Sreeja
-
జైపూర్ పేట్రియాట్స్ జట్టులో ఆకుల శ్రీజ, స్నేహిత్... ఆగస్టులో యూటీటీ లీగ్...
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్ ఐదో సీజన్ కోసం మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు 48 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. ఇందులో 16 మంది విదేశీ క్రీడాకారులు. భారత నంబర్వన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ, తెలంగాణకే చెందిన యువతార సూరావజ్జుల స్నేహిత్ జైపూర్ పేట్రియాట్స్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. ప్రపంచ 25వ ర్యాంకర్ శ్రీజ గత నెలలో నైజీరియా లో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో సింగిల్స్, డబుల్స్ టైటిల్స్ నెగ్గింది. ఆగస్టు 22 నుంచి సెపె్టంబర్ 7 వరకు చెన్నైలో జరిగే యూటీటీ లీగ్లో అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్, చెన్నై లయన్స్, దబంగ్ ఢిల్లీ టీటీసీ, గోవా చాలెంజర్స్, జైపూర్ పేట్రియాట్స్, పీబీజీ బెంగళూరు స్మాషర్స్, పుణేరి పల్టన్, యు ముంబా జట్లు పాల్గొంటాయి. -
శిరీష్ భరద్వాజ్ మరణానికి కారణం చెబుతూ తల్లి ఎమోషనల్
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ (39) అనారోగ్యంతో కొద్దిరోజుల క్రితం మృతి చెందారు. ఆయన మృతి గురించి పలు రకాలుగా రూమర్స్ వచ్చాయి. అయితే, తాజాగా ఆమె అమ్మగారు పలు ఆసక్తికరమైన విషయలాను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. భరద్వాజ్ లంగ్స్ డ్యామేజ్ వల్ల చనిపోయారని వచ్చని రూమర్స్లో నిజం లేదని ఆమె తెలిపారు.శిరీష్ భరద్వాజ్ ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ (గుండె ఆగిపోవడం) వల్ల చనిపోయాడని ఆమె ఇలా తెలిపారు. 'కొన్నేళ్లుగా మేము హైదరాబాద్లోనే ఉంటున్నాం. చికిత్స కోసం శిరీష్ భరద్వాజ్ను జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో చేరిపించాం. మే 13న భరద్వాజ్ పుట్టినరోజు ఉంది. సెలబ్రేషన్ చేసుకునేందుకు దుబాయ్ వెళ్లాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురికావడం జరిగింది. దీంతో మే 17న అపోలో ఆసుపత్రిలో చేర్పించాము. సుమారు 30రోజుల పాటు అక్కడ చికిత్స తీసుకుంటున్న క్రమంలో కార్డియాక్ అరెస్ట్ వల్ల జూన్ 19న మరణించాడు. కానీ, కొన్ని మీడియా సంస్థలు భరద్వాజ్ మరణం గురించి తప్పుగా రాశారు. అందులో ఎలాంటి నిజం లేదు.శ్రీజ ఎలా ఉంటుందంటే..2007లో శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దలకు తెలియకుండా జరిగిన ఈ వివాహం అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా శ్రీజ గురించి భరద్వాజ్ అమ్మగారు ఇలా చెప్పారు. శ్రీజ చాలా మంచి అమ్మాయి. అందరూ అనుకున్నట్లుగా ఆమెను తప్పు పట్టాల్సిన పనిలేదు. వారి పెళ్లి జరిగి చాలా ఎళ్లు అయింది. వాళ్లు ఎందుకు విడిపోయారు అనేది నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ, శ్రీజ- భరద్వాజ్లకు జన్మించిన కూతురు నివృత్తి మాత్రం తండ్రి మాదిరే పోలికలు ఉన్నాయి. ఆ పాపను చూస్తే చాలు భరద్వాజ్ను చూసినట్లే ఉంటుంది. భరద్వాజ్ మరణం తర్వాత మెగాస్టార్ కుటుంబానికి సమాచారం ఇచ్చాం. కానీ, వారిలో ఎవరూ అంత్యక్రియలకు కూడా రాలేదు. నా వరకు అయితే నా మనవరాలిని (నివృత్తి) చూడాలని ఉంటుంది. వారు పెద్దవాళ్లు కదా..! వాళ్ల ఇష్టం ఆ అవకాశం కల్పిస్తారో లేదో.. అందరి మాదిరి నా మనవరాలిని చూడాలని నాకు ఉంటుంది. నా భర్త లాయర్గా పనిచేసేవారు. 2016లో ఆయన కూడా మరణించారు. ఇప్పుడు నేను చిన్న అబ్బాయితో ఉంటున్నాను.మాకు ఎవరూ డబ్బు ఇవ్వలేదుశ్రీజ నుంచి భరద్వాజ్ రూ. 33 కోట్లు తీసుకున్నట్లు ఒకప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ అంశంపై ఆమె ఇలా స్పందించారు. 'మా కుటుంబంలో ఎవరూ డబ్బు తీసుకోలేదు. అంత డబ్బు తీసుకుంటే.. మేము అద్దె ఇంట్లో ఎందుకు ఉంటాం..? దానిని చాలామంది తప్పుగా చెప్పుతున్నారు. ఆ కుటుంబం నుంచి మాకు డబ్బు ఇస్తామని చెప్పిన మాట నిజమే.. కానీ, మేము వద్దని చెప్పాం. ఆ డబ్బును మా మనవరాలు (నివృత్తి) కోసం ఉపయోగించమని చెప్పాం.' అంటూ భరద్వాజ్ అమ్మగారు ఎమోషనల్ అయ్యారు. తెలంగాణ ఆర్టీసీలో మేనేజర్గా పనిచేసి రిటైర్డ్ అయినట్లు ఆమె అన్నారు. వారి మనవరాలు నివృత్తిని చూడలనే కోరిక ఉన్నట్లు ఆమె పదేపదే ఎమోషనల్గా చెప్పారు. -
శిరీష్ భరద్వాజ్ కన్నుమూత
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ (39) అనారోగ్యంతో మృతి చెందారు. 2007లో శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దలకు తెలియకుండా జరిగిన ఈ వివాహం అప్పట్లో సంచలనం రేపింది. అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని 2012లో శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం వీరిద్దరి మధ్య విభేదాలు పెరగడంతో 2014లో విడాకులు తీసుకున్నారు.శ్రీజతో విడిపోయిన తర్వాత 2019లో హైదరాబాద్కు చెందిన డాక్టర్ విహనను శిరీష్ భరద్వాజ్ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు చెన్నైలో ఉన్నట్లు సమాచారం. అయితే, కొంత కాలంగా శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన లంగ్స్ డ్యామేజ్ కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొంత సమయం క్రితం మృతి చెందారు. 2017లో శిరీష్ భరద్వాజ్ బీజేపీలో చేరారు. కానీ, పార్టీ ప్రచార కార్యక్రమాలలో ఆయన ఎక్కడ కనిపించలేదు.ఆర్య సమాజ్లో వివాహంకొణిదెల శ్రీజకు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. ఆమె చదువుకుంటున్న రోజుల్లో ప్రతిరోజూ ఎల్బీ స్టేడియం వరకు వెళ్లి ప్రాక్టీస్ చేసేది. ఆమె ప్రతిభను చూసిన వారందరూ కూడా నేషనల్ రేంజ్కు చేరుకుంటుందని ఆశించారు. కానీ, ఎవరూ ఊహించని రీతిలో అక్టోబరు 17, 2007న శిరీష్ భరద్వాజ్ని ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటికి ఆమె వయసు 19 ఏళ్లే కావడంతో చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం చెప్పారు. వారందరినీ కాదని ఆర్య సమాజ్లో వివాహం చేసుకుని మీడియా ముందుకు వచ్చారు. శ్రీజ మేజర్ కాగానే ఆమె పేరుతో రూ. 32 కోట్లు చిరంజీవి డిపాజిట్ చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ డబ్బును కాజేసేందుకే పెళ్లి పేరుతో ఆమెను ట్రాప్లో పడేశాడని భరద్వాజ్పై ఆరోపణ ఉంది. శ్రీజ పేరుతో బేగంపేటలో ఉన్న ఒక ఫ్లాట్ను కూడా అప్పట్లో భరద్వాజ్ తీసుకున్నారట. వివాహం తర్వాత శిరీష్ భరద్వాజ్ కరెక్ట్ వ్యక్తి కాదని శ్రీజ ఆరోపించింది. తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
లవ్ మ్యారేజ్.. పిల్లలెప్పుడని ఒత్తిడి తెచ్చారు.. ఎనిమిదేళ్లకు..
పెళ్లయిన ప్రతి జంటకు ఎదురయ్యే ప్రశ్న.. ఏదైనా విశేషముందా? ఈ మాట వినీవినీ విసుగెత్తిపోయే జంటలెన్నో! కొందరు దంపతులు తమ ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకుంటారు. మరికొందరికేమో ప్రెగ్నెన్సీ వచ్చినా అది నిలవదు.. మిస్క్యారేజీ(గర్భస్రావం) అవుతుంటుంది. మలయాళ బుల్లితెర నటి సెంథిల్ శ్రీజకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి.ప్రెగ్నెన్సీ నిలవలేదుపదవ పెళ్లి రోజు సందర్భంగా శ్రీజ భర్త సెంథిల్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అందులో ఆయన మాట్లాడుతూ.. తనకు రెండు మూడుసార్లు గర్భస్రావమైంది. మేము ఏ విషయమైనా ఇంట్లోవాళ్లతో షేర్ చేసుకుంటాం. అలా ప్రెగ్నెన్సీ గురించి చెప్పి వాళ్లు సంతోషించేలోపే మిస్క్యారేజ్ అయిందని చెప్పేవాళ్లం. పిల్లల కోసం ఎంత ఎదురుచూశామో! మా కలలు నీరుగారిపోయిన సమయంలో తను మరోసారి ప్రెగ్నెంట్ అయింది. అంతకుముందు కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ నిలవలేదు కాబట్టి అప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోలేదు.ఈసారి కూడా..ఒకవేళ ఈసారి కూడా గర్భం నిలవకపోతే పిల్లలు లేరని బాధపడకూడదని శ్రీజ నాతో అంది. కానీ మా కన్నా ముందు చుట్టుపక్కల వారి బాధ భరించలేకపోయాం. ఎప్పుడూ దాని గురించే అడుగుతూ ఒత్తిడికి గురి చేసేవారు. మా అదృష్టం కొద్దీ ఆ ప్రెగ్నెన్సీ నిలబడి దేవ్ జన్మించాడు. పెళ్లైన కొత్తలో మా ఇద్దరికీ కొంత కన్ఫ్యూజన్ ఉండేది. పెళ్లికి ముందు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. కానీ వివాహం తర్వాత మాత్రం ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం కొంత తగ్గిపోయింది. కొంతకాలం తర్వాత మళ్లీ మంచి స్నేహితులుగా మారిపోయాం. ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటున్నాం. మొదటి మూడేళ్లు..లవ్ మ్యారేజ్ అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లయినా సరే.. మొదటి మూడేళ్లు ఎలాగోలా మ్యానేజ్ చేసుకుంటే తర్వాత జీవితమంతా సాఫీగా ఉంటుంది. మేము ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉండేవాళ్లం. బాబు పుట్టాక పోట్లాడుకునేంత తీరిక దొరకడం లేదు అని చెప్పుకొచ్చాడు. సెంథిల్, శ్రీజ.. సూపర్ హిట్ తమిళ సీరియల్ 'శరవణన్ మీనాక్షి'లో కలిసి నటించారు. ఈ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2023లో దేవ్ అనే కుమారుడు జన్మించాడు.చదవండి: 12 ఏళ్ల క్రితం.. చెప్పులేసుకుని ఇక్కడ నిలబడ్డా.. వెయ్యి రూపాయలతో.. -
విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తెలుగువారికి సుపరిచితమే. 2016లో శ్రీజ.. నటుడు కళ్యాణ్ దేవ్ను వివాహాం చేసుకుంది. ఈ జంటకు 2018లో ఓ కూతురు కూడా జన్మించింది. అయితే, పలు విభేదాల కారణంగా ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగానే ఉంటున్నారు. వీరి ముద్దుల కూతురు నవిష్క వారంలో కొద్ది రోజులు మాత్రమే కల్యాణ్ దేవ్ వద్ద ఉంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే శ్రీజ నెటిజన్లకు టచ్లోనే ఉంటుంది.విడాకుల అంశం గురించి శ్రీజ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ స్టోరీ పోస్ట్ చేసింది. కానీ ఆమె తన భర్తతో విడాకుల గురించి రియాక్ట్ కాలేదు. సోషల్ మీడియా ద్వారా ఓ అమ్మాయి ది ఆంగ్రీ థెరపిస్ట్ అనే అకౌంట్కు ఇలా ప్రశ్న పంపింది. 'నా భర్తకు విడాకులు ఇవ్వాలని ఉంది. కానీ, నా భర్తే ఈ విషయంలో అడ్డు పడుతున్నాడు. తన మీద ప్రేమ ఉంటే విడాకులు ఇవ్వద్దని కోరుతున్నాడు. ఇప్పుడేం చేయాలి..?' అని అడిగింది. ఇందుకు సమాధానంగా వాళ్లు.. ఆయనతో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారా లేదా అనే ప్రశ్న మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి అంటూ చెప్పుకొచ్చారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ అంశంలో ఇతరుల ప్రమేయం లేకుండా మీరే నిర్ణయం తీసుకోవాలని వారు సూచించారు.ఈ క్రమంలో విడాకుల విషయంపై ఆ అమ్మాయికి వారు ఇలా సూచించారు. 'బబుల్ బాత్ చేయడం, స్పాకి వెళ్లడం, నచ్చిన డ్రెస్సులు కొనుక్కోవడం, చక్కగా రెడీ కావడం, మీకు నచ్చిన గిఫ్టులు మీరే కొనుక్కోవడం అనేది సెల్ఫ్ లవ్. ఈ విషయంలో మళ్లీ ఒక్కసారి ఆలోచించండి. సెల్ప్ కేర్ వర్సెస్ సెల్ఫ్ లవ్ అనే పోరాటంలో మనల్ని మనం ప్రేమించుకునే దమ్ము, ధైర్యం మీకుందా..?' అని ఆ యువతితో వారు చెప్పుకొచ్చారు. ఈ మెసేజ్లను శ్రీజ కూడా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. గతంలో కూడా శ్రీజ సెల్ఫ్ లవ్ అంటూ పలు పోస్టులు పెడుతుండేది. దీనినిబట్టి చూస్తే భవిష్యత్లో ఎవరితోనూ ప్రేమలో పడేది ఉండదని ఆపై పెళ్లి చేసుకునే ఛాన్స్ కూడా లేదన్నట్లుగా ఆమె మెసేజ్లు ఉన్నాయని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.వ్యాపారంలో శ్రీజ తొలి అడుగుకొద్దిరోజుల క్రితం శ్రీజ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. స్టూడియో అనంత పేరుతో హైదరాబాద్లో ఓ ఫిట్నెస్ సెంటర్ను ఆమె ప్రారంభించింది. తాను ఇలా వ్యాపార రంగంలోకి రావడం, ఫిట్నెస్ సెంటర్లో భాగం కావడం థ్రిల్లింగ్గా ఉందంటూ గతంలో శ్రీజ తెలిపింది. ఈ ఫిట్నెస్ సెంటర్లో జిమ్, యోగా కూడా ఉంటాయని ఆమె చెప్పింది. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
భారత నంబర్వన్గా శ్రీజ
న్యూఢిల్లీ: రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల సింగిల్స్ నంబర్వన్ ర్యాంకర్గా అవతరించింది. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) తాజా ర్యాంకింగ్స్లో శ్రీజ ఒక స్థానం మెరుగుపర్చుకొని 38వ ర్యాంక్లో నిలిచింది. ఇప్పటి వరకు భారత నంబర్వన్గా ఉన్న మనిక బత్రా రెండు స్థానాలు పడిపోయి 39వ ర్యాంక్కు చేరుకుంది. భారత్ నుంచి యశస్విని 99వ ర్యాంక్లో, అర్చన కామత్ 100వ ర్యాంక్లో ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న 25 ఏళ్ల శ్రీజ ఈ ఏడాది నిలకడగా రాణిస్తూ ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సర్క్యూట్లో రెండు టైటిల్స్ సాధించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్లో ఆచంట శరత్ కమల్తో కలిసి శ్రీజ మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో శరత్ కమల్ 37వ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. సత్యన్ జ్ఞానశేఖరన్ 60వ స్థానంలో, మానవ్ ఠక్కర్ 61వ స్థానంలో, హర్మీత్ దేశాయ్ 64వ ర్యాంక్లో ఉన్నారు. హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ 147వ ర్యాంక్లో నిలిచాడు. -
గ్రూప్ దశలోనే శ్రీజ, మనిక నిష్క్రమణ
మకావు: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి మహిళాక్రీడాకారిణులు మనిక బత్రా, ఆకుల శ్రీజలకు నిరాశ ఎదురైంది. వీరిద్దరు గ్రూప్ దశలోనే నిష్క్రమించారు. మొత్తం 48 మంది క్రీడాకారిణులను మొత్తం 16 గ్రూప్లుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో ముగ్గురికి చోటు క ల్పించారు. 16 గ్రూప్ల్లో టాపర్గా నిలిచిన వారు నాకౌట్ దశ ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. గ్రూప్–2లో ఢిల్లీ అమ్మాయి మనిక, గ్రూప్–4లో తెలంగాణ ప్లేయర్ శ్రీజ రెండో స్థానంలో నిలిచారు. నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ల్లో ప్రపంచ 37వ ర్యాంకర్ మనిక, ప్రపంచ 39వ ర్యాంకర్ శ్రీజ ఓడిపోయారు. బుధవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లలో మనిక 6–11, 4–11, 9–11, 4–11తో ప్రపంచ రెండో ర్యాంకర్ మాన్యు వాంగ్ (చైనా) చేతిలో... శ్రీజ 4–11, 4–11, 15–13, 2–11తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ మెంగ్ (చేతిలో) ఓటమి పాలయ్యారు. -
అత్తింటి ఆరళ్లకు ముగ్గురు బలి
కరీంనగర్ రూరల్: అదనపు కట్నం కోసం అత్తింటివేధింపులను తట్టుకోలేక ఏడాది బిడ్డకు విషగుళికలు ఇచ్చి చంపిందా తల్లి. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని తట్టుకోలేక మృతురాలి తల్లి సైతం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకేరోజు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతితో కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో తీరని విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. బొమ్మకల్ గ్రామ పంచాయతీ విజయ్నగర్కాలనీలో ఉంటున్న ఉపాధ్యాయ దంపతులు గద్దె వెంకటేశ్వరచారి– జయప్రద(55) తమ చిన్న కూతురు శ్రీజ(25)కు మూడేళ్లక్రితం వరంగల్ జిల్లా మొగ్ధుంపూర్కు చెందిన నరేశ్తో కట్నకానుకలతో వివాహం జరిపించారు. ఏడాదిపాటు సక్రమంగా కాపురం చేసిన నరేశ్... కొడుకు ఆర్యన్(1) పుట్టాక శ్రీజను అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. అత్తమామలు సుజాత–కేశవచారి హింసించడంతో శ్రీజ గత నెల 29న బొమ్మకల్లోని పుట్టింటికి వచ్చింది. మంగళవారం ఉదయం 6గంటలకు కొడుకు మొదటి బర్త్డే గురించి నరేశ్కు శ్రీజ ఫోన్ చేయడంతో అత్తమామలు, భర్త కలిసి తీవ్రంగా దూషించారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన శ్రీజ క్రిమిసంహారక మాత్రలను కొడుకు ఆర్యన్కు తాగించి ఆ తర్వాత తానూ వేసుకుంది. అపస్మారకస్థితిలో పడి ఉన్న తల్లి, కొడుకులను జయప్రద, వెంకటేశ్వరచారి అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బిడ్డ మృతిచెందగా శ్రీజ చికిత్స పొందుతూ చనిపోయింది. కూతురు, మనవడి మృతిని తట్టుకోలేక జయప్రద ఇంటికివెళ్లి క్రిమిసంహారక మాత్రలు వేసుకుంది. ఆస్పత్రిలో చేరి్పంచగా పరిస్థితి విషమించి మృతి చెందింది. -
హోలీ వేడుకల్లో మెగా డాటర్స్.. గ్రీన్ శారీలో మిస్టర్ ప్రెగ్నెంట్ హీరోయిన్!
హోలీ వేడుకల్లో మెగా డాటర్స్ సందడి.. అలాంటి లుక్లో కనిపించిన టబు... అయోధ్య బాలరామున్ని దర్శించుకున్న అనన్య నాగళ్ల... గ్రీన్ శారీలో మిస్టర్ ప్రెగ్నెంట్ హీరోయిన్ హోయలు.. హోలీ వేడుకల్లో సందడి చేసిన మంచులక్ష్మి.. ప్రగ్యా జైస్వాల్ స్టన్నింగ్ పోజులు.. వేసవిలో చిల్ అవుతోన్న లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్ View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Roopa Koduvayur (@roopakoduvayur_9) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Tabu (@tabutiful) View this post on Instagram A post shared by Sushmita (@sushmitakonidela) -
క్వార్టర్స్లో స్నేహిత్
బీరుట్ (లెబనాన్): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ లెవెల్ టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్లు ఆకుల శ్రీజ, సూరావజ్జుల స్నేహిత్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్లో స్నేహిత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... మహిళల సింగిల్స్లో శ్రీజ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 166వ ర్యాంకర్ స్నేహిత్ 11–7, 11–8, 11–13, 15–13తో ప్రపంచ 58వ ర్యాంకర్ అహ్మద్ సలెహ్ (ఈజిప్ట్)ను బోల్తా కొట్టించాడు. శ్రీజ 10–12, 9–11, 11–2, 9–11తో భారత్కే చెందిన ఐహిక ముఖర్జీ చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో శ్రీజ–దియా చిటాలె (భారత్) ద్వయం 9–11, 8–11, 5–11తో చాంటల్ మాంట్జ్ (జర్మనీ)–ఇజాబెలా లుపులెస్కు (సెర్బియా) జోడీ చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. మిక్స్డ్ డబుల్స్లో స్నేహిత్–శ్రీజ (భారత్) జోడీ తొలి రౌండ్లో 4–11, 4–11, 8–11తో జియా లియాన్ ని–లుకా మ్లాడెనోవిచ్ (లక్సెంబర్గ్) జంట చేతిలో ఓటమి పాలైంది. భారత్కే చెందిన మానవ్ ఠక్కర్–అర్చన కామత్... మనుష్ షా–దియా చిటాలె జోడీలు మిక్స్డ్ విభాగం ఫైనల్లోకి దూసుకెళ్లాయి. -
ప్రిక్వార్టర్స్లో శ్రీజ, స్నేహిత్
బీరుట్ (లెబనాన్): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ లెవెల్ టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్లు ఆకుల శ్రీజ, సూరావజ్జుల స్నేహిత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో శ్రీజ 11–4, 11–3, 11–8తో అష్తారి మషిద్ (ఇరాన్)పై గెలిచింది. డబుల్స్ తొలి రౌండ్లో శ్రీజ–దియా చిటాలె (భారత్) జోడీ 12–10, 11–7, 14–12తో నథాలీ మర్చెటి–లిలూ మసార్ట్ (బెల్జియం) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో స్నేహిత్ 10–12, 11–5, 12–10, 11–3తో ఖాలిద్ ఖాదర్ (జోర్డాన్)పై, తొలి రౌండ్లో 11–6, 11–8, 11–6తో బాసిల్ హర్బ్ (లెబనాన్)పై గెలుపొందాడు. -
క్వార్టర్ ఫైనల్లో శ్రీజ పరాజయం
వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన జాతీయ మాజీ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. గోవాలో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీజ 5–11, 11–7, 6–11, 4–11తో చెంగ్ ఐ చింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. శ్రీజకు 2,500 డాలర్ల (రూ. 2 లక్షలు) ప్రైజ్మనీ, 105 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సింగిల్స్ చాంపియన్ శ్రీజ
టెక్సస్ (అమెరికా): రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ తన కెరీర్లో తొలి అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. శుక్రవారం ముగిసిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ టోర్నీలో 25 ఏళ్ల శ్రీజ మహిళల సింగిల్స్ విభాగంలో చాంపియన్గా అవతరించింది. ఫైనల్లో శ్రీజ 11–6, 18–16, 11–5తో ప్రపంచ 46వ ర్యాంకర్ లిలీ జాంగ్ (అమెరికా)పై గెలిచింది. విజేతగా నిలిచిన ప్రపంచ 94వ ర్యాంకర్ శ్రీజకు 650 డాలర్ల (రూ. 54 వేలు) ప్రైజ్మనీతోపాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టైటిల్ గెలిచిన క్రమంలో శ్రీజ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 37వ ర్యాంకర్ అమీ వాంగ్ (అమెరికా)పై 11–9, 9–11, 11–1, 6–11, 11–9తో గెలుపొందడం విశేషం. ‘చాలా సంతోషంగా ఉన్నా. నా కష్టానికి తగ్గ ఫలితం లభించింది. అంతర్జాతీయస్థాయిలో నాకిదే తొలి టైటిల్. నాకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులను ఓడించి విజేతగా నిలిచినందుకు ఆనందంగా ఉంది’ అని రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీజ వ్యాఖ్యానించింది. -
మెగా లిటిల్ ప్రిన్సెస్కు ఐదేళ్లు.. శ్రీజ పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తెలుగువారికి సుపరిచితమే. 2016లో శ్రీజ.. నటుడు కళ్యాణ్ దేవ్ను వివాహాం చేసుకుంది. ఈ జంటకు 2018లో ఓ కూతురు కూడా జన్మించింది. అయితే ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగానే ఉంటున్నారు. వీరి ముద్దుల కూతురు నవిష్క వారంలో కొద్ది రోజులు మాత్రమే కల్యాణ్ దేవ్ వద్ద ఉంటోంది. (ఇది చదవండి: గుడ్న్యూస్ చెప్పిన బిగ్బాస్ బ్యూటీ..) తాజాగా నవిష్క బర్త్ డే సందర్భంగా శ్రీజ తన ఇన్స్టాలో కూతురి ఫోటోను షేర్ చేసింది. నా కూతురు అప్పుడే ఐదేళ్లు పూర్తి చేసుకుందని తెలిపింది. నవిష్క వైట్ డ్రెస్లో ఉన్న ఫోటోను పంచుకుంది. ఇది చూసిన మెగా అభిమానులు హ్యాపీ బర్త్ డే మెగా లిటిల్ ప్రిన్సెస్ అంటూ విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీజ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. క్రిస్మస్ సందర్భంగా సోమవారం నిర్వహించిన వేడుకల్లో శ్రీజ కొణిదెల కూడా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
జాతీయ టీటీ విజేత శ్రీజ
సాక్షి, విజయవాడ: జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్íÙప్ మహిళల సింగిల్స్లో తెలంగాణ ప్లేయర్ ఆకుల శ్రీజ విజేతగా నిలిచింది. టోరీ్నలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన శ్రీజ శనివారం జరిగిన ఫైనల్లో 6–11, 9–11, 11–4, 9–11, 11–7, 12–10, 12–10 (4–3) స్కోరుతో అర్చనా కామత్ (పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్)పై విజయం సాధించింది. తొలి నాలుగు గేమ్లలో మూడు ఓడి 1–3తో వెనుకబడిన శ్రీజ...ఆ తర్వాత చెలరేగి వరుసగా మూడు గేమ్లను గెలుచుకోగలిగింది. 3–3తో సమంగా నిలిచిన తర్వాతి చివరి గేమ్లో ఒక దశలో 10–8తో అర్చన విజయానికి చేరువైంది. అయితే వరుసగా నాలుగు పాయింట్లు సాధించి శ్రీజ మ్యాచ్ను ముగించింది. పురుషుల సింగిల్స్లో మానవ్ ఠక్కర్ (పీఎస్పీబీ)కి టైటిల్ దక్కింది. ఫైనల్లో జి.సత్యన్ (పీఎస్పీబీ)ని ఠక్కర్ గెలుపొందాడు. ఐదు గేమ్ల తర్వాత 2–3తో వెనుకబడిన తర్వాత ఆరో గేమ్లో 0–2 స్కోరు వద్ద వెన్నునొప్పితో సత్యన్ మ్యాచ్నుంచి వైదొలిగాడు. -
'మీ చిన్న హృదయాలు స్వచ్ఛంగా ఉండాలి'.. శ్రీజ పోస్ట్ వైరల్!
శ్రీజ కొణిదెల తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మెగాస్టార్ చిరంజీవి కూతురిగా శ్రీజకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లికి ఫ్యామిలీతో కలిసి హాజరైంది. తన ఇద్దరు కూతుళ్లతో వరుణ్ పెళ్లిలో సందడి చేసింది. పెళ్లిలో నూతన దంపతులతో దిగిన ఫోటోను తన ఇన్స్టాలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది. (ఇది చదవండి: స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ.. ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో తెలుసా?) తాజాగా ఇవాళ చిల్డ్రన్స్ డే కావడంతో తన కూతుళ్లతో పాటు మెగా, అల్లు కుటుంబాల పిల్లలు ఉన్న ఫోటోను పంచుకుంది. అంతే కాకుండా పిల్లల మనస్తత్వం గురించి నోట్ రాసుకొచ్చింది. శ్రీజ తన ఇన్స్టాలో రాస్తూ..' ఇక్కడ ఉన్న అన్ని చిన్న హృదయాలు ప్రేమ, స్వచ్ఛత, నవ్వు, ఆనందం, ఉత్సుకతతో నిండి ఉండాలి. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇది చూసి ఫ్యాన్స్ సూపర్ పిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో రామ్ చరణ్- ఉపాసన కూతురు క్లీంకార ఎక్కడ? అంటూ పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా ఓకే ఫ్రేమ్లో మెగా, అల్లు కుటుంబాల పిల్లలను చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది. కాగా.. 2016లో కల్యాణ్ దేవ్తో శ్రీజ వివాహం జరిగిన విషయం తెలిసిందే. (ఇది చదవండి: జీవితంలో కష్టాలు వచ్చినా.. గుండె బద్దలైనా అంటూ శ్రీజ కామెంట్స్) View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
జీవితంలో కష్టాలు వచ్చినా.. గుండె బద్దలైనా అంటూ శ్రీజ కామెంట్స్
మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల వివాహం నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్గా జరిగింది. ఆ పెళ్లి వేడుకలో మెగా- అల్లు కుటుంబాలు సందడి చేశాయి. ఈ వివాహా వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయ్యాయి. తాజాగా వారందరూ ఇటలీ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. వరుణ్ వివాహ వేడుకలో తన పిల్లలతో సందడి చేసిన మెగాస్టార్ కూతురు శ్రీజ తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఓఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. (ఇదీ చదవండి: గుంటూరు కారం ఫస్ట్ సాంగ్.. మహేశ్ ఫ్యాన్స్కు మసాల బిర్యానీ రెడీ) 'విషయాలు నా నియంత్రణలో లేనప్పుడు, పరిస్థితులు అస్తవ్యస్తంగా మారినప్పుడు హృదయం గాయపడటంతో పాటు విరిగిపోతుంది, మనస్సు కలత చెంది ఆపై క్షీణిస్తుంది. ఆ సమయంలో శరీరం అలసిపోయి బలహీనం అవుతుంది. జీవితంలో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, మనసులో బాధగా ఉన్నా... గుండె బద్దలైనా, పరిస్థితి చేజారినా కూడా ఒక్కసారి కళ్లు మూసుకుని మనలోపలికి మనం వెళ్తే అన్నీ సెట్ అవుతాయ్. అని శ్రీజ తెలిపింది. కష్టాల సమయంలో మనందరి ముందు ఉన్న ఏకైక దారి కూడా అదే అంటూ చెప్పుకొచ్చిన శ్రీజ.. ఈ పోస్ట్కు మాత్రం కామెంట్లను డిజబుల్ చేసింది. 2016లో కల్యాణ్ దేవ్తో శ్రీజ వివాహం జరిగిన విషయం తెలిసిందే.. వరుణ్ పెళ్లిలో శ్రీజ, నవిష్కలు ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్న సమయంలో.. తన కూతురిని మిస్ అవుతున్నట్టుగా కళ్యాణ్ దేవ్ తన ఇన్స్టాగ్రామ్లో పలు స్టోరీలు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. శ్రీజ పోస్ట్ చేసిన విషయాన్ని పలువురు షేర్ చేస్తూ ఎంతో పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. జీవితంలో అన్నీ ఉంటాయి.. కానీ వాటినీ స్వీకరించక తప్పదంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. -
మా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ పేరు..!
-
వాళ్లు గారాబం చేయడం వల్ల నా జీవితంలో చాలా కోల్పోయాను
-
నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది: కళ్యాణ్ దేవ్
-
చరణ్ బావ ఎప్పుడు ఏడిపిస్తుండేవాడు..!
-
మా ఇంట్లో నాకు అలాంటి ఆంక్షలు ఏమీ పెట్టలేదు..!
-
మా పరిచయం ఎలా మొదలైందంటే..!
-
నేను వంట ఎలా చేసిన బాగుంది అంటాడు
-
నా కూతురికి మా నాన్న అంటే చాలా ఇష్టం
-
నాకు ఎలాంటి గుర్తింపు అవసరం లేదు
-
నా జీవితం ఇలా మారింది అంటే వాళ్లే కారణం
-
శ్రీజకు నిరాశ
ప్యాంగ్చాంగ్ (దక్షిణ కొరియా): ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్ర్నీప్లో జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ విభాగాల్లో రెండో రౌండ్ను దాటలేకపోయింది. సింగిల్స్ రెండో రౌండ్లో శ్రీజ 5–11, 6–11, 9–11తో ఇటో మిమా (జపాన్) చేతి లో ఓడిపోయింది. డబుల్స్లో తొలి రౌండ్లో ‘బై’ పొందిన శ్రీజ–దియా (భారత్) జోడీ రెండో రౌండ్ లో 7–11, 6–11, 6–11తో సన్ యింగ్షా–వాంగ్ యిది (చైనా) జంట చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో శ్రీజ–హరీ్మత్ జోడీ 6–11, 7–11, 8–11తో తొమోకాజు–హినా హయాటా (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. -
విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కూతురు ఉందా?
విజయ్ సేతుపతి ఓ నటుడు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు-వెబ్ సిరీస్లు ఫుల్ బిజీగా ఉన్నాడు. పేరుకే తమిళ యాక్టర్ గానీ దేశవ్యాప్తంగా బోలెడంత క్రేజ్ సంపాదించాడు. ఇంతలా పాపులారిటీ తెచ్చుకున్న సేతుపతికి పెళ్లయిందని, టీనేజ్ కూతురు ఉందని చాలామందికి తెలియదేమో. తాజాగా ఓ పిక్ బయటకు రావడంతో ఈ విషయం తెలుగు నెటిజన్స్ మధ్య చర్చకు దారితీసింది. ఇంతకీ విజయ్ సేతుపతి కూతురు డీటైల్స్ ఏంటి? కెరీర్ ప్రారంభంలో విజయ్ సేతుపతి.. పలు సినిమాల్లో గుర్తింపు లేని పాత్రలు చేశాడు. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోకముందే అంటే 2003లోనే జెస్సీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అబ్బాయి సూర్య, అమ్మాయి శ్రీజ పుట్టారు. అయితే సేతుపతికి బోలెడంత స్టార్డమ్, దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాడు. కానీ ఇతడి ఫ్యామిలీ గురించి ఎవరికీ పెద్దగా తెలియదనే చెప్పొచ్చు. వాళ్ల ఫొటోలు కూడా పెద్దగా ఏం బయటకు రాలేదు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?) అయితే విజయ్ సేతుపతి కొడుకు సూర్య.. తన 'నేను రౌడీనే' సినిమాలో చైల్డ్ క్యారెక్టర్లో నటించాడు. ఇక కూతురు శ్రీజ కూడా.. 2020లో విజయ్ సేతుపతి నటించిన 'ముగిల్' మూవీలో నటించింది. రీల్ లైఫ్ లోనూ వీళ్లిద్దరూ తండ్రి కూతురిగా నటించి ఆకట్టుకున్నారు. అయితే తాజాగా విజయ్ సేతుపతి.. తన కొడుకు-కూతురితో ఉన్న పిక్ బయటకు రావడంతో అందరూ షాకవుతున్నారు. ఇంత పెద్ద అమ్మాయి ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే శ్రీజ సేతుపతి ఓ సినిమాలో నటించింది. ప్రస్తుతం చూస్తుంటే.. తండ్రి అంతా ఎత్తు కూడా పెరిగిపోయింది. అన్ని కలిసొస్తే.. త్వరలో నటి లేదా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినాసరే ఆశ్చర్యపోనక్కర్లేదు. (ఇదీ చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' చిరంజీవి చేయాల్సింది.. కానీ!) -
'మన జీవితంలో అప్పుడే మధురమైన క్షణాలు'.. కల్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరో కల్యాణ్ దేవ్ టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. విజేత సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజను.. కల్యాణ్ దేవ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి నవిష్క అనే పాప కూడా ఉంది. అయితే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఇటీవలే తన బిడ్డతో ఆడుకుంటున్న వీడియోను తన ఇన్స్టాలో పంచుకున్నారు కల్యాణ్. తాజాగా ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశాడు. (ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన బిగ్బాస్ బ్యూటీ.. ఇన్స్టా పోస్ట్ వైరల్!) తాజగా ఇన్స్టాలో తన ఫోటోలను షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చారు. 'మన జీవితంలో మార్చలేని వాటిని వదులుకునే ధైర్యం తెచ్చుకున్నప్పుడే.. మనకు అత్యంత మధురక్షణాలు. దీనితో మీరు ఏకీభవిస్తారా?' అంటూ పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ శ్రీజను ఉద్దేశించే చేసినట్లు తెలుస్తోంది. గతేడాది నుంచే సోషల్ మీడియాలో కూడా ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ ఏడాదిన్నర కిందంటే ప్రచారం మొదలైంది. కానీ ఇంతవరకు దీనిపై అటు శ్రీజ, ఇటు కల్యాణ్ దేవ్ స్పందించనేలేదు. కాగా.. ఇటీవలే తన కూతురు నవిష్కతో కలిసి ఆడుకున్న ఫోటోలు షేర్ చేసిన కల్యాణ్.. 'వారంలో ఎంతో ఆనందంగా గడిపే నాలుగు గంటలు ఇవే' పోస్ట్ చేశారు. (ఇది చదవండి: రిలేషన్షిప్పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..!) View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
‘మెగా’ మనువరాళ్లు.. చిరుతో రేర్ ఫోటోలు
-
మెగా డాటర్స్ VS మెగా అల్లుళ్లు... ఒక్క పోస్ట్ తో సోషల్ మీడియా షేక్...
-
గోవాలో భూమి ఫడ్నేకర్.. రిషికేశ్లో యషికా ఆనంద్ ఫోజులు
►కలర్ఫుల్ దుస్తుల్లో ప్రణీత ఫోజులు ►రకుల్ ప్రీత్ సింగ్ స్మైలీ పిక్స్ ►గోవాలో బిజినెస్ స్టార్ట్ చేసిన భూమి ఫడ్నేకర్ ►రిషికేశ్లో యషికా ఆనంద్ గ్లామర్ లుక్స్ ►జిమ్లో కూతురితో మెగా డాటర్ శ్రీజ కసరత్తులు View this post on Instagram A post shared by Bhumi 🌏 (@bhumipednekar) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
శ్రీజను టార్గెట్ చేస్తూ వీడియో షేర్ చేసిన కల్యాణ్దేవ్
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్ దేవ్ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. 2016లో శ్రీజ కళ్యాణ్ దేవ్ల పెళ్లి జరగ్గా కొంతకాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం, ఇద్దరూ కలిసున్న ఫోటోలు డిలీట్ చేసేయడం సహా మెగా ఫ్యామిలీలో జరిగే ఏ పార్టీలోనూ కల్యాణ్ దేవ్ కనిపించకపోవడంతో ఈ రూమర్స్ నిజమనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. మరోవైపు ఇప్పటివరకు ఈ పుకార్లపై నేరుగా స్పందించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఇన్డైరెక్ట్ హింట్స్ ఇస్తున్నారు. తాజాగా కల్యాణ్ దేవ్ షేర్ చేసిన ఓ పోస్ట్ చూస్తే వీరిద్దరి మధ్య ఎంత అగాధం ఉందన్నది స్పష్టమవుతుంది. ఈ వీడియోలో ఓ స్కూల్ పాప కల్చరల్ ఈవెంట్లో పాల్గొంటుంది. తన పేరెంట్స్ ఎక్కడున్నారా అని స్టేజ్పై ఉండి వెతుక్కుంటుంది. వాళ్ల తల్లిదండ్రులను చూడగానే సంతోషంతో చాలా ఎగ్జయిట్ అవుతుంది. ఈ వీడియోను కల్యాణ్దేవ్ షేర్ చేస్తూ.. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, సపోర్ట్ కావాలి. మిస్సింగ్ నవిష్క, నివిత్రి అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు.దీంతో భార్యభర్తలు విడిపోయినా పిల్లలకు ఇద్దరి ప్రేమ దక్కాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతంలోనూ కూతుళ్లను తలుచుకుంటూ కల్యాణ్ దేవ్ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. -
హాట్టాపిక్గా మారిన చిరంజీవి చిన్నల్లుడి పోస్టులు.. నెట్టింట వైరల్
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్ దేవ్ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. 2016లో శ్రీజ కళ్యాణ్ దేవ్ల పెళ్లి జరగ్గా మనస్పర్థల కారణంగా వీరు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరగుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం, ఇద్దరూ కలిసున్న ఫోటోలు డిలీట్ చేసేయడం సహా మెగా ఫ్యామిలీలో జరిగే ఏ పార్టీలోనూ కల్యాణ్ దేవ్ కనిపించకపోవడంతో రూమర్స్ మొదలయ్యాయి. కొన్నాళ్లుగా వీరిద్దరి పర్సనల్ లైఫ్పై ఇప్పుడు రకరకాల పుకార్లు వస్తున్నా మెగా ఫ్యామిలీ కానీ, ఇటు కల్యాణ్ దేవ్ కానీ ఇంతవరకు స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ తమ రిలేషన్షిప్పై ఇన్డైరెక్ట్ హింట్స్ ఇస్తున్నారు. తాజాగా కల్యాణ్ దేవ్ షేర్చేసిన ఓ పోస్ట్ నెట్టింట హాట్టాపిక్గా మారింది. 'ఇతరులు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధల గురించి మనకు తెలిసింది గోరంత అయితే తెలియనది కొండంత. అందుకే ఎదుటి వారి పట్ల మనం దయ, జాలితో ఉండాలి అంటూ' ఓ కొట్ను షేర్చేశారు. ఇక మరొక పోస్ట్లో.. క్రమశిక్షణ వల్లే వచ్చే బాధ, విచారం వల్ల కలిగే బాధ ఇలా రెండుంటాయి. వాటిలో మీరు ఏది కోరుకుంటారు అంటూ కల్యాణ దేవ్ చేస్తున్న వరుస పోస్టులు నెట్టింట వైరల్గా మారాయి. -
చిరు కూతుళ్లు శ్రీజ, సుష్మితలతో అల్లు అర్జున్ వెకేషన్.. ఇది సరిపోదా?
అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఇప్పటికే చిరంజీవి, అల్లు అరవింద్ స్పందించినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. రీసెంట్గా రామ్చరణ్ బర్త్డే పార్టీలో కూడా అల్లు అర్జున్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. 38వ వసంతంలోకి అడుగుపెట్టిన రామ్చరణ్ చిరంజీవి నివాసంలో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. టాలీవుడ్ ప్రముఖులంతా పార్టీలో సందడి చేసినా అల్లు అర్జున్ మాత్రం రాకపోడంతో నిజంగానే వీరిద్దరి మధ్య స్టార్ వార్ నడుస్తోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ రూమర్స్కి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి చెక్ పెట్టింది. అల్లుఅర్జున్, శ్రీజ, సుష్మితలతో పాటు మరికొంత మంది కజిన్స్తో వెకేషన్కు వెళ్లిన వీడియోను స్నేహ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీనికి లవ్ ఫ్యామిలీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒకవేళ నిజంగానే బన్నీ-చరణ్లకు మధ్య విబేధాలు ఉంటే శ్రీజ, సుష్మితలు బన్నీతో కలిసి వెకేషన్కు వెళ్లరు కదా, అయినా సోషల్ మీడియాలో విష్ చేయనంత మాత్రానా కథలు అల్లడమేనా? అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
ప్రేమంటే ఏమిటంటే.. కల్యాణ్ దేవ్ ఇలా.. శ్రీజ అలా..
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్ దేవ్ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. వీరిద్దరి పర్సనల్ లైఫ్పై ఇప్పుడు రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో వీరిద్దరు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అటు కల్యాణ్ దేవ్ కానీ, ఇటు శ్రీజ కానీ.. ఇన్స్టాలో ఒక్క పోస్ట్ పెట్టిన అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14) పురస్కరించుకొని ప్రేమపై ఈ జంట విడి విడిగా పెట్టిన సోషల్ మీడియా పోస్టులు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వాలెంటైన్స్ డే విషెస్ తెలుపుతూ కల్యాణ్ దేవ్ ఇన్స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టాడు. మనం ఎంతగా ప్రేమిస్తున్నామని కాదు.. వాళ్లు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేది ముఖ్యం’ అని అందులో రాసుకొచ్చాడు. మరోవైపు శ్రీజ కొణిదెల ప్రేమ గురించి చెబుతూ.. ‘లవ్ అంటే.. నీతో ప్రేమలో పడేసుకోవడం కాదు.. తనతో తనే ప్రేమలో పడేలా చేయడం.. ఉన్న ప్రేమను గుర్తించాలి.. ప్రేమ కోసం ఎక్కడో వెతకకూడదు’ అని చెప్పుకొచ్చింది. ఈ రెండు పోస్టులు చూస్తుంటే ఒకరిపై ఒకరు కౌంటర్గా ఇలా చేశారనే విషయం అర్థమవుతుంది. అసలు వీరిద్దరు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందనే విషయం ఎవరికీ అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్పై ఇప్పటికీ ఈ జంట స్పందించకపోవడం గమనార్హం. -
చాలా మిస్ అవుతున్నాను.. కూతుర్ని తలచుకుంటూ కల్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ పేరు ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. దానికి కారణం అతని పర్సనల్ లైఫ్లో విభేదాలు వచ్చేయనే పుకార్లు రావడమే. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన శ్రీజ.. కొన్నాళ్లకే అతనితో విడిపోయి కల్యాణ్ దేవ్ని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరు కూడా దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరు పెట్టే పోస్టులు కూడా పలు అనుమానాలకు తావు ఇస్తున్నాయి. తాజాగా కూతురు నవిష్కను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు కల్యాణ్ దేవ్. ఫిబ్రవరి 11న కల్యాణ్ దేవ్ బర్త్డే. ఈ సందర్భంగా గతంలో కూతురితో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్న వీడియోని ఇన్స్టాలో షేర్ చేస్తూ.. ‘నీతో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఇది నాలుగోసారి. నా బర్త్డేను ఇంతకంటే గొప్పగా స్టార్ట్ చేయలేను. ప్రతిరోజూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఇప్పటికే నిన్ను మిస్ అవుతున్నా’అంటూ కల్యాణ్ దేవ్ రాసుకొచ్చాడు. ఇటీవల జరిగిన కూతురి బర్త్డే సెలబ్రేషన్స్లో కల్యాణ్ దేవ్ కనపడలేదు. అప్పుడు కూడా నవిష్కను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
14 ఏళ్లప్పుడు పరిచయం అయ్యావ్.. థాంక్యూ మై డియర్, శ్రీజ పోస్ట్వైరల్
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె ఏ పోస్ట్ పెట్టినా.. క్షణాల్లో వైరల్ అవుతోంది. దానికి కారణం ఆమె పర్సనల్ లైఫ్లో విబేధాలు వచ్చేయనే పుకార్లు రావడమే. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన శ్రీజ.. కొన్నాళ్లకే అతనితో విడిపోయి కల్యాణ్ దేవ్ని రెండో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరు కూడా దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరు పెట్టే పోస్టులు కూడా పలు అనుమానాలకు తావు ఇస్తున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా ‘ ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా’ అంటూ శ్రీజ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. చివరకు ఆమె 'ఐ యామ్ లవింగ్ ది రిలేషన్ షిప్ విత్ సెల్ప్' అంటూ సెల్ఫ్ లవ్ కంటే గొప్పది ఏదీ లేదన్నట్టుగా రాసుకొచ్చి అందరికి షాకిచ్చింది. తాజాగా తన కాఫీ అలవాటు గురించి శ్రీజ చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘నా అల్లరికి ప్రశాంతతను నువ్వే ఇస్తావ్.. జీవితంలో చీకటికి నువ్వే వెలుగులు నింపుతావ్.. నేను ఉదయం లేస్తున్నానంటే దానికి కారణం నువ్వే.. నా 14 ఏళ్ల వయసులో నువ్వు(కాఫీ) పరిచయం అయ్యావ్. అప్పటి నుంచీ నాతోనే ఉంటున్నావ్.. థాంక్యూ మై డియర్ కాఫీ’ అంటూ తాను కాఫీ లవర్ని అని శ్రీజ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
సంధ్య థియేటర్లో సినిమా చూడటానికి వచ్చిన చిరంజీవి కూతుళ్లు
మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా వచ్చేసింది. చిరంజీవి నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా నేడు(శుక్రవారం)గ్రాండ్గా విడుదల అయ్యింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అర్థరాత్రి నుంచే ప్రీమియర్ షోలతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. డప్పులు, డ్యాన్సులతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాడ్ రోడ్డులోని సంథ్య థియేటర్ వద్ద తెల్లవారుజామున 4గంటలకే సినిమా షో పడింది. ఈ థియేటర్లో డైరెక్టర్ బాబీ, దేవీ శ్రీ ప్రసాద్లతో పాటు చిరంజీవి కూతుళ్లు సుష్మిత, శ్రీజలు వచ్చారు. అభిమానులతో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
'చాలా మిస్ అవుతున్నా'.. కూతుర్ని తలుచుకొని కల్యాణ్ దేవ్ ఎమోషనల్
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ఈమధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. సినిమాల కంటే పర్సనల్ లైఫ్ కారణంగానే ఎక్కువగా పాపులర్ అయ్యాడు. ఇక శ్రీజతో విబేధాల కారణంగా కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నా ఇప్పటివరకు దీనిపై ఈ జంట స్పందించలేదు. ఇక ఇప్పటికే శ్రీజ తన ఇన్స్టా హ్యాండిల్లో శ్రీజ కొణిదెలగా పేరు మార్చుకోవడం, భర్త కల్యాణ్ దేవ్ను అన్ఫాలో చేయడంతో మరిన్ని రూమర్స్ తెరమీదకి వచ్చాయి. ఇదిలా ఉంటే శ్రీజ-కల్యాణ్దేవ్ల చిన్నకూతురు నవిష్క ప్రస్తుతం తల్లి దగ్గరే ఉంది. తాజాగా నవిష్క లేటెస్ట్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన కల్యాణ్ దేవ్.. 'మిస్ యూ సో మచ్' అంటూ కామెంట్ చేశాడు. గతంలోనూ కూతురి బర్త్డే సెలబ్రేషన్స్లోనూ కల్యాణ్ దేవ్ కనపడలేదు. అప్పుడు కూడా నవిష్కను తలుచుకుంటూ తెగ బాధపడిపోయిన కల్యాణ్ దేవ్ 'నువ్వే నా ప్రపంచం'.. అంటూ స్పెషల్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కూతుర్ని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. View this post on Instagram A post shared by Navishka (@navishka_k) -
త్వరలో కొత్త జీవితం.. ఎవరో చెప్పేసిన శ్రీజ!
మెగాస్టార్ చిన్నకూతురు శ్రీజ కొణిదెల తాజాగా వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఎప్పుడు చురుక్కుగా ఉండే ఆమె పర్సనల్ లైఫ్లోనూ రకరకాల రూమర్స్ వినిపించాయి. కానీ.. తాజాగా శ్రీజ షేర్ చేసిన పోస్ట్తో వాటన్నింటికీ చెక్ పెట్టింది. ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా అంటూ ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతేడాదిలో తనకిష్టమైన వ్యక్తి గురించి తెలుకున్నానంటూ తన ఇన్స్టాలో ఓ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఆ వ్యక్తిని కలవడం అద్భుతం.. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నా : శ్రీజ) అందరూ అనుకుంటున్నట్లు ఆమె ఎవరితోనూ రిలేషన్షిప్లో లేదు. నూతన ఏడాదిలో తనకు తానే కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నట్లు ఇన్స్టా స్టోరీలో తెలిపింది. స్వీయ రిలేషన్లో ఉండనున్నట్లు వెల్లడించింది. 'ఐ యామ్ లవింగ్ ది రిలేషన్ షిప్ విత్ సెల్ప్' అంటూ ఫోటో పోస్ట్ చేసింది. సాధారణంగా శ్రీజ ఫిట్నెస్, ట్రావెల్ వంటి విషయాలపై పోస్టులు పెడుతూ ఉంటుంది. ఆమె తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆసక్తికరంగా మారడంతో ఫ్యాన్స్ కంగ్రాట్స్ తెలిపారు. గతేడాది గురించి ఆమె స్పందిస్తూ…‘2022 సంవత్సరం నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేసిందని పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో ఆమె సెల్ఫ్ రిలేషన్లో ఉండనున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. -
చిన్నకూతురు శ్రీజకి చిరంజీవి కాస్ట్లీ గిఫ్ట్.. ఎన్ని కోట్లంటే..!
మెగాస్టార్ చిరంజీవికి కుటుంబం అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. ఖాలీ సమయం దొరికితే చాలు.. ఫ్యామిలీతో గడపడానికే ఎక్కువ ఇష్టపడతాడు. కొడుకు కూతుళ్లతో పాటు మనవరాళ్లను ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. ముఖ్యంగా చిన్న కూతురు శ్రీజ అంటే మెగాస్టార్కు చాలా ఇష్టం. ఆమె ఏం అడిగినా వెంటనే కాదనకుండా చేసేస్తాడట. తాజాగా తన చిన్న కూతురు శ్రీజకు మెగాస్టార్ ఓ ఖరీదైన బహుమతిని ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రూ. 35 కోట్ల విలువ చేసే ఓ ఇంటిని కూతురికి కొనిచ్చాడట. ఆ ఇంటిని హైదరాబాద్లోని ఎమ్మెల్యే కాలనీలో కొనుగోలు చేశారని సమాచారం. ఈ ఇంటిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయట. తాను చేసిన, చేయబోతున్న సినిమాల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్తో ఈ ఇంటిని కొన్నారట. చిరు ప్రస్తుతం అనిల్ సుంకర, మైత్రీ మూవీస్లతో భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాల ద్వారా వచ్చిన పారితోషికంతో పాటు చేయబోతున్న సినిమాల కోసం తీసుకున్న అడ్వాన్స్లతో ఆ ఇంటిని కొనుగోలు చేశారట. రూ.35 కోట్లు అంటే చిరంజీవికి చిన్న విషయమే కానీ.. విన్నవారికి మాత్రం ఇది చాలా పెద్ద విషయమే. (చదవండి: 'నా జీవితంలోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిశాను'.. శ్రీజ ఇంట్రెస్టింగ్ పోస్ట్) ఇక శ్రీజ విషయానికొస్తే.. ఆమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. తన వ్యక్తిగత జీవితంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన శ్రీజ.. కొన్నాళ్లకే అతనితో విడిపోయి కల్యాణ్ దేవ్ని రెండో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరు కూడా దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
ఆ వ్యక్తిని కలవడం అద్భుతం.. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నా : శ్రీజ
మెగాస్టార్ చిన్నకూతురు శ్రీజ కొణిదెల కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఆమె పర్సనల్ లైఫ్లో రకరకాల రూమర్స్ తెరమీదకి వస్తున్నాయి. భర్త కల్యాణ్ దేవ్తో ఆమె వైవాహిక జీవితంపై పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా శ్రీజ షేర్ చేసిన పోస్ట్ మరింత అనుమానాలకు తావిస్తుంది. న్యూఇయర్ సందర్భంగా గతేడాది జరిగిన మూమెంట్స్ని షేర్చేస్తూ.. ''డియర్ 2022, నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిశేలా చేశావ్. నా గురించి బాగా తెలిసిన వ్యక్తి, నన్ను అమితంగా ప్రేమిస్తూ, కేరింగ్గా చూసుకుంటూ, కష్టసుఖాల్లో నాకు తోడుంటే వ్యక్తి, ఎప్పుడూ నాకు సపోర్ట్గా నిలబడే వ్యక్తి.. తనను కలుసుకోవడం అద్భుతం. కొత్త ప్రయాణం మొదలవుతుంది'' అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ఇక ఈమధ్యకాలంలో శ్రీజ, కల్యాణ్దేవ్లు కలిసి ఒక్కసారి కూడా కనిపించలేదు. రీసెంట్గాకూతురి బర్త్డేను సైతం శ్రీజ ఒక్కతే సెలబ్రేట్ చేసింది. ఈ క్రమంలో 'కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నా' అంటూ శ్రీజ వెల్లడించడం అటు మెగా అభిమానులతో పాటు నెటిజన్లలోనూ ఆసక్తికరంగా మారింది. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నా.. కల్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ పేరు ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఆయన ఏ పోస్ట్ పెట్టినా.. నెటిజన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఇటీవల ఆయన ‘కాస్తా ఓపికగా ఉండండి.. అన్నింటికి సమాధానం దొరుకుతుంది’ అని ఇన్స్టాలో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ చూసిన వారంతా కళ్యాణ్ ఎందుకు అలా పెట్టాడు? ఈ పోస్ట్ వెనక అంతర్యం ఏంటి? పర్సనల్ లైఫ్లో విభేదాలు వచ్చాయా?’అని ఆరా తీశారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఆయన పెట్టిన మరో పోస్ట్ కూడా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘2022లొ చాలా నేర్చుకున్నాను. సహనంగా ఎలా ఉండాలో తెలిసివచ్చింది. ఎదుగుదల అంటే ఏంటో తెలిసింది.. అవకాశాలను అందుకోవడం, రిస్క్ తీసుకోవడం తెలుసుకున్నా. నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ఇతరులను క్షమించడం.. నాతో నేను ఎక్కువగా గడపడం ఇలా ఎన్నో నేర్చుకున్నాను. నా ఈ ప్రయాణంలో ఉండి.. నన్ను నేను మార్చుకునేలా సాయపడ్డ ప్రతీ ఒక్కరికీ ధన్యావాదలు. మీ అందరి ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ప్రయత్నించడం… ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దూ.. మీ అందరికీ ప్రేమ, ఆరోగ్యం, ఆనందం, సాహసం, విజయం, మీరు కోరుకునేది ప్రతిదీ ఉండాలని కోరుకుంటూ ఈకొత్త సంవత్సరం శుభాకాంక్షలు ’అని కల్యాణ్ దేవ్ తన ఇన్స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్.. ‘దీని అంతర్యం ఏంటీ?’
మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ-కల్యాణ్ దేవ్లు 2016లో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం కల్యాణ్ దేవ్ విజేత మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. రీసెంట్గా ఆయన నటించిన సూపర్ మచ్చి చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. దీంతో కల్యాన్ సినిమాలకు కాస్తా బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కల్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటాడు. చదవండి: సమంత షాకింగ్ నిర్ణయం! ఆ ప్రాజెక్ట్స్ నుంచి సామ్ అవుట్? తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్లో ఉంటున్నాడు. ఇదిలా ఉంటే కల్యాణ్ దేవ్ తన పర్సనల్ లైఫ్కు సంబంధించి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు అతడు తన గురించి వస్తున్న పుకార్లపై ఎప్పుడు నేరుగా స్పందించ లేదు. కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్స్ షేర్ చేస్తూ పరోక్షంగా తన వ్యక్తిగత జీవితంపై స్పందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా అతడు పెట్టిన పోస్ట్ ఆసక్తిగా మారింది. తన లేటెస్ట్ ఫొటో షేర్ చేస్తూ ఈ పోస్ట్కి ఇచ్చిన క్యాప్షన్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. చదవండి: బిగ్బాస్ 6: టాప్ 3 కంటెస్టెంట్ కీర్తి.. 15 వారాల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ‘కాస్తా ఓపికగా ఉండండి.. అన్నింటికి సమాధానం దొరుకుతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో దీని ఉద్దేశం ఏంటని? ఈ పోస్ట్ వెనక అంతర్యం ఏంటి? అంటూ నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. అదేవిధంగా త్వరలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిమ ఎదైనా కీలక ప్రకటన రానుందా? అంటూ కొందరు ఈ పోస్ట్పై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తన చిత్రాలు వరుసగా ప్లాప్ అవుతున్న నేపథ్యంలో కల్యాణ్ దేవ్ సినిమాలకు గుడ్బై చెప్పుబోతున్నాడంటూ కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
శ్రీజ బర్త్డే.. ఆసక్తికర పోస్ట్ను షేర్ చేసిన కల్యాణ్ దేవ్
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందిరిలాగే శ్రీజకు కూడా సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి తగ్గట్లే శ్రీజ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన డైలీ రొటీన్స్తో పాటు ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఈ మధ్య కాలంలో శ్రీజ వ్యక్తిగత జీవితంపై నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది.ఇదిలా ఉండగా శ్రీజ బర్త్డే సందర్భంగా ఆమె భర్త కల్యాణ్ దేవ్ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిన్న(నవంబర్9)న శ్రీజ బర్త్డే సందర్భంగా ప్రతిసారి ఆమెకు విషెస్ చెప్పే కల్యాణ్ దేవ్ ఈసారి మాత్రం ఎలాంటి పోస్ట్ చేయలేదు. కానీ తన వెకేషన్కు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేస్తూ..లైఫ్ అంత ఈజీగా సాగదు.. మనమే స్ట్రాంగ్ అవ్వాలి అంటూ ఓ ఆసక్తికర పోస్ట్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. కల్యాణ్ దేవ్ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
హీరోయిన్తో మెగా అల్లుడు కల్యాణ్ ఫోటో వైరల్
మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చిరంజీవి చిన్నకూతురు శ్రీజను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా కల్యాణ్ దేవ్ పర్సనల్ లైఫ్కు సంబంధించి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా ఓ హీరోయిన్తో కల్యాణ్ దేవ్ షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వర్ణిక రాథోర్ అనే హీరోయిన్తో దిగిన ఓ ఫోటోను షేర్ చేసిన కల్యాణ్ దేవ్ దీనికి నా లైఫ్ను మార్చేసిన కళల రాణి అంటూ క్యాప్షన్తో ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. దీంతో కల్యాణ్ దేవ్ మాటల వెనకున్న అర్థమేంటని నెటిజన్లు ఆరాతీస్తున్నారు. ఆయన మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలు కూడా వచ్చిన నేఫథ్యంలో కల్యాణ్ దేవ్ షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్గా మారింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని ఆమె కల్యాణ్ దేవ్ చేస్తున్న సినిమాలో హీరోయిన్గా ఎంపికయ్యిందని, ఈ క్రమంలోనే ఫోటో బయటికొచ్చిందని తెలుస్తుంది. -
'కొండంత అండగా నిలబడ్డారు.. కష్టాల్లో తోడున్నారు' అంటూ శ్రీజ ఎమోషనల్
మెగా డాటర్ శ్రీజ కొణిదెల ఈమధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఆమె వ్యక్తిగత జీవితంపై నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది. ఇటీవలె ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెకేషన్స్కి వెళ్లిన శ్రీజ సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ ఎప్పటకిప్పుడు తన లైఫ్లో జరిగిన విషయాలను షేర్ చేసుకుంటుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్టును షేర్చేసింది. 'నా కష్టసుఖాల్లో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి దన్యవాదాలు. నేను కోపంలో ఉన్నప్పుడు నవ్వించారు. ఏడుస్తున్నప్పుడు భుజం తట్టారు. నేను మాట్లాడినప్పుడు విన్నారు. నేను ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. నాకు కొండంత అండగా నిలబడ్డారు. ఇలాంటి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దొరికినందుకు ఎంతో లక్కీగా ఫీల్ అవుతున్నా' అంటూ శ్రీజ పేర్కొంది. ప్రస్తుతం ఆమె షేర్చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
అలా సినిమా చాన్స్ వచ్చింది.. పవన్ కల్యాణ్ వీరాభిమానిగా
‘‘ముందు టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయ్యాను. నా వీడియోలు చూసిన దర్శకుడు అనుదీప్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమాకి అవకాశం ఇచ్చారు’’ అన్నారు సంచిత బషు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బషు జంటగా వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంశెట్టి ద్వయం తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. దర్శకుడు అనుదీప్ కథతో ఏడిద శ్రీజ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. సంచిత మాట్లాడుతూ – ‘‘చిన్నతనం నుంచే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన లయ పాత్రలో నటించాను. దర్శకులు వంశీ, లక్ష్మి నన్ను బాగా ప్రోత్సహించారు. నిర్మాత శ్రీజగారు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు’’ అన్నారు. -
Sreeja: ఈ బిడ్డ గెలుపు ఆ తండ్రికి కనువిప్పు!
ఏ తల్లిదండ్రులకైనా కన్నబిడ్డల విజయం అనేది ఒక కల.. అది అందుకున్న వేళ మధుర క్షణంగా మిగిలిపోతుంది కూడా. కానీ, ఆ తండ్రికి మాత్రం అదొక కనువిప్పు.. అలాంటి తండ్రులకు ఓ మంచి గుణపాఠం. కారణం.. పసికందుగా ఉన్నప్పుడే ఆమెను నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లిపోయాడు కాబట్టి. తాజాగా సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో 99.4 శాతం మార్కులు సంపాదించుకుంది బీహార్ పాట్నాకు చెందిన శ్రీజ. పసితనంలోనే ఆమె తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. అయితే ఆమె అలనా పాలనా చూడాల్సిన కన్నతండ్రి.. కర్కశంగా వ్యవహరించాడు. ఆ చిన్నారి ఖర్చులు భరించడం తన వల్ల కాదంటూ.. పైగా ఆడబిడ్డ అనుకుంటూ నిర్లక్ష్యంగా ఇంట్లో ఒక్కదానినే వదిలేసి వెళ్లిపోయాడు. చిన్నారి శ్రీజ ఏడ్పు విని స్థానికులు.. ఆమె అమ్మ తరపు బంధువులకు సమాచారం అందించారు. విషయం తెలిసి అమ్మమ్మ శ్రీజను అక్కున చేర్చుకుంది. తాతా అమ్మమ్మలే పెంచి.. చదివించారు. ఏళ్లు గడిచాయి.. ఇప్పుడు తన మనవరాలు సాధించిన విజయంతో ఆ అమ్మమ్మ మురిసిపోతోంది. ‘‘నా కూతురు చనిపోయాక మా అల్లుడు శ్రీజను వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతన్ని మేం చూడనే లేదు. మరో వివాహం చేసుకున్నాడని మాత్రమే తెలుసు. ఈ ఫలితం చూస్తే.. అతను కచ్చితంగా తన నిర్ణయానికి పశ్చాత్తాపం చెందుతాడని అనుకుంటున్నా’ అని ఆ అమ్మమ్మ అంటోంది. त्याग और समर्पण की अद्भुत दास्ताँ! माँ का साया हटने पर पिता ने जिस बेटी का साथ छोड़ दिया उसने नाना-नानी के घर परिश्रम की पराकाष्ठा कर इतिहास रच दिया। बिटिया का 10वी में 99.4% अंक लाना बताता है कि प्रतिभा अवसरों की मोहताज नहीं है। मैं आपके किसी भी काम आ सकूँ, मेरा सौभाग्य होगा। pic.twitter.com/ufc3Gp4At9 — Varun Gandhi (@varungandhi80) July 24, 2022 మరోవైపు ఈ సక్సెస్పై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ స్పందించారు. శ్రీజకు ఏ విధంగా అయినా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు ఆయన. మరోవైపు ఇంటర్నెట్ సైతం ఆ చిన్నారి విజయంపై హర్షం వ్యక్తం చేస్తోంది. మానసికంగా ధైర్యంగా ఉండి.. మంచి చదువుతో విజయం సాధించిన శ్రీజకు.. ఆమెకు అండగా నిలిచిన అమ్మ తరపు కుటుంబానికి అభినందనలు తెలియజేస్తోంది. పుస్తకాల పురుగు అయిన Sreeja శ్రీజ.. అలాగని గంటల తరబడి పుస్తకాలకే అంకితమై పోయేది కాదట. చదువుతో పాటు ఆటపాటలు, ఇతర వ్యవహారాలను చాలా సమానంగా చూసుకునేదట. పరీక్షకు ముందు.. పాత ప్రశ్నాపత్రాలను తిరగేయడం, వాటిని సాల్వ్ చేయడం చేస్తూ వెళ్లాను అని అంటోంది ఆమె. ప్రస్తుతం పదకొండవ తరగతి కోసం శ్రీజ DAV-BSEBలో అడ్మిషన్ తీసుకుంది కూడా. -
హాలీడే మూడ్లో చిరంజీవి.. శ్రీజ, ఉపాసన స్వీటెస్ట్ కామెంట్
వరుస సినిమాల షూటింగ్తో బిజీగా ఉన్న చిరంజీవి.. ‘ఆచార్య’ విడుదల తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చాడు. భార్య సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘కరోనా పాండమిక్ తర్వాత ఇదే తొలి ఇంటర్నేషనల్ జర్నీ. చాలా రోజుల తర్వాత చిన్న హాలీడే తీసుకొని సురేఖతో కలిసి అమెరికా, యూరప్ పర్యటనకు వెళ్తున్నాం. త్వరలోనే అందరిని కలుస్తా’ అంటూ సురేఖతో ఫ్లైట్లో దిగిన ఫోటోని ఇన్స్టాలో షేర్ చేశాడు. చిరంజీవి పోస్ట్పై ఆయన కూతురు శ్రీజతో పాటు కోడలు ఊపాసన కూడా స్పందించారు. ‘ఎంజాయ్ అమ్మ అండ్ డాడీ, ఐలవ్ యూ సో మచ్’అని శ్రీజ, ‘హ్యాపీ టైమ్ అత్తయ్య, మామయ్య’ అని ఉపాసన కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ మేకింగ్ లో భోళాశంకర్, మోహన్ రాజా తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ , బాబి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటిస్తున్నాడు. వీటిల్లో గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఆగస్ట్ లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పిల్లలతో వెకేషన్లో శ్రీజ కొణిదెల.. ఫోటోలు వైరల్
మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందిరిలాగే శ్రీజకు కూడా సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి తగ్గట్లే శ్రీజ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన డైలీ రొటీన్స్తో పాటు ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఈ మధ్యకాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్న శ్రీజ ఏ పోస్ట్ చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా తన ఇద్దరు పిల్లలు నవిష్క, నివృతిలను తీసుకొని తమిళనాడులోని కోటగిరి హిల్స్కు వెకేషన్కు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. పిల్లలతో దిగిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేస్తూ.. నా ప్రపంచం, నా జీవితం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Navishka (@navishka_k) -
ఎదుటివాళ్లకు ఏం ఇస్తామో అదే తిరిగొస్తుంది.. శ్రీజ ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల గురించి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తున్న శ్రీజ ఏ పోస్ట్ చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శ్రీజ కుటుంబసభ్యులతో కలిసి దిగిన స్పెషల్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో శ్రీజ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. 'మనం అవతలి వ్యక్తికి మనస్పూర్తిగా ఏదైతే ఇస్తామో.. అదే 100రెట్లు మనకు తిరిగి వస్తుంది' అంటూ ఓ కొటేషన్ను షేర్ చేసింది. దీంతో శ్రీజ ఎవరి గురించి ఈ కామెంట్స్ చేసింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
హోలీ ఆడిన శ్రీజ కూతుళ్లు, కల్యాణ్ దేవ్ ఏమన్నాడంటే?
చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ ఏం చేసినా అది సెన్సేషనే అవుతోంది. అతడు సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. విజేత సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ దేవ్ ఇటీవల సూపర్ మచ్చితో ప్రేక్షకులను పలకరించాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన కిన్నెరసాని త్వరలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే కొంతకాలం నుంచి మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్లో పెద్దగా కనిపించడం లేదు కల్యాణ్ దేవ్. అంతేకాదు ఈ మధ్య షేర్ చేస్తున్న ఫొటోల్లో శ్రీజ మిస్ అవుతుండటంతో వీళ్లు విడాకులు తీసుకుంటున్నారన్న ఊహాగానాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హోలీ పండగను పురస్కరించుకుని కల్యాణ్దేవ్ తన ముఖమంతా రంగులమయమైన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఈ హోలీ రోజు ప్రేమ, సరదాలను పంచండంటూ దానికి క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే తన కూతుళ్లు నివృత్తి, నవిష్క సెలబ్రేట్ చేసుకున్న హోలీ వీడియోలను సైతం ఇన్స్టా స్టోరీలో పెడుతూ రంగుల్లో మునిగిపోయారంటూ కామెంట్ చేశాడు. ఈ హోలీ వేడుకల్లో ఎక్కడా శ్రీజ కనిపించలేదు. మొత్తానికి కల్యాణ్దేవ్ హోలీ ఫొటోలు మాత్రం నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Nivrithi_k (@nivrithi_k) View this post on Instagram A post shared by Navishka (@navishka_k) చదవండి: కష్టాల్లో ఉన్న ఉక్రెయిన్ బాడీగార్డ్కు రామ్చరణ్ సాయం -
శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లెటేస్ట్ పోస్ట్ వైరల్, ఏం అంటున్నాడంటే
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. రీసెంట్గా సూపర్ మచ్చీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్యాణ్ తరచూ వెకేషన్స్కు వెళ్తున్నాడు. అంతేగాక ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈ మధ్యే తన మేకోవర్ లుక్ని షేర్ చేసిన కల్యాణ్ దేవ్ దీనికి ‘నీకు ఎవరైనా ఏదైనా చెబితే నువ్వు పెద్దగా పట్టించుకోకు. ఒక నవ్వు నవ్వి వదిలెయ్. నీకు నచ్చింది నువ్వు చెయ్’ అంటూ కొటేషన్ను యాడ్ చేశాడు. చదవండి: Pooja Hegde: పూజ నోట అసభ్య పదం, ట్రోల్ చేస్తున్న నెటిజన్లు ఇక తాజాగా వీకెండ్ సందర్భంగా కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ.. ‘శనివారం నుంచి సోమవారం మధ్యలో’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ సందర్భంగా కల్యాణ్ వీకెండ్లో ఎలా ఉంటాం.. వీకెండ్ అయిపోయాక మండే రోజు ఎలా ఉంటాం.. మూడ్ ఎలా మారుతుంది అంటూ డిఫరెంట్ మూడ్తో ఉన్న ఫొటోలను పంచుకున్నాడు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే నెట్టింట రకారకాల పుకార్లు వస్తున్న నేపథ్యంలో కల్యాణ్ దేవ్ పెట్టే ప్రతి పోస్ట్ ఆసక్తిని సంతరించుకుంటున్నాయి. కాగా ప్రస్తుతం కల్యాణ్ తన మూడవ సినిమా ‘కిన్నెర సాని’ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నాడు. చదవండి: ఆర్జీవీపై యాంకర్ శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
మెగాస్టార్ చిన్న కూతురు లేటెస్ట్ పోస్ట్.. ఏం చెబుతుందంటే !
Chiranjeevi Daughter Sreeja New Post About Her Childrens: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు, మెగా డాటర్ శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ తన మనసులోని భావాలను షేర్ చేసుకుంటుంది. ఇటీవల అన్నయ్య రామ్ చరణ్తో కలిసి దిగిన పిక్ను షేర్ చేస్తూ చిన్న విషయాలు కూడా నన్ను సంతోషపెడతాయంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. తాజాగా శ్రీజ తన పిల్లలతో ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ స్టోరీకి 'లవ్లీస్' అంటూ తన పిల్లలపై ఉన్న ప్రేమను చాటుకుంది శ్రీజ. అలాగే లవ్ సింబల్స్ పెట్టి తల్లిప్రేమను చాటింది. ఈ స్టోరీ చూస్తుంటే శ్రీజ తన పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీజకు నివ్రతీ, నవీక్ష అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ బర్త్డే: విషెస్ చెప్పిన కూతురు
Kalyan Dev Birthday,Daughter Navishka Sweet Wishes: చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే మరింత పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కల్యాణ్ దేవ్ రీసెంట్గానే తన మేకోవర్ లుక్తో షాకిచ్చాడు. ఎవరేం చెప్పినా పెద్దగా పట్టించుకోకు.. నీకు నచ్చింది నువ్వు చెయ్ అంటూ కొటేషన్స్తో చర్చకు దారితీసిన కల్యాణ్ దేవ్ రీసెంట్గానే తన 32వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్న కూతురు నవిష్క తండ్రికి బర్త్డే విషెస్ తెలిపింది. హ్యాపీ బర్త్డే డాడా అంటూ క్యూట్గా విషెస్ చెప్పింది. దీనికి థ్యాంక్యూ బంగారు అంటూ కల్యాణ్ దేవ్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఎంతో క్యూట్గా విషెస్ చెప్పిందో.. తండ్రీ-కూతుళ్ల ప్రేమ నెవర్ ఎండింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Navishka (@navishka_k) -
ఎన్నో ఆశలతో, సంతోషంగా ఉన్నా : శ్రీజ భర్త కల్యాణ్ దేవ్
Sreeja Konidela Husband Kalyan Dev Cryptic Post : చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. రీసెంట్గా సూపర్ మచ్చీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ ఈ మధ్యే తన మేకోవర్ లుక్ని షేర్ చేసిన కల్యాణ్ దేవ్ దీనికి నీకు ఎవరైనా ఏదైనా చెబితే నువ్వు పెద్దగా పట్టించుకోకు. ఒక నవ్వు నవ్వి వదిలెయ్. నీకు నచ్చింది నువ్వు చెయ్ అంటూ కొటేషన్ను యాడ్ చేశాడు. తాజాగా మరో ఫోటోను షేర్ చేసి దానికి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చాడు. సముద్రపు అలల మధ్య ఉదయించిన సూర్యుడి ఫోటోను షేర్చేస్తూ.. ఎన్నో ఆశలతో ప్రేమగా, సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కల్యాణ్ దేవ్ షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
'బతకడానికి నన్ను సంతోషపెట్టే విషయాలివే'.. శ్రీజ ఎమోషనల్
Sreeja Konidela Shares Lovely Pics With Ram Charan, Write Emotional Quote: మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు. చెల్లెలు శ్రీజతో కలిసి ఆయన ముంబైలో కనిపించడంతో ఫోటోగ్రాఫర్లు క్లిక్మనిపించారు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్గా మారాయి. అయితే వీరు ముంబై ఎందుకు వచ్చారన్న విషయంపై క్లారిటీ లేదు. ఇక అన్నయ్య రామ్చరణ్తో కలిసి దిగిన ఫోటోలను శ్రీజ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. 'హగ్స్ అండ్ హగ్స్.. నేను బతకడానికి నాకు సంతోషాన్నిచ్చే చిన్న చిన్న విషయాలివే అంటూ ఎమోషనల్ అయ్యింది. ఫోటోల్లో రామ్చరణ్ పెట్ రైమ్ కూడా ఉంది. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
నా ప్రేమను మాటల్లో చెప్పలేను... చిరంజీవి కూతురు శ్రీజ ఎమోషనల్ పోస్ట్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్డే నేడు(జనవరి 19). ఈ సందర్భంగా అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వరుణ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాఫ్యామిలీ నుంచి చిరంజీవి, నాగబాబు, సాయితేజ్, నిహారిక సోషల్ మీడియా ద్వారా వరుణ్ తేజ్కి బర్త్డే విషెస్ తెలియజేశారు. తాజాగా చిరంజీవి కూతురు శ్రీజ.. తన సోదరుడికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు తమ్ముడు. పొడుగ్గా ఉన్నంత మాత్రాన తెలివైన వాళ్లమని అనిపించుకోలేరు. అందుకే నీ కోసం నేను ఉన్నాను. నా బాల్యాన్ని ఎంతో సంతోషంగా గడిచేలా చేశావు. అంతేకాదు నాకు సపోర్ట్గా ఉన్నావు. ఎంతో ప్రేమించావు. నీ మీద నాకు మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంది’అంటూ వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్లతో దిగిన ఫోటోని ఇన్స్టాలో షేర్ చేసింది శ్రీజ. ప్రస్తుతం శ్రీజ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
మెగా డాటర్ శ్రీజ పోస్ట్పై సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ ఆసక్తికర కామెంట్
Samantha Stylist Preetham Jukalker Comments On Mega Daughter Sreeja Post Goes Viral: సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్.. ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలిచిన పేరు ఇది. టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య-సమంత విడాకుల ముందుకు వరకు ప్రీతమ్ జుకాల్కర్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు. కానీ వారి విడాకుల ప్రకటన అనంతరం ఈ పేరు మీడియాలో, సోషల్ మీడియాల్లో మారు మోగింది. ఎందుకంటే చై-సామ్ విడిపోవడానికి ప్రధాన కారణం ఇతడేనంటూ అక్కినేని ఫ్యాన్స్ ప్రీతమ్పై మండిపడ్డారు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా సమంత స్టైలిస్ట్ అయితే మాత్రం తనతో అంత చనువేంటని, సామ్కు దూరంగా ఉండాలంటూ చై-సామ్ అభిమానులు అతడికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలా వివాదాలు, విమర్శలు ఎదుర్కొంటు ప్రీతమ్ వార్తల్లోకి ఎక్కాడు. ఇక తాజాగా మరోసారి ప్రీతమ్ పేరు తెరపైకి వచ్చింది. మెగా డాటర్ శ్రీజ కల్యాణ్ బర్త్డే రోజున ఆమె పెట్టిన పోస్ట్పై ప్రీతమ్ ఆసక్తికర కామెంట్ చేశాడు. దీంతో ప్రీతమ్ పెట్టిన కామెంట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చదవండి: నాగ్ సినిమా మేకర్స్కు చుక్కలు చూపించిన అమలా పాల్, మెహ్రీన్! శ్రీజ తనకు బర్త్డే విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ తన ఫొటోతో పోస్ట్ షేర్ చేసింది. దీనికి ప్రీతమ ‘సుందర్ లడికీ(అందమైన అమ్మాయి)’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో నెటజన్ల ఫోకస్ ప్రీతమ్ కామెంట్పై పడింది. చూస్తుంటే ప్రీతమ్ సమంతకు మాత్రమే కాదు టాలీవుడ్కు చెందిన పలువురికి డిజైనర్గా వ్యవహరిస్తున్నాడంటూ చర్చించుకుంటున్నారు. అంతేగాక సమంతతో పాటు మెగా కుటుంబానికి కూడా ప్రీతమ్ సుపరిచితుడేనంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: హాట్ టాపిక్గా శివకార్తికేయన్ రెమ్యునరేషన్, తక్కువ టైంలో అంత మొత్తమా! View this post on Instagram A post shared by Sreeja (@sreeja_kalyan) -
విడాకుల రూమర్స్కి ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చిన మెగా అల్లుడు
Kalyan Dev Sreeja Divorce Rumors: సమంత-నాగచైతన్య విడాకుల తర్వాత ఇండస్ట్రీకి చెందిన మరో జంట విడిపోనున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ-హీరో కల్యాణ్దేవ్లు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు దీపావళి సెలబ్రేషన్స్లో సైతం వీరు కనిపించలేదు. అంతేకాకుండా మేనల్లుడు సాయిధరమ్ తేజ్తో పాటు మెగా హీరోలందరూ కలిసి దిగిన ఫొటోలోనూ కళ్యాణ్ దేవ్ మిస్ అయ్యాడు. సాధారంగా మెగా ఫ్యామిలీలో జరిగే దాదాపు అన్ని వేడుకల్లో కల్యాణ్ దేవ్ హాజరవుతుంటారు. అలాంటిది ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్లో కనిపించకపోవడంతో ఈ వార్తలు నిజమేనేమో అన్న అనుమానం కొందరిలో మొదలైంది. తాజాగా కల్యాణ్దేవ్ ఒక్క ఫోటోతో రూమర్స్కి చెక్ పెట్టారు. భార్య శ్రీజ బర్త్డే సందర్భంగా..హ్యాపీ బర్త్డే స్వీటూ అంటూ లవ్ సింబల్ను జతచేస్తూ ఫోటోను పోస్ట్ చేశాడు. దీనికి శ్రీజ ఇన్స్టా అకౌంట్ను కూడా ట్యాగ్ చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన విడాకుల రూమర్స్కి బ్రేక్ పడినట్లయ్యింది. 2016లో శ్రీజ-కల్యాణ్ల వీరి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. కాగా విజేత సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ దేవ్ ఇటీవలె సూపర్ మచ్చి, కిన్నెరసాని షూటింగ్స్ పూర్తి చేశారు. త్వరలోనే ఈ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
సిస్టర్స్కు ట్రీట్ ఇచ్చిన హీరో రామ్చరణ్
హీరో రామ్ చరణ్ తన సిస్టర్స్ సుస్మితా కొణిదెల, నిహారిక, శ్రీజ కల్యాణ్లకు ఆదివారం లంచ్ ట్రీట్ ఇచ్చారు. రాఖీ పండగ సమయంలో రామ్చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ షూట్తో బిజీగా ఉండటం వల్ల తన సిస్టర్స్కు ట్రీట్ ఇవ్వలేకపోయారని, ఇప్పుడు టైమ్ దొరకడంతో వారిని లంచ్కి తీసుకెళ్లారట. పై ఫోటోలను సుస్మిత, నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. చదవండి :కృష్ణాష్టమి: 'రాధే శ్యామ్' సర్ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్ Chiranjeevi: కపిల్ దేవ్ను కలిసిన చిరు A lovely afternoon with the favs @AlwaysRamCharan @sushkonidela #Sreeja 💜 pic.twitter.com/1OR7jrcvOc — Niharika Konidela (@IamNiharikaK) August 29, 2021 -
శ్రీజ-కల్యాణ్ స్కూల్లో బెంచ్మెట్స్
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి పండుగ రోజు ఇంకో పండుగ కూడా. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పుట్టినరోజుని కూడా అదే రోజు జరుపుతారు. రెండు పండుగల సందడి నడుమ భర్త కల్యాణ్ దేవ్తో కలిసి శ్రీజ ‘సాక్షి’ కోసం ఇంటర్వ్యూ ఇచ్చారు. శ్రీజ-కల్యాణ్ స్కూల్లో బెంచ్మెట్స్, చిన్ననాటి స్నేహితులు జీవితాన్ని పంచుకున్నారు. విజేతతో హీరో కాకముందు కల్యాణ్ నటుడు కావడానికి చాలా ప్రయత్నాలు చేశారు.. అప్పుడేమైంది? కల్యాణ్ సినిమాలో మామయ్య చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ ఎంత? నిహారిక పెళ్లిలో మెగా సందడి ఎలా ఉండబోతుంది? శ్రీజను రామ్ చరణ్ ఎలా ఆటపట్టించేవాడు? కల్యాణ్ ఇంట్లో ఎలా ఉంటాడు? ఇలాంటి బోలెడు మచ్చట్లను ‘సాక్షి’తో పంచుకున్నారు. అవేంటో చూసేయండి మరి -
పండగవేళ చిరుదివ్వెలు
-
నవిష్క..వేడుక
చిరంజీవి కుటుంబంలో డిసెంబర్ 25న రెండు పండగలు జరిగాయి. ఒకటి క్రిస్మస్ సెలబ్రేషన్ కాగా మరోటి చిరంజీవి మనవరాలు నవిష్క పుట్టినరోజు వేడుక. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, కల్యాణ్ దేవ్ల కూతురు నవిష్క. ఈ చిన్నారికి మొదటి పుట్టినరోజు ఇది. ఈ బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది చిరంజీవి ఫ్యామిలీ. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఉపాసన. ‘‘హ్యాపీ బర్త్డే డార్లింగ్ నవిష్క. మీ అత్తామామ (ఉపాసన, రామ్చరణ్)కు నువ్వంటే చాలా ప్రేమ’’ అని ఈ ఫొటోలను షేర్ చేశారు. కల్యాణ్ దేవ్, నవిష్క, శ్రీజ, రామ్చరణ్, ఉపాసన -
అత్త మామల ప్రేమతో: ఉపాసన కొణిదెల
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ సతీమణిగా..అపోలో హాస్పిటల్ ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్గా ఉపాసన కొణిదెల ప్రత్యేక పాత్ర పోషిస్తూ ఉంటారు. చరణ్కు సంబంధించిన విశేషాలతోపాటు అనేక విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. మెగాస్టార్ చిరజీవి రెండో కూతురు శ్రీజా- కళ్యాణ్ దేవ్ల గారాల పట్టి నవిష్క పుట్టిన రోజు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. అదే రోజు క్రిస్మస్ కావడంతో మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది. ఇక ఈ పార్టీలో రామ్ చరణ్, ఉపాసన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరూ ఎల్లో కలర్ దుస్తుల్లో మెరిసిపోయారు. పార్టీలో శ్రీజ, కల్యాణ్ దంపతుల కూతురితో దిగిన ఫోటోలను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. అత్త మామల ప్రేమతో..హ్యపీ బర్త్డే డార్లింగ్ నవిష్క’ అని క్యాప్షన్ జోడించారు. అలాగే బర్త్డే బేబీ తండ్రి కళ్యాణ్ దేవ్ సైతం కూతురు పుట్టిన రోజు సందర్భంగా భావోద్వేగ ట్వీట్ చేశారు. తన కూతురు మీద ఉన్న ప్రేమను ముద్దుగా ట్వీట్ రూపంలో తెలియజేశాడు. ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్టైగర్ ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్కు జోడీగా అలియా భట్.. ఎన్టీఆర్కు జోడిగా హాలీవుడ్ నటి ఒలివియా మోరిన్ నటిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 31న విడుదల కానుంది. View this post on Instagram Mr & Mrs C wish u a Very Merry Christmas ❤️🎄 Happy First Birthday darling #navishka - ur mama & atha love u. Check us out #twinning 😛 coincidence A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on Dec 25, 2019 at 6:49am PST View this post on Instagram Mr & Mrs C wish u a Very Merry Christmas ❤️🎄 Happy First Birthday darling #navishka - ur mama & atha love u. Check us out #twinning 😛 coincidence A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on Dec 25, 2019 at 6:49am PST View this post on Instagram I never realised that an year goes by so fast, we hope we gave you enough of ours to make you happy. One day you may be a woman, but I will always remember your first laughs and cries. The way you called me Nanna, it is etched deep within. Hope you had the best first birthday Navishka! . 📸 @epics_by_avinash #sreejakalyanbaby @sreeja_kalyan A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) on Dec 25, 2019 at 8:15am PST -
గుడ్ ఫాదర్
ఇద్దరు పిల్లలున్నప్పుడు ఒకరికి ఏదైనా ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే బావుండదనుకుంటారు పేరెంట్స్. ఇలానే అనుకుని తన కూతుర్ని తన తదుపరి చిత్రంలో నటింపజేస్తున్నారు విజయ్ సేతుపతి. ‘నానుమ్ రౌడీదాన్’ సినిమాలో విజయ్ సేతుపతి చిన్నప్పటి పాత్రలో అతని తనయుడు సూర్య నటించాడు. విడుదలకు సిద్ధమైన విజయ్ సేతుపతి ‘సిందుబాద్’లోనూ సూర్య ఓ పాత్ర చేశాడు. విజయ్ సేతుపతి నటిస్తున్న ‘సంఘ తమిళన్’ చిత్రంలో అతని కుమర్తె శ్రీజ నటించనుందట. విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ‘‘వాడిని (సూర్య) యాక్ట్ చేయించి తనని (శ్రీజ) యాక్ట్ చేయించకపోతే తనని వదిలేసినట్టు తను బాధపడకూడదు. అందుకే ఈ సినిమాలో యాక్ట్ చేయిస్తున్నాను’’ అని పేర్కొన్నారు విజయ్ సేతుపతి. -
నిత్య నూతనం
చిరంజీవి ఇంట్లో సందడి నెలకొంది. ఆయన చిన్నల్లుడు కల్యాణ్ దేవ్, శ్రీజ దంపతుల ముద్దుల తనయకు నవిష్క అని నామకరణం చేశారు. శుక్రవారం ఈ నామకరణ వేడుక జరిగింది. ‘మా చిన్నారికి నవిష్క అని పేరు పెట్టాం’ అంటూ కల్యాణ్దేవ్ సోషల్ మీడియాలోన ఈ విషయాన్ని పేర్కొన్నారు. ‘నవిష్క’ అంటే నిత్య నూతనం అని అర్థం అట. -
‘ఈ క్రిస్మస్ జీవితాంతం గుర్తుండి పోతుంది’
క్రిస్మస్ పర్వదినాన మెగాస్టార్ చిరంజీవి ఇంట సంతోషాలు వెల్లివిరిశాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మంగళవారం ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన కూతురి పాద ముద్ర ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్.. ‘ 2018 క్రిస్మస్ మాకు జీవితాంతం గుర్తుండి పోతుంది. ఆడపిల్ల పుట్టింది. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్ జతచేశారు. కాగా విజేత సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం రెండో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రిజ్వాన్ నిర్మించనున్న ఈ సినిమా ద్వారా పులి వాసు దర్శకునిగా పరిచయం కానున్నారు. ఇక ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ స్వరాలు సమకూర్చనున్నారు. View this post on Instagram 2018 Christmas to remember for life! We have been blessed with a #BabyGirl 👶🏻 this morning. Super Merry Christmas to all of you!🎄 #SreejaKalyanBaby2Arrived #SoMuchOfLove #Nivrithi ‘s #Sister #Arrived @sreeja_kalyan A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) on Dec 24, 2018 at 10:42pm PST -
సినిమాల్లోకి చిరంజీవి చిన్నల్లుడు?
హైదరాబాద్: పెద్ద స్టార్ల కొడుకులే కాదు.. అల్లుళ్లు కూడా వారసులుగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన చరిత్ర టాలీవుడ్లో ఉంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు అంటూ వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న కళ్యాణ్ తెరంగేట్రానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. క్యూట్ లుక్స్తో అదరగొడుతున్న ఇతగాడిని హీరోగా పరిచయం చేయబోతున్నట్టు సమాచారం. 'మెగాస్టార్ చిన్నల్లుడు', 'శ్రీజతో కళ్యాణ్' అంటూ లీకైన ఫొటోలు టీటౌన్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. దీంతోపాటు శ్రీజతో పెళ్లయిన తర్వాత చిన్నల్లుడు సినీ రంగ ప్రవేశం చేయనున్నాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అటు ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ట అల్లుడు సుధీర్ బాబు హీరోగా పరిచయమయ్యాడు. ఇపుడు చిరంజీవి చిన్నఅల్లుడు కళ్యాణ్ వంతు వచ్చిందన్నమాట అంటూ టాలీవుడ్ గుసగుసలాడుతోంది. శ్రీజ పెళ్లి వార్తలపై ఇప్పటికీ గోప్యతను పాటిస్తున్నమెగా ఫ్యామిలీ , మరి ఈ వార్తలపై ఎలా స్పందిస్తుందో చూడాలి. -
శ్రీజను చూసి పవన్ కళ్యాణ్ కంటతడి!
-
శ్రీజను చూసి పవన్ కళ్యాణ్ కంటతడి!
ఖమ్మం: బ్రెయిన్ ఫీవర్ తో బాధపడుతున్నశ్రీజ ఆరోగ్య పరిస్థితి చూసి సినీ నటుడు పవన్ కళ్యాణ్ చలించి పోయారు. ఓ దశలో పవన్ కళ్యాణ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీజను శుక్రవారం మధ్యాహ్నం పరామర్శించారు. తనను చూడాలని ఉన్న చిన్నారి శ్రీజ కోరికను పవన్ కళ్యాణ్ తీర్చేందుకు ప్రయత్నించారు. పలుమార్లు శ్రీజ అంటూ పేరు పెట్టి పవన్ పిలిచినట్టు, అయితే బాలిక స్పందించకపోవడంతో ఆవేదనకు గురయ్యారరని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వైద్యం కోసం కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలను,శ్రీజ కోసం ఆట వస్తువులను పవన్ కళ్యాణ్ ఇచ్చారు. -
భార్యను కడతేర్చిన భర్త
ఏడడుగులు నడిచి కడదాకా తోడుంటానని ప్రమాణం చేసి కట్టుకున్న భర్తే భార్యను కడతేర్చాడు. నిండుచూలాలని చూడకుండా కర్కశంగా గొంతుకోసేశాడు. ఈ ఘటనను చూసిన మూడేళ్ల కూతురినీ తుదముట్టించేందుకు ఒడిగట్టాడు. ఈ ఘోర సంఘటన మండల పరిధిలోని షాద్నగర్ మున్సిపాలిటీ చటాన్పల్లి శివారులో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. - న్యూస్లైన్, షాద్నగర్ రూరల్ తాగినమైకంలో కట్టుకున్న భార్య ను గొంతుకోసి హత్యసేశాడు ఓ భర్త. అంతటితో ఆగక తన చిన్నారి కూతురుపైనా దాడి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. కేశంపేట మండలం వేముల్నర్వ గ్రామానికి చెందిన తిరుపతమ్మ(25)ను అదే మండలం తులవానిగడ్డ గ్రామానికి చెందిన ఓడ్సు వెంకటేష్కు ఇచ్చి ఏడేళ్ల క్రితం వివాహం జరిపించా రు. వీరికి శ్రీజ(3)ఉంది. కొంతకాలంగా వెంకటేష్ తాగుడుకు బానిసై భార్యతో తరచూ గొడవపడేవాడు. ఏదాడి క్రితం చటాన్పల్లి శివారులోని రాంనగర్ కాలనీ లో ఇల్లు నిర్మించుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. కాగా మంగళవారం రాత్రి వెంకటేశ్ తాగి వచ్చాడు. ఇంటి ఆవరణ లో నిద్రపోయూరు. తెల్లవారుజామున ఇరువురు గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన వెంకటేష్ తాగినమైకంలో ఎనిమిది నెలల గర్భిణి అనికూడా చూడకుండా మారణాయుధంతో భార్య తిరుపతమ్మ గొంతుకోసి కడతేర్చాడు. ఈ అలికిడికి పక్కనే నిద్రిస్తున్న కూతురు శ్రీజ నిద్రమేల్కొనడంతో విషయం ఎవరికైనా చెబుతుందేమోనని చిన్నారిపైనా దాడి చేయగా కేకలేస్తూ బయటకు పరుగులు తీసి అదే కాలనీలో నివాసముంటున్న వెంకటేష్ అన్న ఓడ్సు స్వామికి విషయాన్ని చెప్పిం ది. స్వామి ఫోన్ ద్వారా తిరుపతమ్మ కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందిచారు. తీవ్రంగా గాయపడిన శ్రీజను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. పట్టణ సీఐ నిర్మల సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించా రు. నిందితుడిని అదుపులోకి తీసుకొని తిరుపతమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి గొలుసు అనంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ద ర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నిర్మల తెలిపారు.