samineni udaya bhanu
-
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు.. ఎఫ్ఐఆర్ల సంగతేంటి: సామినేని ఉదయభాను
సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులను ఆపాలి. దాడులకు కారణమైన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను. అలాగే, చాలా ఘటనల్లో కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని కామెంట్స్ చేశారు.కాగా, మాజీ ఎమ్మెల్యే ఉదయభాను ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘కౌంటింగ్ జరిగిన నాటి నుంచి టీడీపీ నేతలు ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో మాదే ప్రభుత్వం. మాదే రాజ్యం అనేలా విర్రవీగుతున్నారు. గత ఐదేళ్లలో జగ్గయ్యపేటలో టీడీపీ నేతలపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ రెండు నెలల్లో వైఎస్సార్సీపీకి చెందిన 15 మందిపై దాడులు చేశారు. రోడ్డుపై ఎవరూ తిరగకూడదనేలా వ్యవహరిస్తున్నారు. గింజుపల్లి శ్రీనివాసరావు తండ్రి వీరయ్య మంచి నాయకులు. ఇందిరమ్మ ఇళ్లు కట్టినందుకు వైఎస్సార్ వీరయ్యను సన్మానించారు. 2009లో వీరయ్యను ఆనాడు టీడీపీ నేతలు పొట్టనపెట్టుకున్నారు. నాడు తండ్రిని చంపిన వారే ఈరోజు శ్రీనివాసరావును హతమార్చాలని చూశారు. వీరయ్య హత్యలో ప్రస్తుత జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ సోదరుడు ధనుంజయ్ కూడా ఒక ముద్దాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే సోదరుడి రౌడీయిజం ఎక్కువై పోయింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను కొట్టండి.. చంపండి.. కేసులు లేకుండా చూసుకుంటానని చెబుతున్నాడు. పక్కాగా రెక్కీ నిర్వహించి మరీ శ్రీనివాసరావును చంపాలని చూశారు. మేం దాడులు చేయం.. హింసను ప్రోత్సహించమని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, టీడీపీ నేతలు, శ్రేణులు దాడులు చేస్తూ రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే దాడులను నిలువరించాలి. దాడులకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి. వీరయ్య హత్య కేసులో సీబీసీఐడీ కేసు నుంచి సాక్షులను తొలగించారు. పోలీసులే ఛార్జిషీట్ వేసి కేసును దర్యాప్తు చేయాలి. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే దాడులను ఆపాలి. నిందితులను శిక్షించాలి. రాష్ట్రంలో ఎక్కడ దాడి జరిగినా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తున్నారు. చాలా ఘటనల్లో కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదు. పోలీసులను అడిగితే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం.. చూస్తామంటున్నారు. గతరాత్రి ఘటనలో అరెస్ట్ చేసిన వారిని కేసు తేలేవరకూ విడిచిపెట్టొద్దు’ అని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు హేయం : సామినేని
సాక్షి,కృష్ణా జిల్లా : ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని ,పేర్ని నాని, వల్లభనేని వంశీ ఇళ్లపై దాడులు చేయటం హేయమైన చర్య అని కృష్ణా జిల్లా జగ్గయ్య పేట వైస్సాఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మండిపడ్డారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైస్సాఆర్సీపీ సానుభూతిపరులపై జరుగుతున్న దాడుల్ని ఆయన ఖండించారు. కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో వైస్సాఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వరుస దాడులపై పోలీసులు తాత్కాలిక కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును మేం గౌరవిస్తాం. జగ్గయ్యపేటలో గెలిచిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్కు అభినందనలు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఉండేందుకు నాయకులు ప్రయత్నించాలని వైఎస్సాఆర్ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విజ్ఞప్తి చేశారు. -
కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే
-
పార్టీ మార్పుపై క్లారిటీ: సామినేని ఉదయభాను
-
చంద్రబాబు పవన్ కళ్యాణ్ని కలవడంపై ఉదయ్ భాను స్ట్రాంగ్ కౌంటర్.
-
మంత్రి పదవి రాలేదని కాస్త బాధపడ్డాను: సామినేని
-
ఇలాంటప్పుడు తప్ప ఎన్టీఆర్ గుర్తురారా?
సాక్షి, అమరావతి: నలభై ఏళ్లు నిండిన టీడీపీ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు అన్నీ అబద్ధాలే వల్లెవేశారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. టీడీపీ ఆవిర్భావమో లేదంటే మçహానాడు కార్యక్రమమో తప్ప మిగతా సమయాల్లో ఎన్టీ రామారావును చంద్రబాబు ఎందుకు గుర్తుపెట్టుకోరని ప్రశ్నించారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క జిల్లాకు కూడా ఆయన పేరు పెట్టలేదని గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారని, బీసీ డిక్లరేషన్ తీసుకురావడంతోపాటు వారి అభివృద్ధికి 53 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడవడం తప్ప ఆయనకు మంచి చేసింది ఏమీలేదని విమర్శించారు. -
ఏపీ రైతుల హక్కులను కాలరాస్తున్న తెలంగాణ సర్కార్
జగ్గయ్యపేట/అచ్చంపేట: ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తోందని ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ఆయన్ను తెలంగాణ పోలీసులు రాష్ట్ర సరిహద్దులోని బుగ్గమాధవరం వద్ద ఆదివారం అడ్డుకున్నారు. ఇందుకు నిరసనగా ఎమ్మెల్యే ఆందోళన చేశారు. తర్వాత ముక్త్యాలలోని కృష్ణానది వద్దకు చేరుకుని నాటు పడవల ద్వారా గుంటూరు జిల్లా మాదిపాడులోని అవతలి ఒడ్డుకు చేరుకుని రైతులు, విలేకరులతో కలిసి పులిచింతల ప్రాజెక్టును పరిశీలించారు. విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు.. అనంతరం ఉదయభాను మాట్లాడుతూ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో జల విద్యుదుత్పత్తికి పూనుకోవటంతో నీరందక సాగు సాగని పరిస్థితి నెలకొందన్నారు. పులిచింతలతో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల వద్ద తెలంగాణ సర్కార్ అక్రమ విద్యుదుత్పత్తికి పాల్పడుతోందన్నారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం నీటిని వాడుకోవాలని, లేకుంటే కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. నీటి వృధా శ్రేయస్కరం కాదు.. గత 10 రోజుల వ్యవధిలో ఏడున్నర టీఎంసీలు పులిచింతల ప్రాజెక్టు ద్వారా వృధాగా సముద్రంలో కలిపారని ఉదయభాను తెలిపారు. శనివారం ఒక్కరోజే ఒక టీఎంసీని వృధా చేశారని, ఒక టీఎంసీ అంటే 10 వేల ఎకరాల మాగాణి, 20 వేల ఎకరాల మెట్ట పంటలకు సరిపోతాయన్నారు. ఇది ఉభయ రాష్ట్రాల రైతాంగానికి శ్రేయస్కరం కాదన్నారు. కృష్ణా, డెల్టా ప్రాంతాలకు చెందిన 13 లక్షల ఆయకట్టు భూములకు సమృద్ధిగా సాగునీటిని సరఫరా చేసేందుకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారన్నారు. ప్రాజెక్టు నిర్మాణం జరగక పోతే తెలంగాణ వాటాగా 120 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు వచ్చేదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ వల్ల ఎక్కువగా లబ్ధి పొందింది తెలంగాణ రైతులేనన్నారు. అలాంటి మహానేతపై తెలంగాణ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హితవు పలికారు. అయినప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణ వారితో స్నేహపూర్వకంగా మెలగాలని చెబుతున్నారని, అవసరం అనుకుంటేనే కేంద్రానికి ఫిర్యాదు చేద్దామని చెబుతున్నారన్నారు. ఇప్పటికైనా పవర్ ప్రాజెక్టుకు అక్రమంగా నీటిని వదిలే చర్యను విరమించుకోవాలన్నారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయానికి వెళ్లి ఈఈ శ్యాంప్రసాద్తో మాట్లాడి నీటి మట్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు జగదీష్, రవి, జుబేర్, ఫిరోజ్ఖాన్, హరిబాబు, సత్యనారాయణ, మాదిపాడు సర్పంచ్ నాగేశ్వరరావు, తదితరులు ఆయన వెంట ఉన్నారు -
ప్రభుత్వ విప్ ఉదయభానును అడ్డుకున్న తెలంగాణ పోలీసులు
-
Telangana: కరోనా రోగులకు రాష్ట్రంలోకి నో ఎంట్రీ
ఏపీలోని అనంతపురానికి చెందిన ఓ కరోనా బాధితుడి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను అంబులెన్స్ లో తీసుకుని సోమవారం హైదరాబాద్ బయలుదేరారు. తెలంగాణలో ఆలంపూర్ వద్దకు రాగానే పోలీసులు ఆ అంబులెన్స్ ని ఆపి.. రాష్ట్రంలోకి రావడానికి అనుమతి లేదంటూ వెనక్కి వెళ్లమన్నారు. వారు ఎంత బతిమిలాడినా వినలేదు. ఓ ఎమ్మెల్యే ఫోన్ చేసినా.. తెలంగాణ పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో బాధితుడు కర్నూలులోని ఓ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. కర్ణాటక నుంచి ఆదివారం అర్ధరాత్రి కరోనా రోగితో వచ్చిన ఓ అంబులెన్స్ ను గద్వాల జిల్లా పుల్లూరు చెక్పోస్టు వద్దే పోలీసులు నిలిపివేశారు. హైదరాబాద్లో బెడ్లు ఖాళీ లేవని వెనక్కి వెళ్లాలని సూచించారు. తమకు బెడ్ అలాట్మెంటు ఉందని చూపించినా వెనక్కి పంపించారు. సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా బాధితులను తెలంగాణలోకి అనుమతించడంలేదు. రాష్ట్రంలో కరోనా పడకలు, ఆక్సిజన్ సిలిండర్లకు కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా పాజిటివ్ రోగులను రాష్ట్రంలోకి రానివ్వడంలేదు. అలాంటివారిని తీసుకొస్తున్న అంబులెన్సు లను రాష్ట్ర సరిహద్దుల్లోనే పోలీసులు అడు ్డకుని వెనక్కి పంపిస్తున్నారు. సాధారణ వాహనాలు, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారిని అనుమతిస్తున్నా.. కరోనా బాధి తులను మాత్రం అడుగు పెట్టనివ్వడంలేదు. 40 శాతం పొరుగు రాష్ట్రాల వారే.. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో దాదాపు 40 శాతం మంది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒడిశాలకు చెందినవారే ఉన్నారు. ఇప్పటివరకు వారికి ఎలాంటి షరతులూ లేకుండా చికిత్స అందించిన ప్రభుత్వం.. ఆదివారం రాత్రి నుంచి అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా బాధితులను రాష్ట్రంలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ–ఆంధ్రా సరిహద్దులైన వెంకటాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, అశ్వారావుపేట, జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ప్లాజాలతోపాటు ఏపీ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించే మాచర్ల మార్గంలో నాగార్జున సాగర్ వద్ద, దాచేపల్లి మార్గంలో వాడపల్లి వద్ద, మఠంపల్లి మండలం మట్టపల్లి వంతెన వద్ద, హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ మండలం రామాపురం వద్ద ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తూ.. కోవిడ్ రోగులున్న అంబులెన్సులను వెనక్కి పంపిస్తున్నారు. కొన్నిచోట్ల బెడ్ ఉన్నట్టు పత్రాలు చూపించినవారిని మాత్రం రాష్ట్రంలోకి అనుమతించారు. ఈ విషయంపై ఏపీ, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర ప్రజలకు సమాచారం లేకపోవడంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన కరోనా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి విషమించిన కరోనా రోగులను హైదరాబాద్కు తరలించే క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర నిర్వేదంలో మునిగిపోయారు. వీరంతా ఆక్సిజన్ సిలిండర్లతో లైఫ్ సపోర్ట్ వచ్చిన వారే కావడం గమనార్హం. ఏపీ నుంచే బాధితులు అధికం.. తెలంగాణకు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ కంటే ఏపీ నుంచే రోగుల తాకిడి అధికంగా ఉంది. అయితే ఏపీ నుంచి మాత్రం అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారు. అయితే, తెలంగాణ పోలీసులు సరిహద్దుల్లోనే ఆ అంబులెన్సులను ఆపడంతో చాలావరకు అక్కడే నిలిచిపోయాయి. రోగి కేస్షీట్ చూసి కరోనా పాజిటివ్ అయితే వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. కొన్నిచోట్ల బెడ్ అలాట్మెంట్ చూపిస్తే అనుమతించినా.. మరికొన్ని చోట్ల అంగీకరించలేదు. ఎందుకు ఆపుతున్నారన్న ప్రశ్నకు హైదరాబాద్లో బెడ్లు లేవని, ఆక్సిజన్ కొరత ఉందని అందుకే ఆపమంటూ తమకు మౌఖికంగా ఆదేశాలు వచ్చాయని పలువురు కిందిస్థాయి పోలీసులు తెలిపారు. దీంతో చాలామంది తెల్లవారుజాము వరకు ఎదురుచూసి వెనక్కి వెళ్లిపోయారు. ఇక కర్ణాటక, మహారాష్ట్రలో లాక్డౌన్ ఉండటంతో అక్కడ నుంచి వచ్చే రోగుల సంఖ్య పెద్దగా లేదు. అందుకే, ఈ విషయంలో కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ పోలీసులు తామెవరినీ ఆపడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో తమకు ఎలాంటి ఆదేశాలూ అందలేదని ఉమ్మడి ఆదిలాబాద్ పోలీసులు తెలిపారు. అయితే, రాష్ట్రంలోకి ప్రవేశించే వారు ఎక్కడికి వెళ్తున్నారో మాత్రం నోట్ చేసుకుని అనుమతిస్తున్నామని వెల్లడించారు. ఇక ఛత్తీస్గఢ్ నుంచి ఏపీ మీదుగా భద్రాచలం ద్వారా రావాలనుకున్న కరోనా పేషెంట్లకు ఎంట్రీ లేదనే చెబుతున్నారు. మానవత్వంతో చూడండి: జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను ఏపీ నుంచి వెళ్తున్న అంబులెన్సులను తెలగాంణలోకి అనుమతించకపోవడంపై జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్రోడ్కు చేరుకుని అక్కడ విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడారు. కోవిడ్ బాధితులపై మానవత్వం చూపాలని కోరారు. అంబులెన్సులను నిలిపివేస్తే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ విషయంపై తెలంగా ణ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించి ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు. -
‘పవన్ కళ్యాణ్ నోరెందుకు మెదపడం లేదు’
న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు నోరెందుకు మెదపడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ, జనసేన పార్టీలకు క్లారిటీ లేదని, అందువల్లే వాళ్లు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉందని ఆరోపించారు. రాష్ట్రంలోని విపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్సీపీతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంపై మమకారం ఉంది కాబట్టే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నామని వివరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రంతో గట్టి పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై తమతో కలిసివచ్చే పార్టీలను ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్తామని వెల్లడించారు. పోస్కో సంస్థకు అవసరమైతే కడప, కృష్ణపట్నం స్టీల్ ప్లాంట్లను తీసుకోవాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తే.. రెండేళ్లలో లాభాల బాట వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు..
విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ప్రజలు ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలతో పాటు మేనిఫెస్టోలో పొందుపరచని మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ప్రజల తలరాతలను మార్చారని కొనియాడారు. పేదల కలలను సాకారం చేసేందుకు సీఎం జగన్ అహర్నిశలు కృషి చేస్తుంటే.. కొన్ని దృష్ట శక్తులు అదే పనిగా అడ్డుతగులుతున్నాయని ఆయన ఆరోపించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు చేయలేని అభివృద్ధిని, సీఎం జగన్మోహన్రెడ్డి కేవలం పద్దెనిమిది నెలల్లోనే చేసి చూపించారని ఆయన ప్రశంశించారు. ఇళ్ల పట్టాల పంపిణీ దగ్గర నుంచి అనేక సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు అండ్ కో మోకాలడ్డుతున్నా, సీఎం జగన్మోహన్రెడ్డి ఉక్కుసంకల్పంతో ముందుకు సాగుతున్నారన్నారు. తన నియోజకవర్గంలో ఒక్కరికి కూడా ఇంటి పట్టా ఇవ్వలేకపోయిన దేవినేని ఉమ.. ఇళ్ల పట్టాల పంపిణీపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలో రావడం అసాధ్యమని తెలుసుకున్న చంద్రబాబు.. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా ప్రవర్తిస్తూ, రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సామినేని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబు, రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం సీఎం వైఎస్ జగన్ అహర్నిశలు కృషి చేస్తుంటే.. చంద్రబాబు ఎండ్ కో మత విద్వేశాలు రెచ్చగొట్టడంలో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది: మోపిదేవి పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మొదలై పాతిక రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొని ఉందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. 31 లక్షల మంది సొంతింటి కలను సాకారం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఆయన కొనియాడారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు ,అవసరాలు అవపోసన పట్టి ముఖ్యమంత్రి.. వాటిని పరిష్కరించేందుకు కంకణం కట్టుకున్నారని ఆకాశానికెత్తారు . ఖజానా ఖాళీ అవుతున్నా పేదల అవసరాలు తీర్చే విషయంలో సీఎం జగన్ వెనకడుగు వేయడం లేదని ఆయన ప్రశంశించారు. అంబేడ్కర్ ఆశయాల సాధన, సామాజిక వర్గాల సమతుల్యతతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటుంటే, ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర పతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి తన ఉనికిని కాపాడుకునే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారని ఆరోపించారు. -
మీ అవినీతిని రాస్తే పెద్ద గ్రంథం అవుతుంది: ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: భూములు అమ్మేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పత్రికలు గగ్గోలు పెడుతున్నారని, అది వృధా ప్రయాస అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవరత్నాలు, నాడు-నేడు నిధుల కోసం భూములు వేలం వేస్తున్నామని స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకత దేశంలో ఎవరైనా వాటిని కొనుగోలు చేసేలా ఈ-వేలం వేస్తున్నామన్నారు. గడిచిన మీ హయాంలో ఎన్నికల్లో లబ్ది చేకూర్చిన వారికి ఎన్ని భూములు కట్టాబెట్టారో ప్రపంచానికి తెలుసని వ్యాఖ్యానించారు. అయితే తాము సద్వివిమర్శను ఆహ్వానిస్తామని, మీ అవినీతిని రాస్తే పెద్ద గ్రంథం అవుతుందని విమర్శించారు. రాజధాని పేరుతో పేదల నుంచి బలవంతంగా అసైన్డ్ భూములు సేకరించింది మీరు కాదా? అని వాటిని పెద్దలకు కట్టబెట్టింది మీ హయాంలోనే కాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజా కోర్టులో స్ఫష్టమైన తీర్పు వచ్చిదన్నారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకుని అచ్చెన్నాయుడు రాషష్ట్రంలో తిరుగుతా అంటున్నారని వెంటనే తిరగండని పేర్కొన్నారు. విశాఖలో భూ కుంభకోణం చూసి మీ హయాంలో మంత్రులే రోడ్డున పడ్డారని, త్వరలో సమగ్ర భూ సర్వేకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 100 ఏళ్లనాటి రికార్డులు ప్యూరిఫికేషన్ చేస్తామని, మొబైల్ కోర్టులు ఏర్పాటు చేసి భూ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు మీటర్లు బిగిస్తున్నామని, త్వరలో అంత: రాష్ట్ర వివాదాలు పరిష్కరించి నేరడి బ్యారేజ్ నిర్మించి తీరుతామని ధర్మాన పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాతయాత్ర కృష్ణా జిల్లా: ప్రజాసంకల్ప యాత్రకు మూడేళ్లు అయిన సందర్బంగా ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. పెనుగ్రంచిప్రోలు పాత సినిమా హాలు సెంటర్ నుంచి మున్నేరు వంతెన మీదగా ముచ్చింతల వరకు ఈ పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ... దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలని నేరుగా తెలుసుకున్న నేత సిఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. ఏడాదిన్నర పరిపాలనలో 90 శాతానికి పైగా హామీలను ఆయన నెరవేర్చారన్నారు. ప్రజలకిచ్చిన నవరత్నాల హామీలే కాకుండా 16 రకాలకు పైగా సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ అందిస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాలకు అండగా నిలబడిన ప్రభుత్వం తమదని, గత ప్రభుత్వం అభివృద్దిని, సంక్షేమాన్ని రెండింటినీ విస్మరించిందన్నారు. నాడు-నేడు కార్యక్రమంతో విద్య, వైద్యంలో విప్లకాత్మకమైన మార్పులకి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తే... సీఎం వైఎస్ జగన్ వైద్య ఖర్చు వెయ్యి రూపాయిలు దాటితే ఆరోగ్యశ్రీలోకి చేర్చి పేదలకి అండగా నిలబడ్డారన్నారు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మరో 30 ఏళ్లు కొనసాగుతారని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు. కాగా ఈ పాదయాత్రలో భారీ సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. -
ముంపు ప్రాంతాలను పరిశీలించిన సామినేని
కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట పట్టణంలో ధనంబోర్డ్ కాలనీ, కాకాని నగర్, డాoగే నగర్, యానాది కాలనీలో వరద ముంపు ప్రాంతాలను ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సామినేని వెంకట కృష్ణప్రసాద్, తన్నీరు నాగేశ్వరావు, సహా వివిధ అధికారులు పాల్గొన్నారు. మరోవైపు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది. హైవేపై దాదాపు రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో వాహనాలు నీటిలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. (విరిగిపడ్డ కొండచరియలు, ఒకరు మృతి) -
చంద్రబాబుకు సామినేని సవాల్..
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి ప్రజాతీర్పుకు వెళ్లాలని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సవాల్ విసిరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ చంద్రబాబు పిలుపును కృష్ణా జిల్లా లో టీడీపీ నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఆయన 19 గ్రామాలకు నాయకుడిగా మారిపోయారు. కరోనా కష్ట కాలంలో ప్రజలకు అందుబాటులో లేకుండా, పక్కరాష్ట్రానికి పారిపోయి జూమ్లో మాత్రమే దర్శనమిస్తున్నారంటూ’’ ఆయన ఎద్దేవా చేశారు. (చదవండి: ‘వారంతా చంద్రబాబు బినామీలే’) చంద్రబాబు ఎన్ని ఉద్యమాలు చేసిన ప్రజలు నుంచి స్పందన లేదన్నారు. ‘‘కేంద్రం కూడా రాజధాని విషయంలో స్పష్టమైన విధానం చెప్పింది. కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని అంశంపై రాష్ట్రానిదే తుది నిర్ణయం అని స్పష్టం చేసిందని’’ ఆయన పేర్కొన్నారు. 14 నెలలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు చరిత్ర ముగిసిన అధ్యాయం అని, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు ఆయన్ని గుర్తించడం లేదని సామినేని ఉదయభాను వ్యాఖ్యానించారు.(చదవండి: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై సోము సెటైర్లు) -
అగ్నిప్రమాదంలో సామినేని సన్నిహితుడు మృతి
సాక్షి, కృష్ణా: విజయవాడలోని స్వర్ణపాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో జగ్గయ్యపేట పట్టణానికి చెందిన బేతెస్థా ప్రార్ధన మందిరం పాస్టర్ ఎస్.ఆర్.అబ్రహం ఆయన సతీమణి రాజకుమారి దుర్మరణం పాలయ్యారు. మృతుడు అబ్రహం ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుకు అత్యంత సన్నిహితుడి తెలిసింది. దాంతో సామినేని ఉదయభాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా, రమేష్ ఆస్పత్రి యాజమాన్యం స్వర్ణ ప్యాలెస్ హోటల్ని లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. హోటల్ను ఆస్పత్రిగా మార్చి 50 మంది కరోనా పేషెంట్లకు ప్రైవేట్ ఆస్పత్రి చికిత్స అందిస్తోంది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు సమాచారం. తెల్లవారుజామున 4.45 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రమేష్ ఆస్పత్రి నిర్లక్ష్యం ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు రెండు కమిటీలను నియమించింది. (విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం) ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు సంతాపం విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో ఘంటసాల మండలం కొడాలి గ్రామానికి చెందిన పొట్లూరి పూర్ణచంద్రరావు మృతి చెందారు. ఆయన మృతిపట్ల ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు విచారం వ్యక్తం చేశారు. పూర్ణచంద్రరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (అగ్నిప్రమాదం: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం) -
అర్హులైన మహిళలందరికీ ‘వైఎస్సార్ చేయూత’
సాక్షి, కృష్ణా జిల్లా: అర్హులైన మహిళలకు ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తామని పేర్కొన్నారు. 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఏడాదికి రూ.18,750 అందిస్తామని, నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. వైఎస్సార్ చేయూత ద్వారా 25 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారని తెలిపారు. ఆగష్టు 12న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. అర్హులైన పేద మహిళలను గుర్తించి వారికి ఆర్థికసాయం అందేలా చూడాలని వాలంటీర్లను సామినేని ఉదయభాను సూచించారు. (కరోనా పేషెంట్లకు అండగా ఉంటాం: మంత్రి) -
విలువలు ప్రతిబింబించేలా ‘స్థానిక ఎన్నికలు’
సాక్షి, విజయవాడ: స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అన్ని సీట్లు కైవసం చేసుకుంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనను ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు గమనించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక సాహసోపేత నిర్ణయాలతో వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ప్రజలంతా సీఎం జగన్ వైపే చూస్తున్నారని తెలిపారు. డబ్బు, మద్యం లేకుండా స్థానిక ఎన్నికలు జరగాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ‘అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఎన్నిక రద్దు చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు మంచి పాలన అందించాలన్నదే సీఎం లక్ష్యమని చెప్పారు. అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు వివరించి ప్రజలను ఓట్లు అడుగుతామని సామినేని ఉదయభాను పేర్కొన్నారు. (ఏపీలో మోగిన స్థానిక ఎన్నికల నగారా) ప్రభుత్వం జవాబుదారీతనంగా పనిచేస్తోంది: మొండితోక జగన్మోహన్రావు ప్రజాస్వామ్యం విలువలు ప్రతిబింబించేలా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు అన్నారు. ఏ విధమైన ప్రలోభాలు లేకుండా ఎన్నికల నిర్వహణ జరగాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు మెచ్చిన..ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు గెలవాలన్నదే ఆయన సంకల్పమన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తోందని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేశామని వివరించారు. స్థానిక ఎన్నికల్లో విజయ గంట మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు దేశానికే తలమానికంగా నిలవనున్నాయని తెలిపారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అన్ని స్థానాల్లోనూ గెలిచే అవకాశం ఉందని జగన్మోహన్రావు పేర్కొన్నారు. -
విజయవాడను ఆదర్శ నగరంగా మార్చుతాం
సాక్షి, విజయవాడ: ఐదేళ్లలో విజయవాడను ఆదర్శనగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. బుధవారం విజయవాడలో కేఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి రాణిగారి తోట వరకు ఆరున్నర కోట్లతో మంచినీటి పైప్లైన్ పనులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుతో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. వీరికి మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండని కోరారు. ఈ కార్యక్రమానికి వైస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్, నగరాధ్యక్షులు బొప్పన భవకుమార్ హాజరయ్యారు. టీడీపీ నిజాలు మాట్లాడదని తెలిసిపోయింది ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. రాష్ట్రాన్నిసమగ్రాభివృద్దివైపు నడిపించాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. జగన్ పాలనలో పేదల కష్టాలు కడతేరిపోతాయని పేర్కొన్నారు. ఐదేళ్లు నిర్లక్ష్యానికి గురైన విజయవాడ అభివృద్ధికి ఆయన అవసరమైన నిధులు కేటాయించారని హర్షం వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక విజయవాడ అభివృద్ధికి బంగారుబాటలు పడ్డాయన్నారు. టీడీపీ పాలనలో పట్టిన గ్రహణం వీడిందని పేర్కొన్నారు. సీఎం జగన్కు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. రాజధాని డ్రామా ఫెయిల్ కావడంతో ఇప్పుడు జనచైతన్య యాత్ర డ్రామా మొదలు పెట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ప్రజలు స్పందించరని స్పష్టం చేశారు. టీడీపీ నిజాలు మాట్లాడదన్న సత్యాన్ని గ్రహించే జనం వారికి గుణపాఠం చెప్పారన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఎగరేస్తాం దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్పోరేటర్లు ఉన్న డివిజన్లను అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చూపారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తుందన్నారు. కృష్ణలంక కరకట్ట నిర్మాణానికి రూ.125 కోట్లు కేటాయించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. రాబోయే కార్పోరేషన్ ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో విజయకేతనం ఎగురవేస్తామన్నారు. బొప్పన భవకుమార్ మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా మంచినీటి పైప్లైన్కు శంకుస్థాపన చేయడం శుభపరిణామమన్నారు. ఆర్భాటాలు టీడీపీ సొంతమైతే.. అన్ని ప్రాంతాల అభివృద్ధి మా నైజమన్నారు. -
‘అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి’
-
‘అలాంటి పథకాన్ని ఎవరూ తీసుకురాలేదు’
సాక్షి, జగ్గయ్యపేట : గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆచరణలో చేసి చూపుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. ఆదివారం ఆయన జగ్గయ్యపేట పురపాలక సంస్థ పరిధిలోని 24,25,26,27 డివిజన్ల వార్డు సచివాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలోని జన్మభూమి కమిటీలకు సచివాలయాల వ్యవస్థకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. జన్మభూమి కమిటీలు టీడీపీ సభ్యుల కోసం పనిచేశాయని ఆరోపించారు. కానీ మతం, కులం, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందరికి అందాలనే లక్ష్యంతో సీఎం జగన్ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. సచివాలయంలో 72 గంటల్లోనే ఫిర్యాదుదారుడి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. కృష్ణాజిల్లాలో 1280 గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజల అందుబాటులోకి రావడం శుభపరిణామన్నారు. ప్రతి రోజు స్పందన కార్యక్రమం సచివాలయాల్లో జరుగుతుందన్నారు. అమ్మఒడి లాంటి పథకం 70 ఏళ్ల భారత స్వాతంత్ర్య చరిత్రలో ఎవ్వరూ తీసుకురాలేదని ప్రశంసించారు. దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పథకం అమ్మఒడి పథకం అన్నారు. రాష్ట్రంలో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. హైదరాబాద్ రాజధానిని కోల్పోయినప్పుడు ప్రజలను కన్నీరు పెట్టుకున్నారని అటువంటి పరిస్థితి మరోసారి రాకూడదని సీఎం జగన్ ఆలోచిస్తున్నారని చెప్పారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమన్నారు. ఒక లక్షా 10వేల కోట్లు అమరావతిలోనే పెట్టుబడి పెట్టడం వలన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. -
‘నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది’
సాక్షి, కృష్ణా : జగ్గయ్యపేట మండలం రావిరాల, వేదాద్రి గ్రామాలలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సోమవారం పర్యటించారు. వరదల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఆయనతో పాటు నాయకులు వేల్పుల రవికుమార్, రవిశంకర్, తుమ్మల ప్రభాకర్ ఉన్నారు. -
చెప్పింది కొండంత.. చేసింది గోరంత..
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో చేపట్టిన గృహ నిర్మాణం పథకం సరిగా లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. దివంగత వైఎస్సార్ హయాంలో 48 లక్షల ఇళ్లు కట్టించినట్లు గుర్తుచేశారు. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ.. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం త్వరలోనే 25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడామని తెలిపారు. గృహ నిర్మాణంలో అవినీతి జరగకుండా.. గ్రామ వాలంటీర్ల ద్వారా కేటాయింపులు పారదర్శకంగా జరుపుతామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటిని లబ్ధి దారుని పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి.. ఇస్తామని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలం లేకుండా.. ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇస్తుందని ఉదయభాను సభలో తెలిపారు. పేదప్రజల పేరు చెప్పుకుని గత ప్రభుత్వం దోపిడికి పాల్పడిందని ఆయన విమర్శించారు. జన్మభూమి కమిటీ కేటాయింపుల్లో ఎంతో అవినీతి జరిగిందని ఆరోపించారు. పేద ప్రజల అభివృద్ధికి కొండంత చెప్పి.. గోరంత చేశారని ఎద్దేవా చేశారు. ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదివరకే ప్రకటించినట్లు ఎమ్మెల్యే శిల్పారవి స్పష్టంచేశారు. సంక్షేమ ఫలాలు అందించేటప్పుడు కులం, మతం చూడమని అన్నారు. ఐదేళ్ల కాలంలో ఇళ్ల పేరుతో టీడీపీ నేతలు దోపిడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. -
‘వైఎస్ జగన్ సీఎం అవడం ఖాయం’
సాక్షి, విజయవాడ : కుట్రలు, కుతంత్రాలతో గెలవాలని ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. గురువారమిక్కడ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ప్రజా తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తుందని తెలిసే చంద్రబాబు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఎద్దేవా చేశారు. కోడెల శివప్రసాద్ లాంటి వ్యక్తులను పక్కన పెట్టుకుని.. ఫ్రస్ట్రేషన్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ‘చంద్రబాబు జూన్ 8 వరకు నేనే సీఎం అంటూ రివ్యూలు చేస్తున్నారు. అనేక మంది ఉద్యోగులకు మీరు జీతాలు ఇవ్వాలి. ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. మీరేమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ మీద కూడా నిందలు వేస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు గవర్నర్ ని కలవడం కూడా తప్పే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు నువ్వు ఎవరిని నమ్ముతావు బాబు’ అని ఉదయభాను ప్రశ్నించారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాకు రోజులు దగ్గర పడ్డాయని, అధికారంలోకి వచ్చాక నీపై అన్ని విధాలుగా విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. వైఎస్ జగన్ సీఎం అవడం ఖాయం.. చంద్రబాబు ఇంటికి వెళ్లే రోజు దగ్గర్లోనే ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రక్షణనిధి అన్నారు. ఐదేళ్లు చంద్రబాబు దుర్మార్గపు పాలన చేశారని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబుకు కలలో కూడా వైఎస్ జగన్ కనిపిస్తున్నారు. అక్కా చెల్లెమ్మలు టీడీపీకి ఓటు వేస్తే మీకు ఎందుకు భయం బాబు. కోడెల రిగ్గింగ్ చేస్తుంటే ప్రజలు తిరగబడ్డారు. తిరువూరులో నాపై మంత్రిని పోటీ చేయించారు. అయినా గెలుపు నాదే. ప్రజా తీర్పు మాకే అనుకూలం. వైఎస్ జగన్ సీఎం అవడం ఖాయం. రాజన్న రాజ్యం రావడం ఖాయం’ అని ధీమా వ్యక్తం చేశారు. -
తెలుగుదేశం పాలనలో దళితులకు రక్షణ కరువు
కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట అర్బన్: తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆందోళన వ్యక్తంచేశారు. మండలంలోని అనుమంచిపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో ఏర్పాటుచేసిన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ విగ్రహాలను తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధితో కలిసి ఉదయభాను ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉదయభాను మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దళితులు తీవ్ర అవమానాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడటం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. ప్రభుత్వ విప్గా ఉన్న చింతమనేని ప్రభాకర్ దళితులను కించపరిచేలా మాట్లాడినా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. చింతమనేని దౌర్జన్యాలకు అంతం లేకుండా పోయిందని, కనీసం ఆయనపై చర్యలు తీసుకోవడానికి కూడా సీఎం ప్రయత్నించకపోవడం ఆయన చేతగాని తనాన్ని, దళితులపై ఆయనకు ఉన్న గౌరవం ఏమిటో తెలియజేస్తోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నాటి పాలన రావాలంటే ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రక్షణనిధి మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లే అట్టడుగున ఉన్న దళితులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని స్పష్టం చేశారు. జగ్జీవన్రామ్ దళితుల అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాలే పుల్లారావు, జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ యువ నాయకుడు సామినేని ప్రశాంత్బాబు, మాజీ ఎంపీపీ మాతంగి వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ నాయకులు పగిడిపల్లి సునిల్కుమార్, తుమ్మల ప్రభాకర్, బూడిద నరసింహారావు, మార్కపూడి గాంధీ, పాతకోటి ఉదయభాను, ఆకారపు వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. -
నీ తండ్రిని చంపిన పార్టీతో చర్చలా!
సాక్షి, హైదరాబాద్: తన తండ్రి వంగవీటి మోహనరంగాను చంపిన తెలుగుదేశం పార్టీలోకి రాధాకృష్ణ ఏముఖం పెట్టుకుని వెళుతున్నారు? ఆ పార్టీ నేతలతో ఏ విధంగా చర్చలు జరుపుతున్నారు? అని విజయవాడ పార్లమెంటు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామినేని ఉదయభాను ప్రశ్నించారు. రాధా పార్టీని వీడుతూ వైఎస్సార్ కాంగ్రెస్పైనా, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనా చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయన్నారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రంగా కుటుంబంతో తమకు ఎంతో సాన్నిహత్యం ఉందనీ, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయన ఎదుగుదలకు ఎంతగానో సహకరించారని తెలిపారు. అలాంటి రంగాను టీడీపీ నేతలు, గూండాలు ఒక టూరిస్టు బస్సులో టీడీపీ జెండా కట్టుకుని వచ్చి విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ ఉండగా ఘోరంగా నరికి చంపారని ఉదయభాను గుర్తు చేశారు. చంద్రబాబు స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని అన్నారు. రంగా హత్య కేసులో దేవినేని నెహ్రూ, వెలగపూడి రామకృష్ణ ప్రసాద్ ఇతర టీడీపీ నేతలు ముద్దాయిలని, ఈ హత్య వెనుక చంద్రబాబు, అప్పటి హోంశాఖ మంత్రి కోడెల శివప్రసాదరావు కుట్ర ఉందని అప్పటి రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య తన ఆత్మకథలో రాసిన విషయం ఆయన గుర్తుచేశారు. ఇదే విషయాన్ని పలు వేదికలపై కూడా జోగయ్య చెప్పారన్నారు. అయినప్పటికీ తన తండ్రి రంగాను చంపింది తెలుగుదేశం పార్టీ కాదు.. కొందరు వ్యక్తులు అని రాధా మాట్లాడటం రంగా అభిమానులకు బాధ కలిగిస్తోందని అన్నారు. రాధా తల్లి టీడీపీలో చేరినప్పుడే రంగా ఆత్మ ఘోషించిందని, తాజాగా రాధా మాటలతో మరింత ఘోషిస్తోందని పేర్కొన్నారు. రంగా విగ్రహావిష్కరణలకు అభ్యంతరం చెప్పలేదు రాధా టీడీపీ కబంధ హస్తాల్లో చిక్కుకొని, వాళ్లు ఇచ్చిన స్క్రిప్టునే మాట్లాడారని ఉదయభాను విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్లో చేరేటప్పుడు తన తమ్ముడిలా చూసుకుంటానని రాధాకు జగన్ చెప్పారని, ఆ మేరకు 2014 ఎన్నికలయ్యాక పార్టీ యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని తెలిపారు. కానీ రాధా ఎక్కడా తిరగడం గానీ, ఒక్క కార్యక్రమం నిర్వహించడం కానీ చేయలేదని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శిని చేసినా చురుగ్గా వ్యవహరించలేదన్నారు. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా నియమించినా ప్రజా సమస్యలపై గానీ, పార్టీ కోసం గానీ ఏ ఒక్క పోరాటం చేయలేదని తెలిపారు. అన్ని పదవులిచ్చినా తనకు జగన్ ప్రాధాన్యత ఇవ్వలేదని రాధా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రంగా విగ్రహావిష్కరణలకు జగన్ అభ్యంతరం చెప్పారనడంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. కృష్ణా జిల్లాలో అందరికంటే రాధాకే జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని, ప్రేమ చూపేవారని ఉదయభాను గుర్తుచేశారు. రాధా అభ్యంతరం వ్యక్తం చేసినందుకే దేవినేని నెహ్రూను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదన్నారు. అదీ రంగా కుటుంబానికి, రాధాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గౌరవం అన్నారు. అయినా వైఎస్సార్ కాంగ్రెస్ను, జగన్ను విమర్శిస్తున్నారంటే అంతకంటే దారుణం మరొకటి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల మాయ మాటలకు రాధా లొంగి పోయారని, ఆయన ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని సూచించారు. రాధా టీడీపీలోకి వెళ్ళాలనుకోవడం సిగ్గుమాలిన పనిగా అభివర్ణించారు. -
‘రంగాని కిరాతకంగా హత్య చేసింది టీడీపీనే’
సాక్షి, హైదరాబాద్ : వంగవీటి మోహనరంగాను కిరాతకంగా హత్య చేసింది తెలుగుదేశం పార్టీనేనని వైఎస్సార్ సీపీ నేత, విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను వ్యాఖ్యానించారు. రంగాని హత్య చేసింది టీడీపీ గూండాలు కాదని వంగవీటి రాధా చెప్పటం బాధాకరమన్నారు. గురువారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రంగాను టీడీపీ గూండాలు ఏ విధంగా హత్య చేశారో రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. నాటి పరిస్థితులను తాము ప్రత్యక్షంగా చూశామని తెలిపారు. రాధా మాటలతో రంగా అభిమానిగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగా బాధపడుతున్నానని పేర్కొన్నారు. చేగొండి హరిరామజోగయ్య ఆ రోజులలో మంత్రిగా ఉన్నారని, ఆయన రాసిన పుస్తకంలో కూడా రంగా హత్య వెనక చంద్రబాబు స్ర్కీన్ ప్లే వహించాడని రాశారన్నారు. రాధా మాటలతో రంగా అభిమానులందరు బాధపడుతున్నారని తెలిపారు. రాధా ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు చూస్తే టీడీపీలో చేరినట్లుగానే మాట్లాడారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వంగవీటి రంగా కుమారుడిగా రాధాకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. రాధాను యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని వెల్లడించారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘ఈ నాలుగు సంవత్సరాలలో రాధా పార్టీ కోసం ఉద్యమాలు చేశారా?. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారా?. మీ కుటుంబంతో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మీ తండ్రిని ఘోరాతిఘోరంగా టీడీపీ గూండాలు బస్లో వచ్చి హత్య చేస్తే నువ్వు మళ్లీ తిరిగి ఆ పార్టీలో ఎందుకు చేరుతున్నావో ఆత్మపరిశీలన చేసుకో. మీ అమ్మగారు టీడీపీలో చేరినప్పుడే రంగా గారి ఆత్మఘోషించింది. ఇప్పుడు మళ్లీ ప్రెస్ మీట్లో నువ్వు మాట్లాడిన మాటలు విని రంగా గారి అభిమానులు బాధపడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గారు మీ తల్లికి టిక్కెట్ విషయంలో సమస్య తలెత్తితే టిక్కెట్ ఇప్పించారు. రాధా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవాళ రంగా గారి ఆత్మ క్షోభిస్తుంది. ప్రజలను చంద్రబాబు ఏ విధంగా వంచిస్తున్నారో ఆ వంచనను ప్రజలకు తెలియచేయాలని వైఎస్ జగన్ తపిస్తుంటారు. వైఎస్ జగన్ గారు స్పష్టంగా ‘ మీ నాన్న గారు తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు కాబట్టి నువ్వు కూడా అక్కడినుంచి పోటీ చేస్తే బాగుంటుందని’ సూచించారు. దేవినేని నెహ్రూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానంటే రాధా చెప్పడం వల్లనే చేర్చుకోలేద’’ని తెలిపారు. -
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: ఉదయభాను
సాక్షి, కృష్ణా జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే తమ పార్టీకి ముఖ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంపై టీడీపీ చేస్తున్న విమర్శలు అసంబద్దమని మండిపడ్డారు. ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ మద్దతు తెలిపిందని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఫెడరల్ ఫ్రంట్కు మద్దతిస్తున్నామన్నారు. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్కు సంబంధించి వైఎస్ జగన్, కేటీఆర్ మధ్య జరిగిన భేటీపై సీఎం చంద్రబాబునాయుడు వంది మాగధులు, టీడీపీ మంత్రులు– ఆయన ప్రయోజనాల పరిరక్షణకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఎల్లో మీడియా రెండు రోజులుగా గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబును, హరికృష్ణ శవం సాక్షిగా టీఆర్ఎస్తో పొత్తుకోసం ప్రయత్నించానని సాక్షాత్తూ చంద్రబాబే అటు అసెంబ్లీలోనూ, ఇటు తెలంగాణ ఎన్నికల సమయంలోనూ ప్రకటించినా ఏ మాత్రమూ తప్పు బట్టని ఎల్లో మీడియా నేడు రాద్ధాంతం చేస్తున్నది. ఈ తరహా అసత్యప్రచారాలపై రాష్ట్ర ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
దీక్షకు అర్థం మార్చిన బాబు
జగ్గయ్యపేట అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మదీక్ష పేరుతో దీక్షల అర్థం మార్చివేశారని వైఎస్సార్ కాంగ్రెస్ విజయవాడ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మండిపడ్డారు. బాబు దీక్షను చూసి జాతిపిత మహాత్మాగాంధీ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మలు క్షోభిస్తున్నాయని అన్నారు. శుక్రవారం ఆయన తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దీక్షలనేవి నిరాడంబరంగా జరగాలన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన ధర్మదీక్షకు ఏసీలు, చలువ పందిళ్లు, బిర్యానీ పాకెట్లు, శీతలపానీయాల వంటి వాటితో హంగామా సృష్టిస్తున్నారని తెలిపారు. ప్రజలను బలవంతంగా తరలిస్తున్నారని చెప్పారు. విద్యార్థులను, ప్రభుత్వ ఉద్యోగులను దీక్షకు తరలించాలని జీవోలు జారీ చేసే పరిస్థితి నెలకొందంటే బాబుపై ప్రజల్లో ఏపాటి నమ్మకం ఉందో అర్థమవుతుందన్నారు. దీక్షలు, ధర్నాల వలన ఏమొస్తుందన్న చంద్రబాబు నేడు దీక్ష ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో దీక్ష చేస్తే అరెస్ట్ చేస్తారని భయం ఢిల్లీలో దీక్ష చేస్తే క్షణాల్లో ఆయన్ను అరెస్ట్ చేస్తారనే భయం ఉండబట్టే ఆయన విజయవాడ కేంద్రంగా దీక్ష చేస్తున్నారని తెలిపారు. ఒక్కోమంత్రి ఒక్కో జిల్లాలో దీక్షకు కూర్చోవటం ద్వారా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయటం కాదా అని ప్రశ్నించారు. ఆర్టీసీ బసులన్నీ ఆయన దీక్షకు జనాలను తీసుకువెళ్లటానికి కేటాయించటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. బాబుకు జగన్కు పోలిక లేదు సీఎం చంద్రబాబు కుటుంబం కార్పొరేట్ హంగులకు అలవాటు పడిందన్నారు. కానీ తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండలను సైతం లెక్క చేయకుండా నడుస్తున్నారని అన్నారు. చంద్రబాబు తన కుమారుడుని పరోక్షంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి దొడ్డిదారిన మంత్రిని చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన కుమారుడిని ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిపించి ప్రజాక్షేత్రంలోకి తీసుకువచ్చారన్నారు. టీడీపీ నేతల చూపు వైఎస్సార్ సీపీ వైపు.. తెలుగుదేశం పార్టీలోని కీలక నేతలు వైఎస్సార్ సీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే టీడీపీకి చెందిన ఇద్దరు పారిశ్రామికవేత్తలు జగన్ సమక్షంలో తమ పార్టీలో చేరబోతున్నారని తెలిపారు. -
పింఛన్లపై ఆందోళన : వైఎస్ఆర్ సీపీ నేతల అరెస్టు
సాక్షి, జగ్గయ్యపేట : అర్హులైన వారికి రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలంటూ జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. రేషన్ కార్డుల జారీ, పింఛన్లు మంజూరు చేయడంలో అధికారులు పక్షపాతం చూపుతున్నారంటూ బాధితులతో కలసి వైఎస్ఆర్ సీపీ నేతలు ఆందోళనకు దిగారు. హూటాహుటిన ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్న పోలీసులు ఆందోళనను విరమించుకోవాలని కోరారు. ధర్నా చేసేందుకు ముందుగా అనుమతి తీసుకోవాలని చెప్పారు. దీంతో వైఎస్ఆర్ సీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించారు. దీంతో పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకున్న వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు స్టేషన్ ఎదుట బైఠాయించారు. అరెస్టు చేసిన వారిని విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. -
‘ఎన్ని కుట్రలు చేసినా న్యాయమే గెలిచింది’
సాక్షి, జగ్గయ్యపేట : కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చివరకు న్యాయమే గెలిచిందని వైఎస్ఆర్ సీపీ నేత సామినేని ఉదయభాను అన్నారు. మున్సిపల్ ఛైర్మన్గా వైఎస్ఆర్సీపీ సభ్యుడు ఇంటూరి రాజగోపాల్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అనంతరం సామినేని ఉదయభాను మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికను వాయిదా వేసేందుకు టీడీపీ ఎన్నో కుట్రలు చేసిందని, ప్రలోభాలకు లొంగనివారికి, బెదిరింపులకు గురి చేసిందన్నారు. వైఎస్ఆర్ సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉందని, అయితే టీడీపీ సభ్యులను కిడ్నాప్ చేశారంటూ ఆ పార్టీ కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించినప్పటికీ... వైఎస్ఆర్ సీపీ సభ్యులు క్రమశిక్షణతో సహనంగా వ్యవహరించారన్నారు. -
జగ్గయ్యపేటలో మరో కుట్రకు తెరలేపిన టీడీపీ
సాక్షి, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడటంతో టీడీపీ మరో కుట్రకు తెరలేపింది. ప్రలోభాలకు లొంగని వైఎస్ఆర్ సీపీ నేతల బెదిరింపులతో అదుపులోకి తెచ్చుకునేందుకు యత్నిస్తోంది. తమకు మద్దతు ఇవ్వకుంటే కేసులు తిరగదోడతామంటూ లీకులు ఇస్తోంది. పార్టీ ఫిరాయించి మద్దతిస్తే కేసులు మాఫీ చేస్తామని టీడీపీ సంకేతాలు పంపిస్తోంది. తాము చెప్పినట్లు వినకుంటే నలుగురు కౌన్సిరల్లను అరెస్ట్ చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక టీడీపీ నేతల హైడ్రామా నేపథ్యంలో జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎన్నిక వాయిదాపై రిటర్నింగ్ అధికారి హరీశ్ మాట్లాడుతూ.....‘కౌన్సిల్లో చోటుచేసుకున్న పరిణామాలను ఈసీ దృష్టికి తీసుకెళ్తాం. ఈ రోజు కోరం ఉన్నా ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేదు. సర్దిచెప్పినా కొంతమంది సభ్యులు వినిపించుకోలేదు. రేపు ఉదయం ఎన్నిక నిర్వహిస్తాం.’ అని తెలిపారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ నేత సామినేని ఉదయభాను మాట్లాడుతూ... మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారంలో కావాలనే టీడీపీ నేతలు రాద్ధాంతం చేశారని అన్నారు. టీడీపీ నేతలు రిటర్నింగ్ అధికారిపై ఒత్తిడి తెచ్చి ఎన్నిక వాయిదా వేయించారని ఆయన ఆరోపించారు. కోరం ఉన్నా వాయిదా వేయడంలోని మతలబు ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నెల రోజుల నుంచి ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేస్తున్నా... తమ కౌన్సిలర్లు లొంగలేదన్నారు. అందుకే టీడీపీ నేతలు విధ్వంసం చేశారని మండిపడ్డారు. తమ పార్టీ కౌన్సిలర్లకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. కాగా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ వైఎస్ఆర్ సీపీ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనలో పాల్గొన్న సామినేని ఉదయభాను సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల అరాచకం.. వైఎస్ఆర్సీపీకి మెజార్టి సభ్యులు ఉండటంతో ఎలాగైనా మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకోవాలని టీడీపీ నేతలు అరాచకానికి ఒడిగట్టారు. అధికారులు, ప్రతిపక్ష సభ్యులపై దౌర్జన్యం ప్రదర్శిస్తూ మున్సిపల్ కార్యాలయంలో బీభత్సం సృష్టించారు. ఇద్దరు టీడీపీ మహిళ నాయకులను కౌన్సిలర్గా చూపిస్తూ మున్సిపల్ హాలులోకి టీడీపీ నేతలు తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతల అసలు రంగు బయటపడటంతో కౌన్సిల్ హాలులోని టేబుళ్లను పడేశారు. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఎన్నికల మెమోరండం పేపర్లను చించిపారేశారు. అలాగే మున్సిపల్ ఆఫీసు ముందు పార్క్ చేసిన బైక్ను టీడీపీ నేతలు పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ తతంగం అంతా సీసీ ఫుటేజ్లో రికార్డవడంతో తమ కౌన్సిలర్లు ఇద్దరు మాయమయ్యారంటూ ఎన్నిక వాయిదా వేయాలని పట్టుపట్టారు. ఈ గందరగోళంలో అధికారులు చైర్మన్ ఎన్నిక కాసేపు వాయిదా వేసినప్పటికి వ్యవహారం సద్దుమణగపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఛైర్మన్ ఎన్నికల వాయిదా వేయడంపై వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రలోభాలతో మా కౌన్సిలర్లను టీడీపీ నేతలు కొనాలని చూశారని...కుదరకపోవడంతో ఎన్నిక వాయిదా వేయించారని మండిపడ్డారు. రేపు ఉదయం 11 గంటలకు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. -
ఫిరాయింపుదారులకు మంత్రి పదవులా?
జగ్గయ్యపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన క్యాబినెట్ విస్తరణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టడం అప్రజాస్వామికమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీలో చేరిన ఫిరాయింపుదారులతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలన్నారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ టీఆర్ఎస్లో చేరి మంత్రి అయితే కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపించిన చంద్రబాబు నేడు అదే సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారన్నారు. అప్పట్లో గవర్నర్ను సైతం దూషించిన చంద్రబాబు ప్రస్తుతం అదే గవర్నర్తో టీడీపీలో చేరిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారని దుయ్యబట్టారు. అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు నిలువెత్తు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరం చెప్పాల్సిన గవర్నర్ కూడా మంత్రివర్గ విస్తరణలో పాల్గొని వారితో ప్రమాణస్వీకారం చేయించటం హేయమన్నారు. ఇటీవల విడుదలైన కాగ్ నివేదిక కూడా చంద్రబాబు అవినీతిని తేటతెల్లం చేసిందని గుర్తు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు తీరుపై పార్టీ ఆధ్వర్యంలో పోరాడనున్నట్లు తెలిపారు. -
ఆ నలుగురిని మళ్లీ బరిలోకి దింపండి..
విజయవాడ: తెలుగుదేశం పార్టీలోకి వలస వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీచేసి గెలవలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ సీనియర్ నేత సామినేని ఉదయభాను మీడియాతో మాట్లాడుతూ.. గతంలో దానం నాగేందర్, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిలు తెలుగుదేశం పార్టీ వీడి కాంగ్రెస్కు వచ్చినప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వారి చేత పదవులకు రాజీనామా చేయించి తిరిగి ఎన్నికల్లో నిలబెట్టారని గుర్తుచేశారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అవలంబిస్తున్నారని, తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళితే వారు రాజీనామాలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేస్తారు. ఇక్కడ మాత్రం నలుగురు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించారా? అంటూ ప్రశ్నించారు. జలవనరుల ప్రాజెక్టుల్లో కుంభకోణం చేయగా వచ్చిన కోట్లాది రూపాయల సొమ్మును ఎరగా వేసి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చంద్రబాబు కొంటున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విసిరిన సవాల్ను స్వీకరించే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ఖాన్ను రాజీనామా చేయించి తిరిగి టీడీపీ తరపున పోటీ చేయించాలని కోరారు. జలీల్ఖాన్పై ఆ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి చెందిన ఏడుగురు కార్పొరేటర్లలో మీ పార్టీ ఎవర్ని సూచించినా పోటీకి దింపి. పాతిక వేల మెజారిటీతో గెలిపించుకుంటామని సవాలు విసిరారు. చంద్రబాబు రాజధాని ప్రాంతాన్ని సింగపూర్గా మార్చుతానంటే ప్రజలు నమ్మారని, అయితే రాజకీయ వ్యభిచార కేంద్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇప్పటికే తెలంగాణను కోల్పోయి రెండు కళ్లలో ఒక కన్ను పోగొట్టుకున్నారని, ఇప్పుడు రెండో కంట్లో నాలుగు యాసిడ్ చుక్కల్ని వేసుకుని ఆ కన్ను కూడా పోగొట్టుకునేందుకు సిద్ధమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి అన్నారు. ప్రజల్లో చంద్రబాబు గ్రాఫ్ రోజురోజుకు పడిపోతూ ఉండబట్టే ప్రజల దృష్టి మరల్చడానికి ఇప్పుడు ఆకర్ష్ పథకం పెట్టి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని అన్నారు. చంద్రబాబు చేసే దుర్మార్గపు పనుల్ని ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ఆయన్న రాజకీయ సమాధి చేస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ కార్పొరేటర్లు, నేతలు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేత ఉదయభాను అరెస్ట్
-
'శ్రీశైల వాసు హత్యకేసుపై సమగ్ర దర్యాప్తు'
నందిగామ: తమ పార్టీ నాయకుడు బుగ్గవరపు శ్రీశైల వాసు హత్య వెనుక పలు అనుమానాలున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పార్థసారథి, సామినేని ఉదయభాను అన్నారు. ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. శ్రీశైల వాసు హత్యకేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం వైఫల్యం వల్లే గన్ కల్చర్ తరహాలో హత్యలు జరుగుతున్నాయని విమర్శించారు. పోలీసులు కావాలనే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కృష్ణాజిల్లా నందిగామలో శ్రీశైల వాసును మంగళవారం ఉదయం తుపాకీతో కాల్చిచంపారు. -
పత్రికల పాత్ర గణనీయం
వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు సామినేని విశ్వనాథం జగ్గయ్యపేట అర్బన్ : సమాజాభివృద్ధిలో పత్రికలపాత్ర ఎంతో గణనీయమైనదని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు సామినేని విశ్వనాథం అన్నారు. బుధవారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను స్వగృహంలో పట్టణంలో నూతనంగా ప్రారంభించిన ఎదురుదాడి వారపత్రిక ప్రచురించిన మున్సిపల్ ప్రత్యేక అనుబంధాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలకు,ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండే పత్రికలు నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురిస్తూ అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ప్రజాప్రతినిదులు, అధికారులు పనిచేసేలా మరింత చొరవకు పత్రికలు కృషిచేయాలన్నారు. ఎదురుదాడి వారపత్రిక సంపాదకులు మాశెట్టి రమేష్బాబును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మున్సిపల్ చైర్మన్తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ పారదర్శకమైన పాలనను అందించేందుకు పత్రికలు తమవంతు సహాయసహాకారాలు అందించాలని కోరారు. వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ మదార్సాహెబ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల చలం, వైస్ చైర్మన్ మహ్మద్ అక్బర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చింకా వీరాంజనేయులు, జె.ఉదయభాస్కర్, శివాలయం దేవస్థాన మాజీ చైర్మన్ ఎం.కేశవరావు, నాయకులు శేషం ప్రసాద్, వేముల రామకృష్ణ, రఫీ, పలు వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
‘కోడెల’ రాజీనామా చేయాలి
జగ్గయ్యపేట అర్బన్ : గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికల్లో పాల్గొనడానికి వస్తున్న వైఎస్సార్ సీపీ శాసనసభ్యుడు, ఎంపీటీసీ సభ్యులు, పలువురు నేతలపై టీడీపీ గూండాలు దాడిచేయడం హేయమైన చర్య అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. ఈ దాడికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఉదయభాను మాట్లాడుతూ గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబుతోపాటు నలుగురు ఎంపీటీసీ సభ్యులపై తెలుగుదేశం గూండాలు తెగబడి వాహనాన్ని అడ్డగించి దౌర్జన్యంగా, అక్రమంగా భయానక వాతావరణం సృష్టించి, రక్తం వచ్చేలా తీవ్రంగా కొట్టడం దారుణమన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ నిరంకుశ వైఖరి, అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమన్నారు. ఈ ఘటనపై చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యల ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన స్థాయిని మరిచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో ఫోన్లో సంప్రదింపులు జరపడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకుని దాడులకు పాల్పడిన వారిపై హత్యానేరం, కిడ్నాప్ కేసులు నమోదుచేయాలని కోరారు. ఇదే తీరులో తెలుగుదేశం శ్రేణులు 15 రోజులుగా ప్రకాశం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దాడులకు తెగబడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను కలిసిన రెండు రోజులకే ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. టీడీపీ దాడులను ఆపకపోతే వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రత్యక్ష దాడులకు దిగుతాయని ఉదయభాను హెచ్చరించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల చలం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు జగదీష్, నంబూరి రవి, పారిశ్రామికవేత్త తుమ్మేపల్లి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ నేతల ఖండన.. వాహనంలో వెళ్తున్న గుంటూరు శాసనసభ్యుడు ముస్తఫా, ఆయన కుటుంబసభ్యులు, మహిళలపై విచక్షణారహితంగా దాడులు చేయడంపై వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ మదార్సాహెబ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎం.డి.అక్బర్, మైనార్టీ నాయకులు పి.ఫిరోజ్ఖాన్ తదితరులు తీవ్రంగా ఖండించారు. -
ప్రజల పక్షాన పోరాడుతాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఉదయభాను జగ్గయ్యపేట అర్బన్, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాతీర్పును తమ పార్టీ గౌరవిస్తోందని, ప్రతిపక్ష పార్టీగా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ఆయన శనివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా వీచిన బీజేపీ, మోడీ గాలి వల్లే రాష్ట్రంలో టీడీపీకి అనుకూల ఫలితాలు వచ్చాయని వివరించారు. ఎన్నికల్లో చంద్రబాబు చేసిన వాగ్దానాలు అమలుకు సాధ్యం కావని, అయినప్పటికీ ప్రజలను నమ్మించారని విమర్శించారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేస్తామన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తారన్నారు. గతంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే ఫైలుపై చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. చంద్రబాబుకు రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఆయన తొలి సంతకం కూడా ఉచిత విద్యుత్పైనే చేయాలని డిమాండ్ చేశారు. వెయ్యి రూపాయలకు పింఛన్ల పెంపు, రైతు రుణమాఫీ, డ్వాక్రారుణాల రద్దు, రైతులకు పగటిపూట వ్యవసాయవిద్యుత్, నిరుద్యోగులకు ఉద్యోగం, నిరుద్యోగ భృతి తదితర హామీలను అమలు చేసి నిజాయితీని చాటుకోవాలని సూచించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ధనప్రభావంతో గెలిచిందని, ఓట్ల లెక్కింపులో ఆధిక్యత వచ్చిన వెంటనే అనేక గ్రామాలలో ఆ పార్టీ దౌర్జన్యానికి దిగిందని విమర్శించారు. ఓటర్లకు కృతజ్ఞతలు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ఓటువేసిన ప్రజలు, పార్టీ కోసం కృషిచేసిన నాయకులు, కార్యకర్తలకు ఉదయభాను కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ జిల్లా అధికారప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్ మదార్సాహెబ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల చలం, మండల కన్వీనర్ మాతంగి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ అభ్యర్థి ఇంటూరి రాజగోపాల్, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్, కొలగాని వెంకయ్య, పొన్నా రామ్మోహన్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చింకావీరాంజనేయలు, జె.ఉదయభాస్కర్, జగదీష్, పట్టణ యూత్ కన్వీనర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
నేడు చారిత్రాత్మక తీర్పు
జగన్ సీఎం కావడం ఖాయం లగడపాటివి సన్నాసి మాటలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఉదయభాను జగ్గయ్యపేట అర్బన్, న్యూస్లైన్ : రాష్ట్ర ప్రజలు నేడు చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, పేట అసెంబ్లీ అభ్యర్థిసామినేని ఉదయభాను స్పష్టం చేవారు. చిల్లకల్లు రోడ్డులోని స్థానిక పట్టణపార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుని అధికారంలోకి రావడం ఖాయమనిఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల వెలువడిన మున్సిపల్, మండల, జిల్లాపరిషత్ ఎన్నికల ఫలితాల్లో వెఎస్సార్ సీపీకి తక్కువ సీట్లు వచ్చినా అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 110సీట్లకు పైగా తమ పార్టీ కైవసం చేసుకుని విజయదుందుభి మోగిస్తుందన్నారు. మున్సిపల్,మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలకు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు అసలు సంబంధమే ఉండ దన్నారు. ఆ ఎన్నికలు కేవలం ఒక ప్రాంతానికి చెంది, స్థానిక రాజకీయాలు, స్థానిక గ్రూపు రాజకీయాల ప్రభావంతో నిండి ఉంటాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన నాటికి, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయానికి మధ్యలో అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరించనున్నారన్నారు. గతంలోనూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షం తెలుగుదేశానికి ఎక్కువ స్థానాలు వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న వైఎస్సార్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా నీరాజనాలు పలికే విధంగా ఫలితాలు రానున్నాయన్నారు. జిల్లాలోనూ అత్యధిక స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నిలిపే సమర్థవంతమైన వైఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం ఖాయమన్నారు. లగడపాటివి సన్నాసి మాటలు... రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రగాల్భాలు పలికిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సన్యాసం మాటున సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని ఉదయభాను అన్నారు. కుళ్లు, కుతంత్రాలతో ఏ ఎండకు ఆ గొడుగు పట్టే విధంగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటట్లు ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా సర్వేలు వెల్లడించడం ఆయనకు పరిపాటేనని దుయ్యబట్టారు. బెట్టింగులకు పాల్పడుతూ అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. 2009లో కూడా ఈ విధంగానే బెట్లు కాస్తూ కోట్లాదిరూపాయలు గడించారని, ప్రస్తుతం 48గంటల్లో ఫలితాలు వెల్లడవుతాయని తెలిసి కూడా బెట్టింగ్ రాజకీయాలు చేస్తూ అనేక కుటుంబాలను నాశనం చేస్తున్నారన్నారు. ఆయనపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ నేతలు తన్నీరు నాగేశ్వరరావు, షేక్ మదార్సాహెబ్, తుమ్మేపల్లి నరేంద్ర, తుమ్మల ప్రభాకర్, చింకా వీరాంజనేయులు, జె.ఉదయభాస్కర్, సిహెచ్.జగదీష్, నంబూరి రవి, ఇంటూరి రాజగోపాల్, కాకాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
విజయం తథ్యం : భాను
132 అసెంబ్లీ స్థానాలు మావే సీమాంధ్రలో వైఎస్సార్సీపీ హవా జననేత జగన్కే పట్టం కట్టిన ఓటరన్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉదయభాను వెల్లడి జగ్గయ్యపేట, న్యూస్లైన్ : సీమాంధ్రలో వైఎస్సార్ సీపీకి 132 అసెంబ్లీ స్థానాల్లో విజయం తథ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జగ్గయ్యపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సామినేని ఉదయభాను ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని తన స్వగృహంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే సీమాంధ్ర ఓటర్లు పట్టం కట్టారని చెప్పారు. ఉద్యోగులు, కూలీలు, యువకులు, మహిళలు అంతా వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓటు వేశారన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్, టీడీపీ నాయకులు అనేక విధాలుగా వేధించారని చెప్పారు. ప్రజలంతా వైఎస్ కుటుంబానికి అండగా నిలిచారన్నారు. జగన్మోహన్రెడ్డిని కుట్రపూరితంగా, అన్యాయంగా 16 నెలలు జైలులో పెట్టినప్పటికీ ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ప్రజల మధ్యకు వచ్చి ప్రజా ఉద్యమం చేశారన్నారు. మంచి పాలన కావాలని ప్రజలకు విశ్వాసం కల్పించారని తెలిపారు. దేశ చరిత్రలోనే ఒక మహిళ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత షర్మిలకే దక్కుతుందని గుర్తుచేశారు. ప్రజల హృదయాల్లో వైఎస్సార్సీపీ... ప్రజల మనసుల్లో వైఎస్సార్ సీపీ ఉందని, బుధవారం జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలలో ప్రజలు తమ ఓటు ద్వారా ఆ విషయం స్పష్టం చేశారని భాను వివరించారు. వైఎస్సార్ కుటుంబం త్యాగాల కుటుంబమని చెప్పారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అధికార దాహం కోసం ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా.. ప్రజలు గమనించి వారికి ఏ ప్రభుత్వం కావాలో నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉండే నాయకత్వం కోసం, ప్రజా పరిపాలన కోసం జనం ఎదురుచూస్తున్నారన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ పోలింగ్ నమోదైందన్నారు. నిత్యకృషీవలుడు జగన్... జననేత జగన్మోహన్రెడ్డి నిత్యకృషీవలుడని, నెలలో 24 రోజులపాటు ప్రజలకు అందుబాటులో ఉంటారని భాను చెప్పారు. జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్సీపీ అభ్యర్థులు కైవసం చేసుకుంటారని, జగ్గయ్యపేటలోనూ వైఎస్సార్సీపీకే అనుకూలంగా ప్రజా తీర్పు రాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లకు కృతజ్ఞతలు... పార్టీ స్థాపించిన నాటి నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు నిత్యం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఓటర్లకు భాను కృతజ్ఞతలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచిన ఓటర్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్ షేక్ మదార్సాహెబ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చింకా వీరాంజనేయులు, నంబూరి రవి, కట్టా కోటేశ్వరరావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తుమ్మల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి పేరు శ్రీరాం.. చేసేది ఫ్యాక్షనిజం..
నేరచరితులకు ‘తాతయ్య’ వెన్నుపోటులో చంద్రబాబుకు తమ్ముడే.. అక్రమాల్లో సోదరుల అండ సాక్షి, విజయవాడ : ఆయన ఇంటి పేరు శ్రీరాముడు.. రామచంద్రుడంతటి గొప్ప పాలనాదక్షుడనుకుంటే ‘తప్పు’లో కాలేసినట్లే. ఆనాడు మాటకోసం శ్రీరాముడు పదవిని తృణప్రాయంగా త్యజిస్తే.. ఈనాడు శ్రీరాం రాజగోపాలుడు పదవి కోసం ఎంతటి పని చేయడానికైనా వెనుకాడడని ప్రతీతి. మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా తన స్వార్థమే తప్ప ప్రజల కష్టసుఖాలు పట్టించుకోని నాయకుడని తెలుగు తమ్ముళ్లే చెప్పుకొంటుంటారు. తనను రాజకీయంగా పైకి తీసుకొచ్చిన సామినేని ఉదయభానునే వెన్నుపోటు పొడిచి చంద్రబాబుకు రాజకీయ తమ్ముడిని అనిపించుకున్న ‘ఘనుడు’. ఒక్కసారి ఎమ్మెల్యే పదవి రుచిచూశాక తన తమ్ముడి సాయంతో నియోజకవర్గంలో భయభ్రాంతులు సృష్టిస్తూ రెండోసారి ఎమ్మెల్యే కావాలని కలలు కంటున్నాడు. ఆయన అరాచక రాజకీయాలు గమనిస్తున్న నియోజకవర్గ వాసులు ఈసారి తగిన బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజాకంటక పాలనలో కొన్ని నిజాలు... తన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉనికే ఉండకూడదని శ్రీరాం తాతాయ్య భావించారు. ఈ సమయంలో నవాబుపేట సర్పంచ్ గింజుపల్లి వీరయ్య స్థానిక శివాలయంలో అత్యంత పాశవికంగా హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో శ్రీరాం తాతాయ్య సోదరులు శ్రీరాం ధనుంజయ (చిన్నబాబు), శ్రీరాం బదరీనారాయణ నిందితులు. వీరిద్దరిని ముద్దాయిలుగా తప్పించేందుకు ఎమ్మెల్యేగా తనకున్న పరపతిని ఉపయోగించారని నవాబుపేట గ్రామస్తులు నమ్ముతున్నారు. వీరయ్య హత్యకేసులో మొదటి నిందితుడుగా ఉన్న చిన్నబాబు సినిమా ఫక్కీలో ఏడాది పాటు నియోజకవర్గం నుంచి కనుమరుగయ్యాడు. పరిస్థితులు చక్కబడిన తరువాత తిరిగి నియోజకవర్గంలో కాలుపెట్టాడు. పాతికేళ్ల కిందట జయరాజ్ అనే దళితుడిపై స్వయంగా దాడి చేసిన తాతయ్య అతని తల పగలగొట్టి హత్యాయత్నం చేయడం అప్పట్లో పట్టణంలో సంచలనం సృష్టించింది. ఈ తరహా దాడులతోనే చివరికి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారని నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ చర్చించుకుంటారు. దళిత నాయకులు ఆలేటి రాజారావు, కనపర్తి బాబు, సేతు, గోపిలను హత్యచేసిన వారికి రాజకీయ ఆశ్రయం కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి.సినీనటుడు పవన్కల్యాణ్ అభిమాని బసవల వెంకటేశ్వరరావు అలియాస్ కొండ.. తొర్రగుంటపాలెంలో దారుణ హత్యకు గురైన ఘటన వెనుక రాజకీయ నేపథ్యం ఉందనేది బహిరంగ రహస్యమే. తన మాటలు వినని ఇతర పార్టీ నేతలను, పోలీసు అధికారులను వేధించడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. జిల్లాలో పేకాట క్లబ్లను పోలీసులు అనేక సంవత్సరాల క్రితమే నిషేధించినా ఆయన తన కనుసన్నల్లో అక్రమంగా యథేచ్ఛగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నిర్వాహకుల నుంచి లక్షల రూపాయల్లో మామూళ్ల వసూలు అందరికీ తెలిసిన విషయమే. తన పదవిని అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టించేందుకూ వెనుకాడని నైజం ఆయనది. ఈ నేపథ్యంలోనే ఆయన మాటలు విన్న స్థానిక ఎస్ఐ, సీఐలు సస్పెన్షన్కు గురవడం గమనార్హం. అక్రమార్జనలో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలనూ వదిలిపెట్టరని ప్రతీతి. ప్రతి ఫ్యాక్టరీకీ ఒక రేటు ఫిక్స్ చేస్తారని, ఏటా వాటినుంచి మామూళ్లు వసూలు చేస్తారని, చందాలు ఇవ్వని యాజమాన్యాలపై కార్మికులను ఉసిగొల్పుతారని విమర్శలు ఉన్నాయి. కార్మికులకు, యజమానులకు మధ్య సయోధ్య కుదుర్చుతున్నట్లుగా నటించి కోట్లు వెనుకేసుకోవడం ఆయన సోదరులకు వెన్నతో పెట్టిన విద్య. తన అనుచరులకు బినామీ కాంట్రాక్టులు ఇప్పించి అందులోనూ వాటాలు దండుకోవడంలో సిద్ధహస్తుడు. వత్సవాయి మండలం భీమవరం వద్ద కొంగర మల్లయ్య గట్టును తవ్వి నూతనంగా నిర్మించిన హైవే రోడ్డు విషయంలోనూ ఆయనకు కోట్ల రూపాయలు ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది. -
చీకటి వ్యాపారంతో తాతయ్య బిజీ!
చేరదీసిన నేతకే వెన్నుపోటు కాకిరాయి అక్రమరవాణాపైనే ఆసక్తి తమ్ముడే షాడో ఎమ్మెల్యే జర్నలిస్టుల పైనా దాడికి వెనుకాడని నైజం జగ్గయ్యపేట, న్యూస్లైన్ : ‘మాటల్లో గాంధేయవాదం... చేతల్లో గూడాయిజం’ ఈ వర్ణన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతాయ్య)కు అక్షరాలా సరిపోతుంది. అటు కాంగ్రెస్, ఇటు టీడీపీలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, రాజకీయాల్లో పెంచి పెద్ద చేసిన నేతకే వెన్నుపోటు పొడిచిన ఘనుడిగా నియోజకవర్గ ప్రజలు తాతయ్యను గుర్తించారు. చీకటి వ్యాపారాన్ని చట్టబద్ధం చేసుకోవడానికి తన ఐదేళ్ల ఎమ్మెల్యే పదవిని చక్కగా వినియోగించుకున్నారు. ఆయన సోదరుడు ధనుంజయ (చిట్టిబాబు) షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చెలాయిస్తున్నారు. తమ కనుసన్నల్లో ఉండ ని వారిపై దాడులు చేయడానికి కూడా వెనుకాడని నైజం చిట్టిబాబుది. సామినేనికే వెన్నుపోటు పొడిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను గతంలో శ్రీరాం తాతాయ్య రాజకీయంగా ఎదిగేందుకు అన్ని విధాలా సహకరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాతాయ్యను మున్సిపల్ చైర్మన్గా గెలిపించేందుకు సాయంచేశారు. తాతాయ్యపై ఉన్న నమ్మకంతో జగ్గయ్యపేట పట్టణ నిర్వహణ బాధ్యతలను సామినేని ఆయనకే అప్పగించారు. అయితే ఇంతగా నమ్మిన ఉదయభానును గత ఎన్నికల్లో వెన్నుపోటు పొడవడానికి తాతాయ్య వెనుకాడలేదు. టీడీపీ వ్యతిరేకిగా రాజకీయాల్లోకి వచ్చి చివరకు ఆ పార్టీ పంచనే చేరి ఎమ్మెల్యేగా గెలిచి వెన్నుపోటులో సిద్ధహస్తుడిగా నియోజకవర్గ ప్రజల్లో గుర్తింపు పొందారు. కాకిరాయి అక్రమరవాణా వత్సవాయి మండలంలోని తన ఐరన్వోర్ ఫ్యాక్టరీకి చీకటి వేళ కాకిరాయి అక్రమంగా రవాణా చేస్తూ శ్రీరాంతాతయ్య కోట్లు గడిస్తున్నారు. ఎమ్మెల్యే కాకముందు కాకిరాయి అక్రమంగా రవాణాను గుర్తించిన అప్పటి ప్రభుత్వం ఫ్యాక్టరీని సీజ్చేసింది. ఎమ్మెల్యే అయ్యాక కాంగ్రెస్తో దోస్తీకట్టి ఫ్యాక్టరీని తెరి పించారు. తిరిగి చుట్టుపక్క ప్రాంతాల కాకిరాయిని అక్రమంగా తరలిస్తూ రూ.కోట్లు ఆర్జిం చారు. పన్నులు చెల్లించకుండా అధికారులను సైతం భయభ్రాంతులకు గురిచేశారు. ప్రస్తుతం ఈ వ్యాపారం ఎమ్మెల్యే సోదరుడి కనుసన్నల్లో యథేచ్ఛగా నడుస్తోంది. పారాబాయిల్డ్ రైస్మిల్లుకు కోట్ల రూపాయల బ్యాంకుల రుణాలు తీసుకువచ్చి డబ్బు చెల్లించకుండా బ్యాంక్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. ఎమ్మెల్యే సోదరుడిదే హవా.. తాతయ్య పేరుకే ఎమ్మెల్యే. హవా అతని సోదరుడు చిన్నబాబుదే. తాతయ్య హైదరాబాద్కే పరిమితం కావడంతో చిన్నబాబే ఎమ్మెల్యేగా చలామణీ అవుతున్నారు. గ్రామాల్లో టీడీపీ నాయకులు చేసే ఇసుక, కాకిరాయి వ్యాపారాల్లో అతని హస్తం ఉండాల్సిందే. అక్రమ వ్యాపారాలు చేసేవారికి ఏదైన జరిగితే చాలు రాజీ చేస్తుంటారు. తానే ఎమ్మెల్యేనని ఇటీవల కార్యకర్తలతో చినబాబు ఫ్లెక్సీలు వేయించి పట్టణంలో ఏర్పాటుచేయించాడు. 2009లో పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గింజుపల్లి వీరయ్య హత్య కేసులో నింది తులైన ఈ సోదరులు కొంతకాలం అజ్ఞాతంలో గడిపారు. కాంగ్రెస్ నేతలతో చేతులు కలపడంతో అప్పటి ఎంపీ లగడపాటి రాజ గోపాల్ వారిని హత్య కేసు నుంచి తప్పించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జర్నలిస్టుపై దాడి ఇటీవల చంద్రబాబు జగ్గయ్యపేటలో నిర్వహించిన రోడ్ షో విఫలమైంది. దీనిపై సాక్షి దినపత్రిక ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే వర్గీయులు జగ్గయ్యపేట సాక్షి విలేకరి విజయ్పాల్పై దాడి చేశారు. ఈ దాడి వెనుక చిట్టిబాబు హస్తం ఉందని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. -
తండ్రి ఆశయాల కోసమే జగన్ పోరాటం
పెనుగంచిప్రోలు, న్యూస్లైన్ : దివంగత మహానేత వైఎస్సార్ ఆశయాల సాధన కోసం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడుతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి కొనియాడారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆదివారం జగ్గయ్యపేట అసెంబ్లీ అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభానుతో కలిసి మండలంలోని శనగపాడు, వెంగనాయకునిపాలెం, వెంకటాపురం కె.పొన్నవరం, కొళ్లికూళ్ల, సుబ్బాయిగూడెం గ్రామాల్లో పర్యటించారు. వారికి ఆయా గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా పూలవర్షం కురిపించి, హారతులు పట్టారు. కాబోయే సీఎం జగన్కు జై అంటూ యువకులు నినాదాలుచేశారు. ఆయా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయాంలోనే జరి గిందని, ఆల్ ఫ్రీ చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని బాబు పూర్తిగా దిగజార్చాడని విమర్శించారు. వైఎస్ పుణ్యమా అని పులిచింతల ప్రాజెక్టు పూర్తయిందని, రాష్ట్రంలో 47 చిన్నతరహా పరిశ్రమలు పూర్తయి రైతులకు ఎంతో మేలు కలుగుతోందని వివరించారు. కరెంట్ కోసం ధర్నాలు చేస్తే రైతులను పోలీసులతో కాల్పించి చంపించిన ఘనత బాబుకే దక్కుతుందని ఎద్దేవాచేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థి సామానేని ఉదయభానును అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మండలంలో శనగపాడు నుంచి సుబ్బాయి గూడెం వరకు తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఉదయభాను హామీ ఇచ్చారు. ఎత్తిపోతల పథకాలతో రైతులకు పూర్తిగా సాగునీటి కష్టాలు తీరుస్తామని పేర్కొన్నారు. ఎస్సార్ సీపీలో చేరిన ఏఎంసీ చైర్మన్ జగ్గయ్యపేట : స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు చైర్మన్ కుందవరపు కొండయ్య, మండలంలోని అనుమంచిపల్లి సర్పంచి పాతకోటి రాధ ఆదివారం వైఎస్సార్ సీపీలో చేరారు. చిల్లకల్లు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, కేంద్రపాలక మండలి సభ్యురాలు నందమూరి లక్ష్మీపార్వతి సమక్షంలో కొండయ్య, రాధ కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ కొద్దిరోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఒంటెత్తు పోకడల వల్ల ఆ పార్టీ ఖాళీ అవుతుందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఎదురుచూస్తున్న జగన్మోహన్రెడ్డి పాలన కొద్దిరోజుల్లో వస్తుందన్నారు. కొండయ్య ఆధ్వర్యంలో అనుమంచి పల్లి శివాలయం చైర్మన్ అమ్మిన శ్రీనివాసరావు, తిరుమలగిరి వెంకటేశ్వరస్వామి దేవస్థాన పాలకవర్గ సభ్యుడు పానుగంటి మధు, సొసైటీ సభ్యుడు బాదే నాగేశ్వరరావు, చేపలచెర్వు (అనుమంచిపల్లి) చైర్మన్ కాకారపు వీరాస్వామి, వార్డు సభ్యులు ఆరికంటి తిరుపతి రావు, రహీమ్, తాళ్లూరి కరుణ, 200 మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు, నాయకులు ఇంటూరి రాజగోపాల్ (చిన్నా), పట్టణ పార్టీ కన్వీనర్ బెంబవరపు కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. గండ్రాయి నుంచి 45 కుటుంబాల చేరిక మండలంలోని గండ్రాయి నాయకులు వైకుం ఠపు అమరబాబు, కేవీ ఆధ్వర్యంలో 45 కుటుం బాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉదయభాను సమక్షంలో ఆదివారం వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ నాయకులు మాడుగుల వెంకటేశ్వరరావు, ముండ్లపాటి పవన్, పాల్వంచ రమేష్, పుల్లంశెట్టి వర, సన్నీ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపార్వతి, ఉదయభాను సమక్షంలో న్యాయవాది దాసరి బాపిరాజు, 13, 16వ వార్డులకు చెందిన టీడీపీ నాయకులు వడ్డేపల్లి బ్రహ్మం, కర్నాటి శ్రీనివాసరావు, నాగన్న వైఎస్సార్ సీపీలో చేరారు. -
ఓటమి భయం + ఉక్రోషం =దౌర్జన్యం
జిల్లాలో వైఎస్సార్సీపీపై కొనసాగుతున్న టీడీపీ దాష్టీకం తాజాగా పెంజెండ్రలో ఎన్నికల ర్యాలీపై దాడి మద్యం సేవించి బైక్లతో మహిళలపైకి దూసుకొచ్చిన వైనం ఎంపీటీసీ అభ్యర్థిని చేతికిగాయం వెంటాడుతున్న ఓటమి భయం.. ప్రత్యర్థి మనకంటే బలవంతుడనే ఉక్రోషం.. వెరసి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు భౌతిక దాడులకు దిగేస్థాయికి దిగజార్చాయి. మున్సిపల్, పరిషత్ తొలి దశ ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు దిగిన టీడీపీ శ్రేణులు పరిషత్ రెండో దశ ఎన్నికల్లోనూ అదే తీరు కొనసాగిస్తున్నారు. తాజాగా బుధవారం గుడ్లవల్లేరులో వైఎస్సార్సీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిని తాతినేని పద్మావతి ఎన్నికల ప్రచార ర్యాలీపై దాడి చేయడం కలకలం రేపింది. సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఓటమి ఉక్రోషంతో కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు బాహాటంగా దాడులకు దిగి దాష్టీకానికి పాల్పడుతున్నారు. పరిషత్ ఎన్నికల రోజైన ఈ నెల ఆరో తేదీన జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయిలో సామినేని ఉదయభాను అల్లుడు విజయనర్సింహారెడ్ది కాన్వాయ్పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. మక్కపేటలో పోలింగ్ సరళి చూసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభానుపై టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మీరెందుకు ఇక్కడకు వచ్చారంటూ ఆయనతో వాగ్వివాదానికి దిగారు. ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడు ఓటింగ్ సరళిని చూసుకునేందుకు వచ్చినా టీడీపీ శ్రేణులు సహించలేకపోవడం శోచనీయం. జగ్గయ్యపేట నియోజకవర్గంలో రెడ్డినాయక్తండా, ధర్మవరపు తండా ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలింగ్ సమయంలో టీడీపీ కార్యకర్తలు వివాదానికి దిగారు. దాడిచేసి.. గాయపరిచి... నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల మండలం మోగులూరులో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బండి జానకిరామయ్యపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఆయన తలకు గాయమైన సంగతి తెల్సిందే. అదే ఘటనలో వైఎస్సార్సీపీకి చెందిన మరో ముగ్గురికి కూడా గాయాలయ్యాయి. బండి జానకిరామయ్య ప్రస్తుతం హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. ఈ నెల ఐదో తేదీ రాత్రి గనిఆత్కూరులో వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ పాటిబండ్ల హరిజగన్నాథరావుపై టీడీపీ స్థానిక నేతలు దాడికి దిగారు. ఈ నెల ఆరున మచిలీపట్నం మండలంలోని పల్లెతాళ్లపాలెంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడిచేయగా వైఎస్సార్సీపీ నాయకుడు చెక్కా కృష్ణారావుకు గాయాలయ్యాయి. కంచికచర్ల మండలం పరిటాలలో వైఎస్సార్సీపీ నేత బత్తుల తిరుపతిరావుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడి ప్రస్తుతం విజయవాడ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ముప్పాళ్లలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు చేసిన సంగతి కూడా తెల్సిందే. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలే ఓటమి భయం.. ఆపై మద్యం సేవించారు.. ఇంకేముంది రెచ్చిపోయిన టీడీపీ యువకులు బైక్లతో వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీలోకి దూసుకుని వచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని చేతికి గాయమైంది. బుధవారం జరిగిన ఈ ఘటన టీడీపీ శ్రేణుల తీరుకు తాజా నిదర్శనం. గుడ్లవల్లేరు మండలం పెంజెండ్రలో వైఎస్సార్సీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిని తాతినేని పద్మావతి, జెడ్పీటీసీ అభ్యర్థిని అల్లూరి శిరీష, ఎంపీటీసీ అభ్యర్థిని బలుసు శ్రీసంధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం ఆఖరిరోజు కావడంతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు కొందరు మద్యం సేవించి విచక్షణారహితంగా బైక్లతో వైఎస్సార్సీపీ ర్యాలీలోకి దూసుకొచ్చారు. ఈ ఘటనలో ఎంపీటీసీ అభ్యర్థిని శ్రీసంధ్య చేతికి గాయమైంది. దీంతో టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. అప్పటికీ వారు అదే తీరుతో మహిళలని కూడా చూడకుండా దుర్భాషలకు దిగారు. దీంతో చైర్పర్సన్ అభ్యర్థిని తాతినేని పద్మావతి జోక్యం చేసుకుని ఇది సరైన పద్ధతి కాదని, ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు దిగుతున్నాయని మండిపడ్డారు. స్థానికుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. జిల్లాలో వైఎస్సార్సీపీకి పెరిగిన ప్రజాదరణను చూసి ఓర్వలేక టీడీపీ ఇలా భౌతిక దాడులకు దిగుతోందని వైఎస్సార్సీపీ నాయకులు మండిపతున్నారు. గత కొద్దిరోజులుగా వైఎస్సార్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను గమనిస్తే అవి ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారనే సంగతి తేటతెల్లమవుతోంది. స్లిప్ల పంపిణీలోనూ రాజకీయమే... ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో గ్రామ స్థాయిలో సిబ్బంది పంచాల్సిన ఓటరు స్లిప్లను టీడీపీకి చెందిన సర్పంచ్లు, వార్డు సభ్యులు పంపిణీ చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు టీడీపీ మద్దతుదారులు ఉద్దేశపూర్వకంగానే ఓటరు స్లిప్లు పంచలేదన్న విషయాన్ని నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్బాబు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
వైఎస్సార్ సీపీ విజయదుందుభి : సామినేని
కంచికచర్ల, న్యూస్లైన్ : జిల్లాలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయదుందుభి మోగిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను స్పష్టం చేశారు. జెడ్పీటీసీ అభ్యర్థి కాలవ వాసుదేవరావు స్వగృహంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సామినేనితోపాటు జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిని తాతినేని పద్మావతి, రాష్ట్ర ప్రచారకమిటీ కన్వీనర్ విజయచందర్ పాల్గొన్నారు. ఉదయభాను మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న జెడ్పీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించి జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం అత్యధిక మున్సిపాల్టీలు వైఎస్సార్ సీపీ ఖాతాలో జమ అవుతాయని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ బలం రోజురోజుకూ తగ్గిపోతుందన్నారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు బీజేపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఏ పార్టీతోనైనా జతకట్టేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో 9 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సొంతంగా పోటీచేసే దమ్ములేకే పొత్తులకోసం ఎదురుచూస్తుందని ఆరోపించారు. చివరకు పవన్కల్యాణ్ పార్టీతో కూడా పొత్తుకు సిద్ధపడుతుందంటే అధికారం కోసం టీడీపీ ఏ విధంగా అర్రులు చాస్తుందో ఇట్టే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజాకర్షణ కలిగిన నాయకుడు కేవలం వైఎస్. జగన్మోహనరెడ్డి మాత్రమేనన్నారు. రాష్ట్రంలో జరిగే సాధారణ ఎన్నికల్లో జగన్ నాయకత్వంలో వైఎస్సార్ సీపీ రాష్ట్రంలో 140 స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని చెప్పారు. విజయచందర్ మాట్లాడుతూ తాను రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జిల్లాల్లో పర్యటించానని అక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకున్నానన్నారు. ప్రతిఒక్కరూ ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్, బీజేపీపై కసితో ఉన్నారని, ఆ రెండు పార్టీలను భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నార ని తెలిపారు. రాజకీయాల్లో చిరంజీవిది ఐరన్లెగ్ అన్నారు. ఆయన పెట్టిన పీఆర్పీ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూసిందని, అనంతరం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారని, ఫలితంగా కాంగ్రెస్ పార్టీ కూడా భ్రష్టుపట్టిందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా తనను ప్రకటించడం తనకు ఎంతోసంతోషాన్నిచ్చిందని తాతినేని పద్మావతి పేర్కొన్నారు. జిల్లాలో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని చైర్మన్ పదవిని వైఎస్సార్ సీపీ దక్కించుకుంటుందన్నారు. జెడ్పీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటానని చెప్పారు. మండల పార్టీ కన్వీనర్ బండి జానకిరామయ్య, సర్పంచిగద్దె ప్రసాద్, దాసరి రాము, కోనా సుబ్బారావు, ఎంపీటీసీ అభ్యర్థిని నిమ్మగడ్డ కరుణ, పెదమళ్ల భద్రయ్య పాల్గొన్నారు. -
మ్యాచ్ఫిక్సింగ్... బయటపడింది
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదంతో తేటతెల్లం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భాను విమర్శ జగ్గయ్యపేట అర్బన్, న్యూస్లైన్ : రాజ్యసభలో తెలంగాణ బిల్లును ఆమోదించటంతో కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను విమర్శించారు. గురువారం రాత్రి ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. 58 ఏళ్లు కలిసివున్న తెలుగుజాతిని అత్యంత కిరాతకంగా విభజించిన పాపం ఆ మూడు పార్టీలకే దక్కుతుందని, దీంతో భారతదేశ పార్లమెంటు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని భాను అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారతదేశంలో కేవలం తమ స్వార్థం కోసం ఆ రాష్ట్ర అసెంబ్లీలోని మెజార్టీ సభ్యుల ఆమోదం కూడా లేకుండా ఏకపక్షంగా, నిరంకుశంగా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రంలోని ఉభయసభల్లో ఆమోదించటం అప్రజాస్వామికమన్నారు. తెలుగుజాతిపై కక్షకట్టినట్లుగా వారు వ్యవహరించటం దురదృష్టకరమని చెప్పారు. కేంద్ర మంత్రులు దద్దమ్మల్లా కూర్చున్నారు... కేంద్ర మంత్రులు జేడీ శీలం, కావూరి సాంబశివరావు, చిరంజీవి కూడా చర్చ సమయంలో పల్లెత్తుమాట కూడా మాట్లాడకుండా దద్దమ్మల్లా కూర్చోవటం దారుణమని భాను విమర్శించారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం సయయంలో తెలుగుదేశం సభ్యుడు సుజనాచౌదరి బిల్లుకు ఆమోదం తెలియజేయటంతో కాంగ్రెస్, తెలుగుదేశం కుమ్మక్కు రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయన్నారు. చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం మరోసారి రుజువైందన్నారు. దేశ చరిత్రలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ విధంగా కేంద్రప్రభుత్వంతో కుమ్మక్కై మ్యాచ్ఫిక్సింగ్కు పాల్పడటం ద్వారా నీచరాజకీయాలకు తెరతీసినట్లయిందన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీపీఎం మాత్రమే కాక దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు కూడా రాజ్యసభలో బిల్లును వ్యతిరేకి ంచటం గమనార్హమన్నారు. దేశ ప్రజలు ఈ వ్యవహారాన్నంతా గమనిస్తున్నారని చెప్పారు. అప్రజాస్వామికంగా వ్యవహరించిన పార్టీలకు తగిన సమయంలో బుద్ధిచెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో పలువురు నేతలు పాల్గొన్నారు. -
నిరసనాగ్రహం
వైఎస్సార్సీపీ బంద్ విజయవంతం మార్మోగిన సమైక్య నినాదం జిల్లా అంతటా ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు సాక్షి, మచిలీపట్నం : కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేందుకు ఏకపక్షంగా చేస్తున్న ప్రయత్నాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసనాగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరక ు ఆ పార్టీ శ్రేణులు శుక్రవారం జిల్లాలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏపీ ఎన్జీవోలు, అక్కడక్కడ టీడీపీ నేతలు కూడా ఆందోళనలు నిర్వహించారు. బస్సుల నిలిపివేత... ఒంటికాలిపై నిరసన జగ్గయ్యపేటలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. స్థానిక ఆర్టీసీ డిపో గేటు వద్ద భాను నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేసి బస్సులను నిలిపివేశారు. అనంతరం మానవహారం, ర్యాలీలు నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ ఆధ్వర్యంలో అవనిగడ్డ, చల్లపల్లి, నాగాయలంక బంద్ చేపట్టారు. అవనిగడ్డలో సింహాద్రి రమేష్, యాసం చిట్టిబాబు తదితరులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. మోపిదేవిలో వైఎస్సార్సీపీ నాయకులు రాస్తారోకో చేశారు. చల్లపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిపారు. ఏపీఎన్జీవో నాయకులు బంద్, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జాతీయరహదారిపై ధర్నా... కైకలూరులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఆయన ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు షాపులు మూయించి జాతీయ రహదారిపై ధర్నా చేశారు. కైకలూరు టీడీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. గుడివాడలో నిర్వహించిన బంద్లో వైఎస్సార్సీపీ నాయకులు మరీదు కృష్ణమూర్తి, మండలి హనుమంతరావు, లోయ రాజేష్ పాల్గొన్నారు. పెడన వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. పెడనలో పోస్టాఫీసు, బ్యాంకులు, పాఠశాలలు మూతపడ్డాయి. యూపీఏ దిష్టిబొమ్మ దహనం... నూజివీడులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. పట్టణంలో బైక్లతో ర్యాలీ నిర్వహించారు. నూజివీడు బస్టాండ్ సెంటర్ నుంచి చిన గాంధీ బొమ్మ సెంటర్ వరకు పాదయాత్ర చేసి యూపీఏ దిష్టిబొమ్మ దహనం చేశారు. న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మేకా ప్రతాప్ సంఘీభావం తెలిపారు. తిరువూరులో బంద్ సందర్భంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. మైలవరంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పట్టణంలో పాదయాత్ర చేశారు. నూజివీడు రోడ్డులో మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి బోసుబొమ్మ సెంటర్లో విద్యార్థులతో కలిసి జోగి రమేష్ మానవహారం నిర్వహించారు. నందిగామలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ర్యాలీ, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు. పామర్రులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. షాపులు మూయించివేసి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త పడమట సురేష్బాబు ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఎంపీ కోసం ప్రత్యేక పూజలు.. మచిలీపట్నం ఎంపీ కొనకొళ్ల నారాయణరావు లోక్సభలో గుండెపోటుకు గురైన నేపథ్యంలో టీడీపీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో బంద్ నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ని ముంబైకి తరలించడంతో టీడీపీ శ్రేణులు ఆలయాల్లో పూజలు చేశారు. -
ఖాజాబీ మృతిపై న్యాయ విచారణ : సామినేని
నందిగామ చేరిన మృతదేహం ప్రముఖుల సందర్శన, నివాళులు దోషులను అరెస్టు చేయాలని రాస్తారోకో నందిగామ, న్యూస్లైన్ : పేద కుటుంబంలో పుట్టి ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగి అర్ధాంతరంగా మృత్యుకౌగిలికి చేరిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఖాజాబీ మృతిపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి నిజానిజాలు తేల్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు ఎవరైనా ఆమెను ఆత్మహత్యకు పురికొల్పినట్లయితే...దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఆదివారం నందిగామకు చేరుకున్న ఖాజాబీ మృతదేహాన్ని ఆయన సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వ అధికారుల వైఫల్యం వలనే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పారు. వైఎస్సార్సీపీ నందిగామ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ ఈమెపై ఘాతుకానికి పాల్పడ్డారనే ఆరోపణలు నిజమైతే భర్తను. వారి బంధువులను కఠిన శిక్షించాలని డిమాండ్ చేశారు. కన్నీరు మున్నీరు... నందిగామ చేరుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఖాజాబీ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆమెను చూసేందుకు పట్టణంలోని పలు రాజకీయ పార్టీల నాయకులు, ముస్లింలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భర్తే హింసించి తమ బిడ్డను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఖాజాబీ తల్లిదండ్రులు సయ్యద్లాల్, గుల్షా ఆరోపిస్తున్నారు. మృతురాలి భర్త, ఖమ్మం జిల్లా ఖాజీపురానికి చెందిన మాజీ సర్పంచి షేక్ మహ్మద్ ఆలీషా, సర్పంచి మహ్మద్ నజీర్ మహారాష్ట్ర పోలీసులకు భారీ ఎత్తున ముడుపులు ఇచ్చి తమకు సహకరించకుండా చేశారని ఆరోపించారు. మృతురాలి శరారంపైనుంచి బట్టలు తీసి పది గంటల పాటు అలాగే ఉంచారని, కనీసం వేరే బట్టలు మృతదేహంపై కప్పలేదని ఆరోపించారు. అక్కడ పోలీస్ అధికారులు తమకు సహకరించకపోగా నేరానికి పాల్పడిన ఖాజాబీ భర్త మునీబ్కు అండగా నిలిచారని వాపోయారు. దోషులను శిక్షించాలని రాస్తారోకో... ఖాజాబీ మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ నందిగామ 65వ నెంబర్ జాతీయ రహదారిపై మృతురాలి తల్లి, బంధువులు, పలు రాజకీయ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఖాజాబీకి నివాళులర్పించిన వారిలో వివిధ పార్టీలకు చెందిన నెలకుదిటి శివనాగేశ్వరరావు, తాటి రామకృష్ణారావు, చెరుకూరి సాంబశివరావు, లగడపాటి వీరయ్య, గాదెల వెంకటేశ్వరరావు, రబ్బానీ, ఫాతిమా, వేల్పుల పరమేశ్వరరావు, షేక్ జాఫర్, ఆచంట సునీత, కన్నెగంటి జీవరత్నం, కొండూరు వెంకట్రావ్, ఖాజా తదితరులున్నారు. అంత్యక్రియలు.... ఖాజాబీ మృతదేహానికి నందిగామ పెద్ద మసీదు శ్మశానంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించా రు. ఆమెది ఆత్మహత్య కాదని, భర్తే హత్య చేశాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పూణేలోని పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించగా, ఆదివారం సాయంత్రం నందిగామకు తరలించారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆమె మృతదేహాన్ని పెద్ద మసీదులో శ్మశానంలో ఖననం చేశారు. -
‘సమైక్య’ పోరాటం
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన యత్నాలను వ్యతిరేకిస్తూ.. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించాయి. రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసించాలని నాయకులు పిలుపునిచ్చారు. జగ్గయ్యపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ప్రధాన రహదారులగుండా వివిధ ప్రాంతాల్లో నినాదాల హోరు మధ్య ర్యాలీ చేశారు. విజయవాడ వన్టౌన్లో నగర కన్వీనర్ జలీల్ఖాన్, సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో సమన్వయకర్త పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. అవనిగడ్డలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్బాబు ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీ అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో సాగింది. వైఎస్సార్సీపీ రైతువిభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ కుక్కల విద్యాసాగర్తో పాటు ఆరు మండలాల నుంచి మండల కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు మోటార్సైకిళ్లతో ర్యాలీ చేశారు. మైలవరంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జోగి రమేష్, జ్యేష్ఠ రమేష్బాబు బైక్ ర్యాలీలు నిర్వహించారు. అక్కడినుంచి మైలవరం చేరుకున్నారు. ఇబ్రహీంపట్నంలో, నూజివీడు పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు చేశారు. పామర్రులో వైఎస్సార్సీపీ నాయకురాలు ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో బైక్ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర ఒక్క జగన్మోహన్రెడ్డి వల్లనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. -
నేడు ‘సమైక్య’ బంద్
=వైఎస్సార్సీపీ, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు =తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మద్దతు =4న బైక్ ర్యాలీ, 7 నుంచి దీక్షలు : భాను మచిలీపట్నం, న్యూస్లైన్ : అసెంబ్లీలో శుక్రవారం నుంచి తెలంగాణ బిల్లుపై చర్చించనున్న నేపథ్యంలో సీమాంధ్రలో మళ్లీ ఉద్యమం రగులుతోంది. వైఎస్సార్సీపీ, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక శుక్రవారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. వ్యాపార, విద్యాసంస్థలు, ఉద్యోగ సంఘాలు, సినిమాహాళ్ల యాజమాన్యం సహకరించాలని సమైక్యవాదులు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ చేపట్టడాన్ని నిరసిస్తూ వారంరోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. జనవరి 3న బంద్, 4న బైక్ ర్యాలీలు, 7 నుంచి 10 వరకు నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. బంద్కు సహకరించాలని ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులను కోరినట్లు ఎన్జీవో నేతలు తెలిపారు. ఈ ఆందోళనల్లో ఉపాధ్యాయులు కూడా పాల్గొంటారని సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి రాష్ట్ర కన్వీనరు మత్తి కమలాకరరావు తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం చేపట్టిన బంద్కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు పంచాయతీరాజ్ సర్వీసుల జాయింట్ యాక్షన్ కమిటీ గురువారం తెలిపింది. -
బిల్లు కాగితాలు కాదు...చంద్రబాబు చొక్కా చింపండి
= టీడీపీ నేతలకు ఉదయభాను సూచన = కృత్తివెన్నులో హోరెత్తిన సమైక్య శంఖారావం కృత్తివెన్ను, న్యూస్లైన్ : తెలంగాణ బిల్లు కాగితాలు చింపటం కాదు.. సమైక్యం ఊసెత్తని చంద్రబాబు చొక్కా చింపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలుగుదేశం పార్టీ నేతలకు సూచించారు. కృత్తివెన్నులో ఆదివారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సమైక్య శంఖారావం సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అడ్డపర్రకు చెందిన ప్రముఖుడు ముత్యాల రాధాకృష్ణతో పాటు సుమారు 200 మంది వివిధ పార్టీలకు చెందినవారు ఉదయభాను సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సభలో భాను మాట్లాడుతూ మరువలేని మహానేత వైఎస్సార్ వారసుడైన జగన్మోహన్రెడ్డి మాట తప్పని, మడమ తిప్పని నాయకుడన్నారు. చంద్రబాబు దొంగనాటకాలు ఆడుతున్నారని, రకరకాల యాత్రల పేరుతో రోడ్ల వెంట తిరుగుతున్నా ఎక్కడా సమైక్యంపై నోరు విప్పకపోవటమే దీనికి నిదర్శనమని చెప్పారు. తెలంగాణలో కొందరు నాయకులు చంద్రబాబు దయ వల్లే తెలంగాణ వచ్చిందని సంబరాలు చేసుకుంటుంటే ఇక్కడి టీడీపీ నేతలు మాత్రం దానిపై నోరు మెదపకపోవడానికి వారి రెండు కళ్ల సిద్ధాంతమే కారణమని విమర్శించారు. వైఎస్సార్సీపీలో సీటిస్తే చేరడానికి ఎందరో టీడీపీ నాయకులు ఎదురుచూస్తున్నారన్నారు. చంద్రబాబు మాటలను సొంత పార్టీ నాయకులే నమ్మే స్థితిలో లేరన్నారు. సీమాంధ్రకు నీరు కావాలంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ రకాల ఉన్నతస్థాయి చదువులు అభ్యసిస్తున్న ఎంతోమంది విద్యార్థుల భవిత అంధకారమవుతుందన్నారు. వివిధ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రాష్ట్రం సమైక్యంగా ఉండి తీరాలన్నారు. ఇప్పటికే విడిపోయిన వివిధ రాష్ట్రాలు పడుతున్న ఇబ్బందులు మన రాష్ట్ర ప్రజలకు రాకూడదంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తెలిపారు. అసెంబ్లీలో బిల్లు పెట్టినంత మాత్రాన రాష్ట్రం విడిపోదన్నారు. జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఇతర రాష్ట్రాల నాయకులను కలిసి మద్దతు కూడగడుతున్నారని, సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ సీపీ ఎనలేని పోరాటం చేస్తోందని చెప్పారు. రాష్ట్రానికి కాబోయే సీఎం జగన్మోహన్రెడ్డేనని జన సర్వేలు చెబుతున్నాయని, ఇవి ముమ్మాటికీ నిజమేనని తెలిపారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అని చెప్పారు. పార్టీలో చేరినవారిలో ప్రస్తుత పంచాయతీ వార్డు సభ్యులు గంధం దుర్గ, తోట సుబ్బారావు, కొప్పర్తి రంగారావు, గ్రామస్తులు తోట ముసలయ్య, అడపాల నాగేశ్వరరావు, పాశం రాంబాబు, పిన్నెంటి రంగారావు, మేడపాటి సత్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. సభలో పార్టీ జిల్లా సేవాదళ్ కన్వీనర్ మావులేటి వెంకటరాజు, రాష్ట్ర ఎస్సీ సెల్ కో-ఆర్డినేటరు మారుమూడి విక్టర్ప్రసాద్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు శ్యామల, మండల కన్వీనర్ యాళ్ల బాబులు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు పిన్నెంటి సతీష్, బంటుమిల్లి కన్వీనరు ముత్యాల నాగేశ్వరరావు, పెడన టౌన్ కన్వీనరు పిచ్చుక శంకర్, పెడన రూరల్ కన్వీనరు అంకెం సముద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగు
=టీడీపీకి పుట్టగతులుండవ్! =వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సాక్షి, విజయవాడ : వచ్చే సార్వత్రిక ఎన్నికల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని, తెలుగుదేశం పార్టీకి పుట్టగతులుండవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని వాంబేకాలనీలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం సభ ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉదయభాను మాట్లాడుతూ తన కొడుకు కోసం సోనియాగాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేయడాన్ని సీమాంధ్ర ప్రాంత వాసులే కాకుండా తెలంగాణలోని సమైక్యవాదులు కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. చంద్రబాబునాయుడు సమన్యాయం అంటారు.. ఆయన పార్టీ నాయకులు సమైక్యవాదం అంటారు.. అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలకు దమ్ముంటే... సీమాంధ్ర ప్రాంతంలోని తెలుగుదేశం నేతలకు దమ్ముంటే చంద్రబాబు చేత సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లాడించాలని సవాల్ విసిరారు. చంద్రబాబు కొబ్బరిచిప్పలు, ఇద్దరు కొడుకుల సిద్ధాంతం అంటూ ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థం కావడం లేదని విమర్శించారు. చంద్రబాబు సమైక్యవాదం కోరుకుంటున్నారో... వేర్పాటువాదాన్ని కోరుకుంటున్నారో ఒక్క ముక్కలో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ఐక్యత కోసం పోరాడుతుంటే యువకులు, వృద్ధులు అనే తేడా లేకుండా ఆయన అడుగులో అడుగువేస్తూ ధర్నాలు, రాస్తారాకోలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోతే కృష్ణా డెల్టాకు నీరు ఎలా వస్తుందని ఆందోళన చెందుతున్నారని చెప్పారు. బీజేపీతో చంద్రబాబు చెట్టపట్టాలు... సమావేశంలో పార్టీ నగర కన్వీనర్ జలీల్ఖాన్ మాట్లాడుతూ లగడపాటి విజయవాడ జోకర్ అయితే, చంద్రబాబు రాష్ట్రంలోనే పెద్ద జోకర్ అని పేర్కొన్నారు. పేకాటలో జోకర్ ఎక్కడైనా ఇమిడిపోయినట్లు చంద్రబాబు ఇప్పడు బీజేపీతో కలిసిపోయి చెట్టపట్టాలు వేసుకుని తిరిగేందుకు సిద్ధమౌతున్నారని విమర్శించారు. బీజేపీతో కలిసి పెద్ద తప్పు చేశానని చంద్రబాబు గతంలో చెప్పిన మాటలను మరిచిపోయారా అని ప్రశ్నించారు. టీడీపీలో దొంగ సమైక్యవాదులు... తెలుగుదేశంలో దొంగ సమైక్యవాదులు ఉన్నారని, ఆ పార్టీలో ఆరుగురు ఎంపీలు ఉంటే నలుగురు మాత్రమే అవిశ్వాస తీర్మానంపై స్వంతకం పెట్టారని జలీల్ఖాన్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనను జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందునే రాష్ట్ర ఐక్యత కోసం నేను పోరాడతా... మీరూ పోరాడండి అని పిలుపునిచ్చారన్నారు. ఆయన ఓటమి అంగీకరించరని, చంద్రబాబు లాగా రాజీ పడబోరని చెప్పారు. అందువల్లనే 16 నెలలు జైలులో ఉన్నా సోనియాతో పోరాడుతున్నారని కొనియాడారు. ఆర్టికల్స్ మార్చకుండా విభజన కష్టం... సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త గౌతంరెడ్డి మాట్లాడుతూ ఆర్టికల్ 371డీ, 371ఈ లను మార్చకుండా రాష్ట్ర విభజన చేయడం కష్టమన్నారు. ఆర్డికల్-3 ని కూడా మార్చాలని, రాష్ట్రంలో మూడు వంతుల మెజార్టీ ఉంటేనే విభజనకు అంగీకరించాలని జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేతల్ని కలుస్తున్నారని వివరించారు. కృష్ణానదిపై కర్ణాటక ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు కడుతున్నా చంద్రబాబునాయుడు తన తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదన్నారు. దీనివల్లనే ఇప్పుడు కృష్ణాడెల్టా ఎడారిగా మారే ప్రమాదం వచ్చిందన్నారు. మాజీ కార్పొరేటర్ జానారెడ్డి సభకు అధ్యక్షత వహించి మాట్లాడారు. -
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు జాగీరా? : ఉదయభాను
విజయవాడ, న్యూస్లైన్ : రాష్ట్రాన్ని రెండుగా చీల్చాలని లేఖ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జాగీరా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఒక ప్రకటనలో శనివారం ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు, కిరణ్కుమార్ రెడ్డిలు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. సోనియా డెరైక్షన్లో కిరణ్, చంద్రబాబులు కొత్త నాటకాలాడుతున్నారని ఆరోపించారు. గత నాలుగు నెలలుగా రాష్ట్రం రావణకాష్టంగా మారితే కనీసం స్పందించని బాబు ఇప్పుడెందుకు హడావుడిగా విలేకర్ల సమావేశాలు నిర్వహించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఆర్టికల్-3 గురించి జగన్మోహన్రెడ్డి ఇతర రాష్ట్రాల నేతలను కలిసి మద్దతు కూడగడుతుంటే ఆర్టికల్-3 గురించి జగన్కు తెలుసా అంటూ వ్యాఖ్యానించటం ఆయనలోని దుగ్ధను బయటపెడుతోందని పేర్కొన్నారు. ఆర్టికల్-3 గురించి పూర్తిగా తెలిసిన చంద్రబాబు ప్యాకేజీలు ఎందుకు అడిగారని నిలదీశారు. ఈ రాష్ట్రంలో అవినీతికి ఆద్యుడు చంద్రబాబేనని, ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఏలూరు నోట్లకట్టలు కుంభకోణం, ఏలేరు స్కాం, స్టాంపుల కుంభకోణం, మద్యం కుంభకోణం... ఇలా వందల సంఖ్యలో కుంభకోణాలు బయట పడ్డాయని గుర్తు చేశారు. సోనియాగాంధీపై నిజమైన పోరాటం చేసింది తానేని చెబుతున్న చంద్రబాబు పార్లమెంటులో ఎఫ్డీఐ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఎంపీలు ఎందుకు గైర్హాజరయ్యారో చెప్పాలని, అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టినప్పుడు విప్ జారీ చేయకుండా బలం లేని కిరణ్కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు నిలబెట్టారో కూడా బాబు బహిరంగంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా చంద్రబాబు ఎటువంటి అవినీతికి పాల్పడనట్లైతే ఆయన కోర్టు స్టే లు ఎందుకు తెచ్చుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహనరెడ్డి అండ చూసుకుని విభజిస్తున్నారని చెప్పటానికి కిరణ్కుమార్ రెడ్డికి సిగ్గు లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చేనాటికి కిరణ్, చంద్రబాబు కలిసి ఎమ్మెల్యేలందరితో రాజీనా మా చేయించి అసెంబ్లీ జరగకుండా అడ్డుకునే ధైర్యం వారికి ఉందా? అని ప్రశ్నించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారి పదవులకు రాజీనామాలు చేసి ఎం పీలతో రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. -
ఇక సమరమే..
=నేడు జిల్లా బంద్కు వైఎస్సార్సీపీ పిలుపు =పొలిటికల్ జేఏసీ మద్దతు సాక్షి, విజయవాడ : రాష్ట్రాన్ని ముక్కలు చేయాలన్న నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో జిల్లావ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా బంద్ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 121 రోజులుగా ప్రజలు సమైక్యం కోసం ఉద్యమం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు. ఓట్లు, సీట్ల కోసం సోనియాగాంధీ రాష్టాన్ని ముక్కలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని జిల్లాలో ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. తన కుమారుడిని ప్రధానిని చేయడం కోసం, తన స్వార్థ రాజకీయం కోసం ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయాలనుకోవడం దారుణమని విమర్శించారు. శుక్రవారం జరిగే బంద్కు వ్యాపార, వర్తక, వాణిజ్యంతో పాటు విద్యాసంస్థలు, ఉద్యోగులు బంద్కు మద్దతు తెలపాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపును పొలిటికల్ జేఏసీ బలపరిచింది. పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కొలనుకొండ శివాజీ ఒక ప్రకటన చేస్తూ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్లు కూడా వేర్వేరు ప్రకటనలలో బంద్కు పిలుపిచ్చాయి. -
రైతన్నను ఆదుకోండి
=ఎకరాకు రూ.10 వేలు పరిహారమివ్వాలి =రుణాలు రద్దు చేయాలి =వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ భాను డిమాండ్ =పెడన, పామర్రు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటచేల పరిశీలన పెడన/ పామర్రు రూరల్, న్యూస్లైన్ : హెలెన్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. సోమవారం ఆయన పెడన నియోజకవర్గంలో గూడూరు, పెడన మండలాల్లో ముంపుబారిన పడిన పొలాలను పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్టీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్, రాములతో కలిసి పర్యటించారు. పామర్రు మండలంలో పార్టీ సమన్వయకర్త ఉప్పులేటి కల్పనతో కలసి దెబ్బతిన్న పంటచేలను పరిశీలించారు. ఈ సందర్భంగా పెడన, పామర్రులలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఎం కిరణ్కుమార్రెడ్డి మూడేళ్ల పాలనలో నాలుగుసార్లు తుపానులు వచ్చాయన్నారు. జల్ తుపాను బాధిత రైతులకు నేటికీ ఇన్పుట్ సబ్సిడీ విడుదల కాలేదని విమర్శించారు. పై-లిన్ తుపాను అనంతరం కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, మిర్చి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారన్నారు. హెలెన్ తుపానుకు వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారని, రుణాలు మాఫీ చేయాలని, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో అధికారంలోకి వస్తే క్వింటా ధాన్యం మద్దతు ధర రూ.2 వేలు చేస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొందని, ఆంధ్రప్రదేశ్లో అదే ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించకపోవటం అన్యాయమని విమర్శించారు. రైతులకు పెద్దపీట వేసింది ఒక్క వైఎస్సారేనని చెప్పారు. హెలెన్ తుపాను వల్ల మృతిచెందిన వారికి రూ.5 లక్షల నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు పక్షాన పోరాడేది వైఎస్సార్సీపీ ఒక్కటే : నాగిరెడ్డి రైతన్నల పక్షాన పోరాడే ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. హెలెన్ తుపాను వల్ల సన్న, చిన్న కారు, కౌలు రైతులు సర్వం కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని, ఆత్మహత్యలే శరణ్యమంటూ విలపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా నిలిచి వారితో కలిసి పోరాటం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఉన్నారని భరోసా ఇచ్చారు. నవంబర్ వచ్చినా దాళ్వా ఉందో లేదో చెప్పలేదన్నారు. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరుందని, ఇటు అధికారులు, అటు మంత్రులు రైతులను విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. తుపాను వల్ల దెబ్బతిన్న రైతులకు రెండో పంటకు రుణం ఇచ్చే నాథుడే కరువయ్యాడని చెప్పారు. రైతుల రుణాలు వెంటనే రద్దుచేసి, నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రెండో పంటకు 75 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలని ఆయన కోరారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. క్వింటా ధాన్యానికి మద్దతు ధర రూ.2 వేలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దెబ్బతిన్న పంటల పరిశీలన నేడు
విజయవాడ, న్యూస్లైన్ : హెలెన్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటను సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం పరిశీలించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెడన, పామర్రు నియోజకవర్గాల్లో దెబ్బతిన్న వరి పంటను పరిశీలిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే పై-లిన్ తుపానుతో పాటు అకాల వర్షాలకు వరి పంట 50 శాతం మేర దెబ్బతిందని తెలిపారు. వెనువెంటనే హెలెన్ రూపంలో మరో తుపాను డెల్టా రైతాంగాన్ని అతలాకుతలం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో రైతాంగానికి భరోసా కల్పించేందుకు వైఎస్సార్ సీపీ దెబ్బతిన్న పొలాలను పరిశీలించే కార్యక్రమం నిర్వహిస్తోందని తెలిపారు. సోమవారం ఉదయం గూడూరు మండలంలోని తరకటూరు నుంచి ఈ పరిశీలన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ బృందంలో తనతో పాటు పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ క్యాడర్ పాల్గొంటారని తెలిపారు. పెడన నియోజకవర్గం గూడూరు మండలం తరకటూరులో ప్రారంభమయ్యే ఈ యాత్ర చిట్టిగూడూరు, గూడూరు, రామరాజుపాలెం, ఆకుమర్రు, మల్లవోలు, పోలవరం, రాయవరం, తుమ్మలపాలెం, శారదాయిపేట, ఆకులమన్నాడు, కప్పలదొడ్డి గ్రామాల్లో సాగుతుందని వివరించారు. మధ్యాహ్నం భోజనం అనంతరం పెడన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఉంటుందని తెలిపారు. తరువాత పెడన మండలంలోని పెడన, కొంకేపూడి గ్రామాల్లో పర్యటిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పామర్రు నియోజకవర్గంలోని ఉండ్రుపూడి, పామర్రు, రాపర్రు, పోలవరం గ్రామాల్లో పర్యటిస్తామని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు పామర్రు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నష్ట తీవ్రతను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తగిన విధంగా పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా వైఎస్సార్ సీపీ కృషి చేస్తుందని వివరించారు. పెడన, పామర్రు నియోజకవర్గాల్లోని పార్టీ మండల కన్వీనర్లు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల వారు, రైతులు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వర్ల రామయ్యకు మతి భ్రమించింది తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్యకు మతిభ్రమించిందని ఉదయభాను విమర్శించారు. హఠాన్మరణం చెందిన జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు భౌతికకాయాన్ని సందర్శించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఒక బలహీన వర్గాలకు చెందిన నేతను జిల్లా పరిషత్ స్థానంపై కూర్చబెట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి దక్కితే అదే నేతను మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ సమన్వయకర్తగా నియమించిన ఘనత జగన్మోహన్రెడ్డికి దక్కిందని గుర్తుచేశారు. ఆకస్మికంగా మరణించిన వ్యక్తి గురించి అసత్య ఆరోపణలు చేయడం నీతిమాలిన రాజకీయమని విమర్శించారు. సీట్లు అమ్ముకునే సంస్కృతి తెలుగుదేశం పార్టీదేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోనే ధనవంతులైన సుజనాచౌదరి, సీఎం రమేష్లకు రాజ్యసభ సీట్లు అమ్ముకున్న ఘనత చంద్రబాబుది కాదా అని ఉదయభాను ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గుడివాడ నుంచి కోసూరుకు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి మూడున్నర గంటలు పట్టిందని, ప్రతిచోట జగన్మోహన్రెడ్డిని జనం అక్కున చేర్చుకున్నారని, ఈ ఆదరణ చూసి ఓర్పలేకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. -
కొనసాగిన ‘సమైక్య’ జోరు
=రోడ్లన్నీ దిగ్బంధనం =కొనసాగిన ‘సమైక్య’ జోరు =స్తంభించిన రవాణా వ్యవస్థ =రోడ్లపైనే వంటావార్పు =స్వచ్ఛందంగా సహకరించిన ప్రజలు =పలుచోట్ల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల అరెస్ట్ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల దిగ్బంధనం కార్యక్రమం రెండోరోజూ విజయవంతమైంది. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వ మొండివైఖరిని జనం తీవ్రంగా నిరసించారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రోడ్ల దిగ్బంధనం, వంటావార్పు, రాస్తారోకో కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఆకాంక్షను చాటిచెప్పారు. సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్రను కాపాడుకోవడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండోరోజు కూడా రహదారుల దిగ్బంధనం కార్యక్రమం విజయవంతంగా జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ప్రజలు స్వచ్ఛందంగా ఆందోళనకు సహకరించారు. ఆందోళనకారులు రోడ్లపైనే వంటావార్పు నిర్వహించారు. కొన్ని చోట్ల ఆర్టీసీ సిబ్బంది కూడా వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. పలుచోట్ల వైఎస్సార్సీపీ నాయకులతో పాటు వందమందికి పైగా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఉదయభాను అరెస్ట్... జగ్గయ్యపేట మండలంలోని గట్టు భీమవరం టోల్ప్లాజా సమీపంలో వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎనిమిది గంటల నుంచి దాదాపు 12 గంటల వరకు రహదారిని దిగ్బంధించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు భానుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి చిల్లకల్లు పోలీస్స్టేషన్కు తరలించారు. విజయవాడలో పార్టీ నగర కన్వీనర్ జలీల్ఖాన్ ఆధ్వర్యంలో గొల్లపూడి జూతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై రెండువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో జలీల్ఖాన్తో పాటు 25 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో సింగ్నగర్ ఫ్లైఓవర్ వద్ద రాస్తారోకో నిర్వహించి, వంటావార్పు చేపట్టారు. రెండు గంటల పాటు రోడ్డుపై ఆటపాట నిర్వహించారు. తూర్పు నియోజకవర్గంలో పార్టీ అధికార ప్రతినిధి చందన సురేష్ ఆధ్వర్యంలో కృష్ణలంక ఫైర్స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై కార్యకర్తలు రాస్తారోకో జరిపారు. పోలీసులు 10 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. తిరువూరులో జాతీయరహదారిపై నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో రాస్తారోకో, వంటావార్పు కార్యక్రమాలు జరిగాయి. విజయవాడ - జగదల్పూర్ జాతీయరహదారిపై రెండుగంటలసేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను బలవంతంగా తొలగించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయరహదారిపై కబడ్డీ ఆడారు. ఏకొండూరు మండలం కంభంపాడులో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కైకలూరులో వెయ్యిమందితో... కైకలూరులో జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వెయ్యిమందికి పైగా విద్యార్థులు, కార్యకర్తలు గంటపాటు రోడ్డు దిగ్బంధనం చేశారు. విద్యార్థులు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాస్కులు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. పులిగడ్డలో 216 జాతీయ రహదారి దిగ్బంధనం కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్బాబు ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. రైతువిభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి సంఘీభావం తెలిపారు. రహదారిపై భోజనాలు చేసి నిరసన తెలిపారు. గుడ్లవల్లేరు, నందివాడ మండలాల్లో రహదారుల దిగ్బంధనం జరిగింది. పామర్రులో రహదారుల దిగ్బంధనానికి పూనుకోగా పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా పార్టీ నేతలు ఉప్పులేటి కల్పన, కుక్కల నాగేశ్వరరావులను అరెస్ట్ చేశారు. మైలవరంలో నియోజకవర్గ సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్బాబు ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ యార్డు వద్ద విజయవాడ-భద్రాచలం జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి రహదారిని దిగ్బంధించారు. వంటవార్పూ కార్యక్రమం నిర్వహించి రోడ్డుపైనే భోజనాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జ్యేష్ఠ రమేష్బాబుతో పాటు మరో ఐదుగురు నేతలను అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కి తరలించారు. ఇబ్రహీంపట్నంలో వినూత్న నిరసన... ఇబ్రహీంపట్నంలో నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రింగ్ సెంటర్ను దిగ్బంధనం చేశారు. విభజనకు పాల్పడిన సోనియాగాంధీ, సహకరించిన చంద్రబాబు దిష్టిబొమ్మలను వేర్వేరు మంచాలపై పడుకోబెట్టి చీపుళ్లతో కొడుతూ నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్తో పాటు మరో నలుగురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కంచికచర్ల మండలం కీసర టోల్గేట్ వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై పార్టీ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో రోడ్డు దిగ్బంధనం చేపట్టారు. రోడ్డుపైనే దుస్తులు ఇస్త్రీ చేసి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఆయనతోపాటు 19 మంది నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నూజివీడులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నూజివీడు-విస్సన్నపేట, నూజివీడు-మైలవరం, నూజివీడు-జంక్షన్, నూజివీడు-విజయవాడ రహదారులను దిగ్బంధించారు. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్లో జాతీయ రహదారి, గన్నవరం-నూజివీడు రహదారిని దిగ్బంధించారు. హనుమాన్జంక్షన్లో పార్టీ నేత దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై భారీ మానవహారం నిర్మించి రోడ్డు దిగ్బంధనం కార్యక్రమం నిర్వహించారు. బందరు నియోజకవర్గంలోని కోనేరు సెంటరులో నాలుగు వైపులా రోడ్లను దిగ్బంధించారు. మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో గూడూరు మండలంలో విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారిపై రోడ్డు దిగ్బంధనం చేపట్టారు. ఉయ్యూరులో రోడ్లు దిగ్బంధించారు. గండిగుంట బైపాస్ వద్ద మూడుగంటలపాటు రాస్తారోకో చేశారు. ఉయ్యూరు ప్రధాన సెంటర్లో వంటావార్పు నిర్వహించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు పడమట సురేష్బాబు, తాతినేని పద్మావతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. -
6, 7 తేదీల్లో రోడ్ల దిగ్బంధం : భాను
జగ్గయ్యపేట అర్బన్, న్యూస్లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 6, 7 తేదీల్లో 48 గంటలపాటు రహదారుల దిగ్బంధం కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నియమించిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) సమావేశం ఏడో తేదీన జరుగుతున్నందున దానికి నిరసనగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేవిధంగా పోరాటాలను ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. సమైక్యాంధ్రప్రదేశ్ను బలపర్చేందుకు 6, 7 తేదీల్లో రహదారుల దిగ్బంధం, రోడ్లపైనే వంటావార్పు కార్యక్రమాలు పార్టీ పిలుపుమేరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 49 మండలాల్లో అన్నిచోట్ల ఈ కార్యక్రమాలు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సూచించారు. -
పార్టీ పిలుపు మేరకు పంచాయతీల సమైక్య తీర్మానాలు
=పార్టీ పిలుపు మేరకు పంచాయతీల సమైక్య తీర్మానాలు =వాటిని ప్రధాని, జీవోఎంలకు ఈమెయిల్ చేసిన ఉదయభాను జగ్గయ్యపేట, న్యూస్లైన్ : ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజన చేయనీయబోమని, అడ్డుకొని తీరుతామని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను చెప్పారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లు చేసిన తీర్మానాలను ఉదయభాను ప్రధాని మన్మోహన్సింగ్, గ్రూపు ఆఫ్ మినిస్టర్స్(జీవోఎం)కు ఈ మెయిల్ ద్వారా పంపే కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరుతూ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, వార్డుమెంబర్లు తీర్మానాలు చేశారు. స్థానిక ఆర్అండ్బీ బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహనీయుల ఆత్మబలిదానంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కొందరు స్వార్థపరశక్తుల కారణంగా విచ్ఛిన్నమయ్యే ముప్పు తలెత్తిందన్నారు. విభజన ప్రక్రియను చేపట్టిన కేంద్ర ప్రభుత్వం గత సంప్రదాయాలు, మార్గదర్శకాలు, ప్రాతిపదికలను అనుసరించాలన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టటం ద్వారా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కుకు మరో నిదర్శనం పంట నష్టపోయి దీనావస్థలో ఉన్న రైతన్నను పరామర్శించేందుకు తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను అక్రమంగా అరె స్ట్చేసిన కిరణ్ సర్కారు.. చంద్రబాబును అడ్డుకోకపోవటం వెనక ఆ రెండు పార్టీల కుమ్మక్కు మరోసారి బయటపడిందని ఉదయభాను విమర్శించారు. శుక్రవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో విజయమ్మ పర్యటనను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అదే ప్రాంతంలో చేస్తున్న పర్యటనను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర ఉద్యమం చేపట్టిన జగన్కు వస్తున్న జనాదరణ చూసి ఆ రెండు పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఆ రెండు పార్టీలకు త గిన సమయంలో బుద్ధిచెప్పేందుకు జనం ఉవ్విళ్లూరుతున్నారన్నారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్ మదార్సాహెబ్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చింకా వీరాంజనేయులు, గూడపాటి శ్రీనివాస్, జనార్ధన్, జగదీష్, యూత్ నాయకులు రాంబాబు, నంబూరు రవి పాల్గొన్నారు. -
చరిత్రాత్మక సభ శంఖారావం :భాను
జగ్గయ్యపేట అర్బన్, న్యూస్లైన్ : రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో జరుగనున్న సమైక్య శంఖారావం సభ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని చరిత్రాత్మక సభగా నిలిచిపోతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను చెప్పారు. పార్టీ వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ చల్లా బ్రహ్మేశ్వరరావు (బ్రహ్మం) రూపొందించిన సమైక్య శంఖారావం సభ వాల్పోస్టర్ను గురువారం ఉదయభాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ వేర్పాటు వాదాన్ని నిరసిస్తున్న కోట్లాదిమంది సమైక్యవాదుల సమైక్యవాణిని ఢిల్లీ పెద్దలకు వినిపించే చివరి అవకాశంగా ఈ సభ దోహదపడుతుందని అన్నారు. ఈ సభకు తెలంగాణా ప్రాంతాల నుంచీ పెద్ద సంఖ్యలో సమైక్యవాదులు హాజరు కానున్నారని చెప్పారు. తెలుగుజాతి సమైక్య నినాదాల హోరుతో ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా జరిగే ఈ సభకు జిల్లా నుంచి అనూహ్యరీతిలో పార్టీల కతీతంగా సమైక్యవాదులు తరలి రానున్నారన్నారు. రాష్ట్రంలోని మెజార్టీ ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టే ఈ సభ సమైక్యాంధ్ర ఉద్యమంలో ఒక మైలురాయిలా నిలిచిపోయి రాష్ట్ర చరిత్రలో రికార్డు సృష్టించడం ఖాయమన్నారు. చల్లా బ్రహ్మం మాట్లాడుతూ ఈ సభకు పార్టీలకతీతంగా సమైక్యాన్ని కోరుకునే వివిధ ఉద్యోగ సంఘాల జేఏసీ సభ్యులు, మహిళలు, మైనార్టీ వర్గాలు, వ్యాపారవర్గాల ప్రతినిధులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ అడహక్ కమిటీ సభ్యులు ఉప్పల సత్యనారాయణప్రసాద్, జిల్లా ప్రచార కమిటీ సభ్యులు, న్యాయవాది కామనేని ఉదయకుమార్, నందిగామ మాజీ ఎంపీటీసీ సూరె రామారావు, పేట యూత్ నాయకులు గుంటుపల్లి సీతారామయ్య, జి. కృష్ణప్రసాద్, యర్రమాసు రామకృష్ణ, ఎస్కె.బాబు, తదితరులు పాల్గొన్నారు. బీసీలు తరలిరండి... పెడన రూరల్ : సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్. జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరుగనున్న సమైక్య శంఖారావం సభను విజయవంతం చేసేందుకు జిల్లాలోని బీసీలంతా తరలిరావాలని ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అడ్హక్ కమిటీ సభ్యులు గూడవల్లి వెంకట కేదారేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ సీపీ అధినేత జగన్ రెండు సార్లు ఆమరణ దీక్ష చేపట్టారని చెప్పారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని సీమాంధ్ర ప్రాంతంలోని రాజకీయ పార్టీల నాయకులు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. -
సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసమే వెళ్లా : సామినేని విమల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు బాధ్యత గల పౌరురాలిగా రాష్ట్రపతిని కలిశానని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సతీమణి విమల చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సతీమణులందరూ కలిసి గవర్నర్ నర్సింహన్ను కలిశాం. ఆ సమయంలో టీడీపీ నేత అచ్చంనాయుడి సతీమణీ వచ్చారు. అప్పుడు మాట్లాడని చంద్రబాబు, టీడీపీ నేతలు ఇప్పుడెందుకు రాద్దాంతం చేస్తున్నారు’ అని ప్రశ్నించారు. ‘గవర్నర్కు ఇచ్చినట్లే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వాలని మూడు పార్టీల నేతల సతీమణులం ఆ రోజే చర్చించుకున్నాం. రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాగానే అందరికీ సమాచారమిచ్చారు. గవర్నర్ దగ్గరికి వచ్చిన అచ్చంనాయుడి భార్య మాత్రం డుమ్మా కొట్టారు. దీంతో టీడీపీ రెండుకళ్ల సిద్ధాంతం మళ్లీ రుజువైంది’ అని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలంటూ కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు... రాష్ట్ర సమైక్యత కోసం తాము పోరాడుతుంటే అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. -
బంద్ సక్సెస్
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. అత్యధిక విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాయి. ఎన్జీవో జేఏసీ నేతలు ఉదయం నుంచే ర్యాలీగా తిరిగి పలుచోట్ల తెరిచిన ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను మూయించివేశారు. కొన్నిచోట్ల ఆందోళనకారులు కొన్ని కళాశాలల బస్సులకు గాలి తీసివేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సీతారామపురంలోని పార్టీ కార్యాలయం నుంచి చుట్టుగుంట సెంటర్ వరకు పాదయాత్ర, చుట్టుగుంట సెంటర్లో రాస్తారోకో జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సామినేని ఉదయభాను, ఎంవీఎస్ నాగిరెడ్డి, జలీల్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమం సోమవారం నాటికి 55వ రోజుకు చేరింది. ఇరిగేషన్ ఇంజనీర్లు సోమవారం ఉదయం మచిలీపట్నంలో కలెక్టర్ను కలిసి సమ్మె నోటీసు అందచేశారు. చల్లపల్లిలో దీక్షలు 45, అవనిగడ్డలో 33వ రోజుకు చేరుకున్నాయి. ఘంటసాల, మోపిదేవి, కోడూరు, నాగాయలంక మండలాల్లో దీక్షలు కొనసాగాయి. చల్లపల్లి మండలం మాజేరులో రైతులు రాస్తారోకో చేశారు. చల్లపల్లిలో మేకావారిపాలేనికి చెందిన రైతులు దీక్ష చేపట్టారు. అవనిగడ్డలో పవనిజం యూత్ ఆధ్వర్యంలో దీక్ష చేశారు. జగ్గయ్యపేట మున్సిపల్ కూడలి సమీపంలో దీక్ష శిబిరంలో కాకతీయ సేవా సమితి సభ్యులు కూర్చున్నారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, సీనియర్ రాజకీయ నాయకులు సామినేని విశ్వనాథం, కాంగ్రెస్ నాయకులు పాటిబండ్ల వెంకట్రావ్లు సంఘీభావం తెలిపారు. రోడ్డుపై వ్యాయామ ఉపాధ్యాయులు ఆటలు ఆడి నిరసన వ్యక్తం చేశారు. గుడివాడ నెహ్రూచౌక్ వద్ద డ్వాక్రా మహిళలు రిలేదీక్షలో పాల్గొన్నారు. మునిసిపల్ సిబ్బంది, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. ఉపాధ్యాయులు తాడులాగుడు పోటీ నిర్వహించిన తమ నిరసన తెలిపారు. పామర్రులో ఏపీ ఎన్జీవోస్, జేఏసీ నాయకులు జాతీయ రహదారిపై మోకాళ్లపై నిలబడి ఆందోళన చేశారు. నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 48వ రోజుకు చేరాయి. ఈ దీక్షలలో కుమార్ స్కూల్ విద్యార్థులు, చెవిటి, మూగవారు కూర్చున్నారు. మచిలీపట్నం ఎనిమిదో వార్డు ప్రజలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహానికి సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ఓ చిన్నారి వినతిపత్రాన్ని అందించింది. కంభంపాడులో విద్యార్థులు మానవహారం నిర్మించారు. పెడనలో వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలు 36వ రోజుకు చేరాయి. కృత్తివెన్నులోని 216 జాతీయ రహదారిపై మహిళలు కుర్చీలాట, ఒప్పులకుప్ప ఆడారు. కేసీఆర్ చేస్తున్న లొల్లి ఉల్లిఘాటును తలపిస్తోందనిఅర్థం వచ్చేలా సమైక్యవాదులు కృత్తివెన్ను జాతీయ రహదారిపై ఉల్లి విక్రయాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. 216 జాతీయ రహదారిపై సమైక్యవాదులు వంటావార్పు నిర్వహించారు. వ్యవసాయ కార్మికుల వంటావార్పు.. తోట్లవల్లూరు మండలంలోని చాగంటిపాడు శివారు కళ్లంవారిపాలెంలో వ్యవసాయ కార్మికులు, కూలీల ఆధ్వర్యంలో కృష్ణా కరకట్టపై నిరశన శిబిరం ఏర్పాటు చేసి, వంటావార్పు జరిపారు. తోట్లవల్లూరులో జేఏసీ నాయకులు, గొర్రెల కాపరులు గొర్రెలతో నిరసన తెలిపారు. కంచికచర్ల, వీరులపాడు మండలాల జర్నలిస్టుల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ప్రదర్శన నిర్వహించారు. ఏపీఎన్జీవోలు, ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మికులు, ప్రైవేటు విద్యా సంస్థలు, విద్యార్థి జేఏసీ నాయకులు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. నందిగామ జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రైతుపేట వద్ద రాస్తారోకో చేసి, మానవహారం ఏర్పాటు చేశారు. న్యాయవాదుల వినూత్న నిరసన.. న్యాయవాదులు నందిగామలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కొందరు న్యాయవాదులు కేసీఆర్ మాస్కులు ధరించి గాంధీ సెంటర్లో కనక తప్పెట్ల మోతలతో చిందేసి నిరసన తెలిపారు. నందిగామ, పెనుగంచిప్రోలు, చందర్లపాడు మండలాలకు చెందిన విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో. గాంధీ సెంటర్లో పలువురు వడ్రంగి వృత్తిదారులు బాడిసలు పట్టుకుని మొద్దులను చెక్కుతూ నిరసన తెలిపారు. కలిదిండి సెంటరులో ఉపాధ్యాయులు, వీఆర్వోలు రిలే దీక్ష చేశారు. మండవల్లిలో ఐఎన్టీయూసీ మండల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం జరిగింది. కత్తిపూడి-పామర్రు 214 జాతీయ రహదారిపై వంటావార్పు నిర్వహించారు. ఎమ్మెల్యే జయమంగళకు సమైక్య సెగ.. మండవల్లిలో దీక్ష చేస్తున్నవారికి మద్దతు తెలపటానికి వచ్చిన ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణను విద్యార్థులు చుట్టుముట్టి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట, వత్సవాయి మండలాలకు చెందిన జిల్లా పరిషత్ పాఠశాలల వ్యాయామోపాధ్యాయులు రహదారిపై షటిల్, బాల్బ్యాడ్మింటన్, క్రికెట్, పవర్ లిఫ్టింగ్, వాలీబాల్, టెన్నీకాయిట్, కబడ్డీ వంటి ఆటలు ఆడి నిరసన తెలిపారు. జగ్గయ్యపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద మండల రెవెన్యూ ఉద్యోగ జేఏసీ నాయకులు నేలపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. పామర్రులో జాతీయ రహదారిపై మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. -
టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి: ఉదయభాను
సమైక్యవాదినని చెప్పకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో బస్సుయాత్ర చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను విమర్శించారు. చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాతే సీమాంధ్రలోయాత్రలు చేయాలని డిమాండ్ చేశారు. రేపు సాయంత్రం అవనిగడ్డ, ఎల్లుండి ఉదయం కైకలూరులో షర్మిల సమైక్య శంఖారావం బస్సుయాత్ర ఉంటుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాన్ని అడ్డుకునేందుకు అన్ని వర్గాలూ ఆందోళనలోకి రావాలని అంతకుముందు ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా సాగు, తాగు నీరు విషయంలో సీమాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని, సమైక్యాంధ్రను కాపాడుకునేందుకు రైతులు ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగితే డెల్టా శాశ్వతంగా బీడుబారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాగుకు కూడా నీరు లేక ప్రజలు మొత్తం వలసపోవల్సి వస్తుందన్నారు. ఫలితంగా జల యుద్ధాలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అందుకే అన్నివర్గాల వారూ ఆందోళనలు ఉధృతం చేయాలన్నారు. -
ముక్కలు చేయడం అనైతికం: సీమాంధ్ర మహిళలు
విభజన వద్దంటూ గవర్నర్కు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సతీమణుల వినతిపత్రం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని ముక్కలు చేయడం అప్రజాస్వామికం, అన్యాయం, అనైతికం అని రాష్ట్ర సీమాంధ్ర మంత్రుల భార్యలు మండిపడ్డారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రాన్ని ముక్కలు చేసే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి సాకే శైలజానాథ్ సతీమణి మోక్షప్రసన్న, మంత్రి పార్థసారథి సతీమణి కమలల నాయకత్వంలో పలువురు మంత్రుల భార్యలు, బంధువులు మంగళవారం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్కు వినతిపత్రం సమర్పించారు. తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే మహారాష్ట, తమిళనాడు, కర్నాటక, ఒడిశా తదితర ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్కు నీటి వివాదాలు ఉన్నాయని, రాష్ట్రాన్ని విడదీస్తే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య కూడా నీటి తగాదాలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ను అందరం కలిసి అభివ ృద్ధి చేసుకున్నామని, అలాంటిది ఇప్పుడు తమను వెళ్లిపోమంటే ఎక్కడకు వెళ్తామని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబాటుకు గురైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు విభజన వల్ల పూర్తిగా దెబ్బతింటాయన్నారు. విడిపోతే అందరం నష్టపోతామని, కలిసుంటే అందరం అబివృద్ధి సాధిస్తామని చెప్పారు. వారితో పాటు రాజ్భవన్కు వెళ్లిన వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సతీమణి విమల మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సోనియా గాంధీకి అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ చెప్పినట్లుగా ప్రతి తుపాకి గుండు ఒక మాతృ హృదయాన్ని తీవ్రంగా గాయపరుస్తుందని, రాష్ట్ర విభజన తమ హృదయాన్ని తీవ్రంగా గాయపరుస్తోందన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత హోదాలో గవర్నర్ను కలిశామని, ఇందులో తమ భర్తలకు ఎలాంటి ప్రమేయం లేదని అన్నారు. ఇదే అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రిని కలుసుకుని, ఆయనకు కూడా వినతి పత్రం అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు శత్రుచర్ల సతీమణిశశికళ, టీజీ వెంకటేష్ సతీమణి మంజరి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోదరి సుచరిత, విప్ రుద్రరాజు పద్మరాజు సతీమణి ఇందిర, వారి బంధువులు సహా పలువురు మహిళలు పాల్గొన్నారు. వీరంతా రాజ్భవన్కు మంత్రులు అధికారికంగా వినియోగించే బుగ్గ కార్లలో రావడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనల మేరకు బుగ్గకార్లలో కేవలం మంత్రులు మాత్రమే పయనించాలి. -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
కృష్ణా: రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో సీమాంధ్ర ఉద్యమంలో భాగంగా ఏడో రోజు నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఉదయభాను.. రాష్ట్రం విడిపోతే సన్యాసం తీసుకుంటానని సవాల్ చేసిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజీనామా చేయకుండా డ్రామాలాడుతున్నారని విమర్శించారు.