Suresh Kondeti
-
‘అభిమాని’ కోసం రంగంలోకి మణిశర్మ
ప్రముఖ సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా "అభిమాని". ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనేది ఈ చిత్ర ట్యాగ్లైన్. భూలోకం, యమలోకం నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాంబాబు దోమకొండ. ఎస్కే రహ్మాన్, కంద సాంబశివరావు గారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము సంగీతాన్ని (పాటలు) అందిస్తున్నారు. ఈ అభిమాని సినిమాకు మెలొడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా రీ రికార్డింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు మకర సంక్రాంతి విశెస్ తెలియజేసింది మూవీ టీమ్. ఫిబ్రవరిలో "అభిమాని" సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.ఈ సందర్భంగా మెలొడీ బ్రహ్మ మణిశర్మ మాట్లాడుతూ - అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి కంటెంట్ ఇంకా సోషల్ మెసేజ్ కలిగిన అభిమాని( Abhimani) మూవీకి అంతే గొప్పగా నేపథ్య సంగీతం కుదిరింది . ఇందులో ఉన్న అంశం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ప్రధాన పాత్రలో నటించిన సురేష్ కొండేటి బాగా నటించారు. ఆయన నటన అందరినీ ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ దోమకొండ రాంబాబు అనుకున్న కంటెంట్ ని అదే స్థాయిలో ప్రజెంట్ చేశారు. సురేష్ కొండేటి జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుండి నాకు పరిచయం. ఈ సినిమాలో తన నటనతో మంచి పేరు తెచ్చుకుంటాడు. అభిమాని మూవీని మీరంతా సూపర్ హిట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అల్ ది బెస్ట్ సురేష్, అండ్ అభిమాని టీమ్. అన్నారు.అనంతరం డైరెక్టర్ రాంబాబు మాట్లాడుతూ ..'అభిమాని' మూవీకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెలొడీ బ్రహ్మ మణిశర్మ గారు అందించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చారు. రీ రికార్డింగ్ కంప్లీట్ అయ్యింది. మూవీలోని విజువల్స్ మణిశర్మ గారి నేపథ్య సంగీతం కలిసి ఐ ఫీస్ట్ లా ఉంటుంది. సినిమా అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. మరీ ముఖ్యంగా సినిమాకి ప్రాణం అయిన చివరి 20 నిమిషాలుకు మణిశర్మ గారు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోశారు. మా సినిమాకు సపోర్ట్ చేసిన మణిశర్మ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం’ అన్నార. సురేష్ కొండేటి(Suresh Kondeti) మాట్లాడుతూ - లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు నేను ప్రధాన పాత్ర పోషించిన అభిమాని సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. ఈ సంక్రాంతిని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అందుకే ఈసారి మా ఊరికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. మణిశర్మ అనేది పేరు కాదు, ఓ బ్రాండ్. ఆయన సంగీతం వల్లే బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. తెలుగులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే మణిశర్మ చేయాలనే రేంజ్లో తన సినిమాలతో రఫ్పాడించారు. నేను యంగ్ గా ఉన్నప్పుడు ఆయన పాటలు వింటూ ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను అలాంటిది ఇప్పుడు అంతటి మెలోడీ బ్రహ్మ నా సినిమాకు నేపథ్య సంగీతాన్ని అందించడం తో సంతోషంగా ఉంది. మణిశర్మ గారితో నా పరిచయం కొన్ని దశాబ్దాల నాటిది. మణిశర్మ గారి మా టీమ్ కు తోడయ్యక అభిమాని సినిమా లెవెల్ పెరిగింది. రీ రికార్డింగ్ అద్భుతంగా వచ్చింది. ఇప్పటిదాకా నన్ను సినీ జర్నలిస్ట్ గా, ప్రొడ్యూసర్ గా ఆదరించిన ప్రేక్షకులు నటుడిగా కూడా అభిమాని సినిమాతో ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అన్నారు. -
నిర్మాత సురేష్ కొండేటి, అక్సాఖాన్ సినిమా గ్లింప్స్ విడుదల
నిర్మాత సురేష్ కొండేటి సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే 'దేవినేని' అనే సినిమాతో కొద్దిరోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన 'అభిమాని' అనే మరో కొత్త సినిమాను ప్రకటించారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ డైరెక్టర్ రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైంది.మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం ఒక పోస్టర్ను రిలీజ్ చేశారు. అభిమాని ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనే ట్యాగ్లైన్ తో సినిమా తెరకెక్కింది. ఇందులో సురేష్ కొండేటి సరసన అక్సాఖాన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్కే రహ్మాన్, మరియు కంద సాంబశివరావు గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.గ్లింప్స్ విడుదల సందర్బంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. 'అభిమాని సినిమా గ్లింప్స్ చాలా బాగుంది. టైటిల్ సెలక్షన్తోనే సినిమా సగం విజయం సాధించింది. అభిమాని అంటే కేవలం ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లి సినిమా చూసి కాగితాలు ఎగరవేయడమే కాదు, తన అభిమాన హీరో చేసే మంచి కార్యక్రమాలు, వారిలో ఉన్న మంచి లక్షణాలు, వారు ఎంత కష్టపడి పైకి వచ్చారో తెలుసుకుని, తాను పాటిస్తూ పదిమందికి చెప్పాలి. అదే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం.' అని ఆయన చెప్పారు. -
లడ్డూ దక్కించుకున్న సినీ నిర్మాత కొండేటి సురేష్
ప్రముఖ సినీ నిర్మాత, సంతోషం అధినేత కొండేటి సురేష్ గణపతి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఫిలింనగర్ దైవసన్నిదానంలో శనివారం నిర్వహించిన గణనాథుడి లడ్డూ వేలంలో పాల్గొన్న ఆయన ’ 19 వేలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు గణపతి చేతిలో పూజలందుకున్న లడ్డూ తనకు దక్కడం సంతోషంగా ఉందని, ప్రతియేటా తాను లడ్డూ వేలం పాటలో పాల్గొని లడ్డూను దక్కించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ఆలయ కోశాధికారి కాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సురేశ్ కొండేటికి నానమ్మగా అన్నపూర్ణమ్మ!
తెలుగు సినిమాల్లో అమ్మ, అమ్మమ్మ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి అన్నపూర్ణమ్మ. సీనియర్ ఎన్టీఆర్తో పాటు చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలకు ఈమె అమ్మగా నటించి మెప్పించింది. తమిళ సినిమాల్లోనూ అన్నపూర్ణమ్మకు ఎక్కువ అవకాశాలు వచ్చినా సరే తెలుగు సినిమాలనే ఎక్కువగా చేస్తూ వచ్చింది. ఇప్పటికీ ఏదో ఒక మూవీలో కనిపిస్తూనే ఉంటుంది. (ఇదీ చదవండి: దారుణంగా రజినీకాంత్ కొత్త సినిమా పరిస్థితి.. కానీ ఎందుకిలా?) దాదాపు 80 సినిమాల్లో ఆమె అమ్మ పాత్రలు చేసింది. ఇప్పుడు ఈమె.. నటుడిగా మారిన సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటికి నానమ్మ పాత్రలో నటిస్తోంది. సురేష్ కొండేటి ప్రస్తుతం 'అభిమాని' అనే వెబ్ ఫిల్మ్ చేస్తున్నారు. ఇందులోనే వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారు. బషీర్ అమ్మ ప్రొడక్షన్స్లో వస్తున్న అభిమాని వెబ్ మూవీకి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?) -
గోవాలో ఘనంగా సంతోషం అవార్డ్స్ వేడుక (ఫొటోలు)
-
కొంతమంది కావాలనే బురద జల్లుతున్నారు: సురేశ్ కొండేటి
గోవాలో జరిగిన సంతోషం అవార్డ్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ అంశంపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని గత 21 ఏళ్లుగా ఇస్తున్న సినీ జర్నలిస్ట్ సురేశ్ కొండేటి స్పందించారు. ఈ అవార్డులు పూర్తిగా తన వ్యక్తిగతమని.. తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదంటూ ట్వీట్ చేశారు. సురేశ్ కొండేటి ట్వీట్లో రాస్తూ..' అందరికీ నమస్కారం .. గత 21 సం. గా నేను సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను . ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. దీనితో తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదు . ప్రతి సంవత్సరం చాలా కష్టపడి నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా అవార్డ్స్ ఇస్తున్నా. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే . అందుకే 4 ఇండస్ట్రీ వాళ్లని కలిపి అవార్డ్స్ ఇస్తున్నా. గోవా ఈవెంట్లో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన 1200 మందికి సెలబ్రిటీస్కు రూమ్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బంది జరిగింది. కన్నడ, తమిళ వాళ్లని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇంత పెద్ద ఈవెంట్లో కొన్ని పొరపాట్లు జరగడం కామన్. ఇది ఉదేశ్య పూర్వకంగా చేసింది కాదు. దయచేసి అర్ధం చేసుకోగలరు. ఈవెంట్ వల్ల ఇబ్బంది పడి ఉంటే పేరు పేరునా సారీ చెప్తున్నాను. నా మీద కావాలనే కొంత మంది కావాలని బురద జల్లుతున్నారు. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ మీ సురేష్ కొండేటి' అంటూ ట్వీట్ చేశారు. pic.twitter.com/zlLhjNx8UM — Suresh Kondeti (@santoshamsuresh) December 4, 2023 అందరికీ నమస్కారం .. గత 21 సం. గా నేను సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను .. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం . దీనితో తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదు .. ప్రతి సం చాలా కష్టపడి, గ్రాండ్ గా నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా అవార్డ్స్ ఇస్తున్నాను .. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే ..… — Suresh Kondeti (@santoshamsuresh) December 4, 2023 -
అతడు ఫెయిలయ్యాడు, మాకు పీఆర్వో కాదు.. అల్లు అరవింద్ సీరియస్
ఈ మధ్య సినిమా ప్రమోషన్స్లో విలేఖరి సురేశ్ కొండేటి పేరు మారుమోగుతోంది. సెలబ్రిటీలను చిత్రవిచిత్ర ప్రశ్నలడుగుతూ సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయాడు. ఈయన చాలాకాలం నుంచి సంతోషం అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాడు. అయితే ఈసారి ఏకంగా గోవాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. దక్షిణాది నుంచి పలువురు సెలబ్రిటీలను ఈవెంట్కు తీసుకెళ్లాడు. కానీ ఈ ఫంక్షన్ రసాభాసగా జరగడంతో టాలీవుడ్ పరువుపోయే పరిస్థితికి వచ్చింది. కన్నడ సెలబ్రిటీలకు ఇబ్బందులు ఈవెంట్ నిర్వహణలో కన్నడ సెలబ్రిటీలకు చేదు అనుభవం ఎదురైందట. స్టేజీపై కన్నడ నటులకు అవార్డులు ఇస్తున్న సమయంలో సడన్గా లైట్స్ ఆర్పేసి వారిని అవమానించారని, హోటల్ సిబ్బందితోనూ ఇబ్బందులు ఎదురయ్యాయంటూ.. కన్నడ ప్రతినిధులు సంతోషం అవార్డు వేడుకల మీద విమర్శలు చేస్తూ టాలీవుడ్ను తప్పుపడుతున్నారు. వేడుక మధ్యలో నుంచే యాంకర్ వెళ్లిపోయిందని, తమకు సరైన ఏర్పాట్లు చేయకుండా దారుణంగా అవమానించారంటూ కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించాడు. ఒక వ్యక్తి చేసిన పొరపాటు 'ఒక జర్నలిస్టు అనేక సంవత్సరాలుగా అవార్డు ఫంక్షన్స్ నిర్వహిస్తున్నాడు. ఈసారి గోవాలో చేద్దామనుకున్నాడు, కానీ ఏదో కొన్ని కారణాల వల్ల ఫెయిలయ్యాడు, చేయలేకపోయాడు. ఆ ఫంక్షన్కు వెళ్లినవారు ఇబ్బందులు పడ్డారు. అందులో ఇతర భాషల వారు కూడా ఉన్నారు. వాళ్లు తెలుగు సినీ ఇండస్ట్రీని నిందిస్తున్నారు. అది సరైనది కాదు. ఒక వ్యక్తి చేసిన పొరపాటును ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. అలాగే మీడియా.. అతడిని మా కుటుంబానికి చెందిన వ్యక్తికి పీఆర్వో అని రాస్తున్నారు. ఆయన ఎవరికీ పీఆర్వో కాదు. మా ఫ్యామిలీకి చెందిన పీఆర్వో అసలే కాదు. తను సొంతంగా ఏదో కార్యక్రమం చేయాలనుకుని ఫెయిలయ్యాడు.. అంతే!' అని పేర్కొన్నాడు. .#Kannada celebrities face humilation at #SanthoshamSouthIndian Film awards #Goa It is with deep concern and disappointment that we need to address the distressing events that transpired at the #Santhosham #South #Indian Film Awards 2023 The award function that is organised by… pic.twitter.com/s0kXAKPmh1 — A Sharadhaa (@sharadasrinidhi) December 3, 2023 చదవండి: జపాన్ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. అప్పుడే స్ట్రీమింగ్ -
25 ఏళ్లుగా ‘సంతోషం’.. మరో మూడేళ్లు గ్యారెంటీ: సురేశ్ కొండేటి
‘చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లాంటి అగ్ర హీరోల ప్రోత్సాహంతో గత 25 ఏళ్లుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డులను అందిస్తున్నాను. మరో మూడేళ్లు కూడా కచ్చితంగా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి’అని ‘సంతోషం’ పత్రికాధినేత సురేష్ కొండేటి అన్నారు. డిసెంబర్ 2న గోవాలో ‘సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డులు– 2023’ వేడుక జరుగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా సురేశ్ కొండేటి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 18న హైదరాబాదులో సంతోషం ఓటీటి అవార్డ్స్ని, డిసెంబర్ 2న గోవాలో సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు బాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నట్లు ఆయన వెల్లడించారు. ఫంక్షన్ నిర్వహణకు గోవా ప్రభుత్వ అధికారులు చేసిన సహాయం మర్చిపోలేనిదన్నారు. -
గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్.. వీడియో రిలీజ్ చేసిన శ్రీలీల
సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డుల వేడుక డిసెంబరు 2న గోవాలో జరగనుంది. సంతోషం 22వ ‘సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డులు– 2023’ వేడుక గోవాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరగనున్నట్లు, జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా శుక్రవారం హీరోయిన్ శ్రీలీల ఓ వీడియోలో వెల్లడించారు. ఇక గోవాలోని బాంబోలిం బీచ్ కు అతి చేరువలో ఉన్న డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఈ అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది. ఇక అదే సమయంలో గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. 150 దేశాల నుంచి సినీ ప్రేమికులు ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ను ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇక ఆ దేశాల సినీ ప్రేమికులు, మన ఇండియన్ సినీ లవర్స్ మోహరించి ఉన్న గోవాలో వేలాది ప్రేక్షకుల మధ్య సంతోషం 22వ సౌత్ ఇండియన్ ఇండియన్ ఫిలిం అవార్డుల వేడుక జరగనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు బాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నట్లు నిర్వాహకుడు, ‘సంతోషం’ పత్రికాధినేత సురేష్ కొండేటి పేర్కొన్నారు. Exciting news for all the film enthusiasts! 🎥 The Goa Santosham South Indian Film Awards 2023 is just 50 days away, and it's happening on December 2nd at Dr. Shyama Prasad Mukherjee Indoor Stadium, Goa. Can't wait to see what our favorite stars bring to the stage. Mark your… pic.twitter.com/zpvcBrr7aF — Suresh Kondeti (@santoshamsuresh) October 13, 2023 -
సురేశ్ కొండేటికి సిద్ధార్థ్ సీరియస్ వార్నింగ్.. అసలేం జరిగిందంటే?
బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దార్ధ్. ఈ చిత్రంలో జెనీలియా అతనికి జంటగా నటించింది. ప్రస్తుతం ఆయన చిత్తా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పటికే ఈ సినిమా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాగా.. తెలుగు ఈనెల 6న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ్ వరుసగా మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్కు ఆయన హాజరయ్యారు. (ఇది చదవండి: వేదికపైనే బోరున ఏడ్చేసిన కలర్స్ స్వాతి.. ఎందుకంటే? ) అయితే ఈ ప్రెస్ మీట్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సినిమా ఈవెంట్స్లో కాంట్రవర్సీ ప్రశ్నలకు కేరాఫ్గా మారిన సీనియర్ జర్నలిస్ట్ సురేశ్ కొండేటి కూడా హాజరయ్యారు. ఆయన ప్రశ్నలు అడిగేముందే హీరో సిద్ధార్థ్.. అతనిపై సీరియస్ కామెంట్స్ చేశారు. మీరు కాస్తా పద్ధతిగా ప్రశ్నలు అడిగితే బాగుంటుందని మీకు చెప్పమని నాకు ఇంటర్నెట్లో సలహా ఇచ్చారంటూ సిద్ధార్థ్ అన్నారు. సిద్ధార్థ్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. 'కొండేటి సురేశ్కు ఒక వార్నింగ్. మొత్త ఇంటర్నెట్ నీకు వార్నింగ్ ఇవ్వమంది. ఆయనను పిలిస్తే పద్ధతిగా కూర్చొని, పద్ధతిగా ప్రశ్నలు అడగమని చెప్పండి. అలాంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన పనిలేదు అని సలహా ఇచ్చారు. అయితే నేను వారికి కూడా ఒకటి చెప్పాను. సురేశ్ కొండేటి నా ఫ్రెండ్ అయ్యా. అతనికి రైట్స్ ఉన్నాయి అని చెప్పా' అని నవ్వుతూ అన్నారు. ఈ వీడియోను నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. (ఇది చదవండి: గ్లోబల్ స్టార్ హార్స్ రైడ్.. మగధీరను గుర్తుకు తెస్తోన్న చెర్రీ!) Sariponu....... pic.twitter.com/DBYIHOGOAl — Arehoo_official (@tweetsbyaravind) October 3, 2023 -
చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్పై బేబమ్మ రియాక్షన్
విజయ్ దేవరకొండ సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండ హీరోగా బేబీ సినిమా జులై 14న విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమాకు సాయి రాజేశ్ దర్శకుడు కాగ ఎస్కేఎన్ నిర్మాతగా ఉన్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా విడుదలైంది. ఇందులో హీరోయిన్ పాత్ర డీగ్లామర్ రోల్లో ఉంటుంది. దీంట్లో ఆమెను బేబమ్మ అని పిలుస్తారట. (ఇదీ చదవండి: Bigg Boss 7 Telugu: బిగ్బాస్ 7 నుంచి పిలుపొచ్చిందన్న నచ్చావులే హీరోయిన్) ట్రైలర్ను చూసిన వారు నలుపు, తెలుపు శరీర రంగును ఉద్దేశించేలా తెరకెక్కిన ‘బేబీ’ లాంటి సినిమాలను ఇంకా చూడాలా అంటూ పలు విమర్శలు కూడా వచ్చాయి. చివరకు ఫెయిర్ అండ్ లవ్లీ కూడా తన పేరును గ్లో అండ్ లవ్లీగా మార్చుకుంది. అలాంటిది ఈ సినిమా కథ ఏమిటంటూ పలు కామెంట్లు వచ్చాయి. దీనికి హీరో ఆనంద్ కూడా రియాక్ట్ అయి సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుందామన్నాడు. అంతలా సినిమా విడుదలకు ముందే కొంతమేరకు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది ఈ సినిమా తాజాగా చిత్ర యూనిట్తో ఒక రిపోర్టర్ ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో భాగంగా 'బేబీ' సినిమా హీరోయిన్తో.. 'వైష్ణవి.. ముద్దు పెట్టుకుంటా' అని కొంచెం డిఫరెంట్గా అడుగుతాడు. దీంతో వైష్ణవికి ఫీజులు ఎగిరిపోయినంత పని అయింది. చివరకు ఏమనాలో తెలియకుండా కొద్దిసేపు అలాగే ఉండిపోతుంది. వెంటనే ఆ రిపోర్టర్ కలుగచేసుకుని ఈ సినిమాలో హీరో అడిగిన ప్రశ్న ఇదే కదా.. 'సినిమాలో హీరో ముద్దు పెట్టుకుంటా అన్నాడు కదా..' దానికి మీ రియాక్షన్ ఏంటి..? ' అంటూ తనదైన స్టైల్లో మార్చేస్తాడు. అప్పుడు వైష్ణవి కూడా ఓహ్... టీజర్లో ఉన్న సీన్ గురించా అంటూ.. గుర్తుతెచ్చుకుని 'చెప్పు తెగుద్ది అంటాను' అని అంటుంది. 'ఓహో చెప్పు తెగుద్దా' అంటూ వేరే టాపిక్లోకి వెళ్తాడు ఆ రిపోర్టర్. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' టీషర్ట్ కావాలంటే ఉచితంగా ఇలా బుక్ చేసుకోండి) బహాశా ఇది సినిమా ప్రమోషన్ కోసం చేసి ఉంటారో... అనుకోకుండా నిజంగానే జరిగిందో మాత్రం తెలియదు. కానీ సోషల్ మీడియాలో ఆ రిపోర్టర్ను మాత్రం విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియో కింద కామెంట్లు చేయడమే కాకుండా ఆయనకు ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో 2018 మూవీ ప్రెస్ మీట్లో కూడా ఇలాంటి వైరల్ కామెంట్లే చేశాడు. దీంతో దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆదే రిపోర్టర్పై మండిపడ్డారు. ఇలా ఎన్నో సంఘటనలు ఆయన ఖాతాలో ఉన్నాయి. -
డిసెంబర్లో ‘సంతోషం’
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అందచేస్తూ వస్తున్న అనేక అవార్డులలో ‘సంతోషం’ అవార్డ్సు ఒకటి. ‘సంతోషం’ సినీ వారపత్రిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ‘సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్’కి తేదీ ఖరారు అయింది. డిసెంబర్ 26న హైదరాబాద్లో ‘21వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022’ వేడుకలు జరగనున్నాయి. సౌత్ ఇండియా లోని నాలుగు భాషల సినిమాలకు అవార్డులు అందిస్తూ వస్తున్నారు ‘‘తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషలకు అవార్డులు అందించనున్నాం. ఈ వేడుకలో భాగంగా 12 గంటలపాటు నాన్స్టాప్ వినోదం ఉంటుంది’’ అని సంతోషం పత్రికాధినేత, నిర్మాత సురేష్ కొండేటి అన్నారు. -
‘మీ4 టిక్ టిక్’ యాప్ లాంచ్.. టిక్ టాక్ను మరిపిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ టిక్ టాక్ ద్వారా యూత్ తమ టాలెంట్ను నిరూపించుకుంటూ ఎంతో పాపులర్ అయ్యేవారు. అయితే కొన్ని భద్రతా కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం "టిక్ టాక్" ను బ్యాన్ చేసింది. దీంతో యువత ప్రత్యామ్నాయాలను ఎంచుకున్నప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా "రియోజాన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి "మీ 4 టిక్ టిక్" యాప్ ను ప్రముఖులు, యువత సమక్షంలో హైదరాబాద్లో ఘనంగా లాంచ్ చేసింది. ట్యాలెంటెడ్ యూత్ కు 'ME 4 టిక్ టిక్' యాప్ ఒక యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని "ME 4 Tic Tic" యాప్ ఇండియా సీఈవో డీసతీష్ రెడ్డి వెల్లడించారు. అన్ని రకాల కంటెంట్ తో అందరినీ అలరిస్తుందన్నారు. ముఖ్యంగా స్వదేశీంలో భారత ఐటీ యువత రూపొందించిన "ME 4 టిక్ టిక్" హైలీ సెక్యూర్డ్ యాప్ అనీ ఇందులో ఉండే డేటా చాలా సేఫ్ అని కంపెనీ వెల్లడించింది. ఈ యాప్ 150 దేశాలలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా అమెజాన్ భాగస్వామ్యంతో అమెజాన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఈ యాప్ ఉంటుందని, ఒక భారతీయుడిగా ఇండియాలో ఈ యాప్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యాప్ రూపొందించిన టీంకు కృతజ్ఞతలు తెలిపిన పలువురు, యాప్ సక్సెస్ కావాలని కోరుకున్నారు. ఇదివరకు సినిమాలో ఏ క్యారెక్టర్ కు ఎవరు సూట్ అవుతారో ఫోటో షూట్ చూసి సెలెక్ట్ చేసేవారమనీ, సోషల్ మీడియా వచ్చిన తరువాత చాలామంది దర్శక, నిర్మాతలకు ఇపుడు ఆ పని ఈజీ అయ్యిందని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సినీ నిర్మాత సురేష్ కొండేటి వ్యాఖ్యానించారు. టిక్ టాక్కు ప్రత్యామ్నాయంగా వచ్చిన "ME4 టిక్ టిక్" యాప్ పెద్ద సక్సెస్ అవ్వాలన్నారు. -
జోడెద్దులు, నాలుగెకరాల పొలం ఉన్న భాగ్యవంతుడి కథే ‘జైత్ర’
‘‘ఇంజనీరో, డాక్టరో అవుతామని పిల్లలు చెప్పిన మాటలను వారి తల్లిదండ్రులు నమ్ముతారు. అలాగే యాక్టరో, ఫిల్మ్ మేకరో అవుతామని చెప్పినా కూడా తల్లిదండ్రులు నమ్మాలని కోరుకుంటున్నాను. ఫిల్మ్ మేకింగ్ కూడా బాధ్యతతో, గౌరవంతో కూడిన ఉద్యోగం’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. సన్నీ నవీన్, రోహిణీ రేచల్ జంటగా నటించిన చిత్రం ‘జైత్ర’. అల్లం సుభాష్, సురేశ్ కొండేటి నిర్మించిన ఈ సినిమా టైటిల్ లోగో, ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన వెంకీ కుడుముల మాట్లాడుతూ – ‘‘నా ‘ఛలో’ సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా చేసిన మల్లి సినిమాకు నేను అతిథిగా రావడం హ్యాపీగా ఉంది. మల్లి చాలా నిజాయితీగా ఈ సినిమా తీసి ఉంటాడని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘రాయలసీమలో జోడెద్దులు, నాలుగెకరాల పొలం ఉన్న భాగ్యవంతుడి కథే ‘జైత్ర’’ అన్నారు మల్లికార్జున్. ‘‘ప్రేమిస్తే, జర్నీ, పిజ్జా... ఇలా 15 సినిమాలను రిలీజ్ చేశాను. నిర్మాతగా నాకు మంచి పేరు తీసుకువచ్చే మరో సినిమా ‘జైత్ర’ సుభాష్ గారి ద్వారా వస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు సురేష్ కొండేటి. ‘‘రాయలసీమ యాసతో కూడిన మట్టిమనుషుల కథే ఈ చిత్రం’’ అన్నారు సుభాష్. -
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సురేశ్ కొండేటి
50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా సురేష్ కొండేటి, ఉపాధ్యక్షులుగా ఆర్.డి.ఎస్.ప్రకాష్, సురేష్ కవిరాయని, జనరల్ సెక్రెటరీగా ఎం. లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీలుగా ఎస్. నారాయణరెడ్డి ఎం.డి. అబ్దుల్, ట్రెజరర్ పి.హేమసుందర్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా.. తాటికొండ కేశవాచారి, వీర్ని శ్రీనివాసరావు, టి. మల్లిఖార్జున్, రమేష్ చందు, ధీరజ్ అప్పాజీ, నవీన్, రవి గోరంట్ల ఎన్నికయ్యారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బి.ఏ. రాజు, జయ గార్ల గౌరవార్థం వారి కుమారుడు బి.ఏ. శివకుమార్ ను ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మెంబర్ గా.. అలాగే కమిటీ ఆమోదంతో ఈసీ మెంబర్ గా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘రెండోసారి నన్ను ప్రెసిడెంట్ ని చేయడం అనేది చాలా సంతోషంగా ఫీలవుతున్నాను. నా మీద అంత నమ్మకం ఉంచినందుకు మనస్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. గతంలో నేను ఎలాగైతే సంస్థ అభివృదికి.. సభ్యులకు సంక్షేమానికి కృషి చేశానో.. ఇప్పుడు ఈ కమిటీలో ఉన్న సభ్యులందరి సహకారంతో ఇంకా మంచి పనులు చేయాలని.. చేస్తానని మాట ఇస్తున్నాను. ప్రతి మెంబర్ కి ఉపయోగపడేలా నిర్ణయాలు.. కమిటీ సభ్యుల ఆమోదంతో తీసుకోవడం జరుగుతుంది. సినిమా జర్నలిస్టుల అసోసియేషన్లో కీలకమైంది మాత్రం ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అని నేను ఖచ్చితంగా చెప్పగలుతాను ’అన్నారు -
వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ‘రియల్ దండుపాళ్యం’
రామ్ ధన్ మీడియా వర్క్స్ సమర్పణలో శ్రీ వైష్ణో దేవి పతాకంపై రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం `రియల్ దండుపాళ్యం`. మహేష్ దర్శకత్వంలో సి.పుట్టస్వామి, రామ్ధన్ మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా రామ్ధన్ మీడియా వర్క్స్ రిలీజ్ చేస్తోంది. ఈ మూవీ ట్రైలర్ని ప్రముఖ పాత్రికేయులు, నిర్మాత సురేష్ కొండేటి విడుదల చేశారు. అనంతరం సురేష్ కొండేటి మాట్లాడుతూ...``దండుపాళ్యం సిరీస్ తెలుగు, కన్నడ భాషల్లో సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. వాటిని మించేలా `రియల్ దండుపాళ్యం` చిత్రం ఉండబోతుందని ట్రైలర్ చూశాక అర్థమైంది. రాగిణి ద్వివేది అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరించింది. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న వాల్మీకి ఈ చిత్రంతో సినిమా రంగంలో కూడా సక్సెస్ సాధించి మరెన్నో చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నా`` అన్నారు. రామ్ ధన్ మీడియా వర్క్స్ అధినేత వాల్మీకి మాట్లాడుతూ...``తెలుగు, కన్నడ భాషల్లో దండుపాళ్యం సిరీస్ గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటన్నింటినీ మించేలా `రియల్ దండుపాళ్యం ఉండబోతుంది`. సొసైటీలో మగాళ్ళ వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ఈ ‘రియల్ దండుపాళ్యం’.అన్ని సెంటర్స్ లో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది’అన్నారు. -
రాజీవ్ కనకాలతో షూటింగ్లో పాల్గొన్న సురేష్ కొండేటి
Suresh Kondeti Shares Picture With Rajeev Kanakala In Shooting: తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు సురేష్ కొండేటి. 1996లో రాంబంటు సినిమాలో తొలిసారి నటుడిగా కనిపించిన ఆయన తనను నటుడిగా పరిచయం చేసిన డైరెక్టర్ బాపు జయంతి రోజున ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.నటుడు రాజీవ్ కనకాలతో కలిసి షూట్లో పాల్గొన్నారు.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ఇక రాంబంటు సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆయన ఇటీవలె దేవినేని సినిమాలో చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దాసరి గారు తనకు స్ఫూర్తి అని చెప్పే సురేష్ కొండేటి.. దాసరిలా నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, డిస్ట్రిబ్యూటర్ ఇలా అన్ని రంగాల్లో ముద్రవేయాలనేది తన కోరిక అని చెబుతూ ఉంటారు. -
ఒక్కసారైనా హీరోగా చేస్తా: సురేష్ కొండేటి
‘‘దివంగత దర్శకులు దాసరి నారాయణరావుగారే నాకు స్ఫూర్తి. ఆయనలా నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, డిస్ట్రిబ్యూటర్.. ఇలా అన్ని రంగాల్లో ఎదగాలన్నది నా కోరిక. నటుడిగా మంచి పాత్రలు చేస్తూనే, దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉంది’’ అని నటుడు, నిర్మాత, ‘సంతోషం’ సినీ వారప్రతిక అధినేత సురేష్ కొండేటి అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మంగళవారం సురేష్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నటుడిగా ఎదగాలని 1992లో హైదరాబాద్ వచ్చాను. అయితే నాలో నటుడికి కావాల్సిన లక్షణాలు అప్పటికి లేవని తెలుసుకున్నాను. ఆ తర్వాత కృష్ణా పత్రికలో చేరాను. అక్కడ్నుంచి మరో దినపత్రికలో సినిమా జర్నలిస్ట్గా చే రాను. (చదవండి: ప్రతి తెలుగువాడు గర్వపడే సినిమా ఇది: డైరెక్టర్ క్రిష్) రాజేంద్రప్రసాద్గారి ‘రాంబంటు’ (1995)లో మొదటిసారి నటుడిగా కనిపించాను. రాజమౌళి ‘స్టూడెంట్ నం. 1’ డిస్ట్రిబ్యూటర్గా నా తొలి సినిమా.. ఇప్పటివరకూ 75 చిత్రాలు పంపిణీ చేశాను. ‘ప్రేమిస్తే’తో విజయవంతమైన నిర్మాతగా మారాను. ఆ తర్వాత ‘పిజ్జా’ వంటి హిట్ మూవీతో పాటు దాదాపు 15 చిత్రాలు అందించాను. నటుడిగా ఇటీవల ‘దేవినేని’ సినిమాలో సెకండ్ లీడ్ హీరో చేశాను. ఆ పాత్రకి మంచి స్పందన వచ్చింది. ఆ ఉత్సాహంతో ఒక్క సినిమాలో అయినా హీరోగా చేయాలనే కోరిక ఉంది. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’, ‘ఎర్రచీర’ చిత్రాల్లో నటించాను. నేను నిర్మిస్తున్న ఓ సినిమాలోనూ నటిస్తున్నాను. డైరెక్షన్.. యాక్షన్.. ఈ రెంటిపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. నవంబర్ 14న ‘సంతోషం’ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తాం’’ అన్నారు. -
డాక్టర్ సాబ్ టైటిల్ లోగో ఆవిష్కరించిన నిర్మాత సురేష్ కొండేటి
ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్లో శోభన్ హీరోగా డీఎస్బీ దర్శకత్వంలో ఎస్పీ నిర్మాణ సారథ్యలో తెరకెక్కుతున్న చిత్రం డాక్టర్ సాబ్. డాక్టర్స్ ఎదురుకునే పరిస్థితుల నేపథ్యంలో నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ సంగీతం అందిస్తుండగా ఎన్. ప్రభాకర్ రావు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 1400 సినిమాలకు పైగా ఫైట్ మాస్టర్గా పనిచేసిన విక్కీ మాస్టర్ ఈ సినిమాకు సమర్ఫిస్తుండటం విశేషం. కాగా శుక్రవారం ఈ సినిమాకు సంబందించిన టైటిల్ లోగోను ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘కరోనా సమయంలో డాక్టర్స్ చేసిన సేవని మరువలేం. వారు నిజమైన దేవుళ్ళు. అలాంటి డాక్టర్స్లో ఒకరు శోభన్. అయన హీరోగా నిర్మాతగా చేస్తున్న సినిమా డాక్టర్ సాబ్. ఈ మూవీ లోగోని నేను విడుదల చేయడం సంతోషంగా ఉంది. నా చిరకాల మిత్రుడు విక్కీ మాస్టర్ ఈ సినిమాను సమర్పిస్తుండం సినిమాపై అంచనాలను పెంచుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మూవీ యూనిట్కు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విక్కీ మాస్టర్ మాట్లాడుతూ.. డాక్టర్ సాబ్ సినిమా టైటిల్ను అనౌన్స్ చేసిన నా మిత్రుడు సురేష్కు ధన్యవాదాలు. తన శిష్యులైనా శోభన్, సురేష్లు ఈ చిత్రానికి ఎంతో కష్టపడి స్క్రిప్ట్ రాశాన్నారు. డాక్టర్ అనేవాడు దేవుడు అని చెప్పే సినిమానే ఇది. ఈ సినిమా వీరిద్దరికి మంచి పేరు తెస్తుంది. అందరికి ఈ సినిమా నచ్చుతుందని ఆయన అన్నారు. అలాగే దర్శకుడు డీఎస్బీ మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి తయారు చేసిన స్క్రిప్ట్ ఇది. తనను నమ్మి ఈ సినిమాని తెరకెక్కించిన ఈ చిత్ర నిర్మాత, హీరో శోభన్ కృతజ్ఞతలు తెలిపారు. మా కోరికను మన్నించి ఈ సినిమా టైటిట్ను ఆవిష్కరించిన నిర్మాత సురేష్ కొండేటి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా అందరిని మెప్పిస్తుందన్నారు. హీరో శోభన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ వినగానే హీరోగా చేయాలనిపించిందని అన్నాడు. ఈ సినిమా చేయడానికి కారణం విక్కీ మాస్టర్ అని, అయన సినిమాకు మొదటి నుంచి ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని పేర్కొన్నాడు. దర్శకుడు సురేష్ సహకారం బాగా ఉందని, సినిమా బాగా చేశాడని తెలిపాడు. అలాగే తమ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరించిన నిర్మాత సురేష్ కొండేటి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. -
సూపర్ కప్పు ఎవరిది?
‘మాస్ పవర్, పోలీస్ పవర్’ సినిమాల తర్వాత శివ జొన్నలగడ్డ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘సూపర్ çపవర్’. ప్రియా ఆగస్టీన్, మీర హీరోయిన్లుగా నటించారు. కొండేకర్ బాలాజీ, రమేష్ కడూరి ఈ సినిమాకు సహనిర్మాతలు. ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేసిన సురేశ్ కొండేటి . ‘‘మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ‘సూపర్ పవర్’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఎన్నో అడ్డంకులను అధిగమించి సూపర్ పవర్ కప్పును హీరో ఎలా గెలుచుకున్నాడు? అన్నదే కథ’’ అని అన్నారు. సినిమా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత బసవప్ప. -
సైకో థ్రిల్లర్
అనిల్, జాస్మిన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. గోపాల్ రెడ్డి కాచిడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ శ్రీ శ్రీ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై టీఎమ్ఎస్ ఆచార్య నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఆధ్యాత్మిక గురువు హరిప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత, సంతోషం పత్రికాధినేత సురేష్ కొండేటి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా టీఎమ్ఎస్ ఆచార్య మాట్లాడుతూ– ‘‘ఆసక్తికర కథతో గోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నిర్మాతగా ఇది మా మొదటి ప్రయత్నం’’ అన్నారు. ‘‘ఆసక్తికరమైన మలుపులతో సాగే సైకో థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు గోపాల్ రెడ్డి కాచిడి. ‘‘నాకు హీరోగా అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులకు థ్యాంక్స్’’ అన్నారు అనిల్. ‘‘తెలుగులో ఇది నా రెండో సినిమా’’ అన్నారు సబీనా జాస్మిన్. ఈ చిత్రానికి సంగీతం: గౌర హరి, కెమెరా: సీతా రామాంజనేయులు ఉప్పతల. -
111 జీవో నేపథ్యంలో....
ఇటీవల తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన జీవో 111 నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం ‘111’. వీఆర్ దర్శకత్వం వహించనున్నారు. సురేష్ కొండేటి సమర్పణలో వై. రఘునాథరెడ్డి, స్నేహలత ఈ సినిమాని నిర్మించనున్నారు. చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రాజకీయ రాక్షస క్రీడలో రైతులు బలవుతున్నారు. మెతుకునిచ్చి బతుకులు పండించే పచ్చని పల్లెలు కాంక్రీట్ సౌధాలకు సమాధులవుతున్నాయి. జీవోలను అడ్డుపెట్టుకుని నాయకులు, వారి తొత్తులు చేసే దురాగతాలపై ఓ యువకుని తిరుగుబాటు ఫలితమే ఈ ‘111’. హైదరాబాద్ శివారులో జీవో 111 పరిధిలో ఉన్న ఓ పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రభుత్వ జీవోలు ప్రజల మెరుగైన జీవన విధానానికి బలమైన ఆయుధాలవ్వాలని చెప్పే చిత్రమిది. మంచి మేకింగ్ విలువలు, మంచి నటులు, విప్లవాత్మక కథతో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్ మురారి, సంగీతం: లెండర్ లీ మార్టి. -
సంతోషం ఆగదు
‘‘సంతోషం’ సినీ వారపత్రిక నేటితో 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. పత్రికాధినేత సురేష్ కొండేటి ప్రతి ఏటా ‘సంతోషం’ అవార్డుల వేడుకని ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేడుక గురించి సురేష్ మాట్లాడుతూ –‘‘సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ ఎప్పుడు అనేది ప్రతి ఏటా ఆగస్టు 2న ప్రకటించడం, అదే రోజు కర్టెన్రైజర్ ఫంక్షన్ కూడా చేయడం తెలిసిందే. కరోనా వల్ల ఈసారి ఈ ఫంక్షన్ కాస్త ఆలస్యం అవుతుంది. అంతేకానీ సంతోషం వేడుక ఆగదు. కచ్చితంగా ఉంటుంది. సామాజిక దూరం పాటిస్తూ తక్కువ మందితో ఫంక్షన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎప్పుడు? ఎక్కడ? అనేది అతి త్వరలోనే ప్రకటిస్తాం. ప్రతి ఏడాది ఈ ఫంక్షన్లో పేద కళాకారులకు సహాయం చేస్తున్నాం. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న చిత్ర పరిశ్రమలోని కొంతమందికి సహాయం చేసేలా ఈ ఏడాది ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
సినిమా జర్నలిస్ట్లకు ఎఫ్సీఏ సాయం
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభ్యులందరిMీ ఐదు వేల రూపాయలు చొప్పున ‘ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ (ఎఫ్సీఏ) ఆర్థిక సాయం చేసింది. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి మొత్తం 87 మంది సభ్యులకు బ్యాంక్ అకౌంట్ ద్వారా సోమవారం ఐదు వేల నగదును బదిలీ చేశారు. ‘‘ఎఫ్సీఏ’ అడ్వైజర్ కమిటీ కన్వీనర్ మరియు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రావుగారి సలహాల మేరకు, హెల్త్ కమిటీ చైర్మన్ రెడ్డి హనుమంతురావు, మురళి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని ‘ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అధ్యక్షుడు సురేష్ కొండేటి తెలిపారు. -
ప్రతి సీన్లో నవ్వు
‘ఏడు చేపల కథ’ ఫేమ్ అభిషేక్ రెడ్డి, సాక్షి నిదియా జంటగా ‘అంతం’ ఫేమ్ జి.ఎస్.ఎస్.పి. కళ్యాణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైఫై’. లక్ష్మీ చరిత ఆర్ట్స్, జీఎస్ఎస్పికే స్టూడియోస్ పతాకంపై జి. చరితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ని దర్శకుడు వీరభద్రం, నిర్మాత సురేష్ కొండేటి విడుదల చేశారు. అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఏడు చేపల కథ’ నటుడిగా నాకు మంచి పేరు తీసుకురావడంతో పాటు 4 కోట్ల గ్రాస్ వచ్చింది. ‘వైఫై’ ఎవర్నీ నిరాశ పర్చదు. ప్రతీ సీన్లో నవ్వించే ప్రయత్నం చేశాం’’ అన్నారు. ‘‘సమయం కూడా తెలియకుండా సినిమా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు’’ అన్నారు జి.ఎస్.ఎస్.పి కళ్యాణ్. ‘‘ఇలాంటి కథలు ఈ జనరేషన్లో రావాలి.. అందరూ చూడాలి’’ అన్నారు చరితారెడ్డి. -
రైలెక్కి చెక్కేస్తా...
శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై బేబి ఢమరి సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘ఎర్రచీర’. సి.హెచ్ సుమన్బాబు స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. మదర్ సెంటిమెంట్తో తెరకెక్కిన హారర్ చిత్రం ఇది. ఈ చిత్రంలోని ‘రైలెక్కి చెక్కేస్తా...’ అనే ఐటెమ్ సాంగ్ను దర్శకుడు బాబీ, నటుడు సత్యప్రకాశ్ విడుదల చేశారు. ‘ఎర్రచీర’ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్ను రామసత్యనారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ– ‘‘ఐటెమ్ సాంగ్ బావుంది. సుమన్ గారు దర్శకునిగా, నిర్మాతగా రెండు బాధ్యతలు నిర్వర్తించటం చాలా గొప్ప విషయం. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. సుమన్ మాట్లాడుతూ– ‘‘ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా దర్శకుడు బాబీ మా సినిమాను ఆశీర్వదించటానికి వచ్చారు. కొన్ని కారణాల వల్ల ఢమరి అనే సొంత మ్యూజిక్ కంపెనీని స్టార్ట్ చేశాను. శ్రీకాంత్గారు ఇంతకుముందు ఎప్పుడూ చేయని అఘోర పాత్రలో నటించారు. డిసెంబర్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇందులో మంచి పాత్ర చేశా’’ అన్నారు హీరోయిన్ సంజనా శెట్టి. సినిమాలో ఓ కీలక పాత్ర చేసిన సురేష్ కొండేటి, మాజీమంత్రి పుష్పలీల, సంగీత దర్శకుడు ప్రమోద్, రచయిత గోపి తదితరులు పాల్గొన్నారు. -
రత్నకుమారి వచ్చేశారు
80లలో బెజవాడలో సంచలనాలకు కేరాఫ్ అయిన దేవినేని, వంగవీటి రంగాల కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవినేని’ (బెజవాడ సింహం). శివనాగు దర్శకత్వంలో రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. దేవినేని నెహ్రూ పాత్రలో తారకరత్న, రంగా పాత్రలో ‘సంతోషం’ ఎడిటర్ సురేశ్ కొండేటి నటిస్తున్నారు. ఈ చిత్రంలో రంగా సతీమణి రత్నకుమారిగా తమిళ నటి ధృవతార కనిపించనున్నారు. రంగాతో కలిసి ఉన్న ఆమె లుక్ను రిలీజ్ చేశారు చిత్రబృందం. ‘‘ఇప్పటికే విడుదలైన వంగవీటి లుక్కి మంచి స్పందన లభిస్తోంది. ధృవతార హావభావాలు చక్కగా పలికిస్తోంది. మరో రెండు షెడ్యూల్స్లో చిత్రీకరణ పూర్తవుతుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. -
ఆడియన్స్ క్లాప్స్ కొడతారు
‘‘సినిమాకు చెందిన 24 క్రాఫ్ట్స్తో లింక్ ఉన్న ఏ పని చేయడానికైనా నేను సిద్ధమే. ఎందుకంటే సినిమా తప్ప నాకు వేరే తెలీదు’’ అన్నారు సురేశ్ కొండేటి. అంజలి ప్రధాన పాత్రలో రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘లీసా’. ఈ చిత్రాన్ని సురేశ్ కొండేటి తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘లీసా’ రేపు విడుదల కానున్న సందర్భంగా సురేశ్ కొండేటి చెప్పిన విశేషాలు. ► తొలిసారి 1985లో ‘చిన్నారి చేతన’ అనే త్రీడీ ఫిల్మ్ చూసి థ్రిల్ ఫీలయ్యాను. ఇప్పుడు హారర్ 3డీ ఫిల్మ్ ‘లీసా’ను విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ‘ప్రేమిస్తే’ సినిమాతో నిర్మాతగా మారాను. ‘లీసా’ నా 15వ సినిమా. ఈ చిత్రాన్ని నేను విడుదల చేస్తున్నానని తెలిసిన నాలుగు గంటల్లోనే ఆరు జిల్లాల రైట్స్ అమ్ముడుపోయాయి. నెక్ట్స్ డే సినిమా రైట్స్ అన్నీ అమ్ముడుపోయాయి. ► ‘లీసా’ కేవలం హారర్ కామెడీనే కాదు. ఈ సినిమాలో మంచి సెంటిమెంట్ కూడా ఉంది. సినిమా చూసి ఆడియన్స్ క్లాప్స్ కొడతారు. దాదాపు 400 వందల థియేటర్స్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. ‘2.ఓ’, ‘అవెంజర్స్’ సినిమాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని 3డి థియేటర్స్ ఏర్పడ్డాయి. 2డీలో చూసినా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది. ► పాత్రికేయుడిగా నా కెరీర్ని స్టార్ట్ చేశాను. ‘సంతోషం’ పత్రిక సక్సెస్ఫుల్గా 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్’ మెంబర్గా, జర్నలిస్టుగా, నిర్మాతగా, నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నందుకు హ్యాపీగా ఉంది. నాకు చిరంజీవిగారే స్ఫూర్తి. ఓ సందర్భంలో ‘సురేశ్ నువ్వు నిర్మాత అవుతావు’ అన్నారు చిరంజీవిగారు. అయ్యాను. 2004లో అనుకుంటా.. ‘రేపు నాతో కూడా సినిమా చేస్తాడేమో’ అన్నారు. ఆ మాట నాకు బ్లెస్సింగే. ప్రస్తుతం ‘షకలక’ శంకర్తో ‘శ్రీకాకుళం: ఎనీటైమ్ రెడీ’ అనే సినిమా ప్లాన్ చేస్తున్నాం. ‘ఎర్రచీర’ సినిమాలో ఓ పాత్రలో నటిస్తున్నాను. -
‘లీసా’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్
-
మాకు హ్యాట్రిక్ మూవీ అవుతుందనుకుంటున్నా
‘‘లీసా’ నాకు చాలా ఇంపార్టెంట్ మూవీ. హారర్ను త్రీడీలో ట్రై చేశాం. 2డీలో తీసి 3డీలోకి మార్చకుండా మొత్తం 3డీలోనే షూట్ చేశాం. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మా సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అని అంజలి అన్నారు. అంజలి ప్రధాన పాత్రలో రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లిసా’. ఈ చిత్రాన్ని సురేశ్ కొండేటి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో శివాజీరాజా ట్రైలర్ను రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘తెలుగు అమ్మాయి అంజలి పక్క రాష్ట్రం వెళ్లి అక్కడ సక్సెస్ కావడం చాలా సంతోషం. తను తెలుగులోనూ బాగా బిజీ అవ్వాలి. సురేశ్ కొండేటి కష్టాన్ని నేను దగ్గర నుంచి చూశాను. పత్రికాధినేత నుంచి నిర్మాతగా అతను ఏది చేసినా సక్సెసే’’ అన్నారు. ‘‘ఇది కేవలం పిల్లలు మాత్రమే కాదు ఫ్యామిలీలు కూడా ఎంజాయ్ చేసేలా ఉంది’’ అన్నారు దర్శకుడు ముప్పలనేని శివ. ‘‘3డీ సినిమాలకు నేను పెద్ద అభిమానిని. ట్రైలర్ మైండ్ బ్లోయింగ్గా ఉంది’’ అన్నారు రచయిత జేకే భారవి. ‘‘షాపింగ్ మాల్, జర్నీ’ సినిమాలు నా కెరీర్లో మంచి హిట్స్గా నిలిచాయి. అంజలి మంచి ఆర్టిస్ట్. ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా సక్సెస్ చేస్తారనుకుంటున్నాను. షాపింగ్ మాల్, జర్నీ తర్వాత అంజలి, నా కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు సురేశ్ కొండేటి. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ చంద్రహాస్ ఇప్పలపల్లి, కాసాని వీరేశ్, నటుడు భద్రం, దర్శకుడు రాజు విశ్వనాథ్ మాట్లాడారు. -
త్రీడీలో భయపెట్టే లీసా
‘గీతాంజలి’ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టిన తెలుగమ్మాయి అంజలి మరోసారి భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆమె లీడ్ రోల్లో నటించిన త్రీడీ చిత్రం ‘లీసా’. రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. వీరేష్ కాసాని సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ– ‘‘గతంలో అంజలి నటించిన ‘షాపింగ్ మాల్, జర్నీ’ సినిమాలను ఎస్.కె. పిక్చర్స్ ద్వారా తెలుగులో రిలీజ్ చేశాం. ఆ సినిమాలను ఎంతో బాగా ఆదరించిన ప్రేక్షకులు ‘లీసా’ చిత్రాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. త్రీడీలో విడుదలవుతున్న మొట్టమొదటి హారర్ చిత్రమిది’’ అన్నారు. ‘‘గతంలో వచ్చిన హారర్ చిత్రాలకు విభిన్నంగా ‘లీసా’ ఉంటుంది’’ అన్నారు కాసాని వీరేశ్. రాజు విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘100 రోజులకు పైగా ఈ సినిమా షూటింగ్ జరిగింది. 3డీలో షూటింగ్ చాలా కష్టమైన పని. కానీ పి.జి.ముత్తయ్య గారి ఫ్రేమ్స్, ఆయన కష్టం వల్ల శరవేగంగా పూర్తయింది. అంజలిగారు టైటిల్ రోల్కి న్యాయం చేశారు. త్వరలో ఆడియో, ట్రైలర్లను విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘మొదటిసారి 3డి చిత్రం చేశా. రాజులాంటి దర్శకులు చాలా అరుదుగా ఉంటారు’’ అన్నారు అంజలి. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ దయానిధి మాట్లాడారు. బ్రహ్మానందం, సామ్ జోన్స్, మకరంద్ దేశ్ పాండే, సలీమా తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి.జి.ముత్తయ్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రహాస్ ఇప్పలపల్లి. -
మూడు జంటల ప్రేమకథ
15, 18, 24.. ఈ మూడు సంవత్సరాల దశల్లో ప్రేమ ఎలా ఉంటుంది? ఆ ప్రేమల్లో గమ్మల్తైన సంగతులేంటి? ఈ ట్రాక్లో ఊహించని ఓ ప్రమాదం మొత్తం కథను ఎలా మలుపు తిప్పింది? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘15–18–24 లవ్ స్టోరీ’. నిఖిలేశ్వర్, సాహితి, కీర్తన్, సిమ్రాన్ సానియా, ఉపేంద్ర, పారుల్ బిందల్, ఈషా, ధన్యశ్రీ ప్రధాన పాత్రల్లో మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. విమలాద్రి క్రియేషన్స్, మాజేటి మూవీ మేకర్స్, కిరణ్ టాకీస్ బ్యానర్లపై బొద్దుల సుజాత శ్రీనివాస్, స్రవంతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా టైటిల్ లోగోని ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు, హీరో రాహుల్ విజయ్, ‘సంతోషం’ అధినేత సురేష్ కొండేటి ఆవిష్కరించారు. మాడుపూరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘కులుమనాలి, గోవా, హైదరాబాద్లో మూడు ప్రేమ జంటల మధ్య సాగే ప్రేమకథా చిత్రమిది. చక్కటి కథ, కథనాలతో ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుంది. త్వరలోనే ఆడియో, వేసవిలో సినిమా విడుదల చేస్తాం’అన్నారు. ‘‘అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు మా సినిమాలో ఉంటాయి. తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు బొద్దుల సుజాత శ్రీనివాస్, స్రవంతి ప్రసాద్. సంగీత దర్శకుడు జయవర్ధన్, నటీనటులు పాల్గొన్నారు. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి. హజారత్ బాబు, కెమెరా: రాజేష్. -
‘మహానటి’ తర్వాత..
‘ఓకే బంగారం’ ఫేమ్ దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం ‘ఉస్మాద్ హోటల్’. అన్వర్ రషీద్ దర్శకత్వం వహించారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘జనతా హోటల్’ పేరుతో తెలుగులోకి అనువదించారు నిర్మాత సురేశ్ కొండేటి. వినాయక చవితి కానుకగా ఈ నెల 14న ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సురేశ్ కొండేటి మాట్లాడుతూ– ‘‘లవ్, సెంటిమెంట్, పేద– ధనిక వర్గాల మధ్య భేదం.. వంటి అంశాలతో తెరకెక్కిన చక్కని ఫీల్గుడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. కథ, కథనంతో పాటు దుల్కర్, నిత్యామీనన్ జంట ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సాహితీగారు రాసిన సంభాషణలు హైలైట్గా నిలుస్తాయి. మా సంస్థలో వచ్చిన ‘జర్నీ, పిజ్జా, డా. సలీమ్’ చిత్రాలకు ఆయన మంచి సంభాషణలు అందించారు. ఇప్పుడు ‘జనతా హోటల్’కి కూడా అద్భుతమైన మాటలు రాశారు. గోపీ సుందర్ స్వరపరచిన పాటలు మా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ‘మహానటి’ చిత్రం తర్వాత దుల్కర్కు మంచి పేరు తెచ్చిపెట్టే గొప్ప చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. లోకనాథన్. -
‘సంతోషం’ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్
-
పదహారేళ్ల సంతోషం
‘‘సురేష్తో నాకు 23 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. నాకు తమ్ముడులాంటివాడు. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)కు బాగా సహకరిస్తున్నారు. 16 ఏళ్లుగా ‘సంతోషం’ అవార్డులను ఇవ్వడం చిన్న విషయం కాదు. చాలా ప్యాషన్ ఉండాలి. ఎంతో శ్రమపడాలి. అవన్నీ సురేష్లో ఉన్నాయి కాబట్టే అవార్డుల వేడుకను ఇన్నేళ్లుగా గ్రాండ్గా చేయగలుగుతున్నారు’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. ‘సంతోషం’ సినిమా పత్రిక 16 ఏళ్లు పూర్తిచేసుకుని 17వ ఏటలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ‘సంతోషం’ అవార్డులకు సంబంధించిన కర్టన్ రైజర్ ఫంక్షన్ గ్రాండ్గా జరిగింది. శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఇతర సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డులకు దీటుగా ‘సంతోషం’ అవార్డులను అందజేస్తున్నారు. సురేష్ అటు నిర్మాతగానూ సక్సెస్ఫుల్గా ఉన్నారు. తను ఇంకా ఉన్నత స్థానాలకు చేరుకోవాలి’’ అన్నారు. ‘‘ఈ నెలలో నిర్వహించే సంతోషం అవార్డుల ఫంక్షన్ గ్రాండ్గా సక్సెస్ కావాలి’’ అన్నారు సంగీత దర్శకులు మాదవపెద్ది సురేష్. ‘‘ఆగస్టు 1తో ‘సంతోషం’ 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17లోకి అడుగుపెట్టింది. అందుకే కర్టన్ రైజర్ వేడుకను గురువారం ఓ సెంటిమెంట్గా చేస్తాం. ఈ నెలలోనే అవార్డులు అందించనున్నాం’’ అన్నారు ‘సంతోషం’ అధినేత సురేష్ కొండేటి. నటుడు బెనర్జీ, హీరోయిన్ నిత్యాశెట్టి పాల్గొన్నారు. -
జనతా హోటల్
‘ఓకే బంగారం’తో తెలుగు, తమిళ ప్రేక్షకులతో మంచి జోడీ అనిపించుకున్నారు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘ఉస్తాద్ హోటల్’. అన్వర్ రషీద్ దర్శకత్వం వహించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని ‘జనతా హోటల్’ పేరుతో తెలుగులోకి అనువదించారు సురేశ్ కొండేటి. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్ కొండేటి మాట్లాడుతూ– ‘‘లవ్, సెంటిమెంట్, పేద, ధనిక వర్గాల మధ్య ఉండే వ్యత్యాసం తదితర అంశాలతో రూపొందిన చక్కని ఫీల్ గుడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. మలయాళంలో మంచి మ్యూజికల్ హిట్గా నిలిచింది. ‘మహానటి’ మూవీ తర్వాత దుల్కర్ సల్మాన్కు మంచి పేరు తెచ్చే చిత్రమిది. మా సంస్థలో వచ్చిన ‘జర్నీ, పిజ్జా, డా. సలీమ్’ చిత్రాలకు మంచి సంభాషణలు అందించిన సాహితీ ‘జనతా హోటల్’కి కూడా అద్భుతమైన మాటలు రాశారు. గోపీ సుందర్ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. లోకనాథన్. -
త్వరలో ‘జనతా హోటల్’
మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు దుల్కర్ సల్మాన్. వైవిధ్యమైన పాత్రలను చేస్తూ మాలీవుడ్లో స్టార్గా ఎదిగారు. తాజాగా దుల్కర్ నటించిన ఓ మలయాళ మూవీని తెలుగులోకి ‘అతడే’ సినిమాగా డబ్ చేశారు. ఇక ఇదే వరుసలో దుల్కర్ నటించిన మరొక మూవీ కూడా విడుదల కానుంది. పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాలే చేస్తూ తనకంటూ ఓ గుర్తింపును సాధించిన హీరోయిన్ నిత్యా మీనన్. చివరగా ‘అ!’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఉస్తాద్ హోటల్ అని మలయాళంలో ఎప్పుడో రిలీజ్ అయిన ఈ సినిమాను ‘జనతా హోటల్’గా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ను రిలీజ్ చేశారు. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. -
ప్రతి డిస్ట్రిబ్యూటర్కు డబ్బులు వచ్చాయి
‘‘పది కోట్ల బడ్జెట్తో చేయాల్సిన ‘శంభో శంకర’ చిత్రాన్ని తక్కువ బడ్జెట్లోనే రూపొందించాం. పది రూపాయలకు ఒక రూపాయి మాత్రమే తీసుకున్నా, సినిమా బాగా రావాలని నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేశారు. ప్రతి డిస్ట్రిబ్యూటర్కు వారు పెట్టిన డబ్బులు వచ్చాయి’’ అని నిర్మాత సురేశ్ కొండేటి అన్నారు. ‘షకలక’ శంకర్, కారుణ్య జంటగా ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో వై. రమణారెడ్డి, సురేశ్ కొండేటి నిర్మించిన ‘శంభో శంకర’ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. సురేశ్ కొండేటి మాట్లాడుతూ – ‘‘మా సినిమా పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ అని కచ్చితంగా చెప్పగలను. నేను జర్నలిస్టుగా ఉన్నప్పటి నుంచి శివాజీరాజాగారితో కలిసి తిరిగాను. ఆయన మంచితనాన్ని, సేవలను స్ఫూర్తిగా తీసుకుని నా వంతు సహకారాన్ని అందించాలనుకుంటున్నా. ‘శంభో శంకర’ ద్వారా వచ్చిన కొంత అమౌంట్లో పది వేలు చొప్పున పది మంది నిరుపేదలకు అందించాలని నిర్ణయించుకున్నా’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం శంకర్, నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. ఈ ప్రాజెక్టుపై నమ్మకం ఉన్నా ఎక్కడో చిన్న భయం ఉండేది. కానీ సినిమా హిట్తో ఆ భయం పోయింది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు’’ అన్నారు డైరెక్టర్ శ్రీధర్. ‘‘మా సినిమా హిట్ అవడంతో మాకంటే ఎక్కువగా ప్రేక్షకులు హ్యాపీగా ఉన్నారు. థియేటర్లో ఉన్నప్పుడే నాకు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. మా కష్టం ఫలించింది. ఇకపై కూడా ఇదే విధంగా నిజాయితీగా, నమ్మకంగా సినిమాలు చేస్తా’’ అన్నారు ‘షకలక’ శంకర్. ‘మా’ అధ్యక్షుడు, నటుడు శివాజీరాజా, కథానాయిక కారుణ్య, నటులు ఏడిద శ్రీరామ్, ప్రభు, నాగినీడు పాల్గొన్నారు. -
మా ఆవిడ వార్నింగ్ ఇచ్చింది
‘హీరో అయిపోవాలని సినిమా చేయలేదు. పని లేక ఖాళీగా ఉండటం ఇష్టం లేక హీరోగా ‘శంభో శంకర’ సినిమా స్టార్ట్ చేశా. ‘ఆనందో బ్రహ్మ’ లాంటి హిట్ సినిమా తర్వాత నేను అనుకున్న రేంజ్ సినిమాలు రాలేదు. కొన్ని నా మనసుకు నచ్చలేదు. మనసుకు సంతృప్తినిచ్చే క్యారెక్టర్స్ రాలేదు’’ అని శంకర్ అన్నారు. శంకర్, కారుణ్య జంటగా శ్రీధర్ ఎన్. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శంభో శంకర’. రమణా రెడ్డి, సురేశ్ కొండేటి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శంకర్ పంచుకున్న విశేషాలు... ► దొంగతనం చేయడానికి భయం ఉండాలి. అవకాశాలు ఇవ్వమని అడగడానికి భయమెందుకు? నా వద్ద కథ ఉంది, డైరెక్టర్ ఉన్నాడు సినిమా నిర్మించమని త్రివిక్రమ్గారు, రవితేజగారు, ‘దిల్’ రాజుగారి దగ్గరికి వెళ్లాను. వాళ్లు ఎవ్వరూ చేయం అని అనలేదు. కానీ, టైమ్ పడుతుంది అన్నారు. పని లేకుండా ఉండటం నా వల్ల కాదు. అందుకే ఈ సినిమా స్టార్ట్ చేశాం. ► ‘శంభో శంకర’ కథను నేను, శ్రీధర్ కలిసి తయారు చేసుకున్నాం. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నేనే (నవ్వుతూ). ఈ సినిమాని అందరం ప్రేమించి పనిచేశాం. శంకర్ హీరో ఏంటి? అని తక్కువగా చూడలేదు. ఒక్క సీన్కి కాదు.. ఈజీగా పది సన్నివేశాలకు ప్రేక్షకులు క్లాప్స్ కొడతారు. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. నిర్మాతలు రమణారెడ్డిగారికి, సురేశ్ కొండేటిగారికి ధన్యవాదాలు. ► మొన్నటి దాకా ఆర్థికంగా అందరికీ సహాయపడుతుండే వాణ్ణి. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉందాం అనుకుంటున్నా. మా ఆవిడ వార్నింగ్ కూడా ఇచ్చింది (నవ్వుతూ). క్యారెక్టర్ అడుగుదాం అని వెళ్తే అక్కడే ఓ పది మంది ఉంటారు ఇంకేం అడుగుతాం. హీరోగానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేస్తా. ప్రస్తుతం నాగచైతన్య ‘సవ్యసాచి’ చిత్రం చేశా. -
బ్లాక్ బస్టర్స్ లిస్ట్లో శంకర ఉంటుంది – సురేశ్ కొండేటి
‘‘ఈ సినిమాకు ఫస్ట్ టెక్నీషియన్ సాయికార్తీక్గారే. ఆయన తర్వాతే మిగిలిన టెక్నీషియన్స్ అందరూ సెట్ అయ్యారు. మా అందరి ఆరు నెలల కష్ట ఫలితమే ఈ సినిమా. శంకర్ హీరో ఏంటి? అని అనుకునేవాళ్లందరికీ ఈ సినిమా సమాధానం చెబుతుంది. సినిమా చూస్తే శంకర్తో ఎందుకు తీశామో అర్ధమవుతుంది. నిర్మాతల్లో ఒకరైన రమణారెడ్డిగారి వల్లే ఈ సినిమా అవుట్పుట్ బాగా వచ్చింది. నాకు తెలిసి ఈ ఏడాది బ్లాక్బస్టర్స్ లిస్టులో ‘శంభో శంకర’ ఖచ్చితంగా ఉంటుంది. బిజినెస్ పూర్తయ్యింది. అందరి నమ్మకం ఫలిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు సురేశ్ కొండేటి. శ్రీధర్ దర్శకత్వంలో షకలక శంకర్ హీరోగా ఆర్.ఆర్. పిక్చర్స్ , యస్కే పిక్చర్స్ సమర్పణలో వై.రమణారెడ్డి, సురేశ్ కొండేటి నిర్మించిన చిత్రం ‘శంభో శంకర’. జూన్ 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో బిగ్ సీడీ, ఆడియో సీడీలను సంగీత దర్శకుడు సాయి కార్తీక్ విడుదల చేయగా హీరో శంకర్ మొదటి సీడీని అందుకున్నారు. శ్రీధర్ మాట్లాడుతూ –‘‘మాటల రచయిత భానుప్రసాద్ గారు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు. సినిమా కోసం ఏమైనా ఫర్వాలేదని శంకర్ ప్రాణం పెట్టి చేశారు. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. హీరో శంకర్ మాట్లాడుతూ –‘‘దర్శ కులు శ్రీధర్కు, నాకు ఎన్నో ఏళ్లుగా పరిచయముంది. మాకు సినిమాల మీద ఆసక్తి కలిగేలా చేసింది నటి నిర్మలమ్మగారు. ఆవిడ వల్లే మేం సినిమా జీవితం గురించి తెలుసుకున్నాం. ఆవిడ ఆశీర్వాదం ఎప్పటికీ మాపై ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాను మొదట ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ గార్ల దగ్గరికి తీసుకెళ్లాను. వారు చేస్తామన్నారు, కానీ రెండేళ్లు ఆగాలన్నారు. మా బాధను నెల్లూరులోని రమణారెడ్డిగారు అర్థం చేసుకున్నారు. అలాంటి నిర్మాతలుంటే నాలాంటి ఎందరో హీరోలుగా, శ్రీధర్ లాంటి వారెందరో దర్శకులు అవుతారు. నేను నటునిగా పది రూపాయలు సంపాదిస్తే అందులో ఎనిమిది రూపాయలు కష్టాల్లో ఉన్నవారికి ఇచ్చేస్తాను. ఈ నెల 29 మేమంతా ఎంత కష్టపడ్డామో అందరికీ తెలుస్తుంది’’ అన్నారు. -
దూసుకెళుతోన్న శంకర
హాస్య నటుడు ‘షకలక’ శంకర్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘శంభో శంకర’. కారుణ్య కథానాయిక. శ్రీధర్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వై.రమణారెడ్డి, సురేష్ కొండేటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. నిర్మాత రమణారెడ్డి మాట్లాడుతూ– ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. టీజర్ 50లక్షల వ్యూస్ వైపు దూసుకెళుతోంది. ‘దిల్’ రాజు వంటి అగ్ర నిర్మాత మా సినిమా టీజర్ని ప్రశంసించారంటే ఫలితం ఊహించవచ్చు. మా చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ టాక్ వినిపించడం హ్యాపీ’’ అన్నారు. ‘‘శంకర్ హీరోగా నిరూపించుకునే ప్రయత్నమిది. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అవుతాడన్న ధీమా ఉంది’’ అన్నారు నిర్మాత సురేష్ కొండేటి. -
స్ట్రైట్ మూవీ ప్లాన్ చేస్తున్నా!
ఇప్పటివరకు నేను అందించిన అనువాద చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. భవిష్యత్లోనూ నేనందించే చిత్రాలకు ఇదే ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను. ఎప్పటికైనా తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ నిర్మించాలన్నది నా కల. ఆ కలను త్వరలోనే నెరవేర్చుకుంటా’’ అన్నారు సురేశ్ కొండేటి. పాత్రికేయుడిగా కెరీర్ ప్రారంభించి, ‘సంతోషం’ పత్రికాధినేతగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. నేడు సురేశ్ కొండేటి పుట్టినరోజు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ – ‘‘ప్రేమిస్తే’, ‘జర్నీ, మహేశ్, ప్రేమించాలి, పిజ్జా’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించాను. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’ను త్వరలో తెలుగులో విడుదల చేయబోతున్నాను. ఈ చిత్రానికి ‘జనతా హోటల్’ అనే టైటిల్ ఖరారు చేశాం’’ అని చెప్పారు. -
సంతోషంలో ఓ స్పెషాల్టీ ఉంటుంది
– సురేశ్ కొండేటి ‘సంతోషం’ సౌత్ ఇండియన్ ఫిల్మ్ 16వ వార్షికోత్సవ అవార్డుల వేడుక ఈ నెల 12న హైదరాబాద్లో జరుగనుంది. ఈ అవార్డులకు సంబంధించిన లోగోను ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, హీరోయిన్ రెజీనా లాంచ్ చేశారు. తొలి ఆహ్వాన పత్రికను శివాజీరాజా రెజీనాకు అందించారు. శివాజీరాజా మాట్లాడుతూ –‘‘సంతోషం అవార్డ్స్ వేడుక 16వ వసంతంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. ‘మా’ అసోసియేషన్లోని పేద కళాకారులందరికీ ఆర్థికంగా ఆయన సహాయం చేస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఎప్పటిలానే సంతోషం వేడుకల్లో ఓ స్పెషాలిటీ ఫ్లాన్ చేశాం’’ అన్నారు ‘సంతోషం’ అధినేత సురేశ్ కొండేటి. ‘‘సంతోషం అవార్డు తీసుకోవాలన్న నా కల ‘ప్రేమకావాలి’తో తీరింది’’ అన్నారు హీరో ఆది. సురేశ్ కొండేటికి రెజీనా, హెబ్బా పటేల్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
‘మా నమ్మకం నిజమైంది’
‘‘ప్రేమిస్తే, జర్నీ, సలీమ్ తరహాలో చాలా రోజుల తర్వాత ‘మెట్రో’ తో మంచి విజయం అందుకున్నాం. మంచి కథాంశం ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి మా విషయంలో ప్రూవ్ అయింది. ఈ చిత్రం విజయంపై ‘చుట్టాలబ్బాయి’ నిర్మాత రజనీ రామ్, నేను పెట్టుకున్న నమ్మకం నిజమైంది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని సురేశ్ కొండేటి అన్నారు. ఆనంద్ కృష్ణ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘మెట్రో’ చిత్రాన్ని సురేశ్ కొండేటి సమర్పణలో రజనీ తాళ్లూరి అదే పేరుతో తెలుగులో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘నా మొదటి చిత్రం తెలుగు, తమిళంలో ఘన విజయం సాధించడం హ్యాపీ. ప్రస్తుతం ఓ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ రెడీ చేస్తున్నా. తెలుగులో కూడా సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అన్నారు. ‘‘మంచి కథాంశం ఉన్న సినిమాలో నటించే అవకాశం తొలి చిత్రానికే రావడం ఆనందంగా ఉంది’’ అని హీరో శిరీష్ చెప్పారు. -
గొలుసు దొంగల కథతో...
ప్రస్తుతం సిటీల్లో జరుగుతున్న గొలుసు దొంగతనాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మెట్రో’. శిరీష్, బాబీ సింహా, సేంద్రన్, నిషాంత్ ముఖ్య పాత్రల్లో ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో హిట్ అయింది. ఈ చిత్రాన్ని సురేశ్ కొండేటి సమర్పణలో ఆర్ 4 ఎంటర్టైన్మెంట్ పతాకంపై రజని రామ్ తాళ్లూరి ‘మెట్రో’ పేరుతో మార్చి 3న తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ను హీరో శర్వానంద్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ హిట్ అవ్వాలి. యూనిట్కు మంచి పేరు, డబ్బులు తీసుకురావాలి’’ అన్నారు. సురేశ్ కొండేటి మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్, విశాఖపట్నం వంటి మెట్రో నగరాల్లో గొలుసు దొంగతనాల వార్తలు వింటూనే ఉన్నాం. స్నాచర్లు గొలుసులు తెంచుకుపోవడం ఒక్కోసారి మహిళల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇటువంటి వాస్తవ సంఘటనలను దర్శకుడు తెరపై చక్కగా ఆవిష్కరించారు. యువ గాయని గీతామాధురి మా చిత్రంలో నటిస్తుండటం విశేషం. ఏ.ఆర్. మురుగదాస్, గౌతమ్ మీనన్ వంటి ప్రముఖ దర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం, తెలుగులోనూ హిట్ అవుతుందనే ధీమాతో ఉన్నాం’’ అన్నారు. -
మార్చి 3న 'మెట్రో' రిలీజ్
ప్రేమిస్తే, జర్నీ, పిజ్జా లాంటి బ్లాక్బస్టర్ లను అందించిన ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన సినిమా 'మెట్రో'. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న దొంగతనాలు దోపిల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్కు, స్టిల్స్కు మంచి స్పందన వచ్చింది. ప్రముఖ గాయని గీతామాధురి అతిథి పాత్రలో నటిస్తుండటం సినిమా మీద మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. గౌతమ్ మీనన్, ఏ.ఆర్.మురుగదాస్ లాంటి దర్శకులు చిత్ర టైలర్ను చూసి యూనిట్ సభ్యులను అభినందించారు. అన్ని ప్రముఖ నగరాలు ఎదుర్కొంటున్న సమస్య నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావటంతో తెలుగులో నేటివిటి సమస్య కూడా ఉండదన్న నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్. శిరీష్, బాబీ సింహా, నిశాంత్ ప్రదాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకు ఆనంద కృష్ణన్ దర్శకుడు. తమిళ నాట 2016 జూన్లో రిలీజ్ అయి మంచి విజయం సాధించిన ఈ సినిమాను సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.మార్చి 3న రిలీజ్కు రెడీ అవుతున్న మెట్రో, ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోమరో సక్సెస్ ఫుల్ చిత్రమవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
‘మెట్రో’ మూవీ స్టిల్స్
-
అందమైన ప్రేమకథ
దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ది హిట్ పెయిర్. మలయాళంలో వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలతో పాటు తెలుగులో చేసిన ‘ఓకే బంగారం’ ఘనవిజయం సాధించాయి. ఈ ఇద్దరూ నటించిన మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’. అన్వర్ రషీద్ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఎస్కే పిక్చర్స్ పతాకంపై ‘జతగా’ పేరుతో నిర్మాత cవిడుదల చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ- ‘‘పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలను స్పృశిస్తూ తెరకెక్కించిన అందమైన ప్రేమకథా చిత్రమిది. సున్నితమైన భావోద్వేగాలతో పాటు చక్కని సందేశం ఉంటుంది. యువతకి, కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. గోపీసుందర్ పాటలు మా చిత్రానికి ప్లస్. మలయాళంలో ‘ఉస్తాద్ హోటల్’కి జాతీయ అవార్డులు వచ్చాయి. తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే తెలుగులో ఓ స్ట్రయిట్ చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నా’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. లోకనాథన్. -
అప్పట్నుంచి అవార్డులు మొదలుపెట్టా!
-
అప్పట్నుంచి అవార్డులు మొదలుపెట్టా!
‘నేను చిన్నప్పట్నుంచీ సంతోషం అవార్డు వేడుకలు చూస్తున్నా. నంది, ఫిలింఫేర్ అవార్డుల తర్వాత ఆ స్థాయిలో నటీనటులు, టెక్నీషియన్స్ను ఎంకరేజ్ చేస్తూ జరుగుతున్న అవార్డుల కార్యక్రమం ఇదే. ఈ వేడుక ఇలానే కొనసాగాలి’’అని హీరో నిఖిల్ అన్నారు. ‘సంతోషం’ వార పత్రిక ఈ నెల 2న 14 వసంతాలు పూర్తి చేసుకుని, పదిహేనో ఏట అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఈ నెల 14న హైదరాబాద్లో ‘సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్’ వేడుకలు జరగనున్నాయి. విశ్వ రాసి, కంపోజ్ చేసిన ‘సంతోషం’ సాంగ్ను నిఖిల్ విడుదల చేశారు. ీహ రోయిన్ కేథరిన్, సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ వేడుక ఇన్విటేషన్స్ అందుకున్నారు. పత్రికాధినేత సురేశ్ కొండేటి మాట్లాడుతూ- ‘‘సంతోషం’ పత్రిక ప్రారంభించిన రెండో ఏడాది బాలకృష్ణగారు ‘సంతోషం’ పేరున అవార్డులు ఇస్తే బాగుంటుందని చెప్పారు. అప్పట్నుంచి అవార్డులిస్తున్నా. నేను బ్రతికి ఉన్నంత కాలం ఈ అవార్డులను అందిస్తూనే ఉంటా’’ అన్నారు. దర్శకుడు కల్యాణ్ కృష్ణ, నటులు శివాజీ రాజా, ఏడిద శ్రీరాం, గాయకుడు సింహా, తదితరులు పాల్గొన్నారు. -
దక్షిణాది సినీసీమకు... ఆగస్టులో ‘సంతోషం’
సినిమా ఇండస్ట్రీలోని ప్రతిభావంతులకు ప్రతి ఏటా అవార్డులు ఇస్తూ ప్రోత్సహిస్తోంది ‘సంతోషం’ వారపత్రిక. ఈ పత్రిక ఆగస్టు 2న పధ్నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని, పదిహేనో ఏట అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా ఆగస్టు 14న హైదరాబాద్లో ‘సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్’ వేడుకలు నిర్వహిస్తోంది. పత్రిక అధినేత, ఎడిటర్ సురేశ్ కొండేటి మాట్లాడుతూ- ‘‘తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమా పరిశ్రమ ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నాం. నాటి- మేటి నటీనటులు, టెక్నీషియన్స్ ఈ వేడుకలకు వస్తారు. తెలుగు ఇండస్ట్రీతో పాటు అన్ని భాషల టాప్ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరవుతారు’’ అని చెప్పారు. -
ప్రేమిస్తే మమ్మల్ని నిలబెట్టింది
ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మాణంలో, బాలాజీ శక్తివే ల్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కాదల్’ను ‘ప్రేమిస్తే’ పేరుతో సురేశ్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రం విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మారుతి మాట్లాడుతూ -‘‘ఈ రోజు మేం ఇండస్ట్రీలో ఉన్నానంటే కారణం ‘ప్రేమిస్తే’. ఈ సినిమా కన్నా ముందు వేరే చిత్రాన్ని కొందరితో కలిసి 35 లక్షల్లో నిర్మించి న ష్టపోయాం. అప్పుడు ‘కాదల్’ను ‘ప్రేమిస్తే’ పేరుతో తెలుగులో విడుదల చేస్తే ఈ సినిమా మమ్మల్ని ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసింది’’ అన్నారు. ‘‘సంతోషం రెండో వార్షికోత్సవ వేడుకల్లో చిరంజీవిగారు నేను నిర్మాతగా మారితే చూడాలని ఉందన్నారు. ఆయన స్ఫూర్తితోనే మారుతితో కలిసి ‘ప్రేమిసే’ చిత్రాన్ని విడుదల చేశా. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. అదే న మ్మకంతో మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’ను తెలుగులో ‘జతగా’ పేరుతో త్వరలో విడుదల చేయనున్నా’’అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకులు అనిల్ రావిపూడి, కల్యాణ్కృష్ణ, మల్లికార్జున్, గాయకుడు గంగాధర్శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
కెమిస్ట్రీ కేక!
మణిరత్నం తెరకెక్కించిన ‘ఓకే బంగారం’లో తమ కెమిస్ట్రీతో కుర్రకారును గిలిగింతలు పెట్టిన దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ల జోడి మళ్లీ తెరపై కనువిందు చేయనున్నారు. మలయాళంలో అన్వర్ రషీద్ దర్శకత్వంలో వీరిద్దరూ జంటగా నటించిన ‘ఉస్తాద్ హోటల్’ చిత్రాన్ని ‘జతగా’ పేరుతో సురేశ్ కొండేటి తెలుగులోకి విడుదల చేయనున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర విశేషాలను వెల్లడించారు. ‘‘లవ్, సెంటిమెంట్.. ఇలా అన్ని భావోద్వేగాలు ఉన్న కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. నిత్యామీనన్, దుల్కర్ల జోడీ మళ్లీ ఆకట్టుకుంటుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వండర్ఫుల్గా ఉంటుంది. గోపీ సుందర్ సంగీతం, సాహితీ సంభాషణలు ఈ చిత్రానికి హైలైట్. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.లోకనాథన్. -
ఆ హోటల్లో....
ఓ డబ్బున్న యువ కునికి చెఫ్ కావాలని ఆశ. విదేశాల్లో ఉండే అతగాడు ఇండియా వస్తాడు. తన సొంత ఊరు వెళతాడు. అక్కడ తన తాతగారు నడుపుతున్న హోటల్కి వెళతాడు. ఆ హోటల్ కథ ఏంటి? చెఫ్ కావాలనుకునే ఆ యువకుడు ఆ హోటల్ యజమానిగా బాధ్యతలు చేపడతాడా? విదేశాలు తిరిగి వెళ్లిపోతాడా? అనుకోకుండా పరిచయమైన అమ్మాయి కారణంగా అతని జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఉస్తాద్ హోటల్’. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని సురేశ్ కొండేటి తెలుగులో విడుదల చేయనున్నారు. మణిరత్నం తెరకెక్కించిన ‘ఓకే బంగారం’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నిత్యామీనన్ కథానాయిక. ‘‘దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్లది హిట్ పెయిర్. ఇప్పటికే వీరిద్దరూ కలిసి మూడు చిత్రాల్లో నటించారు. వాటిలో ‘ఓకే బంగారం’ ఒకటి. ‘ఉస్తాద్ హోటల్’లో వీరి కెమిస్ట్రీ ఓ హైలైట్. ప్రేమ, సెంటిమెంట్, కుటుంబ బాంధవ్యాలను స్పృశిస్తూ సాగే చిత్రం ఇది. వచ్చే నెల విడుదల చేయనున్నాం’’ అని సురేశ్ కొండేటి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ఎస్.లోకనాథన్. -
అన్యాయాల్ని ప్రశ్నించే డాక్టర్
‘‘ ‘ఠాగూర్’ చిత్రంలో లాగే ఆస్పత్రుల్లో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తుందీ చిత్రం. నా గత చిత్రాల్లోలాగే ఇందులోనూ సందేశం ఉంటుంది’’ అని నిర్మాత సురేశ్ కొండేటి తెలిపారు. విజయ్ ఆంటోని, అక్ష జంటగా ఎన్.వి. నిర్మల్కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డా. సలీమ్’. సురేశ్ కొండేటి, తమటం కుమార్రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. పాటల సీడీని ఇటీవల తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆవిష్కరించి, ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. -
అనుకోని మలుపు!
అతను మంచి డాక్టర్. రోగుల ప్రాణాలను కాపాడటానికి అహర్నిశలూ కృషి చేస్తాడు. అలాగే బోల్డన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. ఇతరులు అసూయపడే స్థాయికి ఎదుగుతాడు. హాయిగా సాగుతున్న ఆ డాక్టర్ జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. ఆ మలుపు ఏంటి? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘డా. సలీమ్’. విజయ్ ఆంటోని టైటిల్ రోల్ని పోషించి, సంగీతదర్శకునిగా వ్యవహరించిన ఈ చిత్రంలో అక్ష కథానాయిక. నాగప్రసాద్ సన్నితి సమర్పణలో ఎస్.కె. పిక్చర్స్ మరియు ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై సురేశ్ కొండేటి, తమటం కుమార్ రెడ్డి అందిస్తున్న ఈ చిత్రం పాటలు ఈ వారంలోనే విడుదల కానున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు చెబుతూ - ‘‘విజయ్ ఆంటోని నటన, ఆయన స్వరపరచిన పాటలు, సాహితి రాసిన పాటలు, సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ థ్రిల్లర్ అన్ని వర్గాలవారూ చూసే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాత: ఎం. అర్జున్ గౌడ్, దర్శకత్వం: ఎన్.వి. నిర్మల్కుమార్. -
సంతోషం ఫిలిం అవార్డ్స్ వేడుక
-
రేపు సంతోషం సౌత్ ఫిలిం అవార్డ్స్ వేడుక
సిటీ బ్యూరో: ‘‘ పన్నెండేళ్లుగా పాఠకుల ఆదరాభిమానాలు పొందుతూ ‘సంతోషం’ పత్రిక విజయవంతంగా కొనసాగుతోంది. ఎంతో ఉత్సాహంతో పదమూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. అలాగే, పదకొండేళ్లుగా ‘సంతోషం’ ఫిల్డ్ అవార్ట్స్ వేడుకను ఘనంగా చేస్తున్నాం. శనివారం పన్నెండో సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ వేడుకను మరింత వైభవంగా చేయబోతున్నాం. జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఈ వేడుక జరుగుతుంది’’ అని ‘సంతోషం’ సినీ వారపత్రిక అధినేత సురేష్ కొండేటి చెప్పారు. గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పలువురు చిత్రరంగ ప్రముఖులు పాల్గొంటారన్నారు. పలు హిట్ సాంగ్స్కు ఆరుగురు కథానాయికలు డాన్స్ చేస్తారన్నారు. డాన్స్ మాస్టర్ జానీ ఆధ్వర్యంలో ప్రాక్టీస్ జరుగుతోందన్నా రు. కామెడీ స్కిట్స్తో పాటు రకరకాల ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పారు. అవార్డు వేడుకకు సంబంధించిన ట్రైలర్ను శ్రద్ధాదాస్, షీల్డ్ను జానీ మాస్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మీనాక్షీ దీక్షిత్, ఎస్తేర్ పాల్గొన్నారు. -
ఆ ఘనత మాదే: సురేష్ కొండేటి
30న ‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక సాక్షి, సిటీబ్యూరో: గత పదకొండేళ్లుగా ‘సంతోషం’ ఫిల్డ్ అవార్ట్స్ వేడుకను వైభవంగా నిర్వహిస్తున్న తాము 12వ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డు వేడుక మరింత ఘనంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నామని ‘సంతోషం’ సినీ వార పత్రిక అధినేత సురేష్ కొండేటి తెలిపారు. ఈ నెల 30న జరగనున్న ఈ వేడుక కర్టన్రైజ్ కార్యక్రామం ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలో సినీ తారలు ప్రణీత, హంసా నందిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్..‘దక్షిణాది ప్రాంతీయ భాషల్లో ఏ భాషలోనూ ఇంత సుదీర్ఘ కాలంగా ఫిల్మ్ అవార్డులు నిర్వహించిన పత్రిక లేదు. ఆ ఘనత మా పత్రికకే చెందుతుంది. ఇన్నేళ్లుగా చలన చిత్ర పరిశ్రమ పెద్దల ఆదరాభిమానాలతో అవార్డులు అందజేస్తూ వచ్చాను. ఈ ఏడాది జేఆర్సీ కన్వెషన్లో జరపనున్న వేడుకలో పలువురు చిత్రరంగ ప్రముఖులు పాల్గొంటారు’ అని చెప్పారు. గత ఏడాది ఓ కన్నడ చిత్రానికిగాను ‘సంతోషం’ అవార్డు అందుకున్నానని, తాను నటించిన ‘అత్తారింటికి దారేది’ ఈ ఏడాది నామినీగా నిలవడం ఆనందంగా ఉందనీ ప్రణీత తెలిపారు. నాలుగు భాషల వారికి అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం అనీ, నేను నటించిన రెండు చిత్రాలు పోటీలో ఉన్నాయని హంసా నందిని అన్నారు. -
ఈ ‘కుల్ఫీ’ అందరికీ నచ్చుతుంది
‘‘చక్కటి రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. ‘కుల్ఫీ’ అనే మంచి టైటిల్ కుదిరింది. కచ్చితంగా ఈ ‘కుల్ఫీ’ అందరికీ నచ్చుతుంది’’ అని నటి ‘కలర్స్’ స్వాతి చెప్పారు. జై, ‘కలర్స్’ స్వాతి నటించిన తమిళ చిత్రం ‘వడకర్రి’ని తెలుగులో సామల నరసింహారెడ్డి అనువదించారు. శరవణ రాజన్ దర్శకుడు. ఈ చిత్రం పాటల సీడీని దర్శకుడు సాగర్, బిగ్ సీడీని దర్శకుడు సముద్ర, నిర్మాత సురేష్ కొండేటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సామల నరసింహారెడ్డి మాట్లాడుతూ -‘‘మాకిది తొలి సినిమా. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తీస్తాం. పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఓ పాటలో నర్తించడం విశేషం’’ అని చెప్పారు. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర సమర్పకుడు సామల శ్రీనివాసరెడ్డి తెలిపారు. యువన్ శంకర్రాజా ఓ పాటకు సంగీతం అందించారని నిర్మాణ నిర్వాహకుడు బాలాజీ చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు వివేక్, మర్విన్ సాల్మన్, దర్శకుడు శరవణ రాజన్, రచయిత కృష్ణతేజ, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. -
సినిమా రివ్యూ: ప్రేమించాలి
ఈ రోజుల్లో ప్రేమ మత్తులో విద్యార్థులు హద్దు మీరి ప్రవర్తిస్తే ఎలాంటి పర్యవసనాలు చోటు చేసుకుంటాయనే కథ నేపథ్యంగా తమిళంలో ఘనవిజయం సాధించిన 'ఆదాలల్ కాదల్ సీవీర్' చిత్రాన్ని'ప్రేమించాలి' పేరుతో రీమేక్ గా ఫిబ్రవరి 27న నిర్మాత సురేశ్ కొండేటి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇంజనీరింగ్ చదువుతున్న కార్తీక్ (సంతోష్), శ్వేత ( మనీషా యాదవ్) ప్రేమించుకుంటారు. ప్రేమ మత్తులో హద్దు మీరడంతో శ్వేత గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన శ్వేత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది, తమ కూతురు పెళ్లి కాకుండానే గర్భవతి అయిందని తెలుసుకున్న తల్లితండ్రుల మానసిక క్షోభ ఏంటి? కార్తీక్ చేసిన తప్పిదానికి అతడి తల్లితండ్రులు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు? కార్తీక్, శ్వేత పెళ్లి చేసుకున్నారా? కార్తీక్ ను పెళ్లి చేసుకోకపోతే గర్భం దాల్చిన శ్వేత పరిస్థితి ఎంటి? అనే ప్రశ్నలకు సమాధానం. విశ్లేషణ: కార్తీగా సంతోష్ రమేశ్, శ్వేత పాత్రల్లో మనీషాలు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపించారు. కొన్ని కీలక సన్నివేశాల్లో మనీషా ఎయోషన్స్ పలికించడంలో పరణితి ప్రదర్శించింది. శ్వేత తండ్రి పాత్రలో జయప్రకాశ్, తల్లి పాత్రలో తులసి, కార్తీక్ తల్లి పాత్రలో పూర్ణిమ జయరామ్, తండ్రి పాత్రలో రామనాథ్ షెట్టీలు పూర్తి న్యాయం చేకూర్చారు. కార్తీక్ స్నేహితుడు పాత్రలో జై ఓకే అనిపించాడు. ఈ చిత్రంలో టెంపోను కంటిన్యూ చేయడంలో యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. క్లైమాక్స్ బాల సుబ్రమణ్యం పాడిన పాట ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. డబ్బింగ్, ఇతర సాంకేతిక అంశాలను తెలుగు నేటివిటికి కన్వర్ట్ చేయడంలో సురేశ్ కొండేటి పాటించిన నిర్మాణాత్మక విలువు బాగున్నాయి. ఈ చిత్ర తొలి భాగం రెగ్యులర్ ఫార్మాట్ లోనే అబ్బాయిలు, అమ్మాయిల ప్రేమ వ్యవహారాలు అంశాలు, ఆతర్వాత కార్తీక్, శ్వేత ప్రేమ కథను తెరకెక్కించిన దర్శకుడు సుసీంద్రన్ రెండో భాగంలో తన ప్రతిభాపాటవాలతో విశ్వరూపం చూపించాడు. చిత్రం ద్వితీయార్థంలో శ్వేత గర్బవతి అయిన తర్వాత ఆమె అనుభవించిన కష్టాలు, మానసిక వేదనను చక్కగా చిత్రీకరించడంలో దర్శకుడు పూర్తిగా సఫలమయ్యాడు. కాలేజికి వెళ్లి చదువుకుంటోందనే భ్రమలో ఉండే తల్లితండ్రులకు కూతురు గర్భవతి అని తెలిస్తే ఎలా ఉంటుందనే బాధను దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఇక చిత్రంలో ప్రధానంగా చెప్పకోవాల్సి వస్తే, శ్వేత ప్రసవించిన తర్వాత పుట్టిన బాబును అనాధ శరణాలయానికి అప్పగించడం, ఆ తర్వాత అనాధ పిల్లాడు ఎలాంటి కష్టాలను అనుభవించాడనే సన్నివేశాలతో దర్శకుడు గుండెలు పిండేశాడు. ప్రేమించుకోవడంలో తప్పేమీ లేదని..పరిపక్వత లేని ప్రేమ మాటున హద్దు మీరితే ఎలాంటి అనర్ధాలకు దారి తీస్తుందనే కథాంశంతో 'ప్రేమ అంటే బాధ్యత, ఓ జాగ్రత్త' అనే సందేశాన్ని ప్రేక్షకులకు, సమాజానికి తెలియచేయడంలో దర్శకుడు తన బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేర్చాడని చెప్పవచ్చు. తల్లిదండ్రుల కలల్ని, తమ భాద్యతల్ని, లక్ష్యాలను మరిచి ప్రేమ వ్యమోహంలో హద్దు మీరే యువతకు 'ప్రేమించాలి' చిత్రం ఓ చెంపపెట్టు. -రాజబాబు అనుముల -
'ప్రేమించాలి' ప్రెస్ మీట్
-
యువతకు సందేశం
‘ప్రేమిస్తే’ లాంటి ప్రేమకథా చిత్రం ద్వారా నిర్మాతగా మారిన సురేష్ కొండేటి, ఇప్పటివరకు పలు విజయవంతమైన చిత్రాలను అందించారు. ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై ఆయన అందిస్తున్న పదవచిత్రం ‘ప్రేమించాలి’. సంతోష్, మనీషా యాదవ్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ నెల 27న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సురేష్ మాట్లాడుతూ - ‘‘చిన్నపిల్లలు వీధులపాలవుతున్న సంఘటనలను వింటున్నాం.. చూస్తున్నాం. అసలు పిల్లలు అలా వీధులపాలవడానికి కారణం ఏంటి? అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. హృదయానికి హత్తుకునే ఈ ప్రేమకథకు సెన్సార్ బోర్డ్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు. యువతకు మంచి సందేశాన్నిచ్చే సినిమా అనీ ప్రేక్షకుల కంట తడిపెట్టించే సినిమా అని భాస్కరభట్ల తెలిపారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని సురేష్తో కలిసి ‘పిజ్జా’ చిత్రాన్ని విడుదల చేసిన సమన్యరెడ్డి అన్నారు. -
మనసులను తాకే ప్రేమించాలి
స్ట్రయిట్ చిత్రాలను తలపించే అనువాద చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. నేటివిటీతో సంబంధం లేని చిత్రాలైతే, ‘డబ్బింగ్’ అని ఇట్టే తెలిసిపోతుంది. సురేష్ కొండేటి అందించినవన్నీ అనువాద చిత్రాలే అయినా, స్ట్రయిట్ చిత్రాలేమో అనే ఫీల్ని కలగజేస్తాయి. దానికి కారణం ఆయన ఏ సినిమా విడుదల చేసినా, అది తెలుగు నేటివిటికీ దగ్గరగా ఉండటమే. ప్రేమిస్తే... షాపింగ్మాల్, జర్నీ, నాన్న, పిజ్జా.. ఇలా పలు విజయవంతమైన చిత్రాలను అందించిన సురేష్ తాజాగా తమిళంలో సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ‘ఆదలాల్ కాదల్ సెయ్వీర్’ చిత్రాన్ని ‘ప్రేమించాలి’ పేరుతో తెలుగులో ఈ నెలలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడతూ -‘‘మా సంస్థ నుంచి వస్తున్న పదో చిత్రం ఇది. ఇప్పటివరకూ వచ్చిన ప్రేమకథాచిత్రాలకు భిన్నంగా ఉంటుంది. యువతరం మనోభావాలకు అద్దం పట్టేలా సుశీంద్రన్ ఈ చిత్రాన్ని మలిచారు. మనసుల్ని తాకే భావోద్వేగాలతో పాటు, చక్కని సందేశం కూడా ఉంటుంది. ఇప్పటివరకూ మా సంస్థ నుంచి వచ్చిన చిత్రాలన్నింటికీ దాదాపుగా క్లీన్ యు సర్టిఫికెట్టే రావడం గమనార్హం. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు మా నుంచి వస్తాయనడానికి ఇదే నిదర్శనం. యువన్ శంకర్రాజా స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. తమిళనాట సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని కూడా తప్పక ఆకట్టుకుంటుంది’’ అన్నారు. సంతోష్, మనీషా యాదవ్ జంటగా నటించిన ఈ చిత్రంలో జయప్రకాష్, పూర్ణిమా జయరామ్, తులసి, కామ్నాథ్శెట్టి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సూర్య ఎ.ఆర్, ఎడిటింగ్: ఆంటోని, సహ నిర్మాత: సమన్యరెడ్డి. -
మార్చిలో సునిల్తో సినిమా చేస్తా
నూతన సంవత్సరంలో వరుస సినిమాల నిర్మాణంతోపాటు ప్రజా సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టనున్నట్లు ప్రముఖ సినీ నిర్మాత, సంతోషం సినీ పత్రిక సంపాదకుడు సురేష్ కొండేటి అన్నారు. సోమవారం సంక్రాంతి సందర్భంగా స్వస్థలమైన పోడూరు మండలం వేడంగిపాలెం వచ్చిన ఆయన ‘న్యూస్లైన్’తో మాట్లాడారు. ఈ ఏడాది మార్చిలో హీరో సునిల్తో ఓ సినిమా నిర్మిస్తున్నట్లు చెప్పారు. తమిళంలో విజయవంతమైన వరుతా పడార్ వాలీబార్ సంఘం చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి దర్శకుడు, మిగిలిన నటీనటులను త్వరలో వెల్లడిస్తామన్నారు. హీరో సిద్ధార్థతో కార్తికసుబ్బరాజ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం పూర్తయ్యిందని, ఫిబ్రవరిలో దీన్ని విడుదల చేయనున్నట్లు సురేష్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 60 చిత్రాలను పంపిణీ చేయగా తాను నిర్మించిన వివిధ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించాయన్నారు. సొంతగడ్డపై అభిమానంతో వేడంగిపాలెం గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు తన వంతు సహకారం అందించానని, రానున్న రోజుల్లో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సురేష్ చెప్పారు. -
‘ప్రేమిస్తే’ అంత గొప్పగా...
‘సుశీంద్రన్ సినిమాను తెలుగులోకి అనువదించాలనే నా కోరిక ఈ సినిమాతో తీరింది’’ అని నిర్మాత సురేష్ కొండేటి అన్నారు. సంతోష్, మనీషా యాదవ్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఆదలాల్ కాదల్ సేవియర్’ను సురేష్ కొండేటి ‘ప్రేమించాలి’ పేరుతో తెలుగులోకి అనువ దించారు. యువన్శంకర్రాజా స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని హైదరాబాద్లో మంత్రి గంటా శ్రీనివా సరావు ఆవిష్కరించి, తొలి ప్రతిని అంజలి, సందీప్కిషన్లకు అందించారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ -‘నా కెరీర్లో ‘ప్రేమిస్తే’ మరచిపోలేని సినిమా. ఆ సినిమాలాగే ‘ప్రేమించాలి’ కూడా గొప్ప సినిమాగా నిలిచిపోతుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కిన సినిమా ఇది. ఇందులోని కై్లమాక్స్ పాటను సిరివెన్నెలగారితో రాయించాలనుకున్నాను. కానీ భాస్కరభట్లతో రాయించాల్సి వచ్చింది. అనుకున్న దానికంటే గొప్పగా రాశాడు తను’’ అని చెప్పారు. తమిళంలో విజయం సాధించిన తన చిత్రం ఎస్.కె.పిక్చర్స్ ద్వారా తెలుగులో విడుదల కానుండటం ఆనందంగా ఉందని సుశీంద్రన్ చెప్పారు. ‘ప్రేమించాలి’ లాంటి మంచి సినిమాలు అరుదుగా మాత్రమే వస్తాయని భాస్కరభట్ల అన్నారు. చిత్రం యూనిట్ సభ్యులతోపాటు ఎమ్మెల్ కుమార్ చౌదరి, ఏడిద రాజా, విజయ్కుమార్ కొండా, నవీన్చంద్ర, శ్రీవిష్ణు, శ్రీరామచంద్ర, బాలాదిత్య, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కొత్త అల ఈ ప్రేమరా...
‘‘ఇప్పటివరకు మేం అందించిన సినిమాలన్నీ దాదాపు మ్యూజికల్ హిట్సే. ఈ సినిమా కూడా కచ్చితంగా ఆ జాబితాలో చేరుతుంది’’ అని చెప్పారు నిర్మాత సురేష్ కొండేటి. ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై ఇప్పటివరకు తొమ్మిది చిత్రాలు తీసిన సురేష్, పదో సినిమాగా ‘ప్రేమించాలి’ని అందిస్తున్నారు. సుశీంద్రన్ దర్శకత్వంలో సంతోష్, మనీషా యాదవ్ జంటగా నటించిన ఈ చిత్రానికి యువన్శంకర్ రాజా పాటలు స్వరపరిచారు. ‘కొత్త అల ఈ ప్రేమరా.. కొంటె కల ఈ ప్రేమరా..’ అనే టైటిల్ సాంగ్ను ఇటీవల హైదరాబాద్లో రికార్డ్ చేశారు. సురేష్ మాట్లాడుతూ -‘‘నా గత చిత్రం ‘మహేష్’కి ‘మది మోసే మౌనాన్ని...’లాంటి పాట రాసిన పులగం చిన్నారాయణ ఈ ప్రేమ పాటను కూడా బాగా రాశారు. ‘మెలికల్ తిరుగుతుంటే అమ్మాయి..’, ‘కిర్రాకు కిర్రాకు’ పాటల ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న నరేంద్ర అద్భుతంగా పాడారు. యూత్ పదే పదే పాడుకునే విధంగా ఈ పాట ఉంటుంది. ఇంకా ఇతర పాటలు కూడా సినిమాకి ఎస్సెట్ అవుతాయి. అతి త్వరలో పాటలను, త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. -
‘ప్రేమించాలి’... ‘సీతాకోక చిలుక’ను గుర్తుచేసింది - వందేమాతరం
ప్రేమిస్తే, షాపింగ్మాల్, జర్నీ, నాన్న, పిజ్జా... నిర్మాతగా సురేష్ కొండేటి ఉత్తమాభిరుచికి అద్దం పట్టే సినిమాలు. వాటికి ఏ మాత్రం తగ్గని రీతిలో... ఆయన సంస్థ నుంచి రాబోతున్న ‘ప్రేమించాలి’ సినిమా ఉంది’’ అని వందేమాతరం శ్రీనివాస్ అన్నారు. సంతోష్, మనీషా జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఆదలాల్ కాదల్ సెయ్వీర్’. తమిళనాట ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘ప్రేమించాలి’ పేరుతో తెలుగులోకి విడుదల చేస్తున్నారు సురేష్ కొండేటి. ఈ చిత్రంలో కీలక సన్నివేశంలో వచ్చే ఓ పాటను భాస్కరభట్ల రాయగా వందేమాతరం శ్రీనివాస్ ఆలపించారు. ఈ సందర్భంగా చిత్రాన్ని తిలకించిన వందేమాతరం ‘ప్రేమించాలి’ గురించి మాట్లాడారు. ‘‘చిన్న సినిమాలతో ప్రయోగాలు చేయడంలో తమిళ సినిమా ఎప్పుడూ ముందే ఉంటుంది. చిన్న సినిమాగా విడుదలై 16 కోట్లు వసూలు చేసిందంటే... ఈ సినిమా కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. నాటి ‘సీతాకోక చిలుక’ చిత్రాన్ని గుర్తుచేసిందీ సినిమా. సుశీంద్రన్ ట్రీట్మెంట్ నిజంగా సూపర్బ్. హృదయాలకు హత్తుకునే సినిమా ఇది. ఈ సినిమాలో ఓ మంచి పాట పాడే అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉంది. యువన్శంకర్రాజా ఆణిముత్యాల్లాంటి పాటలిచ్చారు. సాంకేతికంగా కూడా రిచ్గా ఉందీ సినిమా. భాషా బేదం లేకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ఈ నెల ప్రథమార్ధంలో పాటలను, ద్వితీయార్ధంలో సినిమాను విడుదల చేస్తామని సురేష్ కొండేటి చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సూర్య వి.ఆర్, కూర్పు: ఆంటోని, సహనిర్మాత: సమన్యరెడ్డి. -
సురేష్ చేస్తున్న పదో ప్రయత్నం ‘ప్రేమించాలి!'
‘‘ప్రేమకథలకు ట్రెండ్తో పని లేదు. మాస్ మసాలా చిత్రాల హవా నడుస్తున్నా, కామెడీ చిత్రాలు వీరవిహారం చేస్తున్నా ప్రేమకథా చిత్రాలకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందుకే, ఓ క్యూట్ లవ్స్టోరీని ప్రేక్షకులకు ఇవ్వాలనుకున్నాం’’ అంటున్నారు సురేష్ కొండేటి. ఇప్పటివరకు ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై తొమ్మిది చిత్రాలను అందించి, విజయవంతమైన చిత్రాల నిర్మాత అనిపించుకున్నారు సురేష్. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి పదో సినిమాగా తమిళ చిత్రం ‘ఆదలాల్ కాదల్ సెయ్వీర్’ని సురేష్ కొండేటి ‘ప్రేమించాలి!’ అనే టైటిల్ తో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఇందులో కొత్తవాళ్ళయిన సంతోష్, మనీషా జంటగా నటించగా, ఈ చిత్రానికి సమన్యరెడ్డి సహనిర్మాత. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్రాజా స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కథా కథనాలు ప్రధాన బలం. . . ఆకర్షణతో ప్రేమలో పడిన ఓ అమ్మాయి, అబ్బాయి జీవితాల్లో ఏర్పడిన పరిణామాల సమాహారమే ఈ సినిమా. తమిళంలో సాధించినట్లుగానే తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు. -
క్రేజీ హీరోతో స్ట్రయిట్ సినిమా!
పాత్రికేయునిగా, అనువాద చిత్రాల నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సురేష్ కొండేటి త్వరలో ఓ స్ట్రయిట్ చిత్రాన్ని నిర్మించనున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా శనివారం ఓ ప్రకటన ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. ‘‘తమిళంలో ఏడు కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందిన చిత్రం ‘వరుత్తపడాద వాలిబర్ సంగమ్’. గత నెల 6న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికి 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇది కోలీవుడ్లో రికార్డ్. ఇంకా అద్భుతమైన వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతుండటం విశేషం. శివకార్తికేయన్, సత్యరాజ్, శ్రీదివ్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పొన్రామ్ దర్శకత్వం వహించారు. నిజానికి ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం చాలామంది నిర్మాతలు తెలుగు నుంచి పోటీపడ్డారు. కానీ ఈ సినిమాపై నమ్మకంతో ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేసి మరీ చిత్రాన్ని తీసుకున్నాం. తెలుగులో ఓ యంగ్ క్రేజీ హీరో ఈ చిత్రంలో నటిస్తారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తాం’’ అని తెలిపారు. -
ఆకర్షణతో ప్రేమిస్తే..? : సురేష్ కొండేటి
‘‘ప్రేమకథలకు ట్రెండ్తో పని లేదు. మాస్ మసాలా చిత్రాల హవా నడుస్తున్నా, కామెడీ చిత్రాలు వీరవిహారం చేస్తున్నా ప్రేమకథా చిత్రాలకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందుకే, ఓ క్యూట్ లవ్స్టోరీని ప్రేక్షకులకు ఇవ్వాలనుకున్నాం’’ అంటున్నారు సురేష్ కొండేటి. ఇప్పటివరకు ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై తొమ్మిది చిత్రాలను అందించి, విజయవంతమైన చిత్రాల నిర్మాత అనిపించుకున్నారు సురేష్. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి పదో సినిమాగా తమిళ చిత్రం ‘ఆదలాల్ కాదల్ సెయ్వీర్’ని తెలుగులోకి అనువదిస్తున్నారు. కాఫీస్ సినిమా సమన్యరెడ్డి సహనిర్మాత. సుశీంద్రన్ దర్శకత్వంలో సంతోష్, మనీషా యాదవ్ జంటగా నటించారు. ఈ చిత్రానికి ‘ప్రేమించాలి!’ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా సురేష్, సమన్యరెడ్డి మాట్లాడుతూ -‘‘తమిళంలో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. కథా కథనాలు ప్రధాన బలం. సుశీంద్రన్ దర్శకత్వ పనితీరు అద్భుతం. యువన్ శంకర్రాజా స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆకర్షణతో ప్రేమలో పడిన ఓ అమ్మాయి, అబ్బాయి జీవితాల్లో ఏర్పడిన పరిణామాల సమాహారమే ఈ సినిమా. తమిళంలో సాధించినట్లుగానే తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు. -
అల్లరి నరేష్ సినిమాలా ఉండే మహేష్
‘‘నేనిప్పటివరకూ ఎనిమిది సినిమాలు విడుదల చేశాను. మన తెలుగు హీరో ఉన్న సినిమా అయితే బాగుంటుందనుకుంటున్న సమయంలో శర్వానంద్ నటించిన ‘జర్నీ’ని రిలీజ్ చేయడం ఆనందాన్నిచ్చింది. ఇప్పుడు మరో తెలుగు హీరో సందీప్కిషన్ నటించిన సినిమాని అందించడం ఇంకా ఆనందంగా ఉంది’’ అన్నారు సురేష్ కొండేటి. సందీప్కిషన్, డింపుల్ చోపడే జంటగా మదన్కుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘యారుడా మహేష్’. ఈ చిత్రాన్ని గుడ్ సినిమా గ్రూప్తో కలిసి ఎస్.కె. పిక్చర్స్ ద్వారా ‘మహేష్’ పేరుతో తెలుగులోకి విడుదల చేస్తున్నారు సురేష్. మారుతి సమర్పకుడు. సమన్యరెడ్డి సహనిర్మాత. నేడు ఈ చిత్రం విడుదలవుతోంది. సురేష్ మాట్లాడుతూ -‘‘మంచి కథ, మాటలు, పాటలు కుదిరాయి. ముఖ్యంగా చిన్నారాయణ రాసిన ‘మది మోసే..’ పాట ఆడియో చార్ట్బస్టర్లో ఫస్ట్ బెస్ట్ సాంగ్గా నిలిచింది. ఏపీలో నాలుగు వందల థియేటర్లకు పైగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు. సందీప్ మాట్లాడుతూ-‘‘ఈ చిత్రం టైటిల్కి ‘అల్లరి నరేష్ ఫిల్మ్’ అని ట్యాగ్లైన్ పెడితే బాగుంటుందని, నరేష్తో అన్నాను. ఎందుకంటే ఇది నరేష్ సినిమాల్లా ఉంటుంది’’ అన్నారు.