syndicate
-
అంతర్ రాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు
-
‘సిండికేట్’తో నా పాపాలన్నీ కడిగేసుకుంటా: ఆర్జీవీ
ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ..ఒకప్పుడు మాత్రం ఆర్జీవీ సినిమాలు ట్రెండ్ సెట్ చేశాయి. శివ, సత్య, సర్కార్, రంగీలా లాంటి సినిమాల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. అలాంటి కల్ట్,క్లాసిక్స్ చిత్రాలను తెరకెక్కించిన ఆర్జీవీ.. ఇటీవల మాత్రం ఆ స్థాయి సినిమాలను తీయలేకపోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. 27 ఏళ్ల తర్వాత తను తీసిన సత్య సినిమా మరోసారి చూశానని, కన్నీళ్లు వచ్చాయని, అలాంటి సినిమాను ఎందుకు బెంచ్ మార్క్గా పెట్టుకోలేకపోయానని ఆయన పశ్చాత్తాప పడ్డాడు. ఇకపై మంచి సినిమాలే చేస్తానని ప్రామిస్ చేస్తూ ట్వీట్ చేశాడు. అయితే కొంతమంది ఆయన ట్వీట్ని నమ్మితే..మరికొంత మంది ఆర్జీవీ ఇలాంటి ట్వీట్స్ చేయడం కొత్తేమి కాదు.. మాట మార్చడం ఆయనకు అలవాటే అనుకున్నారు.కానీ వర్మ ఈ సారి సీరియస్గానే చెప్పారు. గత కొంతకాలంగా నాసిరకం సినిమాలు చేస్తున్న ఆయన.. ఈ సారి ఓ భారీ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు. పెద్ద కాస్టింగ్తో పాన్ ఇండియా సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ఆ సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ఆర్జీవీ తెరకెక్కించబోతున్న ఈ కొత్త సినిమా పేరు ‘సిండికేట్’(Syndicate).అంతేకాదు ఈ సినిమా కాన్సెప్ట్ కూడా చెప్పుకొచ్చాడు. 70వ దశకంలో భారత్ స్ట్రీట్ గ్యాంగ్స్తో మొదలుపెట్టి ఐసిస్ వరకు ఎన్నో రకాల సంఘ వ్యతిరేక శక్తులను చూసిందని.. ఐతే గత పది పదిహేనేళ్లుగా చెప్పుకోగదగ్గ కొత్త గ్రూప్స్ లేవని.. ఒకవేళ భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు ఎలా ఉంటుందో ‘సిండికేట్’ రూపంలో చూపించబోతున్నానని వర్మ ట్వీట్ చేశాడు. ‘ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెర్రిఫైయింగ్ యానిమల్’ అంటూ ఈ సినిమాకు ఒక ట్యాగ్ లైన్ కూడా జోడించాడు వర్మ. తాను గత కొన్నేళ్లుగా చేసిన సినిమా పాపాలన్నింటినీ కడిగేసే ఒకే ఒక్క చిత్రంగా ‘సిండికేట్’ను వర్మ అభివర్ణించాడు. ఈ సినిమాకు పని చేసే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలో పంచుకుంటానని వర్మ వెల్లడించాడు.“ONLY MAN CAN BE THE MOST TERRIFYING ANIMAL “In CONTINUATION to my CONFESSION note on SATYA film , I DECIDED to make the BIGGEST film ever The film is called SYNDICATE It’s about a terrifying organisation which threatens the very EXISTENCE of INDIA The CONCEPT STREET…— Ram Gopal Varma (@RGVzoomin) January 22, 2025 -
లిక్కర్ స్కామ్: ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ:లిక్కర్ స్కామ్లో ఛత్తీస్గఢ్,జార్ఖండ్లలోని మొత్తం 17 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ఏకకాలంలో సోదాలు చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్కుమార్ చౌబే,ఎక్సైజ్ ఉన్నతాధికారి గజేంద్రసింగ్ నివాసాలు, స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కంపెనీల్లో ఈడీ మంగళవారం(అక్టోబర్ 29) తనిఖీలు నిర్వహించింది.ఐఏఎస్ అధికారులతో కలిపి మొత్తం ఏడుగురితో కూడిన సిండికేట్పై ఛత్తీస్గఢ్ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసింది. ఛత్తీస్గఢ్లో లిక్కర్స్కామ్కు పాల్పడడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సిండికేట్ భారీగా గండికొట్టిందన్న ఆరోపణలపై కేసు రిజిస్టర్ చేశారు. ఈ నేపథ్యంలో ఇదే కేసులో మనీలాండరంగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు తాజాగా ఈడీ రంగలోకి దిగింది. ఇదీ చదవండి: వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం.. ఏం జరిగిందంటే.. -
జేసీ వర్గీయుల దాష్టీకం..లిక్కర్ షాపు కోసం కిడ్నాపులు
సాక్షి,అనంతపురం: ఏపీలో లిక్కర్ షాపుల కోసం టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. సిండికేట్లుగా ఏర్పడి మద్యం షాపులను చేజిక్కించుకునేందుకు పచ్చనేతలు అక్రమాలకు తెర తీశారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ సీనియర్నేత జేసీ ప్రభాకర్రెడ్డి వర్గీయులు ఏకంగా కిడ్నాప్లు చేసేందుకు తెగబడ్డారు. మద్యం దుకాణానికి దరఖాస్తు చేశాడన్న కోపంతో యాడికిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ రామ్మోహన్ను జేసీ వర్గీయులు కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు జేసీ వర్గీయుల చెర నుంచి ఎంపీటీసీ రామ్మోహన్ను విడిపించారు. టీడీపీ నేతల దాష్టీకంపై యాడికి వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా, ఏపీలో వైఎస్సార్సీపీ హయాంలో ఉన్న పాత మద్యం పాలసీని రద్దు చేసి కూటమి ప్రభుత్వం ఏపీలో కొత మద్యం పాలసీని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా మద్యంషాపులను ప్రైవేటు వారికి అప్పగించేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ షాపులన్నీ ఎలాగోలా సిండికేట్లుగా మారి దక్కించుకోవాలని టీడీపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తుండడం గమనార్హం.ఇదీ చదవండి: కమీషన్లు..ముడుపులు.. దారి తప్పిన టీడీపీ -
అడ్డగోలు దోపిడీకి చంద్రబాబు సర్కార్ అధికారిక సిండికేట్
-
అడ్డగోలు దోపిడీకి అధికారిక సిండికేట్
అందులో ఉన్నవి నాలుగు ఐటీ ఆధారిత సేవల సంస్థలే ఏ శాఖ అయినా.. ఏ పనికైనా వాటి సేవలను పొందాల్సిందే కొత్త మద్యం విధానం సహా అన్నింటికీ అవే వీటిద్వారా దోపిడీకి రాచబాట వేసుకుంటున్న ప్రభుత్వ పెద్దలుసాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీ కోసం అధికారిక సిండికేట్కు తెరతీసింది. అస్మదీయ కన్సల్టెన్సీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలపై గుత్తాధిపత్యం కట్టబెట్టింది. టెండర్లు లేకుండానే ఏకపక్షంగా కన్సల్టెన్సీల నియామకానికి విధివిధానాలను ఖరారు చేసింది. ఇప్పటికే కొత్త మద్యం విధానం రూపకల్పనకు ఏకపక్షంగా కన్సల్టెన్సీ నియామకం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అన్ని శాఖలకూ వర్తింపజేస్తూ ఏకీకృత దోపిడీ వ్యవస్థను రూపొందిస్తోంది.వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కన్సల్టెన్సీల నియామకానికి మార్గదర్శకాలతో ఇటీవల జారీ చేసిన జీవో–86 ప్రభుత్వ పెద్దల దోపిడీ పన్నాగానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వ శాఖలు ఏవైనా ప్రాజెక్టులు, ప్రొక్యూర్మెంట్, కొత్త విధానం, మాస్టర్ప్లాన్ రూపకల్పన, సాంకేతిక సేవలు, పౌర సేవలు వంటి వాటి కోసం కన్సల్టెన్సీల నియామకంలో పారదర్శక టెండర్లకు ఈ జీవో ద్వారా ప్రభుత్వం దారులు దాదాపుగా మూసివేసింది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సర్విసెస్ (ఎన్ఐసీఎస్ఐ)లో ఎంపానల్ అయిన కన్సల్టెన్సీలనే ఎంపిక చేయాలని షరతు విధించింది.ఎన్ఐసీఎస్ఐ జాబితాలో ఈ అండ్ వై, కేపీఎంజీ, డెలాయిట్, పీడబ్ల్యూసీ అనే నాలుగు కంపెనీలే ఉన్నాయి. ఏ శాఖ అయినా ఈ సంస్థలకు తమ ప్రాజెక్టుకు అర్హత లేదని భావిస్తే టెండర్ల కోసం ప్రభుత్వ అనుమతి కోరాలి. అయితే, అసలు టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకే వీల్లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే.. ఏ శాఖ అయినా టెండర్లు పిలుస్తామని కోరినా ప్రభుత్వం తిరస్కరిస్తుందనే సంకేతాలిచ్చింది. మరోపక్క వివిధ శాఖలకు సేవలందిస్తున్న కన్సల్టెన్సీలను తక్షణం వైదొలగాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. తద్వారా అన్ని శాఖలు ఈ నాలుగు కంపెనీలతోనే సేవలు పొందేలా రాచబాట వేసింది. పారదర్శకతకు పాతర ఈ నాలుగూ ప్రధానంగా ఐటీ కంపెనీలు. ఐటీ ఆధారిత సేవలను మాత్రమే అందించగలవు. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎక్సైజ్, పర్యాటక, పట్టణాభివృద్ధి, వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్, విద్య, వైద్యం.. ఇలా అన్ని శాఖల కన్సల్టెన్సీ సేవలను వీటికే కట్టబెట్టాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక శాఖ 2021లో జారీ చేసిన ప్రొక్యూర్మెంట్–ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే కన్సల్టెన్సీలకు సాంకేతిక అర్హతలు 30 శాతం మించకూడదు.ఆర్థికపరమైన అర్హతలు ఎక్కువ ఉండాలి. బాబు ప్రభుత్వం ఈ నిబంధనను కూడా ఉల్లంఘించి, కన్సల్టెన్సీ సంస్థల సాంకేతిక అర్హతలు 70 శాతం లేదా 60 శాతం ఉండొచ్చని పేర్కొంది. అంటే ఆర్థిక అర్హతలు 30 లేదా 40 శాతం ఉంటే సరిపోతుందని చెప్పింది. సిండికేట్లోని నాలుగు కంపెనీలు ఐటీ ఆధారిత సేవల సంస్థలైనందున, వాటికి సాంకేతిక అర్హతలే ఎక్కువ ఉంటాయనే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధన విధించింది. భారీ దోపిడీకి పక్కా పన్నాగం ప్రభుత్వ విధానాలు, ప్రాజెక్టుల్లో భారీ దోపిడీకి మార్గం సుగమం చేసేందుకే కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ ఎత్తుగడ వేశారు. ప్రభుత్వ పెద్దలు ముందుగానే తమకు అనుకూలమైన విధివిధానాలను అనధికారికంగా రూపొందిస్తారు. అనంతరం అస్మదీయ కన్సల్టెన్సీ సంస్థను నియమించి, తాము రూపొందించిన విధానాన్నే దాని ద్వారా ప్రభుత్వానికి సమర్పిస్తారు. ప్రభుత్వం దానిని ఆమోదిస్తుంది. తద్వారా యథేచ్చగా దోపిడీకి పాల్పడి ప్రజాధనాన్ని కొల్లగొడతారు.ఇన్నర్ రింగ్ రోడ్డు దోపిడీ తరహాలోనే..రాష్ట్ర విభజన అనంతరం 2014–19లో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో దోపిడీకి పన్నిన వ్యూహాన్నే ఇప్పుడు ఏకంగా అన్ని శాఖలకు వర్తింపజేస్తోంది. అప్పట్లో ఏకంగా రూ.5 వేల కోట్ల భూదోపిడీకి ప్రభుత్వ పెద్దలు వేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు స్కెచ్ పెను సంచలనం సృష్టించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఠా ముందుగానే ఓ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను అనధికారికంగా ఖరారు చేసింది.చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలు అప్పటికే భారీగా కొన్న భూములను ఆనుకుని ఆ రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ రూపొందించారు. తరువాత ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ రూపకల్పనకు ఓ అస్మదీయ కన్సల్టెన్సీని నియమించారు. తాము రూపొందించిన అలైన్మెంట్నే ఆ కన్సల్టెన్సీ ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు. దాంతో చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలు ఆ అలైన్మెంట్కు అటూ ఇటూ కొన్న భూముల విలువ అమాంతం పెరిగింది. తద్వారా ఏకంగా రూ.5 వేల కోట్లు కొల్లగొట్టారు. అదే దోపిడీ విధానాన్ని ఇప్పుడు అన్ని ప్రభుత్వ శాఖల్లో అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా పన్నిన వ్యూహమే ఈ కన్సల్టెన్సీల సిండికేట్ జీవో అనేది స్పష్టమవుతోంది. -
పురందేశ్వరి ‘సిండికేట్’ రాజకీయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యం సిండి‘కేట్ల’ను తరిమికొట్టారు. మద్యపాన నియంత్రణకు గట్టి చర్యలు చేపట్టారు. చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను, అడుగడుగునా వెలసిన బెల్టు షాపులను తుదముట్టించి సిండికేట్ల నడుం విరగ్గొట్టారు. ఇప్పుడు మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. వాటి సంఖ్యను కూడా భారీగా తగ్గించింది. దీంతో రాష్ట్ర ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్య పరంగా పీల్చి పిప్పిచేస్తున్న మద్యం సిండికేట్లు కుదేలయ్యాయి. ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించి, మద్యం సిండికేట్ల ప్రయోజనాలే పరమార్థంగా పనిచేసే ఈ విపక్షాలు, పత్రికలకు ఈ పరిణామం కంటగింపుగా మారింది. తమకు ఆదాయాన్ని పంచే మద్యం సిండికేట్ల కోసం అవి రంగంలోకి దిగాయి. కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పైన దుష్ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో దుష్ప్రచారాన్ని తీవ్రతరం చేశాయి. మద్యం సిండికేట్లకు కొమ్ముకాసిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి అరెస్టయ్యారు. దీంతో మద్యం సిండికేట్ల బాధ్యతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నెత్తిన ఎత్తుకున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా ఆమె మాటలు, చర్యలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన పురందేశ్వరి ఆ పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెడుతూ.. కుటుంబం, మద్యం సిండికేట్ల కోసం పనిచేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలి కాలంలో రాష్ట్రంలో మద్యం దుకాణాలు, డిస్టిలరీల విషయంలో ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని రాజకీయ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో డిస్టిలరీలన్నీ చంద్రబాబు ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వాల్లో ఏర్పాటయినవే. 20 డిస్టిలరీల్లో 12 చంద్రబాబు సీఎంగా ఉండగా అనుమతిచ్చినవే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజారోగ్యం దృష్ట్యా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ వాస్తవాలను విస్మరించి, పురందేశ్వరి అసత్య ప్రచారానికి దిగారు. ఇది కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమేనన్నది సుస్పష్టం. బీజేపీ సిద్ధాంతానికి తిలోదకాలు నేషన్ ఫస్ట్–పార్టీ నెక్ట్స్–సెల్ఫ్ లాస్ట్ (దేశం తొలి ప్రాధాన్యత–పార్టీ మలి ప్రాధాన్యత–వ్యక్తిగత ప్రయోజనాలు ఆఖరు) అనేది బీజేపీ సిద్ధాంతం. కానీ, ఆ పార్టీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బీజేపీ సిద్ధాంతానికి తిలోదకాలిచ్చారు. పార్టీ కంటే సొంత కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చేలా ఆమె చర్యలు ఉన్నాయని బీజేపీ నేతల్లోనే చర్చ సాగుతోంది. ఆమె రాష్ట్ర పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ ప్రయోజనాలకంటే కుటుంబ ప్రయోజనాల కోసమే కార్యక్రమాలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ మోదీకి, బీజేపీకి దగ్గరయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే పురందేశ్వరి ఎన్టీఆర్ నాణెం ముద్రణ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టి, అ కార్యక్రమంలో చంద్రêబును, బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఆహ్వానించి, వారి మధ్య సయోధ్యకు ప్రయత్నించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్టీఆర్పైనా ఇదే తీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంపూర్ణ మద్య నిషేధం విధించడంతో మద్యం సిండికేట్లకు అడ్డుకట్ట పడింది. ఈ సిండికేట్లకు మద్దతుగా అప్పట్లో చంద్రబాబు తదితరులు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, ఆయన ప్రభుత్వాన్ని కూలదోశారు. ఆ వెంటనే చంద్రబాబు సీఎం పీఠమెక్కారు. సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడిచారు. మళ్లీ సిండికేట్ల రాజ్యం వచ్చింది. ఇబ్బడిముబ్బడిగా మద్యం దుకాణాలు వెలిశాయి. వీధికో బెల్టు షాపు వచ్చింది. వేయి తలల మద్య రక్కసి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని చిదిమేసింది. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడవడంలో, ఆ తర్వాత చంద్రబాబు పీఠాన్ని అధిష్టించడంలో దగ్గుబాటి పురందేశ్వరికి కూడా∙భాగస్వామ్యం ఉందని అప్పట్లో టీడీపీ వర్గాలే చెప్పాయి. 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన సందర్భంలో ఆమె ఎక్కడా దానిని వ్యతిరేకించలేదని ఆ వర్గాలు తెలిపాయి. ఈ వెన్నుపోటు రాజకీయం, సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడవడంలో చంద్రబాబుకు సహకరించిన కొన్ని పత్రికలే ఇప్పుడు రాష్ట్రంలో మద్యపాన నియంత్రణ చర్యలు చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వంపైనా అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఆ పత్రికల కథనాలను అనుసరిస్తూ పురందేశ్వరి ఇప్పుడు ఏకంగా సీఎం జగన్మోహన్రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేసే స్థాయికి వచ్చారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. చంద్రబాబు అవినీతిపై ప్రధాని మోదీ ఆరోపణలు చేసినా.. రాష్ట్రానికి 2014–19 మధ్య సీఎంగా పనిచేసిన చంద్రబాబు అవినీతిపై స్వయంగా ప్రధాని మోదీనే అనేక ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని ప్రధాని అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పట్లో వచ్చిన అనేక ఆరోపణల్లో ఒకటైన స్కిల్ స్కామ్లో సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్టు చేయగానే, ఆ అరెస్టును తప్పు పడుతూ టీడీపీ నాయకులకంటే ముందే పురందేశ్వరి సామాజిక మా«ధ్యమాల్లో ఖండించారు. రెండు రోజుల క్రితం లోకేశ్ ఢిల్లీలో అమిత్ షాను కలిస్తే.. ఆ భేటీ వివరాలు, ఫొటోలను కూడా లోకేశ్కంటే అరగంట ముందే పురందేశ్వరి ట్వీట్ చేశారు. ఇరువురి భేటీ వివరాలను పురందేశ్వరి సూచన మేరకు బీజేపీ రాష్ట్ర మీడియా విభాగం మీడియా ప్రతినిధులకూ వెంటనే తెలియజేసింది. అవినీతిపరుడని స్వయంగా ప్రధానే ఆరోపించిన చంద్రబాబు విషయంలో పురందేశ్వరి ఇలా వ్యవహరిస్తే బీజేపీ దెబ్బతినడం ఖాయమని ఆ పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బీజేపీని బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాల్సిన పురందేశ్వరి కీలక ఎన్నికల సమయంలో టీడీపీ ఆడే డ్రామాలో పావుగా మారారని, వచ్చిన అవకాశాలను కూడా∙చేజేతులా నిర్వీర్యం చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేతలు ధ్వజమెత్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలందరూ పూర్తి నైరాశ్యంలో ఉన్నారని, వారిలో కొందరు బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాన్ని పురందేశ్వరి వినియోగించుకోకపోగా, టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారా.. అనే అనుమానం కలిగేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. -
దాల్ మే కుచ్ కాలా హై!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కందిపప్పు టెండర్ దాఖలు ప్రక్రియలో కాంట్రాక్టర్ల కుమ్మక్కు తతంగం వెలుగుచూసింది. బహిరంగ మార్కెట్ ధర కంటే దాదాపు 50 శాతం అధికంగా ధరను సూచించి కాంట్రాక్టును దక్కించుకొనేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆ టెండర్ ప్రక్రియనే రద్దు చేసింది. మళ్లీ టెండర్ పిలవాలని యోచిస్తోంది. 54% పెంచేశారు...: రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిలోగర్భిణులు, బాలింతలు 4,57,643 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 6,67,783 మంది నయోదయ్యారు. వారికి ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం కింద సంపూర్ణ పోషకాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్నారు. గర్భిణి/బాలింతకు రోజుకు 30 గ్రాములు, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు రోజుకు 15 గ్రాముల చొప్పున కందిపప్పును ఆహారంలో కలిపి వడ్డిస్తున్నారు. ఈ లెక్కన నెలకు సగటున 500 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. పప్పు సరఫరాకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ టెండర్ పద్ధతిలో కాంట్రాక్టర్ను ఎంపిక చేస్తుంది. ఒకసారి ఎంపికైన కాంట్రాక్టర్ ఆరు నెలలపాటు కందిపప్పును సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రస్తుత వార్షిక సంవత్సరం తొలి 6 నెలల కోసం గత నెల అధికారులు టెండర్ పిలవగా 8 మంది పాల్గొన్నారు. అయితే వారంతా కిలో కందిపప్పు ధరను రూ. 176కు కాస్త అటుఇటుగా పేర్కొన్నారు. గత టెండర్ ప్రక్రియలో కాంట్రాక్టర్ కోట్ చేసిన కనిష్ట ధర రూ. 114 కాగా... ఇప్పుడు ఆ ధర రూ.176కు పెరిగింది. అంటే ఏకంగా 54 శాతం అధికంగా ధర కోట్ అయింది. మరోవైపు బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ. 120లోపే ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు టెండర్ ప్రక్రియను రద్దు చేశారు. భవిష్యత్తులో పెరుగుతుందనే అంచనాతో... టెండర్లో పాల్గొన్న 8 మందిని వ్యక్తిగతంగా అధికారులు పిలిచి మాట్లాడగా మార్కెట్లో ప్రస్తుతం కందిపప్పు ధర తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో పెరుగుతుందనే ఆలోచనతో ఈ రకంగా ధర కోట్ చేశామని వారు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే గత రెండేళ్లలో కందిపప్పు ధర ఈ స్థాయిలో లేకపోవడం, త్వరలో పంట ఉత్పత్తులు సైతం చేతికి అందే సమయం ఉన్నప్పడు ఇంత ఎక్కువ ధరను కోట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు ఆ టెండర్ను రద్దు చేశారు. అలాగే ఈసారి కాంట్రాక్టర్ల మార్పుపైనా దృష్టి సారించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ‘జెమ్’(గవర్నమెంట్ ఈ–మార్కెట్ప్లేస్) నేషనల్ పోర్టల్ ద్వారా టెండర్లు పిలిచే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని... అప్పటివరకు పాత కాంట్రాక్టర్కే తాత్కాలికంగా సరఫరా బాధ్యత అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
డిగ్రీ, పీజీ ప్రెగ్నెంట్ విద్యార్థులకు ప్రసూతి సెలవులు మంజూరు
కేరళలో తొలిసారిగా మహాత్మగాంధీ విశ్వవిద్యాలయం ప్రెగ్నెంట్ విద్యార్థులకు 60 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేసింది. అందవుల్ల వారు ఎలాంటి ఆటంకం లేకుండా చదువును కొనసాగించవచ్చునని పేర్కొంది. ఈ మేరకు వైస్ ఛాన్సలర్ సీటీ అరవింద కుమార్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సిండికేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రసూతి సెలవులు ప్రసవానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చునని తెలిపింది. అది కూడా మొదటి లేదా రెండవ గర్భధారణకు.. కోర్సు వ్యవధిలో ఒకసారి మాత్రమే మంజూరు చేయబడుతుందని పేర్కొంది. అలాగే సెలవుల వ్యవధిలో ఒక్కొసారి పబ్లిక్ సెలవులు, సాధారణ సెలవులను ఉంటాయని, ఐతే ఆ సెలవులతో దానితో కలపమని తెలిపింది. అంతేగాదు అబార్షన్, ట్యూబెక్టమీ తదితర సందర్భాల్లో సుమారు 14 రోజుల సెలవు మంజూరు చేయబడుతుందని పేర్కొంది. పైగా ప్రెగ్నెన్సీ కారణంగా విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడకుండా...ఒక సెమిస్టర్లో ప్రసూతి సెలవులు తీసుకుంటున్నవారు ఆ సెమిస్టర్లో పరీక్షల కోసం నమోదు చేసుకోవడానికి అనుమతించడం జరుగుతుంది. అయితే తదుపరి సెమిస్టర్లో రెగ్యులర్ విద్యార్థుల తోపాటు దానిని సప్లిమెంటరీగా రాయవచ్చు. అందువల్ల వారు సెమిస్టర్ కోల్పోరు. ఎందుకంటే వారి ప్రసూతి సెలవు ముగిసిన తర్వాత తమ బ్యాచ్వారి తోపాటు తర్వాత సెమిస్టర్లను కొనసాగించవచ్చు అని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఈ ప్రసూతి సెలవుల్లో ఉన్న విద్యార్థులకు ప్రాక్టికల్, ల్యాబ్, వైవా పరీక్షలు ఉన్నట్లయితే సంస్థ లేదా విభాగాధిపతి ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిండికేట్ కమిటీ నిర్ణయించింది. ఈ సెలవులు పొందేందుకు మూడు రోజుల ముందు దరఖాస్తుతోపాటు మెడికల్ సర్టిఫికేట్ను సమర్పించాలని పేర్కొంది. (చదవండి: అలా చేయకండి.. బలవంతంగా కొనిపించడం కరెక్ట్ కాదు) -
మందు బాబులు జర జాగ్రత్త.. లేదంటే జేబులు ఖాళీ!
కోహెడరూరల్(హుస్నాబాద్): సిండికేట్ల కనుసన్నల్లో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. మద్యం వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి సిండికేట్గా ఏర్పడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హుస్నాబాద్ నిమోజకవర్గంలో మద్యం వ్యాపారులు మద్యం వినియోగదారుల జేబులు ఖాళీ చేసేందుకు కుమ్మక్కయ్యారు. మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారుల పరస్పర అవగాహనతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్స్లో కొన్ని బ్రాండ్లను మాత్రమే విక్రయిస్తున్నారు. మద్యం వ్యాపారుల తీరుతో మందుబాబులు విసిగిపోతున్నారు. కొద్ది రోజులుగా మద్యం అమ్మకాల్లో జరుగుతున్న నాటకీయ పరిణామాలు వారి మత్తు దిగేలా చేస్తున్నాయి. కోరింది కాకుండా స్కీం ఇచ్చే కంపెనీల మద్యం మాత్రమే అమ్ముతున్నారు. బెల్ట్ షాపుల్లో మాత్రం 24 గంటలు అన్ని రకల బ్రాండ్లు అందుబాటులో ఉంటున్నాయి. పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు సందేహాలకు తావిస్తోంది. (చదవండి: వంట నూనెల సలసల.. 15 రోజుల్లో భారీగా పెరిగిన ధర, ఇలా అయితే కష్టమే! ) వ్యాపారుల ఇష్టారాజ్యం మద్యం కొనుగోలుదారులు అడిగిన బ్రాండ్ కాకుండా తమకు లబ్ధిచేకూర్చే కంపెనీల బ్రాండ్ల మద్యాన్ని మాత్రమే అమ్ముతున్నారు. లాభం ఎక్కువ ఇచ్చే(స్కీం)కంపెనీల మద్యాన్ని మాత్రమే విక్రయించేందుకు వ్యాపారులు సిండికేట్ అయ్యారని స్థానికులు చర్చించుకుంటున్నారు. స్కీంలు భారీగా ఇచ్చే కంపెనీల మద్యం మాత్రమే విక్రయించాలని అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్థానికులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ప్రధాన బాండ్ల విక్రయాలను నిలిపివేశారు. ఇతర ప్రాంతాల్లో వాటిని అమ్ముతున్నప్పటికీ స్థానిక వ్యాపారులు సిండికేటుగా మారడంతో కొన్ని బ్రాండ్ల మద్యం లభించడం లేదు. దీంతో మద్యం ప్రియులు వారు అంటగడుతున్న వాటినే తీసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. స్కీం లేకుంటే అంతే.. యువత ఎక్కువగా బీరు తాగుతుంటారు. అత్యధికంగా కింగ్ ఫిషర్ లైట్ లేదా స్ట్రాంగ్ పైనే మక్కువ చూపుతుంటారు. బీర్ల విక్రయాల్లో ఎక్కువగా అమ్మడు పోయిదే ఈ బ్రాండ్ మాత్రమే. మార్కెట్లో డిమాండ్ ఉన్న బ్రాండ్ కావడంతో కొద్దిరోజులుగా ఆ కంపెనీ స్కీం రూపంలో వైన్షాప్లకు ఇచ్చే ప్రోత్సహకాలకు నిలిపి వేసినట్లు తెలిసింది. దీంతో ప్రోత్సాహకాలు(స్కీం)ఇవ్వని బ్రాండ్లు అమ్మకూడదని వ్యాపారులు నిర్ణయించుకున్నట్లు వినికిడి. వినియోగదారులు కోరినా స్టాక్ లేదంటూ ఇతర కంపెనీల బీర్లను అంటగడుతున్నారు. (చదవండి: అమ్మమ్మ పాలకూర కావాలంటూ.. పుస్తెలతాడుతో.. ) ఎక్సైజ్ అధికారుల అండతో.. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్సైజ్ అధికారుల అండదండలతో మద్యం వ్యాపారుల సిండికేట్ నడుస్తోంది. సిండికేట్ నడుస్తోందని తెలిసినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మా దృష్టికి రాలేదు హుస్నాబాద్ పరిధిలో మద్యం వ్యాపారులు అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. అధిక ధరలకు అమ్ముతున్నట్టు మాకు సమాచారం లేదు. గ్రామాల్లో బెల్ట్షాపులు ఉన్నట్టు మా దృష్టికి రాలేదు. మద్యం వ్యాపారులు సిండికేట్గా ఉండకూడదు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. అధిక ధరలకు మద్యం విక్రయించకూడదు – విజయలక్ష్మి, ఎక్సైజ్ సీఐ, హుస్నాబాద్ సరికొత్త రేట్లతో విక్రయాలు మద్యం వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా ఇష్టారాజ్యంగా ధరలు పెంచి బహిరంగంగా విక్రయాలు సాగిస్తున్నారు. ఫుల్ బాటిల్పై రూ.20 నుంచి 30, హాఫ్ బాటిల్పై రూ.10 నుంచి 20 వరకు, క్వాటర్ సీసాపై రూ.10 నుంచి 15 వరకు విక్రయిస్తున్నారు. బీరుపై రూ.10 నుంచి 20 అధికంగా వసూలు చేస్తున్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేకంగా మద్యం సీసాలపై స్టిక్కర్లు వేసి బెల్ట్షాపులకు సరఫరా చేస్తున్నారు. -
‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!
పాఠశాల సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన మహి వీ రాఘవ్ ఆనందో బ్రహ్మ సినిమాతో తొలి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. తరువాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన యాత్ర సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లను కూడా సాధించింది. యాత్ర తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మహి, తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు మహి. ‘ఓ దర్శకుడు కథ చెప్పటం కన్నా, ఏ కథ చెప్పాలి అని నిర్ణయించుకోవటమే కష్టమైన పని. బాక్సాఫీస్ ట్రెండ్స్, బడ్జెట్, నటీనటులు ఇవేవి కథ ఎంపికకు సాయపడవు. నిశ్శబ్ధంలో వచ్చే ఓ ఆలోచన.. ఇదే నువ్వు చెప్పాల్సిన కథ అని నాకు తెలియజేస్తుంది. నా తదుపరి చిత్రం ఓ యాక్షన్ డ్రామా. టైటిల్ ‘సిండికేట్’. త్వరలోనే ఈ కథ, పూర్తి స్థాయి స్క్రిప్ట్గా, ఆ స్క్రిప్ట్ సినిమాగా వస్తుందని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. ‘SYNDICATE’ pic.twitter.com/6DAyGGqjFf — Mahi Vraghav (@MahiVraghav) July 30, 2019 -
కలరింగ్ ఇచ్చేందుకు అధికారులు నానాపాట్లు
సాక్షి, ఏలూరు టౌన్ : ఎన్నికల కమిషన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాల్సి రావటం.. ఎన్నికల విధులను సక్రమంగానే నిర్వర్తిస్తున్నామని కలరింగ్ ఇచ్చేందుకు అధికారులు నానాపాట్లు పడుతున్నారు. ప్రతి రోజూ భారీఎత్తున దాడులు చేస్తున్నట్టు, అక్రమ మద్యం స్వాధీనం.. అరెస్టులు చేస్తున్నట్లు చూపిస్తున్నారు. ఇంతకీ ఇవన్నీ ఉత్తుత్తి దాడులేనని, పేరుకే దాడులు తప్ప చర్యలు శూన్యమనే ఆరోపణలు ఉన్నాయి. ముందుగా లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని మరీ కాగితాల మీద లెక్కలు చూపించుకునేందుకు అధికారులు తాపత్రయపడుతున్నారని తెలుస్తోంది. ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగంగానే సిండికేట్లతో ఒప్పందాలు చేసుకుని దాడులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిండికేట్లతో రహస్య ఒప్పందం జిల్లా వ్యాప్తంగా మద్యనియంత్రణ, ఆబ్కారీ శాఖ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. భారీ సంఖ్యలో మొబైల్ టీమ్స్, స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్, ట్రైన్ చెకింగ్ టీమ్లతో పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేశామని చెబుతున్నారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని నియంత్రించేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని అధికారులు ప్రకటించారు. కానీ ఇవన్నీ ఉత్తుత్తి దాడులేనని ఆరోపణలు వస్తున్నాయి. ముందుగానే మద్యం సిండికేట్లతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటూ రోజుకు కొన్ని ప్రాంతాల్లో దాడులు చేస్తూ మద్యాన్ని సీజ్ చేయటం, అరెస్టులు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో దాడులు చేసి స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ఎన్నికల అనంతరం వారికి అప్పగించేలా ఒప్పందాలు చేసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంగానే సిండికేట్లు ఆయా ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఏర్పాట్లు చేయటం, అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ శాఖ డీసీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఇలా స్వాధీనం చేసుకున్న మద్యం అంతా ఎన్నికలు ముగిసిన వెంటనే తిరిగి వారికి అప్పగించేలా ఒక రహస్య ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. ముందుగా సిండికేట్లు మద్యం కేసులను ఒక చోట ఉంచి, ఎక్సైజ్ అధికారులకు చెప్పటం, అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవటం అంతా ఒప్పందంలో భాగమేనంటున్నారు. పోలీసులు దాడుల్లో మద్యం బాటిళ్లు దొరుకుతుంటే, ఎక్సైజ్ శాఖ అధికారుల దాడుల్లో మాత్రం ఏకంగా అట్టపెట్టెలతో భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోవటం అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల అనంతరం మళ్లీ తిరిగి అట్టపెట్టెలతో సహా మద్యం బాటిళ్లను మద్యం షాపుల యజమానులకు వాటిని అప్పగించేందుకు పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
ఆక్వా రైతులపై సిండ్‘కాటు’
- కీలక కౌంట్ ధరల తగ్గింపు - లబోదిబోమంటున్న రైతులు అమలాపురం : ఆక్వా ధరలు మరోసారి దారుణంగా పడిపోయాయి. కీలక కౌంట్ ధరలు నెల రోజుల వ్యవధిలో కేజీకి రూ.50 నుంచి 120 వరకు పడిపోవడంతో రైతులు కుదేవుతున్నారు. వ్యాపారులు సిండికేటుగా మారి మరోసారి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. జిల్లాలో గడిచిన రెండేళ్లుగా కాసులు కురిపిస్తున్న వెనామీ సాగు ఈ ఏడాది రైతులకు చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చిన ఊరూపేరూ లేని హేచరీల్లో నాణ్యత లేని సీడ్ వల్ల కొంత వరకు చెరువులు దెబ్బతినగా, మిగిలిన చెరువుల పట్టుబడి సమయానికి దగ్గరకు వచ్చే సరికి వ్యాపారులు సిండికేటుగా మారి ధరలు తగ్గించి వేశారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల వల్ల చెరువుల్లో రొయ్యలు సహజసిద్ధంగా చనిపోతున్నాయి. దీనికితోడు డీవో (డెడ్ ఆక్సిజన్) కారణంగా వందలాది ఎకరాల చెరువుల్లో రొయ్యలు మరణిస్తున్నాయి. ఆందోళనతో ఉన్న రైతులు పట్టుబడులు ఆరంభించారు. ఇదే అదనుగా వ్యాపారులు సిండికేటయ్యారు. ఎక్కువుగా వస్తున్న కౌంట్లను చూసి వాటి ధరలను ఆమాంతంగా తగ్గించేశారు. కొనుగోలుదారులు రేట్లు తగ్గుతున్నాయనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేయడంతో రైతులు ముందస్తు పట్టుబడులకు వెళుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కువుగా 40 కౌంట్ (కేజీకి 40 రొయ్యలు) నుంచి 80 కౌంట్ వరకు వస్తున్నాయి. దీంతో ఈ కౌంట్ ధరలను గుణనీయంగా తగ్గించి వేశారు. 40 కౌంట్ ధర కేజీకి రూ.70, 43 నుంచి 50 కౌంట్ ధర రూ.120, 60 కౌంట్ ధర రూ.110, 63 నుంచి 70 కౌంట్ ధర రూ.90, 73 నుంచి 80 కౌంట్ ధర రూ.70 చొప్పున తగ్గించేశారు. వీటితోపాటు 83 నుంచి 90 కౌంట్ ధర రూ.50, 100 కౌంట్ ధర రూ.30 చొప్పున తగ్గించి రైతుల ఆశలపై నీళ్లు జల్లుతున్నారు. ధరలు తగ్గించే విషయంలో కొనుగోలుదారులు ఒకే మాట, ఒకే ధర అన్నట్టుగా సిండికేటు కావడంతో రొయ్యల రైతులు విలవిల్లాడుతున్నారు. 50 కౌంట్ ధర రూ.120 తగ్గడంతో రైతులు ఎకరాకు సగటున దిగుబడిగా వచ్చే రెండు టన్నుల రొయ్యల ఉత్పత్తిపై రూ. 3 లక్షల వరకు ఆదాయాన్ని కోల్పోతున్నారని అంచనా. ఇటీవల కాలంలో వెనామీ సాగు వైపు రెతులు ఎక్కువగా మొగ్గు చూపడంతో చెరువుల లీజుల ధరలు, సీడ్, మేత ధరలతోపాటు కూలి ధరలు భారీగా పెరిగాయి. చివరకు వేసవి సీజన్ కావడంతో రూ.200 ఉండే క్యాన్ ఐస్ ధర ప్రస్తుతం రూ.400ల నుంచి రూ. 500 వరకు పెరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే 15 శాతం పైగా పెట్టుబడి పెరిగిందని అంచనా. ఈ సమయంలో వ్యాపారులు సిండికేటుగా మారి ధరలు తగ్గించడంతో పంటపండినా నష్టాలు చవిచూడాల్సి వస్తోందని ఆక్వా రైతులు లబోదిబోమంటున్నారు. కౌంట్ గత నెల 25న తాజాగా 20 కౌంట్ 640 640 25 కౌంట్ 540 540 30 కౌంట్ 530 460 40 కౌంట్ 430 360 42 కౌంట్ 410 340 43 నుంచి 50 కౌంట్ 380 260 60 కౌంట్ 350 240 63 నుంచి 70 కౌంట్ 320 230 73 నుంచి 80 కౌంట్ 290 220 83 నుంచి 90 కౌంట్ 260 210 93 నుంచి 100 కౌంట్ 230 200 -
తెల్లవార్లూ మద్యం అమ్మకాలు
మద్యం సిండికేట్లు నిబంధనలు తుంగలో తొక్కి అడ్డగోలుగా వ్యాపారం చేస్తున్నాయి. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా మద్యం విక్రయాలు రహస్యంగా చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారులు ఎక్కడికక్కడ సిండికేట్లుగా ఏర్పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేసిన సందర్భాలలో జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన మంత్రులను బూచీగా చూపిస్తున్నారు. రాత్రిళ్లు షాపులో బయట తాళాలు వేసినా షట్టర్కు చేసిన రంధ్రం ద్వారా తెల్లవార్లు మద్యం విక్రయిస్తున్నారు. రాత్రిళ్లు బాటిల్ను నిర్ణీత మొత్తం కంటే అదనంగా రూ.20 నుంచి రూ.30 వరకూ వసూలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : జిల్లాలో 545 మద్యం షాపులు ఉండగా రెండు నెలల క్రితం లాటరీ పద్ధతిలో 521 షాపులకు కేటాయింపులు చేశారు. మరో 24 షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జూలై నుంచి కొత్త లైసెన్సులు అమలులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో మద్యం సిండికేట్లు ఇష్టారాజ్యంగా వ్యాపారం సాగిస్తున్నారు. మంచినీళ్లు దొరకని ప్రాంతాల్లో కూడా మద్యం ఏరులై పారుతోంది. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం ఈ షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ అమ్మకాలు సాగించాలి. అయితే జిల్లాలో తెల్లవారుజాము నుంచే మద్యం అమ్మకాలు ప్రారంభిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో తెల్లవార్లూ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రాజమహేంద్రవరంలో అప్సరా థియేటర్ వద్ద షాపులో ఉదయం 5 గంటల సమయంలో అమ్మకాలు సాగిస్తున్నందుకు ఏజీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలమూరులో కూడా రెండు షాపులపై ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. చక్రం తిప్పుతున్న సిండికేట్లు మద్యం సిండికేట్లే మద్యం రేట్లు నిర్ణయిస్తున్నారు. మద్యం కంపెనీలు రేట్లు పెంచినందున లాభాలు రావడం లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచుకొని అమ్ముకుంటామని మద్యం వ్యాపారులు గతంలో ప్రభుత్వానికి అనుమతిని కోరుతూ లేఖ రాశారు. అయితే ప్రభుత్వం విధానం ఇంకా ప్రకటించకుండానే వ్యాపారులు రేట్లు పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మార్పీ కంటే ఎక్కువగా విక్రయిస్తుంటే.. ఆ రేట్లకు మించి ఒక్కో బాటిల్పై కనీసం రూ.10 నుంచి రూ.20 వరకూ అదనంగా రేటు నిర్ణయించారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న షాపులు మూసి వేయాలనే విధానంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుండడంతో పాత షాపులనే కొనసాగిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లకే ఎక్కువ షాపులు.. ఎక్సైజ్ అధికారులు ఇటీవల జిల్లాలో నిర్వహించిన లాటరీలో తెలుగు తమ్ముళ్లే ఎక్కువ షాపులను దక్కించుకున్నారు. అధికారులును ప్రలోభాలకు గురి చేసి షాపులకు ఎవరూ అడ్డు రాకుండా చేసుకోగలిగారు. కొన్ని చోట్ల 20 ఏళ్లుగా షాపు నిర్వహిస్తున్న వ్యక్తికే తిరిగి షాపు దక్కేలా పావులు కదిపారు. ఎవరైనా ఆ షాపు కోసం దరఖాస్తు చేస్తే మొదటిలోనే అడ్డుకొని దరఖాస్తు చేసిన వారిపై దౌర్జన్యం చేసి భయపెట్టిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ లాటరీ పద్ధతిపై పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోలేకపోతున్న అధికారులు ప్రతి షాపులో ఎమ్మార్పీకే విక్రయాంచాలన్న నిబంధన అమలుపై ఎక్సైజ్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ ఫిర్యాదులు అందినప్పటికీ షాపు యజమానులపై అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండడంతో వారి ద్వారా ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. చర్యలు చేపడతాం మద్యం షాపుల అమ్మకాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నాం. షాపుల కేటాయింపు పారదర్శకంగా జరిగింది. జూ¯ŒS 30తో పాత షాపులు గడువు ముగుస్తుంది. జూలై ఒకటో తేదీ నుంచి కొత్త షాపులు ప్రారంభమవుతాయి. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నట్టు దృష్టికి వస్తే షాపుల యజమానులపై కేసులు నమోదు చేస్తాం. – బత్తుల అరుణరావు, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ శాఖ -
లాతరీలో.. అన్నీ మోషాలే..
మద్యం షాపుల లాటరీ మాయాజాలం l సిండికేట్లతో అధికారుల లాలూచీ l అమలాపురంలో నాలుగు షాపుల తీరు గందరగోళం సీసీ కెమెరాలు... ఎంట్రీ పాస్లు... గుర్తింపు కార్డులు... టోకెన్లు... నఖశిఖ పర్యంతం తనిఖీలు... పారదర్శకతకు అద్దం పట్టేలా.. సవాలక్ష నిబంధనల నడుమ జిల్లాలో మద్యం షాపులకు నిర్వహించిన లాటరీ విధానం వివాదా స్పదమైంది. చివరికి ఈ విషయం ఉన్నతాధికారులకు ఫిర్యాదులు... కోర్టుల్లో కేసుల వరకూ దారి తీస్తోంది. అమలాపురం టౌ¯ŒS (అమలాపురం) : కాకినాడలో గత నెల 31న మద్యం షాపుల కేటాయింపునకు నిర్వహించిన ఈ లాటరీ విధానంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని లాటరీలో అడ్డగోలు చర్యల వల్ల షాపులు కోల్పోయిన దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు, బడా సిండికేట్లకు అధికారులు తెరచాటు సహకారం అందించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. అమలాపురంలో నాలుగు షాపులకు సంబంధించిన లాటరీల్లో కేటాయింపులు వివాదాస్పదం కావడంతో బాధిత దరఖాస్తుదారుల్లో కొందరు జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ కమిషనర్ లిఖిత పూర్వక ఫిర్యాదులు చేశారు. మరికొందరు ఎక్సైజ్ అధికారుల చేసిన తప్పిదాలపై కోర్టులను ఆశ్రయించారు. బినామీల రంగప్రవేశం అమలాపురంలో నాలుగు షాపుల కేటాయింపులపై చెలరేగిన దుమారంతో జిల్లాలో మి గిలిన ప్రాంతాల్లో కూడా లాటరీ లోపాలు, అధికారుల తప్పిదాలు వెలుగు చూస్తున్నాయి. అమలాపురంలో 190, 191, 192, 193 షాపుల కేటాయింపు వివాదా స్పదం అయిన సంగతి తెలిసిందే. ఒక షాపులో మొదటి దరఖాస్తుదారుడికి లాటరీలో వచ్చినప్పటికీ సంబంధిత సిండికేటర్ దరఖాస్తులో పేర్కొన్న వ్యక్తిని అధికారుల ముందు నిర్ణీత సమయంలో హాజరు పరచలేకపోయారు. మరో షాపునకు దరఖాస్తులో పేర్కొన్న వ్యక్తిని కాకుండా మరో వ్యక్తిని హాజరుపరచి అతనే అసలు వ్యక్తిగా నమ్మించి అతడితో సంతకం పోర్జరీ చేయించారు. 193 షాపునకు ఒకటో దరఖాస్తుదారుడు కాకుండా మరో వ్యక్తి (బినామీ) డ్రాలో పాల్గొన్నాడు. దరఖాస్తులో ఉన్న వ్యక్తి సంతకాన్ని అతడే చేశాడు. 193 షాపులో రెండో దరఖాస్తుదారుడు జవ్వాది వెంకట కృష్ణ నాగేశ్వరరావు ఈ తప్పిదంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటమే కాకుండా కోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు. 192 షాపు వ్యవహారం కూడా ఇలాంటి వివాదంపైనే కోర్టు వరకూ చేరింది. పాటించని నిబంధనలు.. లాటరీ డ్రా నిర్వహిస్తున్నప్పుడు సంబంధిత షాపు దరఖాస్తుదారుడు విధిగా హాజరై ఉండాలి. ఈ నిబంధనను అధికారులు కచ్చితంగా పాటించి ఉంటే లేదా ఈ పరిస్థితి వచ్చేది కాదని బాధిత దరఖాస్తుదారులు అంటున్నారు. లాటరీ డ్రాలో పాల్గొనే ప్రతి దరఖాస్తుదారుడికి ఫోటో గుర్తింపు కార్డులు కూడా జారీ చేశారు. దరఖాస్తుదారుడికి బదులు మరో వ్యక్తి డ్రాలో పాల్గొని ఫోర్జరీ సంతకం చేయడంపై ఎక్సైజ్ అధికారులు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్యం షాపుల నిర్వహణలో ఏళ్ల తరబడి బలంగా పాతుకుపోయిన సిండికేటర్లు, ఎక్సైజ్ అధికారుల మధ్య ఉన్న సంబంధాలతోనే ఈ అక్రమాలకు ఆస్కారం ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. ఆ రోజు లాటరీ డ్రా సమయంలో సీసీ పుటేజ్లను పరిశీలిస్తే అక్రమాలు వెలుగు చూస్తాయని అంటున్నారు. లాటరీ డ్రాకు ఎక్సైజ్ శాఖ విధించిన నిబంధనలను కచ్చితంగా అనుసరించి తిరిగి డ్రాలు నిర్వహిస్తే ఆ షాపులు తమకే దక్కుతాయని బాధిత దరఖాస్తుదారులు అంటున్నారు. -
సిండికేట్గా రేషన్ మాఫియా
రేషన్ బియ్యం అక్రమంగా తరలించి అమ్ముకోవడం కొత్తేమీ కాదు.. ఏళ్ల తరబడి కొనసాగుతున్నదే.. రెండేళ్ల కిందటి వరకు ఇలా పేదల బియ్యాన్ని బొక్కే దొంగలంతా విడివిడిగా తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగించేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ నాయకుడొకరు వీరినందరినీ ఒక తాటిపైకి తెచ్చాడు. ఆ విధంగా రేషన్ డీలర్ల మాఫియా తయారైంది. అధికారులు వారికి జీ హుజూర్ అంటున్నారు. ఇక రేషన్ దోపిడీ పట్టపగ్గాలు లేకుండా సాగుతోంది. మాచర్ల: నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయకుండానే డీలర్లు సిండికేట్గా వ్యవహరిస్తున్న అధికార పార్టీ నాయకులకు అమ్మేస్తున్నారు. తాజాగా శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న 52 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎస్ఐ రామాంజనేయలు స్వాధీనపర్చుకుని కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పీఆర్కే బియ్యం లారీని పట్టించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి వారం రోజులు గడవకముందే మరోసారి రేషన్ బియ్యం దొరికాయి. దీనినిబట్టి అధికార పార్టీకి చెందిన నాయకుల అక్రమ వ్యాపారం ఎలా సాగుతోందో అర్థమవుతోంది. దందా నడిపిస్తున్న నామినేటెడ్ నాయకుడు.. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ వర్గాలుగా వున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాదారులందరినీ తన కనుసన్నలలో ఉంచుకుని ఓ నామినేటెడ్ నాయకుడు దందాను నడిపిస్తున్నాడు. ఈ విషయంపై ఎమ్మెల్యే పీఆర్కే పలుమార్లు ఆరోపణలు కూడా చేశారు. వారం కిందట దుర్గి మండలంలోని అడిగొప్పల ప్రాంతంలో 420 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనపర్చుకుని పోలీసులకు పట్టించారు. అయినప్పటికీ పోలీసులు అధికార పార్టీ నాయకుల వత్తిళ్లకు తలొగ్గి దొరికిన డ్రైవర్పైనే కేసులు నమోదు చేసి అసలు సూత్రధారులను గాలికొదిలేశారనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే పీఆర్కే అక్రమ రేషన్ బియ్యం లారీని పట్టుకున్న సమయంలో దొరికిన ఐదుగురు మినహా మిగతా వారు ఎవరనేది పోలీసులు తేల్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. దుర్గి మండలంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరి పేర్లను నమోదు చేశామని చెబుతున్నా, వారిని అరెస్టు చేశారా లే దా అనే విషయాన్ని వెల్లడించలేదు. తాజాగా శుక్రవారం మాచర్ల శివారులో గుంటూరు రోడ్డులోని రాయవరం జంక్షన్ వద్ద 52 బస్తాల బియ్యాన్ని స్వాధీన పర్చుకున్నారు. ఈసారీ డ్రైవర్ ఒక్కడిపైనే కేసు నమోదు చేశారు. అసలు నిందితులను తేల్చకుండా పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. పథకం ప్రకారం డంపింగ్.. అధికార పార్టీ నాయకులు ముందుగా వివిధ మండలాల నుంచి రేషన్ బియ్యాన్ని తీసుకువచ్చి ఒక చోట డంప్ చేస్తారు. అక్కడ నుంచి వివిధ చోట్లకు వాహనాల్లో తరలిస్తున్నారు. ఈ కార్యక్రమం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరుగుతుంటుంది. పోలీసు పెట్రోలింగ్ చేసే సమయంలోనే లోడ్లను తీసుకెళ్తున్నా పోలీసులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా రూరల్ æపరిధిలోని ఓ పోలీసు అ«ధికారి అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలున్నాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు బియ్యం పట్టుకున్న ప్రతిసారీ దొరికిన వారిపై కేసులు పెట్టి చేతులు దులుపుకొంటున్నారు. కీలక సూత్రధారులపై చర్యలు తీసుకోవడం లేదు. -
శంషాబాద్లో నీళ్ల వ్యాపారుల దోపిడీ
శంషాబాద్ నీళ్ల వ్యాపారుల దోపిడీ మరింత పెరిగింది. గత పదిహేను రోజులుగా రూ.10 కు విక్రయించే 20 లీటర్ల నీటిని అమాంతం రెట్టింపు చేశారు. ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలను కూడా పాటించకుండా ఫిల్టర్ నీటిని అమ్ముకునే వ్యాపారులు సిండికేట్గా మారారు. గత పదేళ్లుగా పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న ఫిల్టర్ వ్యాపారులపై ఇంతరకు అధికారులు తనిఖీలు, అజమాయిషి కాస్తా లేకపోవడంతో వీరిది ఇష్టారాజ్యంగా మారింది. ఇటీవల సిండికేట్గా మారి రేట్లు కూడా పెంచేవారు. ఫ్లోర్ ఫ్లోరుకు ఓ లెక్కన రేట్లు తీసుకుంటున్నారు. నీటి సమస్యతో .. శంషాబాద్లో ప్రస్తుతం పాత గ్రామానికి కృష్ణా నీరు సరఫరా అవుతోంది. రోజుకు 15 లక్షల లీటర్ల నీటిని జలమండలి సరఫరా చేస్తోంది. అయితే, రైల్వే ట్రాక్కు కుడివైపున ఉన్న కాలనీలకు కృష్ణా నీరు అందటం లేదు. దీంతో ఇక్కడి వారు ఫిల్టర్ నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. శంషాబాద్ పట్టణంలో సుమారు 40 వేల జనాభాకు సరిపడా నీటి సరఫరా లేకపోవడంతో నీటి వ్యాపారులు ఇదే అదనుగా ధరలను పెంచేసి దోపిడి చేస్తున్నారు. మురుగునీటి ప్రవాహనం పక్కనే బోర్లు వేసి కూడా నీటిని అమ్ముకుంటు సొమ్ము చేసుకుంటున్నారు. పంచాయతీ కొరడా.. ఇటీవల గ్రామసభలో సమస్య ప్రస్తావనకు రావడంతో ఎట్టకేలకు శంషాబాద్ పంచాయతీ అధికారులు రంగంలోకి దిగారు. ఫిల్టర్ నీటిని సరఫరా చేసే వారు నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన సర్టిఫికెట్లను పొందడంతో పాటు పంచాయతీ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందిగా సోమవారం ఫిల్టర్ వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. పెంచిన రేట్లను కూడా వెంటనే తగ్గించాలని ఆదేశించారు. పంచాయతీ అధికారులు రంగంలోకి దిగడంతో వ్యాపారులు దిగొస్తారా.. లేదా యధాతథంగా తమ దందాను కొనసాగిస్తారా..? లేదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
సర్కారు నోట్లో దుమ్ము
సాక్షి’ చెప్పిందే నిజమైంది.. ఇసుక వేలంలో వ్యాపారుల సిండికేట్ వ్యాపారులను బెదిరించిన టీడీపీ నేతలు కనిష్టంగా రూ.116కు టెండర్ ప్రభుత్వ ఆదాయానికి భారీగా తూట్లు ఏడు రీచ్లకు రూ.27.44 కోట్లు మాత్రమే సాక్షిప్రతినిధి, గుంటూరు : ఇసుక రీచ్ల వేలంలో వ్యాపారులంతా సిండికేట్ అయ్యారు. టీడీపీ నేతలు ఇందులో ముఖ్యభూమిక వహించారు. దరఖాస్తుదారుల వివరాలను ముందుగానే తెలుసుకుని పోటీపడి టెండర్లు వేస్తే ఇబ్బంది పడతారని వారిని టీడీపీ నేతలు బెదిరించారు. తప్పని పరిస్థితుల్లో వ్యాపారులు టీడీపీ నేతల ఆదేశాలను పాటించి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువగా దరఖాస్తులో పేర్కొన్నారు. సిండికేట్ కారణంగా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. క్యూబిక్ మీటరుకు రూ.500 ధరను ప్రభుత్వం నిర్ణయిస్తే, సిండికేట్ కారణంగా రూ.కనిష్టంగా రూ.116, గరిష్టంగా రూ.356 ధరలకు టెండరు వేశారు. కొన్ని రీచ్ల్లో ఇసుక తవ్వకాలకు పరిస్థితులు అనుకూలంగా లేవని, స్థానిక సమస్యలు ఉండడంతో వ్యాపారులు ధర తక్కువగా వేశారని, సిండికేట్ అయినట్టు తమ దృష్టికి రాలేదని అధికారులు చెబుతున్నారు. గుండిమెడ రీచ్కు రూ. 8 కోట్లు ‘సాక్షి ’ దినపత్రిక మొదటి నుంచి ఇసుక రీచ్ల టెండర్లలో టీడీపీ నేతలు ముందస్తు వ్యూహంతో వ్యవహరిస్తున్నారని ప్రచురించింది. గుండిమెడ రీచ్లో వ్యాపారులు సిండికేట్ అయ్యారని కూడా ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ రీచ్లో జరిగిన విధంగానే మిగిలిన రీచ్ల విషయంలో టీడీపీ నేతలు వ్యవహరించి అంతా సిండికేట్ అయ్యే విధంగా చేయగలిగారు. దరఖాస్తుదారుల వివరాలను తెలుసుకుని, వారినందరినీ సమావేశానికి రావాలని ఆదేశించారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే, సమస్యలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. మొత్తం ఏడు రీచ్ల్లో గుండిమెడకు రూ.8 కోట్లకు వ్యాపారులంతా సిండికేట్ అయ్యారు. వేలంలో ఆ రీచ్ను పాడుకున్న వ్యాపారి ఇతర వ్యాపారులకు ఆ మొత్తాన్ని చెల్లించే విధంగా సిండికేట్ అయ్యారు. మరికొన్నిటిలో దరఖాస్తుదారులంతా ఆ రీచ్ల్లో వ్యాపారులుగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నారు.వారిలో ఒకరిని రీచ్ నిర్వాహకునిగా ఏర్పాటుచేసుకుని, మిగిలిన వారు భాగస్వాములుగా ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు. రీచ్ల వారీ వ్యాపారులు చెల్లించనున్న ధరల వివరాలు ... ప్రభుత్వం నిర్ణయించిన విధంగా క్యూబిక్ మీటరుకు రూ.500 మించి విక్రయించరాదని ఆదేశాలు జారీ చేయడంతో దాని కంటే రేటును తక్కువ వేశారు. ఆ రేటుతోపాటు రీచ్ల్లోని ఖర్చులు, వివిధ శాఖల అధికారులకు చెల్లించే పర్సంటేజీలు, లాభంతో కలిపి రూ.500లోపు వ్యాపారులు విక్రయించాలి. గుండిమెడ రీచ్కు రూ.154, జువ్వలపాలెం రూ.138, కస్తల రూ.356, కోసూరు రూ.356, పోతార్లంక రూ.152, వల్లభాపురానికి రూ.142, ఉద్దండ్రాయునిపాలెంకు రూ.116లు చెల్లించే విధంగా వ్యాపారులు టెండరు వేశారు. రూ. 50 కోట్ల మేరకు నష్టం .. ఏడు రీచ్లకు జరిగిన వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.27.44 కోట్ల ఆదాయం లభించనుంది. వ్యాపారులు సిండికేట్ కాకుండా పోటీపడి టెండరులో రేటు వేసి ఉంటే ప్రభుత్వానికి కనీసం రూ.50 కోట్లపైనే ఆదాయం లభించేదని ఆ రంగంలోని సీనియర్లు చెబుతున్నారు. నది నుంచి ఇసుక తవ్వేవిధానం ఉద్దండ్రాయునిపాలెం రీచ్లో ఉండడంతో అక్కడ ఖర్చులు ఎక్కువగా ఉంటాయని భావించి ప్రభుత్వ రేటుపై క్యూబిక్ మీటరుకు రూ.16 అదనంగా వేశారు. మిగిలిన రీచ్ల్లో ఇసుక తవ్వకాలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, రేటు ఎక్కువ వేయలేదు. కృష్ణానది దిగువ భాగం లోని రీచ్లన్నీ పాటదారులకు ఈ ఏడాది కోట్లు కురిపించను న్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మొత్తం ఏడు రీచ్లకు 58 మంది టెండర్లు వేస్తే, అందులో 12 మంది అనర్హులయ్యారు. 46 మంది వ్యాపారుల దరఖాస్తులను పరిశీలించి ఏడురీచ్లను ఖరారు చేశారు. వీటి ద్వారా రూ.27.44 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి లభించనుంది. ఈ ప్రక్రియ తరు వాత కొత్త రీచ్ల్లో ఇసుక తవ్వకాల ప్రారంభానికి మరో పది రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. -
ఔను.. వాళ్లు ఒక్కటయ్యారు!
♦ సిండికేట్గా ఏర్పడిన వ్యాపారులు ♦ అసోసియేషన్ పేరుతో దందా ♦ రైతుకు ‘మట్టి’కొట్టేందుకు ఎత్తుగడ బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నల్ల మట్టి తరలిస్తున్న వ్యాపారులంతా ఒక్కటయ్యారు. ప్రాజెక్ట్ నుంచి నల్లమట్టి తరలించే వ్యాపారులు సిండికేట్గా మారి ధరలను పెంచి రైతులను దగా చేసేందుకు సిద్ధమయ్యారు. అన్నదాతకు ‘మట్టి’ కొట్టేందుకు ఆదివా రం సమావేశమైన వ్యాపారులు.. తెలంగాణ టిప్పర్ అసోసియేషన్గా ఏర్పడ్డారు. అసోసియేషన్కు చెందిన పోస్టర్లను టిప్పర్లకు అతికించి మరీ నల్లమట్టిని తరలిస్తున్నారు. ఒక్కటైన వ్యాపారులంతా ఒకే ధరకు మట్టిని విక్రయించాలని నిబంధనలు విధించుకున్నారు. అంతే కాకుండా ధరల పట్టికను కూడా సిద్ధం చేశారు. ఫలితంగా అన్నదాత ఆరుగాలం కష్టపడి పోగేసిన డబ్బు ‘మట్టి’పాలయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడే ఎందుకో..? శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి సుమారు రెండున్నర నెలలుగా నల్లమట్టిని రైతుల కోసమంటూ తరలిస్తున్నారు. రైతులకు ఎలాంటి భారం కాకుడదని ప్రాజెక్ట్ అధికారులు ఎలాంటి ఆంక్షలు లేకుండా మట్టిని తరలించేందుకు అనుమతించారు. ఇన్నాళ్లు ఎవరికి వారే మట్టిని తరలించిన వ్యాపారులు సిండి‘కేటుగాళ్లు’గా మారారు. అంతా కలిసి అసోసియేషన్గా ఏర్పడ్డారు. అయితే, ఇన్నాళ్లుగా ఏర్పాటు చేయని అసోసియేషన్ ఇప్పుడే ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అసోసియేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిం దో? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసోసియేషన్ ఏర్పాటుకు ముందు అధికారులు ఎక్కడా నల్లమట్టి తరలింపును అడ్డుకోలేదు. మరి అలాంటప్పుడు ‘అసోసియేషన్’ ఎందుకో వ్యాపారులకే తెలియాలి. అసోసియేషన్కు సభ్యత్వ రుసుం.. తెలంగాణ టిప్పర్ అసోషియేషన్లో సభ్యత్వం కోసం డబ్బులు వసూలు చేసినట్లు కొందరు వ్యాపారులు చెబుతున్నారు. టిప్పరు రూ.1000, డంపర్కు రూ.2 వేల చొప్పున చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. ఇలా ఇప్పటివరకు సుమారు 150 వరకు టిప్పర్లు, డంపర్ల పేరుతో అసోసియేషన్లో సభ్యత్వం తీసుకున్నట్లు సమాచారం. అందుకోసమేనా..?! ప్రాజెక్ట్ నుంచి నల్ల మట్టి తరలించేందుకు కొందరు వ్యాపారులు తమిళనాడు, హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో టిప్పర్లను తీసుకువచ్చారు. దీంతో పోటీ తీవ్రమైంది. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు తక్కువ ధరకే నల్లమట్టిని విక్రయించారు. దీనివల్ల రైతులకు కొంత ఊరట లభించింది. అయితే, పోటీ వల్ల దందా దెబ్బ తింటుందని భావించిన వ్యాపారులు.. ‘ఒకే ధర’ నిబంధనను అమలు చేసేందుకు అసోసియేషన్గా ఏర్పడినట్లు తెలిసింది. దీనివల్ల రైతులపై ధరాభారం పడనుంది. ప్రభుత్వానికి చిల్లి గవ్వ చెల్లించకుండా రైతుల పేరుతో మట్టి దందాకు శ్రీకారం చుట్టారు! పోస్టర్ ఉంటేనే.. సభ్యత్వం తీసుకున్న టిప్పర్లకు ‘తెలంగాణ టిప్పర్ అసోషియేషన్’కు చెందిన పోస్టర్లను అతికించారు. ఎస్సారెస్పీ నుంచి నల్ల మట్టి తరలించే ప్రతి టిప్పర్కు అసోసియేషన్ పోస్టర్ ఉండాలి. లేదంటే నల్లమట్టి తరలించేందుకు వీలు లేదనే నిబంధన పెట్టారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నల్ల మట్టిని తరలించేందుకు ప్రాజెక్ట్ అధికారులకు సీనరేజ్ చెల్లించాలి. కానీ సీనరేజ్ చెల్లిస్తే ఆ భారం అంతిమంగా రైతుపైనే పడుతుందని చిలుక పలుకులు పలుకుతున్న వ్యాపారులకు.. అసోసియేషన్ సభ్యత్వ రుసుము భారం కూడా రైతులపైనే పడుతుందని తెలియదా..? -
మద్యం మాఫియా మహాదోపిడీ
జిల్లాలో అధికార పార్టీ లిక్కర్ సిండికేట్ వ్యవహారం మూడు ఫుల్బాటిళ్లు... ఆరు నిబ్బులుగా సాగిపోతోంది. అసలే పక్తూ మద్యం వ్యాపారులు...పైగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా.. దీంతో అడ్డూఅదుపు లేకుండా యథేచ్ఛగా మద్యం వ్యాపారంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. మొత్తం మద్యం దుకాణాలను గుప్పిటపట్టిన ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరిదీ. సిండికేట్గా ఏర్పడి దుకాణాల కేటాయింపులో చక్రం తిప్పారు. లెక్కకు మించి బెల్టు దుకాణాలు తెరిచారు. ఇప్పుడు మద్యం ధరలను ఎమ్మార్పీ కంటే పెంచేసి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఏకంగా నెలకు రూ.15కోట్లుపైగా కొల్లగొడుతున్నారు. - ధరల మాయాజాలం - ఎంఆర్పీ కంటే అధికంగా రేట్లు - అడ్డగోలుగా నెలకు రూ.15కోట్లు అవినీతి - ఇద్దరు ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యం అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఊళ్లు పంచుకున్న చందంగా జీవీఎంసీ, రూరల్ జిల్లాలను పంచేసుకున్నారు. నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి సిండికేట్లో జీవీఎంసీ పరిధిలో 169 దుకాణాల్లో వందకుపైగా దుకాణాలున్నాయి. తొలిసారి ఎన్నికైన మరో ప్రజాప్రతినిధి కుటుంబ సిండికేట్లో రూరల్ జిల్లాలో మద్యం దుకాణాలు ఉన్నాయి. 198 మద్యం దుకాణాల్లో 125 వరకు ఆ ప్రజాప్రతినిధి చెప్పిందే సాగుతోంది. వేలం నోటిఫికేషన్ నుంచే కథ నడిపి అంతా తాము అనుకున్నట్లు చేసుకోగలిగారు. వ్యూహాత్మకంగా దుకాణాలను గుప్పిట్లో పెట్టుకున్న ఆ ఇద్దరు తాజాగా అసలు కథకు తెరతీశారు. మద్యం గరిష్ట ధర(ఎంఆర్పీ) కంటే 10శాతం నుంచి 15శాతం వరకు ఎక్కువగా ధరలు పెంచేశారు. దుకాణాలన్నీ వారి చేతుల్లోనే ఉండటంతో వారు చెప్పిందే ధరగా మారింది. బీరు బాటిల్ మీద రూ.20 అధికంగా అమ్ముతున్నారు. బ్రాండ్లను బట్టి విస్కీ, రమ్ము, ఇతర మద్యాన్ని క్వార్టర్ బాటిల్మీద రూ.10, ఆఫ్బాటిల్ మీద రూ.15, ఫుల్బాటిల్ మీద రూ.25వరకు అధికంగా విక్రయిస్తున్నారు. ఇందులో ఏముందిలో అనుకుంటున్నారేమో!... చిన్న విషయమేమీ కాదు. జిల్లాలో అధికారికంగా 367 దుకాణాలున్నాయి. జిల్లాలో నెలకు రూ.110కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం నెలకు జీవీఎంసీ పరిధిలో రూ. 69కోట్లు, రూరల్ జిల్లాలో రూ.41కోట్ల విలువైన మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఎంఆర్పీ కంటే ధరలు పెంచేయడంతో జీవీఎంసీ పరిధిలోనే నెలకు అక్రమంగా రూ.9కోట్లు వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. జిల్లా పరిధిలో నెలకు రూ.6కోట్ల వరకు అధికంగా గుంజుతున్నారు. ఆ లెక్కన నెలకు జిల్లాలో రూ.15కోట్లు అవినీతికి పాల్పడుతున్నారు. అంటే ఏడాదికి మద్యం విక్రయాల్లో రూ.180కోట్ల అవినీతి యథేచ్ఛగా సాగిపోతోంది. ఇదంతా అధికారిక మద్యం దుకాణాల్లో విక్రయాల్లో జరుగుతున్న అవినీతి. బెల్టు దుకాణాలకు వచ్చేసరికి మద్యం ధరలు మరింతగా పెరుగుతున్నాయి. చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ ఇష్టానుసారంగా ఎంఆర్పీ కంటే అధికంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు కిమ్మనడం లేదు. కనీసం అటువైపు చూడటమే లేదు. ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సిండికేట్ను నిర్వహిస్తుండటమే ఇందుకు కారణమన్నది బహిరంగ రహస్యమే. వారు చేసింది చూడటం... ఇచ్చింది తీసుకోవడం అన్న తీరుగా వ్యవహరిస్తోంది. -
పోలీస్ vs వ్యాపారులు
మామూళ్ల పంచాయితీ నగరంలో 55 మద్యం షాపులు, 117 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిల్లో విక్రయాలు, పనివేళలు, పార్కింగ్ విషయాల్లో పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తారు. ఇందుకుగాను వ్యాపారులు వారికి నెలవారీ మామూళ్లు ముట్టజెబుతారన్నది బహిరంగ రహస్యమే. ఇప్పుడీ విషయంలో ఇరువర్గాల మధ్య పంచాయితీ నడుస్తోంది. విజయవాడ సిటీ : పోలీసు అధికారులు, మద్యం వ్యాపారుల మధ్య మామూళ్ల పంచాయితీ నడుస్తోంది. ఇప్పటివరకు ఇస్తున్నట్లే షాపుల నుంచి నేరుగా నెలవారీ మామూళ్ల కోసం పోలీసు అధికారులు పట్టుబడుతుంటే.. సిండికేట్ ద్వారా ఇస్తామంటూ మద్యం వ్యాపారులు తెగేసి చెబుతున్నారు. దీనికి ససేమిరా అంటున్న పోలీసు అధికారులు పార్కింగ్, నిర్దేశిత వేళలు, బహిరంగ మద్య సేవనంపై హడావుడికి తెరతీశారు. ఈ పరిస్థితి కొనసాగితే ఇద్దరికీ నష్టమేనంటూ ఇరువర్గాల పెద్దల అభిప్రాయం. వివాదం ముదరకుండా చూసేందుకు చర్చలు సాగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కొద్ది రోజుల్లో వీరి మధ్య వివాదానికి తెరదించి సమస్యను కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నగరంలో 55 మద్యం షాపులు, 117 రెస్టారెంట్ అండ్ బార్లు ఉన్నాయి. వీటిని చూసీ చూడనట్లుగా వ్యవహరించినందుకు పోలీసు అధికారులకు నెలవారీ మామూళ్లు ఇవ్వాలి. లేదంటే నిబంధనలను సాకుగా చూపించి పోలీసులు హడావుడి చేస్తారు. రానున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు కూడా పోలీసుల ఆదేశాలను పాటించి మామూళ్లు ముట్టచెబుతుంటారు. కొత్తగా లెసైన్స్లు మంజూరైన మద్యం వ్యాపారులతో కుదిరే అవగాహన కోసం బార్ల్ల నిర్వాహకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇదీ జరిగింది.. నగరంలో 55 మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో ఆరు షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి కాగా మిగిలిన 49 ప్రైవేటు వ్యక్తులవి. రాజకీయ నేతలు భాగస్వాములుగా ఉన్న సిండికేట్లకు ఎక్కువ ప్రైవేటు షాపులు దక్కాయి. ఇప్పటివరకు షాపు ఉన్న ప్రాంతాన్ని బట్టి రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు షాపు యజమానులు పోలీసు స్టేషన్కి ముట్టచెప్పారు. కొత్త షాపులు దక్కిన వారిలో ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్నందున అంతంత మొత్తాల్లో మామూళ్లు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. పెరిగిన అద్దెలు, ఉద్యోగుల జీతాలు, నెలవారీ వడ్డీలను దృష్టిలో ఉంచుకుని గతం కంటే తగ్గించి ఇవ్వాలనేది వీరి నిర్ణయం. విడిగా ఇవ్వడం వలన సాధ్యపడదని భావించిన మద్యం వ్యాపారులు సిండికేట్ ద్వారా మంత్లీ మామూలు నిర్ణయించి శ్లాబు (అన్ని చోట్లా ఒకే రేటు) విధానం అమలులోకి తేవాలనేది నిర్ణయంగా ఉంది. దీనికి పోలీసు అధికారులు అంగీకరించడం లేదు. గత అనుభవాల దృష్ట్యానే.. సిండికేట్ ద్వారా మామూళ్లు తీసుకునేందుకు పోలీసు అధికారులు నిరాకరించడానికి కారణం గత అనుభవాలేనని తెలిసింది. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఆధిపత్యపోరులో మద్యం వ్యాపారంపై ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. ఆ విచారణలో సిండికేట్ల ద్వారా మంత్లీ మామూళ్లు తీసుకునే పోలీసు అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చింది. సిండికేట్ చిట్టాల్లో పలువురు అధికారుల పేర్లు ఉండటంలో కేసులు నమోదు చేశారు. ఇంకా కేసు విచారణ సాగుతోంది. సిండికేట్ల ద్వారా తీసుకోవడం వల్లే ఇది జరిగిందనేది ఇప్పుడు అధికారుల అభిప్రాయం. ఇదే నేరుగా తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురైనా పేర్లు వెలుగులోకి రావనేది వారి భావన. -
కిక్కు షురూ..
నెల్లూరు(క్రైమ్): మద్యం కిక్కు షురూ అయింది. 2015 -17 ఆబ్కారీ సంవత్సరానికి లెసైన్సులు పొందిన వ్యాపారుల్లో 50 శాతం మందికి పైగా బుధవారం అరకొర వసతుల నడుమే మద్యం దుకాణాలను ప్రారంభిం చారు. కొత్త భవనాల కోసం వెతుకులాడటం వల్ల సమ యం వృథా అవుతుందని పాత దుకాణాల్లోనే అమ్మకాలు మొదలుపెట్టారు. కొందరు సెంటిమెంట్ కోసం ఒకటి రెండురోజులు ఆలస్యమైనా పర్వాలేదని కొత్త భవనాల కోసం వెతుకులాట ప్రారంభించారు. 2014-15 గడువు మంగళవారం అర్థరాత్రి ముగిసింది. జిల్లాలోని 313 మద్యం దుకాణాలకు గత నెల 29వ తేదీన లాటరీ డ్రా నిర్వహించిన విషయం తెలిసిందే. నూతన హంగులతో.... మందుబాబులను ఆకట్టుకొనేందుకు మద్యం వ్యాపారు లు దుకాణాలను నూతన హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో మద్యం సేవించేలా సిట్టింగ్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నారు. అందులోనే తినేందుకు వివిధరకాలైన ఆహారపదార్థాలు, కూల్డ్రింక్స్లను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. విక్రయాల్లో అక్రమాలను నిరోధించేందుకు స్కానర్లు తదితరాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. పలు దుకాణాల్లో మద్యం నిల్.... బుధవారం పలు దుకాణాల్లో మద్యం అందుబాటులో లేకపోవడంతో మందుబాబులు నిరాశతో వెనుదిరిగారు. కొందరు వ్యాపారులు ఐఎంఎల్డిపో నుంచి సకాలంలో మద్యం తీసుకొచ్చుకోవడంతో ఉదయం నుంచే విక్రయాలు ప్రారంభించారు. కొందరికి ఆలస్యం కావడంతో ఆ దుకాణాల్లో మద్యం అందుబాటులో లేకుండాపోయిం ది. తొలిరోజు కావడంతో వ్యాపారులు అన్నీ సమకూర్చుకొనే పనిలో ఉండటంతో మద్యం తాగేందుకు సరైన వసతుల్లేక మందుబాబులు బహిరంగ మద్యపానం చేశారు. ఐఎంఎల్ డిపో వద్ద సందడి తొలిరోజు కావడంతో తె ల్లవారుజామునే అధికశాతం మంది మద్యం వ్యాపారులు దేవరపాలెంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్(ఏపీఎస్బీసీఎల్)కు చెందిన ఐఎంఎల్ డిపోకు చేరుకున్నారు. అక్కడ నగదు డిపాజిట్ చేసి ప్రత్యేక వాహనాల్లో మద్యంను దుకాణాలకు తరలించారు. దీంతో దేవరపాలెంలో మద్యం వ్యాపారులు, వివిధ మద్యం కంపెనీలకు చెందిన ప్రతినిధులతో సందడిగా మారింది. మద్యం లారీలు ఐఎంఎల్డిపో వద్ద బారులు తీరాయి. ఎమ్మార్పీ అమలు జరిగేనా? ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు సాగించాలని, బెల్టుషాపులను ఉపేక్షించబోమని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే వీటి అమలు సాధ్యమేనా? అన్న ప్రశ్న అందరిలో నెలకొంది. గతంలోనూ ఇదే తరహాలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎక్కడా అమలుకు నోచుకోలేదు. వ్యాపారులు సిండికేట్గా మారి ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడడంతో పాటు బెల్టుషాపుల్లో మద్యం ఏరులై పారింది. ఈ విషయం ఆబ్కారీ శాఖ అధికారులకు తెలిసినా ముడుపులు పుచ్చుకొని మొక్కుబడి దాడులు చేశారని విమర్శలున్నాయి. ప్రతి మద్యం దుకాణంలో కంప్యూటర్ బిల్లింగ్, స్కానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించినా అమలుకు నోచుకోలేదు. దేవుళ్ల పేర్లు పెట్టడకూడదని, హైవేకి దూరంగా ఉండాలని నిబంధనలు పాటించాల్సి ఉంది. వీటి గురించి ఎక్సైజ్ అధికారులతో మాట్లాడగా ఈసారి నుంచి తప్పకుండా ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు పాటించని దుకాణాలపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. -
ధరల ‘కిక్కు’
ధరల కిక్కుతో మద్యం వ్యాపారులు దండుకుంటున్నారు. ప్రివిలేజ్ ఫీజు పేరుతో అదనపు వసూళ్లకు దిగారు. వ్యాపారులంతా సిండికేటై దోపిడీకి పూనుకున్నారు. షాపుల్లో ఉన్న ధరల పట్టికను సైతం పక్కకు పడేసి యథేచ్ఛగా అదనపు ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు. మామూళ్ల మత్తులో ఉన్న ఎక్సైజ్ అధికారులు ఏమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. కళ్లెదుటే అదనపు ధరల దోపిడీ కనబడుతున్నా ఏప్రిల్ నుంచి ఎక్సైజ్ అధికారులు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, ఖమ్మం : మద్యం వ్యాపారులు బరి తెగించారు. లెసైన్స్ గడువు ముగుస్తుండటంతో అంతా సిండికేట్ అయ్యి ధరలు పెంచేశారు. ఏ బ్రాండ్ అయినా ఒక్కో ఫుల్బాటిల్కు రూ.20 నుంచి 30 వరకు అదనంగా రేటు పెంచి అమ్ముతుండటంతో మందుబాబుల జేబుకు భారీగానే చిల్లు పడుతోంది. దండిగా మామూళ్లు అందుకుంటున్న ఎక్సైజ్ అధికారులు రెట్టింపు వ్యాపారానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారని ఆరోపణలు వినపడుతున్నాయి. జిల్లాలో ప్రతినెల రూ.50 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతోంది. ఈ అదనపు బాదుడుతో మందుబాబులు మరో రూ.10 కోట్లు వదిలించుకోక తప్పదు. జూన్ 30వ తేదీతో వైన్ షాపుల లెసైన్స్ గడువు ముగియనుండటంతో మద్యం దుకాణాలు రెట్టింపు ధరలతో ఊగిపోతున్నాయి. ‘ప్రివిలేజ్’ దెబ్బకు సిండికేట్ విరుగుడు జిల్లాలో మొత్తం 148 లెసైన్స్డ్ వైన్ షాపులున్నాయి. వీటి ద్వారా ప్రతినెలా రూ.50 కోట్ల మద్యం వ్యాపారం నడుస్తోంది. ప్రభుత్వం ఏడాది కాలపరిమితో జారీ చేసిన లెసైన్స్ గడువు వచ్చే నెలాఖరుతో ముగస్తుంది. ప్రభుత్వం షాపుల యజమానుల అదనపు ఆదాయానికి గండి పెడుతూ ప్రివిలేజ్ (నిర్దేశించిన దానికన్నా ఎక్కువ వ్యాపారం చేస్తే ప్రభుత్వానికి చెల్లించేది) ఫీజు విధించింది. దీని ప్రకారం మద్యం అమ్మకాలపై లాభాల రేటు కాస్తా అటు ఇటుగా 17 శాతం లభించనుంది. లెసైన్స్ల జారీ సమయంలో నిర్ణీత లెసైన్స్ ఫీజుకు ఏడు రెట్లు అమ్మకాలు సాగించినా షాపు యజమానులకు లాభాల్లో కోత పెట్టే సరికొత్త నిబంధనను దీంట్లో చేర్చారు. జిల్లాలో ఇప్పటికే అన్ని వైన్ షాపులు ఈ ప్రివిలేజ్ ఫీజు పరిధిలోకి వచ్చాయి. ఒక్కసారిగా లాభాలు పడిపోయాయనుకున్న వ్యాపారులు ఈ అదనపు అమ్మకాల వ్యవహారానికి ప్లాన్ వేసి సిండికేట్ అయ్యారు. ఎక్సైజ్ అధికారులతో కుమ్మక్కై చివరి మూడు నెలల పాటు తాము ఇష్టమొచ్చినట్లు అమ్ముకునే ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. అంటే 40 రోజుల తర్వాత తమ లెసైన్స్ ఉంటుందో..? ఊడుతుందోనన్న ఆలోచనకు వచ్చిన వైన్స్ యజమానులు అదనపు రేట్లకు ప్రణాళిక చేశారు. ఇప్పటికే రెండు నెలల నుంచి ఈ వ్యవహారం నడుస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. బ్రాండ్ ఏదైనా రూ.20 నుంచి 30 వరకు, బీర్లకు రూ.10 నుంచి రూ.15 వరకు అదనంగా వసూళ్లు చేస్తున్నారు. యథేచ్ఛగా అమ్మకాలు లెసైన్స్ పొందిన వ్యాపారులు మార్చి వరకు జిల్లాలో ఎమ్మార్పీ రేట్లకు మద్యం విక్రయించారు. ఎక్సైజ్ అధికారులు కూడా ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మకాలు జరిగేలా దుకాణాల ముందు ధరల పట్టికను ఏర్పాటు చేయించారు. ఏప్రిల్ నుంచి ఏకంగా ఈ ధరల పట్టికను దుకాణదారులు తీయించి వేయటం గమనార్హం. నగరంలోనే యథేచ్ఛగా ఈ వ్యవహారం నడుస్తున్నా ఎక్సైజ్ సిబ్బంది మాత్రం తమ దృష్టికి ఫిర్యాదులు రాలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. వచ్చే లెసైన్స్ జారీలో ప్రభుత్వం ఇదే తరహా లాటరీ ద్వారా కేటాయిస్తుందో..? ప్రభుత్వమే అమ్మకాలకు దిగుతుందో..? తెలియని పరిస్థితుల్లో మద్యం వ్యాపారులు దీపం ఉండగానే ఇల్లుచక్క బెట్టుకునే పనిలో పడ్డారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సాధారణ ఎన్నికలు, ఫలితాలు ఉండటంతో తారా స్థాయిలో అమ్మకాలు సాగాయి. ఇప్పుడు అలాంటివేవి లేకపోవడం.. పైగా ప్రివిలేజ్ ఫీజు విధించటంతో మద్యం వ్యాపారులు సిండికేట్కు తెరదీశారు. ఏప్రిల్ నుంచి కేసులే లేవట..! ఎమ్మార్పీ రేట్ల కన్నా అధిక ధరకు వైన్స్ యజమానులు మద్యం విక్రరుుస్తున్నా ఏప్రిల్ నుంచి ఎక్సైజ్ అధికారులు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. గత ఏడాది జూలై 1 నుంచి మార్చి చివరి వరకు 37 కేసులు నమోదైనట్లు పేర్కొంటున్నారు. అన్ని దుకాణాల్లో ఎమ్మార్పీ రేట్ల అమ్మకాలను యజమానులు భేఖాతర్ చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు కనీసం దాడులు కూడా చేయకపోవడం గమనార్హం. పట్టణాల్లో సిండికేట్తో అదనంగా వసూళ్లు చేస్తుండగా గ్రామాల్లోని బెల్టు షాపులోనూ రూ.10 అదనంగా తీసుకుంటున్నారు. లెసైన్స్ ముగింపు గడువు సమీపిస్తుండడంతో వచ్చే నెలలో రూ.5 అదనంగా ఫుల్బాటిల్, బీరుకు పెంచాలన్న యోచనలో మద్యం వ్యాపారులు ముందడుగు వేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు మహేష్బాబు, డిప్యూటీ కమిషనర్, ఎక్త్సెజ్ శాఖ జిల్లాలో ఎమ్మార్పీ రేట్ల కన్నా మద్యం అధిక ధరలకు విక్రయిస్తే సదరు షాపు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మద్యం కొనుగోలు చేసేవారు ఏ షాపులోనైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే ఆయా సర్కిల్ పరిధిలోని ఎక్సైజ్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి. ఇప్పటికే జిల్లాలో అన్ని స్టేషన్లను ఈ మేరకు ఆదేశించాం. -
చెరువులకు లెస్ రహదారులకు ప్లస్
నల్లగొండ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చెరువుల పున రుద్ధరణ (మిషన్ కాకతీయ) పనులకు తీవ్ర పోటీ ఏర్పడింది. చాలాకాలం తర్వాత రహదారులు, చెరువుల పనులకు మోక్షం లభించడంతో కాంట్రాక్టర్లు సంబరపడ్డారు. అయితే రహదారుల పనులు దక్కించుకోవడంలో కాంట్రాక్టర్లు సిండికేట్గా ఏర్పడి సింగిల్ టెండర్లు దాఖలు చేశారు. అదే మిషన్ కాకతీయ విషయానికొస్తే కాంట్రాక్టర్లు పోటాపోటీగా టెండర్లు వేశారు. దీంతో చెరువుల పునరుద్ధరణ పనులపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పనుల నాణ్యత సంబంధించి రాజీపడే ప్రసక్తే లేదని ఓ వైపు ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతూనే ఉంది. కానీ మరోవైపు స్థానిక రాజకీయ నాయకులు పోటీపడి మరీ బినామీ వ్యక్తులతో తక్కువ రేట్లకు టెండర్లు వేయించారు. ఇదిలాఉంటే పంచాయతీరాజ్ (పీఆర్), ఆర్ అండ్బీ పనులకు మాత్రం సింగిల్ టెండర్లు దాఖలయ్యాయి. పీఆర్ పనుల్లో కాంట్రాక్టర్ల మధ్య సయోధ్య కుదరగా...కొన్ని పనులకు ఎక్కువ (ఎక్సెస్) రేట్లను కూడా కోడ్ చేశారు. ఆర్అండ్బీ అధికారులు పనుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచారు. కాంట్రాక్టర్ల ఒత్తిడి మేరకు పనుల వివ రాలు బయటకు పొక్కనీయకుండా అధికారులు జాగ్రత్తపడినట్లు తెలిసింది. లెస్..లెస్..లెస్... చెరువుల పునరుద్ధరణలో భాగంగా తొలి విడత జిల్లాలో 952 చెరువులు ఎంపిక చేశారు. దీంట్లో 119 చెరువుల్లో నీళ్లు ఉండడంతో వాటిని మినహాయించి మిగిలిన 833 చెరువులకు ప్రతిపాదనలు రూపొం దించి ప్రభుత్వానికి పంపారు. 609 చెరువుల పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీటిలో 469 చెరువుల పనులకు టెండర్లు పిలిచారు. ఈ పనుల అంచనా వ్యయం రూ.177 కోట్లు. ఈ మొత్తం 469 చెరువుల్లో 352 చెరువుల పనులు రూ.50 లక్షల లోపు అంచనా వ్యయంతో ఉన్నవి. ఈ చెరువుల పనులకే ఎక్కువ పో టీ ఎదురైంది. ఒక్కో చెరువుకు 6 నుంచి 14 మంది వరకు టెండర్లు వేశారు. ఈ-ప్రొక్యూర్మెంట్ టెండరు కావడంతో పనులు ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో 18 నుంచి 20 శాతం వరకు తక్కువ (లెస్) రే ట్లు కోడ్ చేశారు. ఇక రూ.50 లక్షల పైబడి ఉన్న 117 పనులకు కాంట్రాక్టర్లు సిండి కేట్ అయినట్లు తెలుస్తోంది. ఒక్కో పనికి ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే టెండర్లు వేశారు. 2-3 శాతానికే తక్కువ రేట్లు కోడ్ చేశారు. నల్లగొండ డివిజన్ పరిధిలో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు సిండికేట్గా ఏర్పడి ఎక్సెస్ రేట్లను కూడా కోడ్ చేసినట్లు తెలిసింది. పనులు ఎలా సాధ్యం..? చెరువు పనులకు ప్రభుత్వం నిర్ధారించిన ధరలు మాత్రం లాభదాయకంగా లేవని అధికారులు చెబుతున్నారు. మిషన్ సహాయంతో చెరువుల్లో మట్టి తవ్వేందుకు మాత్రమే ధర నిర్ణయించారు. కానీ తవ్విన మట్టిన త రలించేందుకు ధర నిర్ణయించలేదు. ఈ మట్టిని వ్యవసాయ భూముల్లో చల్లేందుకు రైతులే స్వచ్ఛందంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం పేర్కొంది. కానీ రైతులు ముందుకు వచ్చినా కూలీలకు డబ్బులు ఎవరు చెల్లిస్తారన్నది ప్రశ్నార్థకం. ఇక పనులు జరుగుతున్న తీరును ఎప్పటిక ప్పుడు ఫొటోల తీసి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి అప్లోడ్ చేయాలి. నాణ్యతలో రాజీపడకుండా పనులు జరగాలని ప్రభుత్వం చెబుతుంది కానీ..కాంట్రాక్టర్లు ఇంత భారీ స్థాయిలో లెస్లకు వెళ్లారు కాబట్టి పనులు చేయడం సాధ్యం కాదని అధికారులే అంటుండడం గమనార్హం. పీఆర్ కాంట్రాక్టర్లదే గుత్తాధిపత్యం... పంచాయతీరాజ్ శాఖ ఎం.ఆర్.ఆర్ (మెయింటెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్) గ్రాంట్ కింద జిల్లాకు 408 పనులు మంజూరు చేసింది. ఈ పనుల అంచనా వ్యయం రూ.207 కోట్లు. ఈ మొత్తం పనులను 59 ప్యాకేజీలు చేసి టెండర్లు పిలిచారు. గతేడాది నవంబర్లోనే టెండర్లు పిలవాల్సి ఉన్నప్పటికి కాంట్రాక్టర్లకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు సాగిన నేపథ్యంలో ఫిబ్రవరి వరకు టెండర్ల ప్రక్రియ కొనసాగించాల్సి వచ్చింది. ఈ పనులన్నీ హాట్ మిక్స్ ప్లాంట్ ఉన్న కాంట్రాక్టర్లు మాత్రమే చేపట్టాల్సి ఉండటంతో పనులు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్ల మధ్య పోటీ లేకుండా పోయింది. జిల్లాలో హాట్ మిక్స్ ప్లాంట్ ఉన్న కాంట్రాక్టర్లు 38 మంది ఉన్నారు. దీంతో ఈ 38 కన్స్ట్రక్షన్ కంపెనీలకు చెందిన కాంట్రాక్టర్లు సిండికేట్గా ఏర్పడి ఎవరి పరిధిలోకి వచ్చే పనులకు మరొకరిని రానివ్వకుండా సింగిల్ టెండర్లు వేశారు. నిబంధనల ప్రకారం ఎక్కువ రేట్లు కోడ్ చేస్తే టెండర్లు రద్దయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సాధార ణ రేట్ల ప్రకారం తక్కువ మోతాదులో ధరలు కోడ్ చేశారు. 0.01 శాతం నుంచి 6.66 శాతం వరకు లెస్ కోడ్ చేసి పనులు దక్కించుకున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న పనులకు మాత్రం ఎక్సెస్ రేట్లు కోడ్ చేశారు. ఇప్పటి వరకు 353 పనుల టెండర్లు పూర్తయ్యాయి. ఈ పనుల అంచనా వ్యయం రూ.184 కోట్లు. ఒకటి, రెండు ప్యాకేజీలు మినహా మిగిలిన వాటికి ఒకటే టెండరు దాఖలు కావడాన్ని బట్టి పరిశీలిస్తే...బడా కాంట్రాక్టర్లతో ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే టెండర్లు నోటిఫికేషన్ వెలువడగానే కాంట్రాక్టర్లు తొలుత ముందుకు రాలేదు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ సంస్థలను చర్చలకు రప్పించి..వారిని మెప్పించిన తర్వాతే టెండర్లు ప్రక్రియ వేగం పుంజుకుంది. నవంబర్లో టెండర్లు పూర్తయి డిసెంబర్లో పనులు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికి ఇప్పటి వరకు ఇంకా టెండర్లు ప్రక్రియ కొనసాగుతుందంటే కాంట్రాక్టర్ల ప్రభావం ప్రభుత్వంపై బలంగానే పనిచేసినట్లు స్పష్టమవుతోంది. మిషన్ కాకతీయ పనుల్లో లెస్లు కోడ్ చేస్తుంటే...రహదారుల పనుల్లో మాత్రం కాంట్రాక్టర్లు సిండికేట్ కావడం...ఎక్సెస్ రేట్లు కోడ్ చేయడం...దానికి ప్రభుత్వం అండదండలు ఉండటం గమనార్హం. ఎక్సెస్ రేట్లతో పనులు దక్కించుకున్న సంస్థలు... మండలం కన్స్ట్రక్షన్ సంస్థ కోడ్ చేసింది పనివిలువ గుండాల జీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ 4.59 శాతం రూ. 3.23 కోట్లు మోతె ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్స్ 4.59 శాతం రూ. 5.64 కోట్లు చింతపల్లి సుజనా కన్స్ట్రక్షన్స్ 0.00 శాతం రూ.4.02 కోట్లు మునగాల బీపీఎస్సీ ఇన్ఫ్రా ప్రాజెక్టు 3.75 శాతం రూ.95 లక్షలు నడిగూడెం సత్యనారాయణస్టోన్ అండ్క్రషర్స్ 4.99 శాతం రూ.2.24 కోట్లు నార్కట్పల్లి చల్లా ఇన్ఫ్రా ప్రాజెక్టు 0.8 శాతం రూ.4.71 కోట్లు పెన్పహాడ్ ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్స్ 0.00శాతం రూ.92 లక్షలు ఆత్మకూరు(ఎస్) ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్స్ 0 శాతం రూ.1.82 కోట్లు అర్వపల్లి బీపీఎస్సీ ఇన్ ఫ్రా ప్రాజెక్టు 3.14 శాతం రూ.2.85 కోట్లు మోత్కూరు జీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ 4.59 శాతం రూ.3.56 కోట్లు -
ఎక్సైజ్ దోపిడీ!
సాక్షి, గుంటూరు : జిల్లాలో ఎక్సైజ్ అధికారులు అందిన కాడికి దోచేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. దీనికి మద్యం సిండికేట్లతో కుమ్మక్కై వాటాలు అందుకుంటున్నారని వినిపిస్తున్న ఆరోపణలు బలం చేకూరుస్తున్నాయి. ఎమ్మార్పీకి మద్యం విక్రయాలు జరపాలని, ఎక్కడా బెల్టుషాపులు ఉండకూడదనే నిబంధనలు జిల్లాలో అమలవుతున్నట్టు కనిపించడం లేదు. జిల్లాలో మొత్తం 342 మద్యం దుకాణాలకు ప్రస్తుతం 313 షాపులు నడుస్తున్నాయి. గుంటూరులోని మద్యం దుకాణదారులు క్వార్టర్ బాటిల్ ధరపై పది రూపాయల వరకు అధిక ంగా వసూలు చేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రూ. 25 నుంచి రూ. 30 వరకు అధికంగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.కొత్త మద్యం విధానం ద్వారా దుకాణాలు కేటాయించిన ప్రభుత్వం ఎమ్మార్పీకి విక్రయాలు జరపాలని నిబంధన పెట్టినప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. మద్యం వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ఎమ్మార్పీని కాదని అధిక ధరలకు విక్రయాలు జరుపుతూ మందుబాబుల జేబులు కొల్లగొడుతున్నారు. దీనికి ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎమ్మార్పీకి మద్యం విక్రయాలు జరపాలని ఎక్కడైనా మందుబాబులు హడావుడి చేస్తే వెంటనే ప్రధాన బ్రాండులను పక్కనబెట్టి ఎవ్వరికీ తెలియని కొత్తరకం బ్రాండ్లను బయటకు తీసి అమ్మకాలు జరుపుతున్నారు. మందుబాబులు అలవాటు పడిన బ్రాండ్ మద్యం మాత్రమే తాగుతారని తెలిసిన వ్యాపారులు వారి బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు.ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం వసూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. కొంతమంది ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం సిండికేట్ వద్ద బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అధిక ధరలకు అమ్మగా వచ్చే లాభాల్లో తమకూ వాటా వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. తమపై అధికారులకు నెలవారీ పంపాలంటూ మద్యం దుకాణాల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో బెల్టు షాపులు ... టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే మద్యం బెల్టు షాపులు రద్దు చేస్తూ చేసిన సంత కానికి విలువ లేకుండాపోయింది. నేటికీ అనేక గ్రామాల్లో మద్యం బెల్టు షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ షాపులను తొలగించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారు. అనేక ప్రాంతాల్లో టీడీపీ నేతలకు చెందిన మద్యం దుకాణాలు ఉండడంతో అధికారులు వాటి జోలి వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. అర్ధరాత్రి వరకు అమ్మకాలు... మద్యం దుకాణాల్లో రాత్రి 10 గంటల అనంతరం షట్టర్లకు తాళాలు వేసి దొడ్డి గుమ్మం నుంచి విక్రయాలు జరుపుతున్నారు. ఏ సమయంలో అమ్మితే మాకేంటి అనుకున్నారేమోగానీ ఎక్సైజ్ అధికారులు ఫోన్లు పక్కన పడేసి హాయిగా నిద్దరోతున్నారు. కొందరు పోలీసులు సైతం నెలవారీ సొమ్ములకు కక్కుర్తి పడి చూసీచూడనట్టు పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. రాత్రి వేళ నిబంధనలతో పనిలేకుండా మద్యం విక్రయాలు జరుపుకునేందుకు వ్యాపారులు పోలీసు శాఖలో జీపు డ్రైవర్ నుంచి అధికారి స్థాయి వరకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ప్రతినెలా అందజేస్తున్నట్లు సమాచారం. -
మందుల ముఠా
సాక్షి, హన్మకొండ : ఔషధాల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా... నాణ్యత ప్రమాణాలపై నిఘా పెట్టేలా ప్రభుత్వం ఔషధ ధరల నియంత్రణ చట్టం తెచ్చింది. దీనికి మెడికల్ స్టోర్స్ యజమానులు తూట్లు పొడుస్తున్నారు. ముఠాగా ఏర్పడి చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రోగాల ఆసరాతో సరికొత్త ఎత్తుగడలతో రోగుల జేబులకు చిల్లులు పెడు తూ లాభాలు ఆర్జిస్తున్నారు. మెడికల్ సిండికేట్ కారణంగా ఆస్పత్రుల పాలైన రోగులు మందులు కొనేందుకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఒకే నాణ్యతా ప్రమాణాలతో తయారైన వస్తువుల ధరలు బహిరంగ మార్కెట్లో హెచ్చుతగ్గులతో ఉంటాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఉత్పత్తి సంస్థలు ధరల్లో ఈ తేడాను పాటిస్తాయి. వినియోగదారులకు తమ కొనుగోలు శక్తి ఆధారంగా వస్తువులను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. మెడికల్ దుకాణదారుల సిండికేట్ కారణంగా జిల్లాలో ఔషధాలు కొనుగోలు చేసే రోగులకు ఈ స్వేచ్ఛ లేకుండా పోయింది. మెడికల్ షాప్ నిర్వాహకులందరూ కలిసి ఎక్కడా... మందుల ధర తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. మార్కెట్లో ఎవరైనా తక్కువ ధరకు ఔషధాలను అమ్మేందుకు ప్రయత్నిస్తే... వారికి జరిమానా వేస్తున్నారు. అంతేకాదు... తక్కువ ధరకు ఔషధాలు అమ్మే మెడికల్ షాప్లకు మందులు సరఫరా చేయొద్దని మెడికల్ ఏజెన్సీలకు హుకుం జారీ చేస్తున్నారు. మాట వినకుంటే వారి ఉత్పత్తులను జిల్లావ్యాప్తంగా అనధికారికంగా బ్యాన్ చేస్తున్నారు. బెదిరింపుల పర్వం ఏడాది కిందట ఎక్కువ డిస్కౌంట్ ఇస్తూ తక్కువ ధరకు ఔషధాలను అమ్ముతామంటూ నగరంలో ఓ మెడికల్ దుకాణం వెలిసింది. నగరంలో మిగిలిన మెడికల్ షాప్లలో కంటే తక్కువ ధరకు మందులు అమ్ముతుండడంతో రోగులు దీన్నే ఆశ్రయిస్తున్నారు. దీంతో మెడికల్ దుకాణాల సిండికేట్ ముఠా కన్ను దీనిపై పడింది. ఇలా అయితే తమ వ్యాపారం దెబ్బతిన్నట్లేనని భావించి సదరు ఔషధ విక్రయ దుకాణంపై కన్నెర్ర చేసింది. ఆ మెడికల్ స్టోర్కు మందులు సరఫరా చేయొద్దని వరంగల్ నగరంలో హోల్సేల్ ధరకు ఔషధాలు అమ్మే మెడికల్ స్టాకిస్టులు, ఏజెన్సీల నిర్వాహకులను ఆదేశించింది. ముఠా మాట వినకుండా ఈ దుకాణానికి మందులు సరఫరా చేసినందుకు నలుగురు మెడికల్ స్టాకిస్టులకు ఇటీవల భారీ మొత్తంలో జరిమానా సైతం విధించింది. అంతేకాకుండా... రోగులకు డిస్కౌంట్ ఇస్తున్న మెడికల్ స్టోర్కు మందులు సరఫరా చేసే ఏజెన్సీకి సంబంధించిన ఔషధాలను జిల్లావ్యాప్తంగా బ్యాన్ చేయించింది. ఈ వ్యవహారాలను రాతపూర్వకంగా చేపడితే ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో... ఫోన్లలోనే బెదిరింపుల పర్వం కొనసాగిస్తోంది. వీరి బెదిరింపులకు భయపడి సదరు మెడికల్ స్టోర్కు మందులు సరఫరా చేసేందుకు స్టాకిస్టులు, ఏజెన్సీలు వెనకడుగు వేశాయి. దీంతో ఈ దుకాణాదారు హైదరాబాద్ నుంచి మందులు తెప్పించుకుంటున్నట్లు తెలిసింది. పన్ను ఎగవేతలు కూడా... జిల్లా వ్యాప్తంగా 2,500 మెడికల్ షాప్లు ఉండగా... వీటిలో సగానికి పైగా షాపుల్లో కంప్యూటరైజ్డ్ బిల్లు ఇవ్వడం లేదు. కేవలం తెల్లకాగితాలు, డాక్టర్ రాసిచ్చిన ప్రిస్కిప్షన్ వె నుకవైపు బిల్లులు రాసి ఇస్తున్నారు. దీనివల్ల మెడికల్ షాప్ల నిర్వాహకులు ప్రభుత్వానికి చె ల్లించాల్సిన పన్ను తగ్గుతోంది. అంతేకాదు... మందుల తయారీదారులు ఇచ్చే డిస్కౌంట్లు సైతం గాల్లో కొట్టుకుపోతున్నాయి. మొత్తానికి మెడికల్ సిండికేట్వ్యవహారం కారణంగా జిల్లాలో ఔషధాల ధరలు చుక్కలనంటుతున్నాయి. -
సందు చూసి..
పండుగ పూట వైన్ షాపుల దందా బెల్ట్ షాపులకు మందు డోర్ డెలివరీ ఎక్సైజ్ అండదండలతో వ్యాపారుల ఇష్టారాజ్యం ధనదాహంతో నిబంధనలకు తిలోదకాలు గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం సాక్షి ప్రతినిధి, వరంగల్ : దసరాకు ముందే పల్లెలను మత్తులో ముంచెత్తి... జేబులు నింపుకునేలా మద్యం వ్యాపారులు కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. ఆయా ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలోని వైన్షాపుల నిర్వాహకులు సిండికేట్గా ఏర్పడి.. ట్రాలీ ఆటోలతో మద్యం సీసాలను నేరుగా బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. పలువురు ఎక్సైజ్ అధికారుల అండదండలతో ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలన్న చందంగా కొనసాగుతోంది. అంతేకాదు... మద్యం వ్యాపారులకు అధిక ఆదాయం వచ్చేలా ఎక్సైజ్ అధికారు లు విధులు నిర్వర్తిస్తుండడం విశేషం. ప్రభుత్వం అధికారికంగా కేటాయించి న వైన్ షాపులు, బార్లలోనే మద్యం అమ్మకాలు జరగాలని నిబంధనలు చెబుతున్నాయి. జిల్లాలో ఈ నిబంధనలకు ఎక్సైజ్ శాఖ అధికారులే పాతర వేస్తున్నారు. బెల్ట్ షాపుల నియంత్రణలో కఠినంగా వ్యవహరించాల్సిన వారు... ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మద్యం వ్యాపారులకు అధిక ఆదాయం తెప్పించేందుకు తాపత్రయపడుతున్నారు. వైన్షాపుల నుంచి బెల్ట్ షాపులకు ఆటోల్లో మద్యం సరఫరా దందా వరంగల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో ఎక్కువగా జరుగుతోంది. వర్ధన్నపేట ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిధిలోని మండలాల్లో ఈ రకమైన దందా ఇంకా ఎక్కువగా ఉంది. దీనిపై పలువురు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ... వర్ధన్నపేట ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. సిండికేట్గా మారి... వర్ధన్నపేట మండల కేంద్రంలో మూడు వైన్ షాపులు, ఇదే మండలంలోని ఇల్లంద, పంథిని, ఐనవోలు గ్రామాల్లో ఒకటి చొప్పున వైన్ షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. జూన్ 1 నుంచి ఈ ఆరు వైన్ షాపులు ప్రారంభమయ్యాయి. వైన్ షాపులు తెరుస్తూనే నీళ్లు కలిపిన మద్యాన్ని ఇష్టారాజ్యంగా విక్రయించడం మొదలుపెట్టారు. దీనికి ఇక్కడి ఎక్సైజ్ శాఖ అధికారులు సహకరించారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తారుు. చివరకు కొందరు ఫిర్యాదు చేయడంతో ఒక వైన్ షాపులో తనిఖీ చేసి మూసివేశారు. సదరు నిర్వాహకుడు ఫైన్ చెల్లించి... ఆ షాపును మళ్లీ తెరిచాడు. ఆరు షాపుల్లో పోటీ వల్ల దాడులు జరిగాయని భావించి... అన్ని షాపుల యజమానులు ఒక్కటయ్యారు. ఆరు వైన్ షాపులకు వచ్చిన మద్యాన్ని ఒకే గోదాంలో పెట్టి... ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామంలోని బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. ఆరు వైన్ షాపులకు సంబంధించిన అమ్మకాల్లో వాటా ఎలా అనే దానికి కొత్త ఉపాయం రచించారు. ఆరు వైన్ షాపుల సరుకులో ఏ మద్యం సీసా ఎవరిది అనే దాన్ని గుర్తించేందుకు ఆయా వైన్ షాపుల పేరులో మొదటి అక్షరంతో స్టిక్కర్లను ముద్రించారు. వీటి ఆధారంగా అమ్మకాలకు సంబంధించిన డబ్బులు పంచుకుంటున్నారు. ఎక్సైజ్ పని మారింది... బెల్ట్ షాపులను నియంత్రణను పక్కనబెట్టిన ఎక్సైజ్ శాఖ కొత్త రకమైన విధులను చేపట్టింది. బెల్ట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి అక్కడ ఉన్నది ఆయా ప్రాంతాలకు చెందిన వైన్ షాపుల మద్యం సీసాలేనా అని మాత్రమే చూస్తోంది. తనిఖీకి వచ్చిన అధికారులు బెల్ట్ షాపును మూసివేయకుండా... వెళ్తూ వెళ్తూ ఒకటిరెండు ఖరీదైన మద్యం సీసాలు తీసుకెళ్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అక్రమాలకు పలువురు ఎక్సైజ్ శాఖ అధికారులు మద్దతు ఇస్తుండడంతో... మద్యం వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉండే దసరా సీజన్లో ఇష్టారాజ్యంగా కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారు. -
అవుట్ సోర్సింగ్లో సిండికేట్లు!
- కాంట్రాక్ట్ ఏజెన్సీలను దక్కించుకునేందుకు వ్యూహాత్మక ఎత్తుగడ - సిండికేట్గా షెడ్యూల్ దాఖలు చేసినట్టు విమర్శలు - తమకే కట్టబెట్టాలంటూ అధికారులపై ఒత్తిళ్లు సాక్షి ప్రతినిధి, విజయనగరం : అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పైనా టీడీపీ నేతల కన్ను పడింది. ప్రభుత్వ శాఖలకు తాత్కాలిక ఉద్యోగులను సమకూర్చే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లను దక్కించుకోవడానికి వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. టెండర్లు ఎవరు వేయాలో వాళ్లే నిర్ణయించారు. గత కాంగ్రెస్ నేతలు చూపిన బాటలోనే వీరూ నడిచారు. సిండికేట్గా మారి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లను దక్కించుకునేం దుకు లైన్క్లియర్ చేసుకున్నారు. జిల్లాలో 40 ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగుల్లేక అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలి క సిబ్బందిని నియమించుకుంటున్నాయి. అందు కు అర్హులైన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లు సమకూరుస్తాయి. ఈమేరకు ఆయా ఉద్యోగులకిచ్చే జీతాల్లో కొంత మొత్తాన్ని కమీషన్గా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు తీసుకుంటున్నాయి. గతంలో టెండర్లు లేకుండా నేరుగా ఆ బాధ్యతల్ని ఏజెన్సీలకు అప్పగించేవారు. అయితే, నిరుద్యోగులు పెరగడం, వారి మధ్యపోటీ ఏర్పడడంతో వారి అవసరాలను ఆసరాగా చేసుకుని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు దోపీడీకి దిగాయి. ఎంత ఇచ్చినా సర్దుకుపోయే పరిస్థితికి నిరుద్యోగులు వచ్చేయడంతో ప్రభుత్వమిస్తున్నదాంట్లో భారీగా కోత పెట్టడం మొదలు పెట్టాయి. దీంతో ఏజెన్సీల పంట పండి, ఈ వ్యవహారం లాభసాటిగా తయారైంది. ఫలితంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల మధ్య పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో టెండర్ల ద్వారా ఏజెన్సీలు ఖరారు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. కలెక్టర్ చైర్మన్గా, ఎంప్లాయిమెంట్ అధికారి కన్వీనర్గా, ట్రెజరీ డీడీ, కార్మిక శాఖ డిప్యుటీ కమిషనర్ సభ్యులగా ఉన్న కమిటీ ఏజెన్సీలను ఖరారు చేస్తుంది. అయితే, రాజు తలుచుకుంటే కానిదేముంటుంది అన్నట్టుగా నేతలు తలుచుకుంటే ఏవీ అడ్డుకావని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల వ్యవహారం రుజువు చేసింది. పేరుకే టెండర్ల ప్రక్రియ...షెడ్యూల్ దాఖలు చేసేవాళ్లంతా అధికార పార్టీకి చెందిన వారే. ఆ పార్టీ పెద్దలు ఎవరికివ్వాలో చెబితే వారికే అధికారులు పెద్ద పీట వేస్తారు. ఈ విధంగా వ్యూహాత్మకంగా షెడ్కూల్ దాఖలు చేసిన వ్యక్తులకే ఏజెన్సీలు ఖరారై, ఉద్యోగులను సమకూర్చే బాధ్యతను పంచేసుకుంటున్నారు. ఈ విధంగా గత ప్రభుత్వంలో ఓ కీలక నేత బంధువు అన్నీతానై అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను దక్కించుకున్నారు. బినామీలను తెరముందు పెట్టి కథ నడిపించారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఏజెన్సీలకు దక్కించుకుని మస్తుగా సంపాధించడమే కాకుండా, తమ ద్వారా వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాన్న పేరు కొట్టేశారు. ఈ విధంగా గత ప్రభుత్వంలో 13ఏజెన్సీలకు సుమారు 1500మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమకూర్చే బాధ్యత అప్పగించగా అందులో ఆ కీలక నేత బంధువు చేతిలో 10వరకు ఉన్నాయి. ఇప్పుడిదే ప్రస్తుత అధికార పార్టీ నేతలకు మార్గదర్శకంగా నిలిచింది. తాజాగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల కోసం పిలిచిన టెండర్లలో షెడ్యూల్ దాఖలు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు ఇందులో క్రీయాశీలకంగా వ్యవహరించారు. ఎవరెవరు షెడ్యూల్ దాఖలు చేయాలో ఒప్పందం ప్రకారం ముందే నిర్ణయించారు. జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ను ఇందుకు వేదికగా చేసుకుని పావులు కదిపారు. ఫలానా శాఖలు ఫలానా వారికని పంచేసుకుని షె డ్యూల్ వేశారు. ఇటీవల టెండర్లు గడువు ముగిసేసరికి 28 షెడ్యూల్ దాఖలయ్యాయి. వీటిలో అత్యధికం అధికార పార్టీకి చెందినవే. సంపాధనే ధ్యేయంగా, ఎన్నికల్లో చేసిన ఖర్చు వేగంగా రాబట్టుకోవాలన్న యావతో ఉన్న ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో జిల్లా స్థాయి ప్రజాప్రతినిధి ఈ విషయంలో కీ రోల్ పోషించారు. దాఖలైన 28షెడ్యూళ్లు ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నాయి. కానీ, తమకే కేటాయించాలంటూ ఇప్పటికే పలువురు అధికారులపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వారికిచ్చేస్తే తలనొప్పి ఉండదనే భావనలో సదరు అధికారులు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ బాధ్యతలు తమకే దక్కుతాయని ధీమాతో టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. మరి, కమిటీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. -
మద్యం మాయ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : జిల్లాలో సొంత ఎక్సైజ్ విధానానికి టీడీపీ పెద్దలు తెరతీశారు. రాష్ట్రమంతటా ఏ విధానం అనుసరిస్తారో మాకు అనవసరం... మా ప్రాంతంలో మేం చెప్పిందే విధానమన్నట్లుగా ఉంది వారి తీరు. ప్రధానంగా అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల్లో ఇద్దరు కీలక ప్రజాప్రతినిధులు ఈ మద్యం మాయాజాలన్ని ప్రదర్శిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు సొంత ఫర్మానాలు జారీ చేస్తున్నారు. నిన్నటికి నిన్న బెల్టు దుకాణాలు మూయించడానికి వీల్లేదని హుకుం జారీ చేసిన టీడీపీ నేతలు... తాజాగా ప్రభుత్వ మద్యం దుకాణాల మీద పడ్డారు. తమ ప్రాంతంలో తమ అనుయాయులు మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న కేంద్రాలకు సమీపంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు ఉండటానికి వీల్లేదని ఆదేశించారు. అనకాపల్లి సూపరింటెండెంట్ కార్యాలయ పరిధిలో ఏకంగా 30 ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారు. తద్వారా తమ సిండికేట్లోని మద్యం దుకాణాలకు భారీ ఆదాయం వచ్చేలా చేస్తున్నారు. కశింకోట... ఓ మచ్చుతునక అనకాపల్లికి చెందిన ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కశింకోట సమీపంలో ప్రభుత్వం మద్య దుకాణాన్ని ఏర్పాటు చేయాలన్న ఎక్సైజ్ అధికారుల నిర్ణయాన్ని అడ్డుకున్నారు. ఎందుకంటే అధికార పార్టీ పెద్దల గుప్పిట్లోని సిండికేట్కే కశింకోటలో మద్యం దుకాణం టెండరు పాడారు. జాతీయరహదారికి ఆనుకుని ఉన్న అక్కడ మద్యం వ్యాపారం ద్వారా భారీ ఆదాయం గడించేందుకు చేయాల్సిందంగా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయంమేరకు కశింకోట సమీపంలో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారుల నిర్ణయాన్నే అడ్డుకున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణం వస్తే తమ సిండికేట్ దుకాణం ఆదాయానికి గండిపడుతుందని టీడీపీ పెద్దలు భావించారు. దాంతో ఇద్దరు ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. కశింకోటలో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి వీల్లేదని ఎక్సైజ్ ఉన్నతాధికారికి తేల్చిచెప్పారు. మహిళలు వ్యతిరేకిస్తున్నందున ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయవద్దని కారణం చూపించారు. మరి ప్రైవేటు మద్యం దుకాణం కొనసాగుతుండటంపై మహిళలు అభ్యంతరం వ్యక్తం చేయలేదా?... ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదా అంటే సమాధానమే లేదు. అసలు అక్కడ తమ మద్యం వ్యాపారానికి గండి పడకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారన్నది బహిరంగ రహస్యమే. ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు కశింకోట సమీపంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. నాలుగేళ్లుగా టీడీపీ పెద్దలు కశింకోట కేంద్రంగా మద్యం సిండికేట్ను శాసిస్తున్నారు. అక్కడ నాలుగేళ్ల క్రితం నాలుగు మద్యం దుకాణాలు ఉండేవి. తద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.2కోట్లు ఆదాయం వచ్చేది. ఆ తరువాత మూడు దుకాణాలకు తగ్గించేశారు. అప్పట్లో ప్రభుత్వానికి ఏడాదికి రూ.1.05కోట్లు ఆదాయం లభించేది. తరువాత రెండు దుకాణాలను తగ్గించేశారు. ఈసారి కేవలం ఒక్క దుకాణమే ఉండేట్లుగా కథ నడిపించారు. దాంతో ప్రస్తుతం ప్రభుత్వానికి రూ.65లక్షలు మాత్రమే ఆదాయం రానుంది. తాజాగా ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటును కూడా అడ్డుకున్నారు. అంతటా అదే తీరు ఈ మద్యం మయాజాలం కశింకోటకే పరిమితం కాలేదు. అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అనకాపల్లి, గాజువాక ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అదే రాజనీతి నడుస్తోంది. అనకాపల్లి సూపరింటెండెంట్ కార్యాలయ పరిధిలో 49 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాటిలో 34 దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి. కానీ వాటిలో కేవలం 22 దుకాణాలకే ఆమోదం తెలిపారు. మిగిలిన 12 దుకాణాలు ఏర్పాటు చేయకుండా టీడీపీ పెద్దలు అడ్డుకున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేస్తే తమ సిండికేట్ ఆదాయానికి గండిపడుతుందనే టీడీపీ పెద్దలు అడ్డుచెప్పారు. ఇక గాజువాక సర్కిల్ పరిధిలో పరిస్థితీ అంతే. అక్కడ 45 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కానీ 22 దుకాణాల ఏర్పాటుకే ఆమోదం తెలిపారు. గుడి, బడికి సమీపంలో ఉన్నాయని 5 దుకాణాల ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. కాగా టీడీపీ పెద్దలు అడ్డుకోవడం వల్లే మిగిలిన కేంద్రాల వద్ద ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు నిర్ణయాన్ని అధికారులు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా జిల్లాలో ఎక్సైజ్ అధికారులను హడలెత్తిస్తూ... మద్యం సిండికేట్ను తమ గుప్పిట్లో పెట్టుకుని టీడీపీ పెద్దలు సొంత మద్యం సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. -
ఇచ్చుకో.. పుచ్చుకో..
మద్యం వ్యాపారులతో ఎక్సైజ్ అధికారుల ఒప్పందం ఒక్కో బాటిల్కు రూ.5 పెంచేందుకు ఓకే లెసైన్స్ రెన్యూవల్కు రూ.55వేలు సగం ముట్టజెప్పిన వ్యాపారులు! మంత్రాంగం నడిపిన సిండికేట్ నాయకుడు జిల్లా వ్యాప్తంగా అమలు మచిలీపట్నం : ఎక్సైజ్ అధికారులకు, మద్యం వ్యాపారులకు మధ్య ఒప్పందం కుదిరింది. అధికారులు అడిగినంత లంచం ఇచ్చేందుకు వ్యాపారులు అంగీకరించారు. వ్యాపారులు ఒక్కో బాటిల్పై అదనంగా ఐదు రూపాయలు వసూలు చేసుకునేందుకు అధికారులు సమ్మతించారు. మచిలీపట్నం ప్రధాన కూడలిలో ఒక పేరుతో వైన్ షాపు దక్కించుకుని... పాత పేరుతోనే షాపు నడుపుతున్న టీడీపీ ద్వితీయశ్రేణి నాయకుడు ఒకరు అటు ఎక్సైజ్ శాఖ అధికారులకు, ఇటు మద్యం దుకాణాల యజమానులకు మధ్యవర్తిగా వ్యవహరించి మామూళ్ల కథను ఓ కొలిక్కి తెచ్చినట్లు సమాచారం. ఎక్సైజ్ కార్యాలయమే వేదిక..! మచిలీపట్నం ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం రిటైల్ షాపు యజమానులతో సమావేశం జరిగింది. ఎక్సైజ్ సర్కిల్ స్థాయి అధికారి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పర్మినెంట్ లెసైన్స్ కావాలంటే ఒక్కో బార్ అండ్ రెస్టారెంట్, మద్యం దుకాణ యజమానులు రూ.55 వేలు చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. దుకాణదారులకు, ఎక్సైజ్ శాఖ అధికారులకు మధ్య జరిగిన చర్చల్లో ఏయే అధికారికి ఎంత మేర మామూళ్లు అందజేయాలనే అంశంపైనా స్పస్టత వచ్చినట్లు తెలుస్తోంది. సిండికేట్ నాయకుడు చొరవ తీసుకుని కొంతమంది వ్యాపారులతో మామూళ్ల అడ్వాన్సుగా రూ.20 వేల నుంచి రూ. 30 వేల వరకు బుధవారమే ఇప్పించినట్లు సమాచారం. వాటాలు ఇలా... మచిలీపట్నం ఎక్సైజ్ కార్యాలయ పరిధిలో ఆరు రిటైల్షాపులు ఉన్నాయి. మచిలీపట్నం మినహా అన్ని ప్రాంతాల్లో ఎంఆర్పీ కన్నా ఒక్కో బాటిల్కు ఐదు రూపాయల చొప్పున అధికంగా వసూలు చేస్తున్నారనే విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇదే పద్ధతిని మచిలీపట్నం ఈఎస్ కార్యాలయ పరిధిలోనూ అమలు చేయవచ్చని, ఇందుకు ఎక్సైజ్ శాఖలో అందరూ సానుకూలంగా ఉన్నారని, సమావేశం ఏర్పాటు చేసిన అధికారి చెప్పినట్లు తెలిసింది. ఒక్కో బాటిల్కు ఐదు రూపాయల చొప్పున ధర పెంచినా తాము పట్టించుకోమని, ఇది తన మాట కాదని, పై అధికారులు చెప్పారని ప్రకటించినట్లు సమాచారం. రిటైల్ షాపులు, మద్యం దుకాణాలకు పర్మినెంట్ లెసైన్స్లు ఇస్తున్నామని, ఒకటి, రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని, ఒక్కో షాపునకు రూ.55వేలు లంచం ఇవ్వాలని సిండికేట్ నాయకుడు, సర్కిల్ స్థాయి అధికారి చేసిన సిఫార్సులకు రిటైల్షాపుల యజమానులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఒక్కో షాపు ద్వారా ఇచ్చే రూ.55 వేలలో ఎక్సైజ్ శాఖ డెప్యూటీ కమిషనర్కు రూ.10 వేలు, ఈఎస్కి, 10 వేలు, సీఐకి రూ.10వేలు, ఎక్సైజ్స్టేషన్కు రూ.25వేల చొప్పున అందజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. బందరు సీఐ కార్యాలయ పరిధిలోని రిటైల్ దుకాణాల యజమానులతో బుధవారం సమావేశం ముగియగా, గురువారం మద్యం దుకాణ యజమానులతోనూ సమావేశం కానున్నారు. పక్కా వ్యూహంతోనే వసూళ్లు మచిలీపట్నం ఈఎస్ కార్యాలయానికి సోమవారం ఎక్సైజ్ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వచ్చారు. అధికారులంతా సమావేశమై మద్యం ధరలు పెంచడం, మామూళ్లు వసూలు చేయడంపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. షాపులకు లెసైన్స్లు మంజూరు చేసే సమయంలోనే నగదు వసూలు చేయాలని, ఇందుకోసం సిండికేట్ నాయకుల సాయం తీసుకోవాలని ఆ అధికారి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తంతోపాటు ఒక్కో మద్యం దుకాణం నుంచి ప్రతి నెలా రూ.15వేలు మామూళ్లు వసూలు చేసే విషయంపై సిండికేట్ నాయకులు, ఎక్సైజ్ అధికారుల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. -
సీతాఫలానికి ‘సిండికేట్’ దెబ్బ
వంట్లమామిడి సంతలో వ్యాపారుల గిమ్మిక్కులు ధర గిట్టుబాటుగాక గిరిజన రైతుల ఆవేదన పాడేరు: ఏజెన్సీలోని పాడేరు మండలం వంట్లమామిడి అంటే నోరూరించే సీతాఫలాలు గుర్తొస్తాయి. ఎలాంటి క్రిమిసంహారక మందు లు వాడకుండా పండించే వీటికి మన రాష్ట్రం లోనే కాదు కోల్కత్తా వంటి బయటి ప్రాంతాల్లోనూ మంచి డిమాండ్. అయితే వాటిని పండించి మారుమూల గ్రామాల నుంచి వంట్లమామిడి సంతకు మోసుకొచ్చే తమకు గిట్టుబాటు ధర ఉండట్లేదని గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. చివరకు మోత కూలి కూడా దక్కలేదని చెబుతున్నారు. నెల రోజుల క్రితం సీజన్ ప్రారంభమైనపుడు బుట్ట సీతాఫలాల ధర రూ. 300 నుంచి రూ. 600 వరకూ ఉంటే ఆదివారం మాత్రం రూ. 150 మించి పలకలేదు. దళారులు, వ్యాపారులు ఏకమై ధరను తగ్గించేశారు. ఆరుగాలం కష్టపడి సీతాఫలాలను సాగుచేసి, మారుమూల గ్రామాల నుంచి కాలినడకనే మోసుకుంటూ సంతకు తెస్తే తీరా తగిన ధర లేకపోవడంతో గిరిజను లు ఉసూరుమంటున్నారు. ఈ సీతాఫలాల సీజన్లో వంట్లమామిడిలో ప్రతి రోజు సంత జరుగుతుంది. సలుగు, దేవాపురం, మోదాపల్లి, వంట్లమామిడి పంచాయతీల పరిధిలోని మారుమూల గ్రామాల్లో గిరిజన రైతులు సీతాఫలాల తోటలను పెంచుతున్నారు. ఎలాంటి క్రిమిసంహారక మందు లు, రసాయన ఎరువులు వాడకుండా పూర్తిగా సేంద్రీయ పద్ధతిలోనే సాగుచేస్తున్నారు. ఎంతో రుచికరంగా ఉండే ఈ పండ్లను కోల్కత్తా వంటి నగరాలకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నారు. మరో రెండు నెలల వరకు సీతాఫలాల సీజన్ ఉంటుంది. -
కొత్త సిండికేట్ కు అమాత్యుని అండ !
బెడిసికొట్టిన మంత్రి మంత్రాంగం సోమవారం లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపు బందరు 15వ వార్డులోని షాపు మినహా... సాక్షి, విజయవాడ : కొత్తగా ఏర్పాటయిన మద్యం సిండికేట్ రాజకీయాలు పెట్రేగిపోతున్నాయి. ఎక్సైజ్ శాఖ మంత్రి ఈ నూతన సిండికేట్కు పూర్తిగా సహకరించడం తీవ్ర వివాదాస్పదమవుతుంది. తనకు అనుకూలంగా ఉండే సిండికేట్కు లబ్ధి చేకూర్చాలనే తాపత్రయంతో మంత్రి పాత మద్యం వ్యాపారుల ఆదాయానికి గండికొట్టేందుకు చేసిన ప్రయత్నం కాస్తా... కోర్టు జోక్యంతో కొంతమేర బెడిసికొట్టింది. జిల్లాలో 335 వైన్షాపులున్నాయి. విజయవాడ డివిజన్ పరిధిలో 162 షాపులు, మచిలీపట్నం డివిజన్లో 173 షాపులున్నాయి. వీటి కేటాయింపు కోసం గతంలో జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం శనివారం లాటరీ ప్రకియ నిర్వహించాల్సి ఉంది. అయితే మచిలీపట్నం డివిజన్లోని మచిలీపట్నం పట్టణం ఎక్సైజ్ గెజిట్లోని 15వ నంబరు వార్డులో షాపును ఏర్పాటు చేయాలని అధికారులు నూతనంగాగెజిట్లో పొందుపరచడం తీవ్ర గందరగోళానికి తెరలేపింది. ఈ సిఫారసును నిరసిస్తూ పాత సిండికేట్ వ్యాపారులు మచిలీపట్నం డివిజన్ లాటరీ ప్రకియపై హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. దీంతో శనివారం మచిలీపట్నం డివిజన్ లాటరీ ప్రకియ నిలిచిపోయింది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమాత్యుని ఆదేశాలతో ఎక్సైజ్ అధికారులు స్టేపై మళ్లీ ఉత్తర్వులు తీసుకొచ్చారు. దీంతో సోమవారం లాటరీ ప్రకియ నిర్వహించనున్నారు.అయితే 15 వార్డులోని షాపులకు లాటరీ నిలిపివేసి మిగిలినవి నిర్వహించాలని అదివారం హైకోర్టు ఉత్తర్వులు వెలువరించడంతో అమాత్యుని అనుచరుల ఆశలు నిరాశలయ్యాయి. దూమారం రేపిన వివాదం ... మచిలీపట్నంలోని కాలేఖాన్ పేట, గిలకలదిండి, సత్రంపాలెంలో మూడు వైన్ షాపులను ఏర్పాటు చేయాలని రెండు నెలల కిత్రం గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ అధికారులు సిఫారసు చేశారు. దానికి ప్రభుత్వ ఆమోదముద్ర పడింది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగా.. మచిలీపట్నం నుంచి గెలుపొందిన కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈక్రమంలో 15 వార్డు పరిధిలోని కోనేరు సెంటర్లో షాపు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను అదేశించారు. దీంతో మూడు షాపుల్లో ఒకదానికి బదులు కోనేరు సెంటర్లో ఏర్పాటు చేయాలని సూచనలతో గెజిట్లో పేర్కొని దరఖాస్తులను స్వీకరించారు. కోనేరు సెంటర్లో ఇప్పటికే మూడు బార్ అండ్ రెస్టారెంట్లున్నాయి. అవి పాత సిండికేట్వి. అలాగే మూడు షాపుల వ్యక్తులు ప్రతిపక్ష పార్టీకి చెందిన వారు. దీంతో వారి ఆదాయ వనరులు దెబ్బతీయాలనే లక్ష్యంతో మూడు షాపులు ఉన్నప్రాంతంలోనే వైన్షాపు ఏర్పాటు చేస్తే బార్ల ఆదాయం గణనీయంగా పడిపోతుందని అమాత్యులు భావించారు. అయితే ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఒకే ప్రాంతంలో బార్, వైన్ షాపులు ఏర్పాటు చేయకూడదు. కానీ అమాత్యుని అదేశాలతో వీటన్నింటినీ పక్కన పెట్టి ఏకపక్షంగా వ్యవహరించారు. దీంతో బార్ యజమానులు కోర్టును ఆశ్రయించటంతో షాపుల కేటాయింపు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. 15వ నంబరు వార్డులో షాపు ఏర్పాటు చేయకూడదని, గెజిట్ నిబంధనలకు అనుగుణంగా లేదని మచిలీపట్నం డివిజన్ గెజిట్ను నిలిపివేసింది. దీంతో ప్రభుత్వం గెజిట్ నిలుపుదలపై మళ్లీ ఉత్తర్వులు తెచ్చింది. దీంతో బందరు 15 వార్డులోని షాపులకు లాటరీ నిలిపివేసి మిగిలిన వాటికి సోమవారం లాటరీ నిర్వహించటానికి అధికారులు సిద్ధమయ్యారు. -
బోగస్ కార్డుల మాయాజాలం
- ఏరివేత సాధ్యమేనా! - జిల్లాలో 6.70 లక్షల కార్డులు జారీ - డీలర్ల వద్దే 5 వేల తెల్లకార్డులు, 10 వేల కూపన్లు - అధికారులు గుర్తించనివి ఎన్నో.. - షాపుల బైఫర్కేషన్ను అడ్డుకుంటున్న సిండికేట్ కలెక్టరేట్ : బోగస్ రేషన్ కార్డుల ఏరివేతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్ ఆధికారులతో సమీక్ష నిర్వహించారు.అయితే జిల్లాలో బోగస్ కార్డుల ఏరివేత సాధ్యమేనా అన్న సంశయం తలెత్తుతోంది. జిల్లాలో దాదాపు 25 లక్షలకు పైగా జనాభా ఉండగా 6.70 లక్షల వరకు కార్డులు ఉంటాయి. నిజామాబాద్ నగరంలోని 87 రేషన్ షాపుల పరిధిలో 78,236 కార్డులు ఉన్నాయి. కాగా నిబంధనలకు విరుద్ధంగా రేషన్షాపులకు కార్డులను కేటాయించారు. ఒక షాపులో 300 కార్డులు ఉంటే మరో షాపుకు 3వేలకు పైగా రేషన్కార్డులను జారీ చేశారు. ఒక్కోషాపుకు కార్డుల కేటాయింపులో ఇంత వ్యత్యాసం ఉండడం బోగర్ కార్డులను నిర్ధారిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. అయితే రేషన్ షాపుల విభజన (బైఫరికేషన్)ను 2008 సంవత్సరంలోనే చేపట్టాల్సి ఉండగా అధికారులు, పాలక వర్గాలు మీనమేషాలు లెక్కించాయి. ఇప్పటి వరకు బైఫరికేషన్ జరగలేదు. వాస్తవానికి నగరంలో ఒక్కో షాపునకు 650 కార్డులకంటే ఎక్కువ కార్డులు ఉండరాదన్నా నిబంధనలు ఉన్నాయి. 2009 సంవత్సరంలో నగరంలోని రేషన్ దుకాణాల బైఫర్కేషన్కు సంబంధించి నోటిపికేషన్ను జారీ చేశారు. అనంతరం యూనియన్ నాయకుల ఒత్తిడి మేరకు బైఫరికేషన్ ప్రక్రియను నిలిపివేశారు. అప్పటి నుంచి బైఫరికేషన్ను పట్టించుకున్నవారే లేరు. దుకాణాల్లో కార్డుల విభజన విషయం తెరమీదికి వచ్చేసరికి యూనియన్ నాయకులు రంగ ప్రవేశం చేసి అధికారులు, పాలక వర్గాలపై ఒత్తిడి తీసుకువచ్చేవారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల 26 రేషన్ షాపుల్లో 5 వేల బోగస్ తెల్ల కార్డులను అధికారులు గుర్తించారు. ఇంతే కాకుండా 10వేల రేషాన్ కూపన్ల వరకు డీలర్ల వద్దే పెట్టుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో నెలకు 20 వేల క్వింటాళ్ల రుపాయి కిలో బియ్యం పక్కదాని పడుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 40 లక్షల వరకు ఉంటుందని అధికారిక వర్గాలే చెబుతున్నాయి. డీలర్లు ఇంత పెద్ద ఎత్తున రుపాయి కిలో బియ్యాన్ని మింగేస్తున్నారు. ఎక్కువ రేషాన్ కార్డులు డీలర్లే రుపాయి బియ్యాన్ని అధికారులతో కుమ్మక్కై రీసైక్లింగ్ కోసం రైస్ మిల్లులకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల అర్సపల్లిలో దొరికిన పీడీఎస్ బియ్యం బస్తాలు నగరానికి సంబంధించిన రేషన్ షాపులవేనని అధికారులు పేర్కొన్నారు. బియ్యం కూడా ఎఫ్సీఐ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్కు వెళ్లకుండా నేరుగా గోదాంకు తరలడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బోగస్ లబ్ధిదారులను సృష్టించి వేలిముద్రలు రిజిష్టర్లో నమోదు చేసి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. అయితే అధికారులు గుర్తించిన వాటిలో కూడ నగరంలో 26 షాపులను బైఫరికేషన్ చే యాల్సి ఉందని వారి విచారణలో తేలింది. ఈ విషయాన్ని నిజామాబాద్ తహశీల్దార్తో పాటు,ఆర్డీవో జిల్లా సివిల్ సప్లై అధికారులకు నివేదిక సమర్పించారు. వారు కమిషనర్కు నగరంలోని 26 రేషన్ షాపుల బైఫరికేషన్పై నివేదిక ఇచ్చారు. ఈ షాపులను బైఫరికేషన్ చేస్తే కొంతైన బోగస్ కార్డులకు చెక్ పడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. -
తీరంలో సిండికేట్ రాజకీయం
సాక్షి, విజయవాడ : తీరంలో మద్యం సిండికేట్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు పూర్తి స్థాయిలో ఫలించాయి. పర్యవసానంగా మూడు షాపులు ఉన్న ప్రాంతంలో రీ లొకేట్ పేరుతో మద్యం షాపును కేటాయించటం వివాదాస్పదమైంది. వాస్తవానికి ఎక్సైజ్ అధికారులు తొలుత షాపును సూచించిన ప్రాంతంలో కాకుండా అధికార పార్టీ అమాత్యుడి ఒత్తిడితో షాపు ప్రాంతం మార్చారు. దీనిపై బందరుకు చెందిన వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మచిలీపట్నం డివిజన్ పరిధిలోని షాపుల కేటాయింపునకు సంబంధించి జారీ అయిన గెజిట్ను నిలుపుదల చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. జరిగిందిదీ... మచిలీపట్నం డివిజన్ పరిధిలో జిల్లాలోనే అత్యధికంగా 173 మద్యం షాపులు ఉన్నాయి. వీటిలో శుక్రవారం సాయంత్రం గడువు ముగిసేనాటికి సుమారు 120 షాపులకు వందల సంఖ్యలో దరఖాస్తులు అందాయి. మచిలీపట్నం డివిజన్లో మూడు మద్యం షాపుల్లో విక్రయాలు సరిగా జరగటం లేదని, షాపులు దక్కించుకున్న వ్యాపారులు నష్టపోయారనే కారణంతో మూడుషాపులను రీ లొకేటెడ్ పేరుతో బందరు పట్టణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అధికారుల ఆదేశాలతో బందరు ఎక్సైజ్ సీఐ రీ లొకేటెడ్ షాపులను పట్టణంలోని 26, 27 వార్డులు, రూరల్లోని సత్రవపాలెంలో ఏర్పాటు చేయాలని డిప్యూటీ కమిషనర్కు సిఫార్సు చేశారు. దీంతో డీసీ కార్యాలయం వాటిని ఆమోదించింది. ఇదంతా ఎన్నిలకు ముందు జరిగింది. ఎన్నికలు పూర్తి కావటం.. ఆ తర్వాత అక్కడ టీడీపీ గెలవటంతో ఆ నేతల హవా పట్టణంలో మొదలైంది. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకున్నారు. పట్టణంలో మూడు బార్లు ఉన్న 15వ వార్డులోనే వైన్షాపులు ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తేవటంతో ఆఘమేఘాల మీద 26వ వార్డులో ఏర్పాటు చేయాల్సిన షాపును 15లోకి మార్చారు. దీంతో బార్ యజమానులు హైకోర్టును ఆశ్రయించి ఎక్సైజ్ తీరుపై కోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో కోర్టు మచిలీపట్నం గెజిట్ను నిలుపుదల చేయాలని శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కొందరు నేతలు రాజకీయ కక్ష్యతోనే తమ వ్యాపారం దెబ్బతీయటానికి 15వ వార్డులో షాపు కేటాయించారని అందుకే తాము హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తీసుకువచ్చామని ఈగల్ బార్ యజమాని ఎల్.ఆనంద్ ‘సాక్షి’కి తెలిపారు. కోర్టు ఉత్తర్వులను ఎక్సైజ్ అధికారులకు పంపామని చెప్పారు. -
రెడీ.. ‘చార్జ్’షీట్!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:బినామీల పేరిట లెసైన్సులు.. సిండికేట్గా ఏర్పడి ధరలను ఇష్టారాజ్యంగా పెంచేయడం.. తప్పుల తడకలుగా రికార్డుల నిర్వహణ.. ఇలా చెప్పుకొంటూపోతే రెండేళ్ల క్రితం వరకు మద్యం మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోయింది. ఎక్సైజ్, పోలీసులు అధికారులు, సిబ్బంది అండ చూసుకొని మద్యం మారాజులు తెగ రెచ్చిపోయారు. రెండేళ్లక్రితం అవినీతి నిరోధక శాఖ పంజా విసిరి, దాడులు చేయడంతో వీరి బండారం బయటపడింది. అప్పటినుంచి కొనసాగుతున్న ఈ కేసు విచారణ ఎట్టకేలకు తది దశకు చేరుకుంది. విచారణాధికారులు చార్జిషీట్లు కూడా ఇటీవలే దాఖలు చేయడంతో ఇక హైకోర్టు తీర్పు ఇవ్వడం.. మద్యం బాస్లు కటకటాలు పాలు కావడమే మిగిలింది. ఒక్కసారి వెనక్కి వెళితే.. జిల్లా వ్యాప్తంగా 38 మండలాల్లోని సుమారు 232 మద్యం దుకాణాల్లో అధిక శాతం సిండికేట్ల చేతుల్లోనే ఉండేవి. వీటిలో చాలా దుకాణాలు తెల్లరేషన్ కార్డుదారులను బినామీలుగా పెట్టి బడాబాబులు లెసైన్సు పొందినవే. ఇలా గుత్తగా గుప్పిట్లో పెట్టుకున్న షాపుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు అమలు చేయడం మానేశారు. సిండికేట్ నిర్ణయించిన అధిక ధరలకు అమ్మకాలు సాగించి యథేచ్ఛగా మందుబాబులను దోచుకున్నారు. అమ్మకాలకు సంబంధించి రికార్డుల నిర్వహణలోనూ చేతివాటం చూపారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. ఎక్సైజ్, పోలీస్ అధికారులకు లంచాల ముడుపులు కట్టి వారి చేతులు కట్టేశారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఏసీబీ విస్తృత దాడులు జరిపి మద్యం మాఫియా భరతం పట్టింది. శ్రీకాకుళం జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో పలువురు జైలుపాలు కాగా.. మరెంతోమందిపై విచారణ ప్రారంభమైంది. అయితే ఏళ్ల తరబడి విచారణ కొనసాగుతుండటంపై సాక్షాత్తు హైకోర్టు మొట్టికాయిలు వేసింది. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించడంతో ఉరుకులు, పరుగుల మీద ఏసీబీ అధికారులు పని ముగించారు. ఎంతమందిపై కేసులు మద్యం షాపుల్లో పనిచేసిన అకౌంటెంట్లు, తెల్ల రేషన్కార్టుదారులతో పాటు ముగ్గురు మద్యం వ్యాపారులు, సీఐ నుంచి ఉన్నతాధికారి స్థాయి వరకు ఎక్సైజ్ అధికారులు, పలు స్టేషన్ల పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లపైనా ఏసీబీ కేసులు నమోదు చేసింది. కొందరిని జైలుకు కూడా పంపించారు. ఇప్పుడు పరిస్థితి మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన ఏర్పడిన తరువాత పెండింగ్లో ఉన్న కేసులను ‘శాంక్షన్ ఆర్డర్ల’ పేరిట పరిష్కరించాలని నిర్ణయించడంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని కేసులూ ముగింపు దశకు వచ్చాయి. అందులో భాగంగానే మద్యం కేసులోనూ చార్జిషీటు దాఖలైంది. ప్రస్తుత పరిస్థితి ఇదీ కేసు పూర్తయితేనే రాష్ట్ర విభజన నేపథ్యంలో బదిలీ కావాల్సిన సిబ్బందిని వారి ప్రాంతాలకు పంపిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో అధికారులూ అంతే స్పీడుగా విచారణ పూర్తిచేశారు. అయితే పలువురు ఎక్సైజ్ సిబ్బంది, పోలీసులపై ట్రైబ్యునల్, బెనిఫిట్ ఆఫ్ డౌట్, డిపార్టమెంటల్ యాక్షన్, డిసిప్లినరీ యాక్షన్లు కోరుతూ ఆయా శాఖల విభాగాధిపతులకు లేఖలు రాశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ కొటారు రామకృష్ణ, కానిస్టేబుల్ అప్పన్న, మద్యం వ్యాపారి ఓరుగంటి ఈశ్వరరావు, ముగ్గురు అకౌంటెంట్లకు త్వరలోనే జైలు శిక్ష ఖాయమవుతుందని ఏసీబీ అధికారులే చెబుతున్నారు. ‘ఓ కానిస్టేబుల్ జీతం రూ.15వేలు కాగా.. అతనికి నెలనెలా వచ్చే మామూళ్లు సుమారు రూ.30 వేలు ఉన్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చని’ ఓ దర్యాప్తు అధికారి వ్యాఖ్యానించారు. మరికొందరు కిందిస్థాయి సిబ్బంది మద్యం మామూళ్లతోనే వాహనాలు కొనుగోలు చేసి ప్రభుత్వ శాఖలకు అద్దెకివ్వడంతోపాటు మద్యం దుకాణాల్లో భాగస్వాములుగా ఉండేవారని ఆ అధికారి చెప్పారు. అటువంటి వారెవరూ ఈ కేసు నుంచి తప్పించుకోలేరని ఆయన అభిప్రాయపడ్డారు. అందరికీ జైలు శిక్ష పడకపోయినా.. ఉద్యోగం నుంచి తొల గింపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలుపుదల వంటి శిక్షలు తప్పవని అన్నారు. -
భవన నిర్మాణ రంగం కుదేల్!
అమాంతం పెరిగిన సిమెంట్ ధర జిల్లాలో రూ.10 కోట్ల భారం ఖాళీగా ఉంటున్న కార్మికులు గుడివాడ : సిమెంటు ధరల దెబ్బకు భవన నిర్మాణ రంగం కుదేలవుతుంది. దీనికి తోడు ఇసుక, ఇనుము, కంకర ధరలకు రెక్కలు రావడంతో భవన నిర్మాణాలకు తీరని విఘాతం కల్గిస్తున్నాయి. నెల రోజులుగా పనులు కార్మికులు ఖాళీగా ఉంటున్నారు. నెలలో మూడు సార్లు సిమెంటు, తదితర ముడిపదార్థాల ధరలు పెరగడంతో భవనాలు నిర్మించలేమని యజమానులు చేతులెత్తేస్తున్నారు. భవన నిర్మాణ రంగానికి అత్యంత గిరాకీగా ఉండే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఇటువంటి చేదు అనుభవం ఎదురవ్వడంతో దీనిపై ఆధార పడిన కుటుంబాలు పనుల్లేక అల్లాడి పోతున్నారు. సిమెంటు కంపెనీల సిండికేట్ కారణంగా సిమెంటు ధరలు మరింత పెరిగిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. సిమెంటు ధరలు పెరుగుదల ఫలితంగా జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంపై నెలకు రూ.10కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సిమెంటుతో ముడిపడి ఉన్న ప్రభుత్వ పనులు తాము చేయలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో అభివృద్ధి పనులకూ విఘాతం కలుగుతోంది. నెల రోజుల్లో మూడుసార్లు పెరిగిన సిమెంటు ధరలు... ఈ ఏడాది మార్చి31 తరువాత నెలరోజుల్లోనే మూడుసార్లుగా సిమెంటు కంపెనీలు ధరలు పెంచారు. మార్చి 31 నాటికి ఏగ్రేడు కంపెనీలు బస్తా సిమెంటు ధర రూ.240 ఉండగా బీగ్రేడు కంపెనీలవి రూ. 225కి అమ్మారు. సీగ్రేడు కంపెనీల బస్తాధర రూ.190 చొప్పున అందించారు. అయితే మే1న అన్నికంపెనీలు బస్తాకు రూ.40 చొప్పున పెంచగా అదేనెల వారం రోజుల్లోపే బస్తాకు రూ 30 అదనంగా పెంచారు. ఈనెల 18నుంచి అన్నికంపెనీలు మరో 10 అదనంగా పెంచారు. దీన్ని బట్టి నెలన్నరలో అన్నికంపెనీలు బస్తాకు రూ.80 చొప్పున పెంచారని చెబుతున్నారు. ప్రస్తుతం ఏగ్రేడ్ కంపెనీల బస్తా సిమెంటు ధర రూ.310 కాగా బీగ్రేడు కంపెనీల బస్తా సిమెంటు రూ.300కి చేరింది. సీగ్రేడు సిమెంటు రూ.280కి అందిస్తున్నారు. నిర్మాణ రంగానికి ప్రధానమైన సిమెంటు ధరల పెరుగుదల కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం సిమెంటు వినియోగం 10శాతానికి పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లా ప్రజలపై రూ.10 కోట్లు భారం.. జిల్లా వ్యాప్తంగా 30 రకాల కంపెనీలకు చెందిన సిమెంటు నెలకు సగటున 62.5వేల టన్నులు వినియోగిస్తారు. జిల్లాలో వినియోగించే మొత్తం సిమెంటు వినియోగంపై దాదాపు రూ.10 కోట్లభారం పడే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇసుక కొరత కారణంగా అపార్టుమెంట్లు అనుకున్న సమయానికి పూర్తి చేసి ఇవ్వకపోవడంతో అటు కొన్న వారు నిర్మాణదారుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫినిషింగ్ పనులపై ప్రభావం... సిమెంటు ధరలు పెరగడంతో భవన నిర్మాణ దారుడి బడ్జెట్ దాటుతుంది. దీంతో భవనం ఫినిషింగ్ పనులపై ప్రభావం పడుతుంది. రంగులు, ఫ్లోరింగ్, ఉడెన్ కార్పంటింగ్ పనులపై దీని ప్రభావం చూపి సంబంధింత వ్యాపారాలు మందగిస్తాయి. సిమెంటు ధరల ప్రభావం ఇతర వ్యాపారాలపై కూడా ఉంటుంది. - టి.భాస్కర్ , సతీష్ పెయింట్స్ అధినేత అల్లాడిపోతున్నాం..? సిమెంటు ధరల ప్రభావం భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన ప్రతి కుటుం బంపై పడుతుంది.నిర్మాణాలు ఆగి పోతే ఫ్లంబర్ నుంచి అన్ని రకాల చేతిపనుల వారు పనులు లేక అల్లాడి పోవాల్సిందే. దీని ప్రభావం దాదాపు రెండు నెలలు పాటు చూపుతుంది. ఇష్టారాజ్యంగా ధరలు పెంచితే లక్షలాది మంది కార్మికులు అల్లాడి పోవాల్సిందే. - లక్ష్మణరావు, భవన నిర్మాణ కార్మికుడు -
అధిక ధరలకు మద్యం అమ్మకాలు
కాకినాడ క్రైం :మద్యం షాపుల లెసైన్సులకు గడువు ముగుస్తుండడంతో జిల్లాలో మద్యం సిండికేట్ బరి తెగిస్తోంది. ఈ నెలాఖరుతో గడువు ముగియనున్న నేపథ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా మద్యం వ్యాపారులు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు. నూతన మద్యం పాలసీ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం టెండరు విధానానికి స్వస్తి పలుకుతూ జనాభా ప్రకారం ధర నిర్ణయించి నూతన మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది. గతేడాది జిల్లాలో 555 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా వంద దుకాణాల నిర్వహణకు వ్యాపారులెవ్వరూ ముందుకు రాలేదు. ఏడాది క్రితం రెన్యూవల్ నిమిత్తం కూడా సుమారు 50 మంది యజమానులు దరఖాస్తు చేసుకోలేదు. దీంతో జిల్లాలో ప్రస్తుతం 400 షాపుల మాత్రమే లెసైన్సు పొంది ఉన్నాయి. తిరిగి చెల్లించని ఒప్పందంతో దరఖాస్తు రుసుం రూ.25 వేలు నిర్ణయించడంతో దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ. 1.12 కోట్లు సమకూరింది. మిగిలిన దుకాణాలను ఎక్సైజ్ శాఖ నేతృత్వంలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) డిపో ద్వారా ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) నిర్వహించాలని ప్రభుత్వం తీర్మానించింది. అయితే జిల్లాలో కాకినాడ, రాజమండ్రి తప్ప ఇంకెక్కడా అవుట్లెట్లు ఏర్పాటు చేయలేకపోయారు. పాత విధానాలే అమలు కోటాకు మించి మద్యం తీసుకోవాలంటే అదనపు మద్యం అమ్మకాలపై ప్రివిలేజ్ ఫీజుగా 14 శాతం సుంకం చెల్లించాలి. దీంతో తమకు ఏమీ మిగలదని వ్యాపారులు అధిక మద్యం తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఈసారి సైతం పాత మద్యం విధానాన్నే ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రివిలేజ్ ఫీజును 13.6 శాతానికి తగ్గించింది. దీంతో కొత్త పాలసీ వస్తుందని ఎదురుచూసిన మద్యం వ్యాపారులకు నిరాశే మిగిలింది. ఈ నెలాఖరులోగా కొత్తగా దరఖాస్తులు స్వీకరించి జూలై 1 నుంచి షాపులు కేటాయించాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. కాగా ఎక్సైజ్ కమిషనర్ ఎస్ఎస్ రావత్ శనివారం 13 జిల్లాలో డిప్యూటీ కమిషనర్లతో సమీక్షించి విధివిధానాలు ఖరారు చేశారు. జిల్లాలో సుమారు 1,100 గ్రామాలుండగా 4,500 పైగా బెల్టుషాపులు ఉన్నట్లు అంచనా. మద్యం దుకాణాల్లో ఉదయం 10.30 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు చేస్తుండగా, బెల్టుషాపుల్లో మాత్రం 24 గంటలూ అందుబాటులో ఉంచుతున్నారు. వీటి ద్వారానే 60 శాతం అమ్మకాలు సాగుతున్నాయని సమాచారం. మందుబాబుల అలవాటును మద్యం వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. మాగ్జిమమ్ రిటైల్ ప్రైస్ (ఎమ్మార్పీ) కంటే అధిక ధరలకు విక్రయించి లాభాలు గడిస్తున్నారు. అర్ధరాత్రి మద్యం కొనుగోలు చేయాలంటే సుమారు రూ. 20 పైబడి అధికంగా ధర చెల్లించాల్సిందేనని మందుబాబులు చెబుతున్నారు. చాలా బడ్డీ కొట్లు, కిళ్లీషాపుల వద్ద బెల్టుషాపులు నిర్వహిస్తున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లాలో ఒక్కో షాపులో రోజూ దాదాపు 200 వరకు బీర్లు అమ్ముడవుతాయి. విస్కీ, రమ్ము, జిన్ను, బ్రాందీ, వైన్ కూడా సుమారు 400 బాటిళ్లు విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో బీర్లు అధికంగా అమ్ముడుపోతున్నాయి. చర్యలు తీసుకుంటాం మద్యం ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై అధికారులను అప్రమత్తం చేసి పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. ఎక్సైజ్ అధికారులకు ముడుపులు అందుతున్నాయన్న మద్యం వ్యాపారుల ఆరోపణల్లో వాస్తవం లేదు. ఇతర అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. -సీహెచ్ వివేకానంద రెడ్డి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ -
174 దుకాణాలు.. 850 దరఖాస్తులు..
ఆదిలాబాద్ క్రైం : కొత్త రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ ద్వారా మద్యం షాపులు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. ఈ ప్రక్రియ శనివారంతో ముగిసింది. జిల్లాలో 174 మ ద్యం దుకాణాలకు 850 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారులకు లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఎలాగైనా మద్యం దుకణాలు దక్కించుకునేందుకు మద్యం వ్యాపారులు ఈసారి భారీగా పోటీ పడుతున్నారు. ఈనెల 23న జిల్లా కేంద్రంలోని పి.జనార్దన్రెడ్డి గార్డెన్లో కలెక్టర్ సమక్షంలో మద్యం దుకాణాలు లక్కీ డ్రా ద్వారా కేటాయించనుండడంతో వ్యాపారులు తమ అదృష్టాన్నే నమ్ముకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలు దక్కించుకోవాలనే కుతుహాలంతో ఉన్నారు. మొదటి నుంచి మద్యం షాపులు నిర్వహిస్తున్నవారు ఈసారి కూడా వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే.. కొంత మంది సిండికేట్ ద్వారా మద్యం దుకాణాలు సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ప్రస్తుతం దరఖాస్తులు గడు వు ముగిసినా షాపు కేటాయించిన తర్వాతైనా సిండికేట్ అయ్యేందుకు వెనకాడడం లేదు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది. చివరి రోజు బారులు.. ఈనెల 16 నుంచి మందకొడిగా సాగిన టెండర్ దరఖాస్తులు చివరి రోజు శనివారం ఊపందుకున్నాయి. జిల్లాలోని మంచిర్యాల యూనిట్ పరిధిలో 104 దుకాణాలు, ఆదిలాబాద్ యూనిట్ పరిధిలో 70 దుకాణాలు ఉన్నాయి. మొత్తం 174 దుకాణాలకు 850 దరఖాస్తులు వచ్చాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు దరఖాస్తుదారులు బారులు తీరారు. కలెక్టర్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్, మంచిర్యాల యూనిట్ పరిధిలోని స్టేషన్ల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకున్నారు. దరఖాస్తుదారులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్ సిబ్బంది రాత్రి వరకూ వాటిని లెక్కపెట్టారు. -
మామిడిలో పెట్టుబడులు రావడం లేదు
ఐదెకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. మూడేళ్లుగా మామిడికి మద్దతు ధర లేకపోవడంతో పెట్టుబడులు రావడం లేదు. అయినా ఈ ఎడాది రూ. 45 వేలు మామిడి తోటలపై పెట్టుబడి పెట్టా. వాతావరణం అనుకూలించిన పోవడంతో గత పూత ఆలస్యంగా వచ్చింది. ఉద్యానవన అధికారుల సూచన మేరకు మందులు వాడినా దిగుబడి రాలేదు. ఇటీవల వచ్చిన గాలీవానలకు 10 శాతం పంట నష్టపోయాం. దీనికితోడు జ్యాస్ ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్గా ఏర్పడి మామిడికి ధర లేకుండా చేస్తున్నారు. - పి.బాబుకిరణ్రెడ్డి, రైతు, సామిరెడ్డిపల్లె, పెనుమూరు మామిడి తోటలు అడిగేవారే లేరు...? రెండు ఎకరాల్లో మామిడి తోట ఉంది. తోటపై ఆధార పడి సుమారు రూ.2 లక్షలు అప్పు చేసి నాలుగేళ్లయింది. అప్పు పెరుగుతోంది తప్ప కష్టాలు తీరలేదు. ప్రతి ఏటా దిగుబడి బాగానే వస్తుంది. అయినా తోట ఇస్తావా.. అంటూ అడిగేవారు లేరు. ఆరు సంవత్సరాలుగా ఎకరా తోట రూ.లక్ష కంటే ఎక్కువ ధరకు ఏనాడు అమ్ముడు పోలేదు. ప్రతి సంవత్సరం నష్టాలు తప్ప లాభం వచ్చిన దాఖలాలు లేవు. మార్కెట్ ఉండి ఉంటే వ్యాపారులకు తోటలను అమ్మకుండా నేరుగా కాయలను విక్రయించి లాభపడేవాడ్ని. - వెంకటాద్రి, రైతు, ఆవులపల్లె, మదనపల్లె రూరల్ వూమిడి సాగుతో అప్పులు మిగిలారుు.... వూమిడి పంట సాగు చేయుడంతో ఈ ఏడాది పూర్తిగా అప్పులు మిగిలారుు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం పంట దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో పెట్టుబడులు పెట్టి కాపాడుకున్నాం. వారం రోజుల క్రితం వీచిన ఈదురు గాలులతో ఉన్న పంట కాస్తా నేలపాలు అరుుంది. ఎక్కడకు తరలించినా క్వింటాల్ ధర రూ.పది వేలకు మించి కొనుగోలు చేయడంలేదు. వారపు సంతల్లో రాలి కాయులు కిలో పదిరూపాయలకు అమ్మినా కొనుగోలు చేసేవారు లేరు. జ్యూస్ ఫ్యాక్టరీలకు తరలించినా వెంటనే చెల్లింపులు ఉండవు. - ఆర్.శ్రీరావుులు, రైతు, కలకడ. సగం పంట దెబ్బతింది గాలీవానలకు సగానికిపైగా మామిడి పంట దెబ్బతింది. మిగిలిన పంటకైనా గిట్టుబాటు ధరా లభిస్తుందన్న ఆశలు లేవు. వేరుశెనగ రైతుల తరహాలో ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి, ఆదుకోవాలి. లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు పడతాం. అధికారులు పంటనష్టం అంచనా వేసి రైతన్నలను ఆదుకోవాలి. ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోక పోతే పరిస్థితి అంతే. -రాజశేఖరరెడ్డి, రైతు, ఐలవారిపల్లె రూ.3లక్షలు నష్టపోయా నగరి నియోజకవర్గంలో గాలివాన బీభత్సానికి రూ.కోటిన్నర పైగా మామిడి పంట నష్టం వాటిల్లింది. ఏడు ఎకరాల మామిడి తోట ఉంది. గత ఏడాది కంటే ఈ ఏడాది మామిడిలో సుమారు రూ. 3 లక్షలు నష్టపోయాను. ఈ ఏడాది రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశా. రాలిపోయిన కాయలను మార్కెట్కు తరలిస్తే కూలీల ఖర్చు కూడా రాలేదు. - రామకృష్ణమరాజు, రైతు, నార్పరాజుకండ్రిగ(విజయపురం) ప్రభుత్వం ఆదుకోవాలి రెండెకరాల మామిడితోట ఉంది. గతేడాది కంటే దిగుబడి 50 శాతానికి పడిపోయింది. పెనుగాలులకు ఒకటిన్నర టన్నుల మామిడి కాయలు నేలరాలాయి. దీంతో దాదాపు రూ. 15 వేల నష్టం వాటిల్లింది. మందుల పిచికారికే రూ. 10 వేలు ఖర్చు చేశా. ప్రస్తుతం ఉన్న కాయలతో నష్టం తప్పదనిపిస్తోంది. కాయలు నేలరాలినా అధికారులు ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. - మునిరాజ, బూరగమంద(సదుం) -
పచ్చ గుట్టు.. పబ్లిగ్గా రట్టు!
అనకాపల్లి లాడ్జిలో ‘దేశం’ యవ్వారం నోట్ల పంపిణీకి ‘పెద్దల’ రహస్య వ్యూహం లాడ్జీలోనే ‘పచ్చచొక్కాల’ మకాం.. మంతనాలు ఎన్నికల అధికారులు, పోలీసుల తనిఖీలు అప్పటికే పలాయనం అనకాపల్లి నుంచి ‘సాక్షి’ ప్రతినిధి : అనకాపల్లిలో తెలుగుదేశం గుట్టు లాడ్జి సాక్షిగా రచ్చకెక్కింది. పచ్చనోట్ల పంపిణీకి భారీ ఏర్పాట్లు సాగుతున్నట్టు అక్కడి వాతావరణాన్ని బట్టి స్పష్టమవుతోంది. ఎంపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాస్ సిండికేట్ తెరచాటున నడిపిన వ్యవహారం స్థానికుల అప్రమత్తత కారణంగా వెలుగు చూసింది. ప్రజాగ్రహం వెల్లువ కావడంతో పచ్చముఠా కంగుతింది. ముందే తోక ముడిచింది. ఫిర్యాదు అందడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు లాడ్జిని నిశితంగా సోదా చేయగా అనుమానాస్పద ఆధారాలు లభించినా, అసలు కథ మాత్రం అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. వారం రోజులుగా తెలుగు తమ్ముళ్లకు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురైన నేపథ్యంలో ఈ కథ చోటు చేసుకుంది. అసలేం జరిగింది? : అనకాపల్లిలోని ఓ లాడ్జి ముందుకు గత రాత్రి ఓ వాహనం వచ్చింది. ఆ వాహనంలో వచ్చిన వ్యక్తులు అందులోంచి కొన్ని బ్యాగులు, తెలుగుదేశం పార్టీకి చెందిన కరపత్రాలు, జెండాలు దించడాన్ని స్థానికులు గమనించారు. అనుమానంతో చుట్టపక్కల వా ళ్లు నిఘా పెట్టారు. రాత్రి 12 గంటల తర్వాత ఆ లాడ్జిలోని రూములోకి కొందరు దఫదఫాలుగా రావడం, చేతి సంచులతో వెళ్ళడం స్థానికుల కళ్లబడింది. లోపల టీడీపీ నేతలున్నట్టు తేలిం ది. చుట్టపక్కల చోటామోటా నేతలతో బేరాలు చేస్తున్నట్టు తెలియవచ్చింది. ఎవరిని ప్రశ్నించి నా సంతృప్తికరమైన సమాధానం రాలేదు. శుక్రవారం ఉదయం కూడా మరో వాహనం రావ డం, మళ్ళీ బ్యాగులు లోనికి వెళ్లడం స్థానికుల దృష్టికి వచ్చింది. సందేహించిన జనం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో అధికారు లు లాడ్జికి బయల్దేరారు. కానీ ఈ సమాచా రం ముందే లాడ్జిలో ‘ముఖ్యులకు’ చేరింది. దాంతో వారు ఆఘమేఘాల మీద లాడ్జి నుంచి పలాయనం చిత్తగించారు. టీడీపీ కరపత్రాలు, ఎన్నికల ప్రచార సామాగ్రిని మాత్రం వదిలేశారు. గంటా, అవంతి లింక్? లాడ్జీలో అణువణువూ శోధించిన పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. నోట్ల కట్టలపై ఉండే లేబుల్స్ ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సందేహాలు కమ్ముకుంటున్నాయి. హడావిడిలో మరచిపోయిన సెల్ఫోన్ను పోలీసులు తనిఖీ చేసినట్టు తెలిసింది. అందులోంచి గంటాకు, అవంతికి గత రెండు రోజులుగా ఎక్కువసేపు కాల్స్ వెళ్లినట్టు పోలీసు వర్గాలు గుర్తించాయి. లాడ్జిలో మకాం వేసిన ఇద్దరి కోసం పోలీసులు వెదుకులాట మొదలు పెట్టారు. ఈ లోగానే గంటా వర్గీయుల నుంచి పోలీసులపై ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. స్థానికుల ఫిర్యాదుతో తనిఖీలు అనకాపల్లి రూరల్: పట్టణంలోని శ్రీనివాస లాడ్జిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి చెందిన వారు డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు రావడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. రెండురోజులుగా లాడ్జిలో ఈ తతంగం నడుస్తున్నట్టు స్థానికుల నుంచి ఫిర్యాదు అందడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలీసులు లాడ్జిలో సోదాలు నిర్వహించారు. ప్రతీ రూమ్లో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించారు. ఒక రూమ్ తాళాలు లేవని లాడ్జి సిబ్బంది బుకాయించారు. అయితే తాళాలు వెంటనే తెచ్చి రూమ్ను తెరవకపోతే లాడ్జిని సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో వెంటనే తాళాలు తెచ్చి రూమ్ను తెరిచారు. రూమ్లో తెలుగుదేశం పార్టీ కరపత్రాలు లభించాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు లాడ్జి సిబ్బందిని ప్రశ్నించగా రామారావు అనే వ్యక్తి పేరు మీద ఒకరు రూమ్ తీసుకున్నట్టు చెప్పారు. కేసు నమోదు గురించి సీఐ చంద్రను ప్రశ్నించగా, నగదు దొరకనందున కేసు నమోదు చేయలేదని చెప్పారు. దాడుల్లో ఎన్నికల నియమావళి అమలు సిబ్బంది బి. సత్యనారాయణ, బి. వెంకటేశ్వరరావు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ సిబ్బంది కె. రత్నాకర్, పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
వెలగపూడి సారాజిక సేవ
తూర్పులో సామాజిక సేవ ముసుగు మరోపక్క అక్రమ మద్యం వ్యాపారం విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు వెలగపూడి నిర్వాకాలపై జనం కన్నెర్ర విశాఖ రూరల్, న్యూస్లైన్: ఒక చేత్తో మంచినీరు .. మరో చేత్తో సారా తాగిస్తున్న నాయకుడాయన. సేవ ముసుగులో మద్యం వ్యాపారం చేస్తూ.. తెలుగుదేశం పార్టీ నేతగా ఎదిగారు. మద్యం సిండికేట్ గా అధిక ధరకు మద్యాన్ని విక్రయిస్తూ కుటుంబాలను విచ్చిన్నం చేస్తూ కోట్లు కూడబెట్టారు. ఆ డబ్బును ఇష్టానుసారంగా వెదజల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ హోదాతో సారా వ్యాపారాన్ని మరింత విస్తరించారు. వైన్షాపులు, బెల్టు షాపులు తెరిచి యువతను మద్యం మత్తులో ముంచుతున్నారు. ఆయన ఆగడాలు శ్రుతి మించడంతో మద్యం కేసులో ఏసీబీకి దొరికిపోయారు. ఆయనే తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన వెలగపూడి ఒకవైపు సేవా కార్యక్రమాలను చేస్తూనే.. మరోవైపు మద్యం వ్యాపారాన్ని విస్తరించారు. రెండు సొంత ట్యాంకర్లను ఏర్పాటు చేసి ఆరిలోవ, జాలారిపేట ప్రాంతాల్లో మంచినీటి సరఫరా చేస్తుంటారు. యువకులు, సంఘాలు చేపట్టే కార్యక్రమాలకు డబ్బులు అందజేస్తుంటారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. తాను ఉచితంగా నీటిని పంపిణీ చేస్తున్న ప్రాంతాల్లోనే మద్యాన్ని ఏరులై పారిస్తున్నారన్న విషయం ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది. సహాయం పేరుతో అందరికీ పంచిపెట్టిన సొమ్ము ఆయా ప్రాంతాల్లో మందుబాబుల నుంచే పిండుకుంటున్నారన్న విషయం ఏసీబీ మద్యం కేసు ద్వారా వెలుగులోకి వచ్చింది. సిండికేట్గా హవా ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత వెలగపూడి మద్యం సిండికేట్గా రెచ్చిపోయారు. శ్రీషిర్డీసాయి, శ్రీవిజయ వైన్స్ పేరుతో మద్యం అమ్మకాలు చేస్తుండడంతో ఎక్కడపడితే అక్కడ బెల్టు షాపులను ఏర్పాటు చేశారు. అధిక ధరకు విక్రయి స్తూ మందుబాబుల జేబులకు చిల్లులుపెట్టారు. తనకు వ్యతిరేకంగా మద్యం వ్యాపారం చేస్తున్న వారిపై అధికా దర్పాన్ని ప్రదర్శించారు. ఎమ్మెల్యే అండ చూసుకొని మద్యం వ్యాపారులు రెచ్చిపోయారు. పెదవాల్తేరు, ఆరిలోవ, జోడుగుళ్లపాలెంలో అనధికార బెల్టుషాపులు పుట్టుకొచ్చాయి. బీచ్లో అనుమతులు లేకుండానే దుకాణాలు తెరిచారు. రుషికొండ ప్రాంతంలో ఏకంగా గెడ్డ భూమిని ఆక్రమించి అక్కడ దాబా నిర్మాణానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఆ ప్రయత్నం వివాదాస్పదమవడంతో వెనక్కు తగ్గారు. ఒకవైపు బెల్టుషాపులను రద్దు చేస్తామని టీడీపీ అధ్యక్షుడు ఎన్నికల ప్రచారంలో ప్రకటనలు గుప్పిస్తూ.. వెలగపూడి లాంటి మద్యం వ్యాపారికి పార్టీ టికెట్ ఇవ్వడం పట్ల ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. చంద్రబాబు ఇచ్చే హామీలకు, చేసే కార్యక్రమాలకు పొంతన ఉండదని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొంటున్నారు. యువతను, కుటుంబాలను నాశనం చేస్తున్న మద్యం వ్యాపారులకు టికెట్లు ఇవ్వడం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నాయకులుఎమ్మెల్యే అయితే నియోజకవర్గంలో మందు కంటే మద్యం పారుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
బెదిరిస్తున్నారని ఫిర్యాదు
చిత్తూరు (క్రైమ్), న్యూస్లైన్: ‘నాకు ఓటు వేయలేదంటే నీతోపాటు మీ కుటుంబాన్ని హతమార్చుతానని’ ఎంపీటీసీ అభ్యర్థి బెదిరిస్తున్నారని నాగలాపురానికి చెందిన గురవయ్య అనే వికలాంగుడు డయల్ యువర్ ఎస్పీకు ఫిర్యాదు చేశాడు. బుధవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఎస్పీ బంగళాలో నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను సన్నిహితం సీఐ చిన్నగోవిందు స్వీకరించారు. సత్యవేడు మండలం నాగలాపురం ఎంపీటీసీ అభ్యర్థిగా మణి అనే అతను సీపీఎం తరఫున పోటీ చేస్తున్నాడని, ఓటు వేయకపోతే చంపుతానని బెదిరించాడని గుర వయ్య ఫిర్యాదు చేశాడు. రక్షణ కల్పించాలని డయల్ యువర్ ఎస్పీకు విన్నవించాడు. పలమనేరు సినిమా హాల్స్ ఓనర్లందరూ సిండికేట్గా మారి, రె ట్టింపు ధరలతో సినిమా టికెట్లను విక్రయిస్తూ ప్రేక్షకులను దగా చేస్తున్నారని ఫిర్యాదు అందింది. నగరి పట్టణంలో రికార్డులు లేని తమిళనాడుకు చెందిన వాహనాలు యథేచ్చగా తిరుగుతున్నాయని ఆ ప్రాంత వాసులు ఫిర్యాదు చేశారు. కుప్పం మండలంలోని కంగుంది, రామకుప్పం మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు మద్యం తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకొని కేసులు పెట్టకుండా వదిలేశారని ఫిర్యాదు అందింది. కలికిరి, రొంపిచెర్ల గ్రామాల్లో నాటుసారా విక్రయూలు జోరుగా సాగుతున్నాయని, రామకుప్పం వైన్షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. వీటితోపాటు సివిల్ తగాదాలు, కుటుంబ సమస్యలు తదితర వాటితో పాటు మొత్తం 20 ఫిర్యాదులు అందాయి. -
కాంగ్రెస్, బిజెపిలు సిండికేట్ అయ్యాయి: మమత
-
పల్లి.. లొల్లి
గిట్టుబాటు ధర కోసం ఆందోళన బాట కేసముద్రం మార్కెట్లో వ్యాపారుల సిండికేట్ ధర అమాంతంగా తగ్గించి కొనుగోళ్లు అధికారులను నిలదీసిన రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట మహిళల బైఠాయింపు నిలిచిపోయిన వేలం పాటలు కేసముద్రం, న్యూస్లైన్ : కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ రైతులు ఆందోళన బాటపట్టారు. పల్లి సీజన్ మొదలైనప్పటి నుంచి వ్యాపారులు సిండికేట్గా మారి ధరను అమాంతం తగ్గించి వేలం పాటలు నిర్వహిస్తున్నారని, అరుునా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఆరుగాలం శ్రమించి పండించిన పల్లికాయతో పలువురు రైతులు రెండు రోజుల క్రితం కేసముద్రం మార్కెట్కు వచ్చారు. ‘వ్యాపారులందరూ ఒక్కతీరుగా రేటు పెడతాండ్రని, ఆ రేటు తమకు గిట్టుబాటు కావడం లేదని... తమకు న్యాయం చేయాలి.’ అంటూ గురువారం మార్కెట్ను సందర్శించిన చైర్మన్ శశివర్ధన్రెడ్డి, ఏడీఎం సంతోష్కుమార్ను వారు వేడుకున్న విషయం తెలిసిందే. వ్యాపారులతో మాట్లాడి ధర పెట్టేలా చూస్తామని వారు చెప్పిన ప్పటికీ... శుక్రవారం కూడా అదేరీతిలో గరిష్ట ధర రూ.2600కు మించలేదు. దీంతో ఆగ్రహించిన రైతులు ఇంత తక్కువ ధర పెడతారా అంటూ వ్యాపారులను నిలదీశారు. మీ ఇష్టముంటే అమ్ముకోండి, లేకపోతే లేదని వారు నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఈ విషయూన్ని మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. గత ఏడాది రూ. ఐదు వేల వరకు కొని, ఇప్పుడు సగం ధరే పెడుతున్నారని గుర్తు చేశారు. మార్కెట్లో మీరందరూ ఉండి ఏం చేస్తున్నారని నిలదీశారు. కొందరు మహిళా రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట కూర్చుని ఆందోళన చేశారు. దీంతో సుమారు మూడు గంటలపాటు వేలం పాటలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో రైతు సంఘం నాయకులు గుజ్జునూరి బాబురావు, వీరభద్రయ్య, మదార్ అక్కడికి చేరుకుని మద్దతు ధర పెట్టాలని మార్కెట్ కార్యదర్శిని డిమాండ్ చేశారు. అనంతరం వారు వ్యాపారులతో సమావేశమై మళ్లీ వేలంపాటలు నిర్వహించాలని వారికి సూచించారు. వ్యాపారులు అంగీకరించడంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు. ఎట్టకేలకు సాయంత్రం వ్యాపారులు వేలం పాటలు ప్రారంభించారు. 14 వేల బస్తాల పల్లి అమ్మకానికి రాగా... కేవలం 9 వేల బస్తాలకు వేలం పాడారు. క్వింటాల్కు గరిష్ట ధర రూ.3,355, కనిష్ట ధర రూ.2,800 పలికినట్లు అధికారులు తెలిపారు. -
సిండికేట్పై పత్తి రైతుల ఆగ్రహం
పెద్దపల్లి రూరల్, న్యూస్లైన్ : వ్యాపారులు సిండికేట్గా మారి అన్యాయం చేస్తున్నారని పెద్దపల్లిలో పత్తి రైతులు సోమవారం రోడ్డెక్కారు. రాజీవ్హ్రదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రెండు బస్తాలు తెచ్చిన వారికి ఎక్కువ రేటు చెల్లించి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటూ ట్రాక్టర్లలో పత్తి తెచ్చిన రైతులను నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంట్లో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. వ్యాపారులు సిండికేట్గా మారి అన్యాయం చేస్తున్నా, మార్కెటింగ్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటపాటు రాస్తారోకో చేయడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సై కిశోర్ వచ్చి రైతులను సముదాయించారు. గతంలో జరిగిన చెల్లింపులను పరిశీలించి, అధికారులు, వ్యాపారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఎస్సై కిషోర్ రికార్డులను పరిశీలించి అధికారులు, వ్యాపారులతో మాట్లాడారు. రైతులకు నష్టం కలగకుండా చూడాలన్నారు. అనంతరం కొనుగోళ్లు జరిగాయి. ఆందోళనలో గుర్రాంపల్లి గ్రామానికి చెందిన పల్లె శ్రీనివాసరెడ్డి, మాజీ వార్డు సభ్యుడు తాడూరి శ్రీమాన్, రైతులు పాల్గొన్నారు. -
సిండి‘కేట్ల’ దోపిడీ రూ.1.08 కోట్లు
తాండూరు, న్యూస్లైన్: తాండూరు వ్యవసాయ మార్కెట్లో కంది రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్ యార్డులో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందడం లేదు. తమ పంటోత్పత్తికి మద్దతు ధర లభిస్తుందని ఆశగా తాండూరు మార్కెట్కు కందులు తీసుకొచ్చిన రైతులు ఈ సీజన్లో మొత్తంగా రూ.1.08 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. సిండికేట్గా మారిన వ్యాపారులు, దళారులు నాణ్యత పేరుతో కొర్రీలు పెట్టి ఇటు రైతును, అటు మార్కెట్ సెస్ను దోచుకుంటున్నారు. ఈ సీజన్లో కందులకు ప్రభుత్వం రూ.4,300 మద్దతు ధర నిర్దేశించింది. తాండూరు వ్యవసాయ మార్కెట్లో నవంబర్ 7 నుంచి కందుల క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు సుమారు 36 వేల క్వింటాళ్ల కందులను మార్కెట్లో వ్యాపారులు కొనుగోలు చేశారు. సీజన్ ప్రారంభంలో గరిష్టంగా రూ. 4,530, కనిష్టంగా రూ.4,200 ధర పలికింది. వ్యాపారులు నామమాత్రంగా గరిష్ట ధరకు కొనుగోలు చేసి, మిగిలిందంతా కనిష్ట ధరకే కొనుగోలు చేసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత మార్కెట్కు కందులు వెల్లువెత్తుతుండడంతో వ్యాపారులు సిండికేట్గా మారారు. ధరలను తగ్గించివేశారు. ప్రస్తుతం మార్కెట్లో గరిష్ట ధర రూ. 4,160 పలుకుతుండగా, కనిష్టంగా రూ.3,800గా ఉంది. సగటు ధర (మోడల్) సీజన్ ఆరంభం నుంచి ఇప్పటివరకు రూ. 4,000 వద్ద స్థిరంగా ఉంది. సగటు ధర ప్రకారం రూ.14.40 కోట్ల విలువ చేసే 36 వేల క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. అంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 4,300కు రూ.300 తగ్గించి కొనుగోలు చేశారు. ఈ లెక్కన క్వింటాకు రైతులు రూ.300 చొప్పున దాదాపు రూ.1.08 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. అంతేకాకుండా మార్కెట్ కమిటీకి వందకు రూపాయి చొప్పున రూ.1.08 లక్షల సెస్కు గండికొట్టారు. ఆందోళనలు చేసినా... కందుల కొనుగోళ్ల సీజన్ ఆరంభంలోనే జిల్లాలోని కోడంగల్, కోస్గి, దౌల్తాబాద్ గ్రామాలకు చెందిన రైతులు మార్కెట్ యార్డులో వ్యాపారుల సిండికేట్పై ఆందోళలనకు దిగారు. మద్దతు ధర చెల్లించకుండా కందులను కొనుగోలు చేస్తున్నా.. పట్టించుకోవడంలేదని అధికారులతో వాదనకు దిగారు. అయినా యార్డులో రైతులను పట్టించుకునే వారేలేకుండా పోయారు. తక్కువ ధరకు అమ్మక తప్పడం లేదు కందులకు ప్రభుత్వ మద్దతు ధర రూ.4,300 రావడం లేదు. నాణ్యతలేదని క్వింటాలుకు రూ.4వేల కన్నా ఎక్కువ ఇవ్వడం లేదు. ధర వచ్చే వరకు ఆగితే కుటుంబ అవసరాలు. సాగు కోసం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడం తదితర ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరకు అమ్ముకుంటున్నాం. - శివరాజ్, రైతు, చింతమణిపట్నం మా గోడు ఎవరూ పట్టించుకోరు ధర కోసం రోజుల తరబడి యార్డులో పంటను పెట్టుకోవడం సాధ్యం కావడం లేదు. మద్దతు ధర అడిగితే పంటను ఎవరూ కొనడం లేదు. మా గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. పంటను యార్డులో పెట్టినా ఆశించిన ధర రాలేదు. రూ.3,900 ధరకు రెండు బస్తాల కందులను విక్రయించాను. - వెంకటయ్య, రైతు, హస్నాబాద్ -
సిండికేటుగాళ్లు
కాట్రేనికోన, న్యూస్లైన్ : మద్యం వ్యాపారులు మందుబాబులను దోచే స్తున్నారు. సిండికేటుగా ఏర్పడి మద్యం అధిక రేట్లకు అమ్మి అక్రమంగా కోట్లకుకోట్లు మింగేస్తున్నారు. ప్రభుత్వాన్ని మోసం చేసి.. అధికారులతో కుమ్మక్కై మరీ దోపిడీ సాగిస్తున్నారు. కాట్రేనికోన మండలంలో చెయ్యేరు, కందికుప్ప, కాట్రేనికోనల్లో 9 లెసైన్స్ షాపులకు 8కి మాత్రమే టెండర్ వేశారు. ఓ షాపునకు టెండర్ వేయకుండా మద్యం వ్యాపారులు ముందే కుమ్మక్కయ్యారు. చెయ్యేరులో రెండు, కందికుప్పలో రెండు, పల్లంకుర్రులో ఒకటి, కాట్రేనికోనలో మూడు షాపులకు ప్రభుత్వం లెసైన్స్లు మంజూరు చేసింది. కాట్రేనికోనలో నాలుగు షాపుల్లో మూడింటికి మాత్రమే టెండర్లు వేశారు. మిగిలిన షాపునకు టెండరు వేయకుండా వ్యాపారులు జాగ్రత్త పడ్డారు. ఈ షాపునకు చెందిన మద్యం అమ్మకాలను మూడు షాపుల్లో గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. ఒక్కొక్క షాపునకు లెసైన్స్కు రూ.34 లక్షలు, షాపు పర్మిట్ కోసం రూ.2 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఏదైనా షాపునకు టెండర్ వేయని పక్షంలో ప్రభుత్వమే తమ సిబ్బందిని పెట్టి ఎంఆర్పీకే విక్రయించాలి. అయితే ముమ్మిడివరం ఎక్సైజ్ అధికారులు సిండికేట్ వ్యాపారుల నుంచి అందుతున్న నెలసరి ముడుపులతో కటాక్షించి టెండరుకు ఎవరూ రావడం లేదని, ప్రభుత్వం నిర్వహించేందుకు షాపులు దొరకడం లేదని సాకుగా చూపారు. అధికారుల కారుణ్యంతో ప్రభుత్వానికి లెసైన్స్, రూమ్ పర్మిట్ల రూపంలో రూ.36 లక్షల నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వం షాపును నిర్వహించి ఉంటే లెసైన్స్ సొమ్ము లాభాల రూపంలో ప్రభుత్వానికి, మందుబాబులకు ఎంఆర్పీకే మద్యం దొరికేది. అన్నిచోట్లా ఎంఆర్పీకి అమ్మకాలు సాగిస్తున్నా, కేవలం కాట్రేనికోనలో మాత్రమే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇష్టారాజ్యంగా విక్రయాలు పల్లంకుర్రు, కందికుప్ప, కాట్రేనికోనల్లో బాటిల్పై ఉన్న ఎంఆర్పీపై రూ.10, చెయ్యేరులో రూ.5 అదనపు ధరలకు విక్రయిస్తున్నారు. చీప్ లిక్కర్, మెన్సన్ క్లబ్లపై రూ.10, ఎంసీ, ఎంహెచ్, ఏసీపీ, బీరు తదితర బ్రాండ్లపై రూ.20 చొప్పున అదనపు రేట్లు వసూలు చేస్తున్నారు. బెల్టు షాపుల్లో వారి ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారు. రోజుకు సుమారు 300 కేసులకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. వీటి ద్వారా సుమారు రూ.లక్ష పైబడి మందుబాబుల నుంచి అదనంగా పిండేస్తున్నారు. ఏడాదికి సుమారు రూ.3 కోట్లు పైబడి అదనపు రేట్లతోనే వస్తుందని చెప్పుకొంటున్నారు. ఎక్కడ చూసినా బెల్టు షాపులే.. మండల గ్రామాల్లో తాగునీరు లేదేమో కాని మద్యానికి మాత్రం కొదవలేదు. మండలంలో 8 లెసైన్స్ షాపుల పరిధిలో సుమారు 350 బెల్ట్ షాపులు ఉన్నాయి. వీటిల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మత్స్యకార గ్రామం గచ్చకాయలపోర మినహాయించి మిగిలిన చోట్ల బెల్టు షాపులకు సైతం వేలం పాటలు నిర్ణయించి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. కొందరు ఎక్సైజ్, పోలీసు అధికారులకు నెలకు రూ.38,150లను మామూళ్లుగా ఇస్తున్నట్టు రాసిన ఓ కాగితం ఇటీవల ఓ బెల్టుషాపు వద్ద ‘న్యూస్లైన్’కు లభించింది. -
ఇసుక మేటలపై సిండి‘కేట్లు’
=నదీ పరివాహాక పొలాలపై కన్ను =తవ్వకాలకు రైతులచే దరఖాస్తు యత్నం సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఇసుక సిండికేట్లు అనుమతుల్లేకుండానే నదులను తవ్వేశారు. అడ్డొచ్చిన అధికారులపై దాడులకు సైతం దిగారు. రోజురోజుకి వీరి ఆగడాలు అధికమవ్వడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు నమోదుతో అడ్డగోలు తవ్వకాలను, అక్రమ రవాణాను కొంతమేరకు కట్టడి చేశారు. కానీ అక్టోబర్ వరదలకు ఇసుక మేటలేసిన పొలాలపై కన్నేశారు. సంబంధిత రైతుల్ని పావుగా వాడుకుని, వాటిలో తవ్వకాలకు అనుమతి తీసుకుని పక్కనున్న నదుల్లో ఇసుక దోచేందుకు పక్కా ప్లాన్ రూపొందించారు. తాండవ, గోస్తనీ, వరహా, శారదా తదితర నదుల్లో నిబంధనలకు లోబడి ఇసుక లేకపోవడంతో మూడేళ్లగా లీజులివ్వలేదు. కానీ ఇసుక సిండికేట్లు మాత్రం ఆగలేదు. అడ్డగోలు తవ్వకాలు, రవాణా చేసి కోట్లకు పడగెత్తారు. ఇదే సమయంలో అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలు వారికి బాగా కలిసొచ్చాయి. పొంగి పొర్లిన నదులు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితో నదీ పరివాహక ప్రాంతాల్లోని పొలాల్లో ఇసుక మేటలేర్పడ్డాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఇసుక అక్రమార్కులు రంగంలోకి దిగారు. నదీ పరివాహాక ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఇసుక మేటలేసున్నాయో ఇప్పటికే గుర్తించారు. వ్యవసాయ అధికారులు కూడా అధికారికంగా జిల్లాలో 120 హెక్టార్ల పొలాల్లో ఇసుక మేటలేసినట్టు నిర్ధారించారు. ఇప్పుడా రైతుల పేర్లును సేకరించే పనిలో పడ్డారు. ఆ రైతులకు ఎంతోకొంత ముట్టజెప్పి, వారి ద్వారానే పొలాల్లో ఇసుక తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దరఖాస్తులు చేయించేందుకు సన్నద్ధమవుతున్నారు. సాధారణంగా పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించి, తరలించేందుకు మండల అధికారుల ద్వారా అనుమతి తీసుకోవచ్చు. దీన్నే సిండికేట్లు అస్త్రంగా చేసుకుంటున్నారు. ఇసుక మేటల తొలగింపు అనుమతితో వాటి ముసుగులో పక్కనున్న నదుల్లోని ఇసుకను దోచేయడమే వారి వ్యూహంగా తెలుస్తోంది. అనకాపల్లి, చోడవరం, తగరపువలస కేంద్రాలుగా పావులు కదుపుతూ అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కొందరు అధికారులకు ముడుపులందించేందుకు లోపాయికారీగా ఇప్పటికే ఒప్పందాలు కూడా చేసుకున్నట్టు తెలిసింది. -
చక్కెర చిక్కులు
=క్వింటా రూ.2700లకు పడిపోయిన ధర =రూ. 25 కోట్లు కోల్పోతున్న నాలుగు సుగర్స్ =నష్టాల దిశగా జిల్లాలోని కర్మాగారాలు =రైతుకు గిట్టుబాటు ధరపైనా తీవ్ర ప్రభావం చోడవరం, న్యూస్లైన్: పడిపోయిన చక్కెర ధరలతో సుగర్ ఫ్యాక్టరీలన్నీ దివాలా తీసే పరిస్థితి దాపురించింది. దేశీయ మార్కెట్లోకి విదేశీ పంచదార భారీగా దిగుమతి కావడంతో ఇక్కడ పంచదారకు డిమాండ్ పడిపోయింది. దీంతో కర్మాగారాల్లో లక్షలాది టన్నుల పంచదార నిల్వలు పేరుకుపోయాయి. ధర పెరుగుతుం దన్న ఆశతో జిల్లాలోని చోడవరం, ఏటికొప్పా క, తాండవ, అనకాపల్లి సహకార చక్కెర ఫ్యాక్టరీల్లో సుమారు 5 లక్షల క్వింటాళ్ల నిల్వలు గోడౌన్లలో ఉన్నాయి. ఒక్క గోవాడలోనే రెండున్నర లక్షల క్వింటాళ్లు ఉన్నాయి. లెవీ ఎత్తేశారని ఆనందంగా ఉన్న కొద్ది రోజుల కే ఒకేసారి క్వింటాకు రూ.500ల వరకు పంచదార ధర తగ్గిపోవడంతో జిల్లాలోని నాలుగు ఫ్యాక్టరీలు సుమారు రూ.25 కోట్లు కోల్పోనున్నాయి. వాటి మనుగడపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది జూన్ వరకు క్వింటా రూ.3200లు అమ్మగా ఆ తర్వాత క్రమంగా రూ.2950 నుంచి ప్రస్తుతం 2700కు పడిపోయింది. దీని ప్రభావం ఒక్క ఫ్యాక్టరీలపైనే కాదు. రైతులకిచ్చే మద్దతు ధరపైన కూడా పడనుంది. 2012-13 సీజన్ చెల్లింపులకు ఫ్యాక్టరీలు రూ. కోట్లు అప్పులు చేశాయి. ధర పతనమై ఉన్న నిల్వలు అమ్ముడుకాకపోవడంతో ఆయా యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. అత్యధికంగా రూ.2300 వరకు మద్దతు ధర ఇచ్చిన చోడవరం వంటి ఫ్యాక్టరీ అయితే మరీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పంచదార వ్యాపారులు సిండికేట్ అయిపోయి దేశవ్యాప్తంగా ధరను తగ్గించడంతో పాటు దుంప, క్యారెట్ నుంచి తయారయ్యే నాసిరకం పంచదారను తక్కువ ధరకే దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎక్కడ చూసినా ఈ పంచదారే లభ్యమవుతోంది. విదేశీ చక్కెర దిగుమతిని నిలువరించకుండా టన్నుకు రూ.2125 కనీస మద్దతు ధరను ప్రకటించిన కేంద్రంపై దేశవ్యాప్తంగా ఇప్పటికే చక్కెర మిల్లర్లు ఎదురుతిరిగిన విషయం తెలిసిందే. చక్కెర నుంచి క్వింటా పంచదార తయారీకి సుమారు రూ.2900వరకు మిల్లర్లకే ఖర్చవుతోంది. అదీ రైతుకు టన్నుకు రూ.2100మద్దతు ధర ఇస్తే. ఇక పెరిగిన వ్యవసాయ పెట్టుబడుల రీత్యా ఈ మద్దతు ధర ఏ విధంగానూ రైతుకు గిట్టుబాటు కాదు. వచ్చే సీజన్లో కనీసం టన్నుకు రూ.2500 మించి ధర చెల్లించాల్సి ఉంది. అలాంటప్పుడు ఘోరంగా పడిపోయిన పంచదార ధరలతో ఎలా ఫ్యాక్టరీలను నడపాలని యాజమాన్యాలు, పాలకవర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఒక పక్క నిల్వలు పేరుకుపోగా మరో పక్క 2013-14సీజన్ క్రషింగ్ను గోవాడ, తాండవ ఫ్యాక్టరీలు గురువారం ప్రారంభించాయి. అప్పులతో అపసోపాలు పడుతూ నామమాత్రంగా నడుస్తున్న తుమ్మపాల, తాండవ సహకార చక్కెర కర్మాగారాలపై తగ్గిన ధరల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇవి మరింత నష్టాల్లో కూరుకుపోవడం తథ్యం. వీటిని మూసేసే పరిస్థితి. ధర ఇలాగే ఉంటే లాభనష్టాలు లేకుండా నడుస్తున్న ఏటికొప్పాక, చోడవరం ఫ్యాక్టరీలదీ దయనీయ దుస్థితి. దీనిపై వెంటనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని రైతులు, ఫ్యాక్టరీల యాజమాన్యాలు కోరుతున్నాయి. -
నేనింతే!
కర్నూలు, న్యూస్లైన్: సొంత శాఖ ప్రక్షాళనకు ఎస్పీ నడుంబిగించారు. ఈ విషయంలో ఆయన బదిలీకి కూడా వెనుకాడకపోవడం తెలిసిందే. తాను ఇబ్బందులు ఎదుర్కొన్నా.. సిబ్బందిని ఎవ్వరూ వేలెత్తి చూపకూడదనే ఉద్దేశం ఆయనది. ఆ దిశగానే ఆయన ముందుకు సాగుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. అలాంటి అధికారి ఆదర్శంగా ముందుకు సాగాల్సిన కింది స్థాయి ముఖ్య అధికారులు కొందరు మామూళ్ల మత్తు నుంచి బయటపడలేకపోతున్నారు. ఎవరెలా ఉన్నా.. మేమింతే అన్న రీతిలో దందా సాగిస్తున్నారు. అదీ జిల్లా కేంద్రంలోనే ఉంటున్న ఈ పెద్ద సారు ఎలాంటి జంకూబొంకూ లేకుండా చేయి చాస్తున్నారు. తనకు ఎస్పీ అండదండలు ఉన్నాయనే ప్రచారంతో వసూళ్లకు పాల్పడటం ఈయన ప్రత్యేకత. చోరీలు.. దోపిడీలు.. హత్యలు.. ఇలాంటి కేసులు ఏవైనా ఆయనకు ఆదాయ వనరులే. ఇటీవల ఓ గొలుసు దొంగను అరెస్ట్ చూపేందుకు రూ.30 వేలు ముడుపు తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. నగరంలో మద్యం సిండికేట్ నుంచి ప్రతి నెలా పోలీసులకు అందుతున్న మామూళ్లు రూ.4 లక్షలు కాగా.. ఈయన వాటాగా రూ.లక్ష అందుతున్నా రెట్టింపు చేయాలని ‘సిండికేట్’కు కొద్ది రోజుల క్రితం హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఇటీవల ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. పోలీసుల అనుమతి లేకుండా ఎలా నడుపుతావంటూ నిర్వాహకున్ని బెదిరించి రూ.60 వేల దాకా లాగినట్లు కింది స్థాయి సిబ్బంది ద్వారా తెలిసింది. దీపావళి సందర్భంగా బాణసంచా వ్యాపారుల నుంచి దుకాణానికి రూ.10వేలు చొప్పున ముడుపులు గుంజినట్లు సమాచారం. సొంత శాఖ సిబ్బందినీ వదలకపోవడం ఈ అధికారి ప్రత్యేకత. వారిపై వచ్చే అవినీతి ఆరోపణలు ఈయనకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. విచారణ పేరిట బెదిరించడం.. అనుకున్న మొత్తం ముట్టగానే తానున్నానని అభయమివ్వడం ఆయనకే చెల్లుతోంది. స్టేషన్ల తనిఖీల పేరుతో కూడా రూ.20వేల నుంచి రూ.25 వేల వరకు ఇవ్వనిదే వదలరని సమాచారం. అదేవిధంగా జిల్లాలోని ప్రజా ప్రతినిధుల మధ్య ఉన్న ఆధిపత్య పోరును కూడా ఈ అధికారి తనకు అనుకూలంగా మల్చుకున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ తన సీటుకు డోకా లేకుండా నెట్టుకొస్తున్నారు. ఎక్కడ నేరం ఉంటుందో.. అక్కడ అక్రమార్జనకు అవకాశం ఉంటుందని సూత్రంలో ఈయన ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ఎక్కడ విధి నిర్వహణలో ఉన్నా.. ముందుగా ఆయా ప్రాంతాల్లో జరిగే నేరాలు ఎలాంటివనే విషయంపైనే ఆరా తీస్తారనే పేరుంది.అప్పటి వరకు పని చేసిన అధికారి రేట్లకు రెట్టింపుతో తన దందా మొదలు పెడతాడనే గుర్తింపు ఈయన సొంతం. సాధారణంగా యథా రాజా తథా ప్రజ అంటారు. అయితే జిల్లా పోలీసు బాస్ నిజాయితీ, ముక్కుసూటి తనంతో ముందుకు సాగుతుండగా.. ఈ సారు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం కింది స్థాయి సిబ్బందిలో చర్చకు తావిస్తోంది. -
అన్నదాత ఆగ్రహం
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్లైన్:పచ్చి మిర్చి ధర తగ్గింపుపై అన్నదాతలు ఆగ్రహించారు. వ్యాపారులు సిండికేట్ అయి క్వింటాకు రూ.500 నుంచి 800 మాత్రమే చెల్లిస్తామని చెప్పడంతో రైతులు తిరగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి... ఖమ్మం బైపాస్ రోడ్లోని కూరగాయల మార్కెట్కు మన జిల్లాతో పాటు వరంగల్, నల్గొండ జిల్లాల రైతులు కూడా పచ్చిమిర్చి, కూరగాయలు తీసుకొస్తుంటారు. ఆదివారం పలువురు రైతులు పచ్చిమిర్చి తేగానే వ్యాపారులు క్వింటా రూ.1100 చొప్పున కొనుగోలు చేస్తామన్నారు. దానికి రైతులు అంగీకరించకపోవడంతో రాత్రి 7.30 గంటలకు పాట ఉంటుందని ప్రకటించారు. అయితే ఆ సమయానికి ముందే కమీషన్ వ్యాపారులు సిండికేట్ అయి క్వింటాకు రూ.500 నుంచి 800 వరకు మాత్రమే చెల్లిస్తామని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు ఇదేం అన్యాయమని వారిని నిలదీశారు. రూ.2500 ఉన్న ధరను అమాంతంగా తగ్గించారని మండిపడ్డారు. శనివారం క్వింటాకు రూ.2 వేల చొప్పున చెల్లించగా.. ఇప్పుడు మరీ తక్కువగా కొనుగోలు చేయడం ఏంటని ప్రశ్నించారు. దీనికి వ్యాపారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో కమీషన్ వ్యాపారుల దుకాణాలను మూసివేయించి, పక్కనున్న బైపాస్రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ధర గురించి వ్యాపారులతో మాట్లాడుదామని చెప్పడంతో రైతులు మార్కెట్కు తిరిగి వెళ్లారు. అయితే అప్పటికే అక్కడున్న కొందరు రైతులు కమీషన్ దుకాణాల ముందున్న విద్యుత్ లైట్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో మార్కెట్లో పనిచేసే కార్మికులకు రైతులకు మధ్య ఘర్షణ జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో టూటౌన్ ఎస్సై సత్యనారాయణ ఆందోళనకారుల్లో కొందరిని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. కమీషన్ వ్యాపారులకు ఫోన్ చేసి సరుకు కొనుగోలు చేయాలని సూచించారు. రూ.1000 చొప్పున కొనుగోలు... కాగా, వ్యాపారులు సిండికేట్ అయి క్వింటాకు రూ.1000 చొప్పున పచ్చిమిర్చి కొనుగోలు చేశారు. ఆ ధరకు ఇష్టం లేకున్నా తప్పని పరిస్థితిలో రైతులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంటికి తిరిగి తీసుకెళ్తే మిర్చి చెడిపోతుందని ఏదోఒక ధరకు విక్రయించామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారుల వైఖరిపై వారు తీవ్ర నిరసన తెలియజేశారు. కాగా అధివారం రాత్రి వరకు నలుగురు రైతులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. -
పలమనేరులో జోరుగా కల్తీ మద్యం
పలమనేరు, న్యూస్లైన్: ఎమ్మార్పీ ధరలతో మద్యం విక్రయాలు చేపడితే లాభాలు రావని తెలుసుకున్న వ్యాపారులు కల్తీపై దృష్టి పెట్టారు. పలమనేరు ప్రాంతంలో కల్తీ మద్యం వ్యాపారం మూడు ఫుల్లులు, ఆరు క్వార్టర్లుగా సాగుతోంది. కల్తీ మద్యం తయారు చేసేందుకు ప్రత్యేక కూలీల ను నియమించుకున్నారు. వారికోసం ప్రత్యేక గోడౌన్లు సైతం ఇక్కడ వెలిశాయి. మద్యం ప్రియులకు ఏ మాత్రం అనుమానం రాకుండా బాటిల్ను ఓపెన్ చేసి తిరిగి అలాగే సీల్ చేయడంలో వీరు సిద్ధహస్తులు. కొందరు మద్యం దుకాణ యజమానులే ఈకల్తీ మద్యాన్ని తయా రు చేస్తున్నట్టు సమాచారం. ఎక్సైజ్ అధికారులు తూతూమంత్రంగా నెలవారి తనిఖీలు చేపడుతూ వారి టార్గెట్ కోసం మద్యం వ్యాపారులకు సహకరిస్తూ ఈ వ్యాపారాన్ని మరింత ప్రో త్సహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలమనేరు పట్టణంతోపాటు మండలం, గంగవరం మండలాల్లో 12 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ రోజుకు 5,500 మద్యం బాక్సులు, 3 వేలకు పైగా బీర్ బాక్సుల వ్యాపా రం సాగుతోంది. ఈ దఫా రెన్యువల్స్కు నాలు గు దుకాణాలు ముందుకు రాలేదు. దీంతో ఎక్సైజ్ అధికారులే వారిని బుజ్జగించి దుకాణా లు కొనసాగించేలా చేశారు. మద్యం వ్యాపారం లో సిండికేట్ లేకపోవడం, ఎమ్మార్పీ ధరలకే విక్రయించాల్సి రావడంతో వీరికి లాభాలు రాకపోగా నష్టాలు వస్తున్నాయి. లాభం పొందాలనే ఉద్దేశంతో కల్తీకి సిద్ధపడ్డారు. మద్యం కల్తీ ఇలా.. పట్టణంలోని పలు మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం తయారీ కోసం రహస్య గోడౌన్లను ఏర్పాటు చేశారు. ఫుల్ బాటిల్ను ఏ మాత్రం అనుమానం రాకుండా ఓపెన్ చేసి అందులోంచి క్వార్టర్ మందును పక్కకు తీసి నీరు పోసి ప్యాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అన్ని రకాల బాటిళ్లను ఓపెన్ చేసి తిరిగి ప్యాక్ చేయడానికి ప్రత్యేక పరికరాలు, హీట్ మిషన్లను, ఇంజక్షన్లను వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పనులు చేయడానికి చేయి తిరిగిన పని వారు సైతం ఉన్నట్టు సమాచారం. వీరికి యజమానులే భోజనం పెట్టి రోజుకు రూ.500 కూలి ఇస్తున్నారు. ఇలా పక్కకు తీసిన మద్యాన్ని రకరకాల క్వార్టర్ బాటిళ్లలో నింపి ఎవరికీ అనుమానం రాకుండా తిరిగి కేసుల్లో నింపేస్తున్నారు. లిక్కర్ బాటిళ్లపై ఉన్న లేబుళ్లను సైతం అలాగే తీసి అంటిస్తున్నారు. పట్టణంలోని వీవీ మహాల్ ఎదురుగా ఈ కల్తీ వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యాన్ని ఎలా విక్రయిస్తున్నారంటే.. సేకరించిన కల్తీ మద్యాన్ని లూజ్ సేల్స్ రూపంలోనూ, బెల్టు షాపులకు అప్పుగానూ సంబంధిత యజమానులు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పలమనేరు పట్టణంలోని మూడు చోట్ల రోజుకు రూ.30 వేల దాకా కల్తీ మద్యా న్ని విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ లెక్కన ప్రతి నెలా లక్షలాది రూపాయల మద్యాన్ని వీరు అక్రమంగా విక్రయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఎక్సైజ్ అధికారులకు తెలియందేమీ కాదు పలమనేరు ప్రాంతంలో కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో ఈ మధ్య ఎక్సైజ్ ఏసీ నాగేశ్వరరావ్ దాడులు చేశారు. నాలుగు రోడ్లు వద్ద మద్యం దుకాణంలో భారీగా కల్తీ మద్యం సీసాలు పట్టుబడ్డాయి. వీటికి ఈఏఎల్ (ఎక్సైజ్ అదేసివ్ లేబుల్) లేకుండా ఉండడం, వాటి కింద రంధ్రాలు ఉండడం, బిరడాలు లూస్ కాబడి ఉండడాన్ని గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి మద్యాన్ని ల్యాబొరేటరీకి పంపారు. ఈ విషయమై పలమనేరు ఎక్సైజ్ ఎస్ఐ సందీప్ను ‘న్యూస్లైన్’ వివరణ కోరగా కల్తీ మద్యంపై తమకు సమాచారం ఉందన్నారు.