Social Media Activists
-
హైకోర్టు తీర్పుని స్వాగతించిన రమణ కుటుంబ సభ్యులు
-
ఇంటూరి రవికిరణ్పై ప్రకాశం జిల్లా పోలీసుల దురుసు ప్రవర్తన
సాక్షి, ప్రకాశం జిల్లా: సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్ను ప్రకాశం జిల్లా పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. కోర్టు షరతు మేరకు సంతకం పెట్టేందుకు ప్రకాశం జిల్లా మార్టూరు స్టేషన్కు వెళ్లిన ఇంటూరిని.. అక్కడ నుంచి పర్చూరుకు సిఐ తీసుకెళ్లారు. ఇంటూరి రవి కిరణ్.. ఇటీవల బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. కనీసం కేసు వివరాలు కూడా చెప్పకుండా పర్చూరు పోలీసులు దురుసుగా వ్యవహరించారు.కిడ్నాపర్లలా వ్యవహరించిన ప్రకాశం జిల్లా పోలీసులు.. తెల్ల కాగితంపై బలవంతంగా సంతకం చేయించుకొని గుర్తు తెలియని ప్రదేశంలో ఇంటూరి రవి కిరణ్ను వదిలేశారు. కనీసం ఏ కేసుపై తీసుకొని వెళ్ళారో కూడా చెప్పని సీఐ శేషగిరి రావు.. ఇంటూరిని ఇబ్బంది పెట్టిన అంశంలో ఇదే సీఐకు న్యాయస్థానం షాకాజ్ నోటీసులు ఇచ్చింది. కక్ష సాధింపులో భాగంగా మరో అక్రమ కేసు బనాయించడానికి పోలీసులు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. -
వీళ్లంతా.. రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్లయిపోయి..
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ మేళాకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు తరలివస్తున్నారు. వీరిలోని కొందరు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఇలాంటివారిలో వైరల్ గర్ల్ మోనాలిసా ఒకరు. ఈమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్గా మారాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసా తన అందమైన కళ్లు కారణంగా సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. మహాకుంభ్లో దండలు, పూసలు అమ్మేందుకు వచ్చిన ఆమె అనూహ్య రీతిలో సోషల్ మీడియాలో ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు.ప్రియా ప్రకాష్ వారియర్ ప్రియా ప్రకాష్ వారియర్.. మలయాళ చిత్రం ‘ఒరు అదార్ లవ్’లోని ఒక చిన్న క్లిప్ వైరల్ కావడంతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిపోయారు. దీంతో ఆమెకు ‘ది వింక్ గర్ల్’ అనే పేరొచ్చింది.భుబన్ బద్యాకర్ పశ్చిమ బెంగాల్కు చెందిన పల్లీల విక్రేత భుబన్ కస్టమర్లను ఆకర్షించడానికి ‘కచ్చా బాదం’ పాటను రూపొందించి పాడాడు. ఈ పాట కారణంగానే భుబన్ రాత్రికి రాత్రే స్టార్గా మారిపోయారు.అంజలి అరోరానాడు వైరల్గా మారిన కచ్చా బాదం పాటకు ఆమె నృత్యం చేసిన వీడియో సోషల్ మీడియాలో తుఫాను సృష్టించింది. దీంతో అంజలి అరోరా రాత్రికి రాత్రే సన్సేషనల్ స్టార్గా మారిపోయారు. కచ్చాబాదం ఆమె ఇంటి పేరుగా మారిపోయింది.రాణు మండల్రాణు మండల్ ఒక రైల్వే స్టేషన్లో లతా మంగేష్కర్ పాడిన ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై’ పాట పాడి, రాత్రికి రాత్రే సంచలనంగా మారారు. సోషల్ మీడియాలో ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తాయి.దనానీర్ ముబీన్19 ఏళ్ల పాకిస్తానీ యువతి దనానీర్ ముబీన్కు చెందిన ‘పావ్రీ హో రహి హై’ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. దీంతో దనానీర్ రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సంచలనంగా మారిపోయారు.సంజీవ్ శ్రీవాస్తవమధ్యప్రదేశ్లోని విదిశకు చెందిన ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవ డ్యాన్సింగ్ అంకుల్గా పేరొందారు. సంజీవ్ శ్రీవాస్తవ బాలీవుడ్ హీరో గోవింద శైలిలో నృత్యం చేయడంతో రాత్రికిరాత్రే స్టార్గా మారిపోయారు.ఇది కూడా చదవండి: వీళ్లంతా ఐఐటీ బాబాలు.. మంచి ఉద్యోగాలు వదిలి.. -
కూటమి పాలనలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు
-
సుధారాణి కుటుంబానికి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: తప్పుడు కేసులతో కూటమి ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొన్న పెద్దిరెడ్డి సుధారాణికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యం చెప్పారు. గురువారం మధ్యాహ్నాం తన కుటుంబ సభ్యులతో ఆమె తాడేపల్లికి వెళ్లి ఆయన్ని కలిశారు.తమపై అకారణంగా కేసులు పెట్టి వేధించారని ఈ సందర్భంగా జగన్ వద్ద సుధారాణి వాపోయారు. అయితే అధైర్య పడొద్దని, ఆమె కుటుంబానికి అండగా నిలుస్తామని, అవసరమైన న్యాయ సహాయం అందజేస్తామని జగన్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు.మాజీ మంత్రి విడదల రజిని, సుధారాణి కుటుంబాన్ని దగ్గరుండి జగన్కు కలిపించారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, అడ్వకేట్ పోలూరి వెంకటరెడ్డి, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి తదితరులు ఉన్నారు. -
సోషల్మీడియా కార్యకర్తపై టీడీపీ మూకల దాడి
సాక్షి,వైఎస్ఆర్జిల్లా:జిల్లాలోని వేంపల్లిలో టీడీపీ రౌడీల అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త లోకేష్పై టీడీపీ అల్లరిమూకలు దాడి చేశాయి. మాట్లాడాలని పిలిపించి లోకేష్ను పిడిగుద్దులు గుద్దారు.టీడీపీ రౌడీలు అల్తాఫ్ ,నాసిర్,ఇమ్రాన్,ఫయాజ్లు కలిసి తనను కొట్టారని బాధితుడు లోకేష్ తెలిపారు.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ సోషల్మీడియా కార్యకర్తలపై దాడులు,వేధింపులు ఎక్కువయ్యాయి. టీడీపీ అల్లరిమూకలు సోషల్మీడియా కార్యకర్తలపై నేరుగా దాడులు చేయడంతో పాటు వారిపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారు. ఒక్కొక్కరిని నెలల తరబడి జైలులో ఉంచేందుకు ఒక కేసు తర్వాత మరో కేసు పెట్టి బెయిల్ రాకుండా చేస్తున్నారు. కొందరు సోషల్మీడియా కార్యకర్తల అదృశ్యం కేసుల్లో అయితే ఏకంగా వారి కుటుంబ సభ్యులు ఏకంగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు కూడా వేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. సోషల్మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: లోకేష్ అవన్నీ నీ కళ్లకు కనిపించడం లేదా..? -
వర్రా రవీందర్ కేసులో నిందితుల లిస్ట్ ని పెంచేస్తున్న పోలీసులు
-
పల్నాడు జిల్లాలో మరోసారి రెచ్చిపోయిన టీడీపీ మూకలు
సాక్షి, పల్నాడు జిల్లా: టీడీపీ మూకలు మరోసారి రెచ్చిపోయారు. పిడుగురాళ్లలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ శివపై దాడి చేశారు. మా ప్రభుత్వ హయాంలో మీరు బయట తిరగడమేంటి అంటూ ఈర్ల శివపై టీడీపీ నేత ఇంతియాజ్ అనుచరులు చెలరేగిపోయారు. టీడీపీ శ్రేణుల దాడిలో శివ తీవ్రంగా గాయపడ్డారు.ఎంపీటీసీపై టీడీపీ నేత దాడిశ్రీకాకుళం జిల్లా: గ్రామ సభలో ఎంపీటీసీపై టీడీపీ నేత దాడి చేశారు. సంత బొమ్మాలి మండలం నౌపాడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామ సభలో మాట్లాడుతున్న ఎంపీటీసీ సుధాకర్పై టిడిపి నేత వాడపల్లి కృష్ణారావు దాడికి దిగారు.బాధితుడు ఎంపీటీసీ సుధాకర్ మాట్లాడుతూ, పంచాయతీ సెక్రటరీ గ్రామసభకు ఆహ్వానించడంతోనే తాను అక్కడికి వెళ్లానని.. సభలో సమస్యలపై మాట్లాడుతుండగా కృష్ణారావు దాడి చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీవి కనుక తనకు సభలోకి వచ్చే అర్హత లేదంటూ టీడీపీ నేత హెచ్చరించారని.. నా చొక్కా చింపేసి... ఇక్కడ కూర్చునేందుకు కూడా అర్హత లేదంటూ దుర్భాషలాడారని సుధాకర్ తెలిపారు. -
KSR Live Show: చంద్రబాబు ఎఫెక్ట్.. ఏపీ పోలీసులపై NHRC ఫైర్
-
అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొందాం
సాక్షి, అమరావతి: పోలీసులు అక్రమంగా బనాయించిన కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని గుంటూరుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కొరిటిపాటి ప్రేమ్కుమార్ భార్య సౌజన్య, కుటుంబ సభ్యులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ను ప్రేమ్ కుమార్ భార్య సౌజన్య, కుటుంబ సభ్యులు కలిశారు. పోలీసులు తమ ఇంటికి వచ్చి దౌర్జన్యంగా వ్యవహరించి ప్రేమ్కుమార్ను తీసుకువెళ్లిన తీరును జగన్కు వారు వివరించారు. వారికి నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చిన జగన్..అక్రమ కేసులు చట్టపరంగా ఎదుర్కుందామని, వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రేమ్కుమార్ బెయిల్ విషయంలో అవసరమైన న్యాయ సహాయం అందజేయాలని వైఎస్సార్సీపీ లీగల్ టీమ్కు సూచించారు. ఈ సందర్భంగా జగన్ను మాజీ మంత్రులు అంబటి, మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు కలిశారు. -
అందరిపైనా సెక్షన్ 111 కుదరదు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 111 కింద వ్యవస్థీకృత నేరమంటూ కొందరిపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా పెడుతున్న అడ్డగోలు కేసుల విషయంలో హైకోర్టు ఒకింత స్పష్టతనిచ్చింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్లను కించపరిచేలా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెసల శివశంకర్రెడ్డి ఫేస్బుక్లో పోస్టులు పెట్టారంటూ కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పులి శ్రీనివాసరావు గత నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివశంకర్రెడ్డిపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసు నమోదు చేశారు. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని శివశంకర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్... బీఎన్ఎస్ సెక్షన్ 111 గురించి కొంతమేర స్పష్టతను ఇస్తూ వ్యవస్థీకృత నేరాలకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఉదహరించారు.‘ఏవరైనా ఒక వ్యక్తిపై బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసు పెట్టాలంటే... అతనిపై గత పదేళ్లలో ఒకటి కంటే ఎక్కువ చార్జిషీట్లు దాఖలై ఉండాలి. వాటిని సంబంధిత కోర్టు విచారణకు స్వీకరించి ఉండటం తప్పనిసరి. బీఎన్ఎస్ సెక్షన్ 111 మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టంతోపాటు గుజరాత్ ఉగ్రవాద, వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టాలను పోలి ఉంది. మహారాష్ట్ర, గుజరాత్ చట్టాలు ఏ సందర్భాల్లో వర్తిస్తాయో సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. ఆ చట్టాలు కూడా నిందితునిపై గత పదేళ్లలో ఒకటి కంటే ఎక్కువ చార్జిషీట్లు దాఖలై ఉండాలని, వాటిని సంబంధిత కోర్టు విచారణకు స్వీకరించి ఉండటం తప్పనిసరి అని చెబుతున్నాయి. కేరళ హైకోర్టు సైతం ఇదే రకమైన తీర్పు ఇచ్చింది.’ అని స్పష్టంచేశారు. ప్రస్తుత కేసులో పిటిషనర్కు బీఎన్ఎస్ సెక్షన్ 111 వర్తిస్తుందా? లేదా? అన్నది దర్యాప్తు అధికారి తన విచారణలో తేల్చాల్సి ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు.ఐటీ యాక్ట్ సెక్షన్–67 పైనా స్పష్టత... ఐటీ చట్టంలోని సెక్షన్ 67 ఏ సందర్భంలో వర్తిస్తుందన్న విషయంలోను న్యాయమూర్తి స్పష్టత ఇచ్చారు. ‘అసభ్యంగా ఉన్న దాన్ని ఎల్రక్టానిక్ రూపంలో ప్రచురించడం, ప్రసారం చేయడం చేశారంటూ ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు పెట్టారు. ఏది అసభ్యత కిందకు వస్తుందన్న దాన్ని తేల్చే ముందు సమకాలీన విలువలను, జాతీయ ప్రమాణాలను ఆధారంగా తీసుకోవాలే తప్ప, సున్నిత మనసు్కలతో కూడిన సమూహం నిర్దేశించిన ప్రమాణాలను కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అసభ్యతను నిర్ధారించే ముందు విషయం మొత్తాన్ని చూడాలే తప్ప, అందులో ఓ భాగం ఆధారంగా అసభ్యతను నిర్ణయించడానికి వీల్లేదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది’అని జస్టిస్ హరినాథ్ తన తీర్పులో గుర్తుచేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ పిటిషనర్ పెసల శివశంకర్రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.10వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని అతన్ని ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. -
కూటమి ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు...
-
ప్రేమ్ కుమార్ ను బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు
-
సోషల్ మీడియా కార్యకర్తని అర్థరాత్రి అరెస్టు చేసిన పోలీసులు
-
పోలీసుల పేరుతో అర్ధరాత్రి హల్చల్.. వైఎస్సార్సీపీ ప్రేమ్ కుమార్ ఎక్కడ?
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అక్రమ కేసుల్లో అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా గుంటూరులో సోషల్ మీడియా కార్యకర్తను అర్ధరాత్రి తీసుకువెళ్లడం తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై పోలీసులు సమాచారం ఇవ్వాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా ట్విట్టర్ వేదికగా అరెస్ట్ వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా అంబటి..‘గుంటూరుకి చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త కొరిటిపాటి ప్రేమ్ కుమార్ను ఎవరో తీసుకెళ్లారు. అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చి పోలీసులు అని చెప్పి.. ప్రేమ్ కుమార్ను తమ వెంట లాక్కెళ్లారు. ఈ ఘటనపై తక్షణమే పోలీసు డిపార్ట్మెంట్ ప్రేమ్ కుటుంబానికి సమాచారం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.ఇక, ఈ వీడియోలో కొందరు వ్యక్తులు ప్రేమ్ కుమార్కు తీసుకువెళ్తున్నారు. వారిలో ఏ ఒక్కరూ పోలీస్ యూనిఫామ్ ధరించకపోవడం గమనార్హం. మరోవైపు.. ప్రేమ్ కుమార్ను తీసుకున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు వారిని అడ్డుకున్నప్పటికీ వారు పట్టించుకోలేదు.ఈ సందర్బంగా తెలుగుదేశం నాయకులపైన పోస్టులు పెడతావా? అంటూ ప్రేమ్ కుమార్ను బలవంతంగా లాక్కెళ్లినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రేమ్ కుమార్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ప్రేమ్ కుమార్ను బలవంతంగా ఎవరో తీసుకువెళ్లారని పోలీసులకు ఫిర్యాదుకు చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు.. ప్రేమ్ కుమార్కు వైఎస్సార్సీపీ నేతలు అండగా నిలిచారు. గుంటూరుకి చెందిన వైసిపి సోషల్ మీడియా కార్యకర్త కొరిటిపాటి ప్రేమ్ కుమార్ ని రాత్రి 3 గంటలకి పోలీసులని చెప్పి తీసుకువెళ్ళారు తక్షణమే పోలీసు డిపార్ట్మెంట్ ఆ కుటుంబానికి సమాచారం ఇవ్వాలి@Anitha_TDP @APPOLICE100 @dgpapofficial @police_guntur pic.twitter.com/k6kxGtOLqJ— Ambati Rambabu (@AmbatiRambabu) December 12, 2024ఇది కూడా చదవండి: మేడం చెప్పారు.. స్టేషన్కు రండి -
పులి సాగర్పై దాడి ఘటన.. పీఎస్లో మార్గాని భరత్ ఫిర్యాదు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రికి చెందిన దళిత యువకుడు పులి సాగర్పై జరిగిన దాడి ఘటనపై రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో బంధించి సీఐ దాష్టీకంపై ఆయన మండిపడ్డారు. దళితులపై కూటమి సర్కార్ వేధింపుల పట్ల భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పులి సాగర్కు జరిగిన అన్యాయంపై జాతీయ ఎస్సీ కమిషన్కు కూడా ఫిర్యాదు చేస్తామని భరత్ తెలిపారు.కాగా, రాజమండ్రి పోలీసుల చేతిలో దారుణంగా హింసించబడ్డ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉదంతంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. బాధితుడు పులి సాగర్కు అండగా నిలవాలని వైఎస్సార్సీపీ నేతలను ఆదేశించారాయన.రెండురోజుల క్రితం పులిసాగర్ను కొందరు వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ జగన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఈ సందర్భంలో.. రాజమహేంద్రవరం పోలీసులు తనతో ఎంత అవమానవీయంగా వ్యవహరించారో జగన్కు సాగర్ వివరించాడు. అయితే సాగర్కు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాదు.. పోలీసుల తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు, జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. -
వర్రా రవీంద్రారెడ్డిపై కొనసాగుతున్న వేధింపులు
-
దళితులంటే ఇంత చిన్నచూపా?
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పరాకాష్టకు చేరింది. ప్రభుత్వ హామీల అమలుపై నిలదీస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను ఉక్కుపాదంతో అణచివేస్తోంది. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను తుంగలో తొక్కుతూ అక్రమ కేసులతో వేధిస్తోంది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు ఎవరిపైనైనా కేసు నమోదు చేస్తే.. ముందు 41ఏ నోటీసు జారీ చేయాలి. ఆ తర్వాత నిందితుడి నుంచి పోలీసులు సమాధానం తీసుకోవాలి. నిందితుడిపై నమోదైన అభియోగాలతో మేజిస్ట్రేట్ సంతృప్తి చెంది, అనుమతి ఇస్తేనే అరెస్టు చేయాలి. కానీ.. పోలీసులు చట్టాన్ని యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నారు. రాజమహేంద్రవరంలో వరదలు వచ్చినప్పుడు ప్రజలు పడిన ఇబ్బందులను నెల రోజుల్లోనే పరిష్కరించానంటూ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై దళిత యువకుడు పులి సాగర్ స్పందిస్తూ.. తాను నివాసం ఉండే కృష్ణానగర్, బ్రదరన్ చర్చి ప్రాంతాల్లో వరద నీళ్లు ఇంకా నిల్వ ఉన్నాయని, ఇతర సమస్యలు అలాగే ఉన్నాయని పోస్టు పెట్టారు. దీనిపై గత నెల 30న పోలీస్స్టేషన్కు రావాలని రాజమహేంద్రవరం ప్రకాష్నగర్ స్టేషన్ పోలీసులు ఆదేశిస్తే.. ఈ నెల 2న పులి సాగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అక్కడ పోలీసులు అతడిని తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ బెదిరించారు. అంతేకాకుండా బీఎస్సీ, బీఈడీ చదివిన తనను సెల్లో అర్ధనగ్నంగా నిలబెట్టి.. మహిళా పోలీసు కానిస్టేబుళ్లను కాపలాగా ఉంచారని పులి సాగర్ ఆవేదన వ్యక్తం చేశాడు. సీఐ బాజీలాల్ తన పట్ల దురుసుగా వ్యవహరించి గొంతుకు రాయికట్టి గోదావరిలో పడేస్తానని బెదిరించారని బుధవారం మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు. కొవ్వుపట్టి కొట్టుకుంటున్నావురా నా..కొ.. అంటూ రెచ్చిపోయారని, పందిలా ఉన్నావు.. నిన్ను కోసి రైలు పట్టాల మీద పడేస్తే దిక్కెవరని బెదిరించారని చెప్పారు. స్థానిక సమస్యపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన పాపానికి దళిత యువకుడినైన తన ఆత్మగౌరవాన్ని పోలీసులు దెబ్బతీసి అమానవీయంగా వ్యవహరించడమే కాక నోటికొచి్చనట్లు అసభ్యంగా మాట్లాడారని పులి సాగర్ వాపోయాడు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు మార్గాని భరత్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావు తీవ్రంగా స్పందించారు. బాధిత యువకుడు పులి సాగర్తో కలిసి వీరు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సంఘటనను మీడియాకు వివరించారు. -
ఏపీలో ఆటవిక పాలన.. ప్రశ్నిస్తే చాలు..టార్గెట్
-
Big Question: పోస్ట్ ఒక్కటే..ఎఫ్ఆర్ లు అనేకం.. వేలల్లో కేసులు.. వారంతా ఎవరు..?
-
సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రాణహాని..జనసేన శ్రేణులు వద్ద సమాచారం
-
సోషల్మీడియా కార్యకర్తలకు ప్రాణహాని..జనసేన శ్రేణుల దుశ్చర్య
సాక్షి,విజయవాడ : సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రాణహాని తలపెట్టేలా కూటమి పార్టీల చర్యలున్నాయి. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన రహస్య సమాచారం బయటికి పొక్కి సోషల్మీడియా కార్యకర్తల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని జనసేన సోషల్ మీడియా విభాగం పోస్ట్ చేస్తోంది.కేవలం పోలీసులు వద్ద ఉండాల్సిన సమాచారాన్ని సోషల్మీడియాలో పెట్టి బహిరంగపరుస్తున్నారు.తాజాగా సోషల్మీడియా యాక్టివిస్టు అనిల్ నాయక్ లొకేషన్ను జనసేన కార్యకర్తలు సోషల్మీడియాలో పోస్టుచేశారు. లొకేషన్ను అక్షాంశాలు,రేఖంశాలతో సహా పోస్ట్ చేశారు.ఈ పోస్టులతో తనకు ప్రాణహాని కలిగేలా చేస్తున్నారని అనిల్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టులు చట్ట వ్యతిరేకమని ఆయన ఆరోపించారు.Shocking breach! Sensitive data, meant only for police access, is now public. If this isn’t dealt with seriously, privacy in AP is doomed, paving the way for dangerous misuse. If a third party is involved, they need to be held accountable . pic.twitter.com/sbeUfL01hp— bagira (@bigcatt09) December 2, 2024 -
ప్రభుత్వ కుతంత్రం బట్టబయలు
రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై వందలాదిగా నమోదు చేస్తున్న అక్రమ కేసుల వెనుక ఉన్న అసలు పన్నాగం ఏమిటన్నది కూడా స్పష్టమైంది. అక్రమ కేసులతో వేధింపులు.. అక్రమ నిర్బంధాలతో రోజుల తరబడి థర్డ్ డిగ్రీతో సృష్టిస్తున్న అరాచకం.. వివిధ జిల్లాల్లోని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నదాష్టీకం వెనుక టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల కుతంత్రం ఉందని నిగ్గు తేలుతోంది.సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న అక్రమ కేసుల కుట్ర బట్టబయలైంది. పోలీసులను పాత్రధారులుగా చేసుకుని ప్రభుత్వ పెద్దలు సూత్రధారులుగా సాగిస్తున్న అరాచక పర్వం గుట్టు ఆధారాలతో సహా రట్టు అయింది. బాధిత బాలిక కుటుంబానికి అండగా నిలిచారన్న ఒకే ఒక్క కారణంతో మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఏకంగా అక్రమంగా పోక్సో కేసు పెట్టేంతగా బరితెగించిన పోలీసు వ్యవస్థ బండారం బయట పడింది. తెల్ల కాగితాలపై సంతకం చేయించుకుని పోలీసులే తప్పుడు ఫిర్యాదు రాసి అక్రమ కేసు నమోదు చేసేంతగా దిగజారారన్న నిజం విభ్రాంతి కలిగించింది. ఓ మాజీ శాసనసభ్యుడిపై అక్రమ కేసు నమోదు చేసేందుకే అంతటి కుతంత్రం పన్నిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు వత్తాసు పలికిన పోలీసు వ్యవస్థ తీరు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.ప్రకాశం జిల్లాలో మరో నిర్వాకం విశాఖపట్నానికి చెందిన ఓ సోషల్ మీడియా యాక్టివిస్ట్ను ప్రకాశం జిల్లా పోలీసులు నవంబరు 4న అక్రమంగా అదపులోకి తీసుకుని, దర్శి పోలీస్ స్టేషన్కు తరలించారు. నవంబరు 5న ఆయన సెల్ ఫోన్ను అన్లాక్ చేయించి, స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా హింసించారు. ఆయనపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాంతో ఆయన మొబైల్ ఫోన్ నుంచి ఓ అసభ్యకర పోస్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ పోస్టు ఎందుకు పెట్టావని ఆయన్ని తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో ఆ బాధితుడు ఎదురు తిరిగాడు. తన మొబైల్ ఫోన్ నవంబరు 5 నుంచి పోలీసుల జప్తులోనే ఉంటే.. తాను నవంబరు 11న ఎలా పోస్టు పెట్టగలనని ప్రశ్నించారు. ఇంతలో ఆయన కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో పోలీసులు వెంటనే అతన్ని విశాఖపట్నం తరలించారు. అక్కడ నుంచి అనకాపల్లి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు.చివరికి ఏదో పాత అంశాన్ని సాకుగా చూపిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో అరెస్ట్ చూపించి రిమాండ్కు తరలించారు. కాగా, టీడీపీ ప్రధాన కార్యాలయంలో మకాం వేసిన రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులు సూత్రధారులుగా.. రాష్ట్రంలోని పోలీసు అధికారులు పాత్రధారులుగా ఈ అక్రమ కేసుల కుతంత్రాన్ని పక్కాగా అమలు చేస్తున్నారన్నది స్పష్టమైంది. పోలీసుల తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. తెల్ల కాగితాలపై సంతకాలతో కుట్రరెడ్బుక్ రాజకీయ కుట్రలను అమలు చేయడంలో తాము నాలుగాకులు ఎక్కువే చదివామంటున్నారు తిరుపతి జిల్లా పోలీసులు. అందుకోసమే గతంలో చంద్రబాబు వద్ద భద్రతా అధికారిగా పని చేసిన పోలీసు అధికారిని ప్రత్యేకంగా తెలంగాణ నుంచి డెప్యుటేషన్పై తెప్పించుకుని తిరుపతిలో కీలక పోస్టింగ్ ఇచ్చారు. ఆయన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అక్రమంగా పోక్సో కేసు నమోదు చేసేందుకు పోలీసు వ్యవస్థ ప్రతిష్టనే పణంగా పెట్టేశారు. ఇటీవల తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఓ బాలికను కొందరు దుండగులు అపహరించుకుపోయి వేధించారు. దాంతో ఆ బాలిక తండ్రి ఆవేదనతో తమకు న్యాయం చేయాలని బోరుమన్నాడు. విషయాన్ని చెవిరెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లాడు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధిత కుటుంబం వద్దకు వెళ్లి బాలిక తండ్రికి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు. ఉదాసీనతపై సర్వత్రా నిరసనటీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. పోలీసు వ్యవస్థ చేతగానితనం, ప్రభుత్వ పెద్దల ఉదాసనీతపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుతోంది. ఈ నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో బాలికపై జరిగిన దాడిని వక్రీకరించి ఏకంగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి వేధించాలని ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. దాన్ని అమలు చేసే బాధ్యతను తిరుపతి జిల్లా పోలీసులు భుజానికెత్తుకున్నారు. బాధిత బాలికకు న్యాయం చేస్తామని మాయ మాటలు చెప్పి, ఆమె తండ్రితో తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. ఆ తర్వాత తమ కుట్రను అమలు చేశారు. బాధిత బాలిక తండ్రి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు ఆ తెల్లకాగితాలపై పోలీసులు రాసేశారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇతరులపై అక్రమ కేసు పెట్టి ఏకంగా పోక్సో చట్టంతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, కేంద్ర ఐటీ చట్టంలతోపాటు ఏకంగా 11 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాస్త ఆలస్యంగా వాస్తవాన్ని గుర్తించిన బాధిత బాలిక తండ్రి పోలీసుల కుట్రను ఆదివారం బట్టబయలు చేశారు. తాను చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపైగానీ, ఇతరులపైనా గానీ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. పోలీసులే ఇదంతా చేశారని కుండబద్దలు కొట్టారు. దాంతో తిరుపతి జిల్లా పోలీసుల కుట్ర బట్టబయలైంది. -
వారిపై సెక్షన్ 111 వర్తించదు: పొన్నవోలు
-
సోషల్ మీడియా యాక్టివిస్టులపై సెక్షన్ 111 వర్తించదు: పొన్నవోలు
సాక్షి, ఢిల్లీ: ఏపీలో వైఎస్సార్సీపీ శ్రేణులను కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వేధిస్తోందన్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్. వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు సంబంధంలేని సెక్షన్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెట్టిన 111 సెక్షన్ వర్తించదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా కార్యకర్తలకు ఈరోజు శుభదినం. ప్రతీ కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశించారు. సజ్జల భార్గవ రెడ్డి మీద పిటిషన్ వేశాం. నెల రోజుల నుంచి ఏపీలో ఫ్యాసిస్ట్ ప్రభుత్వ కోరల్లో చిక్కుకుని సోషల్ మీడియా కార్యకర్తలు నలిగిపోతున్నారు.జూలై 1, 2024కు ముందు జరిగిన ఘటనలకు సెక్షన్ 111 వర్తించదు. ఈ సెక్షన్ 111ను టీడీపీ దుర్వినియోగం చేసింది. సెక్షన్ 111 పెట్టాలంటే ముద్దాయిపై రెండు ఛార్జ్షీట్లు ఉండాలి. అలా కాకుండా రెండు ఛార్జ్ షీట్లు లేకుండానే సెక్షన్ 111 పెడుతున్నారు. ఇది టీడీపీ ప్రభుత్వం ఫ్యాసిస్ట్ ప్రభుత్వం చేసిన పని. సోషల్ మీడియా కార్యకర్తలు ఈ చట్టం కిందకి రారు. కొన్ని వేల మందిపై అక్రమంగా కేసులు పెట్టారు. సజ్జల భార్గవకు అరెస్టు నుంచి రెండు వారాల రక్షణ కల్పించారు. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకునే అవకాశం సుప్రీంకోర్టు ఇచ్చింది. ఘోరమైన నేరాలకు పాల్పడే వారికి ఇది 111 వర్తింపజేయాలని శాసన కర్తల ఉద్దేశం. ఈ ఉద్దేశాలకు వ్యతిరేకంగా అక్రమ కేసులు పెడుతున్నారు. ఒకే ఘటనపై మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు పెట్టొద్దని గతంలోనే సుప్రీంకోర్టు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. సుప్రీంతీర్పు ఉల్లంఘిస్తే అధికారులు కూడా శిక్షకు అర్హులే అంటూ కామెంట్స్ చేశారు. -
కూటమి సర్కార్ అక్రమ కేసులు.. ముగ్గురు సోషల్ మీడియా కార్యకర్తలకు బెయిల్
సాక్షి, గుంటూరు: చిలకలూరిపేట నియోజకవర్గ సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దిరెడ్డి సుధారాణి దంపతులకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో సుధారాణి దంపతులు పోస్ట్ పెట్టారంటూ నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నరసరావుపేట సబ్ జైల్లో ఉన్న సుధారాణి దంపతులను పిటి వారెంట్ ద్వారా గుంటూరు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టగా, సుధారాణి దంపతులకు బెయిల్ మంజూరైంది.వైజాగ్ సోషల్ మీడియా యాక్టివిస్టు బోడి వెంకటేశ్వర్లుకు కూడా గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఒంగోలు జైలు నుంచి పిటి వారెంట్ ద్వారా గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టగా, ఆయనుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.కాగా, సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణి పట్ల మహిళ అని కూడా చూడకుండా పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారని, రోజులతరబడి ఆమెపైన, ఆమె భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా, మానసికంగా వేధించారనే ఆరోపణలున్నాయి.తెలంగాణలో గుడికి వెళ్లిన సుధారాణిని ఆమె భర్త, పిల్లలతో సహా పోలీసులు అదుపులోకి తీసుకొని చిలకలూరిపేటకు తీసుకొచ్చారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలి పెట్టాల్సింది పోయి వారి నిర్బంధంలోనే ఉంచుకొని, చిత్ర హింసలకు గురి చేశారు. ఆమెపై 6 అక్రమ కేసులు బనాయించారు. పోలీసులు శారీరకంగా వేధించి, గాయపర్చినట్లు ఆమె కోర్టుకు తెలిపారు. తనను, భర్త వెంకటరెడ్డిని, పిల్లలను చిలకలూరిపేటకు తీసుకెళ్లారని, పిల్లలను వేరు చేసి భర్తతో పాటు తనను ఒంగోలు వన్టౌన్ పీఎస్కు తరలించినట్టు ఆమె కోర్టుకు చెప్పారు. -
మహిళపై పోక్సో కేసు..
-
కూటమి సర్కార్.. సోషల్ మీడియానే టార్గెట్ గా భారీ కుట్రలు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో భావ ప్రకటనా స్వేచ్చకు భంగం ఏర్పడుతోంది. రాష్ట్రంలో సోషల్ మీడియానే లక్ష్యంగా భారీ కుతంత్రాలు జరుగుతున్నాయి. చంద్రబాబు సర్కార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.కూటమి సర్కార్ పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం ఏర్పడుతోంది. ఈ క్రమంలో ప్రశ్నిస్తే పీడీ యాక్ట్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియానే టార్గెట్ గా భారీగా కుతంత్రాలు జరుగుతున్నాయి. చంద్రబాబు పాలనలో నల్ల చట్టాలతో అణచివేసే కుట్రలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. ఐటీ యాక్ట్ ను కూడా పీడీ యాక్ట్ పరిధిలోకి తెచ్చేలా ప్లాన్ చేస్తోంది కూటమి సర్కార్. రాష్ట్రంలో రెడ్ బుక్ అమలు చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోంది. కూటమి నిర్ణయాలపై రాజకీయ మేధావులు సైతం విస్తుపోతున్నారు. -
Big Question: ప్రశ్నిస్తే వేధించండి.. హామీలు అడిగితే వెంటాడండి..
-
సెక్షన్లు మార్చి.. చట్టాన్ని ఏమార్చి..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులతో వేధింపుల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును కాలరాస్తూ చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది. ఇందుకోసం సెక్షన్లు మార్చేస్తోంది. చట్టాల్ని ఏమారుస్తోంది. సోషల్ మీడియా పోస్టులపై కేసులు అందుకు ఉద్దేశించిన ఐటీ చట్టం ప్రకారం కాకుండా సంబంధంలేని ఇతర చట్టాల కింద పెడుతుండటం ప్రభుత్వ కక్ష సాధింపునకు నిదర్శనం. చివరకు సుధారాణి అనే సోషల్ మీడియా యాక్టివిస్టుపైనా పోక్సో కేసు పెట్టడం ప్రభుత్వ దుర్నీతికి పరాకాష్ట. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఓ మహిళ మీద పోక్సో కేసు పెట్టడమే అత్యంత దారుణమని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇది రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని, ఇదే కొనసాగితే ఎవరూ మనుగడ సాగించలేని దుస్థితి వస్తుందని చెబుతున్నారు. బాధిత బాలికకు అండగా నిలిచినందుకు వైఎస్సార్సీపీ నేత, మాజీ శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై పోక్సో కేసు పెట్టడం ప్రభుత్వ మరో బరితెగింపునకు నిదర్శనం. ఇలా నిత్యం రాష్ట్రంలో అనేక మందిపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోంది.ఐటీ చట్టం స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ అక్రమ కేసుల పరంపరవ్యక్తిగతంగా లేదా మీడియా ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలు వ్యక్తం చేయడం భావ ప్రకటన హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. సోషల్ మీడియా పోస్టులపై అభ్యంతరం ఉంటే కేంద్ర ఐటీ చట్టం కింద మాత్రమే కేసు నమోదు చేసి 41ఏ నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. కానీ కక్ష సాధింపే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పును నిర్భీతిగా ఉల్లంఘిస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తోంది. ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై ఐటీ చట్టం కింద కాకుండా ఇతర చట్టాల కింద కూడా కేసులు పెడుతూ పౌర హక్కులను ఉల్లంఘిస్తోంది. బీఎన్ఎస్ సెక్షన్ 111, పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం.. ఇలా వివిధ చట్టాల కింద కుట్రపూరితంగా కేసులు పెడుతోంది.అందుకు కొన్ని ఉదాహరణలు..» ఇప్పటివరకు 30 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై ఐటీ చట్టంతోపాటు బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద అక్రమ కేసులు నమోదు చేశారు. ఆ సెక్షన్ వ్యవస్థీకృత నేరాల కట్టడికి ఉద్దేశించింది. అంటే ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు, విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసేందుకు ఉద్దేశించినది. కానీ, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టడం తెగింపు ధోరణే.» 9 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై ఐటీ చట్టంతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కూడా అక్రమ కేసులు నమోదు చేశారు. అసలు ప్రభుత్వ వైఫల్యాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించడం ఎస్సీ, ఎస్టీ వేధింపు ఎలా అవుతుందోనని పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. » మరో విడ్డూరం ఏమిటంటే.. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించే వారిపై పోక్సో చట్టం కింద కేసులు పెట్టడం. గుంటూరు జిల్లాకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త, మహిళ సుధారాణిపైనా పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. కొద్దిరోజుల క్రితం సుధారాణి దంపతులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. దీనిపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ ఫుటేజీలను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించడంతో గుంటూరు, ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు షాక్ తగిలింది. దాంతో ఆమెపై ఏకంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, వేధింపులకు గురి చేస్తున్నారు.» చంద్రగిరి నియోజకవర్గంలో ఓ బాలికపై ఇద్దరు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆమె కుటుంబం తల్లడిల్లింది. సమాచారం తెలిసిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అదే ఆయన చేసిన నేరమన్నట్టుగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయనపై ఏకంగా పోక్సో కేసు పెట్టింది. -
Big Question: ప్రశ్నిస్తే పీడీ యాక్ట్.. సర్కారు వారి బరితెగింపు..
-
AP: సోషల్ మీడియా కార్యకర్తలపై పెరిగిన వేధింపులు
సాక్షి,తాడేపల్లి:ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసుల వేధింపులు ఆగడం లేదు. సోషల్మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిని టార్గెట్ చేసి మరీ భారీగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరిపై పది నుంచి ఇరవైకి పైగా అక్రమ కేసులు నమోదు చేశారు. సజ్జల భార్గవ్పై11, అర్జున్ రెడ్డి మీద 11,వర్రా రవీంద్రరెడ్డిపై 21, ఇంటూరి రవికిరణ్ మీద16,పెద్దిరెడ్డి సుధారాణిపై 10,వెంకటరమణారెడ్డిపై 10 కేసులు పెట్టారు. ఇవి కాకుండా చంద్రబాబు సర్కారు రహస్యంగా మరికొన్ని కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.కేసులు నమోదైనవారిలో ఎవరైనా హైకోర్టులో హెబియస్ కార్పస్,క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్లు వేస్తే వారిని పోలీసులు మరింతగా టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ,వాక్ స్వాతంత్రం అసలే కనిపించడం లేదని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. -
Ambati: సోషల్ మీడియా కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది
-
లోకేష్కు శాపంగా మారనున్న రెడ్బుక్: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు: సోషల్మీడియాలో పోస్టులపై వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నపుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయరని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరులో సోమవారం(నవంబర్ 25)అంబటి మీడియాతో మాట్లాడారు.‘వైఎస్సార్సీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టు చేస్తున్నారు. ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. అసభ్యకరమైన పోస్టింగ్స్ పెడితే టీడీపీ వాళ్లను కూడా అరెస్ట్ చేస్తామని చంద్రబాబు నీతి వ్యాక్యాలు చెప్పారు.అయితే వైఎస్సార్సీపీ నేతలపై అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం లేవు.ఇప్పటికే ఈ నెల 17,18,19 తేదీల్లో వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మా కుటుంబ సభ్యులపైన టీడీపీ నాయకులు పెట్టిన పోస్టులపై వివిధ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశాం.నిన్న అన్ని పీఎస్లకు వెళ్ళి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించాం. స్పష్టమైన సమాధానం మాకు రాలేదు. ఇప్పుడు స్పీకర్గా ఉన్న వ్యక్తి వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.లోకేష్ కూడా వైఎస్ జగన్పై అసభ్యకరమైన పోస్టు పెట్టారు. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. పోలీసులు స్పందించకుంటే న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తాం. స్పీకరైనా,మంత్రైనా చట్టం దృష్టిలో ఒకటే. ఇది అంతం కాదు ఆరంభమే. జమిలి ఎన్నికలొస్తాయన్న ప్రచారం జరుగుతోంది.డైరెక్టర్ రాంగోపాల్ వర్మపైన కూడా కేసులు పెట్టారు. పోసాని మురళీకృష్ణ వైఎస్ జగన్ అభిమాని. ఆయనపై కేసులు పెట్టి భయపెట్టొచ్చేమో కానీ వైఎస్ జగన్పై ఆయనకున్న ప్రేమను మాత్రం తొలగించలేరు. రెడ్బుక్ లోకేష్ రాశాడు. రెడ్బుక్ లోకేష్కు శాపంగా మారుతోంది. రెడ్బుక్ రచయితగా లోకేష్ చరిత్రలో నిలిచిపోతాడు’అని అంబటి ఎద్దేవా చేశారు. -
ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులు
-
సూపర్ 6 పథకాల అమలులో కూటమి ప్రభుత్వం వైఫల్యం- భాగ్యలక్ష్మి
-
జగన్ పై అనుచిత పోస్టులు... పోలీసులకు వైఎస్సార్సీపీ నేతలు కంప్లైంట్
-
మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో iTDP సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతున్నారు
-
చంద్రబాబుకు శ్రీకాంత్ రెడ్డి అదిరిపోయే కౌంటర్
-
మానవ హక్కులను హరిస్తూ.. అక్రమ కేసులతో వేధిస్తూ..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ అధికారిక గూండాగిరి వెర్రితలలు వేస్తోంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులతో రోజురోజుకీ మరింతగా పేట్రేగిపోతోంది. ఉగ్రవాదులపట్ల కూడా వ్యవహరించనంత కాఠిన్యంతో పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ మానవ హక్కులను నిర్భీతిగా కాలరాస్తున్నారు. ఒక్కొక్కరిపై నాలుగైదు అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టుచేస్తున్న పోలీసులు వారు రిమాండ్లో ఉండగానే వారికి తెలియకుండానే మరిన్ని కేసులు పెడుతున్నారు. అరెస్టయిన వారిని రాష్ట్రంలోని జైళ్లకు తిప్పుతూ వారి కుటుంబ సభ్యులను కూడా కలవనీయకుండా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ కుట్రలో భాగస్వామిగా మారిన పోలీసు వ్యవస్థ కూడా రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ.. పౌర హక్కులను మంటగలుపుతూ పేట్రేగిపోతోంది. ఇక అక్రమ నిర్బంధాలను సవాల్చేస్తూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తుంటే పోలీసులు మరింతగా చెలరేగిపోతున్నారు. వారిపై మరిన్ని అక్రమ కేసులు బనాయించి బెంబేలెత్తిస్తుండటం ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్టగా నిలుస్తోంది. న్యాయ వ్యవస్థ ఆదేశాల స్ఫూర్తిని సైతం ఉల్లంఘిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న అరాచకం ఎలా ఉందంటే..ఎడాపెడా అక్రమ కేసులు..చంద్రబాబు ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎడాపెడా అక్రమ కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. ఇప్పటివరకు ఏకంగా 178 అక్రమ కేసులు నమోదు చేసినట్లు లెక్కతేలగా.. వాటికి అదనంగా గత రెండ్రోజుల్లోనే మరో 100 వరకు అక్రమ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఓ కేసులో అరెస్టుచేసిన సోషల్ మీడియా యాక్టివిస్టు రిమాండ్లో ఉండగానే ఆయనపై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేస్తోంది. ఇలా ఒకొక్కరిపై కనీసం నాలుగైదు అక్రమ కేసులు నమోదు చేస్తోంది. ఓ కేసులో బెయిల్పై బయటకు రాగానే మరో కేసులో అరెస్టుచేసి మరో జైలుకు తరలిస్తోంది. దీంతో అసలు ఎవరిపై ఎన్ని కేసులు నమోదు చేశారన్న కనీస సమాచారం కూడా తెలియనివ్వకుండా పోలీసులు బరితెగించి వేధిస్తున్నారు. అరెస్టు చేసినవారి సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేయాలన్న రాజ్యాంగపరమైన బాధ్యతను కూడా పోలీసులు బేఖాతరు చేస్తున్నారు. దీంతో తమ వారిని అదపులోకి తీసుకుంది పోలీసులో, ప్రైవేటు గూండాలో తెలీక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారి ఆచూకి కోసం పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.హైకోర్టును ఆశ్రయిస్తే మరిన్ని కేసులు..ఇక సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తూ పైశాచికంగా వ్యవహరిస్తుండడంతో వారి ఆచూకి కోసం కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేస్తూ తమ వారి ఆచూకీ చెప్పాలని వేడుకుంటున్నారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం మరింతగా పేట్రేగిపోతోంది. ఎవరి ఆచూకీ కోసం హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారో వారిని విడుదల చేస్తూనే ఆ వెంటనే వారిపై ఐదారు అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తోంది.ఇంటూరి ఎక్కడో?తీవ్ర ఆందోళనలో కుటుంబ సభ్యులువైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్ను అక్రమ కేసులో అరెస్టుచేసి చిత్రహింసలకు గురిచేసినా ప్రభుత్వ కక్ష చల్లారలేదు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ఆయన్ని రాజమహేంద్రవరం జైలుకు తరలించిన పోలీసులు.. ఆ తరువాత కూడా వేధిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. రవికిరణ్ను కలిసేందుకు ఆయన సతీమణి విశాఖ నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వచ్చారు. కానీ, ఆయన్ని విశాఖ జైలుకు తరలించినట్లు అక్కడి జైలు అధికారులు చెప్పారు. దాంతో ఆమె విశాఖ జైలుకు వెళ్లారు.కానీ, తన భర్తను కలిసేందుకు ఆమెకు అవకాశమివ్వలేదు. రెండ్రోజులు ప్రయత్నించిన మీదట జైలు అధికారులు అంగీకరించడంతో ఆమె జైలుకు వెళ్లారు. తీరా ఆమె వెళ్లేసరికి రవికిరణ్ను విజయనగరం జైలుకు తీసుకుపోయారు. అక్కడికి వెళ్తే అక్కడా లేరని.. శ్రీకాకుళం జైలుకు తరలించారని చెప్పారు. తీరా ఆమె గురువారం శ్రీకాకుళం జైలుకు వెళ్లేసరికి అక్కడ నుంచి పల్నాడు జిల్లా మాచర్లకు తరలించేశారు. ఇక రవికిరణ్ను శుక్రవారం మరో జైలుకు తరలిస్తారని తెలుస్తోంది. ఇలా రవికిరణ్ను ఆయన కుటుంబీకులు కలవనీయకుండా పోలీసులు చేస్తున్నారు.మహిళ పట్లా అత్యంత కర్కశంగా..సుధారాణిని వేధిస్తున్న ప్రభుత్వంమహిళ అనే కనీస కనికరం కూడా లేకుండా సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన సుధారాణిపట్ల కూడా కక్షతో అత్యంత కర్కశంగా వ్యవహరిస్తుండటం చంద్రబాబు ప్రభుత్వ రాక్షసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఏడేళ్లలోపు జైలుశిక్ష పడే అవకాశమున్న కేసుల్లో రిమాండ్ విధించకుండా వెంటనే బెయిల్ మంజూరు చేయాలి. సుధారాణిపై నమోదైన కేసులన్నీ ఇలాంటివే. కానీ, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే సమయంలో వివిధ సెక్షన్లు జోడిస్తూ పోలీసులు కనికట్టు చేశారు. సుధారాణి, ఆమె భర్త వెంకట్రామిరెడ్డిలను అరెస్టుచేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. సుధారాణి ఇద్దరు పిల్లలు తల్లిని చూడాలని ఏడుస్తుండటంతో ఆమె తండ్రి వారిని తీసుకుని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వచ్చారు. వారు వచ్చేసరికే ఆమెను విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. తీరా విశాఖపట్నం సెంట్రల్ జైలుకు వెళ్లేసరికి అక్కడి నుంచి శ్రీకాకుళం జైలుకు తీసుకుపోయారు. ఆమె తండ్రి తన ఇద్దరు మనవలతో కలిసి ఎంతో వ్యయ ప్రయాసలు పడి గురువారం శ్రీకాకుళం వెళ్లేసరికి ఆమెను గుంటూరు జైలుకు తరలించేశారు. అక్కడి నుంచి ఆమెను ఒంగోలు జైలుకు తీసుకుపోయారు. ఇక సుధారాణి భర్త వెంకట్రామిరెడ్డి ఎక్కడ ఉన్నారన్నది అంతుచిక్కడంలేదు. రాజమహేంద్రవరం టు బి.కొత్తకోట..శ్రీనాథ్రెడ్డి పట్ల ప్రభుత్వ వేధింపులుఅల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాకకు చెందిన శ్రీనాథ్ రెడ్డిపట్ల కూడా ప్రభుత్వం అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోంది. ఆయన్నిసోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని అక్రమంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం ఆయనపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెట్టారు. ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లుగానీ అరెస్టు చేసినట్లుగానీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. శ్రీనాథ్రెడ్డిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయన ఎక్కడున్నారనే విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లారు. కానీ, ఆయన్ని అప్పటికే శ్రీకాకుళం జైలుకు తరలించేశారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు శ్రీకాకుళం వెళ్లారు. తీరా వారు అక్కడికి వెళ్లేసరికి.. శ్రీనాథ్రెడ్డికి శ్రీకాకుళం నుంచి ఏకంగా 900 కి.మీ.దూరంలో ఉన్న అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోటకు తరలించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. -
చంద్రబాబుకు శ్రీకాంత్ రెడ్డి అదిరిపోయే కౌంటర్
-
6 నెలల్లో అరాచకాంధ్రప్రదేశ్గా మారిన ఏపీ
-
AP: వర్రా రవీంద్రారెడ్డి పిటిషన్.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,గుంటూరు: సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రారెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్పై బుధవారం(నవంబర్ 20) ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.చట్టనిబంధనలు,కోర్టు ఆదేశాల ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని కడప పోలీసులను హైకోర్టు ఆదేశించింది.పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని కడప పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు పోలీసులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.రవీంద్రారెడ్డి అరెస్టుకు సంబంధించి పుల్లూరు టోల్ ప్లాజా సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచాలని జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ)ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 29కి వాయిదా వేసింది.హైకోర్టులో వర్రా రవీంద్రారెడ్డి తరపున న్యాయవాది నిరంజన్రెడ్డి వాదనలు..ఈ పిటిషన్ పౌరుని హక్కులకు సంబంధించిందిఒక పౌరుడు దుస్థితిని ఈ కోర్టు పరిగణలోకి తీసుకోవాలినిందితుల హక్కులను హరించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇటీవలే ఒక కీలక తీర్పు ఇచ్చిందివర్రా రవీంద్రారెడ్డి రెడ్డి విషయంలో పోలీసులు పలు చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారుకోర్టును తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారం ఇచ్చారురవీంద్రారెడ్డి హైకోర్టు ముందు హాజరు పరచాలని ధర్మాసనం ఆదేశిస్తే పోలీసులు ఎక్కడో హాజరు పరిచారు24 గంటల్లో వర్రా రవీంద్రారెడ్డి రెడ్డిని కోర్టులో హాజరపరచాల్సిన పోలీసులు 48 గంటల పాటు అక్రమ నిర్బంధంలో ఉంచారురాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ప్రస్తుతం ఇలానే వ్యవహరిస్తున్నారుచట్ట నిబంధనలు, కోర్టు ఆదేశాల ఉల్లంఘనలకు పాల్పడితే సహించేది లేదన్న హెచ్చరికలు పోలీసులకు పంపాల్సిన సమయం ఆసన్నమైందిరాజకీయ ప్రత్యర్థులను అక్రమంగా నిర్బంధించి హింసిస్తున్నారుఅధికార పార్టీకి చెందిన వారు సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతున్నారుఇవేవీ పోలీసులకు కనిపించడం లేదువారి జోలికి వెళ్లే ధైర్యం కూడా పోలీసులు చేయడం లేదుకొంతమంది పోలీసులను ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేస్తాం -
Vidadala Rajini: కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా..?
-
నా కూతురిపై టీడీపీ పోస్టులు..
-
మీరు ఎంత భయపెట్టాలని చూస్తే.. మేము అంత ధైర్యంగా ముందుకు వస్తాం
-
మీరు మా ఆదేశాలను ఉల్లంఘించారు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్రెడ్డిని కోర్టు ముందు హాజరుపరిచే విషయంలో పోలీసులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు తెలిపింది. రవీందర్రెడ్డిని తమ ముందు (హైకోర్టు) హాజరుపరచాలని ఆదేశిస్తే, పోలీసులు ఎక్కడో హాజరుపరిచారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. అలాగే, ఈ వ్యాజ్యంలో జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)ని ప్రతివాదిగా చేర్చాలని వర్రా రవీందర్రెడ్డి సతీమణిని కూడా ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.అక్రమ నిర్బంధంపై హెబియస్ కార్పస్ పిటిషన్..తన భర్త వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్భంధంపై అతని భార్య కళ్యాణి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా ఈ వ్యాజ్యం ఈనెల 9న విచారణకు వచ్చింది. అప్పుడు, వర్ర రవీందర్రెడ్డిని తాము అరెస్టుచేయలేదని, అతను తమ నిర్బంధంలో లేరని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దీంతో హైకోర్టు ధర్మాసనం, వర్రా రవీంద్రరెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్ భాస్కర్రెడ్డిలను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈనెల 12న ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, రవీందర్రెడ్డి తదితరులను అరెస్టుచేసినట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. విచారణ సందర్భంగా పోలీసులు వర్రాను కొట్టారని, ఆయన ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని రవీంద్రరెడ్డి న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే.పోలీసులది కోర్టు ధిక్కారమే..ఈ నేపథ్యంలో.. సోమవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. రవీందర్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి స్పందిస్తూ.. ధర్మాసనం ఆదేశించిన మేరకు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశామని చెప్పారు. ఈనెల 9న జరిగిన విచారణలో రవీంద్రరెడ్డి తమ నిర్బంధంలో లేరని చెప్పారని, కానీ 12న అతన్ని సంబంధిత కోర్టు ముందు హాజరుపరిచారని తెలిపారు. తప్పుడు వివరాలతో పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించడమేకాక.. 12న రవీందర్రెడ్డి తదితరులను తమ ముందు హాజరుపరచాలని హైకోర్టు ఆదేశిస్తే పోలీసులు కింది కోర్టు ముందు హాజరుపరిచారని చెప్పారు. అక్రమ నిర్బంధంలో పోలీసులు రవీంద్రరెడ్డిని కొట్టారని తెలిపారు. వాస్తవానికి.. రవీందర్రెడ్డిని పోలీసులు ఈనెల 8నే తమ అదపులోకి తీసుకున్నారని నిరంజన్రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రూల్ ఆఫ్ లా అంటే పోలీసులకు ఎంతమాత్రం గౌరవం లేదనేందుకు ఈ కేసు ఓ మంచి ఉదాహరణనన్నారు. హైకోర్టు ముందు హాజరుపరచకుండా వారిని కింది కోర్టులో హాజరుపరచడం అంటే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని.. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందన్నారు. 48 గంటలకు మించి అక్రమంగా నిర్బంధించడం ద్వారా పోలీసులు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను హరించారన్నారు.పోలీసులను ఇలాగే వదిలేస్తే..పోలీసులు చాలా అక్రమంగా వ్యవహరిస్తున్నారని, వీటిని ఇలాగే వదిలిస్తే రేపు ఓ 100 మందిని అక్రమంగా నిర్బంధించి, వారిని కొట్టి, వారితో కావాల్సిన ప్రతిపక్ష నేతల పేర్లు చెప్పించే పరిస్థితి వస్తుందని నిరంజన్రెడ్డి చెప్పారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, పోలీసులు తమ ఆదేశాలను ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద రవీంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్నారని, అక్కడ సీసీ ఫుటేజీని భద్రపరిచేలా ఆదేశాలివ్వాలని నిరంజన్రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. టోల్ప్లాజా జాతీయ రహదారుల సంస్థ అధీనంలో ఉన్న నేపథ్యంలో ఆ సంస్థను ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని కళ్యాణికి ధర్మాసనం సూచించి తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. -
KSR Live Show: సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల థర్డ్ డిగ్రీ
-
కదిరి మండలానికి చెందిన అమర్నాథ్ రెడ్డి పై ఐదు కేసులు నమోదు
-
Satyameva Jayate: ఏది నిజం.. ఎవరిది శాడిజం..? మార్ఫింగ్ ఫొటోలు పెడుతున్న సోషల్ సైకోలు..
-
కూటమి పెద్దల ఉన్మాదం.. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసుల అరాచకం
కూటమి సర్కార్ పాలనలో అక్రమ అరెస్ట్లపై వైఎస్సార్సీపీ పోరాటం.. -
వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ
-
సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా అమానుష కాండను కొనసాగిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుండడమే వారు చేసిన నేరం. వారిపై అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా ...వారిని అక్రమంగా నిర్బంధించి భౌతికంగా దాడులు చేస్తూ ...కసి తీరిన తరువాతే అరెస్ట్ చూపిస్తోంది. మానవ హక్కులను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ ...రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ సాగిస్తున్న ఈ దమనకాండకు ప్రభుత్వ ముఖ్యనేతే ప్రధాన కుట్రదారు కాగా... కీలక పోలీసు అధికారులు పాత్రధారులు, పర్యవేక్షకులు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ రాక్షస క్రీడ కొనసాగుతోంది. అందులో ప్రధానంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఇందులో బాగా ఆరితేరిపోయారు. అందరికన్నా ముందుండాలన్న తాపత్రయం వారిలో కనిపిస్తోంది. పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను దారుణంగా కాలరాస్తున్న సర్కారు దమననీతిపై న్యాయపోరాటానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. అంతేకాదు తమ విద్యుక్తధర్మాన్ని గాలికొదిలేసి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లల్లా తలాడిస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులపై దమనకాండను కొనసాగిస్తున్న పోలీసు అధికారులపైనా ఎక్కడికక్కడ ప్రైవేటు కేసులు వేసేందుకు బాధిత కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. వీరికి పలువురు మేధావులు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమకారులు, పలు పౌరసంఘాల నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. త్వరలోనే ‘పచ్చ’పాత పోలీసు అధికారులందరూ న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడడం తథ్యమని బాధిత కుటుంబాలు స్పష్టం చేస్తున్నాయి. అంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే... ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో కొనసాగుతోంది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల విభాగాన్ని పర్యవేక్షించే ఉన్నతాధికారి ఈ వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం. అంటే ఈ అమానుష కాండను కొనసాగించేందుకు ప్రభుత్వ పెద్దలు రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారని దీనినిబట్టి స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టులను వారు సంతృప్తిచెందే స్థాయిలో భౌతికంగా హింసించారా లేదా అన్నది వీడియో కాల్ ద్వారా పర్యవేక్షిస్తుండటం ప్రభుత్వ కక్షకు పరాకాష్టగా నిలుస్తోంది. ఆ రాక్షసకాండ ఇలా సాగుతోంది... ఎన్ని కేసులు.. ఎక్కడికి తరలిస్తున్నారు? రాష్ట్రంలో సోషల్మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం ఎడాపెడా అక్రమ కేసులు బనాయిస్తోంది. ఒక్కో యాక్టివిస్టుపై ఒకటికి మించిన కేసులు నమోదు చేయడమే కాకుండా... వేర్వేరు జిల్లాల్లో కేసులు నమోదు చేస్తోంది. వారిని పోలీసులు హఠాత్తుగా అదుపులోకి తీసుకుని తమతో పట్టుకుపోతున్నారు. ఏ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుందీ... ఏ పోలీస్ స్టేషన్కు తరలించారన్న కనీస సమాచారాన్ని కూడా కుటుంబ సభ్యులకు చెప్పడం లేదు. దాంతో తమ పరిధిలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి వాకబు చేస్తే అసలు తాము ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి కరడుగట్టిన నేరస్తులా? అక్రమంగా అదుపులోకి తీసుకున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీస్ స్టేషన్లు తిప్పుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కరడుగట్టిన నేరస్తులపై ప్రయోగించినట్లు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ భౌతికంగా హింసిస్తున్నారు. తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలని..లేకపోతే మరిన్ని రోజులు చిత్రవధ తప్పదని హెచ్చరిస్తున్నారు. వీడియో కాల్ ద్వారా నిర్ధారణ సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించామని పోలీసులు మాటలతో చెబితే ఉన్నతాధికారులు సంతృప్తి చెందడం లేదు. పోలీసు అధికారులు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల విభాగాన్ని పర్యవేక్షించే ఓ ఉన్నతాధికారికి వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ తాము ఆశించినస్థాయిలో ప్రయోగించారా లేదా అన్నది ఆ ఉన్నతాధికారి వీడియో కాల్ ద్వారా పరిశీలిస్తారు. ఆయన సంతృప్తి చెందితే ఆ విషయాన్ని తన బిగ్ బాస్కు నివేదిస్తారు. ఆయన అనుమతి ఇచ్చిన తరువాతే... ఒకే ఇక చాలు... అరెస్ట్ చూపించండి అని ఆ ఉన్నతాధికారి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు చెబుతారు.చిత్రహింసల తర్వాతే అరెస్ట్..ఆ విధంగా ప్రభుత్వ పెద్దలు ఆదేశించినస్థాయిలో థర్డ్ డిగ్రీని ప్రయోగించారని నిర్ధారించుకున్న తరువాతే సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ చూపిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా మూడు రోజుల నుంచి వారం రోజులపాటు సాగుతోంది. కుట్రపూరిత, కక్ష పూరిత రాజకీయాలకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పోలీసు వ్యవస్థను గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతగా దుర్వినియోగం చేయలేదని పోలీసు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసులను గుండాల మాదిరిగా మార్చి రాజకీయ అరాచకం సాగిస్తుండటం విభ్రాంతికరమని మండిపడుతున్నారు. ఈ పరిణామాలతో పోలీసు అధికారులు భవిష్యత్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. -
సోషల్మీడియా కార్యకర్తల కుటుంబాలకు వైఎస్సార్సీపీ నేతల భరోసా
సాక్షి,వైఎస్ఆర్జిల్లా: కడపలో సోషియల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ నాయకులు భరోసా ఇచ్చారు. సోషియల్ మీడియా కో కన్వీనర్ నిషాంత్, దుర్గా ప్రసాద్తో పాటు పలు కుటుంబాలను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు ఆదివారం(నవంబర్17) పరామర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ‘ గత కొన్ని రోజులుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలను నోటీసుల పేరుతో పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. సోషియల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు అర్థరాత్రి సమయాల్లో ఇళ్లకు వస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా? వారికి పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాం’అని తెలిపారు. -
నా భర్తను కాపాడండి..
-
కొనసాగుతున్న ఫిర్యాదులు, అరెస్టులు
సాక్షి నెట్వర్క్: సీఎం చంద్రబాబు, మంత్రులు, టీటీడీ చైర్మన్పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ సోషల్ మీడియా యాక్టివిస్టులపై పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. రాజమహేంద్రవరం జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్కుమార్ను పీటీ వారెంట్పై శుక్రవారం అరెస్టు చేసిన ఏలూరు జిల్లా వేలేరుపాడు పోలీసులు శనివారం జంగారెడ్డిగూడెం కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి రిమాండ్ విధించడంతో మళ్లీ రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. బోరుగడ్డ పోలీసుస్టేషన్లో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన పార్టీలవారు స్టేషన్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అనిల్ ఫొటోలను వారు చెప్పులతో కొడుతూ దహనం చేశారు. గుంటూరు జైలులో రిమాండ్లో ఉన్న విశాఖపట్నానికి చెందిన బోడి వెంకటేష్ను బాపట్ల జిల్లా చీరాల పోలీసులు పీటీవారెంట్పై అరెస్టు చేసి చీరాల కోర్టులో హాజరుపరిచారు. న్యాయాదికారి రిమాండ్ విధించడంతో వెంకటేష్ను ఒంగోలు జైలుకు తరలించారు. వైఎస్సార్సీపీ పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఉండి మండలం ఉణుదుర్రు గ్రామానికి చెందిన గొర్రుముచ్చు సుందర్కుమార్ను శనివారం తెల్లవారుజామున ఉండి పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు వాల్మీకి లోకేశ్ను హిందూపురం వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి వరకు విచారించిన అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం కృష్ణాజిల్లా అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు అందింది. సినీనటి శ్రీరెడ్డిపై గుంటూరులోని నగరంపాలెం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
చంద్రబాబు తీరే అంత.. : భూమన
తిరుపతి, సాక్షి: సొంత డబ్బా కొట్టుకోవడంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు దిట్ట అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. ఓవైపు ప్రజలను మోసం చేస్తూనే.. వైఎస్సార్సీపీకి సానుభూతిపరులెవరూ ఉండకూడదని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారాయన.సాధ్యంకాని హామీలిచ్చి టీడీపీ-జనసేన కూటమి ప్రజలను మోసం చేసింది. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబు దిట్ట. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ చెప్పిందే సత్యమని ఎల్లో మీడియా బాకా ఊదుతోంది. చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జగన్పై విమర్శలు చేస్తున్నారు.ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ఒక చరిత్ర.. కొన్ని నిజాలు పుస్తకం నుంచి చంద్రబాబుకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను భూమన మీడియాకు చదివి వినిపించారు. -
ఏపీలో రాజ్యాంగం తుంగలోకి
-
‘ఖబడ్దార్’ కూటమి సర్కార్.. జనం చూస్తున్నారు జాగ్రత్త!
ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అక్రమ అరెస్ట్లు కొనసాగుతున్నాయి.. వైఎస్సార్సీపీ పోరాటం.. -
కక్షే లక్ష్యం.. చట్టానికి తూట్లు!
సాక్షి, అమరావతి: రాజ్యాంగ హక్కులు, చట్ట నిబంధనలను కాలరాస్తూ ‘రెడ్బుక్’ పాలనతో అణచివేతలకు పాల్పడుతున్న చంద్రబాబు సర్కారు ఉగ్రవాదుల కోసం ఉద్దేశించిన చట్టాలను.. సోషల్ మీడియా యాక్టివిస్టులు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నవారు, ప్రజాస్వామ్యవాదులపై ప్రయోగిస్తూ మానవ హక్కులను హననం చేస్తోంది. ఈ ఏడాది జూలై 1కి ముందు జరిగినట్లు చెబుతున్న ఉదంతాల అభియోగాలపై ఐపీసీ సెక్షన్లకు బదులుగా చట్ట విరుద్ధంగా భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), న్యాయ సంహిత(బీఎన్ఎస్) కింద అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతోంది. వ్యవస్థీకృత నేరాల కింద అక్రమ కేసులు మోపుతోంది. జూలై 1వతేదీకి ముందు నాటి ఉదంతాల అభియోగాలపై బీఎన్ఎస్ కింద కేసులు పెట్టకూడదని కోర్టు తీర్పులు స్పష్టంగా చెబుతున్నా లెక్క చేయడం లేదు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై బీఎన్ఎస్ఎస్ చట్టం 192, 196, 353(2), 336(4), 340(2), 79, 111(2)(బి), 61(2) సెక్షన్ల కింద అక్రమ కేసులు నమోదు చేస్తోంది. వాటిలో సెక్షన్ 111(2)(బి) అనేది వ్యవస్థీకృత నేరాలకు సంబంధించింది. సోషల్ మీడియాలో పోస్టులకు ఆ సెక్షన్ వర్తించదు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదులు, దేశ భద్రతకు విఘాతం కలిగించే అరాచక మూకలపై నమోదు చేసేందుకు ఉద్దేశించిన ఈ సెక్షన్ను సోషల్ మీడియా యాక్టివిస్టులు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న వారిపై బనాయిస్తోంది. ఆ పోస్టులతో సంబంధం లేని వైఎస్సార్సీపీ కీలక నేతలను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కుట్రపూరితంగా బీఎన్ఎస్ఎస్ చట్టం కింద కేసులు నమోదు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భయోత్పాతం సృష్టిస్తూ పౌర హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజల్లో చైతన్యం రగిలిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద చట్టాలను ప్రయోగిస్తూ ఉక్కుపాదం మోపుతోంది. జూలై 1 తరువాత ఉదంతాలకే బీఎన్ఎస్ఎస్ చట్టాలు.. పార్లమెంట్ చట్టాలు, న్యాయస్థానం ఆదేశాలను లెక్క చేయకుండా ఈ ఏడాది జూలై 1 నుంచి దేశంలో కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ నాగరిక సురక్షా సంహిత, న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తుండటం సర్కారు కుట్రలకు నిదర్శనం. కేంద్రం కొత్తగా తెచ్చిన బీఎన్ఎస్ఎస్, బీఎన్ఎస్ చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి వచ్చాయి. అంతకుముందు జరిగిన ఉదంతాలకు సంబంధించి అభియోగాలపై నమోదయ్యే కేసులను మాత్రం ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ల కిందే దర్యాప్తు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆ మేరకు పార్లమెంట్లో చట్టం కూడా చేసింది. చెల్లదన్న రాజస్థాన్ హైకోర్టు..జూలై 1 తరువాత జరిగిన ఉదంతాల అభియోగాలపై నమోదు చేసే కేసులను మాత్రమే బీఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని రాజస్థాన్ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అంతకుముందు జరిగిన ఉదంతాలపై అభియోగాలను ఐపీసీ సెక్షన్ల కిందే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని తేల్చి చెప్పింది. జూలై 1కి ముందు ఓ వ్యక్తి ఫోర్జరీ సంతకాలతో వీలునామాను సృష్టించారంటూ అదే నెల 27న రాజస్థాన్ పోలీసులు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో నిందితులు జోధ్పూర్లోని రాజస్థాన్ హైకోర్ట్ బెంచ్ను ఆశ్రయించగా పోలీసుల తీరుపై న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. ఈ ఏడాది జూలై 1కి ముందు జరిగిందని చెబుతున్న ఉదంతంపై బీఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధమని తేల్చిచెబుతూ అక్టోబరు 19న స్పష్టమైన తీర్పునిచ్చింది. బరి తెగించి అక్రమ కేసులు..పార్లమెంట్ చట్టాలు, న్యాయస్థానం తీర్పులు ఇంత విస్పష్టంగా చెబుతున్నా చంద్రబాబు సర్కారు నిర్భీతిగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఈ ఏడాది జూలై 1వతేదీకి ముందు సోషల్ మీడియాలో పెట్టారని చెబుతున్న పోస్టులపై ప్రస్తుతం కేసులు నమోదు చేస్తోంది. మూడు నాలుగేళ్ల క్రితం నాటి సోషల్ మీడియా పోస్టులపై కొత్త చట్టం పేరుతో అక్రమ కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం. వీటిపై ఐపీసీ సెక్షన్ అంటే ఐటీ చట్టం కింద మాత్రమే కేసు నమోదుకు ఆస్కారం ఉంటుంది. అది కూడా 41 ఏ కింద నోటీసు ఇచ్చి పంపించాలి. అరెస్ట్ చేయకూడదు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు 680 మందికి నోటీసులు ఇవ్వగా 176 మందిపై అక్రమ కేసులు నమోదయ్యాయి. 440 ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడంతోపాటు 55 మందిని అక్రమంగా అరెస్టు చేసి ఎమర్జెన్సీ నాటి నియంతృత్వ విధానాలతో అరాచకం సృష్టిస్తోంది. -
గౌతమ్ రెడ్డిని పరామర్శించిన అంబటి, మేరుగు, చంద్రశేఖర్ తదితరులు
-
వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బుగ్గన రాజేంద్రనాథ్
-
వైఎస్ జగన్ ఆదేశాలు.. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ప్రత్యేక బృందాలు
-
సోషల్ మీడియాకు అండగా ‘వైఎస్సార్సీపీ’ ప్రత్యేక బృందాలు
సాక్షి,అమరావతి: సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిల్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ తరపున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ఈ బృందాలు పనిచేస్తాయి. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ బృందాలు పనిచేస్తాయి. -
కొనసాగుతున్న ఫిర్యాదుల పరంపర
సాక్షి నెట్వర్క్: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ పలువురిపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలవారు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఫిర్యాదుల పరంపర గురువారం కూడా కొనసాగింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, టీటీడీ చైర్మన్పై పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులు అందిందే తడవుగా పోలీసులు కేసులు నమోదుచేసి చర్యలు చేపడుతున్నారు. సినీనటుడు పోసాని కృష్ణమురళిపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా పదులసంఖ్యలో ఫిర్యాదులు అందాయి. రెండుచోట్ల కేసు నమోదు చేశారు. ఈ పోస్టులకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నటి శ్రీరెడ్డిపై రెండు పోలీస్స్టేషన్లలో కేసు నమోదు చేశారు. బుధవారం అరెస్టు చేసిన ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. సజ్జల భార్గవ్రెడ్డి, మరో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నటుడు పోసానిపై.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, మంత్రి లోకేశ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, రామోజీరావు, టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడులను పోసాని అసభ్య పదజాలంతో దూషించారని పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. టీటీడీ, టీవీ–5లపై పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కొన్ని ఫిర్యాదుల్లో పార్టీల నేతలు, విలేకరులు ఆరోపించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పల్నాడు జిల్లా మాచర్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, అన్నమయ్య జిల్లా రాజంపేట, అనకాపల్లి జిల్లా మునగపాక, శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పాతపట్నం, కర్నూలు జిల్లా ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, నంద్యాల జిల్లా డోన్, బనగానపల్లె, బాపట్ల జిల్లా చీరాల, బాపట్ల, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్స్టేషన్లలో పోసానిపై ఫిర్యాదు చేశారు. పోసానిపై అందిన ఫిర్యాదు మేరకు విశాఖ వన్టౌన్, కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. నటి శ్రీరెడ్డిపై.. సినీనటి శ్రీరెడ్డిపై విశాఖపట్నం టూ టౌన్, విజయవాడ కృష్ణలంక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అర్బన్ పోలీస్స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. ఇద్దరికి రిమాండ్ తిరుపతి సబ్జైలులో రిమాండ్లో ఉన్న ప్రకాశం జిల్లా సీఎస్ పురం తనికెళ్లపల్లె గ్రామానికి చెందిన మునగాల హరీశ్వరరెడ్డిని తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసులు బుధవారం పీటీ వారెంట్తో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడిని గురువారం రాజమహేంద్రవరంలోని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్కు తరలించారు. గుంటూరులో బుధవారం అరెస్టు చేసిన పి.రాజశేఖర్రెడ్డిని గురువారం ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. జడ్జి రిమాండ్ విధించడంలో అతడిని జైలుకు తరలించారు. ఇద్దరి అరెస్టు కాకినాడ జిల్లా తొండంగి మండల ఉపాధ్యక్షుడు నాగం గంగబాబు, సోషల్ మీడియా కన్వీనర్ అడపా సురేష్ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.సజ్జల భార్గవ్, మరో ఇద్దరిపై అట్రాసిటీ కేసుజనసేన నేత ఫిర్యాదుతో అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్లో సోషల్మీడియా యాక్టివిస్టులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గత డిసెంబర్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, లోకేశ్, జనసేన అధినేత పవన్కళ్యాణ్లపై అనుచిత పోస్టులు పెట్టారని, ఈ విషయమై అడిగితే తనను కులం పేరుతో దూషించారని సిద్ధవటానికి చెందిన జనసేన నాయకుడు వాకమల్ల వెంకటాద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్రెడ్డి, సిరిగిరి అర్జున్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి పులివెందులకు బదిలీ చేసినట్లు సిద్ధవటం ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
Andhra Pradesh: ‘మండలి’లో మంటలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై శాసన మండలి అట్టుడికింది. కూటమి సర్కారు నిరంకుశ వైఖరి, అరాచక విధానాలపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే నెపంతో చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులను అరికట్టాలి.. నిరంకుశ రాజ్యం నశించాలి.. ఉయ్ వాంట్ జస్టిస్.. సేవ్ డెమొక్రసీ అంటూ నినదించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కించపరుస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కూటమి పార్టీలకు చెందిన కొందరు పెట్టిన అభ్యంతరకర పోస్టుల ప్లకార్డులను ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సభ్యులు ప్రదర్శించారు. యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ అరెస్టులపై చర్చకు అనుమతించాలని వైఎస్సార్సీపీ సభ్యులు మొండితోక అరుణ్కుమార్, తుమాటి మాధవరావు, పి.రామసుబ్బారెడ్డి వాయిదా తీర్మానాన్ని ఇవ్వగా మరో ఫార్మాట్లో తేవాలంటూ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు తిరస్కరించారు. దీనిపై చర్చకు అనుమతించాలంటూ పట్టుబట్టిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, తలశిల రఘురాం, వరుదు కళ్యాణి, కల్పలతారెడ్డి, పండుల రవీంద్రబాబు, తోట త్రిమూర్తులు, మహ్మద్ రుహుల్లా తదితరులు పోడియం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నారా లోకేశ్, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, మండలి చీఫ్విప్ పంచుమర్తి అనురాధ, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు దీనిపై జోక్యం చేసుకుంటూ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత చర్చకు పట్టుబట్టడం సరికాదన్నారు. దీనిపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ రాష్ట్రంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అనేక మంది యువకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని, దీనిపై సభలో ఖచ్చితంగా చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టారు. చర్చ కోసం వైఎస్సార్సీపీ సభ్యులు నిరసన తెలపడంతో సభ 34 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో చైర్మన్ మోషేన్రాజు సభను కొద్దిసేపు వాయిదా వేసి మళ్లీ కొనసాగించారు. డీఎస్సీ నోటిఫికేషన్ కాలయాపనపై చర్చించేందుకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని కూడా మండలి చైర్మన్ మోషేన్రాజు తిరస్కరించారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై చర్చకు డిమాండ్ చేస్తున్న సభ్యులు మా రాజీనామాలు ఆమోదించండి.. సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై చర్చించాలని వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన చేస్తున్న సమయంలోనే వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ రాజీనామాలు ఆమోదించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, టీడీపీ సభ్యులు కలసి వారిని ముందుకు తీసుకెళ్లడం గమనార్హం. ఆ ముగ్గురూ పోడియం పైకి వెళ్లి చైర్మన్ను కలసి తమ రాజీనామాలు ఆమోదించాలని విజ్ఞాపన పత్రాలు అందించారు. మీ రాజీనామాల అంశం పరిశీలనలో ఉందని, వాటిపై తర్వాత నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ స్పష్టం చేశారు. బడ్జెట్పై చర్చను అడ్డుకున్న మంత్రులు శాసన మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు బడ్జెట్పై మాట్లాడుతున్న సమయంలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీలు పదేపదే అడ్డుపడి రభస సృష్టించారు. వైఎస్సార్సీపీ సభ్యురాలు వరుదు కళ్యాణి బడ్జెట్పై చర్చను ప్రారంభించగానే మంత్రులు, కూటమి సభ్యులు చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. చర్చ పక్కదారి పడుతోందని, బడ్జెట్పైనే మాట్లాడాలంటూ చైర్మన్ సహనంతో పలుమార్లు కోరినా మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, డోలా బాలవీరాంజనేయస్వామి, అనిత, సవిత పదేపదే అడ్డు తగులుతూ చర్చ కొనసాగనివ్వకుండా చేశారు. విధిలేని పరిస్థితుల్లో చైర్మన్ పది నిమిషాలు సభను వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అధికార పార్టీ సభ్యులు అదే ధోరణి కొనసాగించారు. చర్చ పూర్తిగా తప్పుదోవ పట్టి గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.సర్వనాశనం చేసింది బాబే: బొత్సరాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబేనని, మళ్లీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి నాశనం చేశారని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో అందుకు అనుగుణంగా కేటాయింపులు జరపలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్సీపీ సభ్యులు కోరటాన్ని తప్పుబడితే ఎలా? అని ప్రశ్నించారు. హామీలు ఎలా అమలు చేస్తారు? ఎప్పుడు నెరవేరుస్తారు? అని అడిగితే అందులో తప్పు ఏముందన్నారు. తమ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక చర్చను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.ఏం జరిగిందంటే..?బడ్జెట్పై చర్చ సందర్భంగా వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి పారీ్టలు హామీ ఇచ్చినట్లుగా.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.18 వేలు.. రైతులకు రూ.20,000, మహిళలకు నెలకు రూ.1,500 లాంటి పథకాల కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. అయితే బడ్జెట్లో ఈ పథకాలకు ఒక్క పైసా కూడా కేటాయించలేదని చెబుతుండగా.. మంత్రి సవిత, అనిత, పయ్యావుల కేశవ్ ఆమెను పదేపదే అడ్డుకున్నారు. సభ్యులు ప్రసంగించకుండా మంత్రులు ఈ విధంగా పదేపదే అడ్డుపడటం సరికాదని ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. సభ్యుల ప్రసంగంపై అభ్యంతరాలు ఉంటే వాటిని నోట్ చేసుకొని సమాధానం ఇచ్చే సమయంలో వివరణ ఇస్తే సరిపోతుందన్నారు. ఈ సందర్భంగా సభలో ఏ విధంగా నడుచుకోవాలి? ఎలా మాట్లాడాలి? అనే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరగడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. అనంతరం వరుదు కళ్యాణి తిరిగి చర్చను ప్రారంభిస్తూ దీపం–2 పథకం కింద మూడు ఉచిత సిలెండర్లకు రూ.3,000 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో కేవలం రూ.800 కోట్లే కేటాయించారని ప్రస్తావిస్తుండగా.. మంత్రి అనిత నిలబడి ఆమెను అడ్డుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏమైందని కళ్యాణి మాట్లాడుతున్న సమయంలో మంత్రి డోలా వీరాంజనేయస్వామి లేచి నిలబడి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మీ నాయకుడు పారిపోయి ఇంట్లో పడుకున్నారు..! త్వరలో మీరూ పారిపోతారంటూ వైఎస్సార్సీపీ సభ్యులను రెచ్చగొట్టడంతో సభలో అలజడి చెలరేగింది. ఇంతలో హఠాత్తుగా నారా లోకేశ్ లేచి నిలబడి అసందర్భ చర్చను తెరపైకి తెచ్చారు. గౌరవ సభలో మా తల్లిని అవమానించారని, అందుకే ఆగ్రహంతో మాట్లాడుతున్నాం అంటూ ఊగిపోయారు. అయితే రికార్డుల్లో లేని విషయాలు, సభలో లేని వ్యక్తులను ప్రస్తావించి చర్చ చేయడం సరికాదంటూ బొత్స వారించారు. ఇరుపారీ్టల సభ్యులు వాగ్యుద్ధానికి దిగడంతో చైర్మన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. -
వైఎస్ జగన్ ఆదేశం.. వైఎస్సార్సీపీ ‘ప్రత్యేక టాస్క్ఫోర్స్’
తాడేపల్లి : ఏపీలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ‘ప్రత్యేక టాస్క్ఫోర్స్’ ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒకవైపు అక్రమ అరెస్టులు చేస్తూనే వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. దీనిని సమర్థవంతంగా ఎదుర్కోనేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక టాస్క్ఫోర్స్కు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, భరోసా కల్పించడం, ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి తాజాగా ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ ప్రత్యేక టాస్క్ఫోర్స్ పని చేయనుంది.జిల్లాలవారీగా టాస్క్ఫోర్స్ వివరాలుశ్రీకాకుళం : సీదిరి అప్పలరాజు, శ్యామ్విజయనగరం: బెల్లాని చంద్రశేఖర్, జోగారావువిశాఖపట్నం : భాగ్యలక్ష్మి, కెకె రాజుతూర్పు గోదావరి : జక్కంపూడి రాజా, వంగా గీతపశ్చిమ గోదావరి : కె.సునిల్కుమార్ యాదవ్, జయప్రకాష్ (జేపి)కృష్ణా : మొండితోక అరుణ్ (ఎమ్మెల్సీ), దేవభక్తుని చక్రవర్తిగుంటూరు : విడదల రజని, డైమండ్ బాబుప్రకాశం : టీజేఆర్ సుధాకర్బాబు, వెంకటరమణారెడ్డినెల్లూరు : రామిరెడ్డి ప్రతాప్రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి (ఎమ్మెల్సీ)చిత్తూరు : గురుమూర్తి (ఎంపీ), చెవిరెడ్డి మోహిత్రెడ్డిఅనంతపురం : కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రమేష్గౌడ్కడప : సురేష్బాబు, రమేష్యాదవ్కర్నూలు హఫీజ్ఖాన్, సురేందర్రెడ్డి -
అధికారంతోనే పచ్చ బ్యాచ్ స్వరం మారింది!
రాజకీయం అంటే నాలుక మడతేయడమేనా? బాబు మార్కు రాజకీయాలు చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం.. అధికారంలోకి రాగానే అవన్నీ మరచిపోయి సుద్దులు చెప్పడం! ఈ విషయంలో ఇప్పుడు బాబుకు పవన్ తోడైనట్టు కనిపిస్తోంది. నేనంటే నేను అన్న చందంగా మాటమార్చే విషయంలో ఇరువురూ పోటీ పడుతున్నారు కూడా. రాష్ట్రంలో అరాచకాలను కట్టడి చేయాల్సిన వీరే వాటిని ఉసిగొలుపుతున్నట్లుగా ఉందీ ప్రస్తుతం పరిస్థితి.ఆంధ్రప్రదేశ్లో ఇటీవలి కాలంలో సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు, అక్రమ కేసులు, అరెస్ట్లు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పోలీసు అధికారులను తమ చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్న బాబు అండ్ కో చట్టాలను అతిక్రమిస్తున్న తీరు దారుణంగా ఉంది. కేసులు, అరెస్ట్లను దాటి పోలీసులు వీరిపై నీచాతినీచంగా బూతులు తిడుతున్నారన్న వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబుల వ్యాఖ్యలకు ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ వైసీపీ అధినేత జగన్ తాము మళ్లీ అధికారంలోకి వస్తామని అప్పుడు ఇలా అకృత్యాలకు పాల్పడ్డ పోలీసు అధికారులు చట్ట ప్రకారం శిక్షకు గురవుతారని హెచ్చరించారు. కానీ.. ఈ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ వక్రీకరించి వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. ఐపీఎస్ అధికారులనే బెదిరిస్తున్నారా? అంటూ పవన్ జగన్ను విమర్శించే ప్రయత్నం చేశారు. సూమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు కూడా.సినీ నటుడిగా పవన్ పౌరుల హక్కుల కోసం పోరాడే హీరో పాత్రలో బోలెడు పోషించారు పవన్. రాజకీయ జీవితంలో మాత్రం వాటిని హరించేలా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు అల్లర్లు చేసినా, దొమ్మీలకు పాల్పడ్డ అసలు ఎలాంటి చర్యలూ తీసుకోరాదన్నట్టు వపన్ మాట్లాడిన విషయం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి మంత్రి రోజాపై జనసేన కార్యకర్తల దాటికి సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకుంటే పవన్ చేసిన హడావుడిని అందరూ చూసే ఉంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పవన్కు మద్దతుగా నిలిచారు.మంత్రిపై దాడి జరగడం ప్రభుత్వ తప్పు అన్నట్లు ప్రచారం చేశారు. ఇక స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయిన బాబుకు పవన్ వత్తాసు పలకడం.. శాంతి భద్రతల సమస్య రాకూడదన్న ఉద్దేశంతో ఆయన్ను అడ్డుకుంటే రోడ్డుపై పడుకుని యాగీ చేయడం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో ఉండే ఉంటుంది. ఒక దశలో చంద్రబాబు పోలీసులనే నేరుగా సంఘ విద్రోహశక్తులన్నట్టు చిత్రీకరించారు. వారిని బెదిరించిన సందర్భాలైతే లెక్కలేనన్ని. తండ్రి తీరు ఇలా ఉంటే.. ఆయన కుమారుడు లోకేష్ రెడ్బుక్ అంటూ పోలీసు అధికారులను పేర్లు చెప్పి మరీ బెదిరించిన వైనం చూశాం. పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తలు దొమ్మీకి దిగి పోలీసు వాహనాన్ని దగ్ధం చేయడమే కాకుండా.. వారిపై రాళ్లూ విసిరారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ కన్ను పోయింది. అంత జరిగినా అప్పట్లో పవన్ పోలీసులపై కనీస సానుభూతి చూపలేదు. అప్పట్లో ఈనాడు వంటి మీడియా సంస్థలు ఏ చిన్న గొడవ జరిగినా చిలువలు పలువలుగా చేసి కథనాలు రాయడం.. వాటిని అందుకుని టీడీపీ, జనసేన కార్యకర్తలు రెచ్చిపోవడం మనం చూశాం. ఎక్కడైనా మానభంగాలు జరిగితే ప్రభుత్వంపై వారు అప్పట్లో దారుణమైన విమర్శలు చేసేవారు.2017లో జరిగిన సుగాలి ప్రీతి హత్యోదంతం ఇందుకు ఒక ఉదాహరణ. తాము అధికారంలోకి వస్తే ఈ కేసురె మొదటగా తీసుకుంటామని నాటకీయంగా చెప్పారు. పవర్లోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఆ కేసును ఏమి చేశారో తెలియదు. రాష్ట్రంలో 35 వేల మంది మహిళలు తప్పిపోయినా ప్రభుత్వం ఏం చేస్తోందని, పోలీసులు ఏమయ్యారని కూడా అప్పట్లో పవన్ పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఊసే ఎత్తడం లేదు. మంగళిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో రోడ్ల ఆక్రమణలు తొలగింపుపై నిరసన తెలిపేందుకు పవన్ వెళుతూండగా పోలీసులు వారించారు. అయినాసరే ఆయన కారుపై కూర్చుని మరీ నాటకీయ ఫక్కీలో అలజడి సృష్టించారు. అయినా ఆనాటి ప్రభుత్వం పవన్ పై ఎప్పుడూ కేసులు పెట్టలేదు. అలాగే పోలీసులను పలుమార్లు దూషించిన చంద్రబాబు, లోకేష్లను కూడా ఏమీ చేయలేదు. ప్రస్తుత మంత్రి అచ్చన్నాయుడు గతంలో పోలీసులను ఎంత నీచంగా దూషించారో వినాలన్నా ఇప్పుడు సిగ్గేస్తుంది.ఇప్పుడు వీరందరికి అధికారం దక్కిందో లేదో.. స్వరం మార్చారు. పోలీసు శాఖలో ఎవరైనా రూల్ ప్రకారం వెళితే ఊరుకోవడం లేదు. వెంటనే బదిలీ చేస్తున్నారు. కడప ఎస్పి బదిలీనే ఇందుకు ఉదాహరణ. చంద్రబాబు నెల రోజులలో పోలీసులను సెట్ చేస్తానంటే ఇదా అని అంతా విస్తుపోతున్నారు. ఇప్పటికి 680 మందికి నోటీసులు ఇవ్వడం, 147 మందిపై కేసులు పెట్టడం, 49 మందిని అరెస్టు చేయడం అసాధారణ చర్యగా కనిపిస్తుంది. మరి వైసీపీ నేతలను దూషిస్తూ కామెంట్లు పెట్టిన ఒక్కరిపై కూడా కేసు రాలేదు. అధికారం ఉంటే ఏమైనా చేయవచ్చని ఈ ఉదంతాలు తేటతెల్లం చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం సాధ్యం కాదని, విద్యార్ధినులు, మహిళలపై దాడులను సమాజమే ఎదుర్కోవాలని ఆయన సూక్తి ముక్తావళి వల్లిస్తున్నారు. ఒకపక్క వైసీపీ వారిపై ఇంత అక్రమ కేసులు పెడుతూ, అత్యాచారాలు చేసిన వారిని పట్టుకోలేమన్న సంకేతం ఇచ్చే విధంగా పవన్ మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఈయన హోం మంత్రి అయితే మాత్రం ఒరిగేది ఉంటుంది? వైసీపీ పాలన అయితే ఏమి జరిగినా జగన్ బాధ్యత వహించాలి. కూటమి పాలనలో మాత్రం సమాజమే రక్షించుకోవాలన్న మాట. అధికారులను బెదిరిస్తే కేసులు అని అంటున్న పవన్ కళ్యాణ్ ముందుగా గతంలో తనతోసహా చంద్రబాబు, లోకేష్లు చేసిన దూషణలకు సుమోటోగా కేసు పెట్టించుకుంటారా? అంతెందుకు ప్రభుత్వాన్ని జనం బూతులు తిడుతున్నారని చెప్పిన సందర్భంలో పోలీసులను ఉద్దేశించి ఆయన ఏమన్నారో మర్చిపోతే ఎలా? చిన్నపిల్లలపై అత్యాచారం కేసులో పోలీసులు కులం చూసి చర్య తీసుకోవడం లేదని అన్నారంటే ఆ పోలీసు అధికారికి ఎంత అవమానం? కూటమి ప్రభుత్వానిది ఎంత అసమర్థత?వీటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి పచ్చ ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై దాడులు చేస్తోంది అన్నది వాస్తవం. తప్పు ఎవరు చేసినా తప్పే అన్నట్లు కాకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎదురయ్యే పరిణామాలకు ఆ శాఖ బాధ్యత కూడా వహించదా? ఒక మోసకారి నటి వ్యవహారంలో తప్పుడు కేసులు పెట్టారంటూ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు లెక్కకు మిక్కిలిగా పోలీసు అధికారులు ఇష్టారీతిన దౌర్జన్యాలకు దిగుతుంటే, బూతులు తిడుతుంటే, దానిపై ప్రతిపక్షంగా వైసీపీ అధినేత జగన్ స్పందించకుండా ఎలా ఉంటారు? మాట్లాడకపోతే ఆ పార్టీ క్యాడర్ నైతిక స్థైర్యం నిలబడుతుంందా? వైసీపీ నేత పేర్నినాని ఓపెన్ గా తుళ్లూరు డీఎస్పీ పేరు చెప్పి మరీ ఆయన చేస్తున్న ఘాతుకాలను మీడియాకు తెలిపారు.దానికి ఆ అధికారి ఏమి జవాబు ఇస్తారు? అలాగే ఆరబ్ దేశాలలో ఫలానా శిక్ష వేస్తారని చెబుతూ రాజును మించిన రాజభక్తి ప్రదర్శించిన మరో ఐపీఎస్ అధికారికి నాని సవాల్ విసిరారు. చట్ట ఉల్లంఘన చేసే పోలీసు అధికారులకు కూడా ఆయా దేశాలలో ఉరి శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు. వైసీపీ సోషల్ మీడియాను అంతం చేయడానికి, వారిని భయభ్రాంతులను చేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతాయని మరో నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు.గతంలో ఒక నాయకుడు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ టీవీలలో రోజూ మాట్లాడుతుంటే పోలీసులు కేసు పెట్టారు. ఆయనను అరెస్టు చేశారు. ఆ సందర్భంలో తనను పోలీసులు హింసించారని ఆయన ఆరోపించి, అసలు కేసును పక్కదారి పట్టించారు. నిజంగానే అప్పుడైనా ఆయనపై పోలీసులు దౌర్జన్యం చేసి ఉంటే ఎవరూ సమర్థించరాదు. అప్పట్లో ఒక నాయకుడికి అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టి నానా అల్లరి చేసిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఇన్ని వందల మంది మీద పోలీసులతో ఎలా దౌర్జన్యాలు చేయిస్తారు? దూషణలు చేయిస్తారు? అంటే ఈ దేశంలో పలుకుబడి, డబ్బు ఉన్నవారికి ఒక న్యాయం, సామాన్యుడికి మరో న్యాయం అన్నది మరోసారి రుజువు కావవడం లేదా? ఆయా వ్యవస్థల్లో ఇంతగా వివక్ష ఉంటే ఈ సమాజంలో అశాంతి ప్రబలకుండా ఉంటుందా? విద్వేషాలు మరింతగా పెరగవా? వాటి పరిణామాలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించవా? ఒక్కసారి కట్టు తప్పితే ఎంత ప్రమాదమో సీనియర్ నేత అయిన చంద్రబాబు నాయుడుకు తెలియకుండా ఉంటుందా? బహుశా ఈ పరిణామాలు, ఇన్ని విషయాలు సినీ నటుడు కూడా అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలియకపోవచ్చు. అందుకే ఆయన తన అధికారంతో ఎవరిని ఏమైనా చేయవచ్చని భ్రమపడుతున్నారు.నిజంగానే పవన్ అలా అరాచకంగా ప్రవర్తిస్తే, భవిష్యత్తులో తన మెడకే గుదిబండలు అవుతాయని గ్రహిస్తే మంచిది.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీలో అరాచకం.. ‘ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆగదు’
ఏపీలో కూటమి ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులతో వేధిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. పాత పాత పోస్టుల ఆధారంగా పోలీసులు కేసులు పెడుతున్నారు. మరికొన్ని చోట్ల.. వాళ్ల మనుషులతో ఫేక్ అకౌంట్ల నుంచి పోస్టులు వేయించి.. వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఇరికిస్తున్నారు. నోటీసులు ఇవ్వడం, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు.. శారీరకంగా హింసించడం లాంటివి చేస్తోంది. -
సోషల్ మీడియా కార్యకర్తలపై కొనసాగుతున్న పోలీసుల వేధింపులు
-
వీ వాంట్ జస్టిస్.. సేవ్ డెమోక్రసీ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నిరసన
అమరావతి, సాక్షి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమైన కాసేపటికే.. శాసనమండలిలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టుబట్టగా.. చైర్మన్ అందుకు నిరాకరించారు. దీంతో.. ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం చుట్టుముట్టి అరగంట పాటు నినాదాలతో తమ నిరసన తెలియజేశారు. సోషల్ మీడియా అరెస్టులతో పాటు డీఎస్సీపై పీడీఎఫ్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే చైర్మన్ కొయ్యే మోషేన్రాజు ఆ రెండు తీర్మానాలను తిరస్కరించారు. తమ వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనని చైర్మన్ను మండలిలో ప్రతిపక్ష నేత బొత్స కోరారు. అయినా అందుకు చైర్మన్ అంగీకరించలేదు. దీంతో.. పోడియం వద్దకు వచ్చి చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ‘‘వీ వాంట్ జస్టిస్..’’, ‘‘సేవ్ డెమోక్రసీ’.. అంటూ నినాదాలు చేస్తుండగా.. మరోవైపు కూటమి ఎమ్మెల్సీలు వాళ్లతో వాగ్వాదానికి దిగి రెచ్చగొట్టేందుకు యత్నించారు. కానీ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాత్రం సోషల్ మీడియా పోస్టుల ప్రతులను చైర్మన్కు చూపిస్తూ నినాదాలు కొనసాగించారు. చేసేది లేక ఆ నినాదాల నడుమే ఏపీ మంత్రులు మాట్లాడేందుకు యత్నించారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొనగా.. మండలిని కాసేపు వాయిదా వేశారు చైర్మన్. ఇదీ చదవండి: చావు లెక్కలు నవ్వుతూ.. -
YSRCP కార్యకర్తలపై ఆగని వేధింపులు
-
బాబుకి ఓపెన్ చాలెంజ్ విసిరిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ అక్రమాలు, వైఫల్యాలు, మోసాలపై ప్రశ్నించే స్వరం విన్పించకూడదనే దురాలోచనతో సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ, అక్రమంగా నిర్బంధిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండి పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ రాజకీయంగా ఆయనను వ్యతిరేకించే వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా ఎవరినీ అరెస్టు చేయడం లేదన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..» దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో 680 మందిపై సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. 147 మందిపై కేసులు పెట్టి.. 49 మందిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు మోసాలను సోషల్ మీడియా వేదికగా నేను పోస్ట్ చేస్తాను. వైఎస్సార్సీపీ శ్రేణులంతా ఇదే పోస్టు పెట్టాలని పిలుపునిస్తున్నా. ఎంత మందిపై కేసులు పెడతారో చూద్దాం. ఆ కేసులేవో నాతోనే మొదలుపెట్టండి. .@ncbn గారు .. ప్రజలకు సూపర్సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు.నీవు చీటర్వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా?ఆడబిడ్డ నిధి:18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాలి. ఎంత…— YS Jagan Mohan Reddy (@ysjagan) November 13, 2024» ఒక వైపు చంద్రబాబు హయాంలో రాష్ట్రం కుదేలైపోయే పరిస్థితి కన్పిస్తోంది. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రతీ వర్గాన్ని మోసం చేస్తున్నారు. మహిళలు, చిన్నారుల పరిస్థితి ఎప్పుడూ చూడని విధంగా ఉంది. ఏకంగా 110 మంది మహిళలు, చిన్నారులపై ఈ ఐదున్నర నెలల్లోనే అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి. » ఇందులో 11 మంది చనిపోయారు. నిన్న (మంగళవారం) కూడా మూడు ఘటనలు జరిగాయి. రాష్ట్రంలో ఐదున్నర నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 177 హత్యలు.. 500కు పైగా హత్యాయత్నాలు జరిగాయి. మహిళలపై అన్యాయాలు, అత్యాచారాలకు అంతే లేకుండా పోయింది.ఇదీ చదవండి: బూచిగా అప్పుల భూతం.. సూపర్ సిక్స్కు ఎగనామం» బడ్జెట్ చూస్తే మోసం.. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం విఫలమైన పరిస్థితి. పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల బకాయిలు రూ.2,300 కోట్లు దాటాయి. వాళ్లు రోడ్డెక్కుతున్నారు. పట్టించుకోవడం లేదు. 108, 104 సిబ్బంది ధర్నా చేస్తున్నారు. అతలాకుతలమైపోయిన పరిస్థితుల్లో సూపర్ సిక్స్, సూపర్ సెవన్ మోసం.. ఇలాంటి పరిస్థితులను నిలదీస్తే.. ప్రశ్నించే గొంతును నొక్కేందుకు అక్రమ కేసులు బనాయిస్తూ అక్రమంగా నిర్బంధిస్తూ ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. -
ప్రభుత్వ పెద్దలను మెప్పించేందుకే..
సాక్షి, అమరావతి : ప్రభుత్వ పెద్దలను సంతోష పెట్టేందుకు రాష్ట్రంలో పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరాం హైకోర్టుకు తెలిపారు. ఇలా చేయడంలో ప్రభుత్వ విధానమే అణచివేత ధోరణిలా ఉందని, దానినే పోలీసులు అనుసరిస్తున్నారన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు ఇష్టమొచ్చినట్లు కేసులు నమోదుచేసి అరెస్టుచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా పోలీసులు ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్నారని, ఈ విషయంలో పోలీసులపై విచారణకు ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు పోలా విజయ్బాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. మతం, కులం, లింగం, పుట్టిన ప్రాంతం తదితరాల ఆధారంగా వర్గాల మధ్య శతృత్వం సృష్టిస్తూ సెక్షన్–153ఏ కింద కేసులు పెడుతున్నారన్నారు. ఈ సెక్షన్ కింద కేసు నమోదు చెల్లదని.. ఇదే హైకోర్టు గతంలో తీర్పునిచ్చిందన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రజల విమర్శలను తట్టుకోలేక సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతున్నారని శ్రీరాం వివరించారు. ప్రజల హక్కులను కాలరాస్తున్నారు..ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. కేసులపై అభ్యంతరం ఉంటే దానిపై న్యాయపోరాటం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించింది. ఆ పనే చేస్తున్నారని, పోలీసుల అక్రమ నిర్బంధాలపై హేబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని శ్రీరాం తెలిపారు. తప్పుడు కేసుల ద్వారా ప్రజల హక్కులను పోలీసులు హరిస్తున్నారన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ప్రజలు భయపడేలా చేస్తున్నారని వివరించారు. ప్రతీ దశలోనూ పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వ దన్నుతోనే పోలీసులు ఇంత అరాచకానికి పాల్పడుతున్నారని ఆయన ధర్మాసనానికి వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించడాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో తప్పుపట్టిందన్నారు. ఈ పిల్ దాఖలు చేసిన తరువాత పోలీసులు నిర్ధిష్టంగా ఒకే తరహా కేసులు పెడుతున్నారని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేసుల నమోదు తప్పుకాదు..ధర్మాసనం స్పందిస్తూ.. సోషల్ మీడియాలో అసభ్య, అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదు చేయడం తప్పుకాదని హైకోర్టు అభిప్రాయపడింది. తమపై (న్యాయమూర్తులు) కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని గుర్తుచేసింది. ఇలాంటి వారిపై కేసులు పెట్టకుండా పోలీసులను నియంత్రించలేమని తెలిపింది. సోషల్ మీడియా ఉన్నది ఇష్టమొచ్చినట్లు మాట్లాడటానికి, పోస్టులు పెట్టడానికి కాదని వ్యాఖ్యానించింది. అలాంటి పోస్టులు పెట్టే వారిని చట్టం ముందు నిలబెట్టడంలో తప్పేముందని ప్రశ్నించింది. కేసులపై అభ్యంతరం ఉంటే వాటిని కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లు దాఖలు చేసుకోవాలని సూచించింది. అంతేతప్ప.. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఈ విషయంలో తగిన ఉత్తర్వులు జారీచేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. -
కొనసాగుతున్న అరాచకపర్వం
సాక్షి నెట్వర్క్: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి, బుధవారం పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కొందరిని కోర్టుల్లో హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం జైళ్లకు తరలించారు. ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు.. ఎక్కడికి తీసుకెళుతున్నారు.. అనే విషయాలను కుటుంబసభ్యులకు కూడా చెప్పడంలేదు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, కుటుంబసభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులు అందిందే తడవు పోలీసులు అత్యుత్సాహంగా కేసులు నమోదుచేసి అరెస్టు చేస్తున్నారు. మంగళవారం రాత్రి, బుధవారం తొమ్మిదిమందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని రిమాండ్ నిమిత్తం జైళ్లకు తరలించారు.ఒకరిని అరెస్టుచేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. దర్శకుడు రాంగోపాల్వర్మ సహా ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. నటులు పోసాని, శ్రీరెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కాకినాడ జిల్లాలో జగ్గంపేటకు చెందిన కాపారపు వెంకటరమణను అరెస్టు చేసిన సీఐ శ్రీనివాస్రావు కాకినాడ కోర్టులో హాజరుపరిచి, అనంతరం రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డిలను మంగళవారం ఆమదాలవలస కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం రిమాండ్ నిమిత్తం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సబ్జైలుకు తరలించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన పఠాన్ అయూబ్ఖాన్, పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన అన్నంగి నరసింహస్వామి, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ముదిగుబ్బకు చెందిన జనికుల రామాంజనేయులుపై కందుకూరులోను, అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన కురమయ్యగారి హనుమంతరెడ్డిపై నెల్లూరు జిల్లా సంగం పోలీస్స్టేషన్లోను కేసులు నమోదు చేశారు. రాయవరం ప్రాంతానికి చెందిన ఖండవిల్లి సునీల్కుమార్, కోరుకొండకు చెందిన లగవత్తుల శివసత్యకుమార్, కనిగిరికి చెందిన హరీశ్వర్రెడ్డి, కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కాకరపర్తి శ్రీనివాస్పై విశాఖపట్నంలో కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆయతపల్లికి చెందిన ప్రసాద్రెడ్డిని బుధవారం మఫ్టీలో వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో అరెస్టు చేసిన నకిరేకల్కు చెందిన పి.రాజశేఖర్రెడ్డిని నూజివీడు తరలించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పశ్చిమగోదావరి జిల్లా కో–కన్వినర్లు పాటూరి దొరబాబు, కమతం మహేష్లకు 41ఏ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. శ్రీరెడ్డిపై కేసు నమోదుటీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోషల్ మీడియా యాక్టివిస్ట్, సినీనటి మల్లిడి శ్రీరెడ్డిపై మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలోని బొమ్మూరు పొలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపై అనకాపల్లి పోలీసులకు టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రత్నకుమారి మరో ఫిర్యాదు చేశారు. రాంగోపాల్వర్మకు నోటీసులు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్స్టేషన్ ఎస్ఐ శివరామయ్య బుధవారం హైదరాబాద్లో సినీ దర్శకుడు రాంగోపాల్వర్మకు నోటీసు అందించారు. ఈనెల 19న మద్దిపాడు స్టేషన్కు రావాల్సిందిగా అందులో కోరారు. వ్యూహం చిత్రం నిర్మించే సమయంలో చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేశ్, బ్రాహ్మణిని అవమానించేలా పోస్టింగ్లు పెట్టారంటూ రెండురోజుల కిందట మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ కేసు నమోదు చేశారు. పోసానిపై ఫిర్యాదులుసినీనటుడు పోసాని కృష్ణమురళీ టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును అసభ్య పదజాలంతో దూషించారని టీడీపీ నేతలు బాపట్ల సీఐ అహ్మద్జానీకి ఫిర్యాదు చేశారు. సీఎం తదితరులపై అసభ్య పోస్టులు పెట్టిన పోసానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నేతలు గుంటూరు, నరసరావుపేటల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
LIVE : వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
అరెస్ట్ పై.. పట్నం నరేందర్ రెడ్డి భార్య.. కీలక వ్యాఖ్యలు
-
మేం ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడం లేదు : అంబటి రాంబాబు
-
అయ్యా డీజీపీ ఎక్కడ ఉన్నారు ? అంబటి ఫైర్
-
ఇవాళ మరో కార్యకర్త పోలీసులు అరెస్ట్ చేశారు : అంబటి