rice millers
-
ధాన్యం దారి మళ్లితే ఉపేక్షించం.. రైస్ మిల్లర్లకు డీఎస్ చౌహాన్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ధాన్యం దారి మళ్లితే ఉపేక్షించేది లేదని.. చర్యలు కఠినంగా ఉంటాయంటూ పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ వార్నింగ్ ఇచ్చారు. రైస్ మిల్లర్ల వద్దకు చేరిన ధాన్యం నిల్వలపై ఎన్ఫోర్స్మెంట్ విభాగం ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాలుగు రోజులలోనే 11 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, పలువురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలులో సర్కార్ పారదర్శకంగా వ్యహరిస్తుందని తెలిపారు.ధాన్యం దారి మళ్లింపునకు అవకాశం ఉండబోదని రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్తోపాటు ఆయా జిల్లాల అసోసియేషన్లు ప్రభుత్వానికి ఇప్పటికే హామీ ఇచ్చాయన్నారు. కొందరు రైస్ మిల్లర్లు మాత్రం అవకతవకలకు పాల్పడుతూ దారి మళ్లిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైస్ మిల్లర్లు ఉత్తమ పనితీరు కనబరుస్తున్నారని చెప్పారు. -
కూటమి ప్రభుత్వం కమీషన్ల దందా
-
కమీషన్ల కోసం కపట నాటకం!
సాక్షిప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వంలో కమీషన్ లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. రాష్ట్రంలో పాలన పారదర్శకంగా సాగిపోతోందని కూటమి సారథులు చెబుతోన్న మాటలకు, వాస్తవానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఇసుక, మద్యం దందా.. దౌర్జన్యాలు, హత్యలు, హత్యాచారాలు, దాడులతో రెచ్చిపోతుండటాన్ని సుపరిపాలనగా చెప్పుకుంటున్నారు. అన్నింట్లోనూ కమీషన్ల కక్కుర్తితో జేబులు నింపుకుంటోన్న పెద్దలు ఇప్పుడు రైస్ మిల్లర్ల పొట్ట కొట్టేందుకు తగ్గేదేలే అంటున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిల విడుదల కోసం కమీషన్ ఇస్తేకానీ విడుదల చేయనని ఓ మంత్రి బీషి్మంచుకుని కూర్చున్నారు. దీంతో కొంత మంది వసూళ్ల బాధ్యతలను భుజాన వేసుకున్నారు. డిసెంబర్ మొదటి వారం నాటికి సదరు మంత్రి అడిగిన మేరకు వసూళ్లు పూర్తి చేసి అప్పగించే పనిలో బిజీగా ఉన్నారు. గత నెలలో కాకినాడ కేంద్రంగా జరిగిన రైస్ మిల్లింగ్ రంగ ప్రముఖల భేటీలో ఈ మేరకు కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం సాగింది. నాడు జరిగిన ఒప్పందం ప్రకారం నాలుగైదు రోజుల క్రితం ప్రభుత్వం నుంచి సీఎంఆర్ బకాయిల కింద రూ.200 కోట్లు విడుదలయ్యాయి. తొలి విడతగా విడుదలైన బకాయిలకు గత నెలలో కుదిరిన ఒప్పందం మేరకు 8 శాతం కమీషన్ వసూళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందుకు కమీషన్గా రూ.16 కోట్లు వసూలు చేస్తున్నారు. బకాయిలు వచ్చాయని సంతోíÙంచాలో.. భారీగా కమీషన్ ఇవ్వాల్సి వచ్చినందుకు ఏడవాలో అర్థం కావడం లేదని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ అసలు సంగతి.. » ప్రజా ప్రయోజనాల కోసం ప్రతి వ్యవసాయ సీజన్లో కోటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ చేసేందుకు అనుమతిస్తుంటుంది. ఇది ఏ ప్రభుత్వంలో అయినా సీజన్కు ముందు జరిగేదే. ప్రభుత్వం ఇచ్చే కోటా ప్రకారం మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యాన్ని తిరిగి అప్పగించడం పరిపాటి. అలా ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇచ్చిన రాష్ట్రంలోని మిల్లర్లకు ప్రభుత్వం సుమారు రూ.1,600 కోట్లు బకాయి పడింది. » సార్వత్రిక ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయకత్వాన ప్రభుత్వం గద్దె నెక్కడంతో సీఎంఆర్ బకాయిల విడుదల కోసం మిల్లర్లు కూటమిలోని పెద్దల వద్ద లాబీయింగ్ చేశారు. బకాయిలు రూ.200 కోట్లు వంతున దశల వారీగా విడుదల చేయాలని పలువురు ప్రతిపాదించారు. » ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కస్టమ్ మిల్లింగ్ లక్ష్యం 37 లక్షల టన్నులుగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 80 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో 20 లక్షల టన్నులు స్థానిక అవసరాలకు వినియోగిస్తే మిగిలిన 60 లక్షల టన్నులు కస్టమ్‡ మిల్లింగ్కు ఇవ్వాలని మిల్లర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. » రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 2,300 మిల్లులపై ఆధార పడ్డ వేలాది మంది లారీ, జట్టు, ప్యాకింగ్ కారి్మకులకు ఉపాధి లభిస్తుందని మిల్లర్లు కోరుతున్నారు. ఈ అంశంతో పాటు రైస్ మిల్లుల రాష్ట్ర కార్యవర్గంలో మార్పులపై ఆ రంగ ప్రముఖులు ఇటీవల కాకినాడలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) బకాయిలు మొత్తంగా సుమారు రూ.1600 కోట్ల విషయం చర్చకు వచ్చింది. ఖరీఫ్ సీజన్లో కస్టమ్ మిల్లింగ్లో ధాన్యం సేకరణ జరగాలంటే బకాయిలు విడుదల చేయాల్సిందేనని మిల్లర్లు పట్టుబట్టారు. మొత్తం బకాయిలు ఇప్పటికిప్పుడు ఒకేసారి విడుదల చేసే పరిస్థితులు లేవని తేల్చారు. రూ.200 కోట్ల వంతున విడుదల చేయించేందుకు ఒక మంత్రి తరఫున కొందరు నాటి సమావేశంలో వకాల్తా పుచ్చుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. » మొదటి విడత విడుదల అనుకున్నట్టు జరగాలంటే విడుదల చేసే బకాయి మొత్తంలో 10 శాతం కమీషన్ ఇవ్వాలని పట్టుబట్టారు. బకాయిలు పెరిగి పోయి మిల్లుల నిర్వహణ సవాల్గా మారిందని అభ్యంతరం వ్యక్తం కావడంతో చివరకు 8 శాతానికి ఒప్పందం కుదిరిందని సమాచారం. గత ప్రభుత్వంలో ఎవరికీ చిల్లి గవ్వ కమీషన్ ఇవ్వలేదని కొందరు విబేధించినా, చివరకు వారు కూడా మెజార్టీ నిర్ణయాన్ని కాదనలేకపోయారని తెలిసింది. పథకం ప్రకారం ఎగుమతులపై విష ప్రచారం » ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కాకినాడ పోర్టు ద్వారా పేదల బియ్యం విదేశాలకు తరలి పోతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నికల సభల్లో గగ్గోలు పెడుతూ కాకినాడ పోర్టు ప్రతిష్టను దెబ్బ తీశారని మిల్లింగ్ రంగంలో ఉన్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గడచిన ఐదేళ్లలో కోటి 47 లక్షల 55 వేల 837 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు జరిపిన కాకినాడ పోర్టు ప్రాధాన్యతను గుర్తించకుండా కమీషన్ కోసమే ఇంత చౌక బారుగా వ్యవహరిస్తారా? అని విస్తుపోతున్నారు. » రెండు తరాలుగా రైస్ ఇండస్ట్రీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన మిల్లర్లే లక్ష్యంగా కూటమి నేతలు రైస్ మిల్లులు, గోడౌన్లపై వరుస దాడులు చేయించారు. తాము చెప్పినదంతా నిజమేనని ప్రజలను నమ్మించేందుకు పీడీఎస్ బియ్యంగా సుమారు 48 వేల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం సీజ్ చేసింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు రోజులు కాకినాడలో మకాం వేసి.. మిల్లులు, గోడౌన్లపై దాడులను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఇంతా చేసి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేక పోయారనే విమర్శలొచ్చాయి. సీజ్ చేసిన బియ్యంలో పీడీఎస్ లేదనే నిర్ధారణతో 70 శాతం బియ్యాన్ని దశల వారీగా విడుదల చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సీజ్ చేసిన మిగిలిన బియ్యంపై 6ఎ కేసులకే పరిమితమయ్యారు. కూటమి పెద్దల ఇంత హడావుడి వెనుక మిల్లర్లను దారికి తెచ్చుకోవడమేనని తేలిపోయిందని జనం విస్తుపోతున్నారు. -
రైస్ మిల్లర్లపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం
-
Telangana: మిల్లర్లపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైస్ మిల్లర్లపై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. పైసా పెట్టుబడి లేకుండా ఏటా కోట్ల రూపాయలు సంపాదిస్తూ కూడా, సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్) చేసేందుకు వెనుకాడుతున్నారంటూ.. మిల్లులపై కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం పెట్టే నిబంధనల మేరకు ప్రతి రైస్ మిల్లు పనిచేయాలని.. లేకుంటే మిల్లు సీజ్ చేయడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేసింది. ప్రతి మిల్లు సామర్థ్యంలో 50 శాతం మేరకు ధాన్యం అప్పగించి, తప్పనిసరిగా మిల్లింగ్ చేసేలా నిబంధన పెట్టింది. బ్యాంకు గ్యారంటీ ఇవ్వలేమంటూ తప్పించుకునే పరిస్థితి లేకుండా చర్యలు చేపట్టింది. కోట్ల రూపాయల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిపడ్డ డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ చట్టం కింద జప్తు చేయాలని నిర్ణయించింది. ఆయా మిల్లుల ఆస్తులను ఇతరుల పేర్లపైకి బదలాయించే అవకాశం లేకుండా ముందు జాగ్రత్తగా రిజి్రస్టేషన్ శాఖను అప్రమత్తం చేసింది. మిల్లర్ల ఇష్టారాజ్యానికి చెక్! రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడి, మిల్లింగ్ సదుపాయాల కొరతను ఆసరాగా చేసుకొని.. మిల్లర్లు కొన్నేళ్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మిల్లింగ్ కెపాసిటీతో సంబంధం లేకుండా సీఎంఆర్ కోసం ధాన్యం కేటాయింపులు, ఏళ్లకేళ్లు గడిచినా బియ్యాన్ని అప్పగించకపోవడం, మిల్లు ల్లో ధాన్యం లేకపోవడం.. వంటి అవకతవకలతో పౌర సరఫరాల సంస్థ తీవ్ర నష్టాలను చవిచూసింది. దీనితో 2014–15లో రూ.4,747 కోట్లుగా ఉన్న సంస్థ అప్పులు.. 2023–24 నాటికి రూ.58,623 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు, మిల్లర్ల మాయాజాలంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొన్ని మార్గదర్శకాలను రూపొందించి... ఖరీఫ్ సీజన్ నుంచే నిబంధనలను కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టింది. కచ్చితంగా మిల్లింగ్ చేసేలా.. మిల్లులు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పగించకుండా మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకోవడం, ఏళ్లకేళ్లు బకాయిలు అలానే ఉండటం వంటి సమస్యలకు చెక్ పెట్టేలా.. ప్రభుత్వం ధాన్యానికి బ్యాంకు గ్యారంటీ నిబంధన తెచ్చింది. ఈ నిబంధన వల్ల కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) చేయలేమంటూ మొండికేస్తున్న మిల్లర్లను దారికి తెచ్చేలా చర్యలు చేపట్టింది. ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్కు సంబంధించి... 2015, 2016లలో విడుదలైన 18, 36 జీవోలు, వాటికి సవరణ చేస్తూ 2023 అక్టోబర్లో జారీ చేసిన జీవో నంబర్ 25ను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలోని ప్రతి రైస్ మిల్లు దాని కెపాసిటీలో కనీసం 50శాతం మేర ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని సీఎంఆర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మిల్లు లైసెన్స్ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దీనితో కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని దించుకోమని మిల్లర్లు మొండికేసే పరిస్థితి తప్పనుంది. 2,054 మిల్లులు ‘గ్యారంటీ’కి రెడీ రాష్ట్రంలోని సుమారు 3,500 మిల్లులకుగాను.. 2,054 రైస్మిల్లులు బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చి ధాన్యాన్ని తీసుకునేందుకు అంగీకరించాయి. ఇందులో 1,274 రా రైస్ (ముడి బియ్యం) మిల్లులు కాగా.. 780 బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) మిల్లులు. ఇప్పటివరకు 1,669 మిల్లులు (992 రా రైస్, 677 బాయిల్డ్ మిల్స్) బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని అండర్ టేకింగ్ ఇచ్చాయి. అండర్ టేకింగ్ ఇచ్చిన మిల్లుల సామర్థ్యం 57.76 లక్షల మెట్రిక్ టన్నులు. డీఫాల్టర్ల విషయంలో ప్రత్యేక చర్యలు మూడు విడతల కన్నా ఎక్కువగా సీఎంఆర్ ఇవ్వకుండా ఎగవేసిన మిల్లర్లను డీఫాల్టర్లుగా గుర్తించి ధాన్యం కేటాయించకూడదని, లేదా షరతులతో కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 1,777 డీఫాల్టర్లను గుర్తించగా.. అందులో 362 మంది మిల్లర్లు కొన్నేళ్లుగా వరుసగా సీఎంఆర్ ఎగవేస్తూ వస్తున్నారు. వారికి ఈ ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయించడం లేదు. మిగతావారు మొత్తం బకాయి మొత్తం బియ్యాన్ని, అపరాధ రుసుముతో సహా అప్పగించి... దీనితోపాటు కొత్తగా ఇచ్చే ధాన్యానికి సంబంధించి 25 శాతం బ్యాంకు గ్యారంటీ ఇస్తే ధాన్యం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి ఎగవేతదారులుగా గుర్తించిన 362 మంది మిల్లర్లలో.. కేవలం 10 మంది మిల్లర్లే ఏకంగా రూ.605 కోట్ల విలువైన 1.67 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. వీరిలో ఆరుగురు సూర్యాపేట జిల్లావారుకాగా, ఇద్దరు కరీంనగర్ వారు నాగర్కర్నూల్, నిజామాబాద్ల నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ రికవరీ యాక్టు ద్వారా వారి ఆస్తులను జప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరిస్తున్నారు. వారు ఆస్తులు అమ్ముకోకుండా, వేరేవారి పేరిట బదిలీ చేయకుండా రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. బ్యాంక్ గ్యారంటీ తీసుకునే ధాన్యం కేటాయింపులురైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేసి... కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు మూడు నుంచి ఆరు నెలల్లోగా ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి... వచ్చిన బియ్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ఇలా ధాన్యం తీసుకున్న చాలా మిల్లులు ఏడాదిన్నర, రెండేళ్లయినా బియ్యం తిరిగివ్వని పరిస్థితి. 2022–23 రబీ సీజన్లో మిల్లులకు కేటాయించిన 65 లక్షల టన్నుల ధాన్యంలో... సుమారు 30 లక్షల టన్నులను మిల్లింగ్ చేసి, బియ్యాన్ని మార్కెట్లో అమ్మేసుకున్నారు. అందులో 25 లక్షల టన్నుల మేర రికవరీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు పిలిచినా ఫలితం లేకుండా పోయింది. ఆ బకాయిల విలువ రూ.7 వేల కోట్లుగా లెక్కగట్టగా.. ఇప్పటివరకు రూ.3 వేల కోట్ల వరకు మాత్రమే రికవరీ అయ్యాయి. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం కేటాయించే ధాన్యానికి సంబంధించి మిల్లర్ల నుంచి కొంత మేర బ్యాంకు గ్యారంటీలు తీసుకుంటోంది. మిల్లులకు వాటికి సామర్థ్యానికి తగిన మేరకే ధాన్యాన్ని కేటాయిస్తోంది. -
మిల్లర్ల కతలు.. రైతుల వెతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసేందుకు రైస్మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 29న ప్రకటించిన ఖరీఫ్ ధాన్యం సేకరణ పాలసీ తమను నష్టాల పాలు చేస్తుందని వారు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. దీనితో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం పడింది. కొనుగోలు కేంద్రాల్లోనే భారీగా ధాన్యం పోగుపడుతోంది. అకాల వర్షాలతో ఆ ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. ఏం చేయాలో పాలుపోక ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. మిల్లర్ల విజ్ఞప్తులను తోసిపుచ్చడంతో.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎంఆర్ పాలసీ విషయంలో మిల్లర్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోలేదనే విమర్శలున్నాయి. సన్న ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయడానికి సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ‘ఔటర్న్’ను సవరించాలని మిల్లర్లు చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనితోపాటు మిల్లులు తమకు కేటాయించే ధాన్యానికి బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ముడి బియ్యం మిల్లర్లు పోరుబాట పట్టారు. నిజానికి ధాన్యం సేకరణ పాలసీ ప్రకటించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల మొదటి వారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. పరిశీలన జరిపిన ఉప సంఘం గత నెలాఖరులో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో ధాన్యం సేకరణ, రైతులకు బోనస్, అధికారుల బాధ్యతలను పేర్కొన్న సర్కారు.. మిల్లర్ల డిమాండ్లను పట్టించుకోలేదు. ‘ఔటర్న్’ తగ్గించాలనే డిమాండ్.. ఒక క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసినప్పుడు వచ్చే బియ్యం, నూకల లెక్కను ‘ఔటర్న్’ అని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఔటర్న్ ప్రకారం.. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) విధానం కింద మిల్లర్లకు చేరే ప్రతి 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, ఇతర అంశాల నేపథ్యంలో.. బియ్యం తక్కువగా వస్తుందని, నూకలు ఎక్కువగా వస్తాయని మిల్లర్లు చెప్తున్నారు. చాలా జిల్లాల్లో ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేస్తే.. 58 కిలోల బియ్యం, 9 కిలోల నూకలు కలిపి 67 కిలోలు వస్తాయని వారు ప్రభుత్వంతో చర్చల సందర్భంగా వివరించారు. తమకు నష్టం కలిగించే ఈ ఔటర్న్ లెక్కను సరిదిద్దాలని కోరారు. మధ్యేమార్గంగా 62 కిలోల ఔటర్న్ నిర్ణయిస్తే.. నూకలను విక్రయించి, బియ్యన్నే అదనంగా ఎఫ్సీఐకి ఇస్తామని చెప్పారు. కానీ మిల్లర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. బ్యాంకు గ్యారంటీలపై విముఖత గతంలో ప్రభుత్వం మిల్లులకు నేరుగా ధాన్యాన్ని కేటాయించి, వారి నుంచి బియ్యాన్ని తీసుకునేది. ధాన్యం ఇచ్చినందుకు ఎలాంటి గ్యారంటీ అడిగేది కాదు. అయితే 2022–23 రబీలో మిల్లర్లు ధాన్యం మిల్లింగ్ చేయలేదంటూ సీఎంఆర్ బియ్యాన్ని పూర్తిగా అప్పగించలేదు. సుమారు రూ.7 వేల కోట్ల విలువైన 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రికవరీ చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నాలుగు సంస్థలకు టెండర్లు ఇచ్చింది. అయినా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లేదా ఆ మేర విలువను మాత్రమే రికవరీ చేయగలిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ధాన్యం కేటాయింపుకోసం మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం తప్పనిసరి అని కొత్త పాలసీలో పొందుపరిచింది. ఇందులో కూడా నాలుగు కేటగిరీలను నిర్ణయించింది. గడువులోగా సీఎంఆర్ అప్పగిస్తూ, ఇప్పటివరకు డీఫాల్ట్ కాని మిల్లర్లకు కేటాయించే ధాన్యం విలువలో 10 శాతం బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటారు. అలాంటి మిల్లులు అతి తక్కువని సమాచారం. ఇక డీఫాల్ట్ అయి పెనాల్టీతో సహా సీఎంఆర్ అప్పగించిన మిల్లర్ల నుంచి 20శాతం, పెనాల్టీ పెండింగ్లో ఉన్న మిల్లర్ల నుంచి 25శాతం బ్యాంక్ గ్యారంటీలు, సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకుంటారు. మిల్లుల్లో ధాన్యం లేని, సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లను నాలుగో కేటగిరీగా నిర్ణయించి.. ధాన్యం కేటాయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నాలుగో కేటగిరీలో సుమారు 300 మంది మిల్లర్లు ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ బ్యాంకు గ్యారంటీ షరతులకు ముడి బియ్యం మిల్లర్లు అంగీకరించడం లేదు. దీనితో అధికారులు ఇప్పటికిప్పుడు కాకపోయినా 15 రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని మిల్లర్ల నుంచి ‘అండర్ టేకింగ్’ తీసుకుంటూ ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. అండర్ టేకింగ్ ఇచ్చిన మిల్లర్లు తర్వాత తప్పనిసరిగా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనికి మిల్లర్లు ముందుకురావడం లేదని తెలిసింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాల్లో అధికారులు రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని గోదాములకు పంపిస్తున్నారు. మిల్లింగ్ చార్జీల పెంపుపైనా అసంతృప్తి.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కస్టమ్ మిల్లింగ్ చార్జీలు క్వింటాల్కు రూ.110 నుంచి రూ.200 వరకు ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దొడ్డురకాలకు రూ.40, సన్నరకాలకు రూ.50కి మాత్రమే చార్జీలు పెంచిందని మిల్లర్లు అంటున్నారు. ఈ చార్జీలను కూడా సకాలంలో ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇచ్చిన బియ్యానికి మాత్రమే లెక్కకట్టి ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. ఇచ్చే అరకొర చార్జీలకు కూడా కోతలు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.రూ.500 బోనస్, రేషన్షాపులకు సన్న బియ్యం ఎలా? రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రైతులు రాష్ట్రంలో భారీ ఎత్తున సన్నరకాల వరి సాగు చేశారని వ్యవసాయ శాఖ ప్రకటించింది. రైతుల సొంత అవసరాలు, బహిరంగ మార్కెట్లో విక్రయించే ధాన్యం పోగా.. కొనుగోలు కేంద్రాలకు ఏకంగా 50 లక్షల టన్నుల సన్నధాన్యం, 30 లక్షల టన్నుల వరకు దొడ్డు ధాన్యం వస్తుందని పౌర సరఫరాల సంస్థ అంచనా వేసింది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్నధాన్యాన్ని మిల్లింగ్ చేయించి, ఆ సన్న బియ్యాన్ని జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. అలా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్న ధాన్యానికి సంబంధించి క్వింటాల్కు రూ.500 చొప్పున రైతులకు నేరుగా జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కూడా. అయితే కొనుగోలు కేంద్రాలకు సన్నధాన్యం రాకపోవడం, మిల్లర్ల లొల్లి నేపథ్యంలో.. రైతులకు బోనస్ అందడం, రేషన్షాపుల్లో సన్న బియ్యం సరఫరా పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారాయి.రేపు రైస్ మిల్లర్ల భేటీ ఖరీఫ్ ధాన్యం మిల్లింగ్ సమస్యల విషయంలో చర్చించేందుకు రైస్ మిల్లర్లు మంగళవారం రోజున సమావేశం కానున్నారు. యాదాద్రి జిల్లా ఘట్కేసర్లో నిర్వహించే ఈ భేటీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రా, బాయిల్డ్ రైస్మిల్లుల నిర్వాహకులు హాజరుకావాలని రా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని తెలిపారు. నామమాత్రంగానే కొనుగోళ్లు రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నప్పటికీ.. ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్లు బాగా తక్కువగా ఉండటం గమనార్హం. ఈ సీజన్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు కేవలం 20వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. అంతేకాదు ఇది కూడా దొడ్డురకం ధాన్యమేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. సన్నరకాల ధాన్యం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. కొనుగోళ్లు సరిగా లేక రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు వానకు తడుస్తూ, ఎండకు ఎండుతున్నాయి. నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు తమ వంతు ఎప్పుడు వస్తుందో తెలియక పడిగాపులు పడుతున్నారు. ఇటీవలి అకాల వర్షానికి పెద్దపల్లి జిల్లాలో చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. -
సన్నబియ్యానికి ‘నూకలు’ చెల్లినట్టే!
సాక్షి, హైదరాబాద్: సన్నబియ్యంలో నూకల పేరిట మిల్లర్లు భారీ స్కెచ్ వేశారు. 100 కిలోల సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 58 కిలోల బియ్యం, 9 కిలోల నూకలు వస్తాయని కొత్తరాగం ఎత్తుకున్నారు. నిబంధనల ప్రకారం ఖరీఫ్లో 100 కిలోల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 67 కిలోల బియ్యం లెక్కన ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ఈసారి కొనుగోలు కేంద్రాలకు సన్న ధాన్యం (సన్నాలు) భారీ ఎత్తున వస్తాయని భావిస్తున్న మిల్లర్లు మిల్లింగ్లో చేతివాటం చూపేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు రబీలో వచ్చే ధాన్యాన్ని రా రైస్గా మిల్లింగ్ చేస్తే నూకల శాతం పెరుగుతుందని చెబుతూ వచ్చిన మిల్లర్లు.. ఈసారి సన్న ధాన్యానికి కూడా ఇదే వంక పెడుతున్నారు. గతంలో ఎన్నడూ ఖరీఫ్ ధాన్యం ఔటర్న్పై ఒక్కమాట కూడా మాట్లాడని మిల్లర్లు ఎకాఎకిన 9 కిలోల బియ్యానికి టెండర్ పెడుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సన్నబియ్యం ధర కిలోకు రూ. 50 చొప్పున లెక్క వేసుకున్నా... 9 కిలోలకు రూ. 450 అవుతుంది. క్వింటాల్ సన్న ధాన్యానికి రైతుకు ప్రభుత్వం రూ. 500 బోనస్గా ఇవ్వాలని భావిస్తుంటే... మిల్లింగ్ పేరు మీద క్వింటాల్ ధాన్యానికి రూ. 450 విలువైన బియ్యాన్ని ఎగవేసే పన్నాగంలో మిల్లర్లు ఉన్నట్లు అర్థమవుతోంది. 9 కిలోల బియ్యానికి బదులు నూకలు ఇస్తామనడం పట్ల పౌరసరఫరాల శాఖ అధికారులే విస్తుపోతున్నారు. బ్యాంక్ గ్యారంటీలపైనా తకరారు! ఖరీఫ్ సీజన్లో మిల్లర్లకు ధాన్యం కేటాయింపులో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగానే బ్యాంకు గ్యారంటీలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలలో పొందుపరిచారు కూడా. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించాల్సి ఉండగా, ముసాయిదాతోనే నిలిపివేసి, మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. రైస్మిల్లు కెపాసిటీకి అనుగుణంగా కేటాయించిన ధాన్యం విలువలో 25 శాతం మేర బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. మిల్లును లీజుకు తీసుకుంటే.. కేటాయించిన ధాన్యం విలువలో 50 శాతం మేర లీజుదారుడు చెల్లించాలి. అయితే ఈ బ్యాంక్ గ్యారంటీ నిబంధనలను మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం అనేది తమకు తలకు మించిన భారమని, మిల్లింగ్ చార్జీలు కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని, ఏపీ వంటి రాష్ట్రాల్లో క్వింటాల్కు రూ.100 చెల్లిస్తుంటే మనరాష్ట్రంలో కేవలం రూ. 10 మాత్రమే ఇస్తున్నారని మిల్లర్లు చెబుతున్నారు. అది కూడా చాలా కాలంగా ఇవ్వడం లేదని వారి ఆరోపణ. ఈ నేపథ్యంలో బ్యాంకు గ్యారంటీలను ఎత్తివేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక సీజన్లో సీఎంఆర్ ఇవ్వకుండా డిఫాల్ట్ అయిన మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకొని ధాన్యం కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అంటే ఒక సీజన్లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లర్లు తాము ఇవ్వాల్సిన బియ్యాన్ని అప్పగించడంతోపాటు అదనంగా 25 శాతం జరిమానా మొత్తానికి బ్యాంక్ గ్యారంటీ ఇస్తే వారికి ధాన్యం కేటాయిస్తారు. ఇలా ఒక సీజన్లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లులు రాష్ట్రంలో 791 ఉన్నట్టు పౌరసరఫరాల సంస్థ తేల్చింది. రెండు, అంతకంటే ఎక్కువ సీజన్లలో డిఫాల్ట్ అయిన మిల్లులకు ఈసారి ధాన్యం కేటాయించమని మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో తేల్చిచెప్పారు. 386 మిల్లులను డిఫాల్ట్ మిల్లులుగా తేల్చడం గమనార్హం. మొత్తానికి బ్యాంకు గ్యారంటీల అంశం కూడా అటకెక్కినట్టేనని పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
ధాన్యం..దళారుల దోపిడీ
సాక్షి, హైదరాబాద్: వరికోతలు మొదలైనా, ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. దీంతో రైతులు దళారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో వరికోతలు పదిహేను రోజుల క్రితమే మొదలు కాగా, ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కూడా కోతలు మొదలయ్యాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని గ్రామాల రైతులు కోసిన పచ్చి ధాన్యాన్నే నేరుగా మిల్లులకు తీసుకొని వెళ్లి, వారిచ్చిన ధరకు అమ్ముకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని మండలాల్లో రైతుల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం రైతులు దళారులనే నమ్ముకుంటున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిద్ధిపేట జిల్లాల్లో కూడా కోతలు షురూ అయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్లో 4.16 లక్షల ఎకరాల్లో వరిసాగు ఉమ్మడినిజామాబాద్ జిల్లాలో యాసంగి సీజన్లో 4.16లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. 11.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానిక అవసరాలకు నాణ్యమైన ధాన్యం రైస్మిల్లర్లు కొనుగోలు చేయగా, మిగతా 6 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే వర్ని, రుద్రూర్, మోస్రా, చందూర్, సిరికొండ, మోపాల్, ధర్పల్లి, డిచ్పల్లి, చాలా మండలాల్లో కోతలు ముమ్మరం అయ్యాయి. మిల్లర్లు, వ్యాపారులు సన్నరకం ధాన్యాన్ని క్వింటాల్కు రూ.1,900 నుంచి రూ.2,300 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్లోని నాణ్యమైన ధాన్యాన్ని నల్లగొండ, మిర్యాలగూడ, ఏపీకి చెందిన మిల్లర్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. పది రోజుల క్రితం క్వింటాలు ధాన్యానికి రూ. 2,500 ధర చెల్లించిన దళారులు ఇప్పుడు రూ.1,900 కే కొంటున్నారు. మిర్యాలగూడలోని 75 మిల్లులకు ధాన్యం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా మిర్యాలగూడ రైస్ మిల్లులకు «ధాన్యం భారీగా వస్తోంది. మిర్యాలగూడలోని 87 రైస్మిల్లులు ఉండగా, ప్రస్తుతం 75 మిల్లుల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. ఇటీవల మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లకు ఆంక్షలు విధించగా, మంత్రి కోమటిరెడ్డి మిల్లుకు వచ్చిన ప్రతిరైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే తొలుత వ్యాపారులు మొదట క్వింటాల్కు రూ.2600 నుంచి రూ.2700 వరకు చెల్లించగా, ధాన్యం రాక పెరగడంతో వ్యాపారులు ధర తగ్గించారు. పెరిగిన ఎండల ధాటికి ట్రాక్టర్లతో ధాన్యం తెచ్చిన రైతుల నుంచి కొనుగోలు చేయకుండా సాయంత్రం వరకు వేచి ఉండేలా చేసి క్వింటాల్కు రూ.2100 నుంచి రూ.2,400 వరకు మాత్రమే ఇచ్చి కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మెట్రిక్ టçన్నుల ధాన్యం కొనుగోలు చేశామ మిల్లర్లు చెబుతున్నారు. ప్రతి ఏడాది 4 నుంచి 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, ఈసారి పంట దిగుబడి ఆశించినంత రాకపోవడంతో 3లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినట్టు చెబుతున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వ కొనుగోళ్లు యాసంగి సీజన్కు సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహాన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7,149 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 75.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేస్తే దళారుల బాధ తగ్గేదని, మిల్లర్ల ఇష్టారాజ్యానికి చెక్ పడేదని రైతులు అంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ‘ఏ’ గ్రేడ్ రకానికి రూ.2,203, ‘బి’ గ్రేడ్ కు రూ. 2,183 ధర వస్తుందని, మిల్లర్లు, దళారుల వల్ల కనీస మద్దతు ధర కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. దళారులు తరుగు తీస్తున్నారనే ఆరోపణలున్నాయి. ధాన్యానికి డబ్బులు చెల్లించేటప్పుడు లక్ష రూపాయలకు రూ.1,000 చొప్పున కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రైస్మిల్లర్లకు రూ.10 కోట్ల జరిమానా
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 36 మంది రా రైస్మిల్లర్లకు రూ.10 కోట్ల మేరకు జరిమానా విధించామని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ తెలిపారు. కలెక్టరేట్లో గురువారం రైస్మిల్లర్లతో సమీక్షించిన అనంతరం 2020–2021 వానాకాలానికి సంబంధించి డిఫాల్ట్ అయిన రా రైస్మిల్లర్లకు జరిమానా విధించినట్లు వివరించారు. 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి సకాలంలో ఇవ్వలేదని, గడువులోగా ఇవ్వని 36 మంది రైస్మిల్లర్లకు రూ.10 కోట్ల జరిమానా విధిస్తూ.. తక్షణమే రూ.2 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. 2022–2023 వానాకాలానికి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ డెలివరీపై ఖీమ్యానాయక్ ఆరా తీశారు. 1,46,341 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 6,931 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని పౌరసరఫరాల అధికారులు వెల్లడించారు. సాధ్యమైనంత తొందరగా సీఎమ్మార్ను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. డీఎస్వో ఎస్.జితేందర్రెడ్డి, పౌరసరఫరాల శాఖ జీఎం జితేంద్రప్రసాద్, రైస్మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పబ్బ నాగరాజు, రైస్మిల్లర్లు గరిపెల్లి ప్రభాకర్, చేపూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
డిఫాల్టర్లకు పెనాల్టీ
సాక్షి, హైదరాబాద్: నిర్ణీత గడువులోగా ఎఫ్సీఐకి కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఇవ్వని రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కొరడా విదిల్చింది. 2021–22 వానా కాలం సీఎంఆర్ గడువు పలు వాయిదాల తరువాత ఏప్రిల్ 31తో ముగిసింది. అయినా రాష్ట్రంలోని 494 రైస్ మిల్లులు బియ్యం అప్పగించలేదు. వీటినుంచి 2.22 ఎల్ఎంటీ బియ్యం ఎఫ్సీఐకి చేరాల్సి ఉంది. ఈ బియ్యం రికవరీకి గడువు కోరినా ఎఫ్సీఐ అంగీకరించలేదు. దీంతో ఎఫ్సీఐ నుంచి సుమారు రూ. 700 కోట్లు రాలేదు. ఇప్పుడు మిల్లర్ల నుంచి బియ్యాన్ని రికవరీ చేసినా, నిబంధనల మేరకు ఎఫ్సీఐకి పంపకుండా రాష్ట్ర అవసరాలకే (స్టేట్ పూల్) వినియోగించుకోవాలి. దీంతో పౌర సరఫరాల శాఖ నష్ట నివారణకు చర్యలు చేపట్టింది. 494 రైస్ మిల్లులను డిఫాల్టర్లుగా ప్రకటించి, వారి నుంచి 25 శాతం పెనాల్టీతో 125 శాతం సీఎంఆర్ను రికవరీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి హోదాలో పౌరసరఫరాల సంస్థ కమిషనర్ వి.అనిల్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 25 శాతం నగదు.. 100 శాతం బియ్యం.. డిఫాల్టర్ల నుంచి 125 శాతం బియ్యాన్ని రికవరీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మిల్లర్ల గుండెల్లో పిడుగు పడినట్లయింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ విలువ రూ. 700 కోట్లు అనుకుంటే... రూ. 175 కోట్లు(25 శాతం) పెనాల్టీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం వెంటనే చెల్లించాలి. అప్పుడే మిల్లర్ నుంచి బియ్యం రికవరీ ప్రారంభమ వుతుంది. మిల్లర్లు ఇప్పటికే బియ్యాన్ని విక్రయించినట్లు ఆరోపణల నేపథ్యంలో రికవరీకి రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేసి స్టేట్పూల్కు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. వంద శాతం రికవరీయే కష్టమవుతుంది కాబట్టి, 25 శాతం బియ్యాన్ని నగదు రూపంలో వసూలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పౌరసరఫరాల శాఖ, సంస్థ డీఎంలు, డీఎస్ఓలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. పెనాల్టీ నుంచి 5వ వంతు మిల్లర్ల నుంచి వసూలు చేసే పనిలో అధికార యంత్రాంగం ఉంది. ఓ వైపు సీఎంఆర్.. మరోవైపు ధాన్యం అన్లోడింగ్.. ఇప్పుడు డిఫాల్ట్ మిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఓవైపు సీఎంఆర్ అప్పగించేందుకు మిల్లులు నడుపుతూ ప్రస్తుత యాసంగి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకొనే విషయంలో సర్కార్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలున్నాయి. ధాన్యానికి కొర్రీలు పెడుతూ ప్రతి 40 కిలోల బస్తాపై 3 నుంచి 5 కిలోల అదనపు ధాన్యాన్ని రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
ప్రజావాణి: ఈ మహిళ పేరు స్వప్న.. తాగడానికి నీరు దొరకలేదు
ఈ మహిళ పేరు స్వప్న. వెల్గటూర్ మండలం ముంజంపల్లి స్వగ్రామం. ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లోని ప్రజావాణి వేదిక వద్దకు చేరుకుంది. తాగడానికి సమీపంలో ఎక్కడా నీరు దొరకలేదు. దాహంతో తపించిపోయింది. జగిత్యాల: అసలే ఎండాకాలం. ఎండలు మండిపోతున్నాయి. దాహం కోసం ప్రజలు తపిస్తున్నారు. అయినా, కలెక్టరేట్లో సోమవారం చేపట్టిన ప్రజావాణిలో కనీస సౌకర్యాలు కల్పించలేదు. కలెక్టరేట్ మొత్తంగా పచ్చదనం పర్చుకుని, ఆహ్లాద వాతావరణం పంచుతూ ఉన్నా.. మౌలిక వసతులు లేవు. దీంతో ప్రజావాణికి హాజరైన అభాగ్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్టాండ్ నుంచి దాదాపు కి.మీ. దూరం కలెక్టరేట్ ఉంది. అక్కడిదాకా ఆటోలు, ప్రైవేట్ వాహనాలు తప్ప ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. అధిక వ్యయ ప్రయాసలకోర్చి ప్రజావాణికి చేరుకున్నా తాగేందుకు చుక్కనీరు లభించని పరిస్థితి నెలకొంది. సమస్యలు పరిష్కరించండి ప్రజావాణి ద్వారా స్వీకరించే అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. ప్రజా వాణి ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభాగ్యుల నుంచి 54 ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. అడిషనల్ కలెక్టర్ లత, అధికారులు పాల్గొన్నారు. ధాన్యం తూకంలో మోసాలు.. ధాన్యం తూకంలో మోసాలు చోటుచేసుకుంటున్నాయని, కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. ప్రజావాణిలో వారు ఒక వినతిపత్రం అందజేశారు. ఒక్కో కొనుగోలు కేంద్రంలో ఒక్కో విధంగా ధాన్యం తూకం వేస్తున్నారని ఆరోపించారు. మిల్లుకు చేరాక ధాన్యంలో మళ్లీ కోత విధిస్తున్నారని వారు ఆరోపించారు. ఇలాంటి మోసాలను అరికట్టి, కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి, మోహన్రెడ్డి, కరుణాకర్రెడ్డి, జలేందర్, కంచర్ల అఖిల్, రాకేశ్, తిరుపతిరెడ్డి, రాజు పాల్గొన్నారు. రైతులను ఆదుకోండి ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు, రైస్మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని, అన్నదాతలను ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు జరుగుతున్న నష్టాలపై వారు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా నిర్వాహకులు కొనుగోలు చేయడంలేదని ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్కుమార్, మ హిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సిరాజొదీ్దన్ మన్సూర్, నాయకుడు వాకాటి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్ల మోసం
-
Telangana: రైస్ మిల్లర్లకు తీపి కబురు.. జీఎస్టీ బకాయి రద్దు..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి, హైదరాబాద్: ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ధాన్యాన్ని ప్రాసెస్ చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడాన్ని మరింతగా ప్రోత్సహిస్తామని, ఆ మేరకు చర్యలు చేపడతామని తెలిపారు. 2015 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2017 జూన్ 30వ తేదీ మధ్య ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతికి సంబంధించిన 2 శాతం సెంట్రల్ సేల్స్ టాక్స్ (సీఎస్టీ) బకాయిని రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్ర రైస్ మిల్లర్లు, రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతుందని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వ తీపి కబురుతో మిల్లర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భాల్లో గతంలో సీ– ఫారం దాఖలు చేస్తే సీఎస్టీలో 2 శాతం రాయితీని కలి్పంచే విధానం ఉండేది. ఆ విధానం ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేశారు. అనంతరం తెలంగాణ ఏర్పాడ్డాక మొదట్లో అమలు చేశారు. 2015 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2017 జూన్ 30వ తేదీ మధ్య కాలంలో రాష్ట్రం నుంచి చేసిన బియ్యం ఎగుమతులకు సీ– ఫారం సబి్మట్ చేయలేదనే కారణంతో బియ్యం ఎగుమతిదారులకు సీఎస్టీలో 2 శాతం పన్ను రాయితీ కలి్పంచడం నిలిపివేశారు. దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని కొంతకాలంగా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద వాపోతున్నారు. బియ్యం ఎగుమతి చేశామా.. లేదా? అనేది నిర్ధారణ చేసుకోవడమే సీ ఫారం ఉద్దేశమని, అది లేనంత మాత్రాన తమ హక్కును ఎలా రద్దు చేస్తారని అడుగుతున్నారు. సీ ఫారం బదులు తాము ఎగుమతులు చేసినట్లుగా నిర్ధారించుకోవడానికి ఇతర పద్ధతులను పరిశీలించాలని విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. తాము చేసిన లోడింగ్, రిలీజింగ్ సరి్టఫికెట్లు, లారీ, రైల్వే పరి్మట్లు, వే బిల్లులు తదితర ఏ ఆధారమైనా తాము సబ్మిట్ చేస్తామని, వాటిని పరిగణనలోకి తీసుకుని రెండేళ్ల కాలానికి సంబంధించిన 2 శాతం పన్ను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని సోమవారం దామరచర్లలో.. మంత్రి జగదీశ్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్, ఉపాధ్యక్షుడు కర్నాటి రమే‹Ù, సంఘం మిర్యాలగూడ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్ తదితరులు సీఎంను కలిసి వివరించారు. వారి అభ్యర్థనను పరిశీలించిన కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను ఆదేశించారు. అలాగే రైస్ మిల్లర్లకు, రాష్ట్ర రైతులకు ప్రయోజనం కలిగేలా సమాలోచన చేయాలని రైతుబంధు సమితి అధ్యక్షుడిని ఆదేశించారు. సీఎస్ ఉత్తర్వులు 2015, ఏప్రిల్ 1 నుంచి 2017, జూన్ 30 వరకు జరిగిన బియ్యం అమ్మకాల లావాదేవీలపై సీఎస్టీని ఎత్తివేస్తూ సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర రాష్ట్రాలకు అమ్మిన ధాన్యం విషయంలో సీ–ఫారంలు సమరి్పంచకపోయినా, పరి్మట్, లోడింగ్ సర్టిఫికెట్, రవాణా రశీదులు, వే బిల్లుల్లాంటి ఆధారాలను సమరి్పస్తే 2 శాతం కన్నా ఎక్కువ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి రైస్ మిల్లర్స్ కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేందర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో మిల్లింగ్ ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిõÙకం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీ– ఫారం నుంచి మినహాయింపు ఇచ్చేందుకు సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, జగదీశ్రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అభినందనీయులని పేర్కొన్నారు. చదవండి: పెళ్లి భోజనంలో మాంసం పెట్టరా? వరుడి ఫ్రెండ్స్ గొడవ.. వివాహం రద్దు.. -
తరుగు పేరుతో ఇబ్బంది పెడితే చర్యలు
వైరా: ధాన్యం తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగం గా శనివారం ఆయన వైరా మార్కె ట్ యార్డ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్యే లావుడ్యా రాము లునాయక్లతో కలసి తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ‘కుప్పలు.. తిప్పలు, ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలు పెడుతున్న మిల్లర్లు ’శీర్షికతో గురువా రం ‘సాక్షి’ప్రధాన సంచికలో ప్రచురితమై న కథనాన్ని పలువురు మంత్రి దృష్టికి తీ సుకొచ్చారు. దీంతో మంత్రి గంగుల కమలాకర్ తేమ శాతం ఎంత ఉంటే కొను గో లు చేస్తున్నారని ఆరా తీయడంతో పాటు స్వయంగా తేమ శాతాన్ని పరీక్షించారు. పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీల ద్వారా మిల్లర్ల అక్రమాలను అడ్డుకోవాల ని సూచించారు. పలువురు రైతులు కొణి జర్ల మండలంలోని ఎస్ఆర్ మిల్లు యజ మాని బస్తాకు పది కేజీలు తరుగు పేరుతో తీస్తున్నారని ఫిర్యాదు చేయగా.. వెంటనే ఆ మిల్లును సీజ్ చేయాలని కలెక్టర్ గౌత మ్ను మంత్రి ఆదేశించారు. మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరులు మంత్రి వెంట ఉన్నారు. -
ధాన్యం అన్లోడింగ్కు మిల్లర్లు ఓకే
సాక్షి, హైదరాబాద్: కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వచ్చే యాసంగి ధాన్యాన్ని దించుకునేందుకు (అన్లోడింగ్) మిల్లర్లు అంగీకరించారు. వేసవిలోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వంతో కలసి నడుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు మిల్లర్లతో రాష్ట్ర పౌరసర ఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం హైదరాబాద్ లోని పౌరసరఫరాల శాఖ భవన్లో భేటీ అయ్యారు. కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాల నుంచి పంపిన ధాన్యాన్ని అన్లోడింగ్ చేయడానికి మిల్లర్లు విముఖత చూపుతున్న అంశంపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాల ని కోరారు. అదే సమయంలో మిల్లర్లు రైతులను తరుగు, తాలు పేరుతో ధాన్యం కోతలతో వేధించడాన్ని మంత్రి తప్పుబట్టారు. మిల్లర్కు, రైతుకు మధ్య సంబంధం ఉండరాదని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాల ప్రకారమే ధాన్యాన్ని మిల్లులకు పంపుతున్నామని, అందువల్ల ఒక్క కిలో కూడా మిల్లుల్లో కోత పెట్టరాదని ఆదేశించారు. సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ యాసంగి ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చార్జీలు నిర్ణయిస్తుందన్నారు. అలాగే రైస్ మిల్లర్ల ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని గంగుల హామీ ఇచ్చారు. మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించడం బాధాకరం... ఈ భేటీలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ధాన్యం సేకరణ, మిల్లింగ్లో కీలకపాత్ర పోషిస్తున్న మిల్లర్లను దొంగలుగా చిత్రీకరించడం బాధాకరమని వాపోయారు. ఇప్పటికే నష్టాల్లో ఉండటం వల్ల యాసంగిలో ఎఫ్సీఐ కోరిన మేరకు 67 శాతం ఔటర్న్ రాదనే భయంతో ధాన్యం అన్లోడింగ్కు కొందరు మిల్లర్లు భయపడుతున్నారని మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్రెడ్డి మంత్రికి వివరించారు. రాష్ట్రంలో 2,400 మిల్లుల్లో 1,500కుపైగా బాయిల్డ్ మిల్లులున్నా యని... ఎఫ్సీఐ, కేంద్రం తీరుతో వాటిపై ఆధారపడి న లక్షలాది కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొందన్నారు. రా రైస్ మర ఆడించడం వల్ల కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ బియ్యం వచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల తమకు నష్టాలు లేకుండా చూడాలని కోరారు. భేటీలో సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్, కార్పొరేషన్ జీఎంలు, మిల్లర్లు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై సీఎస్ కమిటీ భేటీ యాసంగి ధాన్యం సేకరణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక కమిటీ శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. ఈ భేటీలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌరసరఫరాల కమిషనర్ అనిల్కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలవారీగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం కొనుగోళ్లు, ఎఫ్సీఐకి అందించాల్సిన ధాన్యంపై చర్చించారు. -
వా(వ)రి గోస ఎవరికెరుక! మిల్లర్లు కొనరాయే.. అరిగోస పడి అగ్గువకు అమ్ముడాయే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండాపోతోంది. మిల్లర్లు తమ ఇష్టానుసారంగా ధర తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆందోళనలో పడ్డారు. నాలుగు రోజుల కిందటి వరకు బాగానే ధర చెల్లించిన మిల్లర్లు ఒక్కసారిగా తగ్గించేశారు. శుక్ర, శనివారాల్లో ప్రాంతాన్ని బట్టి ఒక్కో క్వింటాల్పై రూ.300 నుంచి రూ.450 వరకు తగ్గించి కొనుగోలు చేశారు. నాలుగు రోజుల కిందటి వరకు సన్నరకం (చింట్లు) ధాన్యం క్వింటాల్కు రూ.2,200 చెల్లించగా, మిర్యాలగూడ ప్రాంతంలోని కొన్ని మిల్లుల్లో సన్నరకం ధాన్యానికి క్వింటాల్కు రూ.1,900 నుంచి రూ.1,850 చెల్లించారు. ఇక త్రిపురారంలోని ఓ మిల్లులో శనివారం క్వింటాల్కు కేవలం రూ.1,750 మాత్రమే చెల్లించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెండు, మూడు రోజులు పడిగాపులు.. నల్లగొండ జిల్లాలో ముందస్తు నాట్లు వేసిన ప్రాంతాల్లో సన్నాల కోతలు 15 రోజుల కిందటే ప్రారంభమయ్యాయి. దీంతో పది రోజులుగా రైతులు మిల్లులకు వచ్చి ధాన్యం అమ్ముతున్నారు. మొదట్లో ధాన్యం తక్కువగా రావడంతో ఎక్కువ ధర చెల్లించిన మిల్లర్లు, ఇప్పుడు ధాన్యం రాక ఎక్కువ కావడంతో ధరను తగ్గించేశారు. అంతేకాక రైతులు ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో రెండు, మూడు రోజల పాటు కొనుగోలు చేయకుండా పెండింగ్ పెడుతున్నారు. రైతులు విసిగిపోయి తక్కువ ధరకైనా అమ్ముకొని వెళ్తారనే ఉద్దేశంతోవారు వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులకు తక్కువ ధరకు అమ్ముకోక తప్పడం లేదు. కొనుగోళ్లలో జాప్యం వల్ల త్రిపురారం మండలంలోని ఒక్కో మిల్లు వద్ద 20 నుంచి 30 ట్రాక్టర్లలో రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. 25 శాతం ఉమ్మడి జిల్లా నుంచే.. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ధాన్యం దిగుబడిలో 25 శాతం వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే వస్తోంది. అత్యధింగా 250 రైస్ మిల్లులు ఉన్నది ఇక్కడే. నల్లగొండ జిల్లాలో 130, సూర్యాపేట జిల్లాలో 83, యాదాద్రి జిల్లాలో 37 మిల్లులు ఉన్నాయి. ప్రస్తుత యాసంగి సీజన్లోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సన్నాలు, దొడ్డు ధాన్యం కలిపి దాదాపు 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో సన్నాలు 2,34,752 ఎకరాల్లో సాగు చేయగా, 4,59,446 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దొడ్డు ధాన్యం 2,09,226 ఎకరాల్లో సాగు చేయగా అందులో 6,54,157 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, మొత్తం 4,43,973 ఎకరాల్లో వరి సాగు చేయగా, సన్న, దొడ్డు ధాన్యం కలిపి 11,13,604 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. సూర్యాపేట జిల్లాలో 4,61,532 ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. అందులో 3,45,081 ఎకరాలలో సన్న రకాలు, 1,16,449 ఎకరాలలో దొడ్డు రకాలను సాగు చేశారు. తద్వారా 8,28,196 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం, 3,26,058 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం వస్తుందని లెక్కలు వేశారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మిల్లర్లు మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్నరకం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.. ధర స్థిరంగా ఉండేలా చూడాలి నాకున్న 8 ఎకరాల్లో హెచ్ఎంటీ రకం సాగుచేశా. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు మిల్లుకు వెళుతున్నారు. మొదట్లో ధర బాగానే పెట్టినా ఇప్పుడు క్వింటాల్కు రూ.1,870 మాత్రమే చెల్లిస్తున్నారు. ధర స్థిరంగా ఉండేలా చూడాలి. – చల్లా ప్రదీప్కుమార్, అన్నపరెడ్డిగూడెం ధర తగ్గించారు మొన్నటి వరకు మిల్లర్లు రూ.2,200 పెట్టినా ఇప్పుడు ధర తగ్గించారు. నాకున్న 2.1 ఎకరాల్లో చింట్లు సాగు చేయగా 65 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. క్వింటాలుకు రూ.1,850 ఇస్తామంటున్నారు. – ధీరావత్ తుకారాం, ఏడుకోట్ల తండా రూ.1,750 ఇస్తున్నారు ఈసారి పంట దిగుబడి తగ్గింది. దీనికి తోడు ధర తగ్గించారు. మొదట రూ. 2,200 ఉందని సంతోష పడ్డాం. ఇప్పుడు మిల్లుకు వచ్చేసరికి క్వింటాలుకు రూ.1,750 ఇస్తున్నా రు. గత్యంతరం లేక తక్కువ ధరకు అమ్ముకుంటున్నాం. – యేమిరెడ్డి వెంకట్రెడ్డి, త్రిపురారం -
ఆశ పోయింది.. శ్వాస ఆగింది..కొనుగోలు కేంద్రంలోనే ఆగిన రైతు గుండె
హుజూరాబాద్/జమ్మికుంట: ధాన్యంరాశి వద్ద ఇరవై రోజులుగా పడిగాపులు కాసినా, కొనే నాథుడులేడనే ఆవేదనతో అన్నదాత కన్ను మూశా డు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో మంగళవారం జరిగింది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటకు చెందిన బిట్ల ఐలయ్య (59)కు 15 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అందులో పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు 20 రోజుల క్రితం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. ధాన్యం తేమగా ఉందని అధికారులు కొర్రీ పెట్టడంతో ఐలయ్య అక్కడే ధాన్యం ఆరబోసి 20 రోజులుగా పడిగాపులు కాస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళ వారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసి మళ్లీ కొనుగోలు కేంద్రానికి వచ్చాడు. ధాన్యాన్ని గన్నీ సంచుల్లో నింపుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై వడ్ల రాశిపైనే కుప్పకూలి విగతజీవిగా మారాడు. ఆయనకు భార్య లక్ష్మి, కూతురు నిత్య ఉన్నారు. కొనుగోలులో జాప్యం చేయడం వల్లే ఐలయ్య మృతి చెందాడని, మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్రావు డిమాండ్ చేశారు. వడ్లు తెచ్చి 20 రోజులైతాంది వడ్లను కేంద్రానికి తీసుకొచ్చి 20 రోజులైతాంది. తేమ ఉందని ఆరబెట్టాలని సార్లు చెప్పిన్లు. అప్పటిసంది కేంద్రంలోనే రోజూ ధాన్యం ఎండబెడుతున్నం. ఈ రోజు నా భర్త భోజనం చేసి, వడ్లను బస్తాలలో నింపేందుకు పోయిండు. కొద్దిసేపటికే చనిపోయిండని చెప్పిన్లు. నాకు దిక్కెవరు. ప్రభుత్వం ఆదుకోవాలె. – లక్ష్మి, మృతుడి భార్య టోకెన్ ఇచ్చాం ఐలయ్య వారం క్రితం కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాడు. ఆరబెట్టిన తర్వాత ఈ టోకెన్ జారీ చేశాం. ఈరోజు గన్నీ తీసుకొని నింపుతుండగా అస్వస్థతకు గురై గుండెపోటుతో చనిపోయాడని తెలిసింది. – తిరుపతి, పీఏసీఎస్ సెంటర్ ఇన్చార్జి ఐలయ్యది ఆకస్మిక మరణం: అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ఐలయ్య ధాన్యాన్ని గన్నీ సంచుల్లో నింపే సమయంలో గుండెపోటుతో మృతి చెందారని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 4న 10–10 రకానికి చెందిన దాదాపు 50 బస్తాల ధాన్యాన్ని తీసుకురాగా, 6న టోకెన్ జారీచేశామని పేర్కొన్నారు. ఐలయ్య మృతిపై జిల్లా సహకార అధికారి కార్యాలయం సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రసూనతో విచారణ జరిపించినట్లు పేర్కొన్నారు. -
తరుగని..దగా!..తాలు, నల్లబడ్డ ధాన్యం పేరుతో మిల్లర్ల తరుగు
ఈ రైతు పేరు డప్పురి భుజంగం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ గ్రామం. రెండెకరాల 30 గుంటల్లో వరివేయగా.. 70 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. పుల్కల్ కొనుగోలు కేంద్రానికి తెచ్చి తూకం వేయించాడు. బస్తాకు 40కిలోల ధాన్యానికి బదులు 42 కిలోల చొప్పున తూకం వేశారు. నిబంధనల ప్రకారం 17% తేమ ఉన్నా పర్వాలేదు. అలాంటిది అంతకన్నా తక్కువగా 15 శాతమే తేమ ఉన్నా తరుగు తీశారు. దీనితో మూడు క్వింటాళ్ల ధాన్యాన్ని నష్టపోయాడు. ..ఒక్క భుజంగమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వరి పండించిన రైతులందరిదీ ఇదే సమస్య. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెస్తే.. రోజుల తరబడి ఎదురుచూపులు. ఎలాగోలా తూకం పూర్తయి మిల్లర్లకు పంపితే.. తాలు, తరుగు పేరిట కోతలు. మిల్లర్లను ఎంత బతిమాలినా.. ఏమాత్రం కనికరం లేకుండా బస్తాకు రెండు కిలోల నుంచి నాలుగు కిలోలదాకా తరుగు తీస్తుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరి రైతు అరిగోస పడుతున్నాడు. నానా తంటాలు పడి ధాన్యం అమ్ముకుంటున్నా.. అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్ల దోపిడీతో నిండా మునుగుతున్నాడు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసినా.. మిల్లర్లు బస్తాకు రెండు కిలోల నుంచి నాలుగు కిలోలదాకా తరుగు తీస్తుండటంతో నష్టపోతున్నాడు. రైతులు ఇదేమిటని అడిగితే మిల్లర్లు ధాన్యాన్ని తిప్పిపంపేస్తూ ఇబ్బందులపాలు చేస్తున్నారు. రైస్మిల్లులు అధికంగా ఉన్న పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, జనగామ, వరంగల్తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మిల్లర్లు అడ్డగోలుగా తరుగు తీస్తుండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. కొనుగోలు కేంద్రం నుంచే మొదలు.. కొనుగోలు కేంద్రాల్లో ఒక్కో బస్తాలో 40కిలోల ధాన్యాన్ని నింపుతారు. ధాన్యంలో తేమ 17శాతం, అంతకన్నా తక్కువ ఉంటేనే తూకం వేస్తారు. అయితే కొనుగోలు కేంద్రాల్లోని హమాలీలు, నిర్వాహకులు తరుగు, ఇతర వేస్టేజీ పేరుతో సాధారణంగానే ఒక కిలోదాకా ఎక్కువ ధాన్యం వేసి.. 41 కిలోలతో బస్తాను నింపుతున్నారు. కానీ 40 కిలోల లెక్కనే నమోదు చేస్తున్నారు. ధాన్యం మొత్తం ఎన్ని బస్తాలు, మద్దతు ధర ప్రకారం అదే సొమ్ము ఎంత అన్న వివరాలను ఒక చీటీ మీద రాసి రైతులకు ఇస్తున్నారు. నిజానికి ఇక్కడితో రైతుల బాధ్యత పూర్తయినట్టే. తర్వాత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆ ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ అధికారులు సూచించిన మిల్లులకు పంపుతారు. మిల్లుకు చేరగానే కొర్రీలు.. మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని తీసుకుని.. తమకు అందినట్టుగా నమోదు చేయాలి. కానీ ఇక్కడే కొర్రీలు మొదలవుతున్నాయి. ధాన్యంలో తాలు, తేమ ఎక్కువగా ఉన్నాయని, నల్లటి ధాన్యం ఉందని సాకులు చెప్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు ఫోన్ చేసి.. ‘‘మిల్లు వాళ్లు వడ్లు తీసుకోరట. తరుగు ఉంది. వడ్లు నల్లబడ్డాయి. ఒకవేళ తీసుకోవాలంటే.. బస్తాకు కనీసం 2 నుంచి 4 కిలోల తరుగు తీయాల్సి ఉంటుంది. మీరు సరేనంటే మిల్లు వాళ్లు తీసుకుంటారట. లేకుంటే తిప్పి పంపేస్తామంటున్నారు..’’ అని చెప్తున్నారు. రైతులు చేసేదేమీ లేక తరుగుకు ఒప్పుకుంటున్నారు. 40 కిలోల బస్తాకు 2 కిలోల నుంచి 4 కిలోల వరకు అంటే.. క్వింటాల్కు 5 నుంచి 10 కిలోల ధాన్యాన్ని వదులుకోవాల్సి వస్తోంది. జాప్యం ఇందుకే.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యంతోపాటు మిల్లర్ల జోక్యం మితిమీరడం వల్లే వానాకాలం పంట కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు వాపోతున్నారు. రోజుకు లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి మరోలా ఉంది. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు మొదలై నెలా 15 రోజులు దాటినా.. ఇప్పటివరకు లక్ష్యంలో 33 శాతమే కొనుగోళ్లు పూర్తయ్యాయి. మొత్తంగా కోటి టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 34.26 లక్షల టన్నులే పూర్తయింది. ఈ నెలాఖరు వరకు కూడా కొనుగోళ్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అంతా కుమ్మక్కై! కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లుల యజమానులు కుమ్మ ౖక్కై రైతులను దోచుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చాలా చోట్ల మిల్లర్లు చెప్పినట్టుగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని.. వారు చెప్పినట్టు ధాన్యం సేకరణ సాగుతోందని రైతులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా పౌర సరఫరాల సంస్థ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 453 కేంద్రాలు తెరవగా కొనుగోళ్లు దాదాపుగా పూర్తయి 427 కేంద్రాలను మూసేశారు. అదే సమయంలో భూపాలపల్లి, కొత్తగూడెం, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఇంకా కొనుగోళ్లు మొదలేకాలేదు. బస్తాకు 2 కిలోలు కట్ చేశారు మా పొలంలో పండించిన వడ్లను ఊరిలోని ఐకేపీ సెంటర్లో అమ్మిన. కానీ జనగామలోని రైస్మిల్లు వాళ్లు వడ్లలో తాలు ఉందంటూ రెండు రోజులు లారీ నుంచి వడ్లు దించుకోలేదు. తర్వాత బక్కో బస్తాకు 2 కిలోల లెక్కన తరుగు కింద కట్ చేశారు. నా 600 బస్తాలకు 12 క్వింటాళ్లు తరుగు చూపించారు. అంటే రూ. 24 వేలు నష్టపొయిన. – కొల్ల నర్సిరెడ్డి, రైతు,బండనాగారం, జనగామ జిల్లా తాలు, తప్ప లేకుండా తేవాలి వడ్లలో తాలు, రాళ్లు లేకుండా శుభ్రం చేసి ధాన్యం తేవాలి. కొందరు కొనుగోలు కేంద్రంలో ఉన్న నిర్వాహకులను మేనేజ్ చేసుకుని, ధాన్యం కాంటా వేయిస్తున్నారు. దానిని రైస్ మిల్లులకు పంపుతున్నారు. తాలు లేకుండా తెస్తే ఎలాంటి కటింగ్ ఉండదు. మేం కూడా రైతులమే.. –మినుపాల ప్రకాశ్రావు, రైస్ మిల్లు యాజమాని, సుల్తానాబాద్ తరుగు తీస్తే కఠిన చర్యలు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చేంత వరకే రైతుల బాధ్యత. కొనుగోలు కేంద్రం నుంచి రైస్మిల్లులకు పంపించాల్సింది కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే. ధాన్యం ఒక్కసారి రైస్మిల్లుకు చేరాక.. రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. రైస్మిల్లర్లు ధాన్యంలో కోతపెట్టడం, తాలు, తరుగు తీయడం అనేది నిబంధనలకు విరుద్ధం. మిల్లర్లు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం. – గంగుల కమలాకర్,పౌరసరఫరాల శాఖ మంత్రి -
నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో మిల్లింగ్ బంద్
సాక్షి, కరీంనగర్: భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) కొర్రీలపై రైస్ మిల్లర్లు తిరుగుబావుటా ఎగురవేశారు. సీఎంఆర్ నాణ్యత విషయంలో పెడుతున్న కొర్రీలపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న మిల్లర్లు కఠిన నిబంధనలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వానాకాలం సన్నరకం ధాన్యం ప్రభుత్వం కేటాయించనుండడం, సీఎంఆర్ తగ్గే అవకాశం ఉండడం, ఎఫ్సీఐ నిబంధనలతో కోట్లల్లో నష్టం వస్తుండడంతో ధాన్యం మిల్లింగ్ సోమవారం నుంచి నిలిపివేయాలని నిర్ణయించారు. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉన్న బియ్యంపై ఆ సంస్థ పెడుతున్న ఆంక్షలు మిల్లర్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ విషయమై అధికారులకు పలుమార్లు చేసిన విజ్ఞప్తులు ఫలించకపోవడంతో సీఎంఆర్ నిలిపివేతవైపే మిల్లర్లు మొగ్గు చూపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి మిల్లింగ్ నిలిపివేయాలని నిర్ణయించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన ప్రస్తుత పరిస్థితిలో మిల్లింగ్ నిలిపివేస్తే కొనుగోళ్లపై ప్రభావం చూపనుంది. మిల్లర్లపై ఒత్తిళ్లు.. ప్రతీ సీజన్లో ధాన్యం తీసుకునే విషయంలో మిల్లర్లపై పౌరసరఫరాలశాఖ ఒత్తిళ్లు సాధారణంగా మారాయి. పంట కోతల సమయంలో వర్షం, తెగుళ్లు ఇతర సమస్యలతో ధాన్యం నాణ్యత తగ్గిపోతోంది. రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం కొనుగోళ్లలో సడలింపులు ఇస్తోంది. ఇవే సడలింపులతో గత వానాకాలంలో తెగుళ్లు సోకిన ధాన్యం కొనుగోలు చేసి, తమకు కట్టబెట్టడాన్ని మిల్లర్లు వ్యతిరేకించారు. అనంతరం దిగుమతి చేసుకున్నారు. సదరు ధాన్యం మరాడించగా.. వచ్చిన బియ్యాన్ని తీసుకోవడానికి ఎఫ్సీఐ ఇబ్బంది పెడుతోందని మిల్లర్లు పేర్కొంటున్నారు. దీంతో రెండునెలల క్రితం నాణ్యతతో కూడిన బియ్యం ఉత్పత్తిపై జిల్లా అధికారులు ఎఫ్సీఐ నాణ్యత నియంత్రణ అధికారులతో మిల్లర్లకు అవగాహన కల్పించారు. చివరికి బియ్యాన్ని తీసుకోవడానికి ఎఫ్సీఐ నిరాకరించడంతో ప్రభుత్వమే దిగి వచ్చి, పొడి బియ్యం బదులు బాయిల్డ్ బియ్యం తీసుకునే వెసులుబాటు కల్పించింది. తాజాగా యాసంగికి సంబంధించి సీఎంఆర్ బియ్యం తీసుకోవడానికి కూడా ఎఫ్సీఐ కొర్రీలు పెడుతోంది. ఈ క్రమంలో బియ్యంతోపాటు ప్యాకింగ్ చేసే సంచుల నాణ్యత కూడా సమస్యగా మారడంతో మిల్లర్లు సమ్మెకు దిగుతున్నారు. సన్నధాన్యం సేకరణపై ప్రభావం నియంత్రిత సాగుపై ప్రభుత్వ ప్రచారంతో ఈ సీజన్లో 60 నుంచి 70శాతం మంది రైతులు సన్నరకం ధాన్యం సాగుచేశారు. దీంతో సన్నాల దిగుబడి ఈ సారి ఇబ్బడిముబ్బడిగా వచ్చే అవకాశముంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 18,78,958 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. సన్నధాన్యం సాధారణ రకం కిందకు రావడం, ఈ సీజన్లో పొడి బియ్యం సీఎంఆర్గా ఇవ్వాల్సి ఉండడం, తదితర కారణాలతో మిల్లర్లు ఎఫ్సీఐ తీరుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని నిర్ణయించారు. ధాన్యాన్ని పొడి బియ్యంగా ఇవ్వాల్సి ఉండటం, ప్రభుత్వానికి పొడి బియ్యమే ఎక్కువగా అవసరం కావడంతో మిల్లర్లు సీజన్కు ముందే ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. సమస్యలు పరిష్కరిస్తేనే మిల్లింగ్.. చిన్నచిన్న సాకులతో సీఎంఆర్ సేకరణకు ఎఫ్సీఐ కొర్రీలు పెడుతోంది. గోదాములకు పంపిన బియ్యాన్ని తిప్పి పంపుతోంది. తిరిగి పాలిష్ చేసి పంపడానికి ఒక లారీకి అదనంగా రూ.7 వేల భారం పడుతోంది. ఈ సారి సన్న వడ్ల లెవీ తక్కువ వస్తుంది. నిబంధనల ప్రకారం సీఎంఆర్ ఇవ్వడం మిల్లర్లకు కష్టమే. రైస్ మిల్లర్లకు కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. న్యాయం చేయాలని మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్ను కలిసి వినతిపత్రాలు అందించాం. సమస్య పరిష్కారానికి సోమవారం నుంచి మిల్లింగ్ నిలిపివేస్తున్నాం. – నగునూరి అశోక్కుమార్, రైస్ఇండస్ట్రీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి -
పేదల బియ్యంలో అవినీతి పురుగులు
జిల్లాలో రైస్ మిల్లర్ల అక్రమాలు.. పరాకాష్ట స్థాయికి చేరాయి. ఓ వైపు ధాన్యం కొనుగోలులో ధరలు, తరుగుల పేరుతో రైతుల కడుపులు కొడుతున్న మిల్లర్లు.. మరో వైపు పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యాన్ని అడ్డదారుల్లో కొనుగోలు చేసి సీఎంఆర్ పేరుతో ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారు. రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి రూ.కోట్లు గడిస్తున్నారు. సీఎంఆర్ కోసం ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యాన్ని ఆడించి నాణ్యమైన బియ్యంగా దర్జాగా మార్కెట్లో విక్రయించి మరో రకంగానూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. సాక్షి, నెల్లూరు: సివిల్ సప్లయిస్, ఎఫ్సీఐ అవినీతిని ఆసరాగా చేసుకుని జిల్లాలో రైస్ మిల్లర్లు నిరుపేదల కడుపులు కొడుతున్నారు. ప్రభుత్వాన్ని ఓ వైపు మోసం చేస్తూ, మరో వైపు రైతులను దోచుకుంటూ, సీఎంఆర్కు ఇచ్చిన ధాన్యాన్ని నాణ్యమైన బియ్యంగా మార్చుకుని రూ.కోట్లకు పడగలు ఎత్తుతున్నారు. జిల్లాలో నెలకు 1.9 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం కార్డుదారులకు సరఫరా చేయాల్సి ఉంది. మార్చిలో కరోనా తర్వాత కేంద్రం కూడా బియ్యం ఉచితంగా అందిస్తోంది. నెలకు రెండు దఫాలు సరఫరా చేస్తున్నాయి. అంటే దాదాపు 2.18 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ అవుతున్నాయి. సాధారణంగా రేషన్ బియ్యం తక్కువ శాతం వినియోగం ఉంది. దీంతో మిల్లర్లు దళారుల ద్వారా తక్కువ ధరకే కొనుగోలు చేసి తిరిగి సీఎంఆర్కు సరఫరా చేస్తున్నారు. ♦పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత ఆహార సంస్థ, పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా కేజీ బియ్యం రూపాయికే సరఫరా చేస్తున్నాయి. ♦పేదలకు ఇచ్చిన రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లర్లు పలు మార్గాల్లో సేకరించి తిరిగి మిల్లులకు చేర్చి పాలిష్ చేసి సీఎంఆర్గా మళ్లీ పౌరసరఫరాల కార్పొరేషన్కు, భారత ఆహార సంస్థకు సరఫరా చేస్తున్నారు. ♦ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ♦జిల్లాలో ఎక్కువగా నెల్లూరు, కోవూరు, కావలి నియోజకవర్గాల పరిధిలో ఉన్న రైస్ మిల్లర్లు దీన్నే వ్యాపారంగా మార్చుకొని రూ.కోట్లు గడిస్తున్నారు. ♦కొంత మంది మిల్లర్లు కనీసం పాలిష్ కూడా చేయకుండానే సంచులు మార్చి మళ్లీ పౌర సరఫరాల సంస్థకు అప్పగిస్తున్నట్లు సౌత్రాజుపాళెం మిల్లులో వెలుగు చూసిన వాస్తవాలే బట్టబయలు చేస్తున్నాయి. ఒక కన్సైన్మెంట్కు రూ.5 లక్షలు ఆదాయం పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఆడించి బియ్యం సరఫరా చేసేందుకు ట్రేడింగ్ మిల్లులకు అధికారులు అప్పగిస్తున్నారు. ఇలా సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)గా మిల్లర్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం ఇచ్చే మిల్లింగ్ చార్జీల ద్వారా ఒక కన్సైన్మెంట్ (220 క్వింటాళ్లు)కు నికరంగా రూ.15 వేలు ఆదాయం ఉంటుంది. కానీ నాణ్యమైన బియ్యం బదులుగా రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ ద్వారా సరఫరా చేస్తే దాదాపు రూ.5 లక్షల వరకు మిగులుతోంది. ♦జిల్లాలో ట్రేడింగ్ కేటగిరీలో 146 రైస్ మిల్లులు ఉన్నాయి. అందులో సీఎంఆర్ పెండింగ్తో 6ఏ కేసులు నమోదైన మిల్లులు మినహాయించి 135 మిల్లులకు ప్రభుత్వం సీఎంఆర్ ధాన్యం సరఫరా చేస్తోంది. ♦ఇందులో దాదాపు అత్యధిక మిల్లులు ప్రభుత్వ సరఫరా చేసిన ధాన్యాన్ని ఆడించి నాణ్యమైన బియ్యంగా బయట మార్కెట్లో అమ్ముకుంటున్నాయి. ♦ఎఫ్సీఐ, పౌరసరఫరాల కార్పొరేషన్కు ఇవ్వాల్సిన సీఎంఆర్కు రేషన్ బియ్యాన్ని సేకరించి పాలిష్ పట్టి సరఫరా చేస్తున్నారు. ♦ఇటువంటి బియ్యాన్ని టెస్టింగ్ ద్వారా గుర్తించి వాటిని నిరాకరించాలి్సన ఎఫ్సీఐ, పౌరసరఫరాల కార్పొరేషన్ అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై దిగుమతి చేసుకుంటున్నారు. ♦రేషన్ బియ్యం కిలో రూ.10లకు కొనుగోలు చేసి పాలిష్ పట్టించి, తిరిగి సీఎంఆర్గా రూ.27.60లకు విక్రయిస్తున్నారు. ♦ఒక్కో రైస్మిల్లు ఏడాదికి వందకు పైగా కన్సైన్మెంట్లు సరఫరా చేస్తే దాదాపు రూ.5 కోట్లు మిగులుతున్నట్లు అంచనా. ♦ఇలా రేషన్ బియ్యం సీఎంఆర్గా రీసైక్లింగ్ జరుగుతుండడంతో ధాన్యం డిమాండ్ తగ్గిపోతోంది. దీంతో మిల్లర్లు రైతులను అడ్డుగోలు ధరలకు దోచుకుంటున్నారు. విజిలెన్స్ దాడుల్లో.. జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో వేలాది టన్నుల రేషన్ బియ్యం పట్టుబడడం సర్వసాధారంగా మారింది. ఇటీవల మర్రిపాడులో రేషన్ డీలర్ ఇంటి నుంచి దళారులు రేషన్ బియ్యం సేకరించి వాహనంలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ♦కృష్ణపట్నం పోర్టులో విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తే ఇతర దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న పేదల బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ♦కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురంలోని రైస్మిల్లులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీల్లో 20 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం 17.5 టన్నుల నూకలు ఉన్నట్లు గుర్తించారు. ♦నెల్లూరు రూరల్ మండలంలోని అల్లీపురం ప్రాంతంలో 20 టన్నుల రేషన్ బియ్యం తరలిస్తుండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. నెల్లూరురూరల్ మండలం సౌత్రాజుపాళెంలోని లక్ష్మీనరసింహ లారీ పార్కింగ్ యార్డులో అక్రమంగా నిల్వ చేసిన నిరుపేదలకు పంచాల్సిన చౌక బియ్యం 77 టన్నులు పట్టుబడ్డాయి. సీఎంఆర్ లేబుల్తో ప్యాక్ చేసిన 263 బస్తాలతో పాటు 1,280 బస్తాల చౌక బియ్యం స్టాక్ చేసినట్లు పక్కా సమాచారంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.28 లక్షల పైమాటే. ఇటీవల వెంకటేశ్వరపురం ఎఫ్సీఐ గోదాముల్లో భారీస్థాయిలో రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సీఎమ్మార్కు ఇస్తున్నట్లు అధికారులు నిగ్గు తేల్చారు. -
40 కేజీల బస్తాకు 5 కేజీల తరుగా..?
సాక్షి, సత్తుపల్లి: రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. అయితే రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని లారీల్లో వరంగల్లోని మిల్లర్ల వద్దకు తీసుకెళ్లారు. కాని రెండు రోజులుగా మిల్లర్లు కొర్రీలు పెడుతూ దిగుమతి చేసుకోవడం లేదు. 40 కేజీల బస్తాకు మూడు నుంచి ఐదు కేజీల ధాన్యం తరుగు తీసేసి దింపుకుంటామని, లేకుంటే వెనక్కి తీసుకెళ్లాలంటున్నారు. దీంతో సత్తుపల్లి మండలం కాకర్లపల్లి సొసైటీ పరిధిలోని బుగ్గపాడు, కాకర్లపల్లి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుమతి చేసుకోకుండా లారీలను వెనక్కి పంపిస్తే ఒక్కో లారీ కిరాయికి రూ.40వేల వరకు నష్టం వస్తుందని, ఆ నష్ణాన్ని రైతులే భరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచక రైతులు ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజాప్రతినిధులు కల్పించుకొని న్యాయం చేయాలని కోరారు. దీనిపై కాకర్లపల్లి సొసైటీ చైర్మన్ తుమ్మూరి శ్రీరాంప్రసాద్ మాట్లాడారు. ఈ సమస్యను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని.. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరామన్నారు. -
అన్నపూర్ణ.. మన తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: వరి దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రైస్బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతోందని, ఈ క్రమంలో ‘రాష్ట్ర సమగ్ర ధాన్యం, బియ్యం విధానం’ రూపొందించనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వెల్లడించారు. రైస్ మిల్లర్లతో పాటు ఇతర భాగస్వా ములందరితో చర్చించి, విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. రైస్ మిల్లర్లకు అండగా ఉండి, వారిని రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను చేస్తామని ప్రకటించారు. విధానం ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చిస్తామని, అసెంబ్లీలోనూ చర్చించి, ఆమోదిస్తామని వివరించారు. రాష్ట్రంలో వరిపంట సాగు, ధాన్యం దిగుబడులు, బియ్యం తయారీ– అమ్మకం– ఎగుమతులు, దీనికి అవలంబించాల్సిన విధానం తదితర అంశాలపై ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పుడున్న పద్ధతిని మార్చాల్సిందే.. ‘సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితికి, ఇప్పటికి చాలా తేడా వచ్చింది. కాళేశ్వరం సహా ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణం, ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పూర్తి, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ వంటి వాటితో రైతులకు సాగునీరు పుష్కలంగా అందుతోంది. దీంతో రాష్ట్రంలో వరిసాగు పెరుగుతోంది. ఈసారి యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నది. కోటి టన్నులకుపైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. వానాకాలంలో 55 నుంచి 60 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉంది. ఒక్క కాళేశ్వరం ద్వారానే 35 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగులోకి రానుంది. ప్రపంచమంతా కరువు వచ్చినా తెలంగాణలో రాదు. వచ్చే ఏడాది కనీసం 70 లక్షల ఎకరాల్లో వరిసాగవుతుంది. మనం ఏటా కనీసం 2.25 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నం. రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతున్నది. ఈ పరిస్థితుల్లో ఇంత పెద్దఎత్తున పండిన ధాన్యాన్ని సేకరించి, మిల్లుకు పంపి బియ్యం తయారుచేసి, వాటిని అమ్మడం చాలా పెద్ద పని. దీనికోసం ఇప్పుడున్న పద్ధతి పనికి రాదు. ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా పండిన ధాన్యం బియ్యంగా మారి అమ్మకం జరిగే వరకు అన్ని సజావుగా సాగాలంటే సమగ్ర ధాన్యం మరియు బియ్యం విధానం అమలు చేయాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రగతిలో రైస్మిల్లులను భాగస్వాముల్ని చేస్తాం ‘రాష్ట్రవ్యాప్తంగా 2,200 రైస్ మిల్లులున్నాయి. ఇవి ఏడాదికి కోటి టన్నుల బియ్యం తయారు చేయగలవు. గతంలో వీటికి సరిపడా ధాన్యం కూడా రాకపోయేది. కరెంటు ఉండకపోయేది. ఫలితంగా 20–30 లక్షల టన్నుల బియ్యం తయారుచేయడం కష్టంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ధాన్యం పుష్కలంగా ఉంది. 24 గంటల నిరంతరాయ కరెంటు ఉంది. దీన్ని అవకాశంగా మార్చుకుని రైసు మిల్లులు ఎక్కువ మొత్తంలో వడ్లు పట్టాలి. రాష్ట్ర ప్రజల అవసరాలు తీరడమే కాకుండా, ఎఫ్సీఐకి పంపించడానికి, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి అనువుగా మిల్లులు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలి. ఇంకా మరికొన్ని మిల్లులు రావాలి. రైసుమిల్లులు బాగా నడవడానికి, అవి లాభాల్లో ఉండటానికి ప్రభుత్వపరంగా చేయాల్సిన సాయం చేస్తాం. రైసుమిల్లులు రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలి’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గంప నాగేందర్, మోహన్రెడ్డి, నాయకులు చంద్రపాల్, బొచ్చు భాస్కర్, ప్రభాకర్రావు, తోట సంపత్కుమార్, కాంతయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. సీఎం మాటల్లో మరికొన్ని ముఖ్యాంశాలు ► రైసు మిల్లర్లకు ఇకపై అధికారుల నుంచి వేధింపులుండవు. అనేక అనుమతులు తీసు కోవాల్సిన పనిలేకుండా మార్పులు తెస్తం. ► ప్రస్తుతం కరోనా ప్రభావంతో రైసుమిల్లుల్లో పనిచేసే హమాలీలు సొంత రాష్ట్రమైన బిహార్ వెళ్లారు. మళ్లీ సీజన్ వచ్చింది కాబట్టి, ప్రత్యేక బస్సుల్లో వారిని తిరిగి రప్పించేం దుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది. ► రైస్ మిల్లర్లకు సరైన మార్కెటింగ్ వ్యూహం ఉండాలి. తెలంగాణ ప్రజలు ఏ రకం బియ్యం తింటారు? ఇతర రాష్ట్రాల వారు ఏ రకం బియ్యం తింటారు? అనేది సరిగ్గా అంచనా వేసి, అందుకనుగుణంగా ధాన్యం రకాలను పండించాలి. వాటిని ఎప్పటికప్పుడు బియ్యంగా మార్చి ఇటు రాష్ట్ర ప్రజలకు, అటు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు పంపించాలి. ► రాష్ట్రంలో రైసుమిల్లుల స్థాపనకు పారిశ్రామికవాడల్లో స్థలం కేటాయించే అవకాశాలను పరిశీలిస్తాం. రైసు మిల్లులను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్గా గుర్తించి, అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తాం. ► రాష్ట్రంలో గోదాముల సంఖ్యను పెంచాలి. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడక ముందు 4 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములే ఉండేవి. ప్రస్తుతం 22 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యానికి గోదాముల సంఖ్యను పెంచాం. దీన్ని 40 లక్షలకు పెంచాలి. ► రైసుమిల్లుల్లో గోదాములు నిర్మించుకోవడానికి ప్రభుత్వపరంగా సహకారం అందిస్తాం. ► రాష్ట్రంలో రైసుమిల్లులు ఎక్కువున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ రైల్వే సైడింగ్స్ ఏర్పాటు చేయాలి. ► రైస్మిల్లుల ఎల్టీ కేటగిరీని 70 హెచ్పీల సామర్థ్యం నుంచి 150 హెచ్పీల సామర్థ్యానికి పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నాం. -
మిల్లర్ల చిల్లర వేషాలు
జిల్లాలో రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోళ్ల విషయంలో దొంగాట ఆడుతున్నారు. ఓ వైపు వరికోతలు ఊపందుకున్నాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో జిల్లా ఉన్నతాధికారులు అన్నదాతలకు నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నా.. కొందరు మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వడంలో జాప్యం చేస్తూ ప్రభుత్వానికి సహకరించడం లేదు. మరో వైపు దళారులను రంగంలోకి దింపి కల్లాల్లోనే ప్రభుత్వ మద్దతు ధరకంటే భారీగా తగ్గించి కొనుగోళ్లు చేయిస్తూ అన్నదాతల కష్టాన్ని దోచుకుంటున్నారు. కొంత మంది మిల్లర్లు అరకొర మొత్తానికే బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. బయట మాత్రం రూ.కోట్ల పెట్టుబడులు పెట్టి దళారులతో ధాన్యం కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మిల్లర్ల తీరుపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. సాక్షి, నెల్లూరు: ఆరుగాలం కష్టపడి పంట పండించే అన్నదాతలకు వెన్నుదన్నుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేకనేక చర్యలు చేపడుతోంది. పంట సాగుకు ముందే పెట్టుబడి సాయం అందించి ఆదుకున్న ప్రభుత్వం.. పంటల దిగుబడులకు ముందే మద్దతు ధర ప్రకటించి అధికార యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలోకి పంపించి రైతులకు మేలు చేకూర్చే విధంగా చర్యలు చేపడుతోంది. జిల్లా ఉన్నతాధికారులు సైతం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, అవసరమైన చర్యలు చేపడుతున్నారు. అయితే ధాన్యం కేటాయించేందుకు మిల్లర్లు ప్రభుత్వానికి బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వకుండా, సహకరించకుండా చిల్లర వేషాలు వేస్తున్నారు. మరో వైపు దిగుబడులు వచ్చిన ధాన్యాన్ని రైతులు కల్లాల్లో నిల్వ చేయలేని పరిస్థితులను ఆసరాగా చేసుకుని దళారులను రంగంలోకి దించి దారుణంగా ధరలు తగ్గించి కొనుగోలు చేయిస్తున్నారు. గత టీడీపీ హయాంలో సీఎంఆర్ బియ్యం సరఫరాలో భారీ అవినీతికి పాల్పడి ఆ పార్టీ పెద్దల సహకారంతో కేసులతో మమ అనిపించుకుని దర్జాగా ఉన్న మిల్లర్లు.. తాజాగా దొంగాట ఆడుతూ అధికారులకు చుక్కలు చూపెడుతున్నారు. రైతులను దోచుకుంటున్నారు. జిల్లాలో ఈ ఏటా సుమారు 6 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతుంది. ప్రస్తుతం ఎకరాకు 3.5 నుంచి 4 పుట్ల ధాన్యం దిగుబడి వస్తుంది. ఈ ఏడాది ప్రకృతి అనుకూలించడంతో పాటు సాగునీరు పుష్కలంగా ఉండడంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. ఈ ఏడాది జిల్లా అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నదాతకు అండగా నిలిచేందుకు ప్రయత్నాలు మమ్మురం చేశారు. జిల్లా వ్యాప్తంగా 189 కేంద్రాలు గాను 90 కేంద్రాలు అందుబాటులోకి తెచ్చారు. దళారులతో దోపిడీ మిల్లర్లు ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోళ్లు కేంద్రాలకు బ్యాంక్ గ్యారెంటీల విషయంలో కావాలనే జాప్యం చేస్తూ మరో వైపు దళారుల ద్వారా కల్లాల్లోనే కొనుగోళ్లు చేయిస్తున్నారు. ధాన్యం దిగుబడులు ప్రారంభం కావడంతో బ్యాంక్ గ్యారెంటీలు లేని కారణంగా కొనుగోలు కేంద్రాలకు పంటను విక్రయించలేని పరిస్థితి ఏర్పడింది. కేంద్రాల నుంచి కూడా మిల్లులకు ధాన్యం కేటాయించలేపోతున్నారు. కల్లాల్లో ధాన్యం ఆరబెట్టుకోలేక.. నిల్వ చేయలేక ఇబ్బంది పడుతున్న రైతులు గత్యంతరం లేక దళారులకే విక్రయాలు చేసుకుంటున్నారు. పరిస్థితులను అనుకూలంగా చేసుకుని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అమాంతంగా తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రభుత్వం వరి సాధారణ రకం క్వింటాకు రూ.1,815 వంతున పుట్టికి (850 కేజీలు) రూ.15427.50, ఏ గ్రేడ్ రకం పుట్టికి రూ.15597.50 మద్దతు ధర నిర్ణయించింది. కానీ దళారులు మాత్రం పుట్టి ధాన్యం రూ.11,500 నుంచి రూ.12,000 వంతున కొనుగోళ్లు చేస్తున్నారు. ఇటీవల వారం రోజుల వ్యవధిలో పుట్టి ధాన్యానికి రెండు వేల తగ్గించారు. మద్దతు ధరకంటే రూ.4 వేలు తక్కువతో కొనుగోలు చేసూ్తనే.. తేమ పేరుతో ప్రతి బస్తాకు నాలుగు కేజీల వంతున తరుగు తీసుకుంటూ రైతుల శ్రమను దోచుకుంటున్నారు. రూ.24 కోట్లకే బ్యాంక్ గ్యారెంటీలు గత నెల రోజులు నుంచి జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, జాయింట్ కలెక్టర్ వినోద్కుమార్ సారథ్యంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 189 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించి మిల్లర్లను బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వాలని పలుమార్లు ఆదేశాలు జారీ చేసినా వారు సక్రమంగా స్పందించడం లేదు. నెల రోజులు నుంచి ఉన్నతాధికారులు ఆదేశాలను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏఓ కుంటిసాకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 65 మంది మిల్లర్లు కేవలం రూ.24 కోట్ల మేరకే బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వడం గమనార్హం. టీడీపీ హయాంలో దోపిడీ టీడీపీ హయాంలో మిల్లర్లు, అధికారులు, ఆ పార్టీ పెద్దలు కుమ్మక్కై సీఎంఆర్ బియ్యం సరఫరా విషయంలో భారీగా అవినీతి పాల్పడ్డారు. 2015–16 ఏడాదిలో కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం 3.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కోనుగోలు చేశారు. మిల్లర్లకు సీఎంఆర్ రైస్ పద్ధతిలో ఇవ్వాలని కోరారు. ఈ మేరకు అంటే 67 శాతం బియ్యం అంటే 2.16 లక్షల టన్నుల మెట్రిక్ బియ్యానికి గాను 1.97 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అప్పగించారు. ఇంకా 18,905 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయి ఉంది. దీని విలువ రూ.36 కోట్లు ఉంది. అప్పటి నుంచి మిల్లర్లు బియ్యం ఇవ్వకపోవడంతో వారికి జరిమానాలతో 2017 నాటికి బకాయిలు రూ.56 కోట్లకు చేరింది. మొత్తం దాదాపు 37 మంది మిల్లర్లు అక్రమాలకు పాల్పడినట్లు లెక్క తేలింది. అప్పటి ప్రభుత్వ పెద్దలు మిల్లర్లకు అండగా నిలవడంతో నామమాత్రపు కేసులతో సరిపెట్టారు. ఆపై ఏకంగా పౌరసరఫరాల సంస్థ కార్యాలయానికి అగ్నిప్రమాదం జరిపించి రికార్డులు కాలిపోయేలా చేశారు. ఈ ప్రమాదం వెనుక మిల్లర్ల హస్తం ఉందన్న విషయం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. కానీ మిల్లర్లపై ఎలాంటి చర్యలు లేకుండా ప్రభుత్వ పెద్దలు కాపాడారు. ఆపై స్వల్పంగా బకాయిలు రాబట్టారు.జిల్లాలో ఇప్పటి వరకు 90 ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేశాం. 391.120 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేశాంమని, మిల్లర్ల నుంచి బ్యాంక్ గ్యారెంటీలు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రోజ్మాండ్ తెలిపారు. -
మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు
-
మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు
సాక్షి, కాకినాడ: రేపటి నుంచి మిల్లర్లు అందరూ ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ.. ధాన్యంతో పాటు పత్తి, వేరుశెనగ, మినుములు, పెసలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కొన్నిచోట్ల మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు తమ దృష్టికి తీసుకు వచ్చారన్నారు. వచ్చే నాలుగైదు రోజుల్లో కొనుగోలుకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయబోతున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. కనీస మద్దతు ధర తగ్గితే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని ఆయన తెలిపారు. -
అమ్మో.. ఆ సీటొద్దు..!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర వాణిజ్య పన్నుల శా ఖ బోధన్ సర్కిల్లో పనిచేసేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు జంకుతున్నారు. ఇక్కడ పోస్టింగ్ అంటేనే మాతో కాదంటూ చేతులెత్తేస్తున్నా రు. కీలకమైన అసిస్టెంట్ కమిషనర్ (సీటీవో) పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంటోంది. వాణిజ్య పన్నుల శా ఖలో నకిలీ చలానాల కుంభకోణం వెలుగు చూసిన విష యం విధితమే. ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్, రైసుమిల్లర్లు అధికారులతో కుమ్మక్కై భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు పన్ను ఎగవేశారు. ఈ నేపథ్యంలో తరచూ నివేదికలు పంపడం, విచారణ కోసం రాష్ట్ర కార్యాలయాల సమావేశాలకు హాజరుకావడం వంటివి ఎక్కువగా ఉండటంతో ఇ క్కడ పనిచేసేందుకు ఆశాఖ ఉన్నతాధికా రులెవరూ ముందుకు రావడం లేదు. ఇక్క డ సీటీవోగా పనిచేసిన విజయేందర్ ఎని మిది నెలల క్రితం బదిలీ చేసుకుని వెళ్లి పో యారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంటోంది. ఇటీవల జరిగిన బదిలీల్లో కూ డా ఈ స్థానానికి ఎవరూ రాలేదు. ఆ సర్కిల్లోని డీసీటీవోకు ఇన్చార్జి సీటీవోగా బా ధ్యతలు అప్పగించారు. ఆ అధికారి కూడా సెలవుపై వెళ్లిపోవడం గమనార్హం. ప్రస్తు తం నిజామాబాద్ సర్కిల్లో పనిచేస్తున్న మరో డీసీటీవోకు బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు. ఎగవేసిన పన్ను వసూలు పడకేసింది వాణిజ్య పన్నుల శాఖలో వెలుగు చూసిన పన్ను ఎగవేత కుంభకోణం రాష్ట్ర వ్యాప్తం గా సంచలనం సృష్టించిన విషయం విధిత మే. నకిలీ చలానాలు, బోగస్ ఇన్పుట్ ట్యాక్స్ పేరుతో రైసుమిల్లర్లు సర్కారు ఖ జానాకు రూ.కోట్లలో ఎగనామం పెట్టారు. అంతర్గత విచారణ చేపట్టిన ఆశాఖ జిల్లా వ్యాప్తంగా 118 మంది మిల్లర్లు రూ.62 కోట్లు ఎగవేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ ప్ర భుత్వం నిర్ణయం తీసుకుంది. కేసు విచార ణ దాదాపు అటకెక్కగా, ఎగవేసిన సొమ్ము రికవరీ కూడా పడకేసింది. మిల్లర్లకు రాజకీయ అండదండలుండటంతో పన్ను బకాయిలను చెల్లించకుండా యథేచ్ఛగా తమ దందాలు కొనసాగిస్తున్నారు. వాణిజ్య ప న్నుల శాఖ అధికారులు కూడా ఈ బకా యిల వసూళ్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ప్రాథమికంగా తేల్చినట్లుగా ఎగవేసిన సొమ్ము రూ.62 కోట్లలో కనీసం 50 శాతం కూడా ఇప్పటి వసూలు కాకపోవడం గమనార్హం. కుంభకోణం వెలుగు చూసిన కొత్తలో నామమాత్రంగా బకాయి లు చెల్లించిన మిల్లర్లు ఆపై దాదాపు చేతులెత్తేశారు. కొందరు మిల్లర్లు ఇచ్చిన చె క్కులు కూడా బౌన్స్ అయ్యాయి. ఈ నే పథ్యంలో ఈ సర్కిల్లో పనిచేసేందుకు అ ధికారులు ముందుకు రాకపోవడంతో ప న్ను ఎగవేతదారులకు మరింత వెసులు బాటు దొరికినట్లవుతోంది. -
అదనపు బియ్యం..ఏదో భయం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గడచిన ఖరీఫ్ సీజన్లో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద వచ్చిన బియ్యాన్ని తరలించడంలో గందరగోళం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ను వెంటనే తీసుకునేందుకు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) సిద్ధంగా ఉన్నా..వాటిని ఇచ్చేందుకు మిల్లర్లు వెనకడుగు వేస్తుండటంతో సమస్య తలెత్తుతోంది. నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా ఎఫ్సీఐ కొర్రీలు పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో బియ్యం అప్పగింతకు మిల్లర్లు తటపటాయిస్తున్నారు.మరో వైపు ఇప్పటికే యాసంగి సీజన్ ఆరంభం కావడంతో కొత్తగా వచ్చే బియ్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో తెలియక పౌర సరఫరాల శాఖ కలవరపడుతోంది. ఈ ఏడాది ఖరీఫ్లో తెలంగాణలో అంచనాలకు మించి ధాన్యం దిగుబడి అయింది. పౌరసరఫరాల శాఖ 40.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు అప్పగించింది. రైస్ మిల్లర్ల నుంచి ‘సీఎంఆర్’ కింద ముడి బియ్యాన్ని ఏటా రేషన్ అవసరాల మేరకు సరిపడే నిల్వలను పక్కనబెట్టగా, మిగిలిన 3.50 లక్షల మెట్రిక్ టన్నుల రారైస్, 3.50 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ బియ్యం (ఉప్పుడు బియ్యం) ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఇందులో బాయిల్డ్ రైస్ను ఎఫ్సీఐ మిల్లర్ల నుంచి సేకరించగా, ముడి బియ్యం మాత్రం తీసుకోలేదు.గత నెల పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ అశ్వినీ కుమార్తో సమావేశమై మిల్లర్ల నుంచి రారైస్ను సైతం సేకరించాలని కోరారు. దీనికి ఎఫ్సీఐ అంగీకరించింది. అందుకు అనుగుణంగా 54వేల మెట్రిక్ టన్నుల రారైస్ను సేకరించింది. మిగతా 2.96లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించడంలో మాత్రం మిల్లర్లు వెనకడుగు వేస్తున్నారు. నూక ఎక్కువగా ఉన్నా, పాలిష్ తక్కువగా ఉన్నా, మిగతా ప్రమాణాల్లో ఎక్కడ తేడావచ్చినా వాటిని ఎఫ్సీఐ వెనక్కి పంపుతుంది. అదే జరిగితే మిల్లర్లకు నష్టం వస్తుంది. ఈ నేపథ్యంలో మిల్లర్లు విముఖత చూపుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్లో పౌర సరఫరరాల శాఖ 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 2,830 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, 1,51,066 మంది రైతుల నుంచి రూ.1836 కోట్ల విలువైన 10.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో 9.44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించింది. ఈ నిల్వలు సైతం వస్తున్న సమయంలో పాత నిల్వలను ఖాళీ చేయడం ఎలా అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ ఖాళీ చేయకుంటే పౌర సరఫరాల శాఖకు గోదాముల్లో నిల్వ సామర్ధ్యం తగ్గుతుంది. నాణ్యతలో ఇబ్బంది తలెత్తుతుంది. దీంతో మిల్లర్లు ఎలా స్పందిస్తారనేది ప్రశ్నగా మారింది. మిల్లర్లు ఆందోళన చెందొద్దు : మంత్రి నిరంజన్ రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ను ఎఫ్సీఐ తీసుకుంటుందని, ఈ విషయం లో మిల్లర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేద ని వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శా ఖ మంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం ఒక ప్రక టనలో స్పష్టం చేశారు. మిల్లర్ల దగ్గర ఉన్న 3 లక్షల మెట్రిక్ టన్నుల ముడి బియ్యాన్ని తీసుకో వడానికి ఎఫ్సీఐ సంసిద్ధత వ్యక్తం చేసిందని, ఒకవేళ ఎఫ్సీఐ తీసుకోని పక్షంలో ఏం చేయాలనే దానిపై పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థకు చెందిన నలుగురు సీనియర్ అధికారుల తో కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో ఈ కమిటీ నివేదికను అందిస్తుం దని, నివేదిక రాగానే ముఖ్యమంత్రితో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి మిల్లర్లకు హామీ ఇచ్చారు. రైస్ మిల్లర్ల సమస్యల పరిష్కా రంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఎ లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన మిల్లర్లకు విజ్ఞప్తి చేశారు. -
మిల్లింగ్.. తిరకాసు!
కోరుట్ల: ధాన్యం మిల్లింగ్లో అధికారులు..ప్రజాప్రతినిధులు ఆడిందే ఆటగా సాగుతోంది. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో ఉత్పత్తి అయిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ కోసం పొరుగు జిల్లాలకు తరలిపోవడం వివాదాస్పదంగా మారుతోంది. ఏటా స్థానిక మిల్లర్లు అభ్యంతరాలు తెలుపుతున్నా.. పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఎప్పటిలాగే ఈ ఖరీఫ్ సీజన్లో మిల్లింగ్ కోసం పొరుగు జిల్లాలకు ధాన్యం తరలించేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయంగా మారింది. ఇదీ..తిరకాసు ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లావ్యాప్తంగా సుమారు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని సివిల్ సప్లయ్ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 35 బాయిల్డ్ రైస్మిల్లులు, 60 పారా బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయి. ఒక్క సీజన్లో జిల్లాలోని అన్ని రైస్మిల్లుల మిల్లింగ్ సామర్థ్యం పరిగణనలోకి తీసుకుంటే మూడు లక్షల మెట్రిక్ టన్నులపైగానే ఉంటుంది. అయినప్పటికీ జిల్లాలోని రైస్మిల్లులకు ఉత్పత్తి అయిన ధాన్యంలో కేవలం 1,35,100 మెట్రిక్ టన్నులు మాత్రమే మిల్లింగ్కు కేటాయించారు. మిగిలిన 1,15,250 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు తరలించాలని నిర్ణయించారు. స్థానికంగా రైస్ మిల్లులకు మిల్లింగ్ కెపాసిటీ ఉన్నప్పటికి పొరుగు జిల్లాలకు ధాన్యం తరలించేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయం వెనక ఏదో తిరకాసు ఉందని స్థానిక రైస్మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.17కోట్ల భారం మిల్లర్ల విషయాన్ని పక్కన బెడితే ఒక్కో క్వింటాలుకు రూ.15 చొప్పున ప్రభుత్వం రవాణా చార్జీలు ఇస్తుంది. 1,15,250 మెట్రిక్ టన్నుల ధా న్యం జిల్లా నుంచి కరీంనగర్, పెద్దపల్లి పరిసరాల కు తరలించడానికి ఎంత తక్కువ అనుకున్నా రూ. 17 కోట్లకు మించిన రవాణా భారం పడుతుంది. జిల్లాలోని దాదాపు 100 రైస్మిల్లుల్ల పనిచేసే సు మారు 5వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లాలో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని స్థానికంగానే మిల్లింగ్ చేసేం దుకు అనుమతి వచ్చేలా ఒత్తిడి తెస్తే ఎంతోకొంత మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశలో అధికారులు..ప్రజాప్రతినిధులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. మిల్లింగ్ సామర్థ్యం తక్కువ జిల్లాలోని రైస్ మిల్లుల్లో మన దగ్గర ఉత్పత్తి అయిన ధాన్యం మిల్లింగ్ చేసే సామర్థ్యం లే దు. ఈ కారణంగా పొరుగు జిల్లాల్లోని రైస్ మిల్లులకు పంపాల్సి వస్తోంది. ఇందులో ఏలాంటి సందేహాలకూ తావు లేదు. మిల్లింగ్ సామర్థ్యం పెరిగితే స్థానికంగా మిల్లర్లకు ధాన్యం కేటాయించడానికి ఇబ్బంది లేదు. – చందన్కుమార్, ఏఎస్వో, సివిల్ సప్లయిస్ -
మిల్లర్ల మాయాజాలం
సాక్షి, విశాఖపట్నం : నిత్యావసరాల ధరలు నింగిలో విహరిస్తున్నాయి.. బియ్యం ధరలే కాస్త అందుబాటులో ఉన్నాయనుకుంటే అవీ భారమవుతున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి బియ్యం ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. క్వింటాలుకు రూ.500, పాతిక కిలోల బ్యాగ్పై రూ.100కు పైగా పెరిగాయి. సాధారణంగా మార్చి నుంచి బియ్యం ధరలు అందుబాటులో ఉంటాయి. మునుపటికంటే తగ్గుతాయి. ఎందుకంటే.. జనవరితో పంట చేతికొస్తుంది. రైతులు అప్పట్నుంచి ధాన్యాన్ని రెండు నెలల పాటు నిల్వ ఉంచుతారు. వాటిని వ్యాపారులు కొనుగోలు చేసి మిల్లుల్లో మర పట్టించి మార్కెట్కు తరలిస్తారు. ఫలితంగా జులై, ఆగస్టు నెలల వరకు బియ్యం ధరలు కాస్త తగ్గుముఖం పడతాయి. అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు బియ్యం ధరలు పెరుగుతున్నాయి. మిల్లర్లు సిండికేట్ అయి బియ్యం సరఫరాలో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ధాన్యం లభ్యత ఆశించినంతగా లేకపోవడంతో బియ్యం ధరలు పెంచక తప్పడం లేదని మిల్లర్లు చెబుతున్నారు. వాస్తవానికి బియ్యాన్ని ప్రభుత్వానికి లెవీ ఇస్తున్నందున ఆ లోటును భర్తీ చేసుకోవడానికి మిల్లర్లు ధరలు పెంచుతున్నారని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు వేసవికాలంలో ధాన్యం మరపట్టిస్తే నూక ఎక్కువగా వచ్చి బియ్యం దిగుబడి తగ్గుతుందన్నది మరో వాదన. దీన్ని దృష్టిలో ఉంచుకుని కూడా మిల్లర్లు నష్టపోకుండా బియ్యం ధరలు పెంచుతుంటారని అంటున్నారు. కాగా రానున్న రెండు, మూడు నెలల వరకు వీటి ధరల పెరుగుదల కొనసాగవచ్చని, ప్రస్తుతంకంటే ఒకింత ఎగబాకే అవకాశం ఉందని బియ్యం వ్యాపారులు చెబుతున్నారు. రోజుకు 4 లక్షల కిలోల వినియోగం విశాఖ నగరంలో రోజుకు సగటున 4 లక్షల కిలోల బియ్యం వినియోగమవుతుందని అంచనా. ఈ డిమాండ్కు తగ్గట్టుగా ప్రస్తుతం సరుకు మార్కెట్కు రావడం లేదు. మిల్లర్ల ముందస్తు వ్యూహంలో భాగంగా సరుకును తగ్గిస్తున్నట్టు చెబుతున్నారు. ఫలితంగా మార్కెట్లో బియ్యానికి డిమాండ్/కృత్రిమ కొరత సృష్టించి, ధర పెరగడానికి దోహదపడుతున్నట్టు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, సరుకులు, కూరగాయల ధరలు భారంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు బియ్యం రేట్లు కూడా వాటితో పోటీపడుతుండడంపై వినియోగదారుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. అధికారులు రంగంలోకి దిగి బియ్యం ధరలను కట్టడి చేయాలని కోరుతున్నారు. ధరలు తగ్గించకపోతే ఎలా? ఇప్పటికే మార్కెట్లో పప్పుదినుసులు, నూనెల ధరలు మధ్య తరగతి వారికి భారంగా మారాయి. ఇప్పుడు వాటికి బియ్యం రేట్లు కూడా తోడయ్యాయి. వీటి ధరల పెరుగుదలను నియంత్రించాలన్న ఆలోచన ప్రభుత్వానికి గాని, అధికారులకు గాని కలగడం లేదు. ఎవరుష్టానుసారం వారు రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్యులే బాధితులవుతున్నారు. బియ్యం ధరల పెరుగుదలకు కారకులయ్యే వారిపై చర్యలు తీసుకుని కట్టడి చేయాలి. – కుప్పిలి నిర్మల్కుమార్, చైతన్యనగర్, సీతమ్మధార -
జిల్లాలోనూ ‘నీరవ్మోదీ’
నీరవ్ మోదీ – పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం.. రొటొమ్యాక్ కొఠారి– బ్యాంక్ ఆఫ్ ఇండియా కుంభకోణం.. ఇలా రోజుకొక బ్యాంకు మోసాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం విదితమే. జిల్లాలోనూ ఈ తరహా బ్యాంకుకు సంబంధించిన భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వ్యాపార లావాదేవీల కోసం పెద్ద మొత్తంలో రుణం పొందిన ఓ రైస్మిల్లరు ఇప్పుడు చేతులెత్తేశాడు. ఆరు నెలలుగా తీసుకున్న రుణానికి సంబంధించిన అసలు, వడ్డీ చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని బోధన్ ప్రాంతానికి చెందిన ఓ రైస్మిల్లరు ఆంధ్రాబ్యాంక్ బోధన్ మెయిన్ బ్రాంచ్ నుంచి రూ.23 కోట్ల మేరకు రుణం తీసుకున్నారు. అయితే గత ఆరు నెలలుగా ఈ మొత్తాన్ని చెల్లించడం లేదు. దీంతో బ్యాంకు అధికారులు ఈ రుణానికి సంబంధించిన సెక్యూరిటీ అసెట్స్ (ఆస్తుల)పై దృష్టి సారించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఇంత భారీ మొత్తంలో బ్యాంకు రుణం తీసుకుని చేతులెత్తేసిన ఘటన ఇదే మొదటి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం.. ఆ తర్వాత చేతులెత్తేయడం జిల్లాలో కొత్తేమీ కాదు. రూ.ఆరు కోట్లు.., రూ.తొమ్మిది కోట్లు ఇలా పలువురు రైస్మిల్లర్లు, ఇతర కాంట్రాక్టర్లు బ్యాంకుల నుంచి రుణాలు పొంది చేతులెత్తేశారు. కానీ ఇంత భారీ మొత్తంలో ఎగనామం పెట్టడం ఇదే తొలిసారి కావడంతో బ్యాంకు, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వజ్రాల వ్యాపారి నీరవ్మోదీ, రొటొమ్యాక్ కొఠారిలు వేల కోట్లలో బ్యాంకులకు ఎగనామం పెట్టగా.. జిల్లాకు చెందిన కొందరు రైస్మిల్లర్లు అప్పులిచ్చిన బ్యాంకులకు పంగనామాలు పెడుతున్నారు.బ్యాంకు నుంచి డబ్బుల ముఠా ఎత్తుకు పోతున్నట్లు సింబాలిక్ క్యారికేచర్ను వాడే విషయం పరిశీలించగలరు. సెక్యూరిటీ ఆస్తుల విలువ అంతంతే.. భారీ మొత్తంలో రుణం పొందిన ఈ రైస్మిల్లరు సెక్యూరిటీగా పెట్టిన ఆస్తుల విలువ రుణంలో సగం కూడా ఉండే అవకాశాలు లేకపోవడంతో బ్యాంకు అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. సుమారు రూ.23 కోట్ల మేరకు బకాయి పడగా.. సెక్యూరిటీగా పెట్టిన ఆస్తుల విలువ సుమారు రూ.13 కోట్లకు మించి ఉండదని తెలిసింది. రైస్మిల్లు స్థలం, ప్లాంట్, మిషనరీ, ఇతర ఆస్తులన్నీ కలిపినా ఈ మేరకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని సమాచారం. దీంతో సుమారు రూ.పది కోట్ల రికవరీ పట్ల బ్యాంకు ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. అయితే సెక్యూరిటీగా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సర్ఫేసీ చట్టం ప్రకారం బ్యాంకుకు సంక్రమించిన అధికారాలతో సెక్యూరిటీ ఆస్తులను ఆన్లైన్లో వేలం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆస్తుల విలువ పెంచేసి.. రుణం పొందడానికి సెక్యూరిటీగా పెట్టిన ఆస్తుల విలువను భారీగా పెంచినట్లు సమాచారం. మార్కెట్ ధర కంటే సుమారు 50 శాతం అధికంగా విలువ ఉన్నట్లు ఆస్తుల విలువను పెంచేసి.. భారీ మొత్తంలో రుణం పొందారు. ఈ వ్యవహారంలో వ్యాల్యువర్, బ్యాంకు ఉన్నతాధికారుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ విలువైన ఆస్తులకు ఎక్కువ మొత్తంలో రుణం మంజూరు చేసిన బ్యాంకు ఉన్నతాధికారులు ఇక్కడి నుంచి బదిలీ అయినట్లు సమాచారం. ఆస్తి విలువను ఎక్కువగా చూపిన వ్యాల్యువర్పై కూడా చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయినట్లు తెలుస్తోంది. వివరాలు చెప్పడానికి లేదు.. బ్యాంకుకు ఎగనామం పెట్టిన విషయమై వివరాల కోసం నిజామాబాద్లోని ఆంధ్రాబ్యాంక్ రీజినల్ కార్యాలయం డిప్యూటీ జనరల్ మేనేజర్ పి.వి.వి.సత్యనారాయణను ‘సాక్షి’ సంప్రదించగా వివరాలు చెప్పేందుకు అంగీకరించలేదు. బ్యాంకు వివరాలు చెప్పడానికి లేదని దాటవేశారు. ఆస్తుల విలువను ఎక్కువగా చూపి ఎక్కువ మొత్తంలో రుణం మంజూరు చేసిన విషయం ప్రస్తావించగా.. రుణ మంజూరులో ప్రోసీజర్ ఫాలో అవుతామని చెప్పుకొచ్చారు. – పి.వి.వి.సత్యనారాయణ, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆంధ్రాబ్యాంక్ -
జియో రైస్ వచ్చేశాయ్..!
రామగుండం(పెద్దపల్లి): బంపర్ ఆఫర్.. భారీ బొనాంజా.. క్రేజీ సమ్మర్.. ఇలా ఎన్నేన్నే ఆఫర్లతో వినియోగదారుల మనసు దోచుకుంటూ.. ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపెడుతోంది రిలయన్స్ జియో నెట్ వర్క్! జనంలో జియో పట్ల పెరిగిన ఆసక్తి అంతా ఇంతాకాదు. ఎక్కడ పదిమంది కలిస్తే అక్కడ చర్చ జియోపైనే! సరిగ్గా ఈ క్రేజ్ నే క్యాష్ చేసుకుంటున్నారు రైస్ మిల్లర్లు. పెద్దపల్లి జిల్లా రామగుండం సహా పలు పట్టణాలకు చెందిన కొందరు రైస్ మిల్లర్లు.. 25 కేజీల సంచులపై జియో లోగోను ముద్రించి సన్నరకం బియ్యం షాపులకు సరఫరా చేస్తున్నారు. ఈ పోకడకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జియో నెట్ వర్క్ లోకి ఒక్కసారి రిజిస్టర్ అయితే మూడు నెలలు ఉచిత కాల్స్, డేటా ఇచ్చిన విధంగా.. 'జియో బియ్యంతో ఒక్కసారి అన్నం తింటే మూడు నెలల దాకా ఆకలి కాదు' అంటూ నెటిజన్లు చవాకులు పేలుస్తున్నారు. బ్రాండ్ ను సొంతం చేసుకునే ఈ తరహా మార్కెటింగ్ ఐడియాలు కొత్తేమీ కావు. సంక్రాంతి, దీపావళి సీజన్లలో హిట్ సినిమాల పేర్లు, హీరోల పేర్లతో పతంగులు, పటాకులు తెలిసినవే. పలు ఉత్పత్తులపై ప్రధాని మోదీ బొమ్మను సైతం ముద్రించి వ్యాపారాలు సాగించిన సందర్భాలను చూశాం. -
మిల్లర్ల జిమ్మిక్కు
- రూ.60 కోట్ల సీఎంఆర్ ఎగవేతకు మిల్లర్ల వ్యూహం - నోటీసులు జారీ చేసిన అధికారులు కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఇవ్వకుండా రైస్ మిల్లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన రూ.60 కోట్లు విలువజేసే సీఎంఆర్ పెండింగ్లో ఉంది. కాగా సీఎంఆర్ చెల్లించకుండా దర్జాగా తిరుగుతున్న ఏడుగురు రైస్ మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్ట్ అమలు చేయనున్నారు. మహిళల వేషంలో హైవేపై దోపిడీలు దీనికి సంబంధించి రైస్ మిల్లర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నెల్లూరు(పొగతోట): సీఎంఆర్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న మిల్లర్లపై చర్యలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఏళ్ల తరబడి సీఎంఆర్ ఇవ్వకుండా రైస్ మిల్ల ర్లు దర్జాగా తిరుగుతున్నారు. 2011–12 సంవత్సరానికి సంబంధించి రూ.6. కోట్లు, 2014–15కు 1750 మెట్రిక్ టన్నులకు రూ.3.69 కోట్లు సీఎంఆర్, 2015–16 సంవత్సరానికి సంబం«ధించి 23,400 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రికవరీ చేయాల్సి ఉంది. సుమారు రూ.50 కోట్లకు పైగా సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన రైస్ మిల్లర్లకు మాత్రమే ధాన్యం సరఫరా చేయాల్సి ఉంది. రైస్ మిల్లర్ కోటి రూపాయలకు బ్యాంక్ గ్యారంటీ ఇస్తే అంత విలువ చేసే ధాన్యాన్ని సరఫరా చేయాల్సి ఉంది. గతంలో బ్యాంక్ గ్యారంటీæ కొంత మంది వద్ద డీడీలు, చెక్కులు కొంత మంది రైస్ మిల్లర్ల వద్ద తీసుకుని ధాన్యం సరఫరా చేశారు. కోర్టును ఆశ్రయించిన మిల్లర్లు ధాన్యం తీసుకుని బహిరంగ మార్కెట్లో విక్రయించి స్వాహా చేసిన కొంత మంది రైస్ మిల్లర్లు తప్పు మాదికాదు.. అధికారులదని కోర్టును ఆశ్రయించారు. తేమ శాతం అధికంగా ఉండే ధాన్యాన్ని సరఫరా చేశారని, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ధాన్యం తరలించారని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం మిల్లులకు సరఫరా అయినట్లు రైస్ మిల్లర్లు రికార్డులో సంతకం చేశారు. ఇంత కాలం విషయం చెప్పకుండా కోర్టును ఆశ్రయించినా ఫలితం అనుకూలంగా రాదని గ్రహించిన రైస్ మిల్లర్లు ప్లేటు ఫిరాయించారు. సమయం ఇవ్వండి సీఎంఆర్ పూర్తి స్థాయిలో సరఫరా చేస్తామని అధికారులు చుట్టూ్ట ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు (íపీపీసీలు) ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తోంది. పీపీసీల ద్వారా సేకరించిన ధాన్యాన్ని ఎంపిక చేసిన రైస్ మిల్లులకు తరలిస్తారు. అయితే ధాన్యం కొనుగోళ్ల లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. వరి సాగు చేయని రైతుల బ్యాంక్ అకౌంట్లలో లక్షల రూపాయలు నగదు జమ చేశారు. ఈ విషయంపై పత్రికల్లో వార్తలు రావడంతో పలువురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. రైస్ మిల్లర్లు నిర్దేశించిన సమయంలో ధాన్యాన్ని ఆడించి సీఎంఆర్ కింద తిరిగి జిల్లా పౌరసరఫరాల సంస్థకు ఇవ్వాల్సి ఉంది. 2015–16 సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.450 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని పీపీసీల ద్వారా కొనుగోలు చేశారు. గత ఏడాది ఆగస్టు్టకు సీఎంఆర్ పూర్తి స్థాయిలో సరఫరా చేయాల్సి ఉంది. రైస్ మిల్లర్లు తీసుకున్న ధాన్యాన్ని ఆడించి బహిరంగ మార్కెట్లో విక్రయించారు. గడువు పూర్తయినా మూడు నెలల సమయం సీఎంఆర్ తిరిగి సరఫరా చేయడానికి గడువు పూర్త యిన తరువాత మిల్లర్లకు మూడు నెలల సమయం ఇచ్చారు. సమయం దాటినా సీఎంఆర్ సరఫరా చేయలేదు. ప్రస్తుతం వస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేసి సీఎంఆర్ సరఫరా చేయాల్సి ఉంది. సీఎంఆర్కు రైస్ మిల్లుల ఎంపికలో అ«ధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. రెండు వేల టన్నుల సామర్థ్యం లేని రైస్ మిల్లులకు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించారు. అటువంటి రైస్ మిల్లర్లు ధాన్యాన్ని బహిరంగా మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పెట్టుబడి లేని వ్యాపారం కావడంతో సీఎంఆర్ ఎప్పుడు ఇచ్చినా అధికారులు పట్టించుకోరనే ధీమాతో రైస్ మిల్లర్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై సీఎంఆర్ స్వాహా చేశారనే విమర్శలున్నాయి. ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయి. ధాన్యం సేకరణకు 19 పీపీసీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని సరఫరా చేయడానికి జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు ముందుకు రాలేదు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఐదుగురు రైస్ మిల్లర్లు ధాన్యం సరఫరా చేయాలని రూ.5 కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. ఈ విధంగా గ్యారంటీ ఇచ్చిన రైస్ మిల్లులకు ధాన్యం సరఫరా చేస్తున్నారు. సీఎంఆర్ పూర్తి స్థాయిలో రికవరీ చేస్తాం సీఎంఆర్ పూర్తి స్థాయిలో రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ధాన్యం సరఫరాలో అధికారులది తప్పని మిల్లర్లు కోర్టును ఆశ్రయించారు. మళ్లీ వాళ్లే వచ్చి సమయం ఇవ్వండి పూర్తి స్థాయిలో సీఎంఆర్ సరఫరా చేస్తామని అడిగారు. వరి కోతలు జరుగుతున్నాయి సమయం ఇచ్చి రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటాం. –కృష్ణారెడ్డి,జిల్లా పౌరసరఫరాల సంస్థ ఎండీ -
రైస్ మిల్లర్లపై సీఐడీ నజర్!
- బోధన్ స్కాంలో 300 మంది రైస్మిల్లర్ల పాత్ర - వారిని విచారించాలని భావిస్తున్న సీఐడీ - ఆపేందుకు ప్రయత్నిస్తున్న ఓ ఎంపీ, మాజీ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు! - ఏ1 నిందితుడు శివరాజ్తో వారికి ఆర్థిక సంబంధాలు - ఉన్నతాధికారులకు సీఐడీ ఫిర్యాదు.. ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు సాక్షి, హైదరాబాద్ వాణిజ్య పన్నుల విభాగం బోధన్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన నకిలీ చలాన్ల కుంభకోణంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కాంలో పాత్రధారులుగా 300 మంది రైస్మిల్లర్లు ఉన్నారని, వారిని విచారించాలని సీఐడీ ప్రయత్నిస్తోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న శివరాజ్ పలువురు ప్రజాప్రతినిధులకు సన్నిహితుడని కూడా గుర్తించింది. అయితే రైస్మిల్లర్లకు, శివరాజ్కు సన్నిహితులైన ఓ ఎంపీ, మాజీ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ కేసు విచారణపై ప్రభావం చూపేలా ఒత్తిళ్లు తీసుకువస్తున్నట్లు సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. రైస్ మిల్లర్లూ బాధ్యులే.. నకిలీ చలాన్లు సృష్టించి, ట్యాక్స్ చెల్లించినట్టు చెప్పుకుంటున్న 300 మంది రైస్మిల్లర్ల పాత్రపైనా విచారించాలని సీఐడీ నిర్ణయించింది. 2005 నుంచి ఇప్పటివరకు వారు నయా పైసా చెల్లించకున్నా.. చెల్లించేసినట్లు శివరాజ్ వారికి చలాన్లు సృష్టించి ఇచ్చినట్టు సీఐడీ దర్యాప్తులో తేలింది. ఇక నిజామాబాద్లోని పలువురు ఎమ్మెల్యేలకు కొంత మంది రైస్మిల్లర్లు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించారనీ భావిస్తున్నారు. నాయకులతో ఏమిటీ లింకు..? సదరు ఎంపీ, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రైవేటు ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్తో ఉన్న లింకులపై ఇంటలిజెన్స్ వర్గాలు ఆరాతీస్తున్నాయి. ఏటా ఐటీ చెల్లింపులు, ట్యాక్స్ల వ్యవహారం వంటి వాటన్నింటిలో వారికి శివరాజ్ సహాయసహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నోట్ల రద్దు సమయంలోనూ ఓ ఎంపీ, మాజీ ఎంపీలకు శివరాజ్ నోట్లు మార్పిడి చేసి పెట్టినట్లు సీఐడీ అధికారులు సందేహిస్తున్నారు. అంతే కాకుండా నిజామాబాద్ జిల్లాలో కొత్తగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల ఆర్థిక వ్యవహారాలను శివరాజ్ చక్కబెట్టేవాడని భావిస్తున్నారు. అందుకే ఆ ఎంపీ, మాజీ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ కేసు దర్యాప్తుపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారని ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై ఇంటలిజెన్స్ విచారణకు ఆదేశించారని, ఇంటలిజెన్స్ అధికారులు నివేదిక రూపొందించే పనిలో ఉన్నారని సమాచారం. ప్రభుత్వం వైపు నుంచీ ఒత్తిడికి యత్నం ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి తమపై వస్తున్న ఒత్తిళ్లు వాస్తవమేనని అధికారులు అంగీకరిస్తున్నారు. అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కుంభకోణంలో ఎవరినీ వదలిపెట్టలేమని వారికి స్పష్టం చేశామని చెబుతున్నారు. దీంతో ఆయా నేతలు ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
సన్నధాన్యానికి గిట్టుబాటు ధర!
- రైస్ మిల్లర్లతో సివిల్ సప్లయ్ ఎంవోయూ - మధ్యాహ్న భోజన పథకం అవసరాల కోసం సన్నబియ్యం - క్వింటాల్ ధాన్యానికి రైతులకు రూ.1,800 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సన్న ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నడుం బిగించింది. కేంద్రం నిర్దేశించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను మించి రైతులకు గిట్టుబాటయ్యేలా చర్యలు తీసుకుంటోంది. రైతుల నుంచి క్వింటాలు సన్న ధాన్యాన్ని రూ.1,800కు తక్కువ కాకుండా కొనుగోలు చేసే మిల్లర్ నుంచి తాము సన్న బియ్యాన్ని క్వింటాలుకు రూ.3వేలు (ముడి బియ్యం), రూ.3,050 (బాయిల్డ్ రైస్) చొప్పున చెల్లించి కొంటామని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియే షన్తో అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కూడా చేసు కుంది. కేంద్ర ప్రభుత్వం ‘ఏ’గ్రేడు ధాన్యానికి క్వింటాలుకు రూ.1,510, సాధారణ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.1,470 కనీస మద్దతు ధరగా నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో సన్న ధాన్యాన్ని రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు సివిల్ సప్లైస్ సంస్థ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధరను మించి చెల్లించి కొనుగోలు చేసే అవకాశం లేదు. దీంతో మిల్లర్ల ద్వారానే ఆ ధాన్యం కొనుగోలు చేసేందుకు కార్పొరేషన్ ప్రణాళిక రూపొందించింది. కాగా, రాష్ట్రంలో పన్నెండు రకాల సన్నధాన్యం పండిస్తున్నప్పటికీ కేవలం మూడు రకాల సన్న ధాన్యానికి మాత్రమే మిల్లర్లకు అనుమతి ఇచ్చారు. బీపీటీ–5204, సోనా మసూరి, సాంబా మసూరి (విజయా మసూరి) రకం ధాన్యాన్ని ఆడించిన బియ్యాన్ని మాత్రమే కార్పొరేషన్ కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రైతుల మేలుకోసం..: కార్పొరేషన్ చైర్మన్ పెద్ది పౌరసరఫరాల సంస్థ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నా, ఈ ఎంఓయూ ద్వారా సన్నరకం ధాన్యం పడించిన రైతులకు మరింత గిట్టుబాటు ధర లభి స్తుందని, తమ తో మిల్లర్లు చేసుకున్న ఎంఓయూకు వారు కట్టుబడి ఉండాలని కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుద ర్శన్రెడ్డి కోరారు. ఈ ఒప్పందం వల్ల రైతుల వద్ద ఉన్న ధాన్యానికి మంచి ధర లభించడంతోపాటు, రాష్ట్రం లోని హాస్టళ్లు, స్కూళ్ళలో మధ్యాహ్న భోజనానికి నాణ్య మైన మన బియ్యమే వాడుకోగలుగుతామని, దీంతో పాటు సన్న బియ్యానికి ఎక్కువ ధర చెల్లించి బయటి రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని, ఫలితంగా ప్రభుత్వంపై భారం తగ్గుతుందని ఆయన వివరించారు. -
మిల్లర్ల వద్ద ‘గన్ని’ సంచులా?
- రూ. 203 కోట్ల విలువైన సంచులు వారి వద్దే.. - 2009 నుంచి 2014 దాకా లెక్క తేలని వైనం - అక్రమాలకు అధికారుల సహకారం - పౌరసరఫరాల శాఖ కమిషనర్ చొరవతో వెలుగులోకి.. సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల శాఖలో కొందరు అధికారుల సహకారంతో ఇన్నాళ్లూ ఆడింది ఆట, పాడింది పాటగా చెలాయించుకున్న రైస్ మిల్లర్ల వ్యవహారాలు.. ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ప్రభుత్వానికి అప్పగించకుండా బయట వ్యాపారం చేసుకున్న తీరుకు ఇటీవలే అడ్డుకట్ట పడగా.. తాజాగా మిల్లర్ల మరికొన్ని లీలలు బయట పడ్డాయి. రూ.203.80 కోట్ల విలువైన గన్నీ సంచులు మిల్లర్ల వద్దే ఉండిపోయినట్లు గుర్తించారు. రైతులు పండించే వరి పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి) దక్కేలా ప్రభుత్వమే గత కొన్నేళ్లుగా ధాన్యం సేకరిస్తోంది. ఐకేపీ మహిళా సంఘాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, రైసు మిల్లుల వద్ద కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అటు మహిళా సంఘాలకు, ఇటు మిల్లర్లకు పౌరసరఫరా సంస్థ గన్నీ సంచులు సరఫరా చేస్తోంది. అయితే, అసలు తతంగమంతా గన్నీ సంచులను అప్పజెప్పడంలోనే చోటు చేసుకుంటోందని సమాచారం. కొత్త సంచులను మిల్లర్లకు ఇస్తుండగా, ఒకసారి వాడిన పాత సంచులను మాత్రం ఐకేపీ కేంద్రాలకు ఇచ్చేవారని తెలిసింది. ఈ ఖరీఫ్ సీజన్లో కనీసం 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ.. ఆ మేరకు అవసరమైన గన్నీ సంచుల గురించి లెక్క తీయగా మిల్లర్ల బాగోతం బయటపడిందని తెలిసింది. పౌరసరఫరాల శాఖ బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశాల్లో లెక్కతేలకుండా పోయిన గన్నీ సంచుల సంగతి బయట పడిందని తెలిసింది. ప్రతీ సీజన్లో ధాన్యం సేకరణ కోసం కోట్ల రూపాయలు వెచ్చించి గన్నీ సంచులు కొనడం ఆనవాయితీ. కానీ, గత సీజన్లో ఎన్ని సంచులు కొన్నారు..? మిల్లర్లకు, ఐకేపీ కేంద్రాలకు సరఫరా చేసిన సంచులు తిరిగి సంస్థకు చేరాయా..? లేదా అన్న విషయాల్లో కొందరు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించిన తీరు విస్తుగొల్పుతోంది. 2009 నుంచి 2014 దాకా మిల్లర్ల నుంచి రావాల్సిన గన్నీ సంచుల లెక్కలు తేల్చడంపై కసరత్తు చేశారు. కరీంనగర్లో అధికంగా అక్రమాలు మిల్లర్ల వద్ద రూ. 203.80 కోట్ల విలువైన గన్నీ సంచులు ఉన్నట్లుగా లెక్క తేలింది. ఒక కొత్త గన్నీ సంచి రూ.50, ఒకసారి ఉపయోగించిన గన్నీ సంచికి రూ.30 గా ధర నిర్ణయించారు. ఈ లెక్కన హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది జిల్లాల్లో కొత్తవి, పాతవి కలిపి సుమారు 5.45 కోట్ల గన్నీ బ్యాగులు మిల్లర్ల వద్దే ఉండిపోయాయని అధికారులు లెక్క తేల్చారు. మిల్లర్లు వీటిని పౌరసరఫరాల సంస్థకు అప్పజెప్పకుండా సొంతానికి వాడుకున్నట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు.. ఈ సారి ధాన్యం సేకరణ సందర్భంగా వీటినే కేటాయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో రూ.8.51 కోట్లు, నిజామాబాద్ - రూ.14.20 కోట్లు, మెదక్ - రూ.17.27కోట్లు, కరీంనగర్ - రూ.115.99 కోట్లు, వరంగల్ - రూ.19.60 కోట్లు, ఖమ్మం - రూ.5.21 కోట్లు, నల్లగొండ - రూ.18.98 కోట్లు, మహబూబ్నగర్ - రూ.2.76 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ..128 కోట్ల విలువైన గన్నీ సంచులు మిల్లర్ల దగ్గర ఉండిపోయాయి. అత్యధికంగా రూ.115.99 కోట్ల విలువైన దాదాపు మూడు కోట్ల గన్నీ బ్యాగులు మిల్లర్ల వద్ద ఉండిపోయిన కరీంనగర్ జిల్లా నుంచే అటు ఉమ్మడి రాష్ట్రంలో, ప్రస్తుతం కూడా పౌరసరఫరా శాఖ మంత్రులు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. -
8న రైస్మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు
న్యూశాయంపేట : జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు వచ్చేనెల 8న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి ఆర్.రాజ్గోపాల్రావు ఓ ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు మిగతా గవర్నింగ్ బాడీ పదవులకు ప్రాంతాలవారీగా నామినేటెడ్ పద్ధతిలో ఎన్నిక ఉంటుందన్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే నెల 2 నుంచి 3 వరకు గడువు ఉంటుందన్నారు. 4న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. 5న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుందన్నారు. పోటీలో ఉన్నవారి జాబితాను అదే రోజు సాయంత్రం ప్రకటిస్తారని చెప్పారు. 8న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. కౌంటింగ్ అదే రోజు సాయంత్రం 5 గంటలకు జరుగుతుందని, ఫలితాలు సాయంత్రం 6.30 గంటలకు ప్రకటిస్తామన్నారు. హంటర్రోడ్లోని రైస్మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పోటీ చేయదల్చినవారు నామినేషన్ పత్రాలను కార్యాలయంలో పొందాలని సూచించారు. -
మిల్లర్ల గిల్లుడు
* సర్కారుకు రూ.500 కోట్ల విలువైన బియ్యం బకాయి * ధాన్యం అట్టిపెట్టుకొని బయట అడ్డగోలు వ్యాపారం * రేషన్ బియ్యానికి ఏర్పడుతున్న కొరత * దాంతో మళ్లీ అదే మిల్లర్ల వద్దే కొంటున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లర్ల మాయాజాలానికి ప్రభుత్వం చిత్తవుతోంది. అధికారులు, మిల్లర్ల కుమ్మక్కుతో పౌరసరఫరాల శాఖ కుదేలవుతోంది. చివరకు ప్రజా పంపిణీ (పీడీఎస్) ద్వారా అందించే రేషన్ బియ్యం కోసం అదనపు భారం మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కస్టమ్ మిల్లింగ్ ద్వారా మిల్లర్ల నుంచి రావాల్సిన బియ్యాన్ని రాబట్టుకోలేక చేతులెత్తేసిన పౌరసరఫరాల శాఖ.. రేషన్ బియ్యానికి కొరత ఏర్పడితే మళ్లీ మిల్లర్ల దగ్గరే కొనుగోలు చేస్తోంది. ఈ శాఖలోని అధికారుల పుణ్యమాని మిల్లర్లు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. కొందరు అధికారులు.. కేసులున్న మిల్లర్లకు, డిఫాల్టర్లకు సీఎంఆర్ (క స్టమ్ మిల్లింగ్ రైస్) అప్పజెప్పారు. అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం వల్ల మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ బియ్యంతో బయట అడ్డగోలు వ్యాపారం చేసుకుంటున్నారు. ఇదీ కథ! 2015-16 సంవత్సరానికిగాను 23 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు అప్పగించింది. ఖరీఫ్, రబీ సీజన్లు పూర్తై మరో ఖరీఫ్ సీజన్ ఆరంభమైనా ఇప్పటి దాకా మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి 14 లక్షల టన్నుల బియ్యమే అందింది. ఇంకా 1.81 లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే పెండింగ్లో ఉంది. ఏళ్లకు ఏళ్లుగా శాఖలో పాతుకు పోయిన కొందరు అధికారులు, జిల్లా స్థాయిలో కొందరు డీఎస్వోలు, డీఎంలు మిల్లర్లకు సహకరిస్తున్నారన్న ఆరోపణ లు ఉన్నాయి. మొత్తంగా ప్రభుత్వానికి ఇంకా రూ.500 కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల నుంచి అందాల్సి ఉంది. మిల్లర్ల వద్ద ఇంత పెద్దమొత్తంలో బియ్యం ఆగిపోవడంతో రేషన్ బియ్యానికి కొరత ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వం తిరిగి అదే మిల్లర్లకు డబ్బులు చెల్లించి బియ్యం కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఇలా 16 వేల టన్నుల బియ్యం కొనుగోలు చేసింది. వాస్తవానికి కస్టమ్ మిల్లింగ్ ద్వారా సేకరించే బియ్యం పీడీఎస్ అవసరాలకు సరిపోవు. కచ్చితంగా బియ్యం కొనుగోలు చేయాలి. కాకపోతే ప్రభుత్వానికి రావాల్సిన 1.81 లక్షల టన్నుల బియ్యం రాక పోవడంతో కొనుగోలు తప్పలేదంటున్నారు. పరిస్థితిని మార్చేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 14న అధికారులతో పూర్తిస్థాయిలో సమీక్ష జరపనున్నారు. బకాయిలే బకాయిలు.. హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాల్లోని మిల్లర్లకు ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ బాధ్యతను అప్పజెప్పింది. 2015-16 సంవత్సరానికి గాను ఖరీఫ్, రబీ సీజన్లలో వీరికి ధాన్యం అప్పజెప్పగా పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలను తమ వద్దే అట్టిపెట్టుకున్నారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో రైస్ మిల్లర్ల నుంచి రూ.159 కోట్ల విలువైన 60 వేల టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది. కరీంనగర్ జిల్లాలో సుమారు రూ.110 కోట్లు విలువ చేసే 41 వేల టన్నులకుపైగా బియ్యం అందా ల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో రూ.80.55 కోట్లు, మహబూబ్నగర్ జిల్లాలో రూ.50 కోట్లు, వరంగల్ జిల్లాలో రూ.38 కోట్లు, రంగారెడ్డి, మెదక్లో ఒక్కో జిల్లాలో రూ.23 కోట్లు, నిజామాబాద్లో రూ.13.50 కోట్లు, ఖమ్మం జిల్లాలో రూ.5.14 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ బియ్యం ప్రభుత్వానికి అందాల్సి ఉంది. ఇవిగో అక్రమాలు అర్హతలేని, పలు కేసుల్లో సీజ్ అయిన మిల్లులకు, చివరకు విద్యుత్ కనెక్షన్ కూడా లేని మిల్లుల కస్టమ్ మిల్లింగ్ కోసం ధాన్యం అప్పజెప్పారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్గా కొద్ది రోజుల కిందటే బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ అధికారి సి.వి.ఆనంద్ సీఎంఆర్ బకాయిలపై దృష్టి పెట్టా రు. ఆయన నేతృత్వంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల మహబూబ్నగర్ జిల్లాలో చేసిన దాడులు అక్రమాలు బయటపడ్డాయి. ఈ మిల్లులన్నీ కస్టమ్ మిల్లింగ్ ధాన్యంతో బయట వ్యాపారం చేస్తున్నట్టు వెల్లడైంది. మహబూబ్నగర్ జిల్లా భూత్పూరులోని వెంకటేశ్వర ఇండస్ట్రీస్ మిల్లులో రూ.3 కోట్ల విలువైన ధాన్యాన్ని సీజ్ చేశారు. శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ మిల్లులో రూ.2.80 కోట్ల విలువైన ధాన్యాన్ని పట్టుకున్నారు. గతేడాది కడ్తాల్లోని వరలక్ష్మీ రైస్ మిల్లును సీజ్ చేశారు. అయినా ఆ మిల్లుకు అధికారులు ధాన్యం అప్పగించారు. దేవరకద్రలో మహాలక్ష్మి మిల్లులో సైతం రూ.74 లక్షల విలువైన ధాన్యం పట్టుకున్నారు. మరోవైపు ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు తమకు గడువు ఇచ్చిందని, ఈ నెలాఖరులోగా పెండింగులో ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందిస్తామని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేందర్ ‘సాక్షి’కి చెప్పారు. -
‘రైస్మిల్లర్స్’ జిల్లా ఉపాధ్యక్షునిగా లక్ష్మీనారాయణ
ఉప్పలగుప్తం : జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా భీమనపల్లికి చెందిన దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన కార్యవర్గ ఎన్నికలో వీరభద్ర రైస్మిల్ అధినేత లక్ష్మీనారాయణను మరోసారి ఈ పదవి వరించింది. లక్ష్మీనారాయణ స్థానిక జెడ్పీటీసీ సభ్యునిగా కూడా ఉన్నారు. -
రైస్ మిల్లర్ల సేవలు ప్రశంసనీయం
నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట : పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందజేస్తున్న జిల్లా రైస్మిల్లర్ల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పుష్కరాలను పురస్కరించుకుని అమరావతిలోని పుష్కరిణి ఘాట్–1లో జిల్లా రైస్మిల్లర్ల అసోసియేషన్ తరఫున భక్తులకు కల్పిస్తున్న నిత్య అన్నదానం కార్యక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే గోపిరెడ్డి పాల్గొని భక్తులకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ తరపున జిల్లా అధ్యక్షుడు ఊర భాస్కరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గోపిరెడ్డిని సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ పుష్కర స్నానం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చే వారందరి ఆకలి తీర్చే విధంగా మిల్లర్లు చేయూతనివ్వడం ప్రశంసనీయమన్నారు. జిల్లా అధ్యక్షుడు ఊర భాస్కరరావు మాట్లాడుతూ పుష్కరాలు ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతి రోజూ 10 నుంచి 15 వేల మందివరకు అన్నప్రసాదం అందజేస్తున్నామన్నారు. దీనికి సహకరిస్తున్న మిల్లర్లు అందరికీ ఆయన తన కృతజ్ఞతలు చెప్పారు. ఎన్ఈసీ చైర్మన్ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, మిల్లర్లు చలువాది బ్రహ్మయ్య, పి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
రైస్ మిల్లర్లకు వేబిల్లుల నిలిపివేత
నిర్ధేశించిన సమయంలో సీఎంఆర్ ఇవ్వాలి ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ నెల్లూరు(పొగతోట): కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సరఫరా చేయకుండా కాకమ్మ కబుర్లు చెబితే సహించేది లేదని జేసీ ఇంతియాజ్ అహ్మద్ రైస్ మిల్లర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక గోల్డన్జూబ్లీహాలులో సీఎస్డీటీలు, డీటీలు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. సీఎంఆర్ సరఫరా చేయడానికి సమయం కావాలని ఈ సందర్భంగా మిల్లర్లు జేసీని కోరారు. ధాన్యం బస్తాలు మిల్లుల్లో నిల్వ ఉంచితే కోతులు గందరగోళం చేస్తున్నాయని మిల్లర్లు చెప్పడంతో కుంటిసాకులు చెప్పడం మానుకుని సీఎంఆర్ సరఫరా చేయాలని జేసీ సూచించారు. సీఎంఆర్ పూర్తి స్థాయిలో సరఫరా చేసేంత వరకు రైస్ మిల్లులకు వేబిల్లులు కట్ చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 10 నాటికి 90 శాతం, 15న నాటికి 100 శాతం సీఎంఆర్ సరఫరా చేయాలని ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దార్లు వారికి కేటాయించిన రైస్ మిల్లుల్లో నిత్యం పర్యవేక్షిస్తూ ధాన్యం ఆడించి సీఎంఆర్ గోదాములకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. సీఎంఆర్ సరఫరా చేయని రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్ఓ టి.ధర్మారెడ్డి, డీఎం కొండయ్య సీఎస్డీటీలు, డీటీలు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త బేరం!
సుమారు లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ 6.5 లక్షల టన్నుల బియ్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా సేకరించాల్సిన పరిస్థి మిల్లర్ల తీరుపై పౌరసరఫరాల శాఖ గుర్రు వంద శాతం సీఎమ్మార్ రైస్ అందజేసిన మిల్లుల నుంచే బియ్యాన్ని సేకరించేందుకు సిద్ధం పభుత్వ నిర్ణయంతో మింగుడుపడని రైస్మిల్లర్లు బియ్యం కొనాలంటూ లాబీయింగ్ చేస్తున్న జిల్లా రైస్మిల్లర్ల సంఘం నేత కరీంనగర్ : సర్కారు సొమ్మును మిల్లర్లు సోకు చేసుకోవడమంటే ఇదేనేమో! రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసి నిర్దేశిత సమయంలో బియ్యం సరఫరా చేయాల్సిన రైస్మిల్లర్లు నిబంధనలను తోసిరాజేసి తమ వ్యాపారాలకు వాడుకుంటూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో సుమారు లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా నేటికీ రైస్మిల్లర్లే వద్దే ఉండిపోయింది. మిల్లర్ల నుంచి బియ్యం రాకపోవడంతో రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని మళ్లీ కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. తద్వారా ఈ ఏడాది ప్రభుత్వంపై రూ.2వేల కోట్లకుపైగా అదనపు భారం పడబోతోంది. మిల్లర్ల తీరుపై గుర్రుగా ఉన్న పౌరసరఫరాల శాఖ వంద శాతం కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని అందజేసిన మిల్లర్ల నుంచే బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఇది మింగుడు పడని జిల్లాకు చెందిన రైస్మిల్లర్ల సంఘం నేత హైదరాబాద్లో మకాం వేసి తనుకున్న పలుకుబడితో ఆ జీవోను సడలించేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తూ ప్రభుత్వానికి నష్టం చేకూర్చే పనిలో పడ్డారు. అందుకోసం మంత్రితో తనకున్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని పౌరసరఫరాల శాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి 2.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ధాన్యాన్ని మర ఆడించి బియ్యంగా ఇవ్వాలని రైస్మిల్లర్లకు అప్పగించారు. నిబంధనల ప్రకారం 15 నుంచి 45 రోజుల్లోగా కస్టమ్ మిల్లింగ్ చేసి ఇవ్వాల్సి ఉంది. మిల్లింగ్ చేసినందుకు క్వింటాలు దొడ్డు బియ్యానికి రూ.30, ఉప్పుడు బియ్యానికి రూ.50 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. కస్టమ్ మిల్లింగ్ గడువు ముగిసినప్పటికీ నేటికీ పూర్తి స్థాయిలో బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించలేదు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 65 శాతం బియ్యం మాత్రమే పౌరసరఫరాల శాఖకు అప్పగించారు. మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని మిల్లర్ల వద్దే ఉంచుకుంటూ వందల కోట్ల రూపాయల వ్యాపారం నడిపిస్తున్నారు. అధికారులు సీరియస్... నిర్దేశిత గడువులోగా మిల్లింగ్ రైస్ పంపాలంటూ పౌరసరఫరాల శాఖ మొత్తుకున్నా మిల్లర్లు పట్టించుకోకపోవడం లేదు. రైస్మిల్లర్ల నిర్వాకంవల్ల పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యం నిల్వలు పౌరసరఫరాల శాఖ వద్ద లేకపోవడంతో మళ్లీ కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అందులో భాగంగా ఈ సీజన్లో 6లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైస్మిలర్ల నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. కిలో బియ్యం 24 రూపాయల చొప్పున కొనుగోలు చేసి పేదలకు రూపాయికే కిలో బియ్యం చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా రైస్మిల్లర్ల నుంచి సకాలంలో కస్టమ్ మిల్లింగ్ బియ్యం రాకపోవడంవల్లే మళ్లీ బియ్యాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తద్వారా ప్రభుత్వానికి రూ.2040 కోట్లు వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడింది. మిల్లర్ల తీరుతో విసిగిపోయిన పౌరసరఫరాల శాఖ అధికారులు వందశాతం కస్టమ్ మిల్లింగ్ చేసిన మిల్లుల నుంచి మాత్రమే బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. అడ్డుకుంటున్న జిల్లా రైస్మిల్లర్ల సంఘం నేత సరిగ్గా ఇదే సమయంలో జిల్లా రైస్మిల్లర్ల సంఘం నేత రంగప్రవేశం చేశారు. మంత్రికి సన్నిహితుడనని చెప్పుకునే సదరు నేత ఇతర జిల్లాలకు చెందిన మిల్లర్ల సంఘం నేతలను కూడగట్టి హైదరాబాద్లో మకాం వేశారు. ఆ జీవోను సవరించేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. అందుకోసం ఉన్నతస్థాయిలో పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉందంటూ రైస్మిల్లుల యజమానుల నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేసినట్లు తెలిసింది. ఒకవైపు పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులపైన, మరోవైపు మంత్రి పేషీపైన ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మంత్రి ఈటల రాజేందర్ మాత్రం ఈ విషయంలో మిల్లర్ల ఒత్తిడికి తలొగ్గకుండా వందశాతం కస్టమ్ మిల్లింగ్ చేసిన మిల్లర్ల నుంచే బియ్యాన్ని కొనుగోలు చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. -
సంక్షోభంలో రైస్ మిల్లులు
లెవీని పూర్తిగా ఎత్తివేయడంతో ధాన్యం కొనుగోళ్లు బంద్ ♦ 2,500 మిల్లుల్లో ఇప్పటికే 1,500కు పైగా మూత ♦ లక్ష మంది కార్మికులపై ప్రభావం సాక్షి,హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్: రాష్ట్రంలో రైస్ మిల్లులు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. జీరో లెవీ విధానం రైస్ మిల్లర్లు, వాటిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న హమాలీల పాలిట శాపంగా మా రింది. లెవీ(మిల్లర్లు సేకరించిన ధాన్యంలో ఎఫ్సీఐకి తప్పనిసరిగా ఇవ్వాల్సిన వాటా)ని పూర్తిగా ఎత్తివేయడంతో ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లి, మిల్లర్లకు పనిలేకుండా పోయింది. దీంతో ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 1,500 మిల్లులు మూతపడ్డాయి. మరికొన్ని మూత పడేందుకు సిద్ధంగా ఉన్నా యి. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కస్టమ్ మిల్లింగ్ చార్జీలను పెంచితే తప్ప పరిశ్రమ మనుగడ కష్టమేనని మిల్లర్లు అంటున్నారు. ఈ దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చేం దుకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా రైస్మిల్లుల బంద్కు పిలుపునివ్వడంతో పాటు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. జీరో లెవీతో దెబ్బ... రాష్ట్రంలో ఉన్న 2,500 రైస్ మిల్లుల నుంచి 50 లక్షల టన్నుల మేర ధాన్యం సేకరణ జరిగేది. 25 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరిగేది. మొత్తంగా ఒక్కో రైస్మిల్లులో హమాలీలు మొదలు డ్రైవర్లు, క్లీనర్ల వరకు 50 నుంచి 100 మంది వరకు ఉపాధి లభించేది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిల్లుల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షకు మించి ఉంటుందని అధికారవర్గాలే చెబుతున్నాయి. అయితే కనీస మద్దతు ధరను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించిన కేంద్రం.. క్రమంగా లెవీ విధానాన్ని ఎత్తివేసింది. 2014 మార్చి వరకు 75శాతంగా ఉన్న లెవీని గతేడాది 25 శాతానికి తగ్గిం చింది. దీనిని అనేక రాష్ట్రాలు వ్యతిరేకించినా వెనక్కి తగ్గని కేంద్రం.. ఈ ఏడాది నుంచి పూర్తిగా లెవీని ఎత్తివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నాయి. ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు ఇచ్చే కస్టమ్ మిల్లిం గ్ ధరపైనే రైస్ మిల్లులు ఆధారపడాల్సి ఉం టోంది. ఇది గిట్టుబాటు కాకపోవడంతో గతేడాదే 500, ఈ ఏడాది మరో వెయ్యికి పైగా మిల్లులు మూతపడ్డాయి. దక్కని హామీ... ప్రతి సీజన్లో పౌరసరఫరాల శాఖ తాను సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు మిల్లర్లకు అప్పగిస్తుంది. మిల్లర్లు 100 క్వింటాళ్ల ధాన్యానికి పచ్చిబియ్యం (రా రైస్) అయితే 67 క్వింటాళ్లు, ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) అయితే 68 క్వింటాళ్లు పౌరసరఫరాల శాఖకు ఇవ్వాలి. ఇలా మార్చి ఇచ్చినందుకు పచ్చి బియ్యానికి క్వింటాల్కు రూ.15, ఉప్పుడు బియ్యానికి రూ.25 చెల్లిస్తారు. దీనినే కస్టమ్ మిల్లింగ్ అంటారు. ఇలా వచ్చిన బియ్యాన్నే పౌరసరఫరాల శాఖ రేషన్కార్డు దారులకు సరఫరా చేస్తుంది. అయితే వంద క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 61 నుంచి 62 క్వింటాళ్ల వరకు మాత్రమే బియ్యం వస్తోందని మిల్లర్లు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ధారించిన మేరకు ఇవ్వాలంటే తాము మరో నాలుగైదు క్వింటాళ్లు అదనంగా కలపాల్సి వస్తోందని, దీంతో తమకు నష్టం కలుగుతోందని అంటున్నారు. ఈ దృష్ట్యా క్వింటాల్ ధాన్యానికి ఎంత బియ్యం, ఎంత నూక, పొరం, తవుడు వస్తుందన్నది ధాన్యం సేకరణకు ముందే టెస్ట్ మిల్లింగ్ చేసి నిర్ధారించాలని కోరుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక కస్టమ్ మిల్లింగ్ ధరను క్వింటాల్ పచ్చిబియ్యానికి రూ.75, ఉప్పుడు బియ్యానికి రూ. 100కు పెంచాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. లెవీ అంటే..? భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) బియ్యం సేకరణ విధానమే లెవీ. అంటే రైతుల నుంచి మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యంలో ఎఫ్సీఐ కొంత మొత్తాన్ని కచ్చితంగా తీసుకోవడం. ప్రభుత్వం నిర్ధారించిన మేరకు చాలా సంవత్సరాల పాటు ఎఫ్సీఐ 75 శాతం లెవీని అమలు చేసింది. ఆ తరువాత కొద్ది సంవత్సరాల పాటు 50 శాతం, చివరగా గతేడాది 25 శాతం అమలు చేసింది. ఈ ఏడాది పూర్తిగా లెవీ విధానానికి స్వస్తి చెప్పింది. ఈ కారణంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడాన్ని మిల్లర్లు ఆపేశారు. ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పౌరసరఫరాల సంస్థలు చేపట్టాయి. రాష్ట్ర పరిశ్రమలను పట్టించుకోరా? ‘‘రాష్ట్ర ప్రభుత్వం టీఎస్-ఐపాస్ అని, ప్రత్యేక ప్రోత్సాహకాలని విదేశీ పరిశ్రమలకు రెడ్ కార్పెట్ వేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో రైస్మిల్ పరిశ్రమలు మూతపడి లక్షల మంది కార్మికుల ఉపాధి పోతుంటే మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకొని రైస్ మిల్లులను ఆదుకోవాలి.’’ - వ డ్డి మోహన్రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
తెలంగాణ దెబ్బ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ధాన్యం సేకరణకు ‘తెలంగాణ’ దెబ్బ పడింది. జిల్లాలో పండించిన ధాన్యంలో సుమారు 90 శాతం మేరకు ఇప్పటికే తెలంగాణ రాష్ర్టం.. అందులోనూ ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తెలంగాణ మిల్లర్లు అధిక ధరకు కొనుగోలు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. అంతేకాకుండా ఇక్కడి మిల్లర్లు నేరుగా నగదు ఇవ్వకుండా బ్యాంకులోకి జమ చేయాలనేది ప్రభుత్వ నిబంధన. దీంతో ధాన్యం విక్రయించిన సొమ్ము బ్యాంకులోకి పడిన వెంటనే పాత అప్పులకు జమ అవుతోంది. దీంతో నగదు చెల్లిస్తున్న తెలంగాణ మిల్లర్లకే ధాన్యాన్ని విక్రయించేందుకు ఇక్కడి రైతులు మొగ్గుచూపారు. ఫలితంగా లెవీ సేకరణకు జిల్లా మిల్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లెవీ సేకరణ పూర్తికాకపోతే... రూపాయికే కిలో బియ్యంతో పాటు సంక్షేమ హాస్టళ్లకు బియ్యం సరఫరాకు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధిక ధరతో అటే అమ్మకాలు..! జిల్లాలో పండించిన గ్రేడ్ ఏ రకం ధాన్యాన్ని క్వింటాలుకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను రూ. 1400గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి బయటి మార్కెట్లో ఈ ధర కంటే అధికంగా ఉంది. అయితే, తెలంగాణ మిల్లర్లు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఎంఎస్పీ కంటే, బయటి మార్కెట్ ధర కంటే అధిక ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. దీంతో జిల్లాలోని గ్రేడ్ ఏ రకం ధాన్యంలో సుమారు 90 శాతం మేరకు ఇప్పటికే తెలంగాణ మిల్లర్లు కొనుగోలు చేశారు. ఫలితంగా ధాన్యం సేకరణకు జిల్లాలోని రైస్ మిల్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లెవీ కింద ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 25 శాతం కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ధాన్యం సొమ్ము కాస్తా పాత అప్పుకు జమ..! నేరుగా జిల్లాలోని రైస్ మిల్లర్లకు ధాన్యం విక్రయించేందుకు రైతులు మొగ్గుచూపకపోవడానికి మరో ముఖ్యమైన కారణం నగదు చెల్లింపులు లేకపోవడమే. ఇక్కడి మిల్లర్లకు ధాన్యాన్ని విక్రయించాలంటే ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు అకౌంటు నెంబరును రైతులు ఇవ్వాల్సి ఉంది. ధాన్యం కొనుగోలు చేసిన మొత్తాన్ని నేరుగా రైతు బ్యాంకు అకౌంటులోకి జమ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడే రైతులకు కొత్త చిక్కు వచ్చి పడింది. రుణమాఫీ ఇంకా పూర్తి కానందున.. ధాన్యం విక్రయించిన సొమ్ము కాస్తా పాత అప్పులకు బ్యాంకర్లు జమ చేస్తున్నారు. దీంతో బ్యాంకు అకౌంట్లోకి జమ చేస్తున్నందున తాము ధాన్యాన్ని విక్రయించలేమని రైతులు తెగేసి చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం... ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లాలోని మిల్లర్లు నేరుగా చేతికే నగదు ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు.. ఎంఎస్పీ కంటే అధిక ధరకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు స్థానికంగా ధాన్యాన్ని అమ్మేందుకు ససేమిరా అంటున్నారు. ఇప్పటివరకు సేకరించింది వేయి టన్నులే...! రైస్ మిల్లర్లు సేకరించిన మొత్తం ధాన్యంలో 25 శాతం మొత్తాన్ని లెవీ కింద పౌర సరఫరాల శాఖకు మిల్లర్లు అందజేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన మన జిల్లాలోని మిల్లర్లు 18 వేల టన్నుల దాన్యాన్ని సేకరించి ఇక్కడి పౌర సరఫరాల శాఖ అధికారులకు అందజేయాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకు కేవలం 1000 టన్నుల ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు సేకరించారు. ఈ రబీ సీజనులో మరో వేయి టన్నులను మాత్రమే సేకరించే అవకాశం ఉందని మిల్లర్లు అంటున్నారు. అంటే మొత్తం 18 వేల టన్నులకుగానూ కేవలం 2 వేల టన్నులు మాత్రమే లెవీ కింద ఇవ్వనన్నారన్నమాట. అంటే నిర్ణీత లక్ష్యంలో కేవలం 11 శాతం మాత్రమే పూర్తైదన్నమాట. ఈ నేపథ్యంలో రూపాయికే కిలో బియ్యం పథకంతో పాటు సంక్షేమ హాస్టళ్లకు బియ్యం సరఫరాకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘జిల్లాలో మొత్తం లెవీ సేకరించే మిల్లులు 90 ఉన్నాయి. ఒక మిల్లుకు 200 టన్నుల లెవీ సేకరణను లక్ష్యంగా నిర్ణయించారు. అయితే, తెలంగాణ మిల్లర్లు నేరుగా నగదు ఇవ్వడంతో పాటు అధిక ధరకు కొంటుండటంతో వారికే ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు మొగ్గుచూపారు’ అని జిల్లా రైస్మిల్లుల సంఘం అధ్యక్షుడు వెంకట నారాయణ ‘సాక్షి’కి తెలిపారు. -
మిల్లర్లు.. బకాసురులు
కర్నూలు: పేదల బియ్యం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారుతోంది. అధికారుల నిఘా వైఫల్యం రైస్ మిల్లర్లకు వరమవుతోంది. కర్నూలు, ఆదోని కేంద్రంగా ఈ తంతు యథేచ్ఛగా సాగుతోంది. నగరంలోని హనుమాన్ వేబ్రిడ్జి సమీపంలో.. రేడియో స్టేషన్ పక్కన.. బళ్లారి రోడ్డులోని ఎస్ఆర్ఎంటీ వద్ద.. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని రెండు రైస్ మిల్లుల్లో ఈ తరహా వ్యాపారం నిత్యకృత్యం. ఆదోనిలోని పలు మిల్లుల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లా నలుమూలల నుంచి బియ్యాన్ని సేకరించి రైస్ మిల్లుల్లో పాలిష్ చేసి ఆకట్టుకునే ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి కర్ణాటక, మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రంగు మారి తెల్లగా కనిపించేలా మిల్టెక్ అనే యంత్రంతో పాలిష్ చేస్తున్నారు. డీలర్లు, మధ్య దళారులు క్వింటా రూ.1200 నుంచి రూ.1500లకు కొనుగోలు చేస్తూ.. పాలిష్ చేసిన బియ్యాన్ని సన్న బియ్యంలో 20 నుంచి 40 శాతం కలిపి విక్రయిస్తున్నారు. క్వింటా రేషన్ బియ్యం పాలిష్ చేస్తే 20 శాతం తరుగు పోతోంది. జిల్లాలో 11.54 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా 11.5వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పంపిణీ అవుతోంది. ఇందులో సగానికి పైగా అడ్డదారుల్లో రైస్ మిల్లులకు తరలుతోంది. రూపు మార్చుకొని మళ్లీ ఎక్కువ ధరతో వినియోగదారులకు చేరుతోంది. బియ్యం అక్రమ నిల్వలు, రవాణాపై అధికారుల నిఘా కొరవడటంతో రైస్ మిల్లుల యజమానులు తమ దందా నిర్భయంగా సాగిస్తున్నారు. భారీ మొత్తంలో రేషన్ బియ్యం నిల చేసుకుని రాత్రిళ్లు పాలిష్ చేసి తెల్లారేలోగా గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ప్రతి నెలా 5.50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పడుతోందని ఓ జిల్లా అధికారే స్వయంగా చెప్పడం ఈ దందా ఏ స్థాయిలో సాగుతుందో తెలియజేస్తోంది. రైస్ మిల్లులను తరచూ పౌర సరఫరాల శాఖ, ఆర్డీఓ స్థాయి అధికారులు తనిఖీ చేయాల్సి ఉంది. పేదలకు అందాల్సిన సబ్సిడీ బియ్యాన్ని అడ్డగోలుగా సేకరిస్తూ రైస్ మిల్లర్లు విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ మామూళ్లకు అలవడిన అధికారులు కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. కర్నూలు నగరంలోనే కనీసం 50 మందికి పైగా మధ్య దళారులు డీలర్లు, కార్డుదారుల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు చేరవేస్తున్నారు. జిల్లాలో 17 బియ్యం గోదాములు ఉండగా.. ప్రతి నెలా మొదటి వారంలో ఆయా గోదాముల వద్ద బియ్యం వ్యాపారులు తిష్ట వేసి గోడౌన్ ఇన్చార్జీలతో చేతులు కలిపి తమ పబ్బం గడుపుకుంటున్నారు. కేసులు నీరుగారుస్తున్న అధికారులు పౌర సరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. నెలలో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే కార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేసి దుకాణాలను మూసేస్తున్నా ఇదేమని ప్రశ్నించని పరిస్థితి. అడపాదడపా మొక్కుబడి దాడులు చేస్తున్నా.. పీడీ యాక్టు అమలు చేయాల్సిన కేసులనూ 6ఏ తరహా సాధారణ కేసులు నమోదు చేసి ఆ తర్వాత నీరుగారుస్తున్నారు. వాహన డ్రైవర్లతో తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించి కేసులను తప్పుదోవ పట్టిస్తున్నారు. 2013 జులై నుంచి 2014 జులై వరకు 100 పైగా 6ఏ కేసులు నమోదు చేసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. గత నాలుగు నెలల్లో అక్రమ తరలింపు ఇలా... యాగంటిపల్లె వద్ద 500 క్వింటాళ్ల బియ్యం.. ప్యాపిలి వద్ద 223 క్వింటాళ్లు.. బనగానపల్లెలో 225 క్వింటాళ్ల.. అనంతపురంలో లారీ బియ్యం.. ఇదంతా గత నాలుగు నెలల్లో బనగానపల్లె పట్టణానికి చెందిన ఓ రైస్ మిల్లర్ కర్ణాటక రాష్ట్రంలోని బాచేపల్లికి తరలిస్తుండగా పట్టుబడింది. గత అక్టోబర్ రెండో వారంలో కర్నూలులోని పాతబస్తీకి చెందిన డీలర్ 20 క్వింటాళ్ల బియ్యం ఆటోలో తరలిస్తుండగా సీపీఎం కార్యకర్తలు పట్టుకుని అధికారులకు అప్పగించారు. అదే నెల 9న కోడుమూరులోని చౌరెడ్డి కాంప్లెక్స్ గోడౌన్లో నిల్వ ఉంచిన 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 15న కర్నూలు నగరం బుధవారపేటలో ఓ డీలర్ 30 క్వింటాళ్ల బియ్యాన్ని ఆటోలో తరలిస్తుండగా ఏఐవైఎఫ్ కార్యకర్తలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించారు. 17న నందికొట్కూరు నుంచి కర్నూలుకు లారీలో తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని లెక్చరర్స్ కాలనీ వద్ద అర్ధరాత్రి గస్తీ విధుల్లోని పోలీసులు పట్టుకున్నారు. -
సన్నాలకు రెక్కలు
నల్లగొండ :సన్న బియ్యం (బీపీటీ) ధరలకు రెక్కలొచ్చాయి. వాటిని సామాన్యులు తినే పరిస్థితి లేకుండా పోయింది. నెల రోజుల క్రితం పాత బియ్యం క్వింటా రూ.3800, కొత్త బియ్యం రూ.3400లకు విక్రయించారు. కానీ ప్రస్తుతం పాత బియ్యాన్ని రూ.4000 నుంచి రూ.4200 వరకు అమ్ముతుం డగా, కొత్త బియ్యం క్వింటా రూ.3600లకు విక్రయిస్తున్నారు. బియ్యం ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం రైస్మిల్లర్ల సహకారంతో జిల్లాలో రూ.30 కిలోబియ్యం కేంద్రాలు ఏర్పాటు చేసినా ఎలాంటి ఫలితం రాలేదు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటల సాగువిస్తీర్ణం భారీగా తగ్గింది. ఇది మిల్లర్లకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో సుమారుగా ఐదు లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. దీంతో బీపీటీ ధాన్యం భారీగా వచ్చింది. అయినప్పటికీ దోమపోటు వల్ల రైతులు తమవద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తిగా మిల్లర్లకు విక్రయించారు. ప్రస్తుత ఖరీఫ్లో కేవలం లక్ష ఎకరాల్లో మాత్రమే వరిసాగు అయ్యింది. దీంతో రాబోయే రోజుల్లో బియ్యానికి మరింత డిమాండ్ ఉండే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఇప్పటినుంచే మిల్లర్లు బియ్యం ధరలు పెంచుతున్నట్టు తెలుస్తోంది. మిల్లుల్లో భారీగా ధాన్యం నిల్వలు జిల్లాలోని పలుమిల్లుల్లో బీపీటీ ధాన్యం నిల్వలు భారీగా ఉన్నాయి. గత ఖరీఫ్ సీజన్లో రైతులనుంచి మిల్లర్లు క్వింటా బీపీటీ ధాన్యం రూ.1600 నుంచి రూ.1700 వరకు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు భారీగా నిల్వ చేసుకున్నారు. అప్పుడు ధర కూడా అంతంతమాత్రంగానే ఉంది. పచ్చిబియ్యం కేవలం హైదరాబాద్కు మినహా ఇతర రాష్ట్రాల్లో విక్రయించుకోవడానికి కూడా పర్మిట్లు లేకపోవడంతో స్థానికంగానే విక్రయిస్తున్నారు. అయినా మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చకుండా నిల్వపెట్టుకుంటున్నారు. ఒక్కో రైస్మిల్లులో లక్ష క్వింటాళ్లకు పైగా ధాన్యం నిల్వలు ఉన్నాయి. రైతుల చేతినుంచి పూర్తిగా మిల్లర్ల చేతిలోకి బీపీటీ ధాన్యం వెళ్లిన తర్వాత ప్రస్తుతం క్వింటా బీటీపీ ధాన్యం రూ.2200 ధర పలుకుతోంది. ఫలితమివ్వని కిలో రూ.30బియ్యం విక్రయ కేంద్రాలు సన్నబియ్యం ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం రైస్మిల్లర్ల సహకారంతో జిల్లాలో ఏర్పాటు చేసిన రూ.30 కిలో బియ్యం కేంద్రాలతో ఎలాంటిఫలితం రాలేదు. సన్నబియ్యం విక్రయ కేంద్రాలలో బియ్యం కొనుగోలు చేయడానికి వినియోగదారులు ముందుకు రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాలలో ఇప్పటి వరకు 2169 క్వింటాళ్ల బియ్యం మాత్రమే విక్రయించారు. రూ. 30 కిలో బియ్యం కేంద్రాలలో బియ్యం నాణ్యతగా ఉండడం లేవని వినియోగదారులు కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు.దీంతో చాలావరకు మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీపీటీ బియ్యం ధరలు ఏమాత్రమూ తగ్గడంలేదు. -
మిల్లింగ్ ‘కష్టం’
తాడేపల్లిగూడెం : బియ్యం సేకరణపై నెలకొన్న సందిగ్ధత వీడింది. లెవీ పేరిట ప్రభుత్వం సేకరిస్తున్న బియ్యూనికి సంబంధించి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎఫ్సీఐ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ముగిసేలోగా దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. పౌర సరఫరాల వ్యవస్థ (పీడీఎస్) అవసరాల కోసం సేకరించే బియ్యూన్ని ఇకపై ఎఫ్సీఐ నుంచి కాకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకునే విధంగా నూతన లెవీ విధానం ఖరారైంది. రేషన్ కార్డులు, విపత్తుల సందర్భంలో ప్రజలకు సరఫరా చేసేందుకు అవసరమైన బియ్యూన్ని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐపైనే ఆధారపడింది. పాత పద్ధతిలో రైస్మిల్లర్లు రైతులనుంచి ధాన్యాన్ని సేకరించేవారు. ఆ మొత్తం ధాన్యాన్ని ఆడగా వచ్చిన బియ్యంలో 75శాతాన్ని ఎఫ్సీఐకి లెవీ రూపంలో విక్రయిం చేవారు. మిగిలిన 25శాతం బియ్యూన్ని బహిరంగ మార్కెట్లో విక్రరుుం చుకోవడం లేదా ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు. నూతన లెవీ విధా నం ద్వారా ప్రభుత్వం ఆ పద్ధతికి స్వస్తి పలకబోతోంది. ఇకపై రైతుల నుంచి 75 శాతం ధాన్యం కొనే బాధ్యతను ఇకపై రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ చేపడతారుు. ఇందుకోసం ఐకేపీ గ్రూపులు, వ్యవసాయ శాఖ, మరీ అవసరమైతే ఎఫ్సీఐ రంగంలోకి దిగుతాయి. సేకరించిన ధాన్యాన్ని మిల్లుల్లో ఆడిస్తారు. బియ్యం ఆడినందుకు క్వింటాల్కు ఇంత అని మిల్లర్లకు ప్రభుత్వం చెల్లిస్తుంది. పౌర సరఫరాల వ్యవస్థ అవసరాలకు సరిపోగా మిగిలిన బియ్యూన్ని ఇతర ప్రాంతాలకు చేరేవేసే బాధ్యతను ప్రభుత్వమే చూస్తుంది. ఈ విధానం పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అమలవుతోంది. మిల్లర్ల పాత్ర ఇక పరిమితమే ఇప్పటివరకూ ధాన్యం సేకరించి.. బియ్యం ఆడించే పని మిల్లర్ల ద్వారానే సాగుతోంది. కొత్త లెవీ విధానం అమల్లోకి వస్తే మిల్లర్ల పాత్ర పరిమితమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ పాత్ర పెరుగుతుంది. రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ కలిసి మొత్తం పంటలో 75శాతం ధాన్నాన్ని రైతుల నుంచి నేరుగా కొనాలి. మిగిలిన 25 శాతం ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు కొనుగోలు చేయూల్సి ఉంటుంది. ధాన్యం సేకరణ బాధ్యత నుంచి తాము తప్పుకుంటే రైతులకు ఇబ్బందులు తప్పవనే వాదనలు మిల్లర్ల నుంచి వినిపిస్తున్నారుు. రైతులకు చెల్లింపుల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని ఆ వర్గాలు పేర్కొంటున్నారుు. ఈ దృష్ట్యా 50 శాతం మిల్లర్లు, 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం సేకరించేలా అనుమతించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాసినట్టు చెబుతున్నారు. అక్టోబర్ 1నుంచి కొత్త ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ మొదలు కానుండగా, ఆలోగా కేంద్రం స్పందిస్తే మిల్లర్లు, ప్రభుత్వం 50 : 50 దామాషాలో ధాన్యాన్ని సేకరించే అవకాశం ఉంటుందని, లేదంటే 75 : 25 శాతం దామాషాలో ధాన్యం సేకరణ ఉంటుందని చెబుతున్నారు. అంటే 75 శాతం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ సేకరిస్తే మిగిలిన 25 శాతం ధాన్యాన్ని మిల్లర్లు సేకరించుకునే వెసులుబాటు ఇస్తారు. -
సుక్కలు చూపిస్తున్న సన్నాలు
మెదక్: సన్న బియ్యం ధరలు సుక్కలనంటుతున్నాయి. క్వింటాలుకు రూ.4,300 నుంచి 4,500 వరకు ధర పలుకుతున్నాయి. రైస్ మిల్లర్లంతా ఎఫ్సీఐ, లెవీల కోసం దొడ్డు వడ్లను మరాడిస్తుండటం, ఉన్న సన్న బియ్యాన్ని అక్రమంగా నిలువ ఉంచడంతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. జిల్లాలో రైతులు దొడ్డు రకం వరి పండించడానికే ఆసక్తి చూపుతుంటారు. సుమారు 15,000 హెక్టార్లలో సన్న వడ్లు సాగు చేస్తారు. తద్వారా7.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం పండుతోంది. చాలామంది రైతులు చెరువులు, కుంటలు, కాలువలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. దీంతో సమయానికి నీరు అందదనే ఉద్దేశంతో దొడ్డు రకాన్ని సాగుచేస్తుంటారు. అయితే బోరు నీటి సదుపాయం ఉన్న చోట మాత్రం సన్న రకం సాగుచేస్తున్నారు. గతేడాది కూడా చాలా తక్కువ విస్తీర్ణంలో పంట వేశారు. దీంతో కోదాడ, నర్సారావుపేట, మిర్యాలగూడ, నల్గొండ, తదితర జిల్లాల నుంచి సన్న రకం ధాన్యం కొనుగోలు చేసి, స్థానిక మిల్లులో మర ఆడించి బియ్యం విక్రయిస్తుంటారు. రాను రాను జిల్లాలో సన్న బియ్యానికి డిమాండ్ ఏర్పడుతోంది. ప్రస్తుతం మిల్లర్లంతా దొడ్డు రకంపైనే దృష్టి పెట్టారు. దీంతో మొన్నటివరకు రూ 3,800 నుంచి 4,000 పలికిన సన్న బియ్యం.. ఇప్పుడు రూ. 4,300 నుంచి రూ. 4,500 వరకు విక్రయిస్తున్నారు. అయితే కొంతమంది మిల్లర్లు ధాన్యం అక్రమ నిల్వలకు పాల్పడుతున్నందువల్లే ధరలు పెరిగాయని అంటున్నారు. పౌరసరఫరాల శాఖ పట్టించుకోకపోవడం వల్ల ధరలు పెరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. దరలు ఇష్టారీతిన పెరుగుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులైతే పెరుగుతున్న బియ్యం రేట్లను చూసి ఆందోళనకు లోనవుతున్నారు. యేడాదికి రెండుసార్లు పెరిగిన డీఏలు బియ్యం కొనుగోళ్ళకే సరిపోతున్నాయంటున్నారు. అలాగే ఈసారి అకాల వర్షాల వల్ల దొడ్డు ధాన్యం కూడా తడిసిందని దీంతో దొడ్డు బియ్యం ధరలు కూడా పెరిగాయని తెలుస్తోంది. ఈ రకం బియ్యం గతంలోనే క్వింటాలుకు రూ 2,200 నుంచి రూ 2,600కు పెరిగాయని రైతులు చెపుతున్నారు. అయితే గ్రామాల్లో కొంతమంది చిరు వ్యాపారులు తెలుపు రంగు రేషన్ కార్డులను లబ్ధిదారుల నుంచి తనఖా పెట్టుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. వడ్డీ లేకుండా రూ. 5,000 వరకు రుణాలిచ్చి, వడ్డీకి బదులుగా వారి రేషన్ కార్డులపై వచ్చే సబ్సిడీ బియ్యాన్ని తీసుకొని మిల్లర్లకు అమ్ముకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఇవే బియ్యాన్ని మిల్లర్లు తిరిగి ఎఫ్సీఐకి విక్రయిసున్నట్లు తెలుస్తోంది. -
రైస్మిల్లర్లకు షోకాజ్ నోటీసులు
కలెక్టరేట్, న్యూస్లైన్ : జిల్లాలో 26మంది రైస్మిల్లర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. 2012-13 సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రభుత్వం ఐకేపీ ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఆ ధాన్యాన్ని రైస్మిల్లర్లకు అప్పగించింది. మిల్లింగ్ చేసేందుకు చార్జీలు చెల్లిస్తోంది. మిల్లింగ్ చేసిన అనంతరం రైస్మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను ఎఫ్సీఐకి డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రైస్మిల్లర్లు ఎఫ్సీఐకి బియ్యం అప్పగించలేదు. దీంతో సంబంధిత రైస్మిల్లర్లకు జాయింట్ కలెక్టర్ సుజాతశర్మ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రైస్మిల్లర్ల వద్ద 14,365 మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని సేకరించిన ఐదుగురు మిల్లర్లు, రబీ సీజన్లో సేకరించిన 21మంది రైస్మిల్లర్లకు నోటీసులు జారీ అయ్యాయి. బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించాలని, లేనిపక్షంలో రెవన్యూ రికవరీ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసిన 15 రోజుల్లోగా సీఎంఆర్ రైస్ను ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. 2013-14 ఖరీఫ్ సీజన్లో రైతుల వద్ద ఐకేపీ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వరి ధాన్యాన్ని నోటీసులు జారీ అయిన రైస్మిల్లర్లకు ఇవ్వడం లేదని, కొత్త మిల్లర్లు, గత ఏడాది పూర్తి బియ్యాన్ని అప్పగించిన రైస్మిల్లర్లకు మాత్రమే ఈ ఏడాది ధాన్యం ఇస్తున్నామని డీఎస్వో వసంత్రావ్ దేశ్పాండే తెలిపారు. -
మిల్లర్ల గుప్పిట్లో సర్కారు బియ్యం
సాక్షి, నిజామాబాద్ : కస్టం మిల్లింగ్ కోసం ప్రభుత్వం ఇచ్చి న ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని నిర్ణీత సమయంలో ఎఫ్సీఐకి సరఫరా చేయడంలో మిల్లర్లు తీవ్ర జాప్యం చేస్తున్నా రు. లక్షల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని తమ వ్యాపార అవసరాల కోసం వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరాకు ప్రభుత్వం ఇచ్చిన గడువు సెప్టెంబరుతో ముగిసినప్పటికీ మిల్లర్లు స్పందించడం లేదు. ఇంకా సుమారు 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తమ వద్దే ఉంచుకున్నారు. ఒక్కో టన్ను బియ్యం విలు వ సుమారు రూ. 23 వేలు ఉంటుంది. ఈ లెక్కన మిల్లర్ల వద్ద ఉన్న బియ్యం విలువ సుమారు రూ.25 కోట్లకు పైగానే ఉంటుం దని అంచనా. జాప్యం వెనుక ఆంతర్యం రైతుల ధాన్యానికి మద్దతు ధర అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏటా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తుంది. ఇలా సేకరించిన ధాన్యాన్ని జిల్లాలో ఉన్న రైసుమిల్లులలో బియ్యంగా మార్చి ఎఫ్సీఐ (భారత ఆహార సంస్థ)కి అప్పగిస్తుంది. ఇలా ధాన్యాన్ని ఆడించినందుకు మిల్లర్లకు క్వింటాలుకు రూ. 15 నుంచి రూ. 25 వరకు మిల్లింగ్ చార్జీలు చెల్లిస్తుంది. దీనితోపాటుగా నిర్వహణ వ్యయం నిమిత్తం స్టోరేజీ చార్జీలు కూడా ఇస్తుంది. ఇలా అన్నీ కలిపి లక్షల రూపాయల చార్జీలను చెల్లిస్తుంది. నిబంధనల ప్రకారం మిల్లర్లు తీసుకున్న ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని 15 రోజులలో ఎఫ్సీఐకి అప్పగించాలి. కానీ మిల్లర్లు నెలల తరబడి జాప్యం చేస్తుండడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇదీ పరిస్థితి 2012 సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో సేకరించిన ధాన్యంలో 37,962 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ నిమిత్తం 52 మిల్లులకు కేటాయించారు. ఇందుకుగాను మిల్లర్లు 25,602 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సీఐకి ఇవ్వాలి. కానీ మిల్లర్లు 18,759 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. మళ్లీ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా మిల్లరు 6,843 మెట్రిక్ టన్నుల బియ్యం తమ వద్దే ఉంచుకున్నారు. రబీ సీజను రబీ కొనుగోలు సీజన్కు సంబంధించి 17,012 మెట్రిక్ టన్నుల ధాన్యం కస్టం మిల్లింగ్ చేసి 11,568 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సీఐకి ఇవ్వాలి. కానీ కేవలం 7,341 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. ఇంకా 4,227 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వడంలో సుమారు 20 మంది మిల్లర్లు నెలల తరబడి జాప్యం చేస్తున్నారు. అంటే ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి మొత్తం 11,070 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిపడ్డారు. ఈ కస్టం మిల్లింగ్ను పర్యవేక్షించాల్సిన పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ వ్యవహారాన్ని ‘మామూలు’గా తీసుకోవడంతో మిల్లర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మిల్లర్లకు నోటీసులు ఇచ్చాం : శ్రీనివాస్, ఏజీపీఓ కస్టం మిల్లింగ్ బియ్యం బకాయి పడిన రైసుమిల్లర్లపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సివిల్సప్లయ్ కార్పొరేషన్ నుంచి నోటీసులు వెళ్లాయి. 15 రోజుల్లో పూర్తి స్థాయిలో బియ్యం రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టాం. ప్రభుత్వం డిసెంబర్ నెలాఖరు వరకు గడువిచ్చింది. తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
మిల్లర్లకు సర్కారు దాసోహం!
సాక్షి, హైదరాబాద్: బియ్యం మిల్లర్లకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం, తద్వారా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలోని మిల్లర్లు ఇతర రాష్ట్రాల్లో విక్రయించే బియ్యంపై వసూలు చేసే రెండు శాతం కేంద్ర అమ్మకపు పన్ను (సీఎస్టీ)ను రద్దు చే సే యోచనలో ఉంది. ఈ మేరకు ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేయగా.. పౌరసరఫరాల శాఖ సంబంధిత ఫైలును ఆర్థిక శాఖ పరిశీలనకు పంపింది. ఆర్థిక శాఖ పరిశీలన పూర్తి కాగానే ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఆమోద ముద్ర వేసేందుకు రంగం సిద్ధమైందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకటనతో సీమాంధ్రలో ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తుంటే.. సందట్లో సడేమియాలా ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు పెద్ద ఎత్తున లబ్ది చేకూర్చే నిర్ణయాలకు సిద్ధమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకు కూడా ప్రయోజనం చేకూర్చడమే ఇలాంటి నిర్ణయాల పరమార్థమని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మన రాష్ట్ర మిల్లర్లు ఇతర రాష్ట్రాల్లో బియ్యం విక్రయించాలంటే వాణిజ్య పన్నుల శాఖకు రెండు శాతం సీఎస్టీ చెల్లించి విక్రయించే బియ్యం పరిమాణం ఎంతో తెలిపే ‘సి’ ఫార్మ్ పొందాలి. అయితే ఈ విధంగా సీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని, అలాగే ‘సి’ ఫార్మ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేసింది! కేవలం లారీ, రైల్వే, ట్రక్కు లోడింగ్ సర్టిఫికెట్లు సరిపోతాయని పేర్కొంది. అంటే మిల్లర్లు తమ ఇష్టానుసారం ఇతర రాష్ట్రాల్లో బియ్యం విక్రయించుకునేందుకు వీలుగా మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేసిందన్నమాట. 2011 జనవరి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు అంటే 2014 మార్చి వరకు ఈ వెసులుబాటు కల్పించాలని కూడా ఉప సంఘం సూచించింది. ఈ సిఫారసు అమలైతే రాష్ట్ర ఖజానాకు రూ.327 కోట్ల నష్టం వాటిల్లుతుంది. అంటే ఆ మేరకు మిల్లర్లకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. గతంలోనూ సీఎస్టీ రద్దు చేసిన సీఎం! 2007 ఏప్రిల్ నుంచి 2010 డిసెంబర్ వరకు ఇతర రాష్ట్రాల్లో మిల్లర్లు విక్రయించిన బియ్యంపై సీఎస్టీని రద్దు చేస్తూ 2011లో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఉప సంఘం పేర్కొంది. అదే తరహాలో ఇప్పుడు కూడా సీఎస్టీని రద్దు చేయాలని సూచించింది. గతంలో ఆర్థిక శాఖ ఆమోదం లేకుండానే కనీసం ఫైలు కూడా ఆర్థిక శాఖకు వెళ్లకుండానే సీఎం నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ నిర్ణయం వల్ల ఖజానాకు రూ.52 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ రూ. 52 కోట్ల సీఎస్టీ రద్దుకు సంబంధించి రెవెన్యూ శాఖ అంతర్గతంగా మెమో జారీ చేసి సరిపుచ్చింది. అయితే ఆ మెమోలో ‘సి’ ఫార్మ్ మినహాయింపు, సీఎస్టీ రద్దు 2010 డిసెంబర్ వరకే పరిమితమని, 2011 జనవరి నుంచి సీఎస్టీ చెల్లించాలని, ‘సి’ ఫార్మ్ తప్పనిసరని అప్పటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు. అయితే 2011 తర్వాత కూడా సీఎస్టీ రద్దుకు తాజాగా మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేసింది. -
లెవీకి ఎగనామం!
ఎఫ్సీఐకి మొండిచేయి చూపిన మిల్లర్లు బహిరంగ మార్కెట్కు బియ్యం తరలింపు అడ్డదారిలో సొమ్ముచేసుకున్న వైనం లక్ష్యాన్ని మరచి పౌర సరఫరాల శాఖ వత్తాసు సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైస్ మిల్లర్లు మాయ చేశారు. పంట దిగుబడి రాలేదని బుకాయించి లెవీ కింద భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)కు ఇవ్వాల్సిన ధాన్యాన్ని ప్రైవేటుకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అయితే మిల్లర్లు చెప్పిన కుంటిసాకులకు జిల్లా పౌర సరఫరాల శాఖ యంత్రాంగం కూడా తలూపింది. దీంతో ఎఫ్సీఐకి భారీ నష్టం వాటిల్లడమే కాకుండా లెవీ సేకరణ లక్ష్యం నీరుగారిపోయింది. రైస్ మిల్లర్లు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మరపట్టించిన తర్వాత వచ్చే బియ్యంలో 75శాతం ప్రభుత్వానికి లెవీ కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్న బియ్యం తిరిగి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సరఫరా అవుతుంది. ఇందులో భాగంగా జిల్లాలో 104 రైస్మిల్లుల పరిధిలో గతేడాదికి సంబంధించి 85వేల టన్నుల బియ్యం ఎఫ్సీఐకి లెవీ రూపంలో ఇవ్వాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించింది. సెప్టెంబర్ 30వతేదీ నాటికి ఈ బియ్యం ఎఫ్సీఐకి అప్పగించాలని సూచించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బియ్యం సేకరణ ప్రారంభించిన సదరు శాఖ లక్ష్యాన్ని చేరలేకపోయింది. గడువు ముగిసే నాటికి కేవలం 46,396 టన్నుల బియ్యం మాత్రమే ఎఫ్సీఐకి చేర్చగలిగింది. బయటి ధర అధికం.. అందుకే.. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో బియ్యం ధర కనిష్టంగా రూ.32 వరకు ఉంది. అయితే ప్రభుత్వానికి లెవీ రూపంలో ఇచ్చే బియ్యం ధరలు పరిశీలిస్తే 2012-13 సంవత్సరం లెక్కల ప్రకారం సాధారణ రకం క్వింటాలుకు రూ.2,082, ఉప్పుడు (బాయిల్డ్) బియ్యం రూ.2,114గా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎఫ్సీఐకి ఇస్తే ఏం లాభమని భావించిన మిల్లర్లు పెద్ద ఎత్తున బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంట దిగుబడులు తగ్గినందునే... ఈ ఏడాది జిల్లాలో పంట దిగుబడులు తగ్గినందునే ధాన్యం ఉత్పత్తులు తక్కువగా వచ్చాయి. అందువల్లే ప్రభుత్వం విధించిన లెవీ లక్ష్యం సాధించలేకపోయాం. మొత్తంగా ఈ ఏడాది లెవీ కింద రావాల్సిన బియ్యం కోటాలో 38,604 టన్నుల బియ్యానికి కోత పడింది. - నర్సింహారెడ్డి, డీఎస్ఓ సీఎంఆర్ లక్ష్యం పూర్తి.. జిల్లాలో గతేడాది రబీ సీజన్లో మహిళా సంఘాలు, డీసీఎంఎస్, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 3,052 మెట్రిక్ టన్నుల (సీఎంఆర్..కస్టమైజ్డ్ మిల్లింగ్ రైస్) బియ్యాన్ని జిల్లా యంత్రాంగం కొనుగోలు చేసింది. వీటిని మిల్లింగ్కు గాను 10 రైస్ మిల్లులకు పంపారు. గతనెల 30 నాటితో మిల్లింగ్చేసి ఎఫ్సీఐకి చేరవేయాల్సి ఉంది. జిల్లా పౌరసరఫరాల సంస్థ ఆయా మిల్లుల నుంచి మొత్తం 2,123 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించింది. నిర్దేశించిన లక్ష్యాన్ని వందశాతం చేరుకున్నాం. -ప్రభు, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ -
ఆసక్తి రేపుతున్న రైస్ మిల్లర్ల ఎన్నికలు
శ్రీకాకుళం, న్యూస్లైన్: జిల్లా రైస్ మిల్లర్ల సంఘం ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మిల్లర్లు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ ఎన్నిక ఈసారి కూడా ఏకగ్రీవమవుతుందా? ఎన్నిక అనివార్యమవుతుందా?? అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం తేల్చేందుకు ఆదివారం సంఘం సర్వసభ్య సమావేశం స్థానిక రైస్మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో జరగనుంది. ప్రతి ఏటా సంఘ సమావేశం జరగడం పరిపాటే అయినప్పటికీ త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండేళ్లకోసారి సంఘ ఎన్నికలు జరుగుతాయి. ఈ సంఘం ఏర్పడిన తర్వాత గత 26 ఏళ్లలో మూడుసార్లు మాత్రమే ఎన్నిక అనివార్యమైంది. మిగిలిన అన్నిసార్లు ఏకగ్రీవ ఎన్నికే జరి గింది. ఈసారి మాత్రం ఎన్నికలు తప్పేట్లు లేదు. వరుసగా మూడోసారి అధ్యక్షునిగా వ్యహరిస్తున్న తంగుడు జోగారావు మరోసారి ఆ పదవిని తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఆయన సోదరుడు తంగుడు గిరిధరుడు కూడా ఈసారి పోటీ పడుతున్నారు. అధ్యక్షునిగా ఎన్నికవ్వాలంటే ముందు సం ఘంలో ఓటరుగా నమోదు కావాలి. ప్రస్తుతం జోగారావు ఓటరుగా ఉండగా, ఆయన స్థానంలో గిరిధరుడు ఓటరుగా నమోదు కావాల్సి ఉంటుంది. మిల్లు భాగస్వాములందరూ సమావేశమై ఓటు హక్కు కల్పిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానిస్తేనే అది సాధ్యమవుతుంది. అయితే జోగారావు కూడా మరోసారి అధ్యక్ష పదవిని ఆశిస్తున్నందున ఓటరుగా వైదొలగి గిరిధరుడికి అవకాశం కల్పించే పరిస్థితి లేదు. జోగారావు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అనుచరుడు కాగా, ఆయన సోదరుడు గిరిధరుడు వైఎస్సార్ సీపీ నాయకుడు, నరసన్నపేట శాసనసభ్యుడు ధర్మాన కృస్ణదాస్ అనుచరుడు కావడంతో రాజకీయంగానూ ఈ ఎన్నిక ప్రాధాన్యం సంతరించుకుంది. వీరిద్దరితోపాటు శ్రీకాకుళం రూరల్ మండలం వప్పంగి గ్రామానికి చెందిన వాసు కూడా రేసులో ఉన్నారు. గత పదిహేనుళ్లుగా సంఘం ట్రెజరర్గా పనిచేస్తున్న ఆయనకు మిల్లర్లలో మంచి పేరుంది. ఇతర జిల్లా నుంచి వలస వచ్చినప్పటికీ ఇక్కడే స్థిరపడి మిల్లరుగా మంచిపేరు తెచ్చుకున్నారు. ఎన్నిక అనివార్యమయ్యే పక్షంలో పోటీ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. రాజీ యత్నాలు ఫలించేనా? కాగా మిల్లర్ల ఎన్నికలకు ముందు ప్రతిసారీ నరసన్నపేట శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాస్, దివంగత ఎర్రన్నాయుడు సోదరుడు హరివరప్రసాద్లు మిల్లర్లతో చర్చలు జరిపి ఎన్నికను ఏకగ్రీవం చేస్తున్నారు. అందువల్లే వీరిద్దరిని సంఘం గౌరవాధ్యక్షులుగా నియమిస్తున్నారు. ఆదివారం జరగనున్న సమావేశానికి కూడా వీరిద్దరూ హాజరుకానున్నారు. అయితే ఈసారి ఏకాభిప్రాయం కుదిరే పరిస్థితి కనిపించడంలేదు. వాసు, గిరిధరుడు, జోగారావులు ముగ్గురు పట్టుదలతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు పాలకొండ, టెక్కలి డివిజన్లకు చెందిన మిల్లర్లు కూడా ఈసారి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటివరకు శ్రీకాకుళం డివిజన్కు చెందినవారే అధ్యక్షులుగా వ్యవ హరించారని, దీనివల్ల తమకు గుర్తింపు లేకుండా పోతోందన్నది వారి ఆవేదన. ఈసారి ఎన్నిక ఏకగ్రీవం కాని పక్షంలో తమలో ఒకరిని పోటీకి పెట్టాలని యోచిస్తున్నారు. ఆ రెండు డివిజన్ల మిల్లర్లు కొద్ది రోజుల క్రితం సమావేశమై పరస్పర సహకారానికి తీర్మానించుకున్నట్లు సమాచారం. ఇంత ప్రాముఖ్యత ఎందుకంటే.. మిల్లర్ల ఎన్నికకు ఇంతటి ప్రాముఖ్యత ఏర్పడటానికి సంఘానికి ఉన్న ఆస్తులు, ఆదాయం, నిధులే కారణమని అంటున్నారు. శ్రీకాకుళంలోని కల్యాణ మండపం అద్దెలతోపాటు ఇప్పటికే ఉన్న పది టన్నుల సామర్థ్యం కలిగిన గొడౌన్ల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోంది. అలాగే మిల్లర్లు సంఘం ద్వారానే లెవీ పర్మిట్ పొందాల్సి వస్తోంది. ఈ రూపంలో కూడా పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోంది. సంఘం పేరిట పెద్ద మొత్తంలో నిధులు ఉండటం, లెవీ సేకరణ సమయంలో సంఘం అధ్యక్షుడికి కొంత ప్రాధాన్యతను ఇవ్వడం వంటి అంశాలు ఆ పదవిపై మోజు, డిమాండ్ పెంచాయి. పలువురు ఈ పదవిపై గురి పెట్టిన తరుణంలో ఆదివారం నాటి సమావేశం కూడా వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. -
గింజగింజకూ అక్రమాలే..
కస్టమ్ మిల్లింగ్ బియ్యం ప్రత్యేక పర్మిట్ల అక్రమాల్లో డొంక కదులుతోంది. అర్హులైన రైస్ మిల్లర్లతో సంబంధం లేకుండా ఇతరులకు బదిలీ అయిన ప్రత్యేక పర్మిట్ల బాధితులు 12 మంది కాదని, 31 మంది ఉన్నారని పౌర సరఫరాల శాఖ అధికారులే చెబుతున్నారు. మిలర్ల అంగీకారం లేకుండా రైస్మిలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడి సంతకంతో వచ్చిన దరఖాస్తులను జిల్లా సరఫరా అధికారి బదిలీ చేసిన కారణంగా 12 మంది మిల్లర్లు కలిపి ఏకంగా కోటి రూపాయలు నష్టపోయినట్లు చెబుతుండగా... ఇప్పుడు ఈ విలువ రెండున్నర కోట్లకు పైమాటే అని తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : బాధితులు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుండగా బయటకు రాకుండా రైస్ మిలర్ల సంఘం బాధ్యులు వారిపై ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. నష్టపోయిన వారు పేర్లు వెల్లడించి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే పౌర సరఫరాల అధికారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇదే జరిగితే ఫిర్యాదు చేసిన వారు వ్యాపారపరంగా భవిష్యత్తులో నష్టపోవాల్సి వస్తుందని సంఘం ముఖ్యులు హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. రైస్మిలర్ల సంఘానికి, పౌర సరఫరాల అధికారులకు ఇప్పటికే పేర్లు తెలిసిన 12 మందిలో నలుగురు రైస్ మిల్లర్లు మాత్రం శుక్రవారం కరీనగర్కు వచ్చి జిల్లా పౌర సరఫరాల అధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. పర్మిట్ల అక్రమ బదిలీలో తాము ఎక్కువగా నష్టపోయామని ఈ నలుగురిలో ఇద్దరు గురువారం పౌరసరఫరాల కార్యాలయానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే పట్టించుకుంటామని అధికారులు షరతు పెట్టడంతో వీరు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయకుండానే చూడాలని, ఒకవేళ వచ్చినా తదుపరి ఎలాంటి విచారణ, చర్యలు లేకుండా అన్ని రకాలుగా ప్రయత్నించాలని రైస్ మిల్లర్ల సంఘం ముఖ్యులు నిర్ణయించుకున్నారు. దీని కోసం రాజకీయపరంగా తమ పలుకుబడిని ఉపయోగించేందుకు సిద్ధమయ్యారు. ధాన్యం కేటాయింపులోనూ... పర్మిట్ల బదిలీ ఒక్క విషయంలోనే కాకుండా ప్రభుత్వ ధాన్యం బియ్యంగా మార్చే(సీఎంఆర్) కేటాయింపుల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయని కొందరు రైస్ మిల్లర్లు చెబుతున్నారు. సంఘం ముఖ్యులతో ‘మంచిగా’ ఉన్న వారికే ప్రభుత్వ ధాన్యం కేటాయిస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలోనూ త్వరలోనే ఫిర్యాదుదారులు బయటికి వస్తారని చెబుతున్నారు. 2011-12 ఖరీఫ్ మార్కెట్ సీజన్లో జిల్లాలో 5.91 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. కస్టమ్ మిల్లింగ్ బియ్యంలో వందశాతం అప్పగించిన వారికి అంతే పరిమాణంలో మార్కెట్లో బియ్యం అమ్ముకునేందుకు పర్మిట్లు ఇవ్వాలి. జిల్లాలో 226మంది మాత్రమే వందశాతం బియ్యం అప్పగించడంతో వీరికి 2.06 లక్షల టన్నుల బియ్యం విక్రయానికి పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. రైస్మిల్లర్ల సంఘం పెత్తనం తో అధికారులు ఇప్పటివరకు 87 వేల టన్నుల బియ్యం విక్రయానికి మాత్రమే పర్మిట్లు ఇచ్చా రు. ఇందుకు రైస్మిలర్ల సంఘం అక్రమ దందా నే కారణంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇచ్చిన పర్మిట్లలోనూ 30 శాతం వరకు అర్హులకు సంబంధం లేకుండా రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, పౌర సరఫరాలశాఖ అధికారి ఆమోదంతోనే జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. శుక్రవారం వచ్చే ఫిర్యాదులతో అక్రమాల దం దా ఏ మేరకు ఉందనేది స్పష్టం కానుంది. కస్ట మ్ మిల్లింగ్ బియ్యం ప్రత్యేక పర్మిట్ల దందాపై ‘సాక్షి’లో వచ్చిన విస్తృత కథనంతో అధికారుల్లో చలనం మొదలైంది. ఇప్పటివరకు జారీ చేసిన 87 వేల టన్నుల బియ్యం పర్మిట్ల వివరాలను ఠీఠీఠీ.జ్చుటజీఝ్చజ్చట.జీఛి.జీ వెబ్సైట్ లో పొందుపరిచామని, అక్రమాలు జరిగినట్లు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి బి.చంద్రప్రకాశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.