richest
-
స్వరంతో కోట్లు సంపాదించిన గాయనీమణులు వీరే! (ఫోటోలు)
-
దేశంలోనే రిచెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్.. జీతం రూపాయి!
దేశంలో ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వారి నేపథ్యం, వ్యక్తిగత విషయాలపైనా చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో పలువురు ఐఏఎస్ అధికారులు వార్తల్లో నిలుస్తుంటారు. వారిలో హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అమిత్ కటారియా ఒకరు. ఇటీవల ఆయన వార్తల్లోకి వచ్చారు.ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్న అమిత్ కటారియా దేశంలోనే అత్యంత సంపన్న ఐఏఎస్ అధికారులలో ఒకరిగా వెలుగులోకి వచ్చారు. ఈ ప్రత్యేకత గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. అంత సంపన్నుడైన ఆయన సర్వీస్లో చేరిన కొత్తలో కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకున్నారు. దీంతో ప్రజాసేవ పట్ల తనకున్న అంకితభావాన్ని ప్రదర్శించారు.అమిత్ కటారియా విద్యా నేపథ్యం కూడా అద్భుతంగా ఉంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. కటారియా తన పాఠశాల విద్యను ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యారు. 2003లో యూపీఎస్ఈ పరీక్షలో 18వ ర్యాంక్ సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చోటు సంపాదించారు.ఉన్నత వ్యాపార కుటుంబంఅమిత్ కటారియా రియల్ ఎస్టేట్లో స్థిరపడిన వ్యాపార కుటుంబం నుండి వచ్చారు. వీరికి ఢిల్లీ, సమీప ప్రాంతాలలో మంచి లాభాలు ఇస్తున్న వెంచర్లు ఉన్నాయి. సంపన్నుడైనప్పటికీ కటారియా తన కెరీర్ ప్రారంభంలో సర్వీస్లో చేరిన తర్వాత కేవలం రూపాయి వేతనం తీసుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు.అయితే కొన్ని సందర్భాలలో తన చర్యలతో వివాదాస్పదమూ అయ్యారు. 2015లో ఛత్తీస్గఢ్లోని బస్తర్ కలెక్టర్గా ఉన్న సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా స్వాగతం పలుకుతూ సన్ గ్లాసెస్ ధరించడం వివాదాస్పదం అయ్యింది. దీన్ని ప్రోటోకాల్ ఉల్లంఘనగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చింది.ఇక వ్యక్తిగత విషయానికి వస్తే అమిత్ కటారియా కమర్షియల్ పైలట్ అయిన అశ్మిత హండాను వివాహం చేసుకున్నారు. ఈ జంట తరచుగా తమ వ్యక్తిగత విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కాగా అమిత్ కటారియా నెట్వర్త్ సుమారు రూ.8.90 కోట్లని అంచనా. -
కాసులు కురిపించిన షేర్లు.. కుబేరుల్లో రెండో స్థానానికి జెఫ్ బెజోస్
అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్కు షేర్లు కాసులు కురిపించాయి. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేర్చాయి. 3 బిలియన్ డాలర్లు (రూ.25 వేల కోట్లు) విలువైన అమెజాన్ షేర్లను బెజోస్ ఇటీవల విక్రయించారు. దీంతో ఈ సంవత్సరానికి ఆయన మొత్తం స్టాక్ అమ్మకాలు 13 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. బెజోస్ 1.6 కోట్లకు పైగా షేర్లను విక్రయించారు. ఇటీవల భారీగా పెరిగిన అమెజాన్ స్టాక్ ధరను ఆయన సద్వినియోగం చేసుకున్నారు. ఒక్కో షేరు ధర 200 డాలర్లను తాకింది. అమెజాన్ స్టాక్ గత సంవత్సరంలో 40 శాతానికి పైగా పెరిగింది. ఇటీవల ప్రకటించిన మూడవ త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించి రాణించడంతో గత వారం రోజుల్లోనే షేర్ల విలువ 7 శాతం పెరిగింది.ఇదీ చదవండి: చనిపోయినా.. చచ్చేంత సంపాదనఅమెజాన్ స్టాక్ల విలువ పెరగడంతో బెజోస్ సంపద కూడా పెరిగింది. ఇది గత సంవత్సరంలో 42.8 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ నవంబర్ 3 నాటికి, బెజోస్ 220 బిలియన్ డాలర్ల నెట్వర్త్తో బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో రెండవ స్థానంలో ఉన్నారు. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ 262 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉండగా, మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ 201 బిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నారు. -
అత్యంత ధనవంతుల జాబితాలోని టాప్ 10 ఎన్ఆర్ఐలు (ఫొటోలు)
-
ప్రపంచంలోనే అత్యంత సంపన్న నటి ఎవరో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత సంపన్న నటి ఎవరో చెప్పగలరా? మీరు ఊహించినట్టు టేలర్ స్విఫ్ట్, రిహన్న, సెలీనా గోమెజ్ అయితే కాదు. ఎందుకంటే ఈ ముగ్గురి మొత్తం సంపద కలిపినా కూడా ఆ నటి సంపదకు సరితూగదు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది అక్షరాల నిజం. అంతేకాదు అందరి కంటే ఎక్కువ సంపద కలిగివున్నప్పటికీ ఆమె ఏమీ పాపులర్ నటి కాదు. ఆమె ఖాతాలో ఒక్క బాక్సాఫీస్ విజయం కూడా లేదు. మరి ఆమెకు అంత సంపద ఎలా వచ్చింది?ఫోర్బ్స్ ప్రకారం.. అత్యంత సంపన్న నటుడు టైలర్ పెర్రీ. అమెరికాకు చెందిన ఆయన నటుడిగా, నిర్మాతగా, నాటక రచయితగా ప్రసిద్ధుడు. ఆయనకు సొంత స్టూడియోతో పాటు, మాడియా హిట్ ఫ్రాంచైజీ ఉండడంతో అతడు 1.4 బిలియన్ డాలర్ల సంపద కలిగివున్నాడు. అత్యంత సంపన్న నటిగా ఈ జాబితాలో ముందున్న అమెరికన్ యాక్ట్రస్-ఆంట్రప్రెన్యూర్ జామీ గెర్టజ్.. ఆస్తుల ఎంతో తెలిస్తే అవాక్కవడం పక్కా. టైలర్ పెర్రీ సంపద కంటే 5 రెట్లు కంటే ఎక్కువని ఫోర్బ్స్ అంచనా వేసింది. జామీ గెర్టజ్ ఆస్తుల నికర విలువ 8 బిలియన్ డాలర్లు. అంటే 66 వేల కోట్ల రూపాయల పైమాటే. ప్రపంచంలోని సెలబ్రిటీలందరిలోనూ ఆమె అత్యంత సంపన్నురాలు. టేలర్ స్విఫ్ట్ (1.6 బిలియన్ డాలర్లు), రిహన్న (1.4 బిలియన్ డాలర్లు), సెలీనా గోమెజ్ (1.3 బిలియన్ డార్లు) తరువాతి స్థానంలో ఉన్నారు. మడోన్నా.. నాన్-బిలియనీర్గా టాప్-5లో చోటు దక్కించుకుంది.టాప్ 10లో జూహీ చావ్లాటాప్-5లో మిగిలిన నలుగురి మొత్తం సంపద కంటే కూడా జామీ గెర్టజ్ సంపదే ఎక్కువని ఫోర్బ్స్ అంచనా వేసింది. టాప్-5లో నిలిచిన ఐదుగురు నటీమణులు నటనతో పాటు ఇతర వ్యాపకాలతో ఆస్తులు కూడబెట్టారు. టేలర్ స్విఫ్ట్, రిహన్న, సెలీనా గోమెజ్, మడోన్నా.. యాక్టింగ్తో పాటు మ్యూజిక్ కెరీర్, మేకప్ బ్రాండ్లతో సంపద పోగేశారు. జామీ గెర్టజ్ విషయానికి వస్తే ఆమె వ్యాపార పెట్టుబడులతో అందరి కంటే ఎక్కువగా సంపాదించారు. మెయిన్ స్ట్రీమ్ నటి రీస్ విథర్స్పూన్ ఏడవ స్థానంలో ఉంది. టాప్ 10లో ఉన్న ఏకైక భారతీయ నటి జూహీ చావ్లా మాత్రమే. హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం ఆమె సంపద సుమారు రూ.4600 కోట్లు.చదవండి: టిన్ అండ్ టీనా మూవీ రివ్యూఎవరీ జామీ గెర్టజ్?జామీ గెర్టజ్.. అమెరికాలోని షికాగోలో 1965లో జన్మించారు. 80వ దశకంలో నటనా జీవితాన్ని ప్రారంభించారు. 1981లో ఎండ్లెస్ లవ్తో సినీ రంగ ప్రవేశం చేశారు. 1987లో లెస్ దేన్ జీరో సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్కి జోడీగా నటించడంతో ఆమెకు గుర్తింపు దక్కింది. అదే సంవత్సరం ది లాస్ట్ బాయ్స్ సినిమాలో ప్రముఖ పాత్రను పోషించి ప్రశంసలు అందుకున్నారు. 90 దశకంలో ట్విస్టర్ వంటి సినిమాల్లో నటించారు. ప్రధాన నటిగా విజయాలు దక్కకపోవడంతో తర్వాత సహాయ పాత్రలకు పరిమితమయ్యారు. అల్లీ మెక్బీల్ టీవీ షోతో ప్రేక్షుకులకు దగ్గరయి ఎమ్మీ నామినేషన్ సాధించారు. చివరిసారిగా 2022 చిత్రం ఐ వాంట్ యు బ్యాక్ సినిమాలో అతిథి పాత్రలో ఆమె కనిపించారు.చదవండి: ఓటీటీలో హాలీవుడ్ రొమాంటిక్ మూవీ.. 20 భాషల్లో స్ట్రీమింగ్అంత సంపద ఎలా వచ్చింది?జామీ గెర్టజ్ నటనా జీవితంలో పెద్దగా విజయాలు లేకపోయినా ఆమె అత్యంత సంపన్న నటిగా ఎలా ఎదిగారనేది అందరికీ ఆసక్తి కలిగించే విషయం. అమెరికన్ బిలియనీర్ వ్యాపారవేత్త టోనీ రెస్లర్ను వివాహం చేసుకోవడంతో ఆమె దశ తిరిగింది. భర్తతో కలిసి వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంతో ఆమె సంపద బాగా పెరిగింది. వీరిద్దరూ నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (NBA)లో అట్లాంటా హాక్స్, మేజర్ లీగ్ బేస్బాల్లో మిల్వాకీ బ్రూవర్స్ జట్లకు సహ-యజమానులుగా ఉన్నారు. వీటితో పాటు ఇతర వ్యాపారాల్లోనూ జామీ గెర్టజ్ పెట్టుబడులు కలిగివుండడంతో రిచెస్ట్ యాక్ట్రస్గా ఆమె టాప్లో ఉన్నారు. -
రూ.16 లక్షల కోట్ల మార్కు దాటిన ‘మార్క్’ సంపద!
మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రపంచంలోని నాలుగో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 200 బిలియన్ డాలర్లు(రూ.16 లక్షల కోట్లు) మించి నికర విలువను సంపాదించిన అతికొద్ది మంది వ్యక్తుల్లో ఒకరిగా స్థానం సంపాదించారు. ఈమేరకు బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్లో వివరాలు వెల్లడయ్యాయి. జుకర్బర్గ్ సంపద ప్రస్తుతం 201 బిలియన్ డాలర్ల(రూ.16.8 లక్షల కోట్లు)కు చేరుకుంది.ఇప్పటివరకు టెస్లా సీఈఓ ఇలోన్ మస్క్ 272 బిలియన్ డాలర్ల(రూ.22.7 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. తర్వాత స్థానాల్లో వరుసగా అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ (211 బిలియన్ డాలర్లు-రూ.17.6 లక్షల కోట్లు), ఎల్వీఎంహెచ్ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ (207 బిలియన్ డాలర్లు-రూ.17.3 లక్షల కోట్లు) ఉన్నారు. జుకర్బర్గ్ ఇప్పటివరకు నాలుగోస్థానంలో ఉన్న ఓరాకిల్ కార్పొరేషన్ సహవ్యవస్థాపకులు లారీ ఎల్లిసన్ను వెనక్కినెట్టారు.ఇదీ చదవండి: వడ్డీతో కలిపి రూ.8,465 కోట్లు చెల్లించిన ఎయిర్టెల్బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం టాప్ 10 ధనవంతులు..ఇలోన్ మస్క్జెఫ్ బెజోస్బెర్నార్డ్ ఆర్నాల్ట్మార్క్ జూకర్బర్గ్లారీ ఎల్లిసన్బిల్గేట్స్లారీపేజ్స్టీవ్ బామర్వారెన్బఫెట్సెర్జీబ్రిన్ -
ఆ గణపతికి 69 కిలోల బంగారు నగలు.. రూ. 400 కోట్ల బీమా
ముంబై: ప్రతి ఏటా దేశంలో గణపతి నవరాత్రులు అత్యంత వైభంగా జరుగుతుంటాయి. ఈ సారి సెప్టెంబర్ 7 నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అలాగే సెప్టెంబర్ 17 న గణేష్ నిమజ్జనం జరగనుంది. మహారాష్ట్రలో గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి.ముంబైలోని ఏర్పాటు చేసే ప్రతి గణపతి విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముంబైలోని జీఎస్బీ సేవా మండలి ప్రతిష్ఠించే గణపతి విగ్రహం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంటుంది. ఈ మండలి వడాలాలోని కింగ్స్ సర్కిల్ సమీపంలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ విగ్రహానికి 69 కిలోల బంగారు నగలను ధరింపజేయనున్నారు. అలాగే రూ. 400 కోట్ల బీమా కూడా చేయించనున్నారు. మహారాష్ట్ర సంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడ నిత్యం పూజలు, అర్చనలు నిర్వహించనున్నారు. -
ప్రపంచంలోనే అత్యంత సంపన్న పిల్లి ..ఇన్స్టాలో ఒక్కో పోస్ట్కి ఏకంగా..!
ఎక్కువ సంపాదన కోసం రకరకా మార్గాల్లో అన్వేషిస్తుంటాడు మనిషి. అలా కష్టపడగా..కష్టపడగా.. కొన్నేళ్లకు ధనవంతుడవుతాడు. అదికూడా కొందరికే సాధ్యమవుతుంది. అలా ఓ జంతువు కూడా సంపాదించగలదంటే నమ్ముతారా..!. ఇది చిన్నప్పటి నుంచి దాని విభిన్నమైన లుక్స్తో సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రజాధరణ పొంది డబ్బులు ఆర్జించడం మొదలుపెట్టింది. అలా ప్రంపచంలోనే అత్యంత ధనవంతురాలైన పిల్లిగా రికార్డు సృష్టించింది. ఇంతకీ ఈ పిల్లి అంతలా ఎలా సంపాదిస్తుంటే..ఆ పిల్లి పేరు నాలా. ఇది కాలిఫోర్నియాకు చెందిన సియామీ టాబీ మిక్స్ క్యాట్. 2010లో వరిసిరి మేతచిట్టిఫాన్ అనే మహిళ ఈ నాలా అనే పిల్లిని జంతు సంరక్షణ కేంద్ర నుంచి దత్తత తీసుకుంది. అప్పుడు దాని వయసు కేవలం ఐదు నెలలే. 2012లో వరిసిరి తన స్నేహితులకు, కుటుంబ సభ్యలతో తన పెంపుడు పిల్లి క్యూట్ ఫోటోలను షేర్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇన్స్టాలో దాని పేరుతో ఒక ప్రొఫెల్ క్రియేట్ చేసింది. కొద్ది కాలంలోనే ఈ పిల్లి వేలాది ప్రజలను ఆకర్షించింది. అలా ఆ పిల్లి ఇన్స్టాలో 4.5 మిలియన్ల మంది ఫాలోవర్ల ఉన్న జంతువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఈ పిల్లి అందమైన తలపాగా, నీలికళ్లతో చూపురులను కట్టిపడేస్తుంది. ఇలా నాలాకు పెరిగిన భారీ ఫాలోయింగే..పెంపుడు జంతువుల విభాగంలో ఫోర్బ్స్ టాప్ ఇన్ఫ్లుయెన్సర్ల జాబితాలో చేర్చింది. అంతేగాదు ఈ పిల్లి పేరు మీదుగా లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్ అకార్డింగ్ టు నాలా క్యాట్' అనే ఈబుక్ను కూడా కలిగి ఉంది. అలాగే ఆమె సొంత వెబ్సైట్ 'లవ్ నాలా' పేరుతో ప్రీమియం క్యాట్ ఫుడ్ బ్రాండ్ను కలిగి ఉంది. నివేదికల ప్రకారం ఈ లవ్ నాలా బ్రాండ్ హస్బ్రో, రియల్ వెంచర్స్, సీడ్ క్యాంప్ల వంటి పెట్టుబడుదారుల నుంచి వందల కోట్లు ఆర్జిస్తోంది. ఈ పిల్లి సంపాదనలో ఎక్కువ భాగం సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్, ప్రొడక్ట్స్ ప్రకటనలు, బ్రాండ్ల ద్వారానే ఎక్కువగా ఆర్జిస్తోంది. ఈ పిల్లి ఇన్స్టాగ్రామ్తో పాటు, టిక్టాక్, యూట్యూబ్తో సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో కూడా ప్రొఫైల్ను కలిగి ఉంది. అయితే ఈ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ల సాయంతో జంతు సంరక్షణ పట్ల అవగాహన కల్పించడం, స్వచ్ఛంద సంస్థలకు నిధులు సేకరించడం వంటివి చేస్తుంది ఆ పిల్లి యజమాని వరిసిరి. కాగా, నాలా తర్వాత ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న పిల్లి ఒలివియా బెన్సన్. ఈ పిల్లి నికర విలువ రూ. 813 కోట్లు. మూడవ అత్యంత సంపన్న పిల్లి దివంగత జర్మన్ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ ఒట్టో లాగర్ఫెల్డ్కు చెందిన చౌపెట్టే. దీనికి రూ. 109 కోట్లు సంపద ఉంది.(చదవండి: 12 ఏళ్లుగా అతనిది 30 నిమిషాల నిద్రే..!) -
ఆర్యమన్ విక్రమ్.. అత్యంత సంపన్న భారత క్రికెటర్ (ఫోటోలు)
-
బాలీవుడ్లో టాప్-5 కుబేరులు వీళ్లే.. అమితాబ్ ప్లేస్ ఎంతంటే?
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల కల్కి మూవీతో మెప్పించిన ఆయన ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్లో అత్యంత సంపన్నుల జాబితాను హురున్ ఇండియా రిచ్లిస్ట్ -2024 పేరుతో విడుదల చేసింది. ఈ లిస్ట్లో అమితాబ్ నాలుగో ప్లేస్లో నిలిచారు.ఇటీవల విడుదలైన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో అమితాబ్ బచ్చన్ కుటుంబ నికర ఆస్తుల విలువ రూ.1,600 కోట్లు అని వెల్లడించింది. అతనికంటే ముందు షారుఖ్ ఖాన్ (రూ.7300 కోట్లు), జూహీ చావ్లా కుటుంబం (రూ.4600 కోట్లు), హృతిక్ రోషన్ (రూ. 2000కోట్లు) అతని ముందున్నారు.ఈ లిస్ట్లో కరణ్ జోహార్ రూ.1400 కోట్లతో ఐదోస్థానంలో నిలిచారు.అయితే అమితాబ్ తన చిన్న వయసులో కోల్కతాలో నెలకు రూ.400 ఉద్యోగంలో పని చేసినట్లు వెల్లడించారు. కాలేజీ పూర్తి చేసిన తర్వాత కోల్కతాలో జాబ్ చేసేందుకు వెళ్లానని తెలిపారు. ఓకే గదిలో దాదాపు 8 మందితో కలిసి ఉండేవాడినని పేర్కొన్నారు. కేవలం నేల మీద పడుకునేవాడినని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. కాగా.. ఇటీవల కౌన్ బనేగా కరోడ్పతి షోలో కంటెస్టెంట్గా పాల్గొన్న ఓ వ్యక్తి తాను పుణెలో ఓకే గదిలో ఎనిమిది మందితో కలిసి జీవిస్తున్నట్లు అమితాబ్తో అన్నారు. ఈ సందర్భంగా తాను కూడా ఆ స్థాయి నుంచే వచ్చినట్లు అమితాబ్ వెల్లడించారు.ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి 16 షూటింగ్లో బిజీగా ఉన్న అమితాబ్ ఆ తర్వాత సెక్షన్ 84 చిత్రంలో కనిపించనున్నారు. అంతేకాకుండా రజనీకాంత్ నటిస్తోన్న వేట్టైయాన్లోనూ నటించనున్నారు. -
‘ధన రాశి’ ఇదే.. అత్యధిక సంపన్నులు వీళ్లే..
దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను హరున్ ఇండియా ఇటీవల విడుదల చేసింది. జులై 31 నాటికి రూ.1000 కోట్లు, అంతకుమించిన సంపద కలిగిన వారితో రూపొందించిన ఈ జాబితా ప్రకారం.. కర్కాటక రాశిలో జన్మించినవారి సంపదే ఈ ఏడాది అత్యధికంగా వృద్ధి చెందింది. ఇక మిగిలిన రాశుల స్థితిగతులేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి...తాజా హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఇది ఉత్తమ సంవత్సరం. తరువాత మిథునం, సింహ రాశి ఉన్నాయి. కర్కాటక రాశి వ్యక్తుల సంచిత సంపదలో 84 శాతం పెరుగుదలను చూసింది. మిథున రాశి వారి సంపద 77 శాతం వృద్ధితో రెండో స్థానంలో ఉంది. మూడవ స్థానంలో సింహరాశి ఉంది. వీరి సంచిత సంపద 68 శాతం పెరిగింది.అదే విధంగా 64 శాతం సంపద పెంపుతో ధనుస్సు రాశి, 61 శాతం వృద్ధితో తులారాశి నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇక మకరం సంచిత సంపదలో 58 శాతం పెరుగుదలను చూసింది. తరువాత మీన రాశి 46 శాతం వృద్ధిని సాధించింది. కుంభం, కన్య రాశులు 39 శాతం సంపద వృద్ధితో ఎనిమిదవ స్థానాన్ని పంచుకున్నాయి. ఇక మేషం, వృశ్చికం, వృషభ రాశులు వరుసగా 34 శాతం, 33 శాతం, 32 శాతం సంపద వృద్ధితో చివరి స్థానాలకు పరిమితమయ్యాయి.మిథునం ఇలా అగ్రస్థానంమొత్తం మీద, సంపద వృద్ధి పరంగా కర్కాటక రాశి ముందంజలో ఉంది. కానీ సంపన్నుల సంఖ్య విషయంలో మిథునం అగ్రస్థానంలో ఉంది. జాబితాలోని ధనవంతులలో 9.9 శాతం మంది ఈ రాశి వారే. వీరిలో కుమార్ మంగళం బిర్లా, ఎల్ఎన్ మిట్టల్ వంటి ప్రముఖులు ఉన్నారు.(Disclaimer: వ్యక్తుల విజయం, సంపాదన రాశుల బట్టి కాక, వారి కృషిని బట్టి ఉంటాయి. దీర్ఘకాలిక లక్ష్యం, అంకితభావంతో కృషి చేసేవారు తమ రంగంలో తప్పక విజయం సాధిస్తారు.) -
Hurun Rich List 2024: అంబానీని మళ్లీ దాటేసిన అదానీ
న్యూఢిల్లీ: హిండెన్బర్గ్ రీసెర్చ్ దెబ్బ నుంచి వేగంగా కోలుకున్న పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ (62) దేశీయంగా అత్యంత సంపన్నుల జాబితాలో మరోసారి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని (67) అధిగమించి అగ్రస్థానం దక్కించుకున్నారు. ఏడాది వ్యవధిలో ఆయన సంపద ఏకంగా 95 శాతం ఎగిసి రూ. 11.6 లక్షల కోట్లకు చేరింది. హురున్ గురువారం విడుదల చేసిన సంపన్నుల జాబితా– 2024లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2023 నివేదికలో అదానీ సంపద 57 శాతం క్షీణించి రూ. 4.74 లక్షల కోట్లకు పడిపోయింది.అప్పుడు అంబానీ సంపద రూ. 8.08 లక్షల కోట్లుగా నమోదైంది. తాజాగా అంబానీ మొత్తం సంపద 25 శాతం పెరిగి రూ. 10.14 లక్షల కోట్లకు చేరడంతో ఆయన రెండో స్థానంలో నిల్చారు. తాజా జాబితాలో జూలై 31 నాటి వరకు రూ. 1,000 కోట్ల పైగా నికర విలువ ఉన్న భారతీయ సంపన్నులను పరిగణనలోకి తీసుకున్నారు. ఈసారి కుబేరుల సంఖ్య 220 మేర పెరిగి 1,539కి చేరింది. మొత్తం సంపద 46 శాతం వృద్ధి ెచంది రూ. 159 లక్షల కోట్లకు చేరింది. ఇది సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్ దేశాల సంయుక్త జీడీపీ కన్నా అధికం కాగా భారతదేశ జీడీపీలో సగానికన్నా అధికం కావడం గమనార్హం. భారత్లో ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీరు నమోదయ్యారు. మరిన్ని విశేషాలు.. ⇒ హురున్ టాప్–5 జాబితాలో హెచ్సీఎల్ అధిపతి శివ్ నాడార్ (రూ. 3.14 లక్షల కోట్లు) మూడో స్థానంలో, సీరమ్ ఇనిస్టిట్యూట్కి చెందిన సైరస్ పూనావాలా (రూ. 2.89 లక్షల కోట్లు) ఒక స్థానం తగ్గి నాలుగో స్థానంలో ఉన్నారు. సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి రూ. 2.50 లక్షల కోట్ల సంపదతో ఆరు స్థానం నుంచి అయిదో స్థానానికి చేరారు. ⇒ 7,300 కోట్ల సంపదతో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తొలిసారిగా ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు.టాప్–3లో హైదరాబాద్.. 17 మంది కొత్త కుబేరులు జత కావడంతో హైదరాబాద్ తొలిసారిగా బెంగళూరును అధిగమించింది. 104 మంది సంపన్నులతో సంఖ్యాపరంగా మూడో స్థానంలో నిలి్చంది. తెలంగాణలో 109 మంది, ఆంధ్రప్రదేశ్లో 9 మంది అత్యంత సంపన్నులు ఉన్నారు. 396 మంది కుబేరులతో ముంబై అగ్రస్థానంలో, 217 మందితో న్యూఢిల్లీ రెండో స్థానంలో ఉంది. అత్యంత సంపన్న తెలుగువారిలో మురళి దివి (దివీస్), సి.వెంకటేశ్వర రెడ్డి –ఎస్.సుబ్రహ్మణ్యం రెడ్డి (అపర్ణ కన్స్ట్రక్షన్స్), జీఎం రావు–కుటుంబం (జీఎంఆర్), హర్షా రెడ్డి పొంగులేటి (రాఘవ కన్స్ట్రక్షన్స్), పి.పి.రెడ్డి–పీవీ కృష్ణా రెడ్డి (ఎంఈఐఎల్), బి.పార్థసారథి రెడ్డి–కుటుంబం (హెటిరో ల్యాబ్స్), ప్రతాప్ రెడ్డి–కుటుంబం (అపోలో హెల్త్కేర్), పీవీ రామ్ప్రసాద్ రెడ్డి (అరబిందో ఫార్మా) తదితరులు ఉన్నారు. -
ధనవంతుల జాబితాలో వెనక్కి తగ్గిన అంబానీ (ఫోటోలు)
-
ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామం, మనదేశంలోనే.. ఎక్కడుందంటే?
ప్రపంచంలో అంత్యంత సంపన్న వ్యక్తులు, దేశాలు, నగరాల గురించి మీరు వినే ఉంటారు. మరి సంపన్న గ్రామం గురించి మీరెప్పుడైనా విన్నారా? అవును మీరు విన్నది నిజమే. మనదేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన గ్రామం ఆసియాలోని అత్యంత సంపన్న గ్రామంగా అవతరించింది. ఇంతకి ఆ గ్రామం ఎక్కడుంది? ఆ ఊరు విశేషాలేంటో తెలుసుకుందాం? పదండి. ఒక్క భారత్లోనే కాదు. ప్రపంచంలోనే వ్యాపారం చేయడంలో గుజరాతీలను మించిన వారు లేరని అంటారు. కాబట్టే మన దేశంతో పాటు ప్రపంచ వ్యాపారం రంగంలో వీరే అగ్రస్థానంలో ఉంటారు. తాజాగా గుజరాత్ రాష్ట్రం, కఛ్ జిల్లా, భుజ్ తాలూకాలో మధాపర్ గ్రామం మొత్తం ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామ వాసుల డిపాజిట్లు మొత్తం రూ.7,000 కోట్లకు పైమాటే. గణాంకాల ప్రకారం.. మధాపర్ జనాభా 2011లో 17,000 నుండి దాదాపు 32,000గా ఉంది. ఈ ఊరిలోనే హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, పీఎన్బీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, యూనియన్ బ్యాంక్తో పాటు మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అన్నీ కలిపి 17కి పైగా ఉన్నాయి. అయినప్పటికీ, ఇతర బ్యాంకులు సైతం ఈ ఊరిలో తమ బ్రాంచీలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సంపన్న గ్రామంగా అవతరించడానికి కారణంమధాపర్ సంపన్న గ్రామంగా అవతరించడానికి ఎన్ఆర్ఐలే కారణమని తెలుస్తోంది. విదేశాల్లో నివసిస్తున్న ఆ ఊరి ప్రజలు గ్రామంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్యాంకుల్లో ప్రతిఏటా కోట్ల మొత్తంలో డబ్బులు డిపాజిట్లు చేస్తుంటారు. విదేశాల్లో ఎక్కువగా ఆఫ్రికన్ దేశాల్లో నివసిస్తున్నారు. సెంట్రల్ ఆఫ్రికాలోని నిర్మాణ వ్యాపార రంగాల్లో గుజరాతీలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ ఊరిలో మిగిలిన వారు యూకే,ఆస్ట్రేలియా,అమెరికా, న్యూజిలాండ్లో నివసిస్తున్నారు.ఊరికి ఏదో ఒకటి చేయాలనిఈ సందర్భంగా చాలా మంది గ్రామస్తులు విదేశాలలో నివసిస్తున్నారు. పని చేస్తున్నప్పటికీ, వారు తమ గ్రామ అభివృద్దికి అండగా నిలుస్తున్నారని, వారు నివసించే ప్రదేశంలో కాకుండా మధాపర్ గ్రామంలో ఉన్న బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్ చేసేందుకు ఇష్టపడతారని జిల్లా పంచాయతీ మాజీ అధ్యక్షుడు పరుల్బెన్ కారా తెలిపారు.సకల సౌకర్యాలకు నిలయంగాగ్రామంలోని జాతీయ బ్యాంకు స్థానిక బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ భారీగా డిపాజిట్లు రావడంతో అభివృద్ధి చెందుతుందన్నారు. నీరు, పారిశుధ్యం, రహదారి వంటి అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి. బంగ్లాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, సరస్సులు, దేవాలయాలు ఉన్నాయని మేనేజర్ చెప్పారు. -
ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులు ఉన్న నగరాలు (ఫొటోలు)
-
బిలీయనీర్లకు బ్యాడ్ ఫ్రైడే
స్టాక్ మార్కెట్ ఎప్పుడెలా ఉంటుందో ఊహించలేము. కొన్ని సార్లు భారీ లాభాలను తెచ్చిపెడితే, మరికొన్ని సార్లు చావుదెబ్బ కొడుతుంది. ఇదంతా సంపన్నులకు సర్వసాధారణమే.. అయినప్పటికీ తాజాగా అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఒక్కరోజులోనే (శుక్రవారం) 15.2 బిలియన్ డాలర్లు నష్టపోయారు.బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అమెజాన్.కామ్ ఇంక్ షేర్లు భారీగా పతనమవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 500 మంది ధనవంతులు సంపద 134 బిలియన్ డాలర్లు తగ్గింది. ఇందులో గరిష్టంగా జెఫ్ బెజోస్ 15.2 బిలియన్ డాలర్లు నష్టపోగా.. ఈయన నికర విలువ 191.5 బిలియన్లకు పడిపోయింది.నాస్డాక్ 100 ఇండెక్స్ 2.4 శాతం పడిపోవడంతో.. టెస్లా బాస్ మస్క్, ఒరాకిల్ కార్పొరేషన్ లారీ ఎల్లిసన్ ఇద్దరూ నష్టాలను చవి చూసారు. దీంతో వీరి సంపద 6.6 బిలియన్ డాలర్లు, 4.4 బిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో దిగ్గజ పారిశ్రామిక వేత్తలు మాత్రమే కాకుండా.. చాలామంది పెట్టుబడిదారులు గందరగోళానికి గురయ్యారు.వ్యక్తిగత సంపద పరంగా మస్క్ తర్వాత స్థానంలో నిలిచిన బెజోస్ ఏడాది పొడవునా అమెజాన్ షేర్లను స్థిరంగా విక్రయించారు. ఒక్క ఫిబ్రవరిలో తొమ్మిది ట్రేడింగ్ రోజులలో సుమారు 8.5 బిలియన్ల విలువైన స్టాక్ను విక్రయించారు. గత నెలలో ఒక రోజు అమెజాన్ షేర్లు రికార్డు స్థాయికి చేరాయి. దీంతో బెజోస్ 5 బిలియన్స్ విలువైన 25 మిలియన్ అదనపు షేర్లను విక్రయించే ప్రణాళికను వెల్లడించారు. కానీ ఇటీవల భారీగా నష్టపోయారు. -
ఇండోనేషియాలో అత్యంత సంపన్న కుటుంబం ఇదే..
ఆసియాలో అత్యంత సంపన్నుడు ఎవరు అంటే.. అందరూ చెప్పే సమాధానం ముకేశ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయిన ఈయన నికర విలువ 120.3 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. నీతా అంబానీ, అంబానీ వారసులు అందరూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. ఆసియాలో రెండో అత్యంత సంపన్న కుటుంబం ఏదనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.ఆసియాలో రెండో అత్యంత సంపన్న కుటుంబం హార్టోనో ఫ్యామిలీ అని తెలుస్తోంది. వీరి నికర విలువ 38.8 బిలియన్ డాలర్లు అని సమాచారం. వీరి కుటుంబ ఆదాయం జార్మ్ గ్రూప్తో ప్రారంభమైంది. ప్రస్తుతం వీరు సిగరెట్ పరిశ్రమలోని అగ్రగాములలో ఒకరుగా ఉన్నారు.హార్టోనో సోదరుల కూడా వ్యాపార రంగంలో గణనీయమైన వృద్ధి సాధించారు. వీరు ఇండోనేషియాలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో పెట్టుబడులు కూడా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. హార్టోనో కుటుంబానికి ఎలక్ట్రానిక్స్, ప్రాపర్టీ, అగ్రిబిజినెస్ వంటి వ్యాపారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: అన్నింటా రికార్డులే.. నిర్మలమ్మ ఖాతాలో మరో ఘనతహార్టోనో ఫ్యామిలీ అధీనంలో జకార్తాలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ పాలిట్రాన్ అండ్ ప్రైమ్ రియల్ ఎస్టేట్ ఉన్నాయి. వీరి కుటుంబ వ్యాపారం ఇండోనేషియాలో ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడింది. దీన్ని బట్టి చూస్తే వీరి సంపద ఎంత ఉంటుందనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. -
ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలివే.. అంబానీ ప్లేస్? (ఫోటోలు)
-
ఈ బిచ్చగాడు ఎంత రిచ్ అంటే.. ఏకంగా రూ.కోటి ఇన్సూరెన్స్!
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో ఉండటంతో ప్రజలు నిత్యావసరాల కోసం విపరీతమైన ధరలు చెల్లిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తన రుణాన్ని తీర్చడానికి విదేశాల నుంచి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో ఆ దేశంలో ఓ బిచ్చగాడు ఉన్నాడు. అతని సంపాదన తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..పాకిస్తాన్ అంబానీగా పిలిచే ఈ సంపన్న బిచ్చగాడి చాలా మందికి తెలియకపోవచ్చు. అతని ఆస్తి రూ.కోట్లలో ఉంటుంది. తన పిల్లలను ఖరీదైన పాఠశాలలో చేర్పించడమే కాకుండా కోటి రూపాయలకు బీమా చేయించాడు. పాకిస్థాన్ కు చెందిన ఈ ధనిక బిచ్చగాడి పేరు షౌకత్ అని పాకిస్థాన్ లోని ఏఆర్వై వార్తా కేంద్రం తెలిపింది.పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ముల్తాన్ నగరంలో నివసిస్తున్నాడు ఈ రిచెస్ట్ బిచ్చగాడు. 2021 అక్టోబర్లో షౌకత్ బ్యాంకు ఖాతాలో 1.7 మిలియన్లు ఉన్నాయని పాకిస్తాన్ టాప్ ట్యాక్స్ కలెక్టింగ్ ఏజెన్సీ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (ఎప్బీఆర్) నివేదించింది. ఇతను రోజుకు రూ.1000 కి తక్కువ కాకుండా అడుక్కుంటాడు. షౌకత్ పిల్లలు పాకిస్తాన్లోని ముల్తాన్ సిటీలోని అత్యంత ఖరీదైన పాఠశాలలో చదువుతున్నారు. ఈ సంపన్న యాచకుడు కోటి పాకిస్థానీ రూపాయలకు తన పిల్లలకు బీమా చేయించాడు. అంతేకాకుండా తన ఆర్థిక స్థితిగతులపై తరచూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతుంటాడు. -
ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ
న్యూఢిల్లీ: ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించారు. 111 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానం దక్కించుకున్నారు. అంతర్జాతీయంగా కుబేరుల లిస్టులో 11వ స్థానంలో నిల్చారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ రిపోర్టు ప్రకారం అంబానీ 109 బిలియన్ డాలర్ల సంపదతో అంతర్జాతీయంగా 12వ స్థానంలో ఉన్నారు. అదానీ 2022లోనే ఆసియాలో నంబర్ వన్ సంపన్నుడిగా ఎదిగారు. అంతే కాదు స్వల్ప సమయం పాటు ప్రపంచంలోనే రెండో స్థానంలో నిల్చారు. అయితే, ఆయన గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ ఆరోపించడంతో 2023 జనవరిలో అదానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత పరిణామాలతో గ్రూప్ సంస్థల షేర్లన్నీ కుదేలై ఏకంగా 150 బిలియన్ డాలర్ల విలువ కరిగిపోయింది. దీంతో ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అంబానీ మళ్లీ అగ్రస్థానం దక్కించుకున్నారు. మరోవైపు, ఆరోపణలను దీటుగా ఎదుర్కొని, అదానీ క్రమంగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటూ గ్రూప్ను మళ్లీ నిలబెట్టుకున్నారు. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 10 గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 17.51 లక్షల కోట్లకు చేరడంతో ఆయన సంపద కూడా పెరిగింది. మొత్తం మీద 2024లో అదానీ నికర విలువ 26.8 బిలియన్ డాలర్లు పెరగ్గా, అంబానీ సంపద 12.7 బిలియన్ డాలర్లు పెరిగింది. -
బ్రిటన్లో అత్యంత సంపన్నుడు భారతీయుడే..!
భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త గోపీచంద్ హిందూజా యూకేలో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ‘ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్’ యూకేలోని 1,000 మంది సంపన్నులు లేదా కుటుంబాలతో వారి మొత్తం నెట్వర్త్ ప్రకారం జాబితా రూపొందించింది. ఈ జాబితాలో హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ హిందూజాను అగ్రస్థానంలో నిలిచారు.‘ది మిర్రర్’ ప్రకారం.. హిందుజా కుటుంబం ఆరు సంవత్సరాలుగా బ్రిటన్లో అత్యంత సంపన్నులుగా నిలుస్తూ వస్తోంది. ర్యాంకింగ్ ఆధారంగా హిందూజా నెట్వర్త్ అంతకు ముందు సంవత్సరంలోని 35 బిలియన్ పౌండ్ స్టెర్లింగ్స్ (సుమారు రూ. 3.7 లక్షల కోట్లు) నుంచి సుమారు 37.196 బిలియన్ పౌండ్ స్టెర్లింగ్స్కు (సుమారు రూ. 3.9 లక్షల కోట్లు) పెరిగింది.జీపీగా పిలిచే గోపీచంద్ హిందూజా భారత్లో 1940లో జన్మించారు. హిందూజా ఆటోమోటివ్ లిమిటెడ్ ఛైర్మన్ అయిన ఆయన గత సంవత్సరం తన సోదరుడు శ్రీచంద్ హిందూజా మరణించిన తరువాత తమ వ్యాపార సమూహానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. గోపీచంద్ 1959లో ముంబైలోని జై హింద్ కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. వెస్ట్మినిస్టర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. దీంతోపాటు లండన్లోని రిచ్మండ్ కళాశాల నుంచి ఆర్థికశాస్త్రంలో గౌరవ డాక్టరేట్ను పొందారు. గోపీచంద్ తండ్రి, పరమానంద్ హిందూజా 1914లో హిందూజా ఫ్యామిలీ కంపెనీని స్థాపించారు. -
ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు గురించి విని ఉంటారు. అలాగే అత్యంత వ్యాపార దిగ్గజాలుగా పేరుగాంచిన వారి గురించి కూడా విని ఉంటారు. కానీ ఇదేంటి అత్యంత ధనిక ఖైదీ. ఖైదీల్లో ధనికులు ఉంటారా..! అని విస్తుపోకండి. ఎందుకంటే ఈ వ్యక్తి గురించి తెలిస్తే తప్పక ఔనని అంటారు. అతడెవరంటే..క్రిప్టోకరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్పెంగ్ జావోకి యూఎస్ కోర్టు గత మంగళవారమే నాలుగు నెలల శిక్ష విధించింది. దీంతో జావో ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఖైదీగా నిలిచినట్లు యూఎస్ టెలిగ్రాఫ్ పేర్కొంది. ఆయన గతేడాది యూఎస్ మనీలాండరింగ్కి సంబంధించిన నిరోధక ఆంక్షల చట్టాలను ఉల్లంఘింట్లు అంగీకరించడంతో సీటెల్ కోర్టు జావోకు ఈ శిక్షను విధించింది. నిజానికి జావోకు ఈ నేరంలో మూడేళ్ల జైలు శిక్ష విధించాలని న్యాయవాదులు నుంచి ఒత్తిడిచ్చినా..జడ్డి అతడి అతని దాతృత్వ రికార్డు, ప్రవర్తనను పరిణలోకి తీసుకుని నాలుగు నెలల జైలు శిక్షను మాత్రమే విధించారు. నాలుగు నెలల జైలు శిక్షఅనుభవిస్తున్న జావో తన బినాన్స్ సంస్థ ద్వారా దాదాపు మూడు వేల కోట్ల సంపదను కలిగి ఉన్నాడు. దీంతో అతడు అత్యంత సంపన్న ఖైదీలలో ఒకరిగా నిలిచాడు. 47 ఏళ్ల జావో యూఎస్ అధికారిక ఒప్పందంలో భాగంగా గతేడాది బినాన్స్ సీఈవో పదవి నుంచి వైదొలిగారు. అయినప్పటికీ బినాన్స్లో ఆయన 90% వాటాను కలిగి ఉండటం విశేషం. పైగా మనీలాండరింగ్ ఆరోపణల పరిష్కారంలో భాగంగా ఫిబ్రవరిలో రూ. 35 వేల కోట్లు చెల్లించడానికి బినాన్స్ సంస్థ అంగీకరించింది.కాగా,2017లో ఈ బినాన్స్ సంస్థ ఏర్పాటయ్యింది. ఇది చాంగ్పెంగ్ జావోను ఒక్కసారిగా బిలియనీర్గా మార్చేసింది. ఈ సంస్థ క్రిప్టో ఎక్స్ఛేంజీలను నడుపుతూ.. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తోంది. ఎప్పుడైతే క్రిప్టో మార్కెట్ కుప్పకూలిపోయిందో అప్పటి నుంచి చట్టబద్దతను ఉల్లంఘించి..నష్టాల బాట పట్టింది. చెప్పాలంటే కుప్పకూలిని క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రైడ్ చేసి బిలయన్ డాలర్ల మోసానికి గానూ 25 ఏళ్ల జైలు శిక్ష విధించిన వారాల తర్వాత జావో నేరం వెలుగులోకి వచ్చింది. జావో అధిక రిస్క్తో కూడిన పెట్టుబడుల కోసం కస్టమర్ ఫండ్లలో బిలియన్ డాలర్లను స్వాహ చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది. (మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో 60 ఏళ్ల మహిళ..!) -
చిరంజీవి, షారుక్ను మించి.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ధనిక కుటుంబం వారిదే! (ఫొటోలు)
-
యూఎస్లోనే అత్యంత సంపన్న మహిళగా..ఏకంగా రూ. 75 వేల కోట్లు..!
భారతదేశంలోనే పుట్టి, పెరిగిన ఒక మహిళ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఆహర్నిశలు కష్టపడి కంపెనీని వృద్ధిలోకి తీసుకొచ్చింది. యూఎస్లోనే అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా వ్యాపారవేత్తగా నిలవడమే గాక ఫోర్బ్స్లో కూడా చోటు దక్కించుకుంది. ఎవరీమె అంటే.. భారత్కి చెందిన నేహా నార్ఖేడే పుట్టింది, పెరిగింది పూణేలోనే. ఆ తర్వాత యూఎస్లోని జార్జియా టెక్లో కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అక్కడే లింక్డ్ఇన్, ఒరాకిల్ వంటి కంపెనీల్లో పనిచేసి కాన్ఫ్లూయెంట్ అనే కంపెనీని స్థాపించింది. ప్రారంభంలో గణనీయమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ అనతి కాలంలోనే రూ. 75 వేల కోట్ల టర్నోవర్తో దూసుకువెళ్లడం ప్రారంభించింది. అలా నేహా అత్యంత పిన్న వయస్కురాలైన పారిశ్రామిక వేత్తగా, అమెరికాలో ఎనిమిదొవ అత్యంత సంపన్న మహిళగా అవతరించింది. చిన్నతనంలో తాను ఇందిరా గాంధీ, కిరణ్బేడి, ఇంద్రానూయి వంటి ప్రముఖులు గురించి చదవడం వల్ల విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణించగలిగానని చెబుతోంది. ఆమె కంపెనీ పబ్లిక్గా మారిన తర్వాత 2021 నాటికల్లా రూ. 13 వేల కోట్లకు చేరుకుంది. అనూహ్యంగా ఆమె సంపద 2022లో దారుణంగా పడిపోయి దాదాపు రూ. 8 వేల కోట్ల నష్టాన్ని నష్టాలను చవిచూసింది. అయినప్పటికీ మళ్లీ కంపెనీని లాభాల బాటపట్టించింది. ప్రస్తుతం నేహా కంపెనీ నికర విలువ ఏకంగా రూ. 75 వేల కోట్లు. అంతేగాదు మార్చి 2023లో నార్ఖేడ్ మోసాలను గుర్తించే సంస్థ ఓస్కిలార్ అనే కొత్త కంపెనీను కూడా స్థాపించింది. అంతేగాదు ఫోర్బ్స్ మ్యాగ్జైన్లో స్వీయ సంపన్న మహిళల జాబితాలో నేహా చోటు దక్కించుకోవడం విశేషం. (చదవండి: మహిళా ఎన్ఆర్ఐ ‘చెత్త’ బిజినెస్.. రూ.1000 కోట్లు టార్గెట్) -
ప్రంచంలోనే అత్యంత సంపన్న శునకం! ఆస్తుల జాబితా వింటే..
చాలామంది టైం బాగోకపోయినా, అనుకున్న పని జరగకపోయినా ఛీ.. కుక్క బతుకు అని అంటుంటారు. కానీ ఈ కుక్క గురించి విన్నాక మీ అభిప్రాయం మార్చుకుంటాంటారు. ఆ కుక్కలా లైఫ్ ఉంటే బాగుండును అనుకుంటారు. దాని ఆస్తుల వివరాలు, బ్యాంకు బాలెన్స్లు వింటే షాకవ్వుతారు. దానికున్న సెక్యూరిటీ, బతుకుతున్న రేంజ్ వింటే వామ్మో అంటారు. ఇప్పుడూ చెప్పబోయే ఈ కుక్క ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్కగా గుర్తింపు పొందింది. దీని పేరు గున్థర్ VI. ఇది జర్మన్ షెపర్డ్ కుక్క. ఇది సుమారు రూ. 500 కోట్ల విలువచేసే విలాసవంతమైన ఇంటిలో ఉంటుంది. అలాగే తిరిగేందుకు బీఎండబ్ల్యూ కార్లు, సరదాగా షికారు చేయడానికి ప్రైవేట్ షిప్ సౌకర్యం తదితరాలు ఉన్నాయి. దీనికి స్వంత ఫుట్బాల్ క్లబ్ ఉంది. ఆ కుక్క డబ్బును పర్యవేక్షించేది 66 ఏళ్ల ఇటాలియన్ వ్యవస్థాపకుడు మౌరిజియో మియాన్. కుక్కకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం, దాని బాగోగోలు చూసుకోవడం అతని బాధ్యత. అయితే ఈ కుక్కకు అంత డబ్బు ఎలా వచ్చిందంటే..? అ కుక్క తాత గున్థర్ III నుంచి ఈ సంపదను వారసత్వంగా పొందాడు. జర్మన్ కౌంటెస్ కార్లోట్టా లీబెన్స్టెయిన్ అనే ధనికుడు ఈ గున్థర్ IIIని ప్రేమగా పెంచుకునేవాడు. అయితే ఆ ధనికుడు కొడుకు విషాదకరంగా ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో వారుసులెవరూ లేకుండా పోయారు. దీంతో లీబెన్స్టెయిన్ చనిపోయేంత వరకు ఆ కుక్కనే ప్రేమగా చూసుకునేవాడు. అతను వెళ్తూ వెళ్తూ..దాదాపు రూ. 600 కోట్ల ఆస్తిని ఆ కుక్క పేరు మీద రాసి వెళ్లిపోయాడు. అంతేగాదు ఆ డబ్బును, కుక్కను పర్యవేక్షించేలా ఇటాలియన్ ఫార్మటిస్ట్ మౌరిజియో మియాన్కి బాధ్యతలు కూడా అప్పగించాడు. అలా గుంథర్ ట్రస్ట్ ఏర్పడింది. నాడు ఆరు వందల కోట్లగా ఉన్న ఆస్తి కాస్త గున్థర్ VI టైంకి వచ్చేటప్పటికీ దాని విలువ ఏకంగా రూ. 3 వేల కోట్లకు చేరింది. యజమాని లిబెన్స్టెయిన్ వదలిపెట్టి వెళ్లిన సంపదతో విలాసవంతమైన ఇళ్లు, విల్లాలు, ఓ ప్రైవేట్ ఓడ కొనుగోలు మౌరిజియో మియాన్చేశాడు. అంతేగాదు ఈ కుక్క బిజినెస్ క్లాస్లోనే ప్రయాణిస్తుందట. అలాగే ఆ కుక్కుబాగోగులు చూసుకునేందుకు సిబ్బంది, బయటకు వెళ్లేటప్పుడూ చుట్టూ గట్టి సెక్యూరిటీ ఉండటం విశేషం. అంతేగాదు ఈ గున్థర్ VI తర్వాత ఈ ఆస్తి అంతా దాని పిల్లలకు వెళ్తుంది. ఇలా ఆ కోట్ల ఆస్తి అంతా ఈ గున్థర్ కుక్క వంశానికే చెందుతుందన్నమాట. ఈ గున్థర్ కుక్కలు గోల్డెన్ స్పూన్ బేబి మాదిరి కుక్కలన్నమాట. బిజినెస్ మ్యాగ్జైన్లో ఈ కుక్క గురించి పలు కథనాలు వచ్చాయి. అలాగే దీనిపై పలు డాక్యుమెంటరీలు కూడా రావడం విశేషం. (చదవండి: షాపు షట్టర్లో కోటు చిక్కుకోవడంతో పాపం ఆ మహిళ..!) -
రూ.5 వేల జీతానికి నానా అగచాట్లు.. ఇప్పుడు ఏకంగా...
సాధారణంగా ప్రైవేటు టీచర్లంటే చిన్నచూపు ఉంటుంది. తక్కువ జీతం ఉంటుందని, పెద్దగా సంపాదన ఉండదని భావిస్తారు. కానీ టీచింగ్తోనే ఎడ్టెక్ సంస్థలు పెట్టి రూ.కోట్లు సంపాదిస్తున్న వారూ ఉన్నారు. వారిలో దేశంలోనే రిచెస్ట్ టీచర్గా నిలిచిన ఓ వ్యక్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సంపన్న ఉపాధ్యాయుడిగా నిలిచారు ఫిజిక్స్వాలా ( PhysicsWallah ) వ్యవస్థాపకుడు, సీఈవో అలఖ్ పాండే ( Alakh Pandey ). అయితే దేశంలో రిచెస్ట్ టీచర్ బైజూస్ రవీంద్రన్ అని చాలామంది వాదించవచ్చు. కానీ ఇప్పుడు ఆ టైటిల్ ఆయనది కాదు. ఫోర్బ్స్ ప్రకారం బైజూస్ పతనం తర్వాత, దాని నికర విలువ కూడా రూ. 830 కోట్లకు పడిపోయింది. అంటే రూ. 2000 కోట్ల కంటే ఎక్కువ నెట్వర్త్ ఉన్న అలఖ్ పాండేనే దేశంలోనే అత్యంత ధనిక ఉపాధ్యాయుడు. ప్రముఖ ఉపాధ్యాయుడు, ఎంటర్ప్రిన్యూర్గా పేరొందిన అలఖ్ పాండే సాధారణంగా లైమ్లైట్కు దూరంగా ఉంటారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖలో ఈ స్టార్టప్ నమోదై ఆయన వార్షిక వేతనం వెల్లడి కావడంతో వార్తల్లోకి వచ్చారు. భారతీయ టెక్, స్టార్టప్ సంస్థల సమాచారం అందించే ‘Inc42’ నివేదిక ప్రకారం.. అలఖ్ పాండే వేతనం 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.6 కోట్లు. దీంట్లో ఆయన రూ.5 కోట్లను తగ్గించుకున్నారు. అయినప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరంలో అలఖ్ పాండే వేతనం రూ. 4.57 కోట్లు. ఇంత ఆదాయం ఉన్న అలఖ్ పాండే మొదటి సంపాదన ఎంతో తెలుసా.. కేవలం రూ.5 వేలు. అది కూడా చాలా మంది పిల్లలకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చేది. యాక్టర్ కావాలనుకున్నాడు దేశంలో 101వ యునికార్న్ కంపెనీ ఫిజిక్స్వాలాను స్థాపించిన అలఖ్ పాండే ఒక టీచర్గానే చాలా మందికి తెలుసు. అయితే యాక్టర్ కావాలన్నది తన కల అని ఎంత మందికి తెలుసు? అలహాబాద్లో జన్మించిన అలఖ్ పాండే యాక్టర్ అవ్వాలనే కోరికతో నుక్కడ్ నాటకాల్లో పాల్గొనేవాడు. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో 8వ తరగతి నుంచే ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు. అలఖ్ పాండే, ఆయన సోదరి చదువుల కోసం వారి తల్లిదండ్రులు తమ ఇంటిని అమ్మేశారు. అలఖ్ పాండే చాలా చురుకైన విద్యార్థి. 10వ తరగతిలో 91 శాతం, 12వ తరగతిలో 93.5 శాతం మార్కులు వచ్చాయి. కోటి మందికిపైగా సబ్స్క్రైబర్లు ఐఐటీలో చేరాలనుకున్న అలఖ్ పాండే కాన్పూర్లోని హార్కోర్ట్ బట్లర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు. అయితే, కోర్సు మూడవ సంవత్సరం తర్వాత కాలేజీ మానేశాడు. 2017లో యూపీలో ఒక చిన్న గది నుంచి యూట్యూబ్ వీడియోలను రూపొందించడం ప్రారంభించాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో అలాఖ్ పాండే వీడియోలు చాలా విజయవంతమయ్యాయి. ఎంతగా అంటే ఓ ఎడ్-టెక్ కంపెనీని ప్రారంభించేంతలా. ఇందులో ఇప్పుడు 500 మందికి పైగా టీచర్లు, 100 మంది టెక్నికల్ సిబ్బంది పనిచేస్తున్నారు. యూట్యూబ్లో ఫిజిక్స్వాలా చానల్కు కోటి మందికిపైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. -
బిల్ గేట్స్ను వెనక్కు నెట్టిన జుకర్బర్గ్
ప్రపంచ కుబేరుల జాబితాలోని మొదటి స్థానంలో మార్పుల ఏర్పడ్డ తరువాత.. మెటా సీఈవో 'మార్క్ జుకర్బర్గ్' (Mark Zuckerberg) కూడా ఓ అడుగు ముందుకు వేసి బిల్ గేట్స్ను వెనక్కు నెట్టారు. దీంతో జుకర్బర్గ్ ప్రపంచంలోని నాల్గవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. మెటా స్టాక్ ధరలు 22 శాతం పెరగడం వల్ల జుకర్బర్గ్ సంపద 28 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఈయన నికర విలువ.. బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం 170 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో బిల్ గేట్స్ నికర విలువ 145 బిలియన్ డాలర్ల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బిల్ గేట్స్ విలువ కంటే జుకర్బర్గ్ విలువ 25 బిలియన్ డాలర్లు పెరిగింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ఇప్పుడు జుకర్బర్గ్ కంటే ముందున్న ధనవంతులు బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్, ఇలాన్ మస్క్ మాత్రమే ఉన్నారు. మెటా తన మొట్టమొదటి డివిడెండ్ను మార్చిలో పంపిణీ చేసినప్పుడు జుకర్బర్గ్ సుమారుగా 174 మిలియన్ డాలర్ల నగదును పొందవచ్చని భావిస్తున్నారు. ఇదీ చదవండి: సంక్షోభంలో పేటీఎం - ప్రత్యర్థులకు పెరిగిన డిమాండ్.. జుకర్బర్గ్ దాదాపు 350 మిలియన్ క్లాస్ A, B షేర్లకు యజమానిగా కంపెనీలో వాటాలను కలిగి ఉన్నారు. అయితే మెటా తన 50-సెంట్స్ త్రైమాసిక డివిడెండ్ కొనసాగిస్తే.. జుకర్బర్గ్ వార్షిక ఆదాయాలు 690 మిలియన్ డాలర్లకు మించిపోతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే ధనవంతుల జాబితాలో నాలుగవ స్థానంలో ఉన్న మెటా సీఈఓ మరింత ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. -
Forbes Billionaires 2023: నూతన కుబేరుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్
పారిస్: ఫ్రాన్సుకు చెందిన ప్రముఖ లగ్జరీ వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్(74) అత్యంత సంపన్నుడిగా స్థానం సంపాదించారు. ఎలాన్ మస్క్ స్థానంలో ఆర్నాల్ట్ను చేరుస్తూ తాజాగా ఫోర్బ్స్ కంపెనీ రియల్ టైం బిలియనీర్ల జాబితాను ప్రకటించింది. ప్రపంచ కుబేరుడి స్థానంలో ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ శుక్రవారం 204.5 బిలియన్ డాలర్లకు తగ్గిపోగా, బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆస్తుల విలువ ఏకంగా 23.6 బిలియన్ డాలర్లు పెరిగి 207.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఫోర్బ్స్ వివరించింది. ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కంపెనీ షేర్ల విలువ గురువారం ఒక్కసారిగా 13 శాతం తగ్గడంతో ఆ మేరకు మస్క్ ఆస్తిలో 18 మిలియన్ డాలర్ల మేర కోతపడింది. అదే సమయంలో, ఎల్వీఎంహెచ్ షేర్ల విలువ శుక్రవారం 13 శాతం పెరుగుదల నమోదు చేసుకోగా ఆ కంపెనీ మార్కెట్ విలువ 388.8 మిలియన్ డాలర్లకు ఎగబాకిందని ఫోర్బ్స్ తెలిపింది. బెర్నార్డ్కు ఎల్వీఎంహెచ్తోపాటు లూయిస్ విట్టన్, ట్యాగ్ హ్యుయెర్, డామ్ ప్రిగ్నోన్, టిఫ్ఫనీ అండ్ కో వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా ఉన్నాయి. 500 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన ఏకైక యూరప్ కంపెనీగా గత ఏడాది ఏప్రిల్లో ఎల్వీఎంహెచ్ గుర్తింపు పొందింది. -
ప్రపంచంలోనే ధనిక కుటుంబం.. ఆస్తులు తెలిస్తే నోరెళ్లబెడతారు!
రాజ కుటుంబాలకు విలాసవంతమైన భవనాలు, తరిగినపోని ఆస్తులు, వ్యాపారాలు ఉంటాయి. కోటానుకోట్ల రూపాయాలు కూడా వాళ్ల సొంతం! అయితే ప్రపంచంలో కోట్ల ఆస్తులు ఉన్న రాజ కుటుంబాలు ఉన్నప్పటీకి యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ రాజ కుటుంబం చాలా ప్రత్యేకమైంది. చాలా తక్కువ మంది మాత్రమే తమ ఆస్తుల వివరాలు బయటి ప్రపంచానికి వెల్లడిస్తారు! ఇటువంటి రాజ కుటుంబాల ఆస్తులు, సౌకర్యాలు, వ్యాపార విలువ తెలిస్తే.. మనమంతా నోరెళ్లబెట్టక తప్పదు! యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్కు సుమారు 4,078 కోట్ల అధ్యక్ష భవనం(మూడు అమెరికా పెంటాగన్ భవనాలతో సమానం), 8 ప్రైవేట్ జెట్స్, అత్యంత విలువైన ఫుట్బాల్ క్లబ్ కలిగి ఉన్నారు. ఈ రాజ కుటుంబం ప్రపంచ చమురు నిల్వల్లో సుమారు 6శాతం కలిగి ఉంది. అదే విధంగా మాంచెస్టర్ నగరంలోని ఫుట్ క్లబ్, ప్రముఖ కంపెనీల్లో వందల షేర్లు కూడా ఉన్నాయ. అందులో హాలీవుడ్ గాయాని బ్యూటీ బ్రాండ్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థ వరకు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ షేర్లు ఉండటం గమనార్హం. యూఏఈ రాజకుటుంబానికి చెందిన మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చిన్న తమ్ముడు షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ వద్ద సుమారు 700 ఖరీదైన కార్లు ఉన్నారు. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద SUV వాహనంతో పాటు ఐదు బుగట్టి వేరాన్లు, ఒక లంబోర్గిని వరెన్టన్, ఒక మెర్సిడెస్ బెంజ్ CLK GTR, ఒక ఫెరారీ 599XX, ఒక Mc12 ఆర్ఎన్ వాహనాలు ఉన్నాయి. ఇక.. ఈ రాజకుటుంబం నివాసం ఉండే కస్ర్ అల్-వతన్ ( యూఏఈ అధ్యక్ష భవనం) ఆ దేశంలోనే అత్యంత పెద్ద రాజభవనంగా గుర్తింపు పొందింది. ఈ ప్యాలెస్ సుమారు 94 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 3,50,000 ప్రత్యేకమైన క్రిస్టల్స్లో తయారు చేయబడిన షాన్డీలియర్, విలువైన చారిత్రక కళాఖండాతో పాలెస్ అబ్బుర పరిచేలా ఉంటుంది. في كلّ ركنٍ قصة من وحي تاريخ دولة الإمارات العربية المتحدة! اكتشفوا قصص تراث الأمة الغني والعظيم وخططوا لزيارتكم إلى #قصر_الوطن اليوم. #في_أبوظبي pic.twitter.com/Uv4zQH6bXb — Qasr Al Watan (@QasrAlWatanTour) November 1, 2022 మరోవైపు అధ్యక్షుడి సోదరుడు తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. రాజకుటుంబంలోనే ప్రధానమైన పెట్టుబడి కంపెనీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీని విలువ ఐదేళ్ల కాలంలో 28,000 శాతం పెరిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ 235 బిలియన్ డాలర్లు. ఈ కంపెనీ వ్యవసాయం, చమురు, వినోదం, సముద్ర వ్యాపారాలను కలిగి ఉంది. అదీకాక కంపెనీ పదివేల మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. యూఏఈ కాకుండా ఈ రాజ కుటుంబానికి లండన్, పారిస్ వంటి ప్రపంచశ్రేణి నగరాల్లో విలువైన ఆస్తులు ఉండటం గమనార్హం. ఇక రాజ కుటుంబంలోని మాజీ కుటుంబ పెద్దకు ‘లండన్ భూస్వామి’ అనే పేరు ఉండటం విశేషం. 2015లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం బ్రిటన్ రాజ కుటుంబంతో పోటీపడే ఆస్తులు యూఏఈ రాజ కుటుబానికి ఉన్నాయని పేర్కొన్నారంటే.. వీరి ఆస్తుల విలువ ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! 2008లో మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. యూకే ఫుట్బాల్ టీం(మాంచెస్టర్ సీటీ)ను సుమారు 2,122 కోట్ల భారీ ధరకు కోనుగోలు చేసి సంచలనం సృష్టించారు. యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ది 18 మంది సోదరులు, 11 మంది సోదరీమణులు గల పెద్ద రాజ కుటుంబం. ఆయనకు 9 మంది పిల్లలు, 18 మంది మనవలు, మనవరాళ్లు ఉండటం గమనార్హం. చదవండి: ఇరాన్పై ప్రతీకారదాడి.. పాక్ అమెరికాను సంప్రదించిందా? -
ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం! ఏకంగా 700 కార్లు..
ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబం. ఆ కుటుబంలోని వ్యక్తులంతా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. వాళ్లు ఉండే ఫ్యాలెస్ ఏకంగా మూడు పెంటాగాన్ భవనాల పరిమాణంలో ఉంటుంది). సంతానం, తోబుట్లువులు కూడా ఎక్కువ మందే. పైగా అందరూ అత్యంత లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నారు. ఆ కుటుంబ సభ్యులంతా ప్రముఖ కంపెనీలన్నింటిలో అత్యధిక శాతం వాటాలను కలిగి ఉన్నారు. ఇంతకీ ఆ అత్యంత ధనిక కుటుంబం ఏదంటే.. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కుటుంటం. ఆయన పేరులోని మొదటి అక్షరాలతో ఎంబీజెడ్గా పిలుస్తారు. ఈయనే కుటుంబ పెద్ద. అతని కుటుబమే అత్యంత ధనిక రాయల్ కుటుంబంగా ఉంది. ఆయనకు 11 మంది సోదరీమణులు, తొమ్మది మంది పిల్లలు, సుమారు 18 మంది దాక మనవళ్లు మనవరాళ్లు ఉన్నారు. ప్రపంచంలోని చమురు నిల్వల్లో దాదాపు ఆరు శాతం ఆ కుటుంబమే సొంతం చేసుకుంది. అలాగే మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ వంటి అనేక ప్రసిద్ధ కంపెనీల్లో అత్యధిక వాటా కలి ఉన్నారు. ఎలోన్ మస్క్ స్పెసఎక్స్ కంపెనీ నుంచి ప్రముఖ గాయకుడు బ్యూటీ బ్రాండ్ ఫెంటీ వంటి కంపెనీలన్నింటిలో ఈ రాయల్ కుటుంబ సభ్యులే వాటాలు కలిగి ఉన్నారు. అధ్యక్షుబు షేక్ మొహమ్మద్ బిన్ తమ్ముడు షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్కే ప్రపంచంలోని అతిపెద్ద ఎస్యూవీ, మెర్సిడెస్ బెంజ్, వంటి లగ్జరీ కార్లు దాదాపు 700 పైచిలుకు ఉన్నాయి. ఆ కుటుంబ సుమారు 94 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద ప్యాలెస్లో నివశిస్తోంది. దాని విలువ నాలుగు వేల కోట్లు ఉంటుంది. ఆ కుటుంబానికి సంబధించని ప్రధాన ఇన్విస్టెమెంట్ కంపెనీకి ఆయన మరో సోదరుడు బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నిర్వహిస్తున్నారు. దీని విలువ గత ఐదేళ్లలో దాదాపు 2 లక్షల పర్సంటేజ్ వరకు పెరిగింది. ఐతే ప్రస్తుతం ఆ కంపెనీ విలువ లక్ష కోట్లు. ఇది వ్యవసాయం, ఇందనం, వినోదం, సముద్ర వ్యాపారాలు వంటివి నిర్వహిస్తుంది. సుమారు పదివేల మందికి ఉపాధి కూడా కల్పిస్తోంది. ఈ కుటుంబానికి యూఏఈలోనే కాకుండా పారిస్, లండన్తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అత్యంత లగ్జరీ ఆస్తులు ఉన్నాయి. ఈ యూఏఈ అధ్యక్షుడికి యూకేలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో పెద్దమొత్తంలో ఆస్తులు ఉండటంతో ఆయన్ని ‘ల్యాండ్ లార్డ్ ఆఫ్ లండన్’(లండన్ భూస్వామి) అని కూడా పిలుస్తారు. అంతేగాదు న్యూయార్క్ నివేదిక ప్రకారం 2015లో ఈ దుబాయ్ రాజకుటుంబం బ్రిటీష్ రాజ కుటుంబంతో సరితూగేలా ఆస్తులను కలిగి ఉందని పేర్కొంది. అతేగాదు 2008లో అధ్యక్షుడు ఎంబీజెడ్కి చెందిన అబుదాబి యునైటెడ్ గ్రూప్ యూకే ఫుట్బాల్ జట్టు మాంచెస్టర్ సిటీని సుమారు రెండు వేల కోట్లకు కొనుగోలు చేసింది. మాంచెస్టర్ సిటీ, ముంబై సిటీ, మెల్బోర్న్ సిటీ, న్యూయార్క్ సిటీ ఫుట్బాల్ క్లబ్లను నిర్వహిస్తున్న సిటీ ఫుట్బాల్ గ్రూపులో 81 శాతం ఈ అబుదాబి కంపెనీ యాజమాన్యంలోనే ఉంది. في كلّ ركنٍ قصة من وحي تاريخ دولة الإمارات العربية المتحدة! اكتشفوا قصص تراث الأمة الغني والعظيم وخططوا لزيارتكم إلى #قصر_الوطن اليوم. #في_أبوظبي pic.twitter.com/Uv4zQH6bXb — Qasr Al Watan (@QasrAlWatanTour) November 1, 2022 (చదవండి: అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని..57 ఏళ్ల క్రితమే ఊహించారా?) -
Gautam Adani: ఒక్క రోజులో తారుమారు.. అత్యంత సంపన్నుడు అదానీనే
పోర్టుల నుంచి పవర్ వరకూ అనేక వ్యాపారాలు నిర్వహించే అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ.. ఒకప్పుడు ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడు, 2022 సెప్టెంబర్ కాలంలో ఆయన సంపద దాదాపు 149 బిలియన్ డాలర్ల మార్కును తాకింది. కానీ ఓ నివేదిక ఆయన్ను పాతాళానికి పడేసింది. దాని నుంచి బయటపడిన అదానీ పడిలేచిన కెరటంలా మళ్లీ అపర కుబేరుడి స్థానానికి చేరారు. దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ స్థానం ఒక్కరోజులో మారిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని దాటి అత్యంత సంపన్న భారతీయుడిగా, ప్రపంచంలోని 12వ అత్యంత ధనికుడిగా గౌతమ్ అదానీ నిలిచారని బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్లో తాజా అప్డేట్ సూచించింది. ఒక్క రోజులో రూ.63 వేల కోట్లు హిండెన్బర్గ్ రీసెర్చ్ కేసుపై సుప్రీం కోర్టు తీర్పు అనంతరం అదానీ సంపద ఒక్క రోజులోనే ఏకంగా 7.67 బిలియన్ డాలర్లు (సుమారు రూ.63 వేల కోట్లు) పెరిగింది. ఇప్పుడాయన నెట్వర్త్ 97.6 బిలియన్ డాలర్ల (రూ.8.1 లక్షల కోట్లు)కు చేరింది. 97 బిలియన్ డాలర్ల (రూ.8 లక్షల కోట్లు) ముఖేష్ అంబానీ సంపదను అధిగమించింది. అదానీ గ్రూప్ స్టాక్స్ దేశీయ మార్కెట్లలో ఊపందుకుంటున్న నేపథ్యంలో గౌతమ్ అదానీ సంపద త్వరలోనే 100 బిలియన్ డాలర్ల మార్క్ను సైతం దాటుతుందని భావిస్తున్నారు. బ్లూమ్బెర్గ్ ఇండెక్స్ ప్రకారం.. గౌతమ్ అదానీ కొత్త ఏడాది 2024లో ఇప్పటివరకు తన సంపదలో 13.3 బిలియన్ డాలర్లు (రూ.1.1లక్షల కోట్లు) పెంచుకున్నారు. ఒక వ్యక్తికి ఇంత తక్కువ సమయంలో సంపద పెరుగుదల ఇదే ఎక్కువ. ఇదే సమయంలో ముఖేష్ అంబానీ సంపద 665 మిలియన్ డాలర్లు (రూ.5,530 కోట్లు) మాత్రమే పెరిగింది. పాతాళానికి పడేసిన నివేదిక పోర్ట్స్ టు పవర్ వ్యాపార సమ్మేళనం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఒకప్పుడు ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడు, ఆయన సంపద 2022 సెప్టెంబర్ కాలంలో దాదాపు 149 బిలియన్ డాలర్ల మార్కును తాకింది. కానీ 2023 జనవరిలో హిండెన్బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన ఒక నివేదిక స్కై-హై వాల్యుయేషన్లను ఉటంకిస్తూ అదానీ గ్రూప్ స్టాక్లు 85 శాతం పడిపోతాయని అంచనా వేసింది. అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి 150 బిలియన్ డాలర్లు క్షీణించాయి. బ్లూమ్బెర్గ్ ప్రకారం.. 2023 ఫిబ్రవరి 27న అదానీ వ్యక్తిగత సంపద 37.7 బిలియన్ డాలర్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. హిండెన్బర్గ్ నివేదిక వెలువడడానికి ఒక రోజు ముందు వరకూ అదానీ ప్రపంచంలోని నాలుగో అత్యంత సంపన్నుడు. -
నాడు అద్దె ఇల్లు.. నేడు 6 యూనివర్సిటీలు, 28 ఆస్పత్రులు
ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ న్యూయార్క్కు చెందిన ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ డేవిడ్సన్ కెంప్నర్ క్యాపిటల్ మేనేజ్మెంట్తో కొనసాగుతున్న రుణ వివాదానికి పరిష్కారం అంచున ఉంది. మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ చైర్మన్ రంజన్ పాయ్ బైజూస్లో దాదాపు రూ. 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో డేవిడ్సన్ కెంప్నర్ నుంచి బైజూస్ తీసుకున్న రూ.800 కోట్ల రుణాన్ని సెటిల్ చేసేందుకు రంజన్ పాయ్ రూ.1,400 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎవరీ డాక్టర్ రంజన్ పాయ్.. ఆయన బిజినెస్.. నెట్వర్త్ వంటి విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎవరీ డాక్టర్ రంజన్ పాయ్? 1972 నవంబర్ 11న జన్మించిన డాక్టర్ రంజన్ పాయ్ ఒక అర్హత కలిగిన వైద్యుడు, వ్యాపారవేత్త. మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ (MEMG) ఛైర్మన్. ఈ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఆరు విశ్వవిద్యాలయాలు, 28 ఆసుపత్రులను నడుపుతోంది. రంజన్ పాయ్ తండ్రి పద్మభూషణ్ అవార్డు గ్రహీత రాందాస్ పాయ్. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE)కి రాందాస్ పాయ్ ఛాన్సలర్గా ఉన్నారు. రంజన్ పాయ్ మణిపాల్లోని కస్తూర్బా మెడికల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసి, యూఎస్ వెళ్లి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో ఫెలోషిప్ పూర్తి చేశారు. అద్దె ఇంట్లో ప్రారంభం డాక్టర్ రంజన్ పాయ్ మలేషియాలోని మెలక మణిపాల్ మెడికల్ కాలేజీకి మేనేజింగ్ డైరెక్టర్గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 2000 సంవత్సరంలో రంజన్ పాయ్ బెంగళూరులోని అద్దె ఇంట్లో మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ను ప్రారంభించారు. కేవలం 2 లక్షల డాలర్లతో వ్యాపారాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు దీని విలువ సుమారు 3 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 25,000 కోట్లు). నెట్వర్త్ ఫోర్బ్స్ ప్రకారం డాక్టర్ రంజన్ పాయ్ నెట్వర్త్ 2.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 23,000 కోట్లు). మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్కు ఇప్పుడు మలేషియా, ఆంటిగ్వా, దుబాయ్, నేపాల్ దేశాల్లో కూడా క్యాంపస్లు ఉన్నాయి. ఇదే కాకుండా డాక్టర్ రంజేన్ పాయ్కి మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ అనే సంస్థ కూడా ఉంది. -
సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగి కాస్తా..నేడు సంపన్న మహిళగా..!
రాధ వెంబు విజయాన్ని చూసిన తరువాత ‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది’ అనే సుపరిచిత మాటకు అదనంగా మరో మాట చేర్చవచ్చు అనిపిస్తుంది. ‘ప్రతి పరిశ్రమ విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది’ సాధారణ ఉద్యోగిగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ ‘జోహో కార్పోరేషన్’లోకి అడుగు పెట్టిన రాధ వెంబు క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి గెలుపు పాఠాలు తయారు చేసుకుంది. ప్రతిభావంతులైన సిబ్బందికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి బలమైన సైన్యాన్ని తయారు చేసింది. మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించని రాధ వెంబు ‘ఇన్విజిబుల్ ఫోర్స్’గా పేరు తెచ్చుకుంది. తాజాగా ‘360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023’ లో చోటు సంపాదించి, బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్ రిటైల్ కంపెనీ నైకా ఫౌండర్ ఫల్గుణి నాయర్ని దాటేసి మన దేశంలోని సంపన్న మహిళగా వార్తల్లో నిలిచింది....' ‘ఎన్నో విజయాలు సాధించిన రాధ వెంబు గురించి నేనెందుకు వినలేకపోయాను అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది’ అంటూ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రాశాడు జోహో కార్పొరేషన్ కన్సల్టెంట్ ఇంగ్లాండ్కు చెందిన ఆడిసన్. ఈ కన్సల్టెంట్కు మాత్రమే కాదు దేశంలో చాలామందికి ఆమె విజయాల గురించి తప్ప వ్యక్తిగత వివరాల గురించి తెలియదు. ‘సెల్ఫ్–మేడ్ ఉమన్’ అనేది ఆమె పేరు ముందు కనిపించే విశేషణం. ‘కామ్ అండ్ టాస్క్–ఓరియెంటెడ్’ అని సన్నిహితులు రాధ గురించి చెబుతుంటారు. చెన్నైలో పుట్టి పెరిగింది రాధ. తండ్రి మద్రాస్ హైకోర్టులో స్టెనోగ్రాఫర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(మద్రాస్) లో ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో పట్టా పుచ్చుకుంది రాధ. ఆమె సోదరుడు శ్రీధర్ వెంబు ఆమెకు స్నేహితుడు, గురువు. టెక్ ఇండస్ట్రీ గురించి గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. మన కంపెనీలను విదేశీ కంపెనీలతో పోల్చుతూ విశ్లేషించుకునేవారు. తన సోదరులతో కలిసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ ‘జోహో కార్పొరేషన్’ మొదలు పెట్టింది రాధ వెంబు. అంతకుముందు ఉన్న శ్రీధర్ వెంబు కంపెనీ ‘అడ్వెన్ నెట్’ జోహో కార్పోరేషన్లో విలీనమైంది. మొదట్లో ఒక సాధారణ ఉద్యోగిగా ఆ సంస్థలో చేరింది రాధ వెంబు. క్షేత్రస్థాయి పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయడానికి ఇది తనకెంతో ఉపయోగపడింది. ఆ తరువాత జోహో మెయిల్ ప్రాడక్ట్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించింది. వేగంగా ఉన్నత హోదాలోకి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ చాలా సంవత్సరాల పాటు ప్రాడక్ట్ మేనేజర్గానే పనిచేసింది. పెద్ద పెద్ద సంస్థలతో పోటీ పడుతూ తమ కంపెనీని ముందు వరుసలో నిలిచేలా చేసింది. ‘కంపెనీకి సంబంధించిన సాంకేతికతను శక్తిమంతం చేయడానికి, కస్టమర్లను ఆశ్చర్యానందాలకు గురి చేయడానికి సంబంధించి ఎప్పుడూ ఆలోచిస్తుంటాను’ అంటుంది రాధ. ‘పని చేసే ప్రదేశంలో పక్షపాతానికి చోటు లేదు. ఆడా మగా అనే తేడా లేదు. ప్రతిభ ఒక్కటే ప్రమాణం’ అని నమ్మడమే కాదు ఆచరణలో నిరూపించింది రాధ. జోహో వర్క్కల్చర్ బాగా పాపులర్ అయింది. ఒక స్థాయికి చేరిన తరువాత టెక్ కంపెనీల హెడ్క్వార్టర్స్ విదేశాల బాట పడితే ‘జోహో’ మాత్రం మన దేశంలోని చిన్న పట్టణాలను ఎంచుకుంది. టెక్ రంగంలో పురుషాధిక్యతే ఎక్కువగా కనిపించే పరిస్థితులలో రాధా వెంబు ఎన్నో మూస ఆలోచనలను బద్దలు కొట్టింది. ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. ‘నువ్వు కనిపించడం కాదు నీ ప్రాడక్ట్ కనిపించాలి. నువ్వు మాట్లాడడం కాదు నీ ప్రాడక్ట్ మాట్లాడాలి’ అనేది రాధ వెంబు నమ్మిన సిద్ధాంతం. పబ్లిసిటీ లేకపోతే పని జరగదు అని నమ్మే ఈ కాలంలోనూ ఆమె నమ్మిన సిద్ధాంతం నిలిచి గెలిచింది. తీరిక సమయాల్లో తోటపని చేసే రాధ వెంబుకు సామాజిక సేవాకార్యక్రమాలు అంటే ఇష్టం. ‘సంపన్నురాలిగా మారాలని టెక్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు. నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని ఆచరణలోకి తీసుకువచ్చి ఆ ఫలితాలతో సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో వచ్చాను’ అంటుంది రాధ వెంబు. (చదవండి: రుచికి చూపెందుకు? చూపులేకపోయిన వంట అదుర్స్) -
రిచెస్ట్ గణపతి: 69 కిలోల బంగారం.. 336 కిలోల వెండి.. చూస్తే రెండు కళ్లూ చాలవు!
Richest Ganpati: దేశంలో ప్రముఖంగా జరిగే పండుగల్లో వినాయక చవితి ఒకటి. భక్తులు తమ శక్తికొద్దీ గణేషుడి ప్రతిమలు కొలుదీర్చి పూజలు చేస్తారు. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరంలో గణేష్ చతుర్థి అత్యంత వైభవంగా జరుగుంది. గణేషుడి భారీ విగ్రహాలతోపాటు కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన మంటపాలను ఇక్కడ చూడవచ్చు. ముంబై నగరంలోని అత్యంత సంపన్నమైన గణపతి మండపాలలో ఒకటిగా పేరుగాంచిన గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) మండల్ తమ 69వ వార్షిక గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా 69 కిలోల బంగారం, 336 కిలోల వెండి ఆభరణాలతో గణేష్ విగ్రహాన్ని అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు. (Ganesh Chaturthi: రైల్లో వినాయక చవితి పిండి వంటలు! ఆర్డర్ చేయండి.. ఆస్వాదించండి..) కాగా ఈ సంవత్సరం ఉత్సవాలకు రూ. 360.45 కోట్ల బీమా కవరేజీని తీసుకున్నట్లు జీఎస్బీ సేవా మండల్ వైస్ ఛైర్మన్ రాఘవేంద్ర జి భట్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో వెల్లడించారు. గతేడాది రూ. 316.40 కోట్లకు బీమా తీసుకోగా ఈసారి మరింత మొత్తానికి కవరేజీ కవరేజీ తీసుకున్నారు. బీమా ప్యాకేజీలో బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులకు రూ. 31.97 కోట్ల కవరేజీ ఉంటుంది. మిగిలినది మంటపం, నిర్వాహకులు, భక్తుల భద్రతకు కవరేజీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. #WATCH | Maharashtra | 'Richest' Ganpati of Mumbai - by GSB Seva Mandal - installed for the festival of #GaneshChaturthi. The idol has been adorned with 69 kg of gold and 336 kg of silver this year. pic.twitter.com/hR07MGtNO6 — ANI (@ANI) September 18, 2023 -
ఇంజినీర్ జాబ్ వదిలి వ్యవసాయం - సంపాదన తెలిస్తే షాకవుతారు!
ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేసేవారు మాత్రమే ఎక్కువ సంపాదిస్తారని చాలామంది నమ్మకం. అయితే ఆధునిక కాలంలో చదువు మాత్రమే కాదు తెలివితేటలతో కూడా బాగా సంపాదించవచ్చని ఎంతోమంది నిరూపిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన 'ప్రమోద్ గౌతమ్'. మహారాష్ట్రకు చెందిన ప్రమోద్ గౌతమ్ ఇంజనీర్ జాబ్ వదిలి, భారతదేశంలోని ధనిక రైతులలో ఒకరుగా మారి.. ఐఐటీ, ఐఐఎమ్, కొన్ని కంపెనీలలో పనిచేసే సీఈఓల కంటే ఎక్కువ సంపాదిస్తూ.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. నిజానికి ఇతడు MNCలో ఆటోమొబైల్ ఇంజనీర్గా పని చేసేవాడు. హార్టికల్చర్.. ఉద్యోగంలో సంతృప్తి చెందని ప్రమోద్ జాబ్ వదిలి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తనకున్న 26 ఎకరాల భూమిలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. అయితే సాధారణ వ్యవసాయ పంటలు కాకుండా హార్టికల్చర్ (ఉద్యాన పంటలు) విధానం ఎంచుకుని గ్రీన్హౌస్లో పండ్లు, కూరగాయలను పండించాడు. ప్రారంభంలో వేరుశెనగ, పసుపు సాగుతో చిన్నగా ప్రారంభించాడు. కానీ పెద్దగా లాభం లేకపోవడంతో పప్పుకి సంబంధించిన పంటలు పండించాలనుకున్నాడు. కొత్త టెక్నాలజీతో వ్యవసాయం చేసి మంచి దిగుబడులను పొందాడు. తరువాత అతి తక్కువ కాలంలోనే వందన ఫుడ్స్ ప్రారంభించి దీని కింద వివిధ రకాల పప్పులు, ధాన్యాలను విక్రయించడం ప్రారంభించాడు. ఈ ఉత్పత్తులు ఇప్పుడు అమెజాన్ & ఫ్లిప్కార్ట్ ద్వారా దేశవ్యాప్తంగా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఇదీ చదవండి: దేశం పేరు మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చవుతుందంటే? విస్తుపోయే నిజాలు.. ఇక ప్రమోద్ గౌతమ్ ఆదాయం విషయానికి వస్తే.. ఇతడు నెలకు రూ. 10 నుంచి రూ. 12 లక్షలు సంవత్సరానికి సుమారు రూ. 1 కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు సమాచారం. దీంతో మొత్తం దేశంలోనే అత్యంత ధనిక రైతుగా నిలిచాడు. వ్యవసాయం మీద మక్కువతో ఉద్యోగం వదిలి ఈ రోజు దేశంలోని టాప్ 10 ధనిక రైతులలో ఒకరుగా నిలిచారు. (Disclaimer: వ్యవసాయం అనేది అందరికి లాభాలను తెచ్చిపెట్టకపోవచ్చు, కావున ఉద్యోగాలు వదిలి ఇలాంటివి చేయడం వల్ల నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటివి సాహసాలు చేయాలనుకునే వారు తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.) -
పాకిస్తాన్ ‘ఆణిముత్యం’.. ఎవరికీ తెలియని షాహిద్ ఖాన్ సక్సెస్ స్టోరీ!
భారత్తో విడిపోయాక పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. అయితే నాటి నుంచి పాక్ ఆర్థిక పరిస్థితి ఏనాడూ సుస్థిరంగా ఉన్న దాఖలాలు లేవు. కరోనా కాలం అనంతరం పాక్ పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యింది. అనంతరం వచ్చిన వరదలు పాకిస్తాన్ను అతలాకుతలం చేశాయి. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో పాక్ అధిక ధరలతో అట్టుడికిపోతోంది. నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్ను కబ్జా చేశాయి. అయితే ఇన్ని ప్రతికూలతల మధ్య ‘పాకిస్తాన్ రిచెస్ట్ మ్యాన్’ కథ అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఇంజినీరుగా కెరియర్ ప్రారంభం పాకిస్తాన్కు చెందిన షాహిద్ ఖాన్ 1950, జూలై 18న లాహోర్లో జన్మించారు. కొంతకాలం పాక్లోనే ఉండిన ఆయన అనంతదం అమెరికాకు వెళ్లారు. తిరిగి ఇప్పుడు పాకిస్తాన్కు వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఇంజినీరుగా ఆయన తన కెరియర్ ప్రారంభించారు. షాహిద్ ఖాన్ 1980లో తన మాజీ యజమాని నుండి ఆటో విడిభాగాల సరఫరా సంస్థ ‘ఫ్లెక్స్ ఎన్ గేట్’ను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి నిరంతర ప్రగతి బాటలో ముందుకు సాగుతున్నారు. ఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితాలో స్థానం మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం షాహిద్ ఖాన్ విజయంలో వన్ పీస్ ట్రక్ బంపర్కు సంబంధించిన డిజైన్ కీలకంగా మారింది. ఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితాలో చేరిన షాహిద్ ఖాన్కు చెందిన కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 69 ప్లాంట్స్ ఉన్నాయి. వీటిలో 26 వేలకుపైగా సిబ్బంది పనిచేస్తున్నారు. షాహిద్ ఖాన్ ఎన్ఎఫ్ఎల్కు చెందిన జాక్సన్విల్లే జాగ్వార్కు కూడా యజమాని. 2012లో ఆయన దీనిని కొనుగోలు చేశారు. దీనితో పాటు అతనికి యూకేలో ఒక ఫుట్బాల్ కంపెనీ కూడా ఉంది. ఆటోపార్ట్స్ తయారీ కంపెనీతో.. షాహిద్ ఖాన్కు చెందిన కంపెనీ ఆటోపార్ట్స్ను తయారు చేసి, విక్రయిస్తుంటుంది. ఇదే అతనికి వచ్చే ఆదాయంలో అత్యంత కీలకమైనది. ఫోర్బ్స్ అందించిన రియల్ టైమ్ బిలియనీర్స్ రిపోర్టును అనుసరించి షాహిద్ ఖాన్ మొత్తం ఆస్తి 12.1 బిలియన్ డాలర్లు. షాహిద్ ఖాన్ పాకిస్తాన్లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తన 16 ఏళ్ల వయసులో కేవలం 500 డాలర్లతో అమెరికా చేరుకున్నారు. అక్కడ తన వ్యాపార విజయంతో వేల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. చదువుకునే సమయంలో కష్టాలు షాహిద్ఖాన్ అమెరికాలోని ఇలినాయిస్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. గతంలో షాహిద్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను అమెరికాలో చదువుకునే సమయంలో డిష్వాషర్ పని కూడా చేశానని తెలిపారు. 1971లో షాహిద్ ఖాన్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1999లో మెకానికల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం షాహిద్ ఖాన్ను విశిష్ట పూర్వ విద్యార్థిగా గుర్తించి, ఘనంగా సన్మానించింది. ఇది కూడా చదవండి: భార్యను 12 ఏళ్లుగా ‘టార్చర్ రూమ్’లో బంధించి.. ఘోరానికి పరాకాష్ట! -
దేశంలో అత్యంత సంపన్న మహిళలు వీళ్లే.. (ఫొటోలు)
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళ.. ఎలాన్ మస్క్, అంబానీ కంటే ఎక్కువే!
World Richest Woman Empress Wu: ఆధునిక కాలంలో ధనవంతులెవరు? అనగానే ప్రపంచ వ్యాప్తంగా ఎలాన్ మస్క్, మన దేశంలో ముఖేష్ అంబానీ గుర్తుకు వస్తారు. ఇక మహిళల్లో అయితే ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్, ఇండియాలో సావిత్రి జిందాల్ జ్ఞప్తికి వస్తారు. వీరందరి కంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళా ఎవరనేది బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం. చైనా మహారాణి.. ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన మహిళల్లో చైనాకి చెందిన మహారాణి 'ఎంప్రెస్ వు' (Empress Wu) అని తెలుస్తోంది. చైనీస్ చరిత్రలోనే టాంగ్ రాజవంశానికి చెందిన ఏకైన అందమైన మహిళా చక్రవర్తి. పదవి కోసం పిల్లలను చంపిన చరిత్ర ఈమెదని కొంతమంది చెబుతారు. ఉన్నత విద్యావంతురాలు.. చరిత్రకారుల ప్రకారం.. ఎంప్రెస్ వు కేవలం అందమైన మహిళ మాత్రమే కాదు, ఉన్నత విద్యావంతురాలు. అలాగే చాలా మోసపూర్తితమైన, క్రూరమైన వ్యక్తిగా తెలుస్తోంది. ఈమె జీవితం ఆధారంగా గతంలో చాలా సినిమాలు కూడా తెరకెక్కాయి. తన రాజ్యాన్ని సుమారు 15 సంవత్సరాలు పరిపాలించి, మధ్య ఆసియాలో చైనా సామ్రాజ్యం విస్తరించడంలో గొప్ప పాత్ర పోషించింది. ఎంప్రెస్ వు హయాంలో టీ, సిల్క్ వ్యాపారంతో మంచి బిజినెస్ జరిగేదని చైనా ప్రాజెక్టు నివేదించింది. ప్రస్తుతం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద 235 బిలియన్ డాలర్లు అని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఒకప్పుడు చక్రవర్తిగా బతికిన ఎంప్రెస్ వు సంపద సుమారు 16 ట్రిలియన్ డాలర్లకి తెలుస్తోంది. అంటే ఈమె సంపద మస్క్ సంపాదకంటే ఎన్నో రెట్లు ఎక్కువని స్పష్టమవుతోంది. -
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్ల సంపద, వేల ఎకరాల భూమి
World Richest Thailand King: ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న సంపన్నులను గురించి.. ప్రపంచంలోని కుబేరుల గురించి కూడా కొంత వరకు తెలుసుకున్నాం. అయితే ఈ రోజు అపారమైన సంపదను మాత్రమే కాకుండా వేల ఎకరాల భూమిని కలిగి, లెక్కకు మించిన వాహనాలను కలిగిన ఒక సంపన్న రాజును గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వేల ఎకరాల భూమి.. నివేదికల ప్రకారం.. థాయ్లాండ్కు చెందిన మహారాజు 'మహా వజిరాలాంగ్కార్న్' (Maha Vajiralongkorn) ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడని తెలుస్తోంది. ఈయన ఆస్తి సుమారు రూ. 3.2 లక్షల కోట్లు. అంతే కాకుండా వజ్రాలు, రత్నాలు వంటి వాటితో పాటు.. 16 వేల ఎకరాల కంటే ఎక్కువ భూమి కూడా వజిరాలాంగ్కార్న్ అధీనంలో ఉండేదని సమాచారం. ఖరీదైన డైమండ్.. భూముల విషయం పక్కనపెడితే మహా వజిరాలాంగ్కార్న్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన 545.67 క్యారెట్ బ్రయోన్ గోల్డెన్ జూబ్లీ డైమండ్ ఉండేదని.. దీని విలువ 12 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ (రూ. 98 కోట్లు) ఉంటుందని అంచనా, ఇది రాజు కిరీటంలో పొందుపరిచారు. వీటితో పాటు అపురూపమైన రాజ వాయిద్యాలు కూడా ఆయన వద్ద ఉండేవని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు! విమానాలు, హెలికాఫ్టర్లు & కార్లు.. బంగారం, వజ్రాలు మాత్రమే కాకుండా.. వజిరాలాంగ్కార్న్ దగ్గర ఏకంగా 38 విమానాలు, లెక్కకు మించిన హెలికాఫ్టర్లు ఉండేవి. ఇందులో నాలుగు బోయిన్, మూడు ఎయిర్బస్ విమానాలు. వీటితో పాటు 300 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు వీరి గ్యారేజిలో ఉండేవి. కేవలం వాహనాలకు వినియోగించే ఫ్యూయెల్ ఖర్చు మాత్రం సంవత్సరానికి రూ. 524 కోట్లు అని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. ఈ రాజు ఎంత సంపన్నుడో ఇట్టే తెలిసిపోతుంది. ఇదీ చదవండి: హీరోలా ఉన్న ఇతడిని గుర్తుపట్టారా? దేశం గర్వించదగ్గ సంపన్నుడు.. విశాలమైన ప్యాలెస్.. థాయ్లాండ్లోని గ్రాండ్ ప్యాలెస్ విస్తీర్ణం ఏకంగా 23,51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని 1782లో నిర్మించినట్లు సమాచారం. ఇది వారి వారసత్వానికి చిహ్నంగా చారిత్రాత్మక కట్టడంగా నిలిచింది. వజిరాలాంగ్కార్న్ రాజుని 'కింగ్ రామ ఎక్స్' అని కూడా పిలుస్తారు. -
ప్రపంచంలో టాప్ రిచెస్ట్ రాయల్ ఫ్యామిలీ ఏదో తెలుసా?
Worlds Most Richest Royal Family: ప్రపంచంలోని అత్యంత సంపన్న రాజ కుటుంబాలు మధ్యప్రాచ్యం నుండి వచ్చాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం అమలులోకి రాకముందు రాజులు, రాజకుటుంబాల పాలన నడిచేది. ప్రస్తుతం ఆ యుగం ముగిసింది. కానీ బ్రిటిష్ రాజకుటుంబం ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబంగా భావిస్తారు. కింగ్ చార్లెస్ III అధికారికంగా అతని భార్య క్వీన్ కన్సార్ట్ కెమిల్లాతో పాటు దేశాధినేతగా పట్టాభిషేక్తిడైన నేపథ్యంలో, యునైటెడ్ కింగ్డమ్ రాయల్ ఫ్యామిలీ రిచెస్ట్ ఫ్యామిలీ అనుకుంటారు. భారీ సంపద గురించి పట్టాభిషేక వేడుకకు ఖర్చు చేసిన డబ్బు గురించే మాట్లాడుకుంటారు. కానీ ఆశ్యర్యకరంగా ది రాయల్ ఫ్యామిలీ ఆఫ్ సౌదీ ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజకుటుంబంగా నిలుస్తోంది. ఎందుకంటే 1.4 ట్రిలియన్లు డాలర్ల సంపదతో బ్రిటిష్ రాజకుటుంబం కంటే 16 రెట్లు విలువైన సంపద ఈ సౌదీ ఫ్యామిలీ సొంతం. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నేతృత్వంలోని సౌదీ రాజ కుటుంబంలో 15,000 మందికి పైగా సభ్యులు ఉన్నారు, వారి సంపదలో ఎక్కువ భాగం దేశంలోని విస్తారమైన చమురు నిల్వల ద్వారా వచ్చిన ఆదాయమే. సౌదీ అరేబియా రాజు ప్రస్తుతం 4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమై అల్ యమామా ప్యాలెస్లో నివసిస్తున్నారు. అగ్రశ్రేణి లగ్జరీ బ్రాండ్లను మాత్రమే ధరించే వీరి ఖజానాలో టన్నుల కొద్దీ బంగారం-వెండితో పాటు విలువైన వజ్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. గ్రాండ్ ప్యాలెస్లో కోట్ల విలువైన లగ్జరీ కార్లు, క్రూయిజ్లతో పాటు బిలియన్ల విలువైన ప్రైవేట్ జెట్లు ఉన్నాయి. ఖరీదైన బంగారు పూతతో కూడిన కారు కూడా ఉంది. ఇంకా కోట్ల విలువైన లగ్జరీ కార్లు లంబోర్ఘిని అవెంటడోర్ సూపర్వెలోస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూపే, మెర్సిడెస్ జీప్ , బెంట్లీ ఉన్నాయి. 2011లలోనే ఫోర్బ్స్ అతని , అతని తక్షణ కుటుంబ సంపద సుమారు 21 బిలియన్లుగా అంచనా వేసింది. యమామా ప్యాలెస్లో సినిమా థియేటర్ అనేక స్విమ్మింగ్ పూల్స్ మసీదు కూడా ఉంది. ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ 400 మిలియన్ డాలర్ల సెరీన్ సూపర్యాచ్, విలాసవంతమైన క్రూయిజ్ షిప్లు కలిగి ఉన్నారు. ఈ భారీ క్రూయిజ్లో 2 హెలిప్యాడ్లు , స్పోర్ట్స్ గ్రౌండ్తో సహా అనేక సౌకర్యాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య విమానం బోయింగ్ 747-400 రాజకుటుంబం సొంతం. ప్రత్యేక విమానంలో ప్యాలెస్లో ఉండే సౌకర్యాలుండటం మరో విశేషం. సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా తన కుమార్తెకు బంగారంతో చేసిన టాయిలెట్ను బహుమతిగా ఇచ్చాడని ప్రతీతి. సౌదీ అరేబియా రాజకుటుంబం తర్వాత, ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న రాజ కుటుంబీకులు కువైట్ నుండి వచ్చారు, మొత్తం కుటుంబం 360 బిలియన్ల డాలర్లకు పైగా ఉంది. ఇక కింగ్ చార్లెస్ III నేతృత్వంలోని యూకే రాయల్ ఫ్యామిలీ మొత్తం నికర విలువ 88 బిలియడాలర్లు. భారతీయ కరెన్సీలో రూ. 7.22 లక్షల కోట్లతో ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన రాయల్లలో 5వ స్థానంలో ఉన్నారు. -
కోహ్లి టాప్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే..
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెటర్గా ఉన్నాడు. ఒకప్పుడు సచిన్, ధోనిలు చూసిన సంపద వైభోగాన్ని ఇప్పుడు కోహ్లి చూస్తున్నాడు. లెక్కలేనన్ని ఎండార్స్మెంట్లు, యాడ్స్తో కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే ఆసియా ఖండంలో మాత్రం కోహ్లి రెండో ధనవంతమైన ఆటగాడిగా నిలిచాడని స్పోర్టికో అనే సంస్థ తమ రిపోర్టులో వెల్లడించింది. 2022 ఏడాదిలో రూ.277 కోట్లు సంపాదించిన కోహ్లి.. ఓవరాల్గా అత్యంత ధనవంతమైన ఆటగాళ్ల జాబితాలో 61వ స్థానంలో నిలిచాడు. ఇక టాప్-100 లిస్ట్లో కోహ్లి మినహా ఏ క్రికెటర్ చోటు సంపాదించలేకపోయాడు. మరి ఆసియా ఖండం నుంచి టాప్ రిచెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరని ఆరా తీస్తే జపాన్కు మహిలా టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా అని తేలింది. 2022 ఏడాదిలో ఈ మాజీ యూఎస్ ఓపెన్ ఛాంపియన్ రూ. 434 కోట్లకు పైగా అర్జించినట్లు రిపోర్టులో వెల్లడించింది. రిపోర్ట్స్ ప్రకారం విరాట్ కోహ్లి ఆర్ధిక ఆదాయం రూ. 1050 కోట్లు అని తెలుస్తోంది. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లికి ఐకాన్ హోదాలో రూ. 15 కోట్లు చెల్లిస్తున్నారు. ఇక టీమిండియా విషయానికి వస్తే.. ఒక టెస్టు మ్యాచ్కు కోహ్లి ఫీజు రూ. 15 లక్షలు.. ఒక వన్డే మ్యాచ్కు రూ. ఆరు లక్షలు.. అలాగే టి20 మ్యాచ్కు రూ. 3లక్షలు ఫీజు రూపంలో తీసుకుంటాడు. ఇక బీసీసీఐ అతనికి ఏప్లస్ కాంట్రాక్ట్లో చోటు కల్పించింది. ఈ లెక్కన కోహ్లికి వార్షిక కాంట్రాక్ట్ కింద ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక టీమిండియా మాజీ కెప్టెన్.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆర్థిక ఆదాయం రూ.1040 కోట్లకు పైమాటే. ఇక 2022 ఏడాదిలో ప్రపంచంలో అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్ల జాబితాలో ఎన్బీఏ స్టార్ లెబ్రన్ జేమ్స్ రూ.1037 కోట్లతో తొలి స్థానంలో ఉండగా.. లియోనల్ మెస్సీ రూ.997 కోట్లతో రెండో స్థానం, క్రిస్టియానో రొనాల్డో రూ. 939 కోట్లతో మూడో స్థానం, నెయ్మర్ రూ. 843 కోట్లతో నాలుగో స్థానం.. ఇక టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కారాజ్ రూ.727 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. చదవండి: ఒక్క మ్యాచ్ ఆడగానే కెప్టెన్ను చేసేశారు.. ఇంటర్ మియామి సారధిగా మెస్సీ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. చూస్తే మైండ్ బ్లాంక్! వీడియో వైరల్ -
దేశంలో అత్యంత ధనిక-పేద ఎమ్మెల్యేలు వీళ్లే..
బెంగళూరు: దేశంలోనే అత్యంత ధనిక, పేద ఎమ్మెల్యేల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) విడుదల చేసింది. ఈ లిస్ట్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్.. టాప్ ప్లేస్లో నిలిచారు. రూ. 1,400 కోట్లకు పైగా ఆస్తులతో.. దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారాయన. 2023లో కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆఫిఢవిట్లలోని వివరాల ప్రకారం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్).. దేశంలో ధనిక, పేద ఎమ్మెల్యేల లిస్ట్ విడుదల చేసింది. ఈ జాబితాలో రూ. 1,400 కోట్ల ఆస్తులతో డీకే శివకుమార్ అత్యంత ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. తరువాత రూ. 1,267 కోట్ల విలువైన ఆస్తులతో కర్ణాటకకే చెందిన గౌరిబిదనూర్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కేహెచ్ పుట్టస్వామి గౌడ రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో కాంగ్రెస్కు చెందిన ప్రియ కృష్ణ రూ. 1,156 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. ఇక తొలి 10 మంది ధనిక ఎమ్మెల్యేల్లో నలుగురు కాంగ్రెస్కు చెందిన వారు కాగా, ముగ్గురు బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. తన ఆస్తుల గురించి శివకుమార్ను ప్రశ్నించగా.. తాను ధనికుడిని కాదని, అలాగని పేదవాడిని కూడా కాదని అన్నారు. ప్రస్తుతం తనకున్న ఆస్తులన్నీ సుదీర్ఘకాలం కష్టపడి సంపాదించుకున్నవని పేర్కొన్నారు. తన ఆస్తులన్నీ తన పేరు మీదే ఉన్నాయని, అందుకే తన పేరిట ఇన్ని ఆస్తులు ఉన్నట్లు వివరణ ఇచ్చారు. వ్యాఖ్యానించారు. కొందరు తమ ఆస్తులను వివిధ వ్యక్తుల పేరిట రాసుకుంటారని, తనకి అలా ఇష్టం ఉండదని చెప్పారు. అందుకే తన పేరిట ఇన్ని ఆస్తులు ఉన్నట్లు చెప్పారు. చదవండి: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు భారీ ఎదురుదెబ్బ ఇక అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమబెంగాల్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా ఉన్నారు. తన పేరు మీద కేవలం రూ. 1,700 ఆస్తులే ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇతని తరువాత ఒడిశాకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే మకరంద ముదులి రూ. 15,000 వేల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. మరోవైపు దేశ వ్యాప్తంగా తొలి 20 మంది సంపన్న ఎమ్మెల్యేల్లో 12 మంది కర్ణాటకకు చెందిన వారే ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. అంతేగాక రాష్ట్రంలో 14 శాతం మంది ఎమ్మెల్యేలు బిలియనీర్లు కాగా వారు రూ.100 కోట్లకు పైగా వ్యక్తిగత ఆస్తులు కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఆ రాష్ట్రంలోని మొత్తం 59 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు కోటీశ్వరులు ఉన్నారు. చదవండి: Manipur Violence.. మహిళపై అఘాయిత్య ఘటన.. ఆరోజు జరిగింది ఇదేనా! -
దేశంలో రిచెస్ట్ గాయని ఎవరో తెలుసా?ఏఆర్ రెహమాన్తో పోలిస్తే?
భారతీయ సినీ పరిశ్రమలో సినీ నేపథ్య గాయకులకు ఉన్న పాపులారిటీ సామాన్యమైంది కాదు. ప్లేబ్లాక్ సింగింగ్ను కరియర్గా ఎంచుకున్న మహిళలు కూడా చాలామందే ఉన్నారు. తెలుగులో సుశీల, జానకి మొదలు వాణీ జయరాం, సునీత, చిన్మయి, ఉష లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అలాగే లతామంగేష్కర్, ఆశా భోంశ్లే బాలీవుడ్ సినిమాను ఏలారు. ఇంకా సునిధి చౌహాన్ , శ్రేయా ఘోషల్, నేహా కక్కర్ లాంటి వాళ్లు లెజెండ్స్గా ఈ తరాన్ని ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలో రిచెస్ట్ గాయని ఎవరో చూద్దాం. భారతీయ సంగీతంలో ప్లేబ్యాక్ సింగింగ్కు సంబంధించి1950-60లలో గాయకులకు పైసా కూడా చెల్లించేవారు కాదట. కానీ లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ వంటి వాళ్లు పోరాటం ఫలితంగా ఈ తరం గాయకులు మంచి రెమ్యునరేషన్ను అందుకోవడం విశేషమే మరి. ఎంతగా అంటే నేడు చాలా మంది గాయకులు కోట్ల రూపాయలు, ఒక్కో పాటకు లక్షల్లో వసూలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అత్యంత ధనిక మహిళా గాయని ఎవరు అనగానే పలు భాషల్లో తమ గాత్రంతో ఆకట్టుకుంటున్న శ్రేయ ఘోషల్, చిన్మయి శ్రీపాద లాంటివాళ్లు గుర్తు వస్తారు కదా! (ఐటీఆర్ ఫైలింగ్లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్) ఈ పేర్లు టాప్ 5లో ఉన్నప్పటికీ, నికర విలువ పరంగా చూస్తే మాత్రం 37 ఏళ్ల తులసీ కుమార్ టాప్ ప్లేస్లో ఉన్నారు. ఈమె నికర విలువ రూ. 200 కోట్లు. అయితే పాటలు పాడటంతోపాటు, కుటుంబ వ్యాపారం నుంచి వచ్చిన సంపాదన కూడా ఈమె నెట్వర్త్కు జత కలిసింది. కంటే కొంత తక్కువగానే ఉన్నాయి. గాయకుడు-అలా సింగర్=ఆంట్రప్రెన్యూర్ నికర విలువ 25 మిలియన్లు డాలర్లు. టీ-సిరీస్ యజమాని భూషణ్ కుమార్ సోదరి తులసికి కుటుంబ వ్యాపారంలో వాటా ఉంది. సుమారు 4000 కోట్ల కంపెనీలో ఆ వాటా ఆమెకు అపారమైన సంపదను జోడిస్తోంది. (Foxconn: ఫాక్స్కాన్ సంచలన నిర్ణయం: లక్షల కోట్ల ప్రాజెక్ట్ నుంచి వెనక్కి) దాదాపు రూ.180-185 కోట్ల నికర విలువతో శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, 100 కోట్ల రూపాయలతో తరువాతి ప్లేస్లో ఉన్నారు. ఇక సింగింగ్ లెజెండ్ ఆశా భోంస్లే నికర విలువ రూ. 80 కోట్లకు పైగా ఉండగా, లేటెస్ట్ సెన్నేషనల్ సింగర్ నేహా కక్కర్ విలువ దాదాపు రూ. 40 కోట్లు. అయితే ఇండియా అత్యంత ధనిక గాయకుడితో పోల్చితే తులసి నికర విలువ తక్కువే. ఆస్కార్ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయుడు ఏఆర్ రెహమాన్ నికర విలువ రూ. 500 కోట్లకు పైగా మాటే. ఇది చాలా మంది బాలీవుడ్ స్టార్లకంటే చాలా ఎక్కువ. తులసి మరిన్ని విషయాలు 1986 మార్చి 15న న్యూఢిల్లీలో జన్మించారు తులసి సోదరుడు భూషణ్ కుమార్, ఖుషాలి కుమార్ అనే సోదరి ఉన్నారు. లేడీ శ్రీ రామ్ మహిళా కళాశాలలో చదువుకుంది. వ్యాపారవేత్త హితేష్ రాల్హాన్తో 2015లో ప్రేమ వివాహం. వీరిద్దరికీ 2017లో శివాయ్ రాల్హాన్ అనే పాప పుట్టింది. 2009లో 'లవ్ హో జే' ఆల్బమ్తో అరంగేట్రం చేసిన అనేక మ్యూజిక్ వీడియోలు, ఆల్బంలతో మిలియన్ల వ్యూస్తో ఆదరణ పొందడమే కాదు తన గాన ప్రతిభకు ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. 2010- గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అకాడమీ అవార్డులు 2014- మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ 2017- ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ 2017- మిర్చి మ్యూజిక్ అవార్డు 2019- IIFA బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్కి నామినేట్ -
వరల్డ్లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్తి తెలిస్తే..?
రిచెస్ట్ పీపుల్ అనగానే మనకి వ్యాపారస్తులు, నటులు లేదా ఇతర సెలబ్రిటీలు గుర్తుకు వస్తారు. మనమిపుడు ప్రపంచంలోని అత్యంత సంపన్న బిచ్చగాడి గురించి తెలుసుకుందాం రండి. అత్యంత పేదరికంలో ఉన్నవారే 'బిచ్చగాళ్లు' గా మారతారు. అది పురుషుడైనా, మహిళ అయినా,పిల్లలైనా. ప్రాథమిక అవసరమైన పొట్ట నింపుకునేందుకు వేరే మార్గం లేకనో, మరే కారణమో బిచ్చమెత్తుకుని జీవిస్తారనేది సాధారణంగా అందరికీ తెలుసు. కానీ అదే భిక్షాటనను లాభదాయకమైన వృత్తిగా మార్చుకున్న వ్యక్తులు ఉన్నారని తెలిస్తే ఆశ్చర్య పోతారు. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం ముంబైలో నివసిస్తున్న భరత్ జైన్ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడు.భరత్ జైన్. ఇతను ముంబైలో ఉంటాడు. రూ. 1.4 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లు ఉన్నాయి. తన వద్ద ఉన్న సొమ్మను షాపుల్లో పెట్టుబడి పెట్టాడు. అంతేకాదు మహారాష్ట్రలోని థానేలో రెండు షాపులను కూడా కొనుగోలు చేశాడు. దీని ద్వారానెలకు రూ. 30వేల అద్దె ఆదాయం వస్తుంది. భారత్ జైన్ నికర విలువ 7.5 కోట్ల డాలర్లు. తాజా లెక్కల ప్రకారంఅతని నెలవారీ సంపాద దాదాపు లక్ష రూపాయలు. 2014 నాటికి భిక్షాటన ద్వారా భరత్ జైన్ సంసాదన ప్రతిరోజూ 2000-2500 రూపాయలు,నెలకు 75వేలు ఆర్జించేవాటంటే అతని ఆదాయాన్ని ఊహించుకోవచ్చు. (రియల్ ఎస్టేట్ దిగ్గజం రామ్కీ దూకుడు: ఈసారి రూ. 2 వేల కోట్ల బుకింగ్స్) ఆర్థిక సంక్షోభం కారణంగా భరత్ జైన్ విద్యను కొనసాగించలేకపోయాడు. భరత్ జైన్కు వివాహమై ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక్కడ విశేషమేమిటంటే... భరత్ జైన్ తన పిల్లలిద్దర్నీ చక్కగా చదివించాడు. భరత్ జైన్, అతని కుటుంబం పరేల్లోని 1BHK డ్యూప్లెక్స్ ఇంటిలో చాలా సౌకర్యవంతంగా నివసిస్తున్నారు. వాళ్ళ పిల్లలు కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారు. కుటుంబంలోని మరికొందరు స్టేషనరీ దుకాణాన్ని కలిగి ఉన్నా. అయినా సరే, భిక్షాటన వదులుకోమని భారత్కు పదే పదే చెప్పినా...ఏమాత్రం వినకుండా దానినే కొనసాగిస్తున్నాడు.ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ లేదా ఆజాద్ మైదాన్లో భరత్ జైన్ లాంటి ప్రదేశాల్లో ఎక్కువగా భిక్షాటన చేస్తాడట. -
టాప్ 10 - ప్రపంచంలోని అత్యంత సంపన్న నటులు
-
భారతదేశంలోని టాప్-10 సంపన్న నటులు
-
Neha Narkhede: టెక్నోస్టార్
పుణెలోని ఆ ఇంట్లో మరాఠీ, హిందీ పాటలతో పాటు పాఠాలు కూడా వినిపించేవి. అయితే అవి క్లాస్రూమ్ పాఠాలు కాదు. ఎన్నో రంగాలలో ఎన్నో అద్భుత విజయాలు సాధించిన మహిళల గురించిన గెలుపు పాఠాలు. ఆ పాఠాలు వింటూ వింటూ ‘నేను కూడా సాధిస్తాను’ అన్నది చిన్నారి నేహ. అవును ఆమె సాధించింది! ఫోర్బ్స్ అమెరికా ‘రిచ్చెస్ట్ సెల్ఫ్–మేడ్ ఉమెన్–2023’ జాబితాలో వివిధ రంగాలకు చెందిన వందమంది మహిళలకు చోటు దక్కింది. వీరిలో పదకొండు మంది నలభై ఏళ్ల వయసులోపు ఉన్నవారు. వారిలో ఒకరు 38 సంవత్సరాల టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్ నేహ నర్ఖాడే.... మహారాష్ట్రలోని పుణెలో పుట్టి పెరిగింది నేహ. ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు తనకు కంప్యూటర్ కొనిచ్చారు. అప్పుడు టెక్నాలజీపై మొదలైన ప్రేమ అలా కొనసాగుతూనే ఉంది. టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్గా కొత్త కొత్త విజయాలు సాధించేలా చేస్తూనే ఉంది. తన బలం ‘తల్లిదండ్రులు’ అని చెప్పుకుంటుంది నేహ. ‘మొదట చదువు విలువ గురించి చెప్పారు. చదువుపై ఆసక్తి పెరిగేలా చేశారు. ఎంతోమంది మహిళా రోల్మోడల్స్ గురించి చెప్పేవారు. నువ్వు కూడా ఏదైనా సాధించాలి అంటూనే... యస్. నువ్వు సాధించగలవు అనే ధైర్యాన్ని ఇచ్చారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించారు’ అంటుంది నేహ. పుణె ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీలో చదువుకున్న నేహ ... జార్జియా (యూఎస్)లో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేసింది. జార్జియాలో చదువుకునే రోజుల్లో ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలి అనే విషయంలో ఎంతోమంది స్నేహితులతో చర్చిస్తూ ఉండేది. ‘ఒరాకిల్’లో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తొలి ఉద్యోగం చేసిన నేహ ఆ తరువాత ‘లింక్ట్ ఇన్’లో చేరింది. ఆ సమయంలో రకరకాల స్టార్టప్లు, వాటి విజయాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ‘అపాచీ కాఫ్కా’ అనే ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్కు శ్రీకారం చుట్టింది. కంపెనీలు తమ డాటాతో వేగంగా యాక్సెస్ అయ్యే అవకాశాన్ని ఈ ప్లాట్ఫామ్ కల్పిస్తుంది. ‘ఎలాంటి జటిలమైన సమస్యను అయినా పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి’ అనేది లక్ష్యంగా నిర్ణయించుకుంది. రెండు సంవత్సరాల తరువాత ‘కన్ఫ్లూయెంట్’ అనే ఫుల్–స్కేల్ డాటా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది నేహ. ప్రపంచవ్యాప్తంగా వేలాది కంపెనీలు ‘కన్ఫ్లూయెంట్’ నుంచి సేవలు పొందుతున్నాయి. కంపెనీకి సంబంధించి భాగస్వాములు, ఉద్యోగులను ఎంచుకోవడంలో నేహ అనుసరించే పద్ధతి ఏమిటి? ఆమె మాటల్లో చెప్పాలంటే... ‘తెలివితేటలతో పాటు కష్టపడే స్వభావం ముఖ్యం. వీరితో ఐడియాలు షేర్ చేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది అనిపించాలి. సమస్య తలెత్తినప్పుడు మెరుపు వేగంతో పరిష్కరించే సామర్థ్యం ఉండాలి’ నేహ ఎంటర్ప్రెన్యూర్గా ప్రయాణం మొదలు పెట్టినప్పుడు స్టార్టప్ కల్చర్పై ఇప్పుడు ఉన్నంత అవగాహన లేదు. ప్రతి అడుగు ఆచితూచి వేసినా ఎక్కడో ఏదో తప్పు జరుగుతుండేది. వెంటనే ఆ తప్పును దిద్దుకొని ముందుకు సాగేది. నేహా నర్ఖాడే విజయరహస్యం ఏమిటి? ‘వ్యూహాలు, ప్రతివ్యూహల సంగతి తరువాత. ఎంటర్ప్రెన్యూర్లకు తప్పనిసరిగా కావాల్సింది మానసిక బలం. ఆ బలం ఉంటే యుద్ధరంగంలో అడుగు ముందుకు వేయగలం. విజయాలు సాధించగలం. ఇది నా దారి... అంటూ పరుగెత్తడం కాదు. చుట్టూ ఏం జరుగుతుందో అనేదానిపై పరిశీలన దృష్టి ఉండాలి. మన తప్పుల నుంచీ కాదు ఇతరుల తప్పుల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. టైమ్మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఏ రోజైనా సరే... చేయాల్సిన పనిపై పక్కా ప్రణాళిక ఉండాలి’ అంటుంది నేహ. నేహ ఇప్పుడు ఎంతోమంది మహిళలకు రోల్మోడల్, తన రోల్మోడల్ మాత్రం ఎలక్ట్రిక్ కార్ స్టార్టప్ ‘నియో’ ఫౌండర్, సీయివో పద్మశ్రీ వారియర్. ‘రోల్మోడల్ స్థానంలో మనల్ని మనం చూసుకుంటే వారిలా విజయం సాధించడం కష్టం కాదు’ అంటుంది నేహ నర్ఖాడే. టైమ్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఏ రోజైనా సరే... చేయాల్సిన పనిపై పక్కా ప్రణాళిక ఉండాలి. – నేహ -
ప్రపంచంలోని టాప్ 10 శ్రీమంతులు వీరే
-
రిచెస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు.. ఏడీఆర్ నివేదికలో అసలు వాస్తవం
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో అత్యధిక ధనవంతుడు చంద్రబాబుగా ఏడీఆర్ నివేదికలో అసలు వాస్తవం బయటపడింది. దేశంలోనే మూడో ధనిక ఎమ్మెల్యేగా చంద్రబాబును ఏడీఆర్ నివేదిక పేర్కొంది. చంద్రబాబు రిచెస్ట్ అనే వాస్తవాన్ని ఎల్లో మీడియా దాచిపెట్టింది. దేశంలో ధనిక ఎమ్మెల్యేల జాబితాలో మొదటి స్థానం ఎన్ నాగరాజు, రెండో స్థానం డీకే శివ కుమార్ ఉండగా, రూ.668 కోట్లతో ఏపీలో మొదటి స్థానం, దేశంలో 3వ స్థానంలో చంద్రబాబు ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించింది. చదవండి: చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ సెగ.. ఈడ్చిపడేయాలంటూ ఆదేశాలు -
Rishi Sunak: రిచ్ రిషి.. బ్రిటన్లో అత్యంత ధనిక ఎంపీగా రికార్డు
రిషి సునాక్ కోట్లకు పడగలెత్తారు. బ్రిటన్లో అత్యంత ధనిక ఎంపీగా రికార్డు సృష్టించారు. రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిల ఆస్తుల విలువ 73 కోట్ల పౌండ్లకు పైగా ఉంటుందని టైమ్స్ ఆఫ్ లండన్ అంచనా వేసింది. బ్రిటన్లో అత్యంత సంపన్నులైన 250 మందిలో రిషి కూడా ఉన్నారు. వీరికి ఉన్న ఆస్తుల విలువ బ్రిటన్ రాచకుటుంబానికి ఉన్న ఆస్తుల కంటే ఎక్కువని అంటారు. బ్రిటన్ రాజు చార్లెస్–3, కెమిల్లా ఆస్తుల విలువ 300–350 మిలియన్ పౌండ్లు ఉంటే, దానికి రెట్టింపు ఆస్తుల్ని రిషి కలిగి ఉన్నారు. దీంతో అత్యంత ధనికుడైన ప్రధానిగా కూడా రిషి రికార్డు సృష్టించారు. అయితే తన ఆస్తిపాస్తుల గురించి రిషి ఎప్పుడూ బాహాటంగా వెల్లడించలేదు. రిషి లైఫ్స్టైల్ కూడా కాస్ట్లీగా ఉంటుంది. 3,500 పౌండ్లు ఖరీదు చేసే సూట్లు, 490 పౌండ్లు ఖరీదైన షూస్ వేసుకుంటారు. 180 పౌండ్ల విలువ చేసే మగ్గులో కాఫీ తాగుతారు. చిన్నప్పట్నుంచి రిషి కుటుంబానికి డబ్బుకి లోటు లేదు. తండ్రి డాక్టర్, తల్లి మందుల దుకాణాన్ని నడిపేవారు. చదువుకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ఆ కుటుంబం బ్రిటన్లో ధనికులు మాత్రమే చదివే వించెస్టర్ కాలేజీలో చేర్పించారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నాక ఆయన సంపద మరింత పెరిగింది. ఈ దంపతులకి లండన్, యార్క్షైర్, ఇంగ్లండ్, శాంటామోనికా, కాలిఫ్లో సొంత ఇళ్లు ఉన్నాయి. రిషి కుటుంబంలో పశ్చిమ లండన్లోని కెన్సింగ్టన్లో అయిదు బెడ్రూమ్లున్న నివాసంలో ఎక్కువ కాలం గడుపుతారు. ఆ ఇంటి ఖరీదు 70 లక్షల పౌండ్లు ఉంటుంది. ఆయన సొంత నియోజకవర్గమైన రిచ్మండ్లో 2015లో ఎంపీగా ఎన్నిక కాక ముందు 15 లక్షల పౌండ్లతో ఇల్లు కొన్నారు. ఇప్పుడు మరో 20 లక్షల పౌండ్లతో దానికి హంగులు చేకూరుస్తున్నారు. ఇంటిలోపలే స్విమ్మింగ్ పూల్, జిమ్, యోగా స్టూడియో, హాట్ టబ్, టెన్నిస్ కోర్టు వంటివి ఏర్పాటు చేయడానికి ఏకంగా 4 లక్షల పౌండ్లు ఖర్చు పెట్టారు. అందులో నీళ్లు వేడి చేయడానికే ఏడాదికి 14వేల పౌండ్లు ఖర్చుపెట్టాలి. ఇది ఒక సగటు కుటుంబం విద్యుత్ బిల్లు కంటే ఆరు రెట్లు ఎక్కువ. అక్షతా మూర్తి భారతీయ పౌరురాలిగా కొనసాగుతూ పన్నులు ఎగ్గొట్టారని విమర్శలొచ్చాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కంగ్రాట్స్! ఈ విషయంలో మీ దరిదాపులో ఎవరూ రాలేర్సార్!
కంగ్రాట్స్! ఈ విషయంలో మీ దరిదాపులో ఎవరూ రాలేర్సార్! -
కరోనాతో కొత్తగా 16 కోట్ల మంది నిరుపేదలు
న్యూఢిల్లీ/దావోస్: కరోనా సంక్షోభంతో ప్రపంచదేశాలు ఆర్థికంగా కునారిల్లినప్పటికీ అపరకుబేరుల సంపద పెరిగిపోతూనే ఉంది. పేదలు నిరుపేదలుగా మారుతూ ఉండటంతో ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ రెండేళ్ల కాలంలో మరో 16 కోట్ల మందికి పైగా దుర్భర దారిద్య్రంలోకి కూరుకుపోయారని పేదరిక నిర్మూలనకు పాటుపడే స్వచ్ఛంద సంస్థ ఆక్స్ఫామ్ అధ్యయనంలో వెల్లడైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ సదస్సు తొలి రోజు సోమవారం ఆక్స్ఫామ్ సంస్థ ఆర్థిక అసమానతలపై వార్షిక నివేదిను ‘‘ఇన్ఈక్వాలిటీ కిల్స్’’పేరుతో విడుదల చేసింది. కరోనా మహమ్మారి బిలియనీర్ల పాలిట బొనాంజాగా మారిందని ఆక్స్ఫామ్ నివేదిక పేర్కొంది. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక హింస నెలకొంది. ధనవంతులు మరింత ధనవంతులు అయ్యేలా ప్రభుత్వాలు విధానాలు రూపొందిస్తున్నాయి. దీని కారణంగా నిరుపేదలు చితికిపోతున్నారు. ఇప్పటికైనా ధనవంతులపై మరిన్ని పన్నులు వేసి వారి సంపదను వెనక్కి తీసుకువస్తే ఎందరి ప్రాణాలనో కాపాడిన వారు అవుతారు’’అని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాబ్రియెలా బచర్ వ్యాఖ్యానించారు. బిలియనీర్లు జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్, బిల్ గేట్స్ సహా ప్రపంచంలోని టాప్–10 జాబితాలో ఉన్న వారి ఒక్క రోజు సంపాదన దాదాపుగా 130 కోట్ల డాలర్లు (రూ 9,658 కోట్లు) ఉంది. ► ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన 10 మంది సంపాదన 70 వేల కోట్ల డాలర్లు (రూ. 52 లక్షల కోట్లు) నుంచి 1.5 లక్షల కోట్ల డాలర్లుకు (రూ. 111 లక్షల కోట్లకు పై మాటే) చేరుకుంది. ► ప్రపంచంలోని నిరుపేదలైన 310 కోట్ల మంది కంటే ఈ పది మంది ఆరు రెట్లు అధిక సంపన్నులు ► ఆర్థిక అసమానతలు ప్రపంచవ్యాప్తంగా రోజుకి సగటున 21 వేల మంది ప్రాణాలను తీస్తున్నాయి. 310 కోట్ల మంది నిరుపేదల కంటే 10 మంది కుబేరుల సంపాదనే ఎక్కువ భారత్లో 84% కుటుంబాల ఆదాయం తగ్గింది భారత్లో కరోనా మహమ్మారి కుటుంబాలను ఆర్థికంగా ఛిద్రం చేసింది. 2021లో దేశంలోని 84 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోయి ఆర్థిక కష్టాల్లో మునిగిపోయారు. అదే సమయంలో కోటీశ్వరుల సంఖ్య 102 నుంచి 142కి పెరిగింది. దేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద రికార్డు స్థాయిలో ఏడాదిలోనే రూ.57.3 లక్షల కోట్లకు (77,500 కోట్ల అమెరికా డాలర్లు) చేరుకుంది. జనాభాలో ఆర్థికంగా దిగువన ఉన్న 50 శాతం జనాభా జాతి సంపదలో 6 శాతం మాత్రమే కలిగి ఉన్నారు. ► భారత్లో కోట్లకు పడగలెత్తిన వారి సంఖ్య ఏడాదిలో 39% పెరిగింది. వందకోట్లకు పైగా ఆస్తి ఉన్న కోటీశ్వరులు 102 నుంచి 142కి పెరిగారు ► భారత్లో టాప్–10 కోటీశ్వరుల దగ్గరున్న సంపదతో దేశంలో ఉన్న పిల్లలు ప్రాథమిక, ఉన్నత విద్యకూ కావల్సిన నిధులను 25 ఏళ్ల పాటు సమకూర్చవచ్చును. ► టాప్– 10 కోటీశ్వరులు రోజుకు రూ. 7.42 కోట్లు ఖర్చు పెట్టినా... వారివద్ద ప్రస్తుతమున్న ఆస్తి మొత్తం హరించుకుపోవడానికి 84 ఏళ్లు పడుతుంది. ► కోటీశ్వరుల్లో 10 శాతం మందిపై అదనంగా ఒక్క శాతం పన్ను వసూలు చేస్తే 17.7 లక్షలు అదనంగా ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేయొచ్చు. ► 98 మంది బిలియనీర్లపై ఒక్క శాతం అదనంగా పన్ను వసూలు చేస్తే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఏడేళ్లకు పైగా నడపడానికి నిధులు సమకూరుతాయి. ► కరోనా సంక్షోభ సమయంలో భారత్లో మహిళల్లో 28 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. మూడింట రెండొతుల ఆదాయాన్ని కోల్పోయారు. -
ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!
World's Richest Dog: నిజానికి చాలామంది ఏంటీ ఈ జీవితం మరి విలువ లేకుండా పోయింది. మరీ కుక్క కన్న హీనంగా జీవిస్తున్నాం ఛీ అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ కుక్కని చూశాక అందరూ బతికితే ఈ కుక్కలా బతకాలి అని కచ్చితంగా అనుకుంటారు. ఏంటి ఇలా చెబుతున్నారు అని అనుకోకండి. ఇది నిజం యూఎస్లోని మియామిలో నివశిస్తున్న కుక్కను చూసి ఎవరైన ఇలానే అనుకుంటారు. (చదవండి: ఆ మూడు వ్యవసాయ బిల్లులు రద్దవ్వడంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది) అసలు విషయంలోకెళ్లితే...యూఎస్లోని మియామిలో నివసిసున్న కుక్క ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క. పైగా దీనికి వందల కోట్లు విలువ చేసే భారీ బంగ్లా కూడా ఉంది. అయితే ఈ కుక్క పేరు గుంథర్ VI. ఈ కుక్క తాత గుంథర్ IV అనే మరో కుక్క నుంచి 500 మిలియన్ డాలర్ల(రూ.3715 కోట్లు) సంపద వారసత్వంగా లభించింది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ కుక్కలకు ఆస్తులు లభిస్తున్నాయి. ఈ కుక్క వంశానికి చెందిన గుంథర్ III 1992లో మరణించింది. దీంతో దాని చివరి యజమాని జర్మన్ కౌంటెస్ కార్లొట్టా లైబెన్స్టెయిన్ నుంచి ఈ కుక్కకు 58 మిలియన్ డాలర్లు (సుమారు రూ.431 కోట్లు) విలువ చేసే ట్రస్ట్ వారసత్వంగా లభించింది. అంతేకాదు రోజులు గడిచే కొద్ది ఆ ఆస్తుల విలువ పెరుగడం వల్ల గుంథర్ VI ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్కగా రికార్డులకెక్కింది. ఈ కుక్కల ఆఖరి యజమాని చనిపోయిన తర్వాత హ్యాండర్ల బృందం వీటి బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే ఈ గుంథర్ VI తాను నివశిస్తున్న టుస్కాన్ విల్లాను అమ్మకానికి పెట్టింది. ఈ మేరకు ఈ భారీ సౌధాన్ని 2000 సంవత్సరంలో మడొన్నా నుంచి కొనుగోలు చేశారు. అయితే అప్పట్లో ఈ బంగ్లా విలువ రూ.7.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.53 కోట్లు). కానీ ఇప్పుడు దీన్ని రూ.238 కోట్లకు అమ్మకానికి పెట్టారు. అంతేకాదు ఈ భవనాన్ని 1928లో నిర్మించారు. ఇందులో మొత్తం తొమ్మిది బెడ్రూమ్లు, ఎనిమిది బాత్రూమ్లు, ఔట్ డోర్ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. పైగా ఈ ఇంటిని విక్రయించే బాధ్యతను ది అసోలిన్ టీమ్కు చెందిన ‘రూతీ అండ్ ఏతాన్ అస్సౌలిన్’ సంస్థ స్వీకరించింది. ఈ మేరకు ఆ సంస్థ నిర్వాహకురాలు రుతీ మాట్లాడతుతూ...అత్యంత ఖరీదైన ఈ భారీ సౌధానికి యజమాని కుక్క అని నేను ఆశ్చర్యపోయాను. అసలు నేను మొదట నమ్మలేకపోయాను. పైగా ఈ భవనానికి గొప్ప చరిత్ర ఉంది. అంతేకాదు గుంథర్ VIతో మేం సమావేశమైనప్పుడు ఆ కుక్క పరుగెత్తుకుంటూ వచ్చి నాకు ముద్దిచ్చింది. ఓహో ఇది మాతో తను ఒప్పందం చేసుకోవడం ఇష్టమే అన్నట్లుగా ఇలా ముద్దిచ్చినట్లుందని భావిస్తున్నా" అని అన్నారు. (చదవండి: ఆ హోటల్లో దెయ్యాలు..! ‘ఎలిజిబెత్’.. అంటూ మగ గొంతుతో పిలిచి..) -
అమెరికాను దాటి ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా చైనా..
బీజింగ్: ప్రపంచలో అత్యంత ధనిక దేశంగా చైనా కొత్త రికార్డ్ సృష్టించింది. సంపద సృష్టిలో అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టి నెంబర్ వన్గా డ్రాగన్ దేశం అవతరించింది. గడిచిన రెండు దశాబ్ధాల్లో ప్రపంచ సంపదలో చైనా సంపద మూడు రేట్లు పెరిగినట్లు బ్యూమ్బెర్గ్లోని నివేదిక వెల్లడించింది. మెకిన్సే అండ్ కో పరిశోధనా విభాగం 10 దేశాల బ్యాలెన్స్ షీట్లను విశ్లేషించి ఈ నివేదిక అందించినట్లు పేర్కొంది. ప్రపంచం మొత్తం ఆదాయంలో 60 శాతం ఈ పది దేశాల వద్దే ఉన్నట్లు పేర్కొంది. ఆ దేశాల జాబితాలో అమెరికా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, మెక్సికో, స్వీడన్లు ఉన్నాయి. మెకిన్సే ఏజెన్సీ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సంపద 2000లో 156 ట్రిలియన్ డాలర్లు ఉండగా ఇది 2020లో అనూహ్యంగా 514 ట్రిలియన్ డాలర్లకు పెరిగినట్లు వెల్లడించింది. దీనిలో చైనాకు అత్యధిక వాటా లభించిందని, ప్రపంచ ఆదాయంలో దాదాపు మూడో వంతు చైనా సొంతమైందని తెలిపింది. కాగా గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు మనం సంపన్నులమయ్యామని జూరిచ్లోని మెకన్సీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ భాగస్వామి జాన్ మిచ్కి తెలిపారు. 2000 సంవత్సరంలో 7 ట్రిలియన్ల డాలర్లు ఉన్న చైనా సంపద ఇప్పుడు 120 ట్రిలియన్ల డాలర్లకు చేరుకున్నట్లు వెల్లడించారు. ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా చేరిన తర్వాత ఆ దేశ సంపద దూసుకెళ్తున్నట్లు మెకన్సీ తన రిపోర్ట్లో తెలిపింది. మరోవైపు అమెరికా సంపద రెండితలు పెరిగి 90 ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంది. చైనా, అమెరికా ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్న దేశాలు. అయితే ఈ రెండు దేశాల్లో మూడింట రెండొంతుల సంపద కేవలం 10 శాతం కుటుంబాల వద్దే ఉందని ఈ నివేదిక పేర్కొంది. కేవలం వారు మాత్రమే మరింత ధనవంతులు అవుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 68 శాతం నికర సంపద మొత్తం రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉందని నివేదిక తెలిపింది. -
Nita Ambani Expensive Things: రూ.100 కోట్ల కారు, డ్రైవర్ జీతం ఎంతంటే?
-
మళ్ళీ అంబానీని దాటిన అదాని...
-
ఆసియాలో రెండో అతిపెద్ద శ్రీమంతునిగా ప్రముఖ భారతీయుడు
న్యూఢిల్లీ: భారత ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ చరిత్ర సృష్టించారు. ఆసియా శ్రీమంతుల జాబితాలో రెండో స్థానానికి దూసుకుపోయారు. అదానీ గ్రూపుకు చెందిన వివిధ రంగాల షేర్లు ఈ ఏడాది(2021)లో అమాంతం పెరగడంతో అతని సంపదన కూడా అదే రీతిన పెరిగింది. ఫలితంగా ఆసియాలోనే రెండో ధనవంతుడిగా తన పేరుని నమోదు చేసుకున్నాడు. ఇటీవల ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-20లో చోటు దక్కించుకున్న అదానీ ప్రస్తుతం ఈ ఘనతను సాధించాడు. కాగా రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించిన ప్రకారం.. ఇప్పటిదాకా ఆసియాలో రెండో స్థానంలో కొనసాగిన చైనా పారిశ్రామికవేత్త జోంగ్ షాన్షాన్ ఆస్తి 6,360 కోట్ల డాలర్లకు పడిపోయింది. అదానీ గ్రూప్ షేర్ల ర్యాలీతో గురువారం నాటికి గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద 6,650 కోట్ల డాలర్లకు పెరిగింది. దీంతో షాన్షాన్ను వెనక్కి నెట్టి గౌతమ్ అదానీ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఏడాదిలో అదానీ ఆస్తి 3,270 కోట్ల డాలర్లు పెరగగా అదే క్రమంలో షాన్షాన్ ఆస్తి 1,460 కోట్ల డాలర్లు క్షీణించింది. ప్రస్తుతం ప్రపంచ శ్రీమంతుల జాబితాలో అంబానీ 13వ స్థానంలో వుండగా, అదాని 14వ స్థానంలో ఉన్నట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకటించింది. చదవండి: 18 మిలియన్ల పోస్టులను తొలగించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ -
నా దృష్టిలో నాగలక్ష్మి అత్యంత ధనవంతురాలు: సోనూసూద్
ముంబై: టాలీవుడ్ సినిమాల్లో విలన్ పాత్రలతో పరిచయమైన సోనూసూద్ లాక్డౌన్ మొదలు నుంచి ప్రజలకు సహాయం చేస్తూ నిజ జీవితంలో హిరోగా మారాడు. సోనూ ముంబైలో ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడ ఎటువంటి సహాయం కావాలన్న తక్షణమే ఆపన్న హస్తం అందించడంలో సోనూ ముందుంటున్నాడు. ఒక్కోసారి ప్రభుత్వాలకు కూడా సాధ్యం కాని కొన్ని పనులను ఆయన క్షణాల్లో చేసి చూపెడుతున్నారు. సేవ చేయాలంటే కావాల్సింది చేయాలనే శ్రద్ధ అని నిరూపిస్తున్న సోనూసూద్ తాజాగా ఒక మహిళను ట్విటర్లో ప్రశంసించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంధురాలైన నాగలక్ష్మి అనే మహిళ ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ఆమెకు ప్రభుత్వం నుంచి మూడు వేల రూపాయల దివ్యాంగుల పెన్షన్ లభిస్తోంది. ఇటీవల ఆమె తన ఐదు నెలల పెన్షన్ 15 వేల రూపాయలను సోనూసూద్ ఫౌండేషన్కు విరాళంగా ఇచ్చింది. ఈ విషయం తెలియడంతో సోనూసూద్ ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో.. ఆంధ్రప్రదేశ్ లోని వరికుంటపాడు అనే ఒక చిన్న గ్రామానికి చెందిన బొడ్డు నాగలక్ష్మి సోనూసూద్ ఫౌండేషన్కు 15 వేల రూపాయలు విరాళంగా ఇచ్చింది. ఆ డబ్బు ఆమెకు ఐదు నెలల పెన్షన్ అని సోనూసూద్ పేర్కొన్నారు. నా వరకు ఆమె భారతదేశంలోని అత్యంత ధనవంతురాలు. ఒకరి బాధను చూడటానికి మనకి కంటి చూపు అవసరం లేదని ఆమె సందేశం ఇచ్చింది. ఆమె నిజమైన హీరో అని సోనూ పేర్కొన్నాడు. ( చదవండి: రూ. 11 కోట్లకు చేరువలో ‘విరుష్క’ విరాళాల సేకరణ ) Boddu Naga Lakshmi A Blind girl and a youtuber. From a small village Varikuntapadu in andra Pradesh Donated 15000 Rs to @SoodFoundation & that's her pension for 5 months. For me she's the RICHEST Indian. You don't need eyesight to see someone's pain. A True Hero🇮🇳 pic.twitter.com/hJwxboBec6 — sonu sood (@SonuSood) May 13, 2021 -
షౌపెట్... రిచెస్ట్ క్యాట్ గురూ...
పిల్లులందు ఈ పిల్లి వేరయా! అని అనక తప్పదు. ఎందుకంటే పై ఫోటోలో కనిపిస్తున్న పిల్లి ప్రపంచంలోనే అత్యంత ధనికురాలట. జర్మనీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ లాగర్ఫెల్డ్(85) బర్మీస్ జాతికి చెందిన పిల్లిని అపురూపంగా పెంచుకున్నాడు. ఈ పిల్లికి షౌపెట్ అని నామకరణం చేసి.. రాజ భోగాలు అందించారు. 2011లో తన స్నేహితుడి దగ్గరి నుంచి ఇష్టపడి తెచ్చుకుని ఈ మార్జాలనికి ఓ బాడీగార్డును, పనివాళ్లను కూడా ఏర్పాటు చేశాడు. ఇప్పటికే ఈ పిల్లి పలు కాస్మోటిక్ బ్రాండ్స్ ప్రకటనల్లో, కారు ప్రకటనల్లో కనిపించింది. మోడళ్లు ఫోటోలకు పోజులివ్వడానికి కూడా షౌపెట్ను వాడేవారు. అంతేకాకుండా షౌపెట్పై ప్రేమతో ‘షౌపెట్: ది ప్రైవేట్ లైఫ్ ఆఫ్ ఎ హై ఫ్లైయింగ్ ఫ్యాషన్ క్యాట్’అనే పుస్తకాన్ని కూడా కార్ల్ రాశాడు. అందుకే కార్ల్ అనేకమార్లు షౌపెట్ ధనికురాలంటూ సంబోధించేవాడు. ఇక షౌపెట్కు ఇన్స్టాగ్రామ్లో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉండటం విశేషం. కార్ల్ కూడా దానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పిల్లిగారికి సోషల్ మీడియాలో తెగ క్రేజ్ ఏర్పడింది. అన్నీ సజావుగా జరుగుతున్న సమయంలో కార్ల్ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అద్భుతమైన ఫ్యాషన్ డిజైనర్ను కోల్పోయామని నెటిజన్లు ట్వీట్లు చేశారు. కాగా మరణానికి ముందే కార్ల్ తనకు ఎంతో ఇష్టమైన పిల్లి బాగోగుల గురించి ఆలోచించారు. తన మొత్తం ఆస్తిని రాసిస్తున్నట్లు గతంలోనే పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. దీంతో ఆయన సంపాదించిన ఆస్తిలో 150 మిలియన్ పౌండ్లు(సుమారు రూ.14వేల కోట్లు) ఇప్పుడు ఈ పిల్లికి దక్కనున్నట్లు సమాచారం. మార్జాలమా మజాకానా మరి. -
దేశంలో అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ
-
అప్పు లేనివాడు అధిక సంపన్నుడు
ఇది పెద్దలు అనుభవంతో చెప్పిన మాట. అయితే, ఇప్పుడు అప్పు చేయడం ఒక ఫ్యాషన్. ఒక అలవాటు. అప్పు చేయనిదే పొద్దు పోదు కొందరికి. రకరకాల కారణాలు చెప్పి, అవతలి వాళ్లని బురిడీలు కొట్టించి మరీ అప్పు చేసి, జల్సాలు చేయడం ఇంకొందరి నిత్యకృత్యం. కావాలంటే వడ్డీ ఎంతయినా తీసుకోండి కానీ, అప్పు లేదని మాత్రం అనకండి అంటూ ముందే ముందరి కాళ్లకు బంధాలు వేస్తారు. ఒకటి రెండుసార్లు మాట నిలబెట్టుకుని నమ్మకం కలిగిస్తారు, ఆ తర్వాత నట్టేట ముంచుతారు. నిజానికి అప్పు చేయడం తప్పేమీ కాదు. అవసరానికి సరిపడా డబ్బు లేకపోతేనో, సమయానికి సర్దుబాటు కాకపోతేనో చేబదులు తీసుకోవచ్చు. అయితే, అప్పు చేయడాన్ని అలవాటుగా మార్చుకోవడమే తప్పు. అవసరానికి అప్పు ఇచ్చి ఆదుకున్న వాళ్లకు ముఖం చాటేయడం ఇంకా తప్పు. గట్టిగా అడిగితే ‘మీ డబ్బు తీసుకుని మేమేమీ ఊరొదిలి పారిపోములే’ అంటూ ఈసడింపుగా మాట్లాడటం ఇంకా పెద్ద తప్పు. ఇరుగు పొరుగు దగ్గరో, తెలిసిన వాళ్ల దగ్గరో చేబదుళ్లు తీసుకోవడం నామోషీగా మారిపోయి, క్రెడిట్ కార్డులు తీసుకోవడం, కార్డు చేతిలో ఉంది కదా అని దానిని ఎడాపెడా వాడేయటం, ఆ తర్వాత ఆ అప్పులు తీర్చలేక తల వేలాడేయడం... ఇదంతా ఊహించే పెద్దలు ‘అప్పు లేనివాడు అధిక సంపన్నుడు’ అన్నారు. అందుకే, అవసరానికి అప్పు చేయడం తప్పు కాదు. అవసరం లేకున్నా అప్పు చేసి మరీ ‘మా దగ్గర ఆ వస్తువులున్నాయి, ఈ వస్తువులున్నాయి’ అని గప్పాలు కొట్టుకోవడం, విందు వినోదాలతో జల్సా చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పే. అందుకే ‘అప్పు చేసి పప్పు కూడు’ తినేకన్నా, ఉన్నదానిని జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ హుందాగా జీవించడమే ఆనందం. -
భారత్ కుబేరుల్లో.. ముకేశ్ అంబానీ టాప్
‘హురున్’ గ్లోబల్ లిస్ట్ 2016 వెల్లడి బీజింగ్: అత్యంత ధనవంతుడైన భారతీయుడిగా రిలయన్స్ ముకేశ్ అంబానీ నిలిచారు. ఆయన సంపద 30 శాతం వృద్ధితో 2,600 కోట్ల డాలర్లకు పెరిగిందని హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2016 వెల్లడించింది. ప్రపంచవ్యాప్త అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన 21వ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో 8,000 కోట్ల డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ బిల్గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. భారత్లో బిలియనీర్ల సంఖ్య 111కు పెరిగిందని, అధిక బిలియనీర్లు ఉన్న దేశంగా అమెరికా, చైనా తర్వాతి స్థానం మనదేనని ఈ జాబితా తెలిపింది. గత ఏడాదితో పోల్చితే భారత బిలియనీర్ల సంఖ్య 14 పెరిగిందని, మొత్తం ఈ 111 బిలియనీర్ల సంపద 16 శాతం వృద్ధితో 30,800 కోట్ల డాలర్లకు ఎగసిందని పేర్కొంది. 10వేల కోట్ల డాలర్ల సంపద సాధించిన జీవించి ఉన్న ఏకైక వ్యక్తిగా బిల్గేట్స్ నిలిచారని, అయితే తన సంపదలో 2,000 కోట్ల డాలర్లు విరాళాలుగా ఇవ్వడంతో ఆయన సంపద 8,000 కోట్ల డాలర్లుగా ఉందని ఆ నివేదిక వివరించింది. బిల్గేట్స్తర్వాత 6,800 కోట్ల డాలర్ల సంపదతో వారెన్ బఫెట్ రెండో స్థానంలో నిలిచారు. -
ప్రపంచ కుబేరులు తీవ్రంగా నష్టపోయారు!
ప్రపంచ కుబేరుల్లో సుమారు నాలుగు వందలమంది కేవలం మూడు వారాల్లోనే వందల బిలియన్ డాలర్లను కోల్పోవడం మార్కెట్ ప్రపంచాన్నే నివ్వెరపరుస్తోంది. వీరంతా మూడు సంవత్సరాల కాలంతో పోలిస్తే ఈ ఒక్క నెలలోనే భారీ నష్టాలను చవిచూశారు. ఉమ్మడిగా వీరు నష్టపోయిన సంపద విలువ 350 బిలియన్ డాలర్లని బ్లూమ్ బర్గ్ బిజినెస్ రిప్టోర్లులు చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఈక్విటీల వృద్ధి రేటు తీవ్రంగా పడిపోవడంతో వందలమంది బిలియనీర్లు భారీ నష్టాల పాలయ్యారు. బ్లూం బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం ఈ ఒక్కవారంలోనే వారంతా సుమారు 115 బిలియన్ డాలర్ల నష్టాలను చవి చూశారు. అందులో ఏడుగురు శుక్రవారం ఒక్కరోజులోనే ఒక బిలియన్ డాలర్లను కోల్పోయినట్లు నివేదికలు చెప్తున్నాయి. బ్లూమ్బర్గ్ ఇండెక్స్ ప్రకారం అమెజాన్ డాట్ కామ్ ఇంక్ (Amazon.com Inc. ) వ్యవస్థాపకుడు జెఫ్ బెజాస్ నష్టాల్లో అందరికన్నా ముందున్నారు. 8.9 బిలియన్ డాలర్లను ఈ ఒక్క నెల్లోనే నష్టపోయారు. అంతేకాక ఒక్క శుక్రవారం రోజునే 1.9 బిలియన్ డాలర్ల తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. అలాగే బిల్ గేట్స్ 6.8 బిలియన్ డాలర్ల నికర విలువను, చైనా అత్యధిక సంపన్నుడు వాంగ్ జియాన్ లిన్ 6.4 బిలియన్ డాలర్లను నష్టపోయారు. డౌజోన్స్ 391 పాయింట్లతో పాటు, మార్కెట్లో యూరోపియన్ స్టాక్స్ భారీగా పడిపోయిన కారణంగా ఇటువంటి తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వచ్చిందని తాజా రిపోర్టులు చెప్తున్నాయి. అలాగే స్టేట్ రెస్క్యూ ప్రచారంతో షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ కూడ ఏడు నెలల్లో రెండోసారి ఊహించని రీతిలో మలుపు తిరిగింది. ఇదిలా ఉంటే పన్నెండు సంవత్సరాల కాలంలో చమురు ధరలు తీవ్రంగా పడిపోవడం వల్లనే స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలపాలయ్యాయని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదికలు చెప్తున్నాయి. కాగా తీవ్రంగా నష్టపోయిన నాలుగు వందలమంది అత్యధిక సంపన్నుల్లో ఈ సంవత్సరం తొమ్మిది మంది నికర విలువలో కొంత పెరుగుదల కనిపించింది. వీరిలో ముఖ్యంగా ముంబైకి చెందిన రిలయన్స్ ఇండస్ల్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, భారత ఆయిల్ బిలియనీర్ ముఖేష్ అంబానీ నికర విలువలో 620 మిలియన్ డాలర్ల వృద్ధి కనిపించింది. -
అపర కుభేరులు!
-
ఇండియాలో టాప్ సంపాదనా పరుడు దోని