Ramoji Film city
-
రామోజీ ఫిలిం సిటీ గోడలు బద్దలు కొడతాం
-
రామోజీ ఫిలిం సిటీ గేట్లు బద్దలు గొడతాం.. మా భూములు మేం లాక్కుంటాం..
-
Ramoji Film City: ఫిలిం సిటీ గోడలు బద్దలుగొట్టి
-
రంగారెడ్డి జిల్లా రామోజీ ఫిలిం సిటీ బాధితుల ఆందోళన
-
‘రామోజీ ఫిలింసిటీ’ కబ్జాలపై రైతుల ఆందోళన
సాక్షి,రంగారెడ్డిజిల్లా : రామోజీ ఫిలింసిటీ భూ ఆక్రమణల వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఫిలింసిటీ కోసం తమ భూములు ఆక్రమించారని అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్ గ్రామ రైతులు శుక్రవారం(ఫిబ్రవరి21) ఉదయం ఆందోళన చేపట్టారు.వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఫిలింసిటీకి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. రైతుల భూములను ఆక్రమించిన రామోజీ ఫిలింసిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిలింసిటీ కబ్జాలో ఉన్న తమ భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్లో వేల ఎకరాల్లో రామోజీ ఫిలింసిటీ నిర్మాణానికిగాను చుట్టుపక్కల ఉన్న రైతులు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారని ఫిలింసిటీ యాజమాన్యంపై గతంలో పలువురు ఆరోపణలు చేశారు. తాజాగా అనాజ్పూర్ రైతులు ఇదే విషయమై ఆందోళన చేపట్టడంతో కబ్జాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. -
పేదల భూముల వ్యవహారం.. ఆర్ఎఫ్సీకి అల్టిమేటం జారీ
రంగారెడ్డి, సాక్షి: పేదలకు ఇచ్చిన భూములను ఆక్రమించిన రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City) యాజమాన్యానికి అల్టిమేటం జారీ అయ్యింది. వైఎస్సార్ హయాంలో ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని ఆర్ఎఫ్సీ యాజమాన్యం తమ గుప్పిటే ఉంచుకుంది. అయితే.. తమ భూములు తమకు ఇవ్వకపోతే ఫిల్మ్ సిటీని ముస్తామని పేద లబ్ధిదారులు హెచ్చరించారు. తాజాగా.. సీపీఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులు రంగారెడ్డి కలెక్టరేట్(Rangareddy Collectorate) ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంతో.. నేడు చర్చల కోసం ఇరు వర్గాలను ఆర్డీవో ఆహ్వానించారు. అయితే.. చర్చలకు రాకుండా ఆర్ఎఫ్సీ యాజమాన్యం డుమ్మా కొట్టింది. ఈ పరిణామంతో బాధితులు మరోసారి ఆందోళకు దిగారు.ఈ పరిణామాన్ని ఆర్డీవో తీవ్రంగా పరిగణించారు. గురువారం చర్చలకు ఖచ్చితంగా రావాల్సిందేనంటూ ఆర్ఎఫ్సీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారాయన. మరోవైపు.. ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని RFC యాజమాన్యం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిందని, ఏడాది కాలంగా సమస్య పరిష్కారం చేయకుండా సాగదీస్తోందని బాధితులు వాపోతున్నారు. రేపు చర్చల్లో పాల్గొని తమ స్థలాలను చూపించకపోతే గనుక.. రామోజీ ఫిల్మ్ సిటీని ముట్టడిస్తామన్న సీపీఎం(CPM) నేతలు, లబ్ది దారులు హెచ్చరికలు జారీ చేశారు. -
చిక్కుల్లో రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం!
రంగారెడ్డి, సాక్షి: రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్య అరాచకాలపై పేదలు నిరసన గళమెత్తారు. ఆక్రమించుకున్న తమ ఇళ్ల స్థలాలను తిరిగి అప్పజెప్పాలంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట పోరాటానికి దిగారు. ఈ ఆందోళనకు వామపక్ష సీపీఎం తమ మద్దతు ప్రకటించింది. దివంగత మహానేత వైఎస్సార్(YSR) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంచింది. ఇందుకుగానూ ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి సర్వే నెంబర్ 189, 203లో 20 ఎకరాలను 577 మందికి పంపిణీ చేశారు. అయితే.. 2007 నుంచే ఆ స్థలాలను రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City) యాజమాన్యం తమ గుప్పిట్లో ఉంచుకుంది. అప్పటి నుంచి వాళ్ల పోరాటం కొనసాగుతూనే వస్తోంది. అయితే.. లబ్ధిదారులను తమ ప్లాట్ల వద్దకు వెళ్లకుండా గేట్లు, ప్రహరీ గోడలు నిర్మాణం చేసుకుంది ఫిల్మ్ సిటీ యాజమాన్యం. దీంతో.. సీపీఎం(CPM) ఆధ్వర్యంలో బాధితులు ఇవాళ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. వైఎస్సార్ హయాంలో కేటాయించిన.. ఆ ఇళ్ల పట్టాల స్థలాలను చూపించాలంటూ కలెక్టర్ను డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఇది సరైన సందేశమేనా?
‘మరణం నా చివరి చరణం కాదు’ అంటాడు విప్లవ కవి అలిశెట్టి ప్రభాకర్. నిజమే, ప్రభావశీలమైన వ్యక్తులు మరణానంతరం కూడా జీవించే ఉంటారు. వారి ప్రభావ స్థాయిని బట్టి సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాల పర్యంతం కూడా. ప్రభావశీలతలో పాజిటివ్ కోణం ఒక్కటే చూడాలా? నెగెటివ్ ప్రభావానికి కూడా ఈ సూత్రం వర్తిస్తుందా? మానవ చరిత్రపై అడాల్ఫ్ హిట్లర్ చేసిన రక్తాక్షర సంతకం కూడా తక్కువ ప్రభావాన్ని చూపలేదు కదా! అతడు కూడా మనకు ప్రాతఃస్మరణీయుడవుతాడా?నిజానికి ఇందులో సమస్య ఏమీ లేదు. సందేహాతీతమైన సదాచారాలు మనకు ఉన్నాయి. సమాజం మేలు కోరిన వారు, ప్రజల మంచి కోసం పోరాడినవారు, మంచితనాన్ని పెంచినవారిని స్మరించుకునే సంప్రదాయం మనకున్నది. స్మారకాలు నిర్మించుకునే అలవాటు కూడా ఉన్నది. వారి జీవితాల్లోంచి సమాజం పాఠాలు నేర్చుకోవాలనే కాంక్షతో వారినలా తమ జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలబెట్టుకుంటారు. చెడుమార్గంలో పయనించి ప్రభావం కలిగించిన వారిని... అధ్యయనం కోసం మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కించాలి. వారికి మరణమే చివరి చరణం కావాలి. ఆ ప్రభావం ఆదర్శం కాకూడదు.కానీ, దురదృష్టవశాత్తు మారుతున్న కాలం వింత పోకడలు పోతున్నది. అభివృద్ధికి అర్థం మారుతున్నది. విజయ గాథలకు కొత్త నిర్వచనాలు చేరుతున్నాయి. గొప్పతనం అనే మాటకు తాత్పర్యం మారింది. ఎవరు బాగా సంపాదిస్తారో వారే మహానుభావులు అనే భావన బలపడుతున్నది. వారు ఏ మార్గంలో సంపాదించారన్న పట్టింపేమీ కనిపించడం లేదు. గమ్యం మాత్రమే కాదు, గమ్యాన్ని చేరే మార్గం కూడా పవిత్రంగా ఉండాలన్న గాంధీ బోధనను ఒక చాదస్తం కింద జమకట్టవలసిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. గాడ్సే వారసులకు గౌరవ మర్యాదలు లభిస్తున్న కాలంలోకి ప్రవేశించాము కదా!పారిశ్రామికాభివృద్ధిలో జాతి ప్రగతిని దర్శించిన జేఆర్డీ టాటా వంటి ఉన్నతస్థాయి పారిశ్రామికవేత్తలు కూడా మనకు ఉన్నారు. అటువంటి వారు చనిపోయినప్పుడు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకొని అధికారిక సంస్మరణ సభలు నిర్వహించినట్టు గుర్తు లేదు. అటువంటి అదృష్టం మన తెలుగువాడైన చెరుకూరి రామోజీరావుకు దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఈనాడు’కున్నంత పేరు ఆయనకూ ఉన్నది. బాగా సంపాదించారు. చిట్ఫండ్స్తో ప్రారంభమై మీడియాకు విస్తరించారు. మీడియా దన్నుతో సాటి చిట్ఫండ్ కంపెనీలను చావబాది, వాటిని దివాళా తీయించారు. ఫలితంగా ఆయన ‘మార్గదర్శి చిట్ఫండ్స్’ దినదిన ప్రవర్ధమానమైంది.చిట్ఫండ్స్కు తోడుగా ‘ఫైనాన్షియర్స్’ పేరుతో మరో జంట కంపెనీ తెరిచారు. రెండు చేతులా ప్రజాధనాన్ని స్వీకరించారు. మీడియాను విస్తరింపజేశారు. ఫిలిం సిటీ పేరుతో ఓ మాహిష్మతీ రాజ్యాన్ని స్థాపించేశారు. ఈలోగా మీడియాను వాడుకొని ప్రభుత్వాలను మార్చారు. ‘పత్రికొక్కటి ఉన్న పదివేల సైన్యంబు’ అన్నారు నార్ల వెంకటేశ్వరరావు. ఆ వాక్యాన్ని చెరుకూరి వారు వ్యాపారపరంగా ఆలోచించారు. పదివేల సైన్యంబును ప్రయోగిస్తూ వచ్చారు. మొదట కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పదివేల సైన్యం పొగబాంబులు పేల్చింది. ఫలితంగా ఎన్టీ రామారావు గద్దెనెక్కారు. రామోజీరావు వ్యాపారపు అడుగులకు మడుగులొత్తడానికి రామారావు నిరాకరించారు. క్రుద్ధుడైన రామోజీ వృద్ధుడైన రామారావుపైకి తన పదివేల సైన్యాన్ని అదిలించారు. ఎన్టీఆర్ గద్దె దిగి చంద్రబాబు గద్దెనెక్కారు. మనోవేదనతో ఐదు మాసాల్లోపే ఎన్టీఆర్ చనిపోయారు. రామోజీరావు పట్ల కృతజ్ఞతాపూర్వకంగా చంద్రబాబు ఆయనకు శుక్రాచార్యులవారి హోదా కల్పించారు.పత్రికా రచన రంగానికి సంబంధించి రామోజీకి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించాయి. ‘ఈనాడు’ ఎడిటర్ హోదాతో ఆయన ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. కానీ ఆయన వృత్తిపరంగా జర్నలిస్టు కాదు. నాన్ జర్నలిస్ట్ ఎడిటర్గా ఆయన పలు రికార్డుల్ని బద్దలు కొట్టారు. ఏకవాక్య రచన కూడా లేకుండా ఏకబిగిన దశాబ్దాల తరబడి ప్రధాన సంపాదకుడిగా కొనసాగిన ఘనతను ఆయన్నుంచి ఎవరూ లాక్కోలేరు. 1974లో విశాఖపట్నం నుంచి ‘ఈనాడు’ పత్రిక ప్రారంభమయ్యే నాటికి అప్పటికే ఉన్న రెండు పెద్ద పత్రికలు పాత మూసలోనే మునకేసి ఉన్నాయి. ఈ స్థితిలో కొంత ఆధునికతను జోడిస్తూ, ప్రజల అవసరాలను గమనిస్తూ, వారికి అర్థమయ్యే సరళమైన భాషను వినియోగిస్తూ ‘ఈనాడు’ ముందుకొచ్చింది. ఈ మార్పులకు మూల పురుషుడు ‘ఈనాడు’ తొలి ఎడిటర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ ఉరఫ్ ఏబీకే ప్రసాద్ అనే తెలుగుజాతి అగ్రశ్రేణి పాత్రికేయుడు.‘ఈనాడు’ హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైన కొద్ది కాలానికే ఏబీకే ప్రసాద్ను బయటకు పంపించారన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తర్వాత కాలంలో రామోజీరావే స్వయంగా ప్రధాన సంపాదకులయ్యారు. ఏబీకే నెలకొల్పిన పత్రికా ప్రమాణాల స్థానాన్ని క్రమంగా రామోజీ వ్యాపార సూత్రాలు ఆక్రమించాయి. ఈ వ్యాపార సూత్రాలు కూడా పత్రిక విస్తృతిలో వాటి పాత్రను పోషించాయి. ఆ రోజుల్లో ‘స్కైలాబ్’ పేరుతో అమెరికా నెలకొల్పిన ఒక అంతరిక్ష కేంద్రానికి ఆయుష్షు మూడింది. అది ముక్కచెక్కలై భూమ్మీద పడిపోయే సందర్భాన్ని ‘ఈనాడు’ వినియోగించుకున్నది. అది రేపోమాపో పడిపోనున్నదనీ, దాంతో భూమి బద్దలైపోతుందని, ఇవే మనకు చివరి రోజులనీ ఊరూరా ప్రచారం జరగడంలో ‘ఈనాడు’ గొప్ప పాత్రనే పోషించింది. ఆ విధంగా గ్రామీణ ప్రజల్లోకి కూడా చొచ్చుకొనిపోగలిగింది.పత్రికకు ఉండవలసిన నిష్పాక్షికత అనే లక్షణాన్ని ఈ యాభయ్యేళ్ల ప్రయాణంలో మొదటి ఐదారేళ్లు ‘ఈనాడు’ పాటించిందేమో! ఎనభయ్యో దశకం ప్రారంభంలోనే నిష్పాక్షికతకు నిప్పు పెట్టేసింది. గడిచిన నాలుగున్నర దశాబ్దాలుగా దాని పాత్రికేయమంతా ఏకపక్షా రచనా వ్యాసంగమే! నాణేనికి ఉండే రెండో కోణాన్ని తెలుగు ప్రజలు చూడకుండా ‘ఈనాడు’ దాచిపెట్టింది. పోటీగా మరో పత్రిక ఎదగకుండా దాని ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే రామోజీ ఎత్తుగడలన్నీ తెలుగు ప్రజల అనుభవంలో ఉన్నవే. ‘ఉదయం’ పత్రిక అకాల అస్తమయానికి ఈ ఎత్తుగడలే కారణం. ‘వార్త’ను నిర్వీర్యం చేయడానికి కూడా అది ప్రయత్నాలు చేసింది. ఒక్క ‘సాక్షి’ ముందు మాత్రం దాని మంత్రాంగం పారలేదు. ఫలితంగా గత పదహారేళ్లుగా తెలుగు ప్రజలకు వార్తాంశాల రెండో కోణం ఆవిష్కృతమైంది. దశాబ్దాల తరబడి తెలుగు ప్రజలకు నిష్పాక్షిక సమాచార హక్కును దక్కకుండా చేసినందుకుగాను ఆయన్ను అక్షర సూర్యుడుగా భృత్య మీడియా బహువిధాలుగా శ్లాఘించింది. ప్రభుత్వం వారి సంస్మరణ సభలో వక్తలందరూ నోరారా కొనియాడారు.ఇక రామోజీరావు తన వ్యాపార సామ్రాజ్య స్థాపనలో అనుసరించిన పద్ధతులూ, నియమోల్లంఘనలూ, చట్టవిరుద్ధ వ్యవహారాలూ ఆమోదయోగ్యమైనవేనా? భవిష్యత్తు తరాల వారికి వాటిని బోధించవచ్చునా? ఈ అంశాలపై విస్తృతమైన చర్చ జరగవలసి ఉన్నది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరుతో ఆయన చేసిన డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమైనదని స్వయంగా ఆర్బీఐ ప్రకటించింది. ఆయన కూడా అది తప్పేనని ఒప్పుకున్నందువల్లనే ఆ సంస్థను మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ఎవరెవరి దగ్గర డిపాజిట్లు వసూలు చేశారో, ఎవరెవరికి తిరిగి చెల్లించారో తెలియజేస్తూ ఒక జాబితాను సమర్పించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం ఆదేశాన్ని ఆయన పాటించలేదు.కేంద్ర చిట్ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. చిట్ఫండ్ సంస్థలు డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. కానీ మార్గదర్శి ఆ చట్టాన్ని ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించింది. ఆ డిపాజిట్లను నిబంధనలకు విరుద్ధంగా షేర్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో, తమ సొంత కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టింది. లేని చందాదారులను ఉన్నట్టుగా చూపిస్తూ ఘోస్ట్ చిట్టీలు నడుపుతూ మనీలాండరింగ్ నేరానికి పాల్పడినట్టు ఇటీవల జరిగిన సోదాల్లో బయటపడింది. కేంద్ర దర్యాపు సంస్థలు జోక్యం చేసుకోవలసిన పరిణామాలివి.ఇక రామోజీ ఫిలింసిటీ ఒక అక్రమాల పుట్ట. ఇక్కడ జరిగిన నియమోల్లంఘనలు నూటొక్క రకాలు. ఇందులో ప్రభుత్వ భూముల ఆక్రమణ ఉన్నది. పప్పుబెల్లాలు పంచి అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన నేరం ఉన్నది. తరతరాల నాటి రహదారులనే కబ్జా చేసి కాంపౌండ్ వాల్ చుట్టుకున్న దాదాగిరి ఉన్నది. మాతృభూమిలో వైద్యసేవలు చేయడానికి వచ్చిన ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ను బెదిరించి 200 ఎకరాల భూమిని కారుచౌకగా కొట్టేసిన దాష్టీకం ఉన్నది. భూపరిమితి చట్టాన్ని వెంట్రుక సమానంగా జమకట్టిన లెక్కలేని తెంపరితనం ఈ ఫిలింసిటీ కథలో దాగున్నది.ఎటువంటి అనుమతుల్లేకుండా ఫిలిం సిటీలో నిర్మించిన 147 భవనాలు హెచ్ఎమ్డీఏ అధికారాన్ని తొడగొట్టి సవాల్ చేస్తున్నాయి. చెరువులను చెరపట్టి వాటిలోకి ప్రవాహాలను మోసుకెళ్లే కాల్వలను రహదారులుగా మార్చుకున్న ఫిలింసిటీ రుబాబు ముంగిట... ‘వాల్టా’ చట్టం చేతులు ముడుచుకొని సిగ్గుతో తలవంచి నిలబడింది. రామోజీ వ్యాపార సామ్రాజ్య విస్తరణ వెనుక ఇంత తతంగం ఉన్నది. ఇది రేఖామాత్రపు ప్రస్తావన మాత్రమే! ఈ ‘సక్సెస్’ స్టోరీ రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదేనా? రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరపడం సమర్థనీయమేనా? అమరావతిలో శిలా విగ్రహం, ఒక రహదారికి పేరు, స్మారక ఘాట్ల స్థాపన ఎటువంటి స్ఫూర్తిని ఉద్దీపింపజేస్తాయి. ‘భారతరత్న’ బిరుదాన్ని ఆయనకు సంపాదించిపెడతామని ముఖ్యమంత్రి చేసిన వాగ్దానం సరైన సందేశాన్నే సమాజంలోకి పంపిస్తుందా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రామోజీ బ్రతికుండగానే సమాధి కట్టుకున్నాడు.. ఎందుకంటే ?
-
ఫిల్మ్ సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు
-
రామోజీరావు అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్, సాక్షి: రామోజీగ్రూప్ సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం ఉదయం ఫిల్మ్ సిటీలోని స్మృతి వనంలో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు జరిగాయి. రామోజీరావు చితికి కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ నిప్పంటించారు.రామోజీరావుకు గౌరవ వందనంగా గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు పోలీసులు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇక.. అంత్యక్రియలకు భారీ సంఖ్యలో రామోజీ సంస్థల ఉద్యోగులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అంతకు ముందు ఫిల్మ్సిటీలోని నివాసం నుంచి స్మృతి వనం దాకా అంతిమయాత్ర కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామోజీరావు అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. ఆయన కుటుంబ సభ్యుల కూడా ఇందులో పాల్గొన్నారు.మరోవైపు ఈ ఉదయం కూడా పలువురు ప్రముఖులు రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించారు. అంతిమ సంస్కారాలను వీక్షించేందుకు స్మృతివనంలో ఎల్ఈడీ స్క్రీన్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: పెదపారుపూడి టు ఫిలింసిటీ -
ఈనాడు ఒత్తిళ్లతో మహిళా ఉద్యోగి ఆత్మహత్య
-
ఈనాడు ఒత్తిళ్లతో మహిళా ఉద్యోగి ఆత్మహత్య
అబ్దుల్లాపూర్మెట్: ఈనాడు దినపత్రిక యాజమాన్యం ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ మహిళా ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడింది. సంస్థలో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను, అనుభవిస్తున్న మానసిక క్షోభను భర్తతో పంచుకున్నప్పటికీ.. అవి మరింత తీవ్రతరం కావడంతో తనకిక చావే శరణ్యం అనుకుంది. తాను పనిచేస్తున్న ఈనాడు కార్యాలయ భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామోజీ ఫిల్మ్సిటీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు, మృతురాలి భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. పెద్దఅంబర్పేట మున్సిపల్ పరిధిలోని కుంట్లూర్ రెవెన్యూ గజ్జి స్వామియాదవ్ కాలనీలో నివాసముండే ఎర్రగొల్ల శ్రీనివాస్, సాయికుమారి (34)కి పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. శ్రీనివాస్ పదిహేనేళ్లుగా, సాయికుమారి తొమ్మిదేళ్లుగా రామోజీ ఫిల్మ్సిటీలోని ఈనాడు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఈనాడు కాల్ సెంటర్లో పనిచేసే సాయికుమారికి కొంతకాలంగా సంస్థలో ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. దీంతో తరచూ ఇబ్బంది పడుతుండేది. భర్తకు చెప్పుకుని బాధ పడేది. ఆదివారం సరదాగా గడిపి.. ఈ క్రమంలోనే భార్యకు మానసిక ధైర్యాన్నిచ్చేందుకు శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి తిప్పాడు. ఇద్దరూ సరదాగా గడిపారు. సోమవారం విధుల్లో భాగంగా రామోజీ ఫిల్మ్సిటీకి బయలుదేరిన సాయికుమారిని ఉదయం 6 గంటలకు తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి జాతీయ రహదారి వద్ద దిగబెట్టి ఇంటికి వచ్చాడు. అయితే 9 గంటల సమయంలో ఈనాడు హెచ్ఆర్ విభాగం నుంచి శ్రీనివాస్కు ఫోన్ వచ్చింది. సాయికుమారి నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయిందని చెప్పడంతో హుటాహుటిన ఫిల్మ్సిటీకి వెళ్లాడు. అప్పటికే తలకు తీవ్ర గాయమైన సాయికుమారి మృతి చెందింది. శ్రీనివాస్ ఇచ్చింన ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికీ తరలించారు. ఈనాడు సిబ్బంది అత్యుత్సాహం ఈనాడు సంస్థ ఒత్తిళ్ల కారణంగా తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చింన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పీఎస్లో ఉన్న శ్రీనివాస్ నుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. అయితే అతని చుట్టూ కంచెలా ఉన్న ఈనాడు సిబ్బంది అడ్డుకున్నారు. తన భార్య మృతికి దారితీసిన పరిస్థితులను మీడియాకు వివరించేందుకు సిద్ధమవుతున్న శ్రీనివాస్ను బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. -
యాజమాన్యం వేధింపులే కారణమంటున్న బంధువులు
-
రామోజీ ఫిలిం సిటీ వేధింపులు...మహిళా ఉద్యోగిని ఆత్మహత్య కేసుపై వాస్తవాలు
-
రామోజీ ఫిలిం సిటీ వేధింపులు...మహిళా ఉద్యోగిని ఆత్మహత్య కేసుపై వాస్తవాలు
-
రామోజీ ఫిల్మ్సిటీ: ఈనాడు ఆఫీసు పైనుంచి పడి మహిళ మృతి
-
రాఫిసి: ఈనాడు ఆఫీసు పైనుంచి పడి మహిళ మృతి
సాక్షి,హైదరాబాద్: రాఫిసి(రామోజీఫిల్మ్సిటీ)లో ఈనాడు ఉద్యోగిని సాయికుమారి అనుమానస్పదంగా మరణించారు. రాఫిసిలోని ఈనాడు కార్యాలయం నాలుగో అంతస్తు నుంచి కింద పడి సాయికుమారి చనిపోయారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మృతి చెందిన సాయికుమారి ఈనాడు కార్యాలయం కాల్సెంటర్లో ఉద్యోగిని. సాయికుమారి భర్త కూడా ఈనాడు సంస్థల్లోనే పనిచేస్తున్నారు. సాయికుమారికి ఇద్దరు పిల్లలు. మహిళ మృతి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళది ఆత్మహత్యా కాదా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సాయికుమారి కుటుంబం పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెంలో నివాసం ఉంటున్నారు. గత కొద్ది కాలంగా వీపరీతమైన పని ఒత్తిడి కారణంగా మనోవేదనకు గురైనట్టు సమాచారం. కొందరు రాఫిసి (రామోజీ ఫిల్మ్ సిటీ) ఉద్యోగులు ఇచ్చిన సమాచారం మేరకు మరణించిన మహిళా ఉద్యోగి పేరు సాయికుమారి అని తెలిసింది. ఈనాడు కార్యాలయంలోని కాల్ సెంటర్లో సాయికుమారి పని చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఉదయం ఆఫీసుకు వచ్చిన సాయికుమారి.. అదే బిల్డింగ్ నాలుగో ఫ్లోర్ పైనుంచి పడి చనిపోవటం సంచలనంగా మారింది. సాయికుమారి భర్త కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాయికుమారి మృతికి గల కారణాలపై ఇతర ఉద్యోగులను ప్రశ్నించినట్టు తెలిసింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఏం జరిగిందో అన్న విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల రాఫిసి (రామోజీ ఫిల్మ్ సిటీ)లో జరిగిన ఓ ఘటన కూడా చర్చనీయాంశమయింది. ఘనంగా ఈవెంట్లు నిర్వహిస్తామని చెప్పుకునే రామోజీ ఫిలిం సిటీలో నిర్వాహకుల నిర్లక్ష్యంతో క్రేన్ వైర్ తెగిపోయింది. ఈ ఘటనలో వెస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్షా మరణించగా, సంస్థ ప్రెసిడెంట్ విశ్వనాథ్ తీవ్రంగా గాయపడ్డారు. రాఫిసిలో ఏం జరిగినా.. మీడియాను గానీ ఇతరులను గానీ లోపలికి అనుమతించరని స్థానికులు చెబుతున్నారు. అక్కడ యాజమాన్యం వారిచ్చే సమాచారమే తప్ప .. ఏదీ బయటకు రానివ్వరన్న విమర్శలున్నాయి. ఇదీ చదవండి.. ఫొటోగ్రాఫర్ దారుణ హత్య -
అధికారులతో కుమ్మకై మభ్యపెట్టి మా పత్రాలు కాజేసి..
-
ఆడవాళ్ళని చూడకుండా పోలీసులతో.. రామోజీ రావు అకృత్యాలపై మహిళలు
-
ఫిలింసిటీ నిర్మాణం కోసం రామోజీ వేసిన అడుగులు..స్టెప్ బై స్టెప్
-
గేటులోపలికి పట్టాదారుణ్ని అనుమతిస్తాం, మీడియాకి అనుమతి లేదు
-
రాబందు రామోజీ..సంచలన నిజాలు బయటపెట్టిన బాధితులు..
-
వైఎస్ఆర్ ఇచ్చిన భూములు తిరిగిచ్చేయ్...రామోజీకి డెడ్ లైన్..
-
రామోజీకి గోనె ప్రకాశరావు బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: సమాజానికి మార్గదర్శకులు అని మీకు మీరే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దంటూ రామోజీకి గోనె ప్రకాశరావు బహిరంగ లేఖ రాశారు. మీ నిత్య జీవితంలో విలువలు పాటిస్తున్నారా?. ఇతరుల విషయాల్లో మీరు పాటించే సూత్రాలు మీ విషయంలో ఎందుకు పాటించరు?. ఈ బహిరంగ లేఖ ద్వారా ప్రజల పక్షాన అడిగే ప్రశ్నలకు రామోజీ సమాధానం చెప్పాలి’’ అంటూ ప్రకాశ్రావు డిమాండ్ చేశారు. ‘‘పదిహేను సంవత్సరాలుగా బలహీన వర్గాలకు చెందాల్సిన భూములు మీ అధీనం లో ఉన్నాయి. నాగన్పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 189, 203 కింద 14 ఎకరాల 30 గుంటల భూమిని దివంగత సీఎం వైఎస్సార్ బలహీన వర్గాలకు కేటాయించారు. మీ రాజకీయ పలుకుబడితో 15 ఏళ్లుగా పేదల భూమిని ఆక్రమించారు. ప్రభుత్వ రహదారిని రామోజీ ఫిలిం సిటీ కింద ఆక్రమించారు. అనాజ్ పూర్ నుండి ఇబ్రహీంపట్నం వరకు 13 కి.మీ ప్రభుత్వ రహదారి ఆక్రమించారు. దాని వల్ల కోహెడ ,ఇబ్రహీంపట్నం వెళ్ళటానికి దూరం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు ప్రభుత్వ రహదారిని ఆక్రమించడం వల్ల 16 గ్రామాల్లోని 90 వేల మంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’’ అంటూ ప్రకాశరావు దుయ్యబట్టారు. ‘‘ప్రజా రహదారిని కబ్జా చేయటాన్ని మీరెలా సమర్ధించుకుంటారు?. మీరు ప్రజా రహదారులను కబ్జా చేయటం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రభుత్వ రహదారులు మీ ఎస్టేట్ కాదు. మీ సామ్రాజాన్ని సామాన్యులు చూడకూడదు అనుకుంటే భారీ ప్రహరీలు నిర్మించుకోండి. అంతే కానీ అటువైపు ప్రజలు రాకూడదని ప్రభుత్వ రహదారులు ఆక్రమించటం ఏమిటి?’’ అని ప్రకాశరావు ప్రశ్నించారు. ‘‘రామోజీకి 2024 మార్చి 31 వరకు డెడ్ లైన్. ఈ లోపు ప్రభుత్వ భూములు తిరిగి ఇచ్చేయాలి. మీ స్టూడియోలో పని చేసే వారిని ఉన్న పళంగా తీసేస్తారు. వారికి జీతాలు ఇవ్వరు. కార్మికుల చట్టాలు ఉల్లఘించారు. రామోజీ పిరికివాడు, చావు అంటే భయం.సీఎం రేవంత్ రెడ్డికి మెమోరాండం ఇస్తా. రామోజీ ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలి. లేదంటే వైఎస్సార్ పేరు తలుచుకోవడానికి మీరు అర్హులు కాదు. డెడ్ లైన్ లోపు ప్రభుత్వ భూములను రామోజీ తిరిగి అప్పగించాలి. లేదంటే బుల్డోజర్లు పెట్టి మీ గోడలు కూలుస్తా’’ అంటూ గోనె ప్రకాశరావు హెచ్చరించారు. -
రామోజీ ఫిలింసిటీ కేసుపై పోలీసుల దర్యాప్తు వేగవంతం
-
రామోజీ ఫిల్మ్ సిటీలో భద్రతా లోపాలు
-
రామోజీఫిల్మ్ సిటీలో ప్రమాదం..ఒకరు మృతి, మరొకరికి గాయాలు
-
ష్..గప్చుప్! ఆ టాలెంట్ రామోజీ రావుకే సొంతం
సాక్షి, హైదరాబాద్: ఎక్కడా రహస్యాలు, దాపరికాలు ఉండకూడదంటూ ఊదరగొట్టే రామోజీరావు, తన దినపత్రిక, తన గ్రూపు సంస్థల్లో జరిగే ఉదంతాలను మాత్రం అత్యంత గోప్యంగా ఉంచాలని చూస్తారు. ముఖ్యంగా ఫిల్మ్ సిటీలో ఏం జరిగినా అంత సులభంగా బయటకు పొక్కదు. రామోజీరావు అంగీకరిస్తే తప్ప ఫిల్మ్ సిటీ ఆనే కోటలోకి తమకు కూడా ఎంట్రీ ఉండదని పోలీసు వర్గాలే చెబుతుంటాయి. కాగా ఈ క్రమంలో తమతో పాటు అవస రమైతే ప్రభుత్వం పైనా ఒత్తిడి తీసుకువచ్చి విషయం బయట పడకుండా మేనేజ్ చేస్తారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి ఉదంతాలు కొన్ని గతంలో చోటు చేసుకున్నాయి. అయితే గురువారం చోటు చేసుకున్న ప్రమాదంలో కన్నుమూసింది తమ ఉద్యోగి కాకపోవడం, బయటి వాడైన ప్రవాస భారతీయుడు కావడంతో విషయం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. అప్పట్లో 22 మంది ఉద్యోగులు గాయపడినా.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదాలు చోటు చేసుకోవడం కొత్తేంకాదు. చిన్న చిన్న ఉదంతాలు, తన ఉద్యోగులకు పరిమితమైన, ఒకరిద్దరికి సంబంధించిన అంశాలు ఆ కోట దాటి బయటకు రావు.. రానివ్వరు. కానీ 2008 నవంబర్లో చోటు చేసుకున్న ఓ భారీ అగ్నిప్రమాదం.. వారం తర్వాత ‘సాక్షి’ చొరవతో వెలుగులోకి వచ్చింది. ఓ అంతర్జాతీయ సంస్థకు చెందిన వార్షిక సమావేశానికి దాని నిర్వాహకులు రామోజీ ఫిల్మ్ సిటీని ఎంపిక చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందాలు పూర్తయిన తర్వాత వేదిక కూడా ఖరారైంది. ఆ ఏడాది నవంబర్ 2న దాదాపు 3,500 మంది హాజరైన ఆ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఫిల్మ్ సిటీకి చెందిన సిబ్బంది ప్రధాన వేదికను సిద్ధం చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎగరేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్టేజీ సమీపంలో దాదాపు 200 హైడ్రోజన్ బెలూన్లను ఉంచారు. ఈ కార్యక్రమం నిర్వహణను అప్పట్లో ఫైర్ సూపర్వైజర్గా ఉన్న శ్రీనివాసరావు, ఫైర్ మెన్ లక్ష్మణ్లు పర్యవేక్షించారు. అయితే ఈ ఉత్సవాలకు హాజరైన ఓ ప్రతినిధి హైడ్రోజన్ బెలూన్ల సమీపంలో సిగరెట్ కాల్చే ప్రయత్నం చేసినా ఫిల్మ్ సిటీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఫైర్ సూపర్వైజర్, ఫైర్ మెన్ మాత్రం వారించే ప్రయత్నం చేశారు. ఈలోపే ఆ ప్రతినిధి విసిరేసిన సిగరెట్ పీక సమీపంలో ఉన్న హైడ్రోజన్ బెలూన్లపై పడటం, అవి ఒక్కసారిగా పేలిపోయి మంటలు వ్యాపించడం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడ పని చేస్తున్న దాదాపు 22 మంది ఫిల్మ్ సిటీ ఉద్యోగులకు గాయాలయ్యాయి. వీరికి తన కోటలోనే ఉన్న ఆస్పత్రిలో గుట్టుచప్పుడు కాకుండా వైద్యం చేయించిన రామోజీరావు.. పోలీసులు, అగ్నిమాప శాఖ అధికారుల వరకు విషయం చేరనీయలేదు. తన సంస్థ కోసం పని చేస్తూ గాయపడిన వారికి మొండిచేయి చూపారు. దాదాపు వారం తర్వాత ఈ విషయం నాటకీయంగా వెలుగులోకి రావడంతో హయత్నగర్ (అప్పట్లో అబ్దుల్లాపూర్మెట్ ఠాణా లేదు) పోలీసులు సీన్లోకి వచ్చారు. దీంతో విషయం లీక్ చేశారంటూ రామోజీ సైన్యం రాద్ధాంతం చేసింది. చివరకు నామమాత్రంగా సిబ్బందికి సహాయం చేసింది. ఆ టాలెంట్ రామోజీ రావుకే సొంతం ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రమాదాలను బాహ్య ప్రపంచానికి తెలియకుండా దాచి ఉంచే రామోజీ రావులో మరో టాలెంట్ కూడా ఉంది. తన సంస్థల్లో చోటు చేసుకునే ఉదంతాలు పోలీసు రికార్డులకు ఎక్కకుండా చూడటమే కాదు.. తప్పంతా క్షతగాత్రులు లేదా బాధితులదే అన్నట్టుగా కూడా చూపించగలరు. బాధితులే ఆ విధంగా చెప్పేలా చేయగల నైపుణ్యం రామోజీరావు సొంతం. 2009లో బాలానగర్లోని ఈనాడు ప్రింటింగ్ ప్రెస్లో జరిగిన ప్రమాదమే దీనికి ఉదాహరణ. ఈ ఉదంతాన్ని చాలా రోజులు గోప్యంగా ఉంచిన యాజమాన్యం ఎట్టకేలకు పోలీసులకు తెలిపినా.. ఫిర్యాదు లేకుండా చూసుకుంది. సీన్ కట్ చేస్తే తప్పు తనదే అంటూ చెప్పిన ఆ బాధితుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం కొసమెరుపు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బిజయ్కుమార్ నిరుపేద. బతుకుతెరువు కోసం నగరానికి వలసవచ్చి భవన నిర్మాణ కార్మికుడిగా మారాడు. 2009 మే 19న బాలానగర్లోని ఈనాడు ప్రింటింగ్ ప్రెస్లో పనికి వచ్చాడు. అక్కడి మూడో అంతస్తులో పని చేస్తూ మధ్యాహ్నం వేళ కింద పడ్డాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది విషయం రామోజీ కోటరీకి తెలిపారు. వాళ్ళ ఆదేశాల మేరకు విషయం బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో బిజయ్ను ఈనాడు ప్రింటింగ్ ప్రెస్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా బయటకు తరలించాలని ప్రయత్నించారు. అక్కడ పండ్ల వ్యాపారం చేసే సయ్యద్ ముస్తఫా ఈ వ్యవహారం గమనించి అడ్డుకుని ప్రశ్నించారు. క్షతగాత్రుడికి తక్షణ వైద్యం అందాలనే ఉద్దేశంతో ‘108’కు సమాచారం ఇచ్చారు. ఈ పరిణామంతో కంగుతిన్న సెక్యూరిటీ సిబ్బంది ఆయనపై దాడి చేసి తమపైనే దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ముస్తాఫా ద్వారా ఈ ప్రమాదం విషయం వెలుగులోకి రావడంతో బాలానగర్ పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీంతో హడావుడిగా బిజయ్కుమార్ వద్దకు వెళ్ళిన ఈనాడు సిబ్బంది కథ మార్చేశారు. అదే రోజు అతడిని తీసుకుని బాలానగర్ ఠాణాకు వచ్చారు. తన తప్పిదం వల్లే ఈనాడు కార్యాలయం పైనుంచి కింద పడ్డానని, దీనిపై కేసు వద్దని అతడితోనే రాయించి పంపారు. ఫిర్యాదు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. విస్టెక్స్ ఉదంతంలోనూ అనేక ప్రయత్నాలు విస్టెక్స్ ఏషియా సీఈఓ సంజయ్ షా మరణానికి కారణమైన రామోజీ ఫిల్మ్ సిటీపై ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కలిదిండి జానకిరామ్ రాజు అబ్దుల్లాపూర్మెట్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇందులో ఫిల్మ్ సిటీలోని భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం, రెస్క్యూ ఆపరేషన్లో ఉన్న వైఫల్యాలను ఎత్తిచూపారు. అయితే విస్టెక్స్ ఉదంతంలోనూ రామోజీ తన మార్క్ను చూపించారు. దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న ఆర్ఎఫ్సీ ఉద్యోగుల ఫోన్లన్నీ స్వాధీనం చేసుకోవాలని, విషయం బయటకు పొక్కనివ్వొద్దని హెచ్చరించారు. పోలీసులకిచ్చిన ఫిర్యాదులోని అంశాలు రికార్డుల్లోకి ఎక్కకుండా ఉంచేందుకు ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించారు. జరిగిన ఉదంతంపై కేసు నమోదు చేసుకోవాలని, కానీ భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం, అంబులెన్స్ రాక ఆలస్యం కావడం, అదనపు అంబులెన్స్ లేకపోవడం వంటివి ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) నమోదు కాకుండా చూడాలని అనేక ప్రయత్నాలు చేశారు. అవి రికార్డుల్లోకి ఎక్కి, బయటకు వస్తే ఫిల్మ్ సిటీ వ్యాపారం దెబ్బతింటుదంటూ తమ మందీమార్బలంతో పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. కానీ పోలీసులు ససేమిరా అన్నారు. విషయం ఉన్నతాధికారులకు తెలియజేయడమే కాకుండా ఫిర్యాదులోని ప్రతి అంశాన్నీ ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. -
RFC: నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
సాక్షి, హైదరాబాద్/అబ్దుల్లాపూర్మెట్: హైదరాబాద్ నగర శివార్లలో ఈనాడు అధి నేత చెరుకూరి రామోజీరావు నేతృత్వంలోని రామో జీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్వా హకుల నిర్లక్ష్యం, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకపో వడం, అత్యవసర సమయంలో వినియోగించడా నికి అంబులెన్స్లు సైతం లేక ఆస్పత్రికి తరలించ డంలో 20 నిమిషాల వరకు ఆలస్యం కావడంతో ఒకరు మృత్యువాత పడ్డారు. అంచెలంచెలుగా ఎది గిన ప్రవాస భారతీయుడు, బహుళజాతి సంస్థ విస్టెక్స్ ఏషియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈఓ సంజయ్ షా (56) ప్రాణాలు కోల్పోయా రు. తీవ్రంగా గాయపడిన ఆ సంస్థ ప్రెసిడెంట్ దాట్ల విశ్వనాథ్ రాజు అలియాస్ రాజు దాట్ల (52) ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రమా దం జరిగిన వెంటనే ఘటనా స్థలిలోనే ఉన్న షా సతీమణి అంబులెన్స్, అంబులెన్స్ అంటూ అక్కడ ఉన్న ఫిల్మ్ సిటీ సిబ్బందిని విలపిస్తూ వేడుకోవడం కంటతడి పెట్టించింది. గురువారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనపై సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కలిదిండి జానకిరామ్ రాజు ఇచ్చిన ఫిర్యాదుతో ఫిల్మ్ సిటీ సహా మరికొందరిపై అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబై నుంచి అమెరికా దాకా.. ముంబైకి చెందిన సంజయ్ షా 1989లో అమెరికాకు వలసవెళ్ళారు. అక్కడి లేహై యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. అమెరికాలోనే ప్రైస్ వాటర్ హౌస్ కూపర్, జనరల్ మోటార్స్లతో పాటు జర్మనీలోని సాప్ సంస్థలోనూ ఉన్నత స్థానాల్లో పని చేశారు. తర్వాత సొంత కంపెనీ ఏర్పాటు కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. 1999లో అమెరికాలోని ఇల్లినాయిస్ కేంద్రంగా విస్టెక్స్ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లో విస్తరించింది. దీని వార్షిక టర్నోవర్ రూ.3,500 కోట్లకు పైగా ఉంది. హైదరాబాద్లోని మాదాపూర్లోనూ దీని కార్యాలయం ఉంది. దీనికి కలిదిండి జానకిరామ్ రాజు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. తమ సంస్థ ఏర్పాటు చేసి 25 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని భావించిన యాజమాన్యం రామోజీ ఫిల్మ్ సిటీని వేదికగా ఎంచుకుంది. లైమ్లైట్ గార్డెన్లో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విస్టెక్స్ కార్యాలయాల్లో ఈ వేడుకలు జరుగుతుండగా.. ప్రతి కార్యక్రమానికీ సీఈఓ సంజయ్ షా, ప్రెసిడెంట్ విశ్వనాథ్ రాజు హాజరవుతున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ లోని తమ ఉద్యోగులు, క్లయింట్లతో కలిసి వేడుకల నిర్వహణకు రామోజీ ఫిల్మ్ సిటీలోని లైమ్లైట్ గార్డెన్ను బుక్ చేసుకున్నారు. రెండురోజుల పాటు జరిగే వేడుకల కోసం గురువారం రాత్రి ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. 20 అడుగుల ఎత్తునుంచి దిగుతూ.. ప్రారంభ కార్యక్రమాన్ని వెరైటీగా నిర్వహించాలని నిర్ణయించారు. కాంక్రీట్ స్టేజీపైన ఉన్న రూఫ్కు తాళ్లు కట్టి, వాటికి వేలాడేలా చెక్కతో ఓ ప్లాట్ఫామ్ తయారు చేశారు. అలంకరించిన ఆ ప్లాట్ఫామ్ మె ల్లగా కిందకు దిగుతుండగా సీఈఓ, ప్రెసిడెంట్లు 20 అడుగుల ఎత్తులో దానిపై నిలబడి.. ఆహుతు లకు అభివాదం చేస్తూ స్టేజీపైకి దిగేలా ఏర్పాట్లు చే శారు. ఇందుకు ఫిల్మ్ సిటీతో పాటు ఈవెంట్ మేనే జర్ల అనుమతి కూడా తీసుకున్నారు. చెక్కతో చేసిన సదరు ప్లాట్ఫామ్కు రెండు వైపులా ఇనుప చువ్వ లు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 7.40 గంటల సమయంలో ఈ ప్లాట్ఫామ్ పైకి ఇద్దరూ ఎక్కగా.. పైన ఉన్న రూఫ్కు కట్టిన తాళ్ల సాయంతో ప్లాట్ఫామ్ను పైనుంచి కిందకు దింపడం ప్రారంభించారు. అయితే కొద్దిసే పటికే ఒక పక్కన తాడు తెగిపోవడంతో ప్లాట్ఫామ్ పక్కకు ఒరిగి, దానిపై ఉన్న ఇద్దరూ దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి సిమెంట్తో కట్టిన స్టేజీపై వేగంగా పడి పోయారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేవు.. రెస్క్యూ లేదు విస్టెక్స్, ఫిల్మ్ సిటీ ఉద్యోగులు, ఈవెంట్ మేనేజర్లు వెంటనే అక్కడ గుమిగూడారు. విస్టెక్స్ సంస్థ ప్రతినిధులు తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఏదైనా పెద్ద ఆస్పత్రికి తరలించడానికి సహాయం చేయాల్సిందిగా అక్కడ ఉన్న వారిని కోరారు. ఓ వైపు సరైన భద్రతా ఏర్పాట్ల లోపం కారణంగా ప్రమాదం జరగ్గా.. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించేలా సరైన రెస్క్యూ టీమ్ సైతం ఫిల్మ్ సిటీకి లేకపోవడంతో విలువైన సమయం వృధా అయ్యింది. ఆస్పత్రికి తరలింపు ఆలస్యమైంది. విస్టెక్స్ ప్రతినిధులు, షా భార్య 15 నుంచి 20 నిమిషాలు వేడుకుంటే తప్ప ఫిల్మ్ సిటీ నిర్వాహకులు అంబులెన్స్ను ఏర్పాటు చేయలేదు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఒక అంబులెన్స్లో సంజయ్ షాను హయత్నగర్లోని ప్రైవేట్ ఆస్పతికి తరలించారు. విశ్వనాథ్ రాజును తీసుకువెళ్లడానికి మరో అంబులెన్స్ ఏర్పాటు చేయాల్సిందిగా కంపెనీ ప్రతినిధులు ఎంత వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన్ను సొంత కారులోనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో సంజయ్ షా కన్నుమూశారు. విశ్వనాథ్ రాజును మెరుగైన చికిత్స నిమిత్తం మలక్పేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శరీరంలో అనేక చోట్ల ఎముకలు విరగటంతో పాటు తీవ్ర గాయాలైన ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఫిల్మ్ సిటీపై క్రిమినల్ కేసు నమోదు జానకిరామ్ రాజు తన ఫిర్యాదులో ఫిల్మ్ సిటీలోని భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం తదితర అంశాలను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్ (ఉషా కిరణ్ ఈవెంట్స్), సీనియర్ ఈవెంట్ మేనేజర్ రితిక్ ఛటర్జీ, సేఫ్టీ డిపార్ట్మెంట్ చీఫ్ మేనేజర్ జి.ఉదయ్ కిరణ్, ఫిల్మ్ సిటీలో స్పెషల్ ఎఫెక్ట్స్ కాంట్రాక్టర్గా ఉన్న ఎస్.సురేష్ బాబు, రోప్ ఆపరేటర్ ఎస్.దుర్గా సతీష్ తదితరులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్లోని 336, 287 రెడ్విత్ 34 సెక్షన్ల కింద వీరిపై ఆరోపణలు చేశారు. భార్య కళ్ల ఎదుటే ప్రమాదం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం జరిగిన సమయంలో విస్టెక్స్ సంస్థ సీఈఓ సంజయ్ షా భార్య కూడా అక్కడే ఉన్నారు. దంపతు లిద్దరూ గురువారం సాయంత్రం తమ సొంత విమానంలో ముంబై నుంచి శంషాబాద్ విమా నాశ్రయానికి, అక్కడి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చారు. స్టేజీ కింద ఆహుతులతో కలిసి సంజయ్ భార్య కూర్చుని వీక్షిస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. దీంతో పరుగున స్టేజీ పైకి వచ్చిన ఆమె.. రక్తపు మడుగులో పడి ఉన్న తన భర్తను ఆస్పత్రికి తరలించండి అంటూ దాదా పు 15 నిమిషాలు అందరినీ వేడుకున్నారు. ఉస్మానియాలో పోస్టుమార్టం.. ముంబైకి మృతదేహం సంజయ్ షా మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో శుక్రవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం భార్యకు అప్పగించారు. అక్కడి నుంచి శవపేటికను మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ప్రత్యేక అంబులెన్స్లో ఎయిర్పోర్టుకు, ఆపై విమానాశ్రయం అంబులెన్స్లో షా విమానం ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్ళారు. కానీ అందులో శవ పేటికను పెట్టడానికి అవకాశం లేకపోవడంతో కార్గో విమానంలో ముంబైకి పంపారు. షా భార్య సహా మిగిలిన వారు సంజయ్ విమానంలోనే ముంబై వెళ్ళారు. తమ స్వస్థలం గుజరాత్ అని, ఏళ్ళ క్రితమే ముంబైకి వలసవచ్చామని సంజయ్ భార్య పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఇద్దరు కుమార్తెలు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. -
రామోజీ ఫిల్మ్ సిటీపై కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలు అయ్యాయి. దీంతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్ను నిందితులుగా చేర్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఫంక్షన్ల నిర్వహణ కోసం పలు గార్డెన్లను ఏర్పాటు చేశారు. అందులో ఒకటి లైమ్లైట్ గార్డెన్. ఈ గార్డెన్ వద్ద విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ను నిర్వహిస్తున్నారు. అదే సమయంలో క్రేన్ ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ ద్వారా గెస్టులను కిందకు దించుతుండగా వైర్ తెగిపోయింది. దీంతో పలువురు కంపెనీ ప్రతినిధులు కిందపడిపోయారు. తీవ్రగాయాలతో విస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్ షా అక్కడికక్కడే చనిపోయాడు. మృతిని పోలీసులు ధృవీకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంలో కంపెనీ చైర్మన్ విశ్వనాథరాజుకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆయన్ని మలక్పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై ఆస్పత్రి నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరికొందరు కంపెనీ ప్రతినిధులకు సైతం గాయాలైనట్లు తెలిసింది. ప్రమాదం ఎలా జరిగిందంటే.? రామోజీ ఫిల్మ్ సిటీలోని లైమ్లైట్ గార్డెన్లో విస్టెక్స్ కంపెనీకి సంబంధించి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విస్టెక్స్ కంపెనీ సిబ్బంది పలువురు హాజరయ్యారు. ఏర్పాట్లు అన్నీ రామోజీ ఫిలింసిటీ చేసింది. ఇందులో భాగంగా సినిమా తరహాలో ఎత్తు నుంచి ఓ క్రేన్లో CEOను, ఛైర్మన్ను కిందికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇలాంటి సర్కస్ తరహా ఫీట్లకు నిర్వహాకులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిపుణులైన సిబ్బందితో పాటు.. నాణ్యమైన క్రేన్లు ఉండాలి. దీంతో పాటు పబ్లిక్ ఈవెంట్లలో ఇష్టానుసారంగా సర్కస్ ఫీట్లు చేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. పైగా ఏ ప్రభుత్వాధికారి కూడా ఇలాంటి ఫీట్లకు అనుమతి కూడా ఇవ్వరు. అయినా రామోజీ ఫిల్మ్సిటీలో నిర్వహాకులు అన్ని నిబంధనలను పక్కనబెట్టి.. విస్టెక్స్ కంపెనీ ఉన్నతాధికారులను క్రేన్ ఎక్కించారు. తేడా కొట్టడంతో క్రేన్ కుప్పకూలి సీఈవో సంజయ్షా మరణించారు. (ప్రమాదం జరిగిన గార్డెన్ ప్రాంతం ఇదే) ఇక ఈ ఘటనపై కేసు నమోదు అయ్యింది. FIR ప్రకారం.. జానకీరాం రాజు అనే ప్రైవేట్ ఉద్యోగి ఈ ప్రమాద ఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులుగా రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్ను చేర్చి దర్యాప్తు చేపట్టారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు. -
రామోజీఫిల్మ్సిటీలో రాజవంశీకుల భూములు
సాక్షి, న్యూఢిల్లీ: రామోజీ ఫిల్మ్సిటీలో రాజవంశీకులకు చెందిన భూములతోపాటు అసైన్డ్, రహదారి భూములున్నాయని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రామోజీ ఫిల్మ్ సిటీలో భూఆక్రమణలపై మీడియాతో ఆయన మాట్లాడారు. రామోజీ ఫిల్మ్సిటీకి చెందిన 3 వేల ఎకరాల్లో 1,700 ఎకరాలు గాలిబ్ జంగ్కు చెందిన భూములున్నాయని... ప్రజారహదారులు, హరిజనుల భూములు, భూదాన్ భూములను సైతం కబ్జా చేశారని చెప్పా రు. కార్మికుల చట్టాలను కూడా ఉల్లంఘిచారని, గతంలో ఈనాడులో పనిచేసిన వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు. అనాజ్పూర్–ఇబ్రహీంపట్నం రహదారిని మూసేసి, కబ్జా చేశారని... దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గోనె పేర్కొన్నారు. దివంగత వై.ఎస్.రాజ శేఖరరెడ్డి హయాంలో 682 మందికి 200 గజాల చొప్పున పట్టాలు ఇవ్వగా లబ్దిదారులను వారి స్థలాల్లోకి రానివ్వట్లేదని గోనె ప్రకాశ్రావు ఆరోపించారు. ఈ ఆస్తులను ప్రభుత్వం వెంటనే అ«దీనంలోకి తీసుకొని రామోజీరావుకు నోటీసులు జారీ చేయాలన్నారు. ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’చట్టం ప్రకారం నోటీసులపై రామోజీరావు కోర్టుకు వెళ్లడానికి వీల్లేదని... ఇది చాలా పటిష్టమైన చట్టమని చెప్పారు. న్యాయ పోరాటం క్లైమాక్స్కు... బ్రిటిష్ పాలకులు ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’అనే చట్టం తీసుకొచ్చారని, అందులో దేశవ్యాప్తంగా వివిధ రాజవంశాలకు చెందిన 560 మందిని చేర్చారని గోనె ప్రకాశ్రావు తెలిపారు. నిజాం స్టేట్లో మార్వాడీ, ముస్లింలు తదితర 8 కుటుంబాలు ఉన్నాయన్నారు. అయితే ఈ రాజవంశీకులకు చెందిన రూ. లక్షల కోట్ల విలువైన ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని.. ఈ విషయంలో తాను చేస్తున్న పోరాటం క్లైమాక్స్కు వచ్చిందన్నారు. ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’చట్టం ప్రకారం రాజవంశీకుల మరణానంతరం వారి వారసులు మైనర్లయితే పరిశ్రమలు, ఆస్తులు, భూములను ప్రభుత్వం అదీనంలోకి తీసుకుంటుందని... వారసులు మేజర్లు అయ్యాక ఆ ఆస్తులను వారికి తిరిగి అప్పగిస్తుందని ఆయన చెప్పారు. అయితే తెలంగాణలో ఆ ఆస్తులు, భూములు అన్యాక్రాంతమయ్యాయని, రూ. లక్షల కోట్ల విలువైన ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’కిందకు వచ్చే ఆస్తులు ఒక పత్రికాధిపతి (రామోజీరావు), తెలుగు రాష్ట్రాల్లోనే నంబర్ వన్ బిల్డర్గా ఉన్న రామేశ్వరరావు అధీనంలో ఉన్నాయని గోనె ఆరోపించారు. వాటిలో పెద్దపెద్ద భవనాలు కట్టారని తెలిపారు. రాష్ట్రంతోపాటు అమెరికాలో పెద్ద పారిశ్రామికవేత్త, ఎయిర్పోర్టులు నిర్మించిన ఆయనకు స్టార్ హోటళ్లు కూడా ఉన్నాయని వాటిని తాజ్ గ్రూప్నకు ఇచ్చారని, అవి కూడా ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’భూములే అన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు విచారణ చేపట్టాలి రాజవంశానికి చెందిన వారందరినీ కలుపుకొని న్యాయం కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ గాం«దీలను కలిసి ఆధారాలు అందిస్తానని గోనె ప్రకాశ్రావు తెలిపారు. ఈ తరహా వ్యవహారాలు కర్ణాటకలోనూ ఉన్నందున చర్యలు తీసుకోవడానికి సీఎం రేవంత్రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఒక కమిటీ వేసి విచారణ జరిపించాలని కోరారు. సంబంధిత పత్రాలు, సమాచారం కోసం హైదరాబాద్లోని రాజ్యాభిలేఖ కార్యాలయానికి దరఖాస్తు చేశానన్నారు. 2008లో పాయిగా వంశానికి చెందిన 140 ఎకరాలు (రూ. 20 వేల కోట్ల విలువైన) రిలీజ్ అయ్యాయని తెలిపారు. దీనిపై రాయచూర్లోని ఆ కుటుంబంతో మాట్లాడానని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు హామీలిచ్చిన పథకాల అమలుకు ఆ ఆస్తులను వాడాలని కోరతామని చెప్పారు. లక్ష నాగళ్లతో (రామోజీ ఫిల్మ్సిటీని) దున్నిస్తానని చెప్పిన కేసీఆర్... సీఎం అయ్యాక కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డిని త్వరలో కలిసి ఈ వ్యవహారాన్ని వివరిస్తానని చెప్పారు. ఆర్థిక చిక్కుల్లో నుంచి రాష్ట్రం బయటపడేందుకు తాను చెబుతున్న విషయం ఒక ఫార్ములా అని అన్నారు. ఈ సందర్భంగా గతంలో రామోజీరావు ఆక్రమణలపై 2010లో ‘ఇండియా టుడే’ ప్రచురించిన కథనాలను, పత్రాలను గోనె ప్రకాశ్రావు మీడియాకు చూపించారు. -
రామోజీ ఫిలిం సిటీ ఆక్రమణల పర్వం: గోనె ప్రకాశరావు
సాక్షి, ఢిల్లీ: ఈనాడు అధినేత రామోజీరావు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన ప్రకటన చేశారు. ఫిలిం సిటీ ప్రాంతంలో గాలిబ్ జంగ్ రాజవంశానికి చెందిన 1700 ఎకరాల భూమిని రామోజీరావు ఆక్రమించుకున్నారని ప్రకాశ్ రావు ఆరోపించారు. కాగా, మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రావు తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘రామోజీ ఫిలిం సిటీలో ప్రభుత్వ భూములున్నాయి. రామోజీరావు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. ఫిలిం సిటీలో రాజ వంశీకుల భూములు, అసైన్డ్, రహదారి భూములు ఉన్నాయి. గాలిబ్ జంగ్ రాజ వంశానికి సంబంధించిన 1700 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. అనాజ్పూర్-ఇబ్రహీంపట్నం ప్రజా రహదారిని కూడా ఆక్రమించారు. ఈ విషయంలో ప్రజలు ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆక్రమణలపై దృష్టి పెట్టాలి. రాజుల వంశంలోని నాటి మైనర్లకు సంబంధించిన భూములు అవి. మైనర్లు కావడం వల్ల ఆ భూములు కోర్టు ఆఫ్ వార్డ్స్ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. కానీ, ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తులు ఆ భూములన్నింటినీ ఆక్రమించుకున్నారు. రాష్ట్రంలో పత్రికాధిపతి చేతిలో ఈ భూములు ఉన్నాయి. అలాగే ఓ రియల్టర్, పారిశ్రామికవేత్త కూడా ఈ భూములను ఆక్రమించారు. ఈ అంశాలపై చర్యలు తీసుకోవాలని త్వరలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కూడా కలుస్తాను. ఈ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి’ అని అన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీ చాలా నష్టాల్లో ఉంది... దాని వల్ల ఏ లాభం లేదు
-
రామోజీ ఫిల్మ్సిటీ అక్రమ నిర్మాణమే
సాక్షి, రాజమహేంద్రవరం: రామోజీ ఫిల్మ్ సిటీ అక్రమ నిర్మాణమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఫిల్మ్ సిటీ కోసం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను ఉల్లంఘించి భూములు సేకరించారని విమర్శించారు. ఫిల్మ్సిటీ రెండు వేల ఎకరాల భూముల విలువ ఇప్పుడు రూ.2 లక్షల కోట్లన్నారు. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో జమీందార్లు, పెద్దలు కూడా భూములు కోల్పోయారన్నారు. కానీ రామోజీ మాత్రం అందుకు భిన్నమన్నారు. ఇందుకు మార్గదర్శి కేసులో జరుగుతున్న విచారణే నిదర్శనమని తెలిపారు. రామోజీకి కోర్టుల్లో చాలా పలుకుబడి ఉందని, ఆయన అడ్వొకేట్లు ఎవరికి కావాలనుకుంటే వారికి శిక్షలు వేయించగలరని చెప్పారు. మార్గదర్శి చిట్ఫండ్ కేసులో రామోజీరావు, శైలజా కిరణ్లను అధికారులు ప్రశ్నించిన వీడియో బయటపెట్టాలని ఉండవల్లి కోరారు. మార్గదర్శిలో నిబంధనల ఉల్లంఘన ఆంధ్రాలో జరిగితే తెలంగాణ కోర్టులో విచారించాలని పట్టుబట్టడం విడ్డూరంగా ఉందన్నారు. దీన్నిబట్టి ఏపీ ప్రభుత్వం కన్నా రామోజీరావుకు పలుకుబడి ఉందని అర్థం అవుతోందన్నారు. ‘ఈనాడు’తోవ్యవస్థలను భయపెడుతున్నారు.. రామోజీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈనాడు పేపర్ను అడ్డం పెట్టుకుని వ్యవస్థలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. అందుకే ప్రతి కేసులో ‘ఈనాడు పత్రిక అధిపతి’ అని ప్రస్తావన తీసుకువస్తారన్నారు. ఒక కేసులో రామోజీరావు మార్గదర్శి ఎండీ అని, మరో కేసులో మార్గదర్శితో రామోజీరావుకు సంబంధం లేదని అఫిడవిట్ వేశారన్నారు. అలాంటి వ్యక్తిపై కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. ఏపీలో ప్రజలు కట్టిన సొమ్ముకు, మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీ వద్ద ఉన్న సొమ్ముకు వ్యత్యాసం ఉందన్నారు. ఆదిరెడ్డి అప్పారావుని అరెస్టు చేసినప్పుడు రామోజీని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఆదిరెడ్డిని పరామర్శించిన చంద్రబాబు రామోజీ గురించి మాట్లాడలేదన్నారు. తన రాజగురువుకు కోపం వస్తే పునాదులు కదులుతాయని ఆయన భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. మార్గదర్శి వ్యవహారంలో రామోజీ తప్పు చేయలేదని బాబు చెప్పగలరా? అని సవాల్ విసిరారు. మార్గదర్శి కేసులో ప్రభుత్వం నాకు సహకరించాలి.. మార్గదర్శి అక్రమాలపై జరుగుతున్న విచారణ చూస్తుంటే చట్టం ముందు అందరూ సమానం కాదన్న భావన కలుగుతోందన్నారు. న్యాయ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. మార్గదర్శి కేసులో నిజాలు బయటపెట్టాలంటే ప్రభుత్వం తనకు సహకరించాలని కోరారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ప్రభుత్వంపై ఇంకా వ్యతిరేక కథనాలు కోకొల్లలుగా వస్తాయన్నారు. చిరంజీవి పిచ్చుక కాదని.. సొంత పార్టీ పెట్టి 18% ఓట్లు సాధించారని గుర్తు చేశారు. -
ప్రాజెక్ట్ కె షూటింగ్లో ప్రమాదం.. అమితాబ్ బచ్చన్కు గాయాలు
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్కు గాయాలయ్యాయి. ప్రాజెక్ట్ కె షూటింగ్లో జరిగిన ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా అనుకోకుండా ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన మూవీ టీం ఆయన్ను గచ్చిబౌలి ఏఐజీలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదంలో అమితాబ్ పక్కటెముకలకు గాయాలయ్యాయని, రెండు వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.ఏఐజీలో చికిత్స అనంతరం బిగ్బి ముంబైకి వెళ్లారు.అయితే తన ఆరోగ్యం విషయంలో అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని అమితాబ్ తెలపారు. తాను ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుంటానని పేర్కొన్నారు. ఈ మేరకు తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ను బ్లాగ్లో రాసుకొచ్చారు.ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా ప్రాజెక్ట్ కె సినిమా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. -
ఫిలింసిటీ గోడలు బద్దలు కొడతాం.. రామోజీరావు కబ్జాకోరు, అరెస్టు చేసి జైల్లో పెట్టాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వ భూములను కబ్జా చేసి రామోజీరావు ఫిలింసిటీని నిర్మించారని.. ప్రభుత్వం దీనిపై కేసులు నమోదు చేసి, రామోజీని అరెస్టు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఫిలింసిటీ గోడలు బద్దలుకొట్టి ప్లాట్లు స్వాధీనం చేసుకుని, పేదలకు పంచుతామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్పల్లి సర్వే నంబర్ 189, 203లలో 675 మందికి ఇళ్లస్థలాలు కేటాయించాలని, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడారు. ‘‘రామోజీరావు భూకబ్జాకోరు. పేదల పాలిట రాక్షసుడు. తమకు కేటాయించిన స్థలాల్లోకి పేదలను రాకుండా రామోజీ అడ్డుకోవడం సరికాదు. పేదలు పోరాటాలు చేసి గుడిసెలు వేసుకుంటే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు కేసు పెట్టాల్సింది రామోజీపై. రామోజీ లాంటి పెట్టుబడిదారులు భూములు ఆక్రమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం ఏమిటి?’’అని ప్రశ్నించారు. అధికారంలోకి రాక ముందు లక్ష నాగళ్లతో ఫిలింసిటీని దున్నిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మౌనం వహిస్తున్నారేమని విమర్శించారు. తెలంగాణలో భూదాన్, సీలింగ్, సర్కార్, పొరంబోకు భూములు పదిన్నర లక్షల ఎకరాలు ఉన్నాయని.. తమ ప్రాణాలు పణంగా పెట్టి అయినా పేదలకు స్థలాలు ఇప్పించే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. రామోజీ సొంత భూములేం అడగడం లేదు పేద ప్రజలు రామోజీ సొంత భూములేమీ అడగడం లేదని.. ఫిలింసిటీలోని 172 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వా లని కోరుతున్నామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరయ్య స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ దారుల కోసమే అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. ఇక రంగారెడ్డి జిల్లాలో ఐదున్నర లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి భాస్కర్ పేర్కొన్నారు. తోపులాట.. ఉద్రిక్తత.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ వైపు దూసుకొస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు తోపులాట జరిగింది. కాసేపటికి సీపీఎం నేతలను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. కార్యకర్తలను చెదరగొట్టారు. తర్వాత 10మంది నేతలు, కార్యకర్తలు వెళ్లి అదనపు కలెక్టర్ తిరుపతిరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు డి.జగదీశ్, సామేలు, జిల్లా కమిటీ సభ్యుడు కందుకూరి జగన్, మండల కార్యదర్శి సీహెచ్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
పేదల స్థలాలపై రామోజీ కన్ను
ఇబ్రహీంపట్నం రూరల్: పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై రామోజీరావు కన్ను పడిందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాన్వెస్లీ ధ్వజమెత్తారు. 2007 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి చొరవతో ఇబ్రహీంపట్నం మండలం నాగన్పల్లి గ్రామం సర్వే నెంబర్లు 189, 203లో (రామోజీ ఫిల్మ్సిటీ పరిధిలోని ప్రభుత్వ భూములు) రాయపోల్, నాగన్పల్లి, పోల్కంపల్లి, ముకునూర్ గ్రామాలకు చెందిన 576 మందికి రామోజీ ఫిల్మ్ సిటీ పరిధిలోన ప్రభుత్వ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయితే నేటికీ లబ్ధిదారులను ఆ స్థలాల్లోకి వెళ్లకుండా, నిర్మాణాలు చేపట్టకుండా రామోజీ అడ్డుకుంటున్నారని జాన్వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన లబ్ధిదారులతో కలిసి నాగన్పల్లి నుంచి కేటాయించిన భూముల ప్రాంతం వరకు పాదయాత్ర చేపట్టారు. ఎర్ర జెండాలు పట్టుకొని నినాదాలు చేసుకుంటూ ఆయా భూముల వద్దకు చేరుకున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లబ్ధిదారులను ఉద్దేశించి జాన్వెస్లీ మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసి ఆ భూములను టూరిజం పేరుతో రామోజీ సంస్థ దక్కించుకోవాలని చూస్తోందని ఆగహ్రం వ్యక్తం చేశారు. ఆ మేరకు ఇప్పటికే రెవెన్యూ అధికారులకు రామోజీరావు దరఖాస్తు చేసుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఫిల్మ్ సిటీ పరిధిలోని 180 ఎకరాల ప్రభుత్వ భూమిలో 12 ఎకరాలను ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తే ఇప్పటికీ లబ్ధిదారులను భూముల్లోకి వెళ్లకుండా, నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఫిల్మ్ సిటీ పరిధిలో ఇంకా 160 ఎకరాలకి పైగా ప్రభుత్వ మిగులు భూమి ఉందనీ, ఇళ్ల పట్టాలు పంపిణీ చేయని వారికి ఇక్కడే స్థలాలు ఇవ్వాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. భూములు పేదలకు దక్కకుండా కోర్టులో కేసులు వేసి రామోజీ అడ్డుపడుతున్నారని, అయితే లబ్ధిదారుల కోసం పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా రామోజీపై లోకాయుక్తలో సుమాటోగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే విధంగా ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రామోజీపై చర్యలు తీసుకోకుంటే ఈ నెల 28న కలెక్టరేట్ ముట్టడి .. ప్రభుత్వం స్పందించి రామోజీపై చర్యలు తీసుకోవాలనీ లేకుంటే ఈ నెల 28వ తేదీన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని జాన్ వెస్లీ హెచ్చరించారు. అప్పటికీ స్పందించకుంటే ప్రజలను సమీకరించి ఇళ్ల స్థలాల్లో గుడిసెలు వేయిస్తామన్నారు. అక్కడే వంటా వార్పు కార్యక్రమాలతో ఇళ్ల స్థలాలను ఆక్రమిస్తామని ఆయన తేల్చిచెప్పారు. మొదటి భూకబ్జా దారుడు రామోజీనే... జిల్లాలో ప్రభుత్వ భూములను మొట్ట మొదటి సారిగా కాజేసింది రామోజీ రావేనని రంగారెడ్డి జిల్లా సీపీఎం కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ ఆరోపించారు. íఫిల్మ్ సిటీలో ఉన్న రోడ్లు, చెరువులు, కుంటలను కబ్జా చేశారని నిందించారు. పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, రెవెన్యూ యంత్రాంగం అండదండలతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. రామోజీరావుపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు.. సీపీఎం పోరు పాదయాత్ర సందర్భంగా భారీగా పోలీసులు మోహరించారు. టియర్గ్యాస్ వాహనాలను కూడా సిద్ధంగా పెట్టారు. అయితే ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల యాదయ్య, సామేలు, జగదీష్, జిల్లా నాయకులు కందుకూరి జగన్, సీహెచ్ జంగయ్య, అలంపల్లి నర్సింహ, ఏర్పుల నర్సింహ, శ్యాం సుందర్, వెంకటేష్, బుగ్గరాములు, జగన్లతో పాటు ఆయా గ్రామాల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: రామోజీ ఫిల్మ్సిటీని ముట్టడిస్తాం: సీపీఎం -
రామోజీ ఫిల్మ్సిటీని ముట్టడిస్తాం: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: సీపీఎం ఆధ్వర్యంలో ఛలో రామోజీ ఫిల్మ్సిటీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్వెస్లీ మాట్లాడుతూ.. 2007లో అప్పటి ప్రభుత్వం 670 మంది పేదలకు 60 గజాల చొప్పున ఇంటి స్థలాలకు సంబంధించిన పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు అప్పట్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. అయితే ఈ స్థలాల్లోకి లబ్ధిదారులు వెళ్లకుండా రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం అడ్డుకుంటోందని ఆరోపించారు. అర్హులకు స్థలాలు చూపెట్టాలని సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. లేనిపక్షంలో రామోజీ ఫిల్మ్ సిటీని ముట్టడిస్తామని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. చదవండి: (సింహం వర్సెస్ సివంగి: యుద్ధం వెనుక కారణాలేంటి?) -
23న ‘చలో రామోజీ ఫిలిం సిటీ’: సీపీఎం
ఇబ్రహీంపట్నం: రామోజీ ఫిలింసిటీ సమీపంలోని నాగన్పల్లిలో 670 మంది పేదలకు మంజూరైన ఇళ్లస్థలాలను వారికి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామం నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాన్వెస్లీ తెలిపారు. రాయపోల్లో ఆదివారం జరిగిన లబ్ధిదారులు, ఇంటి స్థలాల్లేని పేదల సమావేశంలో ఆయన మాట్లాడారు. 670 మంది పేదలకు 60 గజాల చొప్పున ఇంటి స్థలాలకు సంబంధించిన పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు అప్పట్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. అయితే ఈ స్థలాల్లోకి లబ్ధిదారులు వెళ్లకుండా రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం అడ్డుకుంటోందని ఆరోపించారు. ఆ స్థలాల్లో సినిమా షూటింగ్ సెట్టింగ్లను ఏర్పాటు చేసి ఆక్రమణకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఫిలింసిటీ అధినేత రామోజీరావుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం బాసటగా నిలుస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే పేదలందరికీ స్థలాలు చూపించి, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందించాలని జాన్వెస్లీ డిమాండ్ చేశారు. -
Hyderabad: నవంబర్ 23న ఛలో రామోజీ ఫిల్మ్సిటీ
సాక్షి, రంగారెడ్డి: నవంబర్ 23న ఛలో రామోజీ ఫిల్మ్సిటీ కార్యక్రమం చేపట్లనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్ వెస్లీ ప్రకటించారు. ఆర్ఎఫ్సీలో పట్టా సర్టిఫికెట్లు వచ్చిన లబ్ధిదారులు ఇంటి స్థలం లేని పేదలతో ఆదివారం రాయపోల్లో సమావేశం నిర్వహించారు. రాయపోల్ నుంచి రామోజీ ఫిల్మ్సిటీ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఫిల్మ్సిటీలో పట్టాలిచ్చిన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. చదవండి: (Hyderabad: నేను డిప్యూటీ సీఎం అయ్యాక అంతు చూస్తా...) -
2 వేల ఎకరాల ఫిలిం సిటీ సామ్రాజ్యాన్ని చట్ట విరుద్ధంగా నిర్మించుకున్న రామోజీ
-
రామోజీపై భూకబ్జా కేసు పెట్టాలి.. ఆ 70 ఎకరాలు..
సాక్షి, ఇబ్రహీంపట్నం రూరల్: నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను కాజేసి, అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న రామోజీ ఫిలింసిటీ యజమాని రామోజీరావుపై భూ కబ్జా కేసు నమోదు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధి నాగన్పల్లి సర్వే నంబరు 189లో 2007లో దివంగత సీఎండాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి పేదలకు పంపిణీ చేసిన ఫిలింసిటీలోని ప్రభుత్వ ఇళ్ల స్థలాలను, హద్దు రాళ్లను సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్వెస్లీ నేతృత్వంలోని ఆ పార్టీ ప్రతినిధి బృందం శుక్రవా రం పరిశీలించింది. అనంతరం జాన్వెస్లీ విలేకరులతో మాట్లాడారు. పోరాటాల ద్వారా సాధించుకున్న భూముల్లో ఇళ్ల స్థలాలు ఇస్తే వాటిని కబ్జా చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఫిలింసిటీలోని ప్రభుత్వ భూముల్లో 650మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పేదల స్థలాలు కబ్జా చేసి..సెట్టింగులా? స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తే వాటిని నిర్మించకుండా రామోజీరావు అడ్డుకుంటున్నారని జాన్వెస్లీ మండిపడ్డారు. పేదల ఇళ్ల స్థలాల్లో సినిమా షూటింగ్ షెడ్లు, సెట్టింగులు అక్రమంగా నిర్మిస్తున్నారని ఆరోపించారు. పాలకులు, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి రామోజీకి ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలు ఇచ్చిన వారికి ప్రభుత్వం వెంటనే రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి రామోజీతో ఏం లాలూచీ ఉందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను నిలిపివేయాలని కోరారు. లేదంటే ఆయా భూములను తామే ఆక్రమించి వాటిలో గుడిసెలు వేయిస్తామని హెచ్చరించారు. ప్రజలు రాకపోకలు సాగించే రోడ్డుతో పాటు 70 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారన్నారు. 60 గజాల్లో గుడిసెలు వేస్తే పేదలపై కేసులు పెట్టే ప్రభుత్వాలు రామోజీని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. డబ్బులు ఉన్నవాడికి ఊడిగం చేయడం తగదనీ, కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోకపోతే గుడిసెలు వేసి ఆక్రమిస్తామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందే: సీపీఎం జిల్లా కార్యదర్శి భాస్కర్ అక్రమ నిర్మా ణాలను వెంటనే తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే భూములను ఆక్రమించి పొజిషన్ తీసుకుంటామని హెచ్చరించారు. నడకబాటలో ఉన్న రోడ్డు వెంట ప్రజలను రానివ్వకుండా అడ్డుకోవడం తగదన్నారు. రామోజీ పలుకుబడి ఉపయోగించి కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి.సామేలు, డి.జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
రామోజీ ఫిల్మ్సిటీపై దర్యాప్తు చేయించండి
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూముల్లో రామోజీ ఫిల్మ్సిటీ నిర్మాణం, ప్రభుత్వ రహదారి ఆక్రమణ, పేదలకు కేటాయించిన భూముల్లోకి వారిని అనుమతించకపోవడంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఆర్ఎఫ్సీ యాజమాన్యం అక్రమాలపై గత పదేళ్లుగా పోరాటం చేస్తున్న తాను, దర్యాప్తు సంస్థ ముందు హాజరై ఈ అక్రమాలన్నింటినీ నిరూపిస్తానని తెలిపారు. నిరూపించలేకపోతే దేశం విడిచి శాశ్వతంగా వెళ్లిపోతానని సవాల్ చేశారు. అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తే సమస్య లు వస్తాయనే ఉద్దేశంతో స్థానిక రైతుల నుంచి ఆ భూములను 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నట్టు రాయించుకుని.. అటు రైతులను, ఇటు ప్రభుత్వాన్ని ఆర్ఎఫ్సీ యాజమాన్యం మోసగిస్తోందని తెలిపారు. -
హైదరాబాద్లో 10 రోజులపాటు కంగనా
సాక్షి, హైదరాబాద్ : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హైదరాబాద్కు చేరుకున్నారు. సినిమా షూటింగ్ కోసం నగరానికి వచ్చిన కంగనా 10 రోజులపాటు ఇక్కడే ఉండనున్నారు. రామోజీ ఫిలింసిటీలో జరిగే సినిమా షూటింగ్లో ఆమె పాల్గొననున్నారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం అనంతరం సంచలన వ్యాఖ్యలు చేయడంతో కంగనాకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె హైదరాబాద్ రాకను అధికారులు గోప్యంగా ఉంచారు. అదే విధంగా కంగనాకు వై కేటగిరి సెక్యూరిటీ ఉండటంతోపాటు తెలంగాణ పోలీసులు ఆమెకు పూర్తిస్తాయిలో భద్రత కల్పించనున్నారు. చదవండి: ఉద్ధవ్ ఠాక్రేపై భగ్గుమన్న బాలీవుడ్ క్వీన్ కాగా దాదాపు ఏడు నెలల తర్వాత సినిమా షూటింగ్లో పాల్గొంటున్నట్లు కంగనా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్విటర్లో గురువారం పోస్టు చేశారు. ‘‘ప్రియమైన మిత్రులారా, ఈ రోజు చాలా స్పెషల్.. దాదాపు ఏడు నెలల తర్వాత సినిమా షూటింగ్ పనులను ప్రారంభిస్తున్నాను. నేను నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘తలైవి’ కోసం సౌత్ ఇండియా వెళ్తున్నాను.. ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో నాకు మీ ఆశీర్వాదం కావాలి’’. అంటూ కంగనా పేర్కొన్నారు. కోర్టు ముందుకు సంజయ్ రౌత్ వ్యాఖ్యలు -
ప్రజలను మోసం చేసిన కేసీఆర్
అల్లాదుర్గం(మెదక్): పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితుడే తెలంగాణకు మొట్ట మొదటి సీఎం, దళితులు సాగు చేసుకునేందుకు మూడెకరాల భూమి ఇస్తాం అంటూ ప్రజలకు ఎన్నో మోసపూరిత హామీలు సీఎం కేసీఆర్ ఇచ్చారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెదక్ జిల్లా అధ్యక్షుడు సంజీవరావు ఆరోపించారు. మంగళవారం అల్లాదుర్గంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రమే బంగారు కుటుంబంగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టిస్తానని చెప్పినా ఏ గ్రామంలో అవి కనిపించక పోగా, నిరుపేదలు పూరిగుడిసెలలో నివసిస్తున్నారని చెప్పారు. దళితులకు మూడేకరాల వ్యవసాయ భూమి ఇస్తానన్న హామీ ఎక్కడ అమలు చేస్తున్నారో తెలియడం లేదన్నారు. పదవి కోసం తెలంగాణ యువతను బలి చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన రామోజీ ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానని చెప్పిన కేసీఆర్ ఆయనతో అదే ఫిలింసిటీలో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు నరేశ్, సామాజిక హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశయ్య, పద్మరావ్ పాల్గొన్నారు. -
మాహిష్మతి రాజ్యానికి ఊహించని అతిథి
సాక్షి : దర్శకధీరుడు రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్.. తెలుగు చలన చిత్ర స్థాయిని ఖండాంతరాలు దాటించింది. విదేశీ మీడియా కూడా మన చిత్రాన్ని ఓ అద్భుతమంటూ పొగడ్తలు గుప్పించింది. ఇక సినిమాకు కీలకమైన మాహిష్మతి రాజ్యం గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రావీణ్యం ప్రతీ ఫ్రేమ్లోనూ కనిపించింది కూడా. ఇక ఇప్పడు బాహుబలి ప్రస్తావన లేదు కదా.. అందుకే రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న ఆ లోకేషన్లను టూరిస్ట్ స్పాట్గా చేసేశారు. ఇక ప్రసుత్తం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. చివరి టీ20 మ్యాచ్ కోసం హైదరాబాద్లో బస చేశాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్గ్ కూడా టీంతోపాటే వచ్చాడు. తాజాగా ఆయన రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించాడు. అక్కడ బాహుబలి సినిమా సెట్టింగ్స్ను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. భల్లాలదేవుడి భారీ విగ్రహాన్ని నిలిపిన వేదిక ముందు ఇదిగో ఇలా నిల్చుని ఫోటోలకు ఫోజిచ్చాడు. పక్కనే ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమా టైంలో షూటింగ్ నిమిత్తం వేసిన రైల్వే స్టేషన్ సెట్ లోకి వెళ్లి.. అక్కడ ఓ బోగీ వద్ద కొందరు డాన్సర్లతో కలిసి లుంగి డాన్స్ స్టెప్పులేసి సందడి చేశాడు కూడా. -
హైదరాబాద్లో యూట్యూబ్ పాప్–అప్ స్పేస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ వీడియో కమ్యూనిటీ వేదిక యూట్యూబ్... భారత్లో తొలిసారిగా పాప్–అప్ స్పేస్ను నిర్వహిస్తోంది. హైదరాబాద్లో ఈ నెల 7 వరకు జరిగే ఈ కార్యక్రమానికి రామోజీ ఫిల్మ్సిటీ వేదికయింది. యూట్యూబ్ క్రియేటర్లకు పాప్–అప్ స్పేస్లో ప్రవేశం ఉచితం. వీడియోల చిత్రీకరణలో శిక్షణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి కంటెంట్ రూపుదిద్దుకుంటోందో వివరిస్తారు. వీడియోల చిత్రీకరణ కూడా చేపట్టవచ్చు. ఇందుకోసం ప్రత్యేక సెట్స్ సైతం వేస్తారు. 700 మందికి పైగా యూట్యూబ్ క్రియేటర్లు ఇందులో పాల్గొంటున్నారు. మహాతల్లి, తెలుగువన్, వైవా, చాయ్ బిస్కట్, కంత్రీ గైస్, కిరాక్ హైదరాబాదీస్, ఖేల్పీడియో వంటి క్రియేటర్లు స్థానిక భాషల్లో ఎంటర్టైన్మెంట్ను పునర్నిర్వచించారని యూట్యూబ్ స్పేసెస్ గ్లోబల్ హెడ్ లాన్స్ పోడెల్ గురువారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు. దేశంలో ఏడాది కాలంలో 50 మంది ఇండిపెండెంట్ క్రియేటర్లు ఒక్కొక్కరు 10 లక్షల చందాదార్లను సొంతం చేసుకున్నారని కొనియాడారు. వేల మంది క్రియేటర్లు లక్ష చందాదార్ల మార్కును దాటారని తెలియజేశారు. రెండో స్థానంలో తెలుగు.. ప్రపంచవ్యాప్తంగా శాశ్వత ప్రాతిపదికన 9 యూట్యూబ్ స్పేసెస్ ఉండగా, భారత్లో ముంబైలో ఏర్పాటు చేశారు. 7,500 మందికిపైగా క్రియేటర్లు ముంబై కేంద్రాన్ని ఆసరాగా చేసుకున్నారు. వీరు తీసిన వీడియోలకు 10 కోట్లకుపైగా వ్యూస్ ఉన్నాయి. దేశంలో చిత్రిస్తున్న యూట్యూబ్ వీడియోల్లో హిందీ తర్వాతి స్థానాన్ని తెలుగు కైవసం చేసుకుంది. కామెడీ, మ్యూజిక్ విభాగాలు టాప్లో ఉన్నట్లు యూట్యూబ్ స్పేసెస్ ఆసియా పసిఫిక్ హెడ్ డేవిడ్ మెక్డొనాల్డ్ తెలిపారు. ప్రకటనల ద్వారా వస్తున్న ఆదాయంలో అధిక భాగం క్రియేటర్లకే పంచుతున్నట్టు చెప్పారు. ‘ప్రతి నెల 18 కోట్ల మంది యూట్యూబ్కు లాగిన్ అవుతున్నారు. 85 శాతం మంది స్మార్ట్ఫోన్ ద్వారా వీక్షిస్తున్నారు. భారత్లో 40 కోట్ల మంది ఆన్లైన్కు కనెక్ట్ అయ్యారు. 2020 నాటికి ఈ సంఖ్య 60 కోట్లను తాకుతుంది’ అని చెప్పారాయన. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది ప్రతినెలా యూట్యూబ్లో లాగిన్ అవుతున్నారని, రోజూ 100 కోట్ల మంది వీడియోలను చూస్తున్నారని తెలియిజేశారు. -
రియల్ ఎస్టేట్ రంగానికి చేయూతనివ్వండి
-
ఫుల్ జోష్తో..!
రవితేజ అంటేనే ఎనర్జీ. ఆ ఎనర్జీకి నిలువెత్తు నిదర్శనంగా ‘బెంగాల్ టైగర్’ చిత్రం రూపొందుతోంది. ‘రచ్చ’ ఫేం సంపత్ నంది దర్శకుడు. రాధామోహన్ నిర్మాత. ఇందులో రవితేజ సరసన తొలిసారిగా తమన్నా, రాశీ ఖన్నా నాయికలుగా నటిస్తున్నారు. ‘అత్తారింటికి దారేది’ తర్వాత ప్రముఖ హిందీ నటుడు బొమన్ ఇరానీ నటిస్తున్న తెలుగు సినిమా ఇదే. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ చేస్తున్నామనీ, వినాయక చవితికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని, ఇందులో రవితేజ పాత్ర చిత్రణ ఫుల్ జోష్తో ఉంటుందని దర్శక, నిర్మాతలు తెలిపారు. -
బైక్ను ఢీకొన్న కారు... ఎనిమిది మందికి గాయాలు
పెద్దఅంబర్పేట (హైదరాబాద్): ఓ కారు అతివేగంగా వెళుతూ అదుపుతప్పి ముందు వెళుతున్న బైక్ను ఢీకొనడంతో ఎనిమిది మంది గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని రమాదేవి పబ్లిక్ స్కూల్ దగ్గర జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. అబ్దుల్లాపూర్మెట్ వైపు నుంచి హయత్నగర్ వైపు వెళుతున్న ఓ కారు ముందు వెళుతున్న బైక్ను ఢీకొట్టి రోడ్డు పక్కకు వెళ్లి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురితో పాటు బైక్పై ఉన్న ఇద్దరూ గాయపడ్డారు. స్థానికులు వారిని కామినేని ఆస్పత్రికి తరలించారు. -
అప్పుడొక మాట ఇప్పుడొక మాట
తెలంగాణ సర్కార్ వస్తే రామోజీ ఫిలింసిటీని 100 ట్రాక్టర్లతో దున్ని ఆ స్థలాలను ప్రజలకు పంచుతానన్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రామోజీని ఇంద్రుడు, చంద్రు డని ఎందుకు పొగుడుతున్నారో అర్థంకావడం లేదు. ఆంధ్రోళ్ల పై మాకు ఎలాంటి కోపం లేదన్న కేసీఆర్ ఆంధ్రోళ్లు ఏం పా పం చేశారని విభజనకు పాల్పడ్డారో చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా ఉన్న కర్నూలును హైదరాబాద్ చేస్తే నాడు ఎవరూ అడ్డు చెప్పలేదు. అప్పుడేమో విభజన పోరాటం చేసి ఇప్పుడు మాత్రం ఆంధ్ర వాది రామోజీని పొగుడుతున్నారు. తెలంగాణ సర్కారు వస్తే దళితుడిని సీఎంని చేస్తానన్న మీరు మాట మరచి సీఎంగా ఆ సీటుపై కూర్చొని, రామోజీ ఫిలిం సిటీపై నేను ఏ రోజూ మాట అనలేదు అన్నారు. దానిని వంద ట్రాక్టర్లతో దున్ని స్తానని మీరు అన్నట్లు అన్ని పత్రికలలో వచ్చినప్పుడు ఎందుకు కౌంటర్ చేయలేదు. మీ మాటలను ఖండిస్తున్నాము. రామోజీ ఫిలిం సిటీని సందర్శించనిస్తే రామోజీ పవిత్రుడు అయిపోయా రా? రామోజీ ఫిలిం సిటీ భూములు అన్నీ పేద ప్రజల భూము లు కనుకనే కోర్టులో కేసు నడుస్తున్నాయి. సీఎం చంద్రశేఖ రరావు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. - కె.త్రివేణి అమీర్పేట, హైదరాబాద్ -
రామోజీ ఫిల్మ్ సిటి ముందు ఆందోళన!
-
రామోజీ ఫిలింసిటీపై కేసున్నా.. క్లీన్చిట్టా?
-
రామోజీ ఫిలింసిటీపై కేసున్నా.. క్లీన్చిట్టా?
సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ పొన్నాల ధ్వజం సీఎం హోదాలో ముందే తీర్పా? గోబెల్స్కన్నా అతిపెద్ద అబద్ధాలకోరు సాక్షి, హైదరాబాద్: రామోజీ ఫిలింసిటీలో అసైన్డ్ భూములు ఉన్నాయనే ఆరోపణలపై కోర్టులో కేసు ఉన్నా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు క్లీన్చిట్ ఇవ్వడంపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. కేసు ఉన్నా సీఎం హోదాలో ముందే తీర్పు ఇవ్వడం ఏమిటని విమర్శించారు. ఈ విషయం కేసీఆర్కు తెలియదా? అని ప్రశ్నించారు. అన్ని విషయాల్లో అసత్యాలు చెప్పి మోసం చేసినట్టుగానే రామోజీ ఫిలింసిటీ విషయంలోనూ కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. సోమవారం పొన్నాల గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ను అతిపెద్ద అబద్ధాలకోరుగా అభివర్ణించారు. అబద్ధాలు చెప్పనని ఆయన అనడమే అసలు అబద్ధమని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్ను కూడా కేసీఆర్ మించిపోయాడన్నారు. దళిత ముఖ్యమంత్రి హామీ నుంచి రామోజీ ఫిలింసిటీ వరకు కేసీఆర్ మాట్లాడని అంశమే లేదన్నారు. ఎన్నో మాటలు చెప్పి, హామీలు ఇచ్చి అసలు విషయం వచ్చేసరికి మాటమార్చడం, పచ్చి అబద్ధాలు చెప్పడం కేసీఆర్ నైజమని ఆరోపించారు. అబద్ధాలను ప్రచారం చేయడం గురించి గోబెల్స్ను, తప్పుల గురించి శిశుపాలుడిని ప్రస్తావించుకున్నట్టుగానే ఈ రెండు అంశాలను కలిపి మాట్లాడుకోవాలంటే భవిష్యత్తులో కేసీఆర్ను ఉదాహరణగా మాట్లాడుకుంటారని పొన్నాల ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పనితీరు అధ్వానం... పింఛన్లు, ఆహారభద్రత కార్డులు ఇప్పించడానికి ముఖ్యమంత్రి స్వయంగా మూడురోజులపాటు వరంగల్లో ఉండాల్సి వచ్చిందంటే ప్రభుత్వ పనితీరు, పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో తేలిందని పొన్నాల విమర్శించారు. సీఎం తన పర్యటనలో ఔటర్ రింగురోడ్డు, పట్టణంలోని అండర్గ్రౌండ్ డ్రైనేజీ వంటి వాటి గురించి ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. వరంగల్లో సమస్యలను పరిష్కరించినట్టుగానే కేసీఆర్ రాష్ట్రమంతటా పర్యటించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అయిన మూడోరోజే గజ్వేల్కు వెళ్లిన కేసీఆర్... 5 వేల ఇళ్లు కట్టిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైందని పొన్నాల ప్రశ్నించారు. అలాగే దళితులకు మూడెకరాల భూమి, పేదలకు ఇళ్లు, ఇంటికో ఉద్యోగం వంటి హామీల అమలు సంగతి ఏమైందో చెప్పాలన్నారు. ఈ హామీలను అమలు చేయకుండానే కేసీఆర్ కొత్తగా నోటికొచ్చిన హామీలను ఇస్తున్నారని ఆరోపించారు. రైతు ఆత్మహత్యలు పట్టించుకోవేం... కొత్త రాష్ట్రంలో 200 రోజుల్లోనే 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించలేదని పొన్నాల విమర్శించారు. ఆసరా పింఛన్ల కోసం మండుటెండల్లో రెవెన్యూ కార్యాలయాల ముందు నిలబడి గుండెపోటుతో కొందరు చనిపోయారని, మరికొందరు సొమ్మసిల్లి పడిపోయారని, ఇంకా కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని పొన్నాల విమర్శించారు. ఒక్క సిరిసిల్లలోనే వారం వ్యవధిలో నలుగురు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు. బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తామనే హామీని అమలు చేయాలని ఉద్యమాలు చేస్తుంటే కేసీఆర్ స్పందించడంలేదని విమర్శించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులు, యువకులే ఇప్పుడు సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ఎదుట చేస్తున్న పోరాటాలు కనిపించడంలేదా? అని నిలదీశారు. కేవలం ఎన్నికలు ఉన్నాయనే కారణంతోనే కేసీఆర్ ఆర్భాటం చేస్తున్నారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో అద్దంకి దయాకర్, బండ ప్రకాశ్, నాయిని రాజేందర్రెడ్డి, కె.మల్లేశ్ పాల్గొన్నారు. పీజేఆర్కు నివాళి సీఎల్పీ మాజీ నేత పి.జనార్ధన్రెడ్డి జయంతి సందర్భంగా గాంధీభవన్లో సోమవారం ఆయనకు పొన్నాల నివాళులర్పించారు. పేదల హృదయాల్లో చిరస్థాయిగా పీజేఆర్ నిలిచిపోయారని పొన్నాల కొనియాడారు. పేదల పక్షాన ఉంటూ వారి సంక్షేమానికి పోరాడటమే పీజేఆర్కు అర్పించే నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్రెడ్డి, పార్టీ నేతలు నిరంజన్, కుమార్రావు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న ప్రజలకు పొన్నాల సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. -
'ఫిల్మ్సిటీపై కేసీఆర్ మాటమారుస్తున్నారు'
హైదరాబాద్ : రామోజీ ఫిల్మ్సిటీ భూముల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటమారుస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గతంలో చెప్పినదానికి విరుద్ధంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన సోమవారమిక్కడ అన్నారు. కేసీఆర్ మాట మారుస్తారని టీఆర్ఎస్ నేతలే... కొంతమంది అంగీకరిస్తున్నారని పొన్నాల వ్యాఖ్యానించారు. మాట తప్పుతూనే తాను మాట మార్చే మనిషిని కాను అని చెప్పడం కేసీఆర్కే చెల్లిందని ఆయన ఎద్దేవా చేశారు. రామోజీ ఫిల్మ్సిటీ భూముల వివాదంపై కోర్టులో కేసు నడుస్తోందని పొన్నాల అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, పెన్షన్లు రాని వృద్ధులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కేసీఆర్ భరోసా ఇవ్వడం లేదన్నారు. వరంగల్లో 4వేల ఇళ్లు నిర్మించి ఇస్తామన్న కేసీఆర్...గతంలో గజ్వేల్లో 5వేల ఇళ్లు కట్టిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. -
ఫిలింసిటీలో కిడ్నాప్ కలకలం
* ‘లయన్’ సినిమా ప్రొడక్షన్ మేనేజర్, క్యాషియర్ అపహరణ * దుండగులను పట్టుకున్న పోలీసులు హయత్నగర్: రామోజీ ఫిలింసిటీలో కిడ్నాప్ కలకలం... లయన్ సినిమా షూటింగ్ స్పాట్నుంచి దుండుగులు ప్రొడక్షన్ మేనేజర్, క్యాషియర్ను ఎత్తుకెళ్లారు. పోలీసులు వెంబడించి వారిని పట్టుకున్నారు. బాధితులు, హయత్నగర్ పోలీసుల కథనం ప్రకారం... ఫిలింసిటీలో బాలకృష్ణ నటిస్తున్న లయన్ షూటింగ్ జరుగుతోంది. సినిమా నిర్మిస్తున్న ఎస్ఎల్వీ కంపెనీ షూటింగ్ కోసం ఫనా ట్రావెల్స్కు చెందిన కార్లను అద్దెకు తీసుకుంది. గత డిసెంబర్ 31న వీటిలో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో పాడైపోయాయి. ఆ కార్లకు మరమ్మతు చేయించాలని, కార్ల అద్దె కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫనా ట్రావెల్స్ నిర్వాహకులు జూబ్లీహిల్స్లోని ఎస్ఎల్వీ కార్యాలయానికి వెళ్లి గొడవ చేశారు. దీంతో కార్లకు మరమ్మతులు చేయించి అద్దె చెల్లిస్తామని ఎస్ఎల్వీ కంపెనీ వారు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం వేరే కంపెనీ కార్లను అద్దెకు తీసుకుని షూటింగ్ చేస్తున్నారు. ఫనా ట్రావెల్స్కు చెందిన అక్బర్, ఇమ్రాన్ఖాన్, ఖాదర్ షరీఫ్, జీసంత్ఖాన్లతో పాటు మరో ఇద్దరు రామోజీ ఫిలింసిటీలో లయన్ సినిమా షూటింగ్ జరుగుతున్న చోటకు వచ్చారు. అక్కడే ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ దిలీప్సింగ్, క్యాషియర్ రాఘవచంద్రలను బలవంతంగా కారు (ఏపీ09 సీసీ 1851)లో ఎక్కించుకుని నగరం వైపు బయలుదేరారు. అదే విధంగా మరో ట్రావెల్స్కు చెందిన డ్రైవర్ మహేష్ను కొట్టి అతని కారు పట్టుకెళ్లారు. క్యాషియర్ రాఘవచంద్రను తీసుకెళ్తున్న కారు హయత్నగర్లోని తొర్రూరు క్రాస్రోడ్డు వద్ద ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో రాఘవచంద్ర కారు దిగి పారిపోగా.. దిలీప్సింగ్ లోపలే కూర్చున్నాడు. అదే సమయంలో మరో ట్రావెల్స్కు చెందిన కారు డ్రైవర్ మహేష్ దుండగులను కారులో వెంబడిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు, మహేష్ కలిసి వనస్థలిపురం పనామా వద్ద దుండగుల కారును అడ్డుకున్నారు. నిందితులను హయత్నగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఫిలిం సిటీ’ సందర్శన లోగుట్టు?
రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానన్న కేసీఆర్ తనంతట తానే స్వయంగా రామోజీరావును ఎందుకు కలుసుకున్నట్లు? ఉద్యమ నాయకుడు కేసీఆర్ వేరు, సీఎం కేసీఆర్ వేరు అన్న మాట నిర్వివాదాంశం. కానీ ఆయన వెళ్లింది వివాదాస్పద భూముల్లో కట్టిన ఒక ఫిలిం సిటీకి, దాని అధిపతిని కలవడానికి! అంతకు ముందే ఆయన ఆర్కైవ్స్ సహా అన్ని రకాల కొత్త, పాత రెవెన్యూ రికార్డులను పరిశీలించవలసింది. ఫిలిం సిటీ భూ వివాదాలను అర్థం చేసుకోవాల్సింది. ఆ పని చేయలేదు కాబట్టే కేసీఆర్ హఠాత్ ఫిలిం సిటీ సందర్శన అనేక అనుమానాలను రేకెత్తించింది. ప్రజలకు తప్పుడు సంకేతాలను పంపింది. తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గత శుక్రవారం రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి ఐదున్నర గంటలసేపు ఫిలిం సిటీ అధిపతి, పత్రికాధిపతి చెరుకూరి రామోజీరావుతో సమావేశమయ్యారు. ఆయనతో కలసి భోజనం చేశారు. ఫిలిం సిటీ విశేషాలను ఆసాంతం పరిశీలించారు. రామోజీ రావు నిర్మించనున్న ఆధ్యాత్మిక నగరం ‘ఓం’ విశేషాలను తెలుసుకున్నారు. చివరగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ సారథి అయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సఖ్యంగా మెలగాలన్న రామోజీరావు సలహాను స్వీకరించి మరీ తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు వెంట తాజా మంత్రివర్గ విస్తరణలో స్థానం పొందిన మాజీ తెలుగుదేశం పార్టీ నేత తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఉన్నారు. వారిద్దరినీ కాసేపు బయట కూర్చోబెట్టి చంద్రశేఖర్రావు, రామోజీరావు ఏకాంతంగా మాట్లాడుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. రాజకీయ మీడియాలో రాజగురువు అధికారంలో ఉన్న వారిని తన దగ్గరికి రప్పించుకోవడం, రప్పించుకోవాలని ప్రయత్నించడం రామోజీరావుకు కొత్త ఏమీ కాదు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లూ రామోజీ రావును అందరూ రాజ గురువుగా సంబోధించడం తెలిసిందే. మీడియా మొఘుల్గా ప్రఖ్యాతి చెందిన రామోజీరావు తనవి కాంగ్రెస్ వ్యతిరేక రాజకీ యాలని పలుమార్లు స్పష్టంగానే చెప్పారు. అది రాతపూర్వకంగా తన దినపత్రిక ద్వారా కావచ్చు, కోర్టులకు సమర్పించిన అఫిడవిట్లలో కావచ్చు. ఆయన తన కాంగ్రెస్ వ్యతిరేకతను ఎక్కడా దాచుకోలేదు. పత్రికాధిపతికి రాజకీయ అభిప్రాయాలు ఉండకూడదని ఎవరూ అనరు. ఏదో ఒక రాజకీయం లేకుండా మీడియా స్వతంత్రంగా ఉంది అంటే నమ్మడానికి ప్రజలు అమాయకులు కారు. అందుకు రామోజీరావు నడుపుతున్న మీడియా సంస్థలు అతీతంగా ఏమీ లేవు. నిజానికి ఎన్టీరామారావు 1982లో రాజకీయాల్లోకి వచ్చాక ఆయనను అధికారంలోకి తేవడానికి మొత్తం ప్రచార బాధ్యతను నెత్తికెత్తుకుని తన దినపత్రికను తెలుగుదేశం కరపత్రికగా మార్చారన్న విమర్శను ఆయన ఆ రోజు ల్లోనే ఎదుర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట 1984లో నాదెండ్ల భాస్కర రావు ప్రభుత్వాన్ని గద్దె దింపడంలోగానీ, మళ్లీ అదే ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట 1995లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కాపాడటంలోగానీ, ఎన్టీ రామారావును పదవీచ్యుతుడిని చెయ్యడంలోగానీ రామోజీరావు నడిపిన రాజకీ యం చరిత్రలో కచ్చితంగా రికార్డ్ అయి తీరుతుంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రామోజీరావును కలుసుకున్నారు కాబట్టి ఈ గతాన్ని గుర్తు చెయ్యాల్సి వచ్చింది. నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రామోజీరావు నివాసానికి వారానికి ఒకసారో, నెలకొకసారో వెళ్లి సంప్రదింపులు జరిపి సలహాలు తీసుకుని వచ్చేవారని విన్నాం. అప్పుడప్పు డు కొన్ని పత్రికల్లో చదివాం కూడా. కొన్ని సార్లయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబే చికోటి గార్డెన్స్ ఇంటి బయట వరండాలో రాజ గురువు రాక కోసం కాసేపు వేచి ఉండాల్సి వచ్చేది కూడానట. 1994లో అత్య ద్భుతమయిన ప్రజా తీర్పుతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ను గద్దెదించి, అధికారాన్ని చేపట్టడంలో తనకు అండగా ఉన్న పత్రికాధిపతి పట్ల బాబుకు ఆ మాత్రం గౌరవం, కృతజ్ఞతాభావం ఉండటంలో ఆశ్చర్యం లేదు. వైఖరిలో ‘మార్పు’ రామోజీకే పరిమితమా? అయితే, రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానన్న చంద్రశేఖర్రావు తనంతట తానే స్వయంగా వెళ్లి రామోజీరావును ఎందుకు కలుసుకున్నట్లు అన్న ప్రశ్నే ఇప్పుడు చర్చనీయాంశమై కూర్చున్నది. స్నేహపూర్వకంగా కలుసుకోవ డానికో, సరదాగా మాట్లాడుకోవడానికో ఫిలిం సిటీకి వెళ్లేంత తీరిక తెలంగాణ ముఖ్యమంత్రికి ఉందంటే ఎవ్వరూ నమ్మరు. పోనీ వారిద్దరి మధ్యా స్నేహమే మైనా ఉందా అంటే, అదీ లేదు. పైగా, తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ని ఏర్పాటు చేసిన తరువాత కరీంనగర్లో జరిగిన తొలి బహిరంగ సభలో, లక్షలాది మంది సమక్షంలో సభా వేదిక నుండి... ఫిలిం సిటీ పేరిట రామోజీరావు తెలంగాణ ప్రజల భూములను ఆక్రమించుకున్నాడని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక లక్ష నాగళ్లతో ఫిలిం సిటీ దున్నిస్తానని చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఆ బహిరంగ సభా ప్రాంగణంలోనే ఆయన ప్రేరణతోనే రామోజీరావు సంపాదకత్వాన నడుస్తున్న దినపత్రిక ప్రతులను కార్యకర్తలు, అభిమానులు తగులబెట్టారు కూడా. తెలంగాణ ముఖ్యమంత్రి ఇంకా లక్ష నాగళ్లు సిద్ధం చెయ్యలేదేమిటా? అని అంతా ఎదురు చూస్తుండగా, ఆయన రామోజీ ఫిలిం సిటీకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పైగా ఆంధ్ర ప్రాంతీయుల యాజమాన్యంలో పొట్ట కూటి కోసం ఉద్యోగాలు చేసుకుంటున్న లెక్కలేనంత మంది తెలంగాణ వారి మీద ‘తెలంగాణ ద్రోహులు’ అని ముద్రలు వేయడానికి చంద్రశేఖర్రావు కొడుకు, కూతురు, మేనల్లుడు రబ్బర్ స్టాంప్లు చేతబట్టి తిరుగుతున్న సమయంలో జరిగిన ఈ కలయిక అందరినీ నివ్వెర పోయేట్టు చేయడంలో తప్పేముంది? 2001లో టీఆర్ఎస్ ఏర్పడిన నాటి నుండి మొన్నటి సార్వత్రిక ఎన్నికల వరకు తెలంగాణ పది జిల్లాల్లో కొన్ని లక్షల చిన్న పెద్ద ఉద్యమ సభలు జరిగి ఉంటాయి. అందులో కొన్ని వందల సభలలోనయినా ఉద్యమ నేతగా చంద్రశేఖర్రావు ఉద్వేగంగా, ఆవేశంగా ప్రసంగించి ఉంటారు. ఆ సభలన్నిట్లో మారుమోగిన తెలంగాణ ధూమ్ధామ్ పాటలు ఇంకా అందరికీ గుర్తున్నాయి. ఉద్యమ నాయకుడు కేసీఆర్ వేరు, ముఖ్యమంత్రి కేసీఆర్ వేరు అన్న మాట నిర్వివాదాంశం. లక్ష్య సాధన కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా అనేకం మాట్లాడొచ్చు. ఒకసారి లక్ష్యం నెరవేరి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుని ముఖ్యమంత్రి అయ్యాక మరింత బాధ్యతగా నడుచుకోవాల్సిందే. కానీ ఆ మార్పు ఒక్క రామోజీరావును కలుసుకోవడంలోనే ఉండాలా? అన్ని విషయాల్లోనూ ఆ మార్పు కనిపించాలా? అన్నదే ప్రశ్న. మోదీ సలహాను పాటించారా? ఇంతకూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఫిలిం సిటీకి వెళ్లి ఐదు గంటలపాటు రామోజీరావుతో ఎందుకు భేటీ అయినట్టు? ఫిలిం సిటీని నాగళ్లతో దున్నాలా? సులభంగా పని అయిపోవడానికి ట్రాక్టర్లతో దున్నేయొచ్చా? అని చూడడానికి వెళ్లారా? రామోజీరావు నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం ‘ఓం’ గురించి తెలుసుకోవడానికి వెళ్లారా? అధికారంలోకి వచ్చిన నాటి నుండి బోలెడు సార్లు ఆయన చెప్పినట్టే తెలంగాణ ప్రభుత్వం రాచకొండ గుట్టల్లో నిర్మించబోతున్న మరో ఫిలిం సిటీకి అక్కరకు వస్తుందని రామోజీ ఫిలిం సిటీని పరిశీలించడానికి వెళ్లారా? లేక తాను చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో ఎవరిని చేర్చుకోవాలో, ఎవరికి ఏ మంత్రిత్వ శాఖలు ఇవ్వాలో చర్చించడానికి వెళ్లారా? లేక ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సలహా మేరకు రామోజీరావును కలుసుకున్నారా? ఇట్లా రకరకాల ప్రశ్నలు తెలంగాణ ప్రజల మెదళ్లలో కదులుతున్నాయి. ఇటువంటి ప్రశ్నలు తలెత్తడానికి కారణాలూ ఉన్నాయి. ఇటీవల రామోజీరావు ఢిల్లీ వెళ్లి నరేంద్రమోదీని కలుసుకుని తన ఆధ్యాత్మిక ప్రాజెక్టు ‘ఓం’ గురించి వివరించిన సందర్భంలోనూ, ప్రధాని నిర్వహించిన ముఖ్యమంత్రుల సమా వేశం కోసం ఆ తరువాత ఢిల్లీ వెళ్లిన కేసీఆర్, మోదీని కలుసుకున్న సందర్భం లోనూ రామోజీరావు, చంద్రశేఖర్రావులు భేటీ కావాల్సిన అవసరం గురించి ప్రస్తావన వచ్చిందని రాష్ట్రంలో జోరుగా ప్రచారం సాగుతున్నది. ఆ అవసరం ఏమిటో మోదీ, కేసీఆర్, రామోజీరావులకే తెలియాలి. అనుమానాలను రేకెత్తిస్తున్న గోప్యత అన్ని విషయాలూ అందరికీ చెప్పవలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి, ప్రభుత్వం భావించవచ్చు. కానీ తెలంగాణ ప్రజలకు తెలియకూడనంత రహస్యం ఏమిటయి ఉండవచ్చు అన్నది ఒక ప్రశ్న. పైగా ఆయన వెళ్లింది ముఖ్యమంత్రిగా, అందునా వివాదాస్పద భూముల్లో కట్టిన ఒక ఫిలిం సిటీలోనే దాని అధిపతిని కలవడానికి. ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుతో భేటీ కావడాని కంటే ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి... రెవెన్యూ రికార్డులను, కోర్టు ఆఫ్ వార్డ్స్ వివాదాలను, రాష్ట్ర సచివాలయంలోనూ ఆర్కైవ్స్లోని భూ సంబంధమైన రికార్డులను పరిశీలించవలసింది. కింగ్ కోఠీలోని పరదా గేటులో నిజాం వారసుల అధీనంలో ఇంకా మిగిలి ఉన్న పాత రికార్డులను తెప్పించి, వాటిని ఉర్దూ నుండి తెలుగులోకి అనువదింపజేసుకుని చదివి ఉండవలసింది. అదే చేసి ఉంటే రామోజీ ఫిలిం సిటీ భూ వివాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అయ్యేవి. అవేవీ జరగలేదు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు హఠాత్ ఫిలిం సిటీ సందర్శన అనేక అనుమానాలను రేకెత్తించింది. ప్రజలకు తప్పుడు సంకేతాలను కూడా పంపింది. - దేవులపల్లి అమర్ సీనియర్ పాత్రికేయులు మొబైల్ : 98480 48536 - amardevulapalli@yahoo.com -
కేసీఆర్ది ఊసరవెల్లి నైజం: పొన్నాల ధ్వజం
రైతన్నల ఆత్మహత్యలపై కేంద్ర ప్రకటన దారుణం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించి, ఆర్ఎఫ్సీ చైర్మన్ సీహెచ్ రామోజీరావుతో సమావేశం కావడంపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తనదైన శైలిలో స్పందించారు. కొన్ని అంశాలపై సీఎం కేసీఆర్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఊసరవెల్లులు కూడా సిగ్గు పడతాయన్నారు. ఈ భేటీ అంశాన్ని, గతంలో రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తామని కేసీఆర్ పేర్కొన్న విషయాన్ని మీడియా ప్రతినిధులు శనివారం గాంధీభవన్లో ప్రస్తావించినపుడు సీఎం అక్కడ ఎన్ని గంటలున్నారో తెలియదని పొన్నాల బదులిచ్చారు. రాష్ట్రంలో 69 మంది రైతులే ఆత్మహత్యలు చేసుకున్నారంటూ రాజ్యసభలో కేంద్రమంత్రి మోహన్భాయ్ కుంధేరియా సమాధానమివ్వడం దారుణమన్నారు. తెలంగాణ రైతులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్నారు. పార్లమెంట్నే బీజేపీ మోసం చేసిందన్నారు. కేంద్రం ప్రకటించిన ఆత్మహత్యల వివరాలను బీజేపీ సమర్ధిస్తుందా అని పొన్నాల ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఆత్మహత్యల వివరాల నివేదిక లేకపోతే కాంగ్రెస్ తరఫున తాము అందజేస్తామని సూచించారు. దాదాపు 500 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వస్తుంటే కేంద్రమంత్రి ఇటువంటి సమాధానం ఇవ్వడం సరైంది కాదన్నారు. స్వచ్ఛందసంఘాలు సేకరించిన వివరాలతో నివేదికను రూపొందించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కాకుండా రాష్ట్ర బీజేపీ నేతలు కూడా క్షేత్రస్థాయిలో సరైన నివేదికను కేంద్రానికి ఇస్తే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ నెల19-21 తేదీల మధ్య ఎల్బీస్టేడియంలో జరగనున్న అంతర్ జిల్లా బాలికల, బాలుర కబడ్డీ పోటీల పోస్టర్ను పొన్నాల లక్ష్మయ్య గాంధీభవన్లో విడుదలచేశారు. -
కేసీఆర్పై పొన్నాల పరోక్ష వ్యాఖ్యలు
-
కేసీఆర్పై పొన్నాల పరోక్ష వ్యాఖ్యలు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఊసరవెల్లిని మించి వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఉద్యమ నేతగా రామోజీ ఫిల్మ్సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తామన్న కేసిఆర్.. ఇపుడు ముఖ్యమంత్రి హోదాలో రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించడంపై ఏమంటారన్న విలేఖరుల అడిగిన ప్రశ్నకు పొన్నాల పరోక్ష ఆరోపణలు చేశారు. కేసీఆర్ను చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతున్నాయంటూ వ్యాఖ్యాలు చేశారు. తెలంగాణలో 69మంది రైతులే ఆత్మహత్య చేసుకున్నారని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించటం విడ్డూరంగా ఉందన్నారు. వందలాది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పోలీసుల ఎఫ్ఐఆర్లే స్పష్టం చేస్తున్నాయన్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ వందలాది రైతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని పొన్నాల డిమాండ్ చేశారు. ఆత్మహత్యల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అవమానించేలా వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. ఆత్మహత్యల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని టీడీపీ, బీజేపీలు సమర్థిస్తాయో, లేదో చెప్పాలని పొన్నాల డిమాండ్ చేశారు. ఇక పార్టీ యువ నేతలు విష్ణు, వంశీల గొడవ కుటుంబ సమస్యగానే భావిస్తున్నామన్నారు. -
లింగ షూటింగ్లో అపశ్రుతి
హైదరాబాద్ : రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న లింగ షూటింగ్లో అపశ్రుతి చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఫిల్మ్ సిటీలో బీఎస్ఎఫ్ షెడ్ నెం 8 వద్ద చిత్రం షూటింగ్ జరుగుతుంది. అదే సమయంలో ఐదో అంతస్తుపైన ఉన్న లైట్ బాయ్ సుదర్శన్ ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని హుటాహుటిన నగరంలోని ఆస్పత్రికి తరలించారు. రజనీకాంత్ హీరోగా లింగ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా అనుష్క, సోనాక్షి సిన్హా నాయికలుగా లింగ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. -
‘బాహుబలి’షూటింగ్లో అపశ్రుతి.. నలుగురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న బాహుబలి సినిమా షూటింగ్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం సాయంత్రం ఫైటింగ్ సీన్ చేస్తుండగా పేలుడు సంభవించి నలుగురికి మంటలు అంటుకున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని రామోజీ ఫిలింసిటీలో బాహుబలి చిత్రం పోరాట దృశ్యాల చిత్రీకరణ సాగుతోంది. పెద్దఎత్తున కుంకుమను వెదజల్లేందుకు పేలుడు పదార్థాలను ఉపయోగించారు. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ఫైటింగ్ సీన్లో పాల్గొనేందుకు వచ్చి పక్కనే నిల్చున్న నలుగురు ఫైటర్లకు అతి సమీపంగా అవి ఎగిసిపడ్డాయి. దీంతో ఫైటర్లు సతీష్, పాండు, గణేశ్, సంతోశ్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. వారు హయత్నగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించుకుని వెళ్లిపోయారు. -
రామోజీ ఫిలింసిటీలో పేలుడు..
* నలుగురికి గాయాలు హైదరాబాద్: రామోజీ ఫిలింసిటీలోని స్క్రాప్ గోదాములో పాత సామాను తొలగిస్తుండగా పేలుడు సంభవించి నలుగురు గాయపడ్డారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఫిలింసిటీ యాజమాన్యం గాయపడ్డ వారిని తప్పించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఫిలింసిటీలో పాత సామాన్లు, ఇనుప చువ్వలను డీసీఎంలోకి ఎక్కించేందుకు కాంట్రాక్ట్ సిబ్బంది పనిచేస్తున్నారు. గోదాములో రాళ్లను పగులగొట్టేందుకు ఉపయోగించే పేలుడు పదార్థం ఉంది. ఇనుపచువ్వలు తగిలి అది పేలింది. దీంతో పనిచేస్తున్న కార్మికులలో నలుగురు గాయాల పాలయ్యారు. ముగ్గురికి ఫిలింసిటీలోనే ప్రథమ చికిత్స చేసినట్లు తెలిసింది. గండిచెరువుకు చెందిన గుండ్ల యాదయ్య తీవ్రంగా గాయపడటంతో ఆయనను హయత్నగర్లోని కృష్ణవేణి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. లేబర్ కాంట్రాక్టర్ జంగ య్య మాత్రం డీసీఎంలో జారిపడటం వల్లే యాదయ్య గాయపడ్డాడని చెబుతున్నారు. -
బైక్ మీద నుంచి పడిన బాలకృష్ణ
హైదరాబాద్: సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం స్వల్పంగా గాయపడ్డారు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న షూటింగ్ లో బైక్ మీద నుంచి పడిపోయినట్టు సమాచారం. బైక్ మీద పడిపోయిన బాలకృష్ణ కాలికి గాయమైంది. గాయపడిన బాలకృష్ణను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. స్వల్ప ప్రమాదమేనని.. కొంత విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపినట్టు సమాచారం. -
రామోజీ ఫిలింసిటీని దున్నటం ఏమైంది?
సీఎం కేసీఆర్కు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ ప్రశ్న కరీంనగర్: టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రామోజీ ఫిలింసిటీని వెయ్యి నాగళ్లు కట్టి దున్నిస్తామన్న కేసీఆర్ హెచ్చరికలు ఏమయ్యాయని కరీంనగర్, నిజామాబాద్ మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ ప్రశ్నించారు. గురువారం కరీంనగర్లో వారు విలేకరులతో మాట్లాడారు. పోలవరం విషయంలో ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్న కేసీఆర్ మాటమార్చడంలో ఆంతర్యమేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేసే విషయంలో ఓయూ విద్యార్థులు ఆందోళన చేస్తే లాఠీచార్జి చేయించడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే.. చిల్లర పార్టీలంటూ ఎదురుదాడికి దిగడం, తెలంగాణలో రెండు టీవీ చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం వంటి చర్యలు కేసీఆర్ అహం కార ధోరణికి నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ నేతలతో నీతులు చెప్పించుకునే స్థితిలో కాంగ్రెస్ లేదని, హద్దుమీరి మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
‘రామోజీ’ ఆగడాలకు అడ్డుకట్ట వేయండి
మంత్రి నాయినికి ఫిలింసిటీ కార్మికుల విజ్ఞప్తి ఇబ్రహీంపట్నం: రామోజీ ఫిలింసిటీలో పదిహేనే ళ్లుగా పనిచేస్తున్న తమను ఉద్యోగాలకు రాజీనామా చేయాల్సిందిగా ఆ యాజమాన్యం బెదిరిస్తోందని పలువురు కార్మికులు ఆరోపించారు. ఈ మేరకు శనివారం టీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కార్మిక చట్టాలను ఫిలింసిటీ యాజమాన్యం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఫిలింసిటీ యాజమాన్యానికి, తమకు మధ్య హైకోర్టులో, లేబర్ కోర్టులో కేసు నడుస్తోందని.. తమకు ప్రభుత్వం అండగా నిలిచి రామోజీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. -
రామోజీ ఫిలింసిటీ కార్మికుల ధర్నా
హైదరాబాద్: కార్మికులకు,కార్మికశాఖకు వ్యతిరేకంగా రామోజీ ఫిల్మ్సిటీ యాజమాన్యం తెచ్చుకున్న స్టేను ఎత్తివేయించడంలో కార్మికశాఖ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రామోజీ ఫిల్మ్సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం ఆర్టీసీ క్రాస్రోడ్డు సమీపంలోని కార్మికశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఫిల్మ్సిటీ యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. జీవో నంబర్ 63ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేతనాల పెంపు, ఉద్యోగభద్రత తదితర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. రామోజీ ఫిలింసిటీలో పనిచేస్తున్న కార్మికులపై యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. కార్మికశాఖ అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు ఫిల్మ్సిటీ యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రామోజీ ఫిలింసిటీ అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకోండి
గవర్నర్ సలహాదారుకు గోనె ఫిర్యాదు హైదరాబాద్: రామోజీ ఫిలింసిటీ ప్రధానద్వారం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్కు ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఫిలింసిటీ ప్రధాన ద్వారం నిర్మాణం కారణంగా అనాజ్పూర్ గ్రామస్తులు పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నారని, దీనిపై సంబంధిత ఆర్డీవోకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం కనిపించడం లేదని గోనె ఆ వినతిపత్రంలో వివరించారు. అలాగే, తెలంగాణ ప్రాంతంలో లక్ష కోట్ల విలువైన భూమి ఆక్రమణలకు గురైందని, వీటిపై చర్యలు తీసుకోవాలని కూడా గోనె కోరారు. మాజీ ఎంపీ మధుయాష్కీ ఫోర్జరీ సర్టిఫికెట్ల వ్యవహారంలోనూ కేసు నమోదు చేయాలని సలావుద్దీన్ అహ్మద్కు గోనె ప్రకాశరావు మరో వినతిపత్రం అందజేశారు -
రామోజీ ఫిల్మ్సిటీ భూముల స్వాధీనమేమైంది?: విమలక్క
దౌల్తాబాద్/గజ్వేల్,న్యూస్లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే రామోజీ ఫిల్మ్సిటీ భూములను స్వాధీనం చేసుకుంటామన్న కేసీఆర్ వాగ్దానం ఏమైందని, ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్(టఫ్) కోకన్వీనర్ విమలక్క శనివారం ప్రశ్నించారు. రామోజీ ఫిల్మ్సిటీలో మొట్టమొదటగా తానే నాగలి కడతానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఫాంహౌస్లో వ్యవసాయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీయూఎఫ్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, పీఓడబ్ల్యూ, పీడీఎస్యా(విజృంభణ), శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాచైతన్య యాత్ర మెదక్ జిల్లా దౌల్తాబాద్, గజ్వేల్ మండలాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. -
రోడ్డెక్కిన రామోజీ బాధితులు
-
'కార్మికుల హక్కులను రామోజీ హరిస్తున్నారు'
హైదరాబాద్: రామోజీ ఫిలిం సిటీలో పనిచేస్తున్న కార్మికుల హక్కులను గ్రూపు చైర్మన్ రామోజీరావు హరిస్తున్నారంటూ కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఫిలింసిటీ గ్రూప్ చైర్మన్ అయిన రామోజీరావు తమ హక్కులకు విఘాతం కల్గిస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ చిక్కడపల్లి ప్రాంతంలో ఉన్న లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట రామోజీ ఫిలింసిటీ కార్మికులు ధర్నా చేశారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న రామోజీరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రామోజీ ఫిలింసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. -
రామోజీకి అమ్ముడుపోయారు
సాక్షి, హైదరాబాద్: కార్మికులకు, కార్మికశాఖ ఉత్తర్వులకు వ్యతిరేకంగా రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం తెచ్చుకున్న స్టేను ఎత్తివేయించటంలో కార్మిక శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రామోజీ ఫిల్మ్ సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కార్మికుల జీవితాలతో ఫిల్మ్సిటీ యాజమాన్యం, కార్మికశాఖ అధికారులు చెలగాటమాడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కార్మికశాఖ జీవో 63ను ప్రశ్నిస్తూ, దానికి వ్యతిరేకంగా రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం రిట్ పిటిషన్ నెం 2495/2011 తో స్టే తెచ్చుకుందని, నెలలు దాటుతున్నా ఈ కేసులో కౌంటరు దాఖలు చేయటంలో కార్మికశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రామోజీ యాజమాన్యానికి కార్మికశాఖ అధికారులు అమ్ముడుపోయారని, అందుకే స్టే వెకేట్ చేయించటంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని రామోజీ ఫిల్మ్ సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సలహాదారులు ఎం బాబ్జి, వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యం, ప్రధాన కార్యదర్శి జి సైదులు ఆరోపించారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత తదితర న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తమ కార్మిక సంఘం నోటీసు ఇస్తే.. పరిష్కరించాల్సిన యాజమాన్యం కక్ష సాధింపులకు దిగుతోందన్నారు. ఇరవై ఐదు మంది కార్మికులను తొలగించినట్లుగా ప్రకటించిన యాజమాన్యం ఇప్పటివరకు సెటిల్మెంట్ పంపటంలేదన్నారు. సెటిల్మెంట్ పంపితే తాము న్యాయపరంగా పోరాడేవారమని, ప్రస్తుతం అటు డ్యూటీకి వెళ్లకుండా, ఇటు వేతనాలు రాక కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వాపోయారు. కార్మికులు 17, 18 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనం రూ. 10 వేలకు మించి ఇవ్వటం లేదని, ఉద్యోగ భదత్ర, డీఏ, హెచ్ఆర్ఏ వంటి న్యాయబద్ధమైన డిమాండ్లను పట్టించుకోవటం లేదని చెప్పారు. ధర్నా అనంతరం యూనియన్ ప్రతినిధులు రంగారెడ్డి జేసీఎల్ అజయ్ను కలిసి రామోజీ యాజమాన్యం తెచ్చుకున్న స్టేను వెకేట్ చేయించేందుకు సత్వరమే కౌంటరు దాఖలు చేయాలని వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రామకృష్ణ, మహేందర్, కె.బాలరాజు, ఎన్.మధు, విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నష్టాల్లో ఉన్నామంటూ రామోజీ ఫిల్మ్ సిటీ కుంటే షాకు