Taneti Vanita
-
‘జగనన్న చేసిన మంచి ప్రతి కుటుంబంలో ఉంది’
తూర్పుగోదావరి జిల్లా: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మంచి ప్రతి కుటుంబంలోనూ ఉందని మాజీ హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. జగనన్న పేదల గడపలకే సంక్షేమాన్ని చేర్చారని..కూటమి ప్రభుత్వం వచ్చాక అరాచకం దారుణంగా ఉందని, సోషల్ మీడియా కార్యకర్తలపై దాడి, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి వారి వాహనాల ధ్వంసం తప్పితే అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు.గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు.. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ హోం మంత్రి తానేటి వనిత, రాజమండ్రి పార్లమెంట్ కన్వీనర్ గూడూరు శ్రీనివాస్ లు పాల్గొన్నారు. జగనన్నను తలుచుకోని కుటుంబం లేదు‘ఎన్నికలు వచ్చేవరకు ప్రతి కార్యకర్త ఫైట్ చేస్తూనే ఉండాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న ఏ విధంగా ఇబ్బందిపడి బయటకు వచ్చారో అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 15 ఏళ్లు పూర్తయింది. కూటమి తొమ్మిది నెలల పాలనలో జగనన్నను తలుచుకోని కుటుంబం లేదు. కూటమి నాయకులు సైతం జగనన్నను తలుచుకుంటున్నారు. అందరూ కలిసి ఐక్యతతో జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ. తగిలిన గాయాలు, మనపై కట్టిన కేసులు అవి.. ఎవరు మర్చిపోవద్దు మనకి కూడా ఒక రోజు వస్తుంది. అప్పుడు కూటమి నేతలకు తిరిగి ఇస్తాం. పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి పాదాభివందనం. ప్రతి కార్యకర్తకు ఆడబిడ్డగా నేను అండగా ఉంటాను. జగనన్న చేసిన మంచి ప్రతి కుటుంబంలో ఉంది’ అని తానేటి వనిత పేర్కొన్నారు.జగన్ అంటేనే నిజం..వైఎస్ జగన్ అంటేనే నిజం అని అన్నారు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. జగన్ పాలనలో ఒక్క పైసా కూడా ఆశించకుండా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పని చేశారన్నారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వద్దని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబే చెబుతున్నారని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి స్వార్థంగా మాట్లాడిన వాడు చంద్రబాబు తప్ప ఇంకెవరూ లేరన్నారు. రాష్ట్ర సంపద పొందాల్సింది పేదవాడు. అది ఒక వర్గానికో ఒక పార్టీకో చెందటానికి మనం రాచరికంలో లేము. సంక్షేమ పథకాలు పొందాలంటే ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?, టీడీపీ, బీజేపీ, జనసేన, ఈనాడు, టీవీ 5, ఏబీఎన్ కలిసి ప్రజలను మోసం పోయేలా చేశారు. సూపర్ సిక్స్ అని అబద్ధపు హామీలతో గద్దెనెక్కినవాడు చంద్రబాబు.. ఎన్నికల ముందు రాష్ట్రంలో రూ. 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయన్నార చంద్రబాబు, పవన్, పురందేశ్వరీ. శ్వేతపత్రాలని కొన్ని రోజులు హడావుడి చేశారు. చివరకు మతాల మీదకు తెచ్చారు. లడ్డూలో కల్తీ అంటూ చంద్రబాబు ప్రమాదకరమైన ట్రోల్స్ చేశారు. ప్రతినెల డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు చేస్తున్నాడు. ఆరున్నర లక్షల కోట్లు అని చివరికి చెప్పక తప్పలేదు. సంపద సృష్టిస్తానంటూ అధికారం కోసం అబద్ధాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు. గత సంవత్సరం అమ్మబడి ఎత్తేశాడుఅన్నదాత సుఖీభవ అన్నాడు అది ఎత్తేశాడు. కేంద్రం ఇచ్చేవి కాకుండానే ప్రతి రైతుకు 20000 ఇస్తానన్నాడు. ఉచిత బస్సు లేదు.. మూడు గ్యాస్ సిలిండర్లు అన్నాడు ఒకటి ఇచ్చాడు. చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే 79 వేల కోట్లు కావాలి...?, మహిళలకు 15000 ఇస్తా అన్నాడు ఎలా మోసపోయారో వారికి చెప్పాలి .మేనిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాలను అమలు చేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్’ అని పేర్కొన్నారు. -
రఘురామ.. ఫ్లెక్సీ చింపి అంబేద్కర్ను అవమానిస్తారా?: తానేటి వనిత
సాక్షి, ఏలూరు: ఏపీలో కూటమి సర్కార్ వచ్చిన నాటి నుంచి అంబేద్కర్కు అవమానమే జరుగుతోందన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. కూటమి నేతలు అంబేద్కర్కు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదన్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీ చింపేసి అవమానించారని మండిపడ్డారు.మాజీ హోంమంత్రి తానేటి వనిత తాజాగా aమీడియాతో మాట్లాడుతూ.. గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమలలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడం బాధాకరం. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని తప్పకుండా శిక్షించాలి. కూటమి నేతలు అంబేద్కర్కు గౌరవం ఇవ్వడం లేదు. ఎమ్మెల్యే రఘురామ అంబేద్కర్ ఫ్లెక్సీ చించేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు కోరితే న్యాయం జరగలేదు. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ జగన్ నిర్మిస్తే.. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన పేరును తొలగించారు. అంబేద్కర్పై రాజకీయాలా?.అంబేద్కర్ విగ్రహం వద్ద లైట్లన్నీ ఆపేసి.. శిలాఫలకాలు పగలగొట్టారు. ఇప్పటి వరకూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్.. విగ్రహం వద్దకు వెళ్లి చూసింది లేదు. శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై కనీసం చర్యలు తీసుకోలేదు. ఇలాంటి అవమానకర ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా రిపీట్ కాకూడదని కోరుతున్నాను. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కేసులు పెట్టాలి.. వారికి శిక్ష పడాలని కోరుతున్నాం.సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కాలని చూస్తున్నారు. ఎక్కడా లేని విధంగా కొత్త చట్టాలు తీసుకువచ్చి వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు, దారుణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలి. అంతేకానీ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బంది పెట్టేందుకే పోలీసులను ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి నేతలకు అధికారం ఇచ్చింది.. ప్రజలకు మేలు చేయడానికి.. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి కాదు. ఢిల్లీలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచినా వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. -
‘కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణే లేదు’
గోపాలపురం(ప.గో.జిల్లా): గోపాలపురం మండలం హుకుంపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై టీడీపీ కార్యకర్త అత్యాచారానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం ఆమెను గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితురాలని మాజీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. అనంతరం తానేటి వనిత మాట్లాడుతూ.. టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు కేసును నీరుగార్చాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. చిన్న పిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. పోలీసులు సైతం అధికార పార్టీ నాయకులకే కొమ్ము కాస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత.. సరైన చర్యలు చేపట్టలేకపోతున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలి. వెంటనే బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలి’ అని వనిత డిమాండ్ చేశారు. -
ఉత్సవ విగ్రహాలలా పోలీసులు.. పవన్ కళ్యాణ్ ఇవి నీకు కనపడటం లేదా..?
-
నీ మాటలకు మహిళలు తల దించుకుంటున్నారు.. హోం మంత్రి అనితపై ఫైర్
-
వంగలపూడి అనిత మాటలు హాస్యాస్పదం: తానేటి వనిత ఫైర్
సాక్షి, పశ్చిమగోదావరి: ఏపీలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతుంటే అనిత ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులను స్వేచ్చగా పనిచేసుకోవానివ్వాలని కామెంట్స్ చేశారు.కాగా, తానేటి వనిత ఆదివారం తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ..‘మా పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హోంమంత్రి అనిత లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అనిత మాట్లాడే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆమె మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతుంటే అనిత ఎందుకు స్పందించడం లేదు. అనిత కూడా ఎమ్మెల్యేగా గెలిచాకే మంత్రి అయ్యారు. ఇంతకుముందు కూడా చంద్రబాబు కుప్పానికి ఎమ్మెల్యేనే.హోంమంత్రి అనిత మాట్లాడే మాటలకు మహిళలు తలదించుకుంటున్నారు. పోలీసులను స్వేచ్చను ఇచ్చి.. వారిని సక్రమంగా పనిచేసుకోనివ్వాలి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నేతలు దాడులు చేస్తుంటే మా పార్టీ వారిపైనే కేసులు పెట్టిస్తున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
కడుపు మంటతోనే టీడీపీ దాడులు
-
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను ఆమె డిజిపి దృష్టికి తీసుకొచ్చారు. చంద్రగిరి, గురజాల తాడిపత్రి గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు చేసిన హింసకాండ అంశాలపై డీజీపీతో ఆమె మాట్లాడారు.ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. టిడిపికి ఓటు వేయలేదు అన్న కారణాలతో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలపై టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకుల దాడులను స్థానిక పోలీసుల దృష్టికి తీసుకొచ్చినా స్థానిక పోలీసులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు డీజీపీకి తెలిపారు.దాడులకు పాల్పడ్డ నాయకులను, కార్యకర్తలను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఆమె కోరారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాలని డీజీపీని కోరారు. రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ నియమించిన భద్రతా వ్యవహారాల పరిశీలకుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సమాచారం ఉన్నట్లు హోం మంత్రి తెలిపారు. -
మళ్ళీ గెలిచేది జగనే.. ఓటు హక్కు వినియోగించుకున్న తానేటి వనిత
-
టీడీపీ దుష్ప్రచారాలపై తానేటి వనిత ఫైర్..
-
బాబు దుష్టపన్నాగమే ఇది.. ఏపీలో ఈసీ ఉండి ఏం లాభం?: వాసిరెడ్డి పద్మ
గుంటూరు, సాక్షి: ఎన్డీయే కూటమిలో ఉన్నంత మాత్రాన ఎన్నికల సంఘం తనను ఏమీ చేయదని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారా? అని నిలదీశారు వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ. నల్లజర్లలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపై టీడీపీ గుండాలు దాడికి యత్నించిన ఘటనపై బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ద్వారా పద్మ స్పందించారు. ‘‘టీడీపీ శ్రేణులు బరితెగించాయి. సాక్షాత్తూ దళిత హోంమంత్రి తానేటి వనిత మీద దాడికి యత్నించాయి. ఈ ఘటన వెనుక చంద్రబాబు దుష్టపన్నాగం ఉంది. దళితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా చంద్రబాబు వ్యవహరించారు. అసలు దళితులంటే ఎందుకంత చిన్నచూపు చంద్రబాబూ..?.ఒక రాష్ట్ర హోంమంత్రి.. అందునా మహిళ ప్రచారంలో ఉంటే దాడి చేయటం దుర్మార్గపు విషయం. ఇంటి మీదకు వెళ్లి మరీ ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఎన్డీయే కూటమిలో ఉన్నంత మాత్రాన ఈసీ ఏమీ చేయదని చంద్రబాబు భావిస్తున్నారా?. .. మహిళలకు సీఎం జగన్ అండగా నిలిచారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చారు. కానీ, చంద్రబాబు మహిళల మీద వివక్ష చూపుతున్నారు. ఇప్పటికే ఇంటింటి పెన్షన్లు నిలిపివేయించి.. అవ్వాతాతల ప్రాణాలు తీశారు. ఇప్పుడేమో దళితులు, మహిళల మీద దాడులకు తెగపడ్డారు... ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసినా స్పందించటం లేదంటే చంద్రబాబుకు ఎంత లెక్కలేని తనం?. ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోకపోతే అది ఉండీ ఏం ప్రయోజనం?. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పని చేయాలి’’ అని వాసిరెడ్డి పద్మ కోరారు. -
నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్
-
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
-
‘నన్ను కించపరుస్తూ గెలవాలనుకుంటున్నారా?’: మంత్రి తానేటి వనిత
తూర్పుగోదావరి, సాక్షి: నల్లజర్లలో టీడీపీ శ్రేణులు తనపై దాడికి యత్నించడంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. దళితురాలినైన తనను కించపరుస్తూ.. రౌడీయిజంతో గెలవాలనుకోవడం ఎంత వరకు సబబని ప్రత్యర్థులను ఆమె నిలదీశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గోపాలపురం నియోజకవర్గంలో పర్యటించాం. ఎన్నికల ప్రచారం ముగించుకుని స్థానిక నేత సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నాం. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. మా నేతలపై రాళ్లతో దాడి చేయడంతో పాటు వాహనాలను సైతం ధ్వంసం చేశారు. వందమంది ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి ప్రచార రథంపై ఉన్న బాక్సులను, అక్కడున్న బైకులను ధ్వంసం చేశారు.హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. దళితురాలినైన నన్ను కించపరుస్తూ.. రౌడీయిజం ప్రదర్శిస్తూ, దాడి చేసి గెలవాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్?. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రచార కార్యక్రమంలో మేము ముందు ఉండటం.. మాకు ప్రజల ఆదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారు. గోపాలపురంలో వైఎస్సార్సీపీ గెలవబోతుందనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ కడుపు మంటతోనే దాడులకు తెగబడ్డారు.టీడీపీ శ్రేణుల దాడుల్లో.. మా కార్యకర్తలు నలుగురికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. ఒకరికి తల పగలటంతో కుట్లు సైతం పడ్డాయి. టీడీపీ నేతలు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ.. దాడులు చేయిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. కేసు దర్యాప్తు చేస్తున్నారు అని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. -
పవన్, చంద్రబాబుపై తానేటి వనిత సెటైర్లు
-
దళిత మహిళకు రాజ్యాధికారం ఇచ్చింది జగనన్న ఒక్కడే
-
జగనన్నను అడిగే అక్కడికి వెళ్ళాను
-
తానేటి వనిత స్ట్రెయిట్ టాక్
-
సోషల్ మీడియా సైకోలు.. గీతాంజలి చేసిన తప్పేంటి?
టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకల టార్గెట్తో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. జగనన్న తన పేరిట ఇంటి పట్టా ఇచ్చారని, తన పిల్లల్ని చదివించుకోవటానికి అమ్మ ఒడి కూడా వస్తోందని పట్టలేని సంతోషంతో సంతోష పడిన గీతాంజలిని.. ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు చేసి వేధించారు. గీతాంజలి మృతిపై వైఎస్సార్సీపీ మహిళా నేతలు స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాక్షి, తాడేపల్లి: గీతాంజలి మృతికి టీడీపీ, జనసేన కార్యకర్తల ట్రోల్సే కారణమని అన్నారు హోంమంత్రి తానేటి వనిత. ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరిచామని తెలిపారు. కొంతమంది వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్స్పై నిఘా పెట్టామని చెప్పారు. గీతాంజలి ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని..సీఎం జగన్ వల్ల తన కుటుంబానికి జరిగిన మేలు గురించే మాట్లాడిందని తెలిపారు. అలాంటి సాధారణ గృహిణి మీద కూడా ట్రోల్స్ వేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని విమర్శించారు. గీతాంజలి మృతికి కారణమైన ఎవరినీ వదిలేది లేదని అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, దోషుల సంగతి తేల్చుతామని చెప్పారు. మరో మహిళపై ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతామని తెలిపారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం ప్రకటించినట్లు పేర్కొన్నారు. పచ్చపార్టీలను తరిమికొట్టాలి టీడీపీ, జనసేన శ్రేణులు గీతాంజలిపై దారుణంగా మాట్లాడారని మంత్రి రోజా పేర్కొన్నారు. గీతాంజలిపై అమానుషంగా మాట్లాడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఐటీడీపీ, జనసేన హద్దుల్లో ఉంటే బాగుంటుందని హితవు పలికారు. మహిళలు ఘాటుగా స్పందించి పచ్చపార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీల తీరును ఖండిస్తున్నా గీతాంజలి మరణం చాలా బాధాకరమని బొత్స ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలిని ప్రతిపక్షాలు వేధించడం దుర్మార్గ చర్చ అని మండిపడ్డారు. ఆమె మరణానికి టీడీపీ, జనసేన వేధింపులే కారణమని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. గీతాంజలి మృతికి కారణమైన వారికి కఠిన శిక్ష పడాలని కోరారు. సీఎం దృష్టికి తీసుకెళ్లాం.. గీతాంజలి మృతి చాలా దురదృష్టకరమని అన్నారు మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ. గీతాంజలి ఘటనను ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లినట్లు చెప్పారు. గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సోషల్ మీడియా సైకోలను విడిచిపెట్టకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతాంజలి మృతిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్లు స్పందించాలని డిమాండ్ చేశారు. టీడీపీ,జనసేన కార్యకర్తల వేధింపులను ప్రభుత్వం, మహిళాలోకం సీరియస్గా తీసుకుంటుందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి పొందిన మేలును చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా అని అన్నారు. గీతాంజలి మృతికి ప్రధాన కారణమైన అజయ్ సజ్జాను విడిచిపెట్టకూడదని అన్నారు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి. అజయ్ సజ్జాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గీతాంజలిని సోషల్ మీడియాలో వేధించి చనిపోయేలా చేశారని మండిపడ్డారు. మహిళలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు, టీడీపీ వాళ్లు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. -
సీఎం వైఎస్ జగన్ గురించి హోంమంత్రి తానేటి వనిత గొప్ప మాటలు
-
మాజీ సీఎం చంద్రబాబుకు హోంమంత్రి తానేటి వనిత ఓపెన్ ఛాలెంజ్
-
చంద్రబాబుకు ఇదే నా ఓపెన్ ఛాలెంజ్
సాక్షి, ఏలూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ సీఎం చేయని రీతిలో దళారి వ్యవస్థ లేకుండా ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేశారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. వాలంటరీ సచివాలయ వ్యవస్థ ద్వారా వారింటికి సంక్షేమం చేరటంతో ప్రజలు సంతోషిస్తున్నారని తెలిపారు. ద్వారకాతిరుమల మండలంలో కార్యకర్తలు, నాయకుల ఆత్మీయ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడారు. జగనన్నకు ఓటు వేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ఎంతమందితో కలిసి వచ్చినా భయపడేది లేదని అన్నారు. ప్రజలు జగనన్నను ముఖ్యమంత్రిగా చేసేందుకు డిసైడ్ అయిపోయారని పేర్కొన్నారు. ‘చంద్రబాబుది విజన్ అయితే.. 2019లో ఎందుకు అది పాయిజన్ అయిందో చెప్పాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు. అమ్మ ఒడి పథకాన్ని గతంలో ఎందుకు పెట్టలేదు. రెండువేల పైచిలుకు వ్యాధులకు ఆరోగ్య శ్రీలో చికిత్స ఎందుకు ఇవ్వలేదు. చంద్రబాబు విజన్ అంటే దోచుకోవడం దాచుకోవడమేనా?. నేను చంద్రబాబుకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.. కొవ్వూరు నియోజకవర్గంలో ఏ ఇసుక ర్యాంపు నుంచైనా నాకు నెలకు, సంవత్సరానికి గాని ఎవరైనా ఒక్క రూపాయి అయినా నాకు ఇచ్చారనీ నిరూపిస్తే రాజకీయాల నుంచి నేను వైదొలుగుతా’ అని తానేటి వనిత తెలిపారు. అలాగే.. గోపాలపురం నియోజవర్గం అనేది తన స్వస్థలమని తెలిపారు. తన తండ్రి బాబాజీ రావు ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. ప్రజలకు తాను సుపరిచితురాలనేనని.. తనకు పుట్టింటికి వచ్చినట్లుందని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. -
సోషల్ జస్టిస్ కి రోల్ మోడల్ సీఎం జగన్..
-
ఆవిష్కరణకు సిద్ధమైన సామాజిక న్యాయ మహాశిల్పం
-
ఎల్లో మీడియాపై హోంమంత్రి తానేటి వనిత మండిపాటు
-
కొవ్వూరు రైల్వేస్టేషన్లో రైళ్లను పునరుద్ధరించాలి: తానేటి వనిత
సాక్షి, విజయవాడ: కరోనా సమయంలో లాక్ డౌన్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా కొవ్వూరు రైల్వేస్టేషన్లో రద్దు చేసిన రైళ్లును పునరుద్దరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కోరారు. శనివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ను విజయవాడలో కలిసి ఈ మేరకు ఆయా రైళ్ల వివరాలను ప్రత్యేక లేఖ ద్వారా ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కొవ్వూరు రైల్వేస్టేషన్లో రెగ్యులర్గా నిలుపుదల చేయవలసిన రైళ్లను నిలుపుదల చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. హైదరాబాద్, మద్రాసు, బెంగుళూరు, తిరుపతి వెళ్లే ప్రయాణికులు రైళ్లు నిలుపుదల చేయకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని, వ్యయ ప్రయాసలకు గురై రాజమహేంద్రవరం వెళ్లి రైళ్లు ఎక్కవలసి వస్తుందన్నారు. ప్రజలశేయస్సు దృష్ట్యా కొవ్వూరు స్టేషన్లో కొవిడ్ కారణంగా రద్దుచేసిన రైళ్లును పునరుద్ధరించాలని కోరారు. సదరు విజ్ఞప్తిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి కొవ్వూరు నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను తొలగించాలని నిర్మలా సీతారామన్ ను హోంమంత్రి తానేటి వనిత కోరారు. కొవ్వూరు రైల్వేస్టేషన్ కొవ్వూరు, పోలవరం, గోపాలపురం మొత్తం మూడు నియోజకవర్గాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటుందని వివరించారు. కరోనా లాక్ డౌన్ అనంతరం 4 రైళ్లను మాత్రమే పునరుద్దరించారని.. మరో 9 రైళ్లను పునరుద్దరించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరులో పునరుద్దరించాల్సిన రైళ్ల జాబితాను అందజేశారు. పునరుద్దరించాల్సిన రైళ్లలో విజయవాడ వైపు, విశాఖపట్నం వైపు తిరిగే రైళ్లున్నాయి. తిరుమల ఎక్స్ ప్రెస్ (17488, 17487), సర్కార్ ఎక్స్ ప్రెస్ (17644, 17643), బొకారో ఎక్స్ ప్రెస్ (13351, 13352), కాకినాడ-తిరుపతి ఎక్స్ ప్రెస్ (17250, 17249), సింహాద్రి ఎక్స్ ప్రెస్ (17240, 17239), తిరుపతి-పూరి ఎక్స్ ప్రెస్ (17479, 17480), మచిలీపట్నం-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ (17220, 17219), రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ (17244, 17243), బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్ (17482, 17481) రైళ్లకు కొవ్వూరు రైల్వేస్టేషన్ లో ఆగేవిధంగా పునరుద్దరించాలని హోంమంత్రి అందజేసిన లేఖలో పేర్కొన్నారు. హోంమంత్రి విజ్ఞప్తి పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైళ్లు నిలుపుదల పునరుద్ధరణకు తన వంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. -
చంద్రబాబు దళితులను ఎంత అవమానించాడో: తానేటి వనిత
-
తణుకులో కదం తొక్కిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, భీమవరం/తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కదం తొక్కారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో తాము సాధించిన సాధికారతను ఎలు గెత్తి చాటారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నేతృత్వంలో వేల్పూరు రోడ్డులో యాత్ర ప్రారంభమై నరేంద్ర సెంటర్ వరకు సాగింది. బస్సు యాత్రకు నియోజకవర్గం, పరిసర ప్రాంతాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరి బాణసంచా, పూలవర్షంతో బ్రహ్మరథం పట్టారు. తణుకు సెంటర్లో వేలాది జనం సమక్షంలో జరిగిన సభలో మంత్రులు, నేతలు ప్రసంగించారు. రామోజీకి ఎందుకింత కడుపుమంట? : మంత్రి జోగి రమేష్ బడుగు, బలహీన వర్గాలు సాధించిన సామాజిక సా«దికారతను ఓ వేడుకలా నిర్వహిస్తూ చేపట్టిన సాధికార బస్సు యాత్రలపై రామోజీరావుకు ఎందుకింత కడుపు మంట అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక సాధికార సభలో ఆయన మాట్లాడుతూ.. సభ మొదలవ్వడానికి కొన్ని గంటల ముందు ఖాళీ కుర్చీల ఫొటోలు తీసి, సభ అయిపోయి జనాలు వెళ్లాక ఖాళీ కుర్చీ ఫొటోలు తీసి జనాలు రాలేదంటూ రామోజీరావు, రాధాకృష్ణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై అక్కసుతో విషపు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. వెనుక బడిన వర్గాల వారిని చట్ట సభలకు పంపించి వారిని ధైర్యంగా నిలబడేలా చేసింది సీఎంజగన్ మాత్రమేనన్నారు. పేదవాడికి చదువు, వైద్యం అందించిన ఘనత జగన్కు దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. సీఎం జగన్ అందించిన సంక్షేమంలో 80 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దకిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. రూపాయి అవినీతికి తావు లేకుండా లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేశారన్నారు. గత ప్రభుత్వాలు అన్నీ కలిపి 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే, ఒక్క జగన్ హయాంలోనే 2.70 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, వీటిలో 76 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వచ్చాయని తెలిపారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ద్వారానే సాధ్యమైందన్నారు. ఈ సమవేశంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీలు మార్గాని భరత్, నందిగం సురేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్పై దేశవ్యాప్తంగా నమ్మకం: అలీ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ చేసిన మేలుకు సూచనగా ఇప్పు డు చేస్తున్నవి యాత్రలు మాత్రమేనని, 2024లో జాతర జరగబోతోందని, ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా) అలీ చెప్పారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో మోత మోగించిన సీఎం జగన్.. ఈ సారి 175కి 175 నియోజకవర్గా లనూ కైవసం చేసుకుంటారని తెలిపారు. సీఎం జగన్పై అందరికీ అపార నమ్మకం ఉందన్నారు. ఆ నమ్మకంతోనే వైజాగ్ సమ్మిట్కు అదాని, అంబానీలతో సహా దిగ్గజ పారిశ్రామికవేత్తలు వచ్చి ఏపీలో పరిశ్రమలు ఏర్పా టు చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల ప్రతి కుటుంబంలో ఒక్క ఉద్యోగం వచ్చినా ఆర్థికంగా ఆ కుటుంబం నిలదొక్కుకుంటుందని, ఇదంతా సీఎం సుపరిపాలనతోనే సాధ్యమైందన్నారు. -
నిజాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది..
-
మహేంద్ర మృతిపై సీఐడీ విచారణ
కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ఫ్లెక్సీ వివాదంలో మనస్తాపంతో బొంత మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనపై సీఐడీ ద్వారా సమగ్ర విచారణ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ప్రకటించారు. మహేంద్ర మృతి అనంతరం జరిగిన పరిణామాలు తనను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయన్నారు. వైఎస్సార్సీపీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తనపైన, ప్రభుత్వంపైన దురుద్దేశంతో బురదజల్లుతున్నారని అన్నారు. మంత్రి శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘పెనకనమెట్టలో 13వ తేదీన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉండగా జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి భర్త పోసిబాబు ఫోన్లో మాట్లాడారు. ఆయన సోదరుడి కుమారుడు మహేంద్రను పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. వెంటనే స్టేషన్కి ఫోన్ చేయించి మహేంద్రను ఇంటికి పంపమని సూచించాను. తర్వాత మహేంద్రను ఇంటికి పంపారు. మహేంద్ర పురుగుమందు తాగినట్లు తర్వాత రోజు తెలిసింది. మహేంద్ర చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులతో నేనే మాట్లాడాను. తర్వాత విజయవాడ తీసుకెళ్లినట్లు ఎవరూ చెప్పలేదు. 15వ తేదీ ఉదయం ఏలూరు రేంజ్ డీఐజీ ఫోన్ చేసి మహేంద్ర మృతి విషయం చెప్పారు. మహేంద్ర కుటుంబం ఏమీ చెప్పకపోయినా నేనే చొరవ తీసుకుని చేయగలిగిన సాయమంతా చేశాను. మహేంద్ర మృతదేహం వచ్చే సమయానికి నాయకులతో కలిసి అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా కొందరు యువకులు మోటారు సైకిళ్లపై వచ్చి నా కాన్వాయ్పై రాళ్లు, సీసాలు, కర్రలతో దాడులు చేశారు’ అని చెప్పారు. తానేదో పోలీసుల్ని ఆర్డర్ చేసి మహేంద్రను ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలు చేస్తున్నారని, నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హోంమంత్రి చెప్పారు. మహేంద్ర మృతిలో నిజాలు నిగ్గుతేలాలంటే సీఐడీ విచారణ చేయించాలని తాను సీఎం వైఎస్ జగన్ను కోరానని, వెంటనే చేయిస్తానని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. -
జైల్లో ఖైదీలకు ఉద్యోగాలు..మంత్రి తానేటి వనిత గొప్ప ఆలోచన
-
తానేటి వనిత ఇంట్లో దీపావళి సంబరాలు
-
చంద్రబాబు దళిత వ్యతిరేకి
కొవ్వూరు: టీడీపీ అధినేత చంద్రబాబే పెద్ద దళిత వ్యతిరేకి అని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. టీడీపీ హయాంలో దళితులపై ఎన్నో అరాచకాలు, దాడులు జరిగాయని.. కానీ చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పంచాయితీలు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కంచికచర్ల ఘటనలో నిందితులను అరెస్టు చేసినా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన శ్యామ్కుమార్పై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులను 48 గంటల్లోనే అరెస్టు చేసి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు. అయినప్పటికీ టీడీపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. విద్యార్థుల గొడవకు రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. గతంలో సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అంటూ అవహేళన చేశారని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలను దళిత జాతి ఎప్పటికీ మరచిపోదన్నారు. చంద్రబాబు పాలనలో దళితులపై ఎన్నో అరాచకాలు, దాడులు, అత్యాచారాలు జరిగాయని.. మహిళా ప్రజాప్రతినిధులపై దాడులకు ఒడిగట్టారని గుర్తు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దళిత మహిళ కడుపుపై బూటు కాలుతో తన్నారని, అటువంటి నీచ సంస్కృతి టీడీపీదేనని విమర్శించారు. ఇప్పుడు రాజకీయ స్వప్రయోజనాల కోసం దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సీఎం జగన్పై బురద జల్లడం వంటి నీచ రాజకీయాలు మానుకోవాలని వనిత హితవు పలికారు. -
రాష్ట్రంలో శాంతిభద్రతలు భేష్
అనంతపురం క్రైం: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గనిర్దేశంలో పోలీస్ శాఖ అద్భుతంగా పనిచేస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలను సమర్థవంతంగా పరిరక్షిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో ట్రైనింగ్ పూర్తిచేసుకున్న 28 మంది ప్రొబేషనరీ డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ను సోమవారం పీటీసీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హోం మంత్రి తానేటి వనిత, డీపీజీ రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. హోంమంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా రాష్ట్రంలో మహిళల భద్రత, రక్షణ కోసం సీఎం జగనన్న ‘దిశ’యాప్ తీసుకొచ్చి పోలీస్స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దిశ యాప్ ద్వారా 30,500 మంది మహిళలు సహాయం పొందారని చెప్పారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పోలీసు శాఖలోకి నూతనంగా ప్రవేశిస్తున్న డీఎస్పీలు నిజాయితీగా, సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా సేవలందించాలని సూచించారు. డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ సైబర్ నేరాల నియంత్రణ, సోషల్ మీడియా పోకడలను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. పోలీసులు ఒత్తిడికి లోనుకాకుండా బాధితులకు సకాలంలో సేవలందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతపురం పీటీసీ ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ గీతాదేవి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ఎస్పీలు కేకేఎన్ అన్బురాజన్, మాధవరెడ్డి, తాడిపత్రి బెటాలియన్ కమాండెంట్ గంగాధర్ రావు, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
ఏపీ పోలీస్ దేశానికే ఆదర్శం: తానేటి వనిత
సాక్షి, అనంతపురం: ఏపీ పోలీస్ దేశానికే ఆదర్శమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. పోలీస్ శిక్షణా కళాశాలలో సోమవారం.. డీఎస్పీల పాసింగ్ ఔట్ పేరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, సీఎం జగన్ నాయకత్వంలో శాంతి భద్రతలు బాగున్నాయన్నారు. సీఎం ఆదేశాలతో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. దిశా యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని, సీఎం జగన్ ఏపీ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశారని హోంమంత్రి అన్నారు. మహిళల అదృశ్యంపై నిర్లక్ష్యం వహించొద్దు: డీజీపీ ప్రజలతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు ముందుకెళ్లాలని డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి సూచించారు. మహిళల అదృశ్యంపై నిర్లక్ష్యం వహించొద్దని, ఫిర్యాదు వచ్చిన వెంటనే సీరియస్గా స్పందించాలన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. చంద్రబాబు లేఖ వ్యవహారంపై సమగ్ర విచారణ చంద్రబాబు లేఖ వ్యవహారంపై స్పందించిన డీజీపీ.. మీడియాతో మాట్లాడుతూ, దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు. నిజానిజాలు తేలిన తర్వాతే చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదు. భువనేశ్వరి యాత్రపై టీడీపీ నేతలు అనుమతి కోరలేదు. టీడీపీ ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం లేదు’’ అని డీజీపీ స్పష్టం చేశారు. చదవండి: ఉత్తరం.. ఉత్తదే చంద్ర'లేఖ'లో ఇంద్రజాలం! -
అమరవీరులకు నివాళులు అర్పించిన మంత్రి తానేటి వనిత
-
సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరించాలి
మంగళగిరి: సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరించాలని.. అప్పుడే నిజాలు బయటకు వస్తాయని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. చంద్రబాబుపై నమోదైన కేసుల్లో తీవ్రత ఉంది కాబట్టే ఆయనకు బెయిల్ రావడం లేదని స్పష్టంచేశారు. మంగళగిరిలోని ఆరో ఏపీ ఎస్పీ బెటాలియన్లో మంగళవారం జరిగిన జాగిలాల ప్రదర్శనకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోంమంత్రి మాట్లాడుతూ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని చెబుతున్న ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు.. బాబు తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నారని గుర్తు చేశారు. చంద్రబాబును మోయడం తప్ప పవన్ కళ్యాణ్కు మరే ఎజెండా లేదన్నారు. మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, ఏపీఎస్పీ బెటాలియన్ ఆవరణలో 21వ జాగిలాల ప్రదర్శనలు నిర్వహించారు. అధికారుల శిక్షణలో ప్రతిభ కనబరిచిన పలు జాగిలాలు, వాటి శిక్షకులకు మెమొంటోలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. -
పవన్ మాట్లాడిన తీరు కూడా అసలు బాగాలేదు: తానేటి వనిత
-
ఏపీ జైళ్ల శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
దొండపర్తి(విశాఖదక్షిణ)/ఆరిలోవ(విశాఖ తూర్పు)/కొవ్వూరు: ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్మెంట్, ఏపీ జైళ్లశాఖ సంయుక్తంగా విశాఖపట్నంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అన్ని రాష్ట్రాల జైళ్ల అధిపతుల 8వ జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జైళ్ల శాఖలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రధానంగా వర్చువల్ విధానంలో కోర్టు కేసుల విచారణను ప్రారంభించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిందని చెప్పారు. ఖైదీలను దండించడానికే కాకుండా జైళ్లలో వారి సంక్షేమానికి కూడా చర్యలు తీసుకోవడం మంచి పరిణామమని ప్రశంసించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఖైదీలకు కార్పొరేట్ వైద్యంతోపాటు శిక్ష పూర్తయిన అనంతరం వారి జీవనోపాధికి ఉపయోగపడేలా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుండటం మంచి ఆలోచన అని అన్నారు. ఇటువంటి సంస్కరణలతో ఖైదీల్లో పరివర్తనతోపాటు పునరావాసానికి అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ బాలాజీ శ్రీవాత్సవ్, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీ‹Ùకుమార్ గుప్తా, అన్ని రాష్ట్రాల జైళ్ల అధిపతులు పాల్గొన్నారు. జైలులో చంద్రబాబుకు పూర్తి భద్రత: హోంమంత్రి వనిత రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబుకు పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. జైలులో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఉన్నాయని, అక్కడ చంద్రబాబుకు ఎలాంటి ప్రాణహాని లేదని స్పష్టంచేశారు. ఆయన భద్రత పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. చంద్రబాబు కుంభకోణాలు వరుసగా బయటపడుతున్నప్పటికీ ఇంకా ఆయన నిప్పు అంటూ ప్రజలను నమ్మించాలని టీడీపీ నేతలు, పచ్చమీడియా అష్టకష్టాలు పడుతున్నట్లు ఎద్దేవా చేశారు. ఇన్ని కుంభకోణాలకు పాల్పడిన బాబు నిప్పా? అని ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. స్కామ్లన్నీ బయటపడితే టీడీపీ ఉనికి కోల్పోతుందనే భయంతో లోకేశ్, బాలకృష్ణ, పవన్కళ్యాణ్ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు. -
చంద్రబాబు భద్రత ప్రభుత్వం బాధ్యత: హోంమంత్రి
సాక్షి, విశాఖపట్నం: తనను అరెస్ట్ చేయాలని లోకేష్ పదేపదే చెప్పనక్కర్లేదని.. నేరం రుజువైతే అరెస్ట్ తప్పదని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు కోసం చట్టాలు, జైలు రూపొందించలేదన్నారు. జైళ్లలో అన్ని రకాల నేరస్తులు ఉంటారు. రాజమండ్రి జైలుల్లో చంద్రబాబుకు పూర్తి భద్రత కల్పించాం.. ఆయనకు ఇంటి భోజనం కూడా అందిస్తున్నారు. మావోయిస్టుల నుంచి జైలులో చంద్రబాబుకు ఏ ఇబ్బంది లేదు.. ఆయన భద్రత ప్రభుత్వం బాధ్యత. లోకేష్, పవన్, బాలకృష్ణ వారి పని వారు చేసుకోవచ్చు’ అని తానేటి వనిత అన్నారు. ‘‘రోడ్డెక్కి ప్రజలను రెచ్చగొడితే చర్యలు తప్పవు. చంద్రబాబు ఉన్న గది పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. చంద్రబాబు అనుమతితోనే ఎవరినైనా ఆయన వద్దకు పంపించడం జరుగుతుంది. చంద్రబాబు సామాన్య వ్యక్తి కాదు... 14 ఏళ్ల సీఎం.. సాక్ష్యాలు లేకుండా అతన్ని సీఐడీ అరెస్టు చేయదు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న సాక్ష్యాలు ఉండబట్టే ఆయన్ను సీఐడీ అరెస్టు చేసింది’’ అని హోంమంతి పేర్కొన్నారు. ‘‘జైళ్ళలో ఉద్యోగుల కేడర్ బట్టి విధులు కేటాయించడం జరుగుతుంది.. అంతేగాని బంధుత్వం బట్టి జరగదు.. నంద్యాల నుంచి సుఖంగా చాపర్లో తీసుకువెళ్తామని సీఐడీ చెప్తే వినకుండా రోడ్డు మార్గంలో ప్రజల్ని రెచ్చగొట్టేందుకు చంద్రబాబు వచ్చారు. టీడీపీ నాయకులు కావాలనే అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ చెప్పే మాటల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ప్రమేయం లేదని ఉందా?. పోలీసులు సంయమనంతో ఉండడంవల్ల ఏపీలో శాంతియుతంగా ఉంది. స్కిల్ కుంభకోణంలో కేవలం చంద్రబాబు నాయుడు రిమాండ్కి తీసుకున్నారు. విచారణకు చంద్రబాబు సహకరిస్తే అసలు విషయాలు బయట పడతాయి’’ అని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. చదవండి: లోకేష్కు కోపం వస్తే లోకం వణికిపోతుందా? -
త్వరలో లోకేష్ అరెస్ట్..? మంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు
-
బాబు కుంభకోణాలన్నీ బయటకొస్తాయి
కొవ్వూరు/ఆరిలోవ (విశాఖ తూర్పు): చంద్రబాబు అవినీతి కుంభకోణాలన్నీ బయటకొస్తాయని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. నేరం చేసి జైలుకు వెళ్లిన చంద్రబాబునాయుడుకి విధేయులుగా ఉన్న కొందరు చట్టాన్ని తప్పుపట్టటం సరికాదని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు స్పష్టమైన సాక్ష్యాదారాలున్నందునే న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించిందని చెప్పారు. చంద్రబాబు జైలుకెళ్లడం పట్ల ప్రజలు సంతోషంతో ఉన్నారని, అందుకే టీడీపీ చేపట్టిన బంద్లో ప్రజలు పాల్గొనలేదని తెలిపారు. విశాఖపట్నంలో సోమవారం ప్రారంభమైన జైళ్లశాఖ జాతీయ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతోను, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ‘సాక్షి’తోను మాట్లాడారు. నేరం చేసినవారు ఎంతటివారైనా చట్టం దృష్టిలో సమానులేనని చెప్పారు. టీడీపీ నాయకులు, కొన్ని చానళ్లు, పత్రికలు చట్టాన్ని, న్యాయవ్యవస్థను తప్పుపట్టడం మంచిది కాదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.371 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తే, దాన్ని రాజకీయ వైరంగా చిత్రీకరించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. రాజధానికి వేలాది ఎకరాల భూముల సేకరణ విషయంలో బినామీల పేరుతో చంద్రబాబు రూ.వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. తెలంగాణలో ఓటుకి కోట్లు కేసులో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయాడన్నారు. రాజధానిలో అసైన్డ్ భూముల కుంభకోణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల వారి భూములను చంద్రబాబు, ఆయన మనుషులు దోచుకున్నారని చెప్పారు. ఏపీ ఫైబర్నెట్ కుంభకోణంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుతో పాటు రామోజీ కొడుకు వియ్యంకుడు ఆర్.వి.ఆర్.రఘు కేంద్ర ఐటీశాఖ అధికారులకు దొరికిపోవడం వలన రాజధాని కుంభకోణాలు విచారించడానికి వీల్లేదని వాదిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఐటీశాఖ చంద్రబాబుకి అవినీతిపై నోటీసులిస్తే పచ్చమీడియా నోరు మెదపడం లేదన్నారు. రూ.2 వేలకోట్ల లావాదేవీలు చేశారని, చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ప్రధాన నిందితుడని ఐటీశాఖ సాక్ష్యాధారాలతో నోటీసులిచి్చనా విచారణగానీ, అరెస్ట్గానీ చేయకూడదా.. అని ప్రశ్నించారు. ఇంతకాలం చంద్రబాబు దేశంలో వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ, స్టేలు తెచ్చుకుంటూ కాలం గడిపారని చెప్పారు. చంద్రబాబు వేలకోట్ల అవినీతికి పాల్పడుతూ దుష్టచతుష్టయానికి వాటాలు పంచుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్తో అవినీతి భాగస్వాముల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. అవినీతికి పాల్పడిన కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ప్రతీకారంతో చేశారంటూ టీడీపీ, జనసేన, పచ్చమీడియా ప్రజలను నమ్మించేందుకు అష్టకష్టాలు పడుతున్నట్లు ఎద్దేవా చేశారు. అవినీతి డొంక కదిలింది ఇంతకాలం చంద్రబాబు రాజకీయాలను వ్యాపారంగా మార్చుకుని అవినీతి సామ్రాజ్యాన్ని నడిపారని హోంమంత్రి వనిత అన్నారు. ఇప్పుడు చంద్రబాబు అవినీతి డొంక కదిలిందని, ఒక్కో కుంభకోణం బయటపడుతుందని చెప్పారు. ఈ వ్యవహారంలో లోకేశ్పైన కూడా అనుమానాలున్నాయని, సీఐడీ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రజాజీవనానికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలో 144 సెక్షన్ విధించినట్లు చెప్పారు. దీనిపై పోలీసులు బాధ్యతాయుతంగా వ్యహరించారని ఆమె పేర్కొన్నారు. -
బాబు అవినీతి అనకొండ
కొవ్వూరు: చంద్రబాబు ఒక అవినీతి అనకొండ అని, ఆయన పాలనంతా అవినీతిమయమని.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సూత్రధారిగా ఉండి రూ.371 కోట్లు స్వాహా చేశారని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత విమర్శించారు. ఆయన పాలనలో చోటుచేసుకున్న కుంభకోణాలు ఒక్కొక్కటిగా నిరూపణ అవుతుండడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. చంద్రబాబును అరెస్టుచేయడం ఏదో నేరమన్నట్లు రాద్ధాంతం చేసిన ప్యాకేజీ స్టార్ పవన్కళ్యాణ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. ఆదివారం ఆమె ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే... చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ.. వాస్తవాలను దాచిపెట్టి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాన్ని పవన్ మానుకోవాలి. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి. లేకుంటే ప్రజలే ఛీదరించుకునే పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు అరెస్టును తప్పుపట్టిన పవన్ రోడ్డుపై పడుకుని ఓవర్యాక్షన్ చేశారు. ఇక చంద్రబాబు ఒకరితో ఒప్పందం చేసుకుని మరో సంస్థకు నిధులు మళ్లించారు. 2014–19 మధ్య ఒక్క స్కిల్ స్కాంలోనే ఇంత దోపిడీకి పాల్పడగా, అమరావతి రాజధాని పేరుతో రూ.వేల కోట్ల దోపిడీకి తెగబడ్డారు. కేవలం ఐదేళ్లలోనే ఇంత అవినీతికి పాల్పడిన చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన కాలంలో ఇంకెంత అవినీతికి పాల్పడి ఉంటారో అర్థంచేసుకోవచ్చు. చంద్రబాబు అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలి. వారంతా ఇప్పుడేం సమాధానం చెబుతారు? ఇక నోటీసు ఇవ్వకుండా అరెస్టుచేశారని ఒకసారి, గవర్నర్కు సమాచారం లేకుండా అరెస్టు చేశారని మరోసారి, ప్రభుత్వ కక్ష సాధింపులో భాగంగా అరెస్టు చేశారని ఇంకోసారి రకరకాల డ్రామాలాడిన టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులు ఇప్పుడేం సమాధానం చెబుతారు? దొంగే దొంగా దొంగా అన్నట్లుగా చంద్రబాబు ఇన్నాళ్లూ తన అవినీతి సామ్రాజ్యాన్ని నడిపారు. ఇప్పుడు ఆధారాలతో సహా దొరికిపోయేసరికి ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి కక్ష సాధింపు అంటూ ప్రజలను నమ్మించేందుకు లోకేశ్, ఆయన కుటుంబ సభ్యులు తాపత్రయపడుతున్నారు. అవినీతికి పాల్పడిన నేరారోపణపై చంద్రబాబు జైలుకు వెళ్తుంటే దానిని కూడా రాజకీయ లబ్దికోసం వినియోగించుకోవడానికి టీడీపీ పాకులాడుతోంది. ఆధారాలతో అడ్డంగా దొరికిపోయినా దత్తపుత్రుడు మాత్రం తన ప్యాకేజీ సొమ్ము కోసం చంద్రబాబును సమర్థిస్తున్నాడు. ఎన్టీఆర్ను మానసిక క్షోభకు గురిచేసి, ఆయన ఆత్మక్షోభకు కారకుడైన చంద్రబాబు ఇన్నాళ్లకు ఫలితం అనుభవిస్తున్నాడు. ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని నీచ పదజాలంతో దూషించిన టీడీపీ నాయకులు ఇప్పుడు చంద్రబాబు అవినీతిపై ఏ సమాధానం చెబుతారు?. -
నోటీసులిచ్చాకే చంద్రబాబు అరెస్టు
కొవ్వూరు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాతే అరెస్టు చేశారని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. అంతా చట్టప్రకారమే జరిగిందని.. ఈ విషయంలో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కుంభకోణాన్ని గత ప్రభుత్వ హయాంలోనే గుర్తించారని పేర్కొన్నారు. అవినీతి చేయడం వల్లే.. చంద్రబాబు ఇటీవల అరెస్ట్ పేరుతో సానుభూతి డ్రామా మొదలుపెట్టారని చెప్పారు. ఆయన అరెస్టును బీజేపీ నేత పురందేశ్వరి ఖండించడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్షాపై రాళ్లు వేయించి, ప్రధాని మోదీని తిట్టిన వ్యక్తులను సమర్థిస్తున్నారా? అని పురందేశ్వరిని ప్రశ్నించారు. ఆమె బీజేపీకి నిబద్ధతగా ఉంటున్నారో? లేదంటే తన మరిది చంద్రబాబుతో కలిసిపోయారో చెప్పాలని హోం మంత్రి తానేటి వనిత డిమాండ్ చేశారు. చంద్రబాబు కేసులో ఈడీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు తప్పు చేశాయని బీజేపీ నేతగా పురందేశ్వరి చెప్పాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఈ స్కామ్పై ఇన్నాళ్లూ నోరు మెదపని జనసేన అధినేత పవన్కళ్యాణ్.. ఈరోజు చంద్రబాబుకు అండగా ముందుకు రావడాన్ని వనిత తప్పుబట్టారు. ఈ కుంభకోణంలో మీకు అందుతున్న ప్యాకేజీ ఎంతని పవన్ను ప్రశ్నించారు. సమావేశంలో పశ్చిమ గోదావరి జెడ్పీ వైస్ చైర్పర్సన్ పోసిన శ్రీలేఖ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు మన్నె పద్మ, గండ్రోతు అంజనీదేవి తదితరులు పాల్గొన్నారు. -
పురంధేశ్వరి బంధుత్వానికి నిబద్ధతతో ఉన్నారా?: తానేటి వనిత
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు నాయుడు అరెస్టులో ఎలాంటి రాజకీయ దుర్ధేశం, కుట్రలు లేవని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. సీఐడీ అధికారులు నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అరెస్ట్ చేసిన తర్వాత నంద్యాల నుంచి విజయవాడకు హెలికాప్టర్లో తరలిస్తామని సీఐడీ అధికారులు చెప్పినా బాబు మాట వినలేదని అన్నారు. ఆయన ఎందుకు నిరాకరించారో అందరకీ ఇప్పుడు అర్థం అవుతుందన్నారు. ‘స్కిల్ డెవలప్మెంట్ సంస్థలో జరిగిన స్కామ్ను మొదట గుర్తించింది 2017లో అంటే గత ప్రభుత్వంలోనే. ప్రతిపక్షాలుఅనవసర రాద్దాతం చేయాలని చూస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ ఆయన చేసిన తప్పిదాల వల్ల జరిగింది. రాజకీయ కుట్రలు చేసేది టీడీపీనే అందరూ గమనించాలి. చంద్రబాబు నాయుడు తప్పు చేశారని ఆయనకు తెaiసు కాబట్టే గత మూడు రోజులుగా సానుభూతి కోసం పాకులాడారు. పురందేశ్వరి అరెస్ట్లను ఏ విధంగా ఖండిస్తారో సమాధానం చెప్పాలి. పురందేశ్వరి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు..? అమిత్ షా పై రాళ్లు వేయించిన.. మోదీని తిట్టించిన వారిని ఆమె సమర్థిస్తుందా..? పురందేశ్వరి పార్టీకి నిబద్దతతో ఉన్నారా..? లేక బంధుత్వానికి నిబద్ధతతో ఉన్నారా..? ఈడీ, జీఎస్టీ వంటి కేంద్ర సంస్థలు తప్పు చేశాయని బీజేపీ చెప్పదల్చుకుందా..? సమాధానం చెప్పాలి. ఇన్నాళ్లు మాట్లాడని పవన్ .. ఈ రోజు ముందుకొచ్చారు.. అంటే ఈ స్కాంలో పవన్కు అందుతున్న ప్యాకేజీ ఎంత?’ అని మంత్రి తానేటి వనిత ప్రశ్నించారు. చదవండి: చంద్రబాబు అరెస్ట్ అక్రమం కాదు.. అనివార్యం: మంత్రి అంబటి అధికారం చేపట్టిన రెండు నెలలకే ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి ఈ విధంగా ఆర్థిక నేరం చేయడం ఏంటని స్పీకర్ తమ్మినేని సీతారం విస్మయం వ్యక్తం చేశారు. చట్టానికి ఎవరూ చుట్టం కాదని, మొత్తం కేబినెట్ను తప్పుదోవ పెట్టి 3 వందల కోట్లు కాజేశారని అభియోగాలు రుజువు కావడంతో అరెస్టు జరిగిందన్నారు. అధికారం చేపట్టిన రెండు నెలలకే ఈ స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో కేబినెట్ను పక్కదోవ పట్టించారని తెలిపారు. పాలన అంటే పారదర్శకంగా ఉండాలని.. అన్ని అధికారాలను ఓవరూల్డ్ చేసి ఈ సెల్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారని స్పీకర్ తెలిపారు. సీమెన్స్ నుంచి ఒక్క పైసా కూడా రాకుండా 371 కోట్లు ఎలా విడుదల చేశారని ప్రశ్నించారు. ఆర్థిక అధికారులు కొర్రి పెడితే చంద్రబాబు స్వయంగా వెంటనే విడుదల చేయాలని అప్పట్లో ఆదేశించారని గుర్తు చేశారు. చదవండి: ‘చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపు చర్యగా కనిపించడం దౌర్భాగ్యం’ లూటీ చేయటంలో నైపుణ్యం: ఆదిమూలపు సురేష్ చంద్రబాబు ఆర్ధిక నేరస్తుడని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యం అందిస్తానని ఆశ చూపి వారి డబ్బును లూటి చేయటంలో నైపుణ్యం చూపించాడని విమర్శించారు. అమరావతి నిర్మాణం, పేదలకు ఇళ్లనిర్మాణం, నిరుద్యోగ యువతకు నైపుణ్యం ముసుగులో ప్రజాధనాన్ని లూటీ చేయటంలో నైపుణ్యం చూపించాడని దుయ్యబట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, జీఎస్టీ, ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే అన్ని ఆధారాలు బయటపెట్టి ఇందులో ప్రమేయం ఉన్న కొందరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 18 కేసుల్లో స్టే చంద్రబాబు తప్పుడు దారిలో ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కోట్లు దోచుకున్నారు. తప్పు చేశారు కనుకే తలదించుకుని సీఐడీ వెంట వెళ్ళారు. ఇప్పటి కే చంద్రబాబు 18కేసులకు స్టే తెచ్చుకున్నారు. రాష్ట్రాని కాపాడుకుంటానని యాత్రలు చేసే చంద్రబాబు రాష్ట్రాని దోచ్చుకున్నారు. ఇప్పుటికే చేలా కేసులు చంద్రబాబు పై సిద్దంగా ఉన్నాయి. ఆయన అనేక సార్లు అరెస్టు చేయాల్సి ఉంటుంది. యువగళంలో టీడీపీ హింసను ప్రేరేపిస్తుంది. రాజధాని భూముల కేసులో కూడ చంద్రబాబు అరెస్టు అవుతారు. -ఎమ్మెల్యే ఎలిజా కామెంట్స్ ఆలస్యంగా అరెస్ట్ చేసినందుకు విచారిస్తున్నాం చంద్రబాబు నాయుడు 2014 అధికారం చేపట్టిన వెంటనే అక్రమాలకు, అవినీతికి శ్రీకారం చుట్టారు. అన్ని రకాలుగా అవినీతి అక్రమాలలో దొరికిపోయాడు. సిల్క్ డెవలప్మెంట్ సంబందించి 371 కోట్ల రూపాయలకు స్కామ్ జరిగింది. చంద్రబాబు ప్రభుత్వంలో విచారణ జరుగుతుండగా అడ్డుకోవడం జరిగింది. చంద్రబాబు ఎటువంటి తప్పుచేసినా పవన్ ప్రశ్నించడు. ఆధారాలు చూపించకుండా అరెస్ట్ చేస్తారా అని వింత ప్రశ్న వేస్తున్నాడు. అవినీతి, అక్రమాలలో పవన్కు భాగస్వామ్యం ఉంది. చంద్రబాబు నాయుడుని ఇంత ఆలస్యంగా అరెస్ట్ చేసినందుకు విచారిస్తున్నాం. -ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్కాం చేయలేదని బాబు చెప్పడం లేదు చంద్రబాబు అరెస్టులో ఎలాంటి కక్షసాధింపు లేదు. చంద్రబాబు అరెస్టుతో వైసీపికి ఎలాంటి సంబంధం లేదు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని యువతకు నమ్మబలికి స్కాం చేశారు. ఒక కంపెనీతో ఒప్పందం, మరో కంపెనీకి నిధులు నిచ్చారు. రూ.371 కోట్లను కొల్లగొట్టారు. ఈ కేసులో ఈడీ కూడా నలుగురిని అరెస్టు చేసింది. ఆ నలుగురూ తామువతీసుకున్న డబ్బంతా చంద్రబాబుకు పంపామని చెప్పారు. అంటే స్కాంలో అసలు సూత్రధారి చంద్రబాబే. తాను స్కాం చేయలేదని చంద్రబాబు కూడా చెప్పటంలేదు. అంటే భారీగా కుంభకోణం జరిగినట్టు ఆయన కూడా నిర్ధారించారు. ఈ స్కాంలో డబ్బంతా చంద్రబాబుకు వచ్చేసింది. నిజంగా చంద్రబాబు నిప్పు ఐతే ఇన్ని స్కాంలు ఎలా చేశారు? ఎల్లోమీడియాని అడ్డం పెట్టుకుని నిజాలను అబద్దాలుగా మార్చలేరు. కక్షసాధింపు ఐతే ఎన్నికలకు ముందు ఎందుకు అరెస్టు చేస్తాం?. ఇప్పుడు అరెస్టు చేయగానే టీడీపీ తెగ హడావుడి చేస్తోంది. కోర్టులో బెయిల్ వస్తే ఒకరకంగా, రాకపోతే ఇంకోరకంగా డ్రామాలు చేయటానికి చంద్రబాబు ప్లాన్ వేశారు. అమరావతి కేసులు, టిట్కో ఇళ్లు, రింగురోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసులు కూడా విచారణ జరుగుతాయి. చట్టం తన పని తాను చేసుకు పోతుంది. వ్యవస్థలను మేనేజ్ చేసి ఇంతకాలం చంద్రబాబు కథ నడిపించారు. ఇకమీదట అలా నడవదు. తప్పు చేసినవారికి శిక్ష తప్పదు - ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ -
లోకేష్ యువగళం పాదయాత్రపై హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు
-
చంద్రబాబు ఏ1గా కేసు నమోదు చేస్తాం
రాజమహేంద్రవరం రూరల్: పుంగనూరులో రెచ్చగొట్టేలా మాట్లాడి విధ్వంసానికి కారకుడైన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏ1గా కేసు నమోదు చేస్తామని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసులపై టీడీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ముందే నిర్ణయించిన షెడ్యూల్ రూట్లో వెళ్లకుండా, ఎందుకు పుంగనూరులోకి ప్రవేశించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇది శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలనే కుట్రేనని అన్నారు. బీరు బాటిళ్లు, రాళ్లు, కర్రలు వారికి అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ఈ ఘటనలో పోలీసులు సహా 50 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయన్నారు. గాయపడిన పోలీసులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. పోలీసులు సంయమనంతో వ్యవహరించారని చెప్పారు. పోలీసులపై దాడి, పోలీసు వాహనాల విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 40 మందిని అదుపులోకి తీసుకున్నామని.. సీసీ పుటేజ్, ఇతర ఆధారాలు పరిశీలిస్తున్నామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. -
అధికారం కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు...!
-
నియోజక వర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించిన తానేటి వనిత
-
మైనర్పై అఘాయిత్యం.. బాధిత కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం
సాక్షి, కృష్ణా జిల్లా: పామర్రు మండలం నిభానుపూడికి చెందిన మైనర్ బాలిక కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. అత్యాచారానికి గురై బలన్మరణానికి పాల్పడ్డ బాలిక కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు హోంమంత్రి తానేటి వనిత, మంత్రి జోగి రమేష్, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ సోమవారం బాలిక కుటుంబాన్ని పరామర్శించి.. ప్రభుత్వం తరపున ఆమె తల్లిదండ్రులకు పదిలక్షల రూపాయల చెక్కును అందజేశారు. బాధాకరమైన ఘటనలు రాజకీయం చేయొద్దు! హోంమత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. మైనర్ బాలిక అత్యాచారానికి గురవ్వడం, ఆమె చనిపోవడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి పరిస్థితులు మరెవరికీ రాకూడదని విచారం వ్యక్తం చేశారు. ఈ కేసును పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారని తెలిపారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, విచారణ పూర్తయ్యాక నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఇలాంటి బాధాకరమైన ఘటనలను అనవసరంగా రాజకీయం చేయొద్దని కోరారు. వేగంగా స్పందించిన సీఎం ఏ కుటుంబంలో ఇలాంటి దురృష్టకర సంఘటన జరగకూడదని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. త్వరతగతిన విచారణ పూర్తిచేసి నిందితులకు శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బాలిక మృతి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించారని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పేర్కొన్నారు. వెంటనే పదిలక్షల రూపాయలు సహాయం ప్రకటించడంతో పాటు హోంమంత్రిని పంపించారని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సీఎం జగన్ ఆదేశాలిచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు, మైనర్ బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరపున, స్థానిక ఎమ్మెల్యేగా తాను అండగా ఉంటామని.. నేరం చేసిన వారు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్ష పడేలా చేస్తామని తెలిపారు,. బాలిక మృతిపై సమగ్ర దర్యాప్తు పామర్రుకు బాలిక ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కృష్ణా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ను ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై వార్తా పత్రికలలో వెలువడిన కథనాలను సుమోటోగా స్వీకరించినట్టు ఆమె తెలిపారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేట్టాలని కోరారు. ఈ సందర్భంగా కేసు విచారణా వివరాలను ఎస్పీ మహిళా కమిషన్ చైర్ పర్సన్కు వివరించారు. సీసీటీవీ ఫుటేజ్ వివరాలను వెల్లడించారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని 15 రోజులలో చార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తామని వాసిరెడ్డి పద్మకు సీపీ తెలిపారు. నిందితులకు కరిన శిక్ష పడే వరకు విచారణ వేగవంతంగా పూర్తిచేయాలని వాసిరెడ్డి పద్మ కోరారు. కేసును చేధించిన పోలీసులు పామర్రు మండలంలో మైనర్ బాలిక మృతి కేసును పోలీసులు చేధించారు. అత్యాచారం చేయడం వల్లే అవమానంతో బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. నిమ్మకూరు హైస్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న నిభానుపూడి గ్రామానికి చెందిన బాలిక (14)ను.. ప్రేమపేరుతో లోకేష్ (20) అనే యువకుడు దగ్గరయ్యాడు. ఈనెల 20వ తేదీన స్కూల్కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బాలిక బయటకు వచ్చింది. అయితే స్కూల్కు వెళ్లకుండా లోకేష్తో ఉయ్యూరు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఉయ్యూరులోని ఓ లాడ్జిలో తన బంధువైన నరేంద్రతో కలిసి బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు లోకేష్. అత్యాచారం తర్వాత బాలికను నిభానుపూడి సమీపంలో వదిలిపెట్టాడు. అయితే అవమానం భరించలేక కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది బాలిక. అదే రోజు తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల అరెస్ట్ నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. బాలిక మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే 8 బృందాలతో దర్యాప్తు చేపట్టామన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కాలువలో మైనర్ బాలిక మృతదేహం లభ్యమైంది. నిందితులు లోకేష్, నరేంద్ర, రాజేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల పై 376(B),376(VA),342, ఐపీసీ సెక్షన్,13 పోక్సో, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుల పై రౌడీ షీట్లు తెరుస్తామని ఎస్పీ జాషువా తెలిపారు. అతి త్వరలో ఛార్జిషీట్ నమోదు చేసి నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
వలంటీర్ల పై పవన్ కళ్యాణ్ పిచ్చి కూతలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హోం మంత్రి తానేటి వనిత
-
మంత్రి తానేటి వనితతో సాక్షి స్ట్రెయిట్ టాక్
-
‘దళితులకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఆదుకున్నది మా ప్రభుత్వమే’
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: దళితులపై అత్యాచారాలు,హత్యలు అంటూ ఈనాడులో ప్రచురించిన వార్తలపై హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు.దళితులకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా వెంటనే ఆదుకున్నది తమ ప్రభుత్వమేనని తానేటి వనిత స్పష్టం చేశారు. దళితులకు అత్యధిక భద్రత కల్పిస్తుంది కూడా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని హోంమంత్రి మరోసారి గుర్తు చేశారు. ‘దళితులపై దాడులు జరిగిన ఘటనలకు సంబంధించి వెను వెంటనే చర్యలు తీసుకున్నాం. బాధితులకు న్యాయం జరిగేలా చేసాం. ఈ విషయాలు ఈనాడుకు పట్టవా... వాటిని ఎందుకు ప్రచురించడం లేదు?, చంద్రబాబు హయాంలో ఎన్నో దారుణాలు జరిగాయి అప్పుడు దళితులపై జరిగిన దాడులకు సంబంధించి పచ్చ మీడియా ఎందుకు ప్రశ్నించలేదు. టిడిపి హయాంలో దళితులపై దాడులకు సంబంధించి రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది. దళితులను అన్ని రకాలుగా ఆదుకున్నది సీఎం జగనన్నే అని చెప్పడంలో సందేహమే లేదు. రాజకీయంగా ,సామాజికంగా ఎన్నో అవకాశాలు కల్పించారు. దళితులకు అత్యధిక భద్రతను కల్పిస్తుంది కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. నాలాంటి సాధారణ దళిత మహిళలకు రాష్ట్ర హోం మంత్రిగా అవకాశం కల్పించింది జగనన్నే. టిడిపి హయాంలో దళితులకు హోం మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలి. ఒకటి రెండు సంఘటన బూచిగా చూపించి వైఎస్సార్ సీపీకి దళితులను దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.అది ఎప్పటికీ సాధ్యం కాదు’ అని తెలిపారు. చదవండి: మార్గదర్శి’లాంటి స్కాం ఇప్పటివరకు జరగలేదు -
సీఎం జగన్కు ప్రత్యేక ధన్యవాదాలు: తానేటి వనిత
సాక్షి, అమరావతి: తమ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం పాటుపడే ప్రభుత్వమని, ప్రజలందరికీ సామాజిక న్యాయం చేస్తోన్న సంక్షేమాభివృద్ధి ప్రభుత్వమని రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. శుక్రవారం అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి ఆమె ఆత్మీయ స్వాగతం పలికారు. సభా కార్యక్రమానికి ముందు సీఎం జగన్తో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా కొవ్వూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటన విజయవంతం కావడం, సభలో నియోజకవర్గ అభివృద్ధికి సీఎం హామీల గురించి మరోసారి చర్చించి ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, బుధవారం సీఎం పర్యటన సందర్భంగా వచ్చిన అర్జీల పట్ల అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి 24 గంటల్లోనే గురువారం రోజున బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేశామని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఇంత త్వరిత గతిన సమస్యలకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి ఎవరూ లేరని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే, నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన విజ్ఞప్తి మేరకు డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి రూ.30 కోట్లతో పాటు 3 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, కొవ్వాడ కెనాల్ వద్ద కల్వర్ట్, మూడు మండలాల్లో మూడు అంబేడ్కర్ భవనాలు, ముస్లింలకు షాదీఖానా, ఎస్సీలకు కమ్యూనిటీ హాలు, కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి హామీ ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి జగన్కు హోంమంత్రి వనిత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇది కూడా చదవండి: సీఎం జగన్ నాలుగేళ్ల పాలనలో ఎన్ని మార్పులు.. ఎన్ని సంస్కరణలు -
దోషులు ఎవరూ తప్పించుకోలేరు: మంత్రి తానేటి వనిత
సాక్షి, తూర్పుగోదావరి: అమరావతి భూముల కుంభకోణంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తుకు ప్రభుత్వం చేసిన అప్పీల్ ను పరిగణనలోకి తీసుకుని మళ్లీ విచారణ జరిపించండని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, స్వాగతిస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. బుధవారం కొవ్వూరు మంత్రి క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వ అవినీతికి సంబంధించి సిట్ ఏర్పాటుపై 'స్టే' విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిందన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరగకపోతే దర్యాప్తును ప్రాథమిక దశలోనే ఎందుకు అడ్డుకున్నారని హోంమంత్రి ప్రశ్నించారు. చదవండి: చంద్రబాబుకు బిగ్ షాక్.. ఈ కేసులో మొదటి నుంచీ ఏం జరిగిందంటే? గత ప్రభుత్వంలో జరిగిన అమరావతి భూముల కుంభకోణం, దళితుల అసైన్డ్ ల్యాండ్స్, ఔటర్ రింగ్ రోడ్డులో అవకతవకలు, భారీ ప్రాజెక్టుల్లో నిబంధనల ఉల్లంఘనలు తదితర అంశాలపై వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపడుతున్న సమయంలో హైకోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై గత ప్రభుత్వంలోని నాయకులు స్టే తెచ్చుకోవడం జరిగిందన్నారు. ప్రాథమిక విచారణలో ఉండగానే హైకోర్టులో స్టే తెచ్చుకున్నారని.. గత ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి, ఏ అక్రమాలు జరగకపోతే విచారణ ఎదుర్కొవడానికి ఇబ్బంది ఏంటి? అని ప్రశ్నించారు. తప్పు చేశామని భయం ఉండబట్టే స్టే తెచ్చుకున్నారన్నారు. విచారణను ఎదుర్కొని వాళ్ల నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. విచారణ జరిగితే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు బయటపడతాయన్న భయంతోనే ప్రాథమిక విచారణలో ఉండడానే హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారని తెలిపారు. గతంలో కూడా ఈ అంశంపై మంత్రివర్గ ఉప సంఘం వేసినప్పుడు భూముల కొనుగోళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలను అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చారని తెలిపారు. చదవండి: ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక ఆ విషయాలన్నీ అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిపి ప్రజల దృష్టికి తీసుకొచ్చామన్నారు. దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతంలో జరిగిన ప్రతి అంశాన్ని పారదర్శకంగా విచారణ చేస్తామన్నారు. దోషులు ఎవరూ తప్పించుకోలేరని, ఎప్పటికీ సత్యమే గెలుస్తుందని అన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని తానేటి వనిత తెలిపారు. -
గోదావరి వంతెనపై ఆత్మహత్యల నివారణకు చర్యలు
-
కరోనాతో పేరెంట్స్ మృతి.. పిల్లలకు 10లక్షలు అందజేత
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన కొల్లు శ్రీవాసవి ప్రవళిక, కొల్లు ఉమాశంకర్ అక్కాతమ్ముళ్లకు సీఎం సహాయ నిధి నుండి రూ.10 లక్షల చెక్కులను హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత అందజేశారు. కొవ్వూరులోని హోం మంత్రి కార్యాలయంలో ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున రెండు చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. కాగా.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని జండా పంజా రోడ్డులో నివాసం ఉంటున్న కొల్లు శ్రీ వాసవి ప్రవళిక, ఉమాశంకర్లు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే తమ తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయారు. 2021లో కరోనాతో తండ్రి కొల్లు శ్రీనివాసరావు(47) జూన్ 5 న మరణించగా, తల్లి కొల్లు శ్యామల(41) జూన్ 9న మృతి చెందారు. ప్రస్తుతం అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న అక్క తమ్ముళ్లకు సీఎం సహాయ నిధి ద్వారా సాయం అందించారు. తల్లిదండ్రులను ఇద్దర్నీ ఒకేసారి కోల్పోయి తీవ్ర మనోవేదనలో ఉన్న తమకు ధైర్యాన్ని, భవిష్యత్ పట్ల నమ్మకాన్ని కలిగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హోం మంత్రి తానేటి వనితలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి సాయం అందించడానికి హోం మంత్రి చేసిన కృషి, చొరవ ఎప్పటికీ మరువలేనిదని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమం కోసం, ఆపద కాలంలో వారికి అండగా ఉండడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అందజేస్తున్నామని తెలిపారు. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాలకు గురవుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి పూర్తి విశ్వాసం కల్పిస్తుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ అహర్నిషలు కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ఎందరో అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసరాగా నిలిచి బతుకుపై భరోసానిచ్చిందని తెలిపారు. -
విపత్తుల నుంచి రక్షణకు ఆర్థికసాయం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: విపత్తుల నుంచి రక్షించుకోవడానికి తీరప్రాంత రాష్ట్రాలకు ఆర్థికసాయం చేయాలని ఏపీ హోం శాఖ మంత్రి తానేటి వనిత కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అవసరమైన అన్ని జిల్లాల్లోనూ మల్టీపర్పస్ సైక్లోన్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (ఎన్పీడీఆర్ఆర్) సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఏటా ఒకటి, అంతకన్నా ఎక్కువ విపత్తులు ఎదుర్కొంటోందని చెప్పారు. తమ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ఆలోచించడంతో విపత్తు నిర్వహణ శాఖ విపత్తులు ఎదుర్కోవడంలో విజయం సాధిస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి కరవు లేదని చెప్పారు. ప్రతి సంవత్సరం తీర ప్రాంతాలను తుపానులు అతలాకుతం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2020వ సంవత్సరం నవంబర్ నెలలో నివర్ తుపాను తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. తుపానుల ప్రభావం నుంచి కోలుకోవడానికి సహాయం కోరుతున్నట్లు చెప్పారు. ప్రపంచబ్యాంకు నిధులతో నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టు (ఎన్సీఆర్ఎంపీ) సహాయంతో తొమ్మిది తీరప్రాంత జిల్లాల్లో 219 మల్టీ పర్పస్ సైక్లోన్ షెల్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరికొన్ని జిల్లాల్లో కూడా వాటి ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తానేటి వనిత విజ్ఞప్తి చేశారు. తమ సీఎం రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలు ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ వలంటీర్లకు శిక్షణ ఇవ్వడంతో విపత్తులు వచ్చినప్పుడు తగిన సేవలు అందిస్తున్నారని తెలిపారు. తీరప్రాంతాల్లో మడ తోటలు, షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్, ఇతర నిర్మాణాత్మక చర్యలు ఎంతో అవసరమన్నారు. ఎన్సీఆర్ఎంపీ మౌలిక సదుపాయాల కింద వంతెనల ఏర్పాటు, తుపాను షెల్టర్లకు అనుసంధానించే రహదారుల నిర్మాణం వంటివి చేపట్టాలని ఆమె కోరారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హోంమంత్రి తానేటి వనిత
-
‘తాడేపల్లిలో జరిగింది గంజాయి హత్య కాదు’
సాక్షి, గుంటూరు: తాడేపల్లి మైనర్ ఎస్తేర్ రాణి హత్య కేసులో నిందితుడు దయానంద రాజును అరెస్ట్ చేసిన పోలీసులు.. మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. ఇది గంజాయి హత్య కాదని స్పష్టం చేశారు గుంటూరు జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ వకుల్ జిందాల్. ఆపై ఏపీ హోం మంత్రి సైతం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ప్రతిపక్ష ఆరోపణలను తోసిపుచ్చారు. అంతేకాదు.. జగనన్నది భరోసా ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు దయానంద రాజు.. తన ఇంటికి ఎదురుగా ఉన్న ఎస్తేర్ రాణి తో అసభ్యంగా ప్రవర్తించాడు. రాణి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వాళ్లు అతన్ని ప్రశ్నించారు. ఆ కోపంతోనే ఎస్తేర్ రాణి పై రాజు కత్తితో దాడి చేశాడని తెలిపారామె. కొన్ని మీడియాల్లో గంజాయి మత్తులో హత్య చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అది పూర్తిగా అవాస్తవం. అప్పటికే కోపంతో ఉన్న రాజు.. మద్యం సేవించి ఆ మత్తుతోనే హత్యకు పాల్పడ్డాడు. గతంలోనూ రాజు ఒక కేసులో అరెస్టై జైలుకు వెళ్లాడు. నిందితుడిపై రౌడీ షీట్ తెరుస్తామని తెలిపిన ఎస్పీ.. ఘటన జరగగానే పోలీసులు వెంటనే స్పందించారని స్పష్టం చేశారు. మహిళల భద్రత,రక్షణకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వమిది సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని మహిళల భద్రత, రక్షణకు జగనన్న ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. నిందితులు ఎంతటివారైనా సరే తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. మంగళవారం ఏపీ సెక్రటేరియట్లో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ.. ఈ నెల 12 వ తేదీ అర్థరాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక మైనర్ బాలికపై నేరచరిత్ర ఉన్న ఓ వ్యక్తి దాడిచేసి హత్యకు పాల్పడ్డాడు. ఇది దురదృష్టకరమైన ఘటన. మద్యం మత్తులో ఉన్న నిందితుడు.. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గంజాయి మత్తు ఇందుకు ఏమాత్రం కారణం కాదు. కేవలం.. వ్యక్తిగత గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రభుత్వం వెంటనే స్పందించడం వల్ల నిందితుని ఒక గంటలోపే పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ ఘటనపై పలువురు నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. మహిళల భద్రత కోసం జగనన్న సర్కార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలను చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో మహిళల భద్రతకు, రక్షణకు, సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పలు వినూత్న కార్యక్రమాలను, పథకాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే దిశా చట్టాన్ని రూపొందించి కేంద్రం ఆమోదానికి పంపడం జరిగింది. ఆపదలో ఉన్న మహిళలను వెంటనే రక్షించేందుకు దిశా యాప్ తీసుకొచ్చాం. ఇప్పటి వరకూ కోటి 30 లక్షల మంది ఈ యాప్ ను తమ స్మార్టు ఫోన్లలోకి డౌన్ లోడ్ చేసుకున్నారు. తొమ్మిది వందలకు పైగా ఈ యాప్ ద్వారా రక్షణ పొందారు. తప్పు ఎవరు చేసినా..ఎలాంటి వారు చేసినా.. ఎటు వంటి పక్షపాతం చూపకుండా 24 గంటల్లోపే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ శాఖ పనితీరుకు ఇదే నిదర్శనం. గంజాయిపై ఉక్కుపాదం రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణా పై జగనన్న ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, రెండు లక్షల కేజీల గంజాయిని పట్టుకోవడమే కాకుండా ఏజన్సీలో గంజాయి సాగును పూర్తిగా నియంత్రించడం జరిగిందని హోం మంత్రి వనిత వెల్లడించారు. గంజాయి సాగుపై ఆధారపడిన గిరిజన రైతులను ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసుకునే విధంగా మళ్లించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నాటు సారా తయారీని కూడా పూర్తిగా నియంత్రించడం జరిగిందని, అధిక మొత్తంలో బెల్లం వ్యాపార చేసే వారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళల భద్రత..రక్షణ..సాధికారత అంశాలకు జగనన్న ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆమె స్పష్టం చేశారు. వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ ప్రధాన ప్రతి పక్షం ఏదో రకంగా ఆరోపణలు చేయడమే పరిపాటి అయిందన్నారు. గత ప్రభుత్వంలో.. మహిళలకు భద్రత ఉండేది కాదని.. దోషులకు శిక్షలు పడకుండా నేతలు కొమ్ముకాసేవారని, కానీ.. ఇప్పుడున్న ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు లేవని, తప్పుచేసిన వారు ఎంతటివాళ్లైనా 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటూ బాధిత కుటుంబాలకు న్యాయం అందిస్తున్నామని ఆమె తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి స్నేహపూర్వక పోలీస్ విధానాన్ని, జీరో ఎఫ్.ఐ.ఆర్. విధానాన్ని అమల్లోకి తేవడమే కాకుండా.. ఇవాళ టూరిస్టు పోలీస్ స్టేషన్లను కూడా సీఎం జగన్ ప్రారంభించారని ఆమె గుర్తు చేశారు. -
నిందితులకు కొమ్ముకాసేది టీడీపీ: హోంమంత్రి తానేటి వనిత
-
నేరస్తుల్ని వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తున్నాం: హోంమంత్రి తానేటి వనిత
-
టూరిస్ట్ పోలీసు స్టేషన్లను అందుకే ఏర్పాటు చేశాము: తానేటి వనిత
సాక్షి, తాడేపల్లి : పర్యాటకుల భద్రతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీసు స్టేషన్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హోం మంత్రి తానేటి వనిత టూరిస్టు పోలీసు స్టేషన్ల ప్రారంభంపై స్పందించారు. ఈ క్రమంలో తానేటి వనతి మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో టూరిస్ట్లకు సహాయం చేయడం కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటుచేయడం సంతోషకరం. మన రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి టూరిస్ట్లు వచ్చినప్పుడు వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా మేమున్నామంటూ మనం సహాయం చేయడం కోసం ఈ స్టేషన్లు ఏర్పాటు చేశాం. ఈ స్టేషన్ల ద్వారా అవసరమైన సమాచారం ఇవ్వడం, వాహనాలు అందించడం, అవసరమైతే ఫస్ట్ ఎయిడ్ చేయడం, ఇంకా ఏమైనా అత్యవసరమైన సహాయం చేయడం కోసం ఇవి ఏర్పాటుచేయడం శుభపరిణామం. రాష్ట్రంలో మహిళల భద్రతకు అనేక చర్యలు తీసుకున్నాము. మహిళలపై అఘాయిత్యాలు నివారించేందుకే దిశా యాప్ను తీసుకువచ్చాము. మహిళలు సీఎంగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం లేదు. విజయవాడలో మహిళలను వ్యభిచార కూపంలోకి టీడీపీ నేతలే దించారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే సకాలంలో చర్యలు తీసుకోలేదు. వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే చంద్రబాబు సెటిల్మెంట్ చేశాడు’ అని తెలిపారు. -
ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తప్పవు: హోంమంత్రి తానేటి వనిత
-
ప్రతిపక్ష నేతగా ఉండటానికి బాబుకు అర్హత ఉందా?
-
నీ పబ్లిసిటీ పిచ్చితో 8 మందిని చంపేసావ్.. చంద్రబాబుపై మంత్రి తానేటి వనిత ఫైర్
-
కందుకూరు ఘటనపై కేసు నమోదు.. మంత్రి వనిత ఏమన్నారంటే?
సాక్షి, కొవ్వూరు: నెల్లూరు జిల్లా కందుకూరు వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో విషాదం నెలకొన్ని విషయం తెలిసిందే. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన సభలో ఎనిమిది మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. కాగా, ఈ ఘటనపై హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే ఈ విషాద ఘటన జరిగింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం అని చెప్పుకునే చంద్రబాబుకు రాత్రి పూట, ఇరుకు సందుల్లో సభ నిర్వహించకూడదనే విషయం తెలియదా?. గోదావరి పుష్కరాల్లో కూడా ఇలాగే పబ్లిసిటీ పిచ్చితో 29 మంది ప్రాణాలను బలితీసుకున్నారు. చంద్రబాబుకు ఇదేమి పబ్లిసిటీ పిచ్చి అని ప్రజలందరూ ఇదేమి కర్మరా బాబు అని బాధపడుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుంటే తమ్ముళ్లు ఇక్కడే ఉండండి, మళ్ళీ వచ్చి మాట్లాడతానని చంద్రబాబు చెప్పడం వెనుక అర్థం ఏమిటి?. చంద్రబాబు ఎలాగైనా ప్రజల నుండి సానుభూతిని పొందాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కందుకూరు ఘటనపై కేసు నమోదు చేశాము అని తెలిపారు. -
Mega Job Fair: కొవ్వూరులో 9న మెగా జాబ్మేళా
కొవ్వూరు: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్ధ, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, సీడాప్ సంయుక్తంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 9న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హోమ్ మంత్రి తానేటి వనిత తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం దీనికి సంబంధించిన పోస్టరును ఆమె ఆవిష్కరించారు. ఈసందర్భంగా వనిత మాట్లాడుతూ కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభం అవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. 15 ప్రముఖ కంపెనీలు మేళాలో పాలుపంచుకుంటాయన్నారు. 1,367 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ, బీఎస్సీ కెమీస్ట్రీ, బీకామ్, పదో తరగతి, ఎంఫార్మసీ,బీ ఫార్మసీ, డీఫార్మసీ, ఇంటర్ మీడియట్ పూర్తి చేసుకున్న 19 నుంచి 30ఏళ్ల లోపు యువతీ యువకులంతా జాబ్ మేళాను సద్వినియోగ పరుచుకోవాలన్నారు. ఎంపికైన అభ్యర్ధులకు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఆయా కంపెనీలు వేతనం చెల్లిస్తాయన్నారు. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక నిర్వహిస్తారని జిల్లా ఉపాధి కల్పనా అధికారి కె.హరీష్ చంద్రప్రసాద్ తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ముందుగాపూర్తి వివరాలతో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. జాబ్ మేళాకు వచ్చే అభ్యర్ధులు తమ ఆధార్, పాన్, ఇతర సర్టిఫికెట్స్ను వెంట తెచ్చుకోవాలన్నారు. వివరాల కోసం 6303889174, 96664 72877, 90596 41596 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. జిల్లా నైపుణ్యావృద్ధికారి శీలం ప్రశాంత్, జేడీ ఎం. సుమలత, ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: ఆరు గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు..) జగనన్న పాలనలో బీసీలకు ప్రాధాన్యం చాగల్లు: బీసీల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశేష కృషి చేస్తున్నారని హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. చాగల్లు మండలం ఊనగట్లలో నియోజకవర్గ బీసీ నాయకులతో సోమవారం ఆమె సమావేశమయ్యారు. విజయవాడలో జరగనున్న జయహో బీసీ మహాసభకు అధిక సంఖ్యలో తరలి రావాలని మంత్రి పిలుపు నిచ్చారు. బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్లు సంసాని రమేష్, పొన్నాడ సింహాద్రి, చాగల్లు, తాళ్లపూడి, కొవ్వూరు వైఎస్సార్సీపీ మండల బీసీ సెల్ అధ్యక్షులు మేకా రాజు, ఎం.పోసిబాబు, కట్టా బ్రాహ్మజీ, వైఎస్సార్సీపీ బీసీ నాయకులు అక్షయపాత్ర రవింద్ర శ్రీనివాస్, మట్టా వెంకట్రావు, పిల్లి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: నేనూ బీసీ ఇంటి కోడలినే.. మంత్రి రోజా) -
చంద్రబాబుకు చాదస్తం మరీ ఎక్కువైంది
సత్తెనపల్లి: పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు పిచ్చి, చాదస్తం కాకపోతే రాత్రి 7 గంటల సమయంలో పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వయసు ప్రభావం వల్ల చాదస్తం మరీ ఎక్కువైందని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కూడా నేరుగా లబ్ధిదారులకు బటన్ నొక్కితే వెళ్లేలా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారన్నారు. అదీ తమ చిత్తశుద్ధి అన్నారు. ఎక్కడా, ఏ విధమైన పొరపాట్లు జరగవని చెప్పారు. ఎక్కడైనా సరే అధికారులు, సిబ్బంది తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై అభూత కల్పనలు సృష్టించి, తద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. 2018లోనే ప్రాజెక్టును పూర్తి చేస్తానని డబ్బాలు కొట్టిన బాబును ప్రజలు ఇంటికి పంపారన్నారు. బాబు నిర్వాకం వల్లే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని చెప్పారు. అన్ని అడ్డంకులను అధిగమించి, ప్రాజెక్టును పూర్తి చేస్తామని.. ప్రారంభోత్సవానికి చంద్రబాబునూ ఆహ్వానిస్తామన్నారు. ఇందులో తొందర పడాల్సిందేమీ లేదని చెప్పారు. పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ఎక్కడా తప్పు పట్టలేదన్నారు. మొట్టమొదట ట్రాన్స్ట్రాయ్ ఏజెన్సీ ఉంటే, చంద్రబాబు దానిని తొలగించి నవయుగకు ఇచ్చారని, ఆ తర్వాత తమ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా మెఘాకు ఇచ్చిందని చెప్పారు. వాళ్లు మారిస్తే తప్పులేదు కానీ, తాము మారిస్తే తప్పా అని ప్రశ్నించారు. ఈరోజు పూర్తవుతుంది.. రేపు పూర్తవుతుందని చంద్రబాబులా అసత్యాలు చెప్పమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగానే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమవుతుందని పునరుద్ఘాటించారు. చంద్రబాబు తొందరపడబట్టే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు. చంద్రబాబుది రోజుకో డ్రామా హోంమంత్రి తానేటి వనిత మండిపాటు కొవ్వూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రోజుకో డ్రామా చేస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు. ఆయన తీరుపై ప్రజలు ఇదేమి ఖర్మరా బాబూ.. అని మాట్లాడుకుంటున్నారని చెప్పారు. గురువారం ఆమె తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో మీడియాతో మాట్లాడారు. పోలవరం వద్ద కావాలనే చంద్రబాబు రాద్ధాంతం చేశారన్నారు. టీడీపీ హయాంలో పోలవరంను ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా జన సమూహంతో అదీ రాత్రి పూట పాజెక్టు వద్దకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. తన హయాంలో ఏం చేశారో చెప్పకుండా రోడ్లు పట్టుకొని తిరిగితే ప్రజలు నమ్ముతారని ఆయన భావిస్తున్నారన్నారు. -
Darshit: కన్నా..ఇక కనిపించవా..
సాక్షి, తాళ్లపూడి/కాకినాడ క్రైం: మూడేళ్ల దర్శిత్ విషాదాంతం అందరి హృదయాలను కలచివేసింది. మండలంలోని పైడిమెట్ట గ్రామానికి చెందిన జొన్నకూటి వినోద్కుమార్ కుమారుడైన దర్శిత్ (3) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 12న తమ ఇంటి డాబాపై ఆడుకుంటుండగా, పై నుంచి వెళుతున్న విద్యుత్ వైర్లు తగిలి బాలుడు షాక్కు గురయ్యాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడ్ని చికిత్సకోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాబును కంటికి రెప్పలా చూసుకున్నారు. బాలుడి కాళ్లకు ఇన్పెక్షన్ సోకడంతో ఆపరేషన్ చేసి రెండు కాళ్లనూ తొలగించాల్సి వచ్చింది. ఈ సంఘటన అందరి గుండెలనూ పిండేసింది. బాలుడ్ని కాపాడేందుకు జీజీహెచ్ వైద్యుల బృందం చేయని ప్రయత్నం లేదు. మరోపక్క దాతలూ స్పందించారు. పెద్ద మనసుతో ఆర్థిక సహాయం అందించారు. పలు శాఖల అధికారుల తమ ఉదారతను చాటుకున్నారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. సుమారు రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి దర్శిత్ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచాడు. బాలుడి మృతితో పైడిమెట్ట గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. జొన్నకూటి వినోద్, చాందిని దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడైన అక్షిత్ యూకేజీ చదువుతున్నాడు. దర్శిత్ రెండో కుమారుడు. వినోద్ లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చదవండి: (Yanamala Brothers: నాలుగు దశాబ్దాల చరిత్ర చెబుతున్నది ఇదే) హోం మంత్రి వనిత పరామర్శ శుక్రవారం ఉదయం హోంమంత్రి తానేటి వనిత కాకినాడ జీజీహెచ్కు వెళ్లి ఆర్ఐసీయూలో దర్శిత్ను పరామర్శించారు. తల్లిదండ్రులతో మాట్లాడారు. బాలుడికి అత్యంత నాణ్యమైన వైద్యం అందించినట్లు తెలిపారు. బాలుడ్ని రక్షించేందుకు పీడియాట్రిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, అనస్థీయా నిపుణులు శ్రమించారని వివరించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని కుటుంబానికి భరోసా ఇచ్చారు. కుమారుడ్ని కాపాడాలంటూ రోదించిన దర్శిత్ తల్లి చాందినిని హోం మంత్రి అక్కున చేర్చుకొని ఓదార్చారు. ఆర్ఐసీయూలో బాలుడికి అందుతున్న చికిత్సను హోం మంత్రి తానేటి వనతి, కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ గీత, కౌడా ఛైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ నగర మాజీ మేయర్ సుంకర శివప్రసన్న పరిశీలించారు. సాయంత్రానికే బాబు మరణించాడనే దుర్వార్త మనసున్నవారిని కుదిపేసింది. బాలుడి కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూసి అందరూ చలించిపోయారు. -
వైఎస్ఆర్సీపీ నేతలను దుర్బాషలాడటం కరెక్ట్ కాదు: తానేటి వనిత
-
మంత్రి సురేష్కు హోం మంత్రి పరామర్శ
సాక్షి, అమరావతి: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ను హోంశాఖ మంత్రి తానేటి వనిత ఆదివారం పరామర్శించారు. ఇటీవల మంత్రి సురేష్కు మోకాలు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో ఉన్న సురేష్ను హోం మంత్రి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
పొలిటికల్ కారిడార్ : ఏపీ హోంమంత్రికి అమిత్ షా అభినందనలు
-
మహిళల భద్రతకోసం సీఎం జగన్ ప్రత్యేక చర్యలు
-
‘ప్రజల కోసం పోలీసులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్నారు’
సాక్షి, విజయవాడ: ఇందిరా గాంధీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. పోలీసుల గౌరవవందనం అందుకున్నారు. అనంతరం, మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ‘పోలీసులు ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్నారు. మహిళాల భద్రత కోసం సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దిశ చట్టం, మహిళా మిత్ర, సైబర్ మిత్ర, జీరో ఎఫ్ఐఆర్ తీసుకొచ్చారు. ప్రతి సచివాలయం పరిధిలో మహిళా పోలీస్ను నియమించాము. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా చర్యలు తీసుకున్నాము’ అని స్పష్టం చేశారు. ఇక, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘పోలీస్ శాఖలో సమర్థత పెంచేందుకు చర్యలు తీసుకున్నాము. సైబర్ నేరాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చెప్పట్టాము. లోన్ యాప్ల నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాము. నాటు సారా నుండి 80 శాతం గ్రామాలకు విముక్తి కల్పించాము. వాటిపై ఆధారపడ్డ వారికి ఉపాధి కల్పిస్తున్నాము’ అని తెలిపారు. -
అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజల మద్దతు కరువైంది : హోంమంత్రి తానేటి వనిత
-
జన సైకోలు.. ప్లాన్ ప్రకారమే మంత్రులపై దాడి
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖ ఎయిర్పోర్టు వద్ద జనసేన కార్యకర్తలు వీరంగంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎయిర్పోర్టు దగ్గర మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తల దాడిని ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసలేం జరిగిందంటే.. విశాఖ ఎయిర్పోర్టు వద్ద గర్జన సభ నుంచి ఒకే కారులో ఎయిర్పోర్టు వెళ్తున్న వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్పై జనసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. మంత్రి రోజా సహాయకుడికి, జోగిరమేష్ అనుచరులకు గాయాలయ్యాయి. జనసేన కార్యకర్తల విధ్వంసంతో ఎయిర్పోర్టులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. జనసేన చిల్లర రాజకీయాలు చేస్తోంది. గర్జనకు వచ్చిన స్పందనను చూసి ఓర్వలేకపోతున్నారు. పిల్ల సేనలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. పవన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మేం కన్నెర్ర చేస్తే.. మీరు రోడ్లపై తిరగలేరు. -మంత్రి ఆర్కే రోజా జనసేన కార్యకర్తలు అల్లరి మూకల్లా ప్రవర్తించారు. జనసేనకు విధి విధానమంటూ లేదు. -వైవీ సుబ్బారెడ్డి ఎయిర్పోర్టు వద్ద జరిగిన దాడి ఉన్మాద చర్య.. ఇది రాజకీయ పార్టీనా.. రౌడీ మూకనా?. విశాఖ గర్జన ప్రశాంతంగా జరిగింది. గర్జనకు భారీగా ప్రజలు తరలివచ్చారు. భారీ వర్షాన్ని కూడా జనం లెక్కచేయలేదు. గర్జనకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేకపోతున్నారు. మంత్రులపై దాడి కాదు.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలపై దాడి. దాడిని పవన్ సమర్థిస్తున్నారా?. జనసేనకు లక్ష్యం, సిద్దాంతమంటూ ఏమీ లేదు. జనసేన కార్యకర్తలది సైకో చర్య. -స్పీకర్ తమ్మినేని సీతారాం. చదవండి: ‘జనసేన’ సైకో చర్య.. దాడి ఘటనపై మంత్రి జోగి రమేష్ హెచ్చరిక జన సైనికులుకాదు.. జన సైకోలు.. ఎయిర్పోర్టు వద్ద దాడి ఘటనకు పవన్ బాధ్యత వహించాలి. మంత్రులపై కావాలనే దాడి చేశారు. పథకం ప్రకారమే మంత్రులపై దాడులు జరిగాయి. దాడి ఘటనకు బాధ్యత వహించి పవన్ క్షమాపణ చెప్పాలి. గర్జనను పక్కదారి పట్టించేందుకే కుట్రలు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. -మంత్రి గుడివాడ అమర్నాథ్ వీధి రౌడీల్లా దాడికి పాల్పడ్డారు. జనసేన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. విశాఖ గర్జన విజయవంతం కావడం తట్టుకోలేకపోతున్నారు. ప్రజల నుంచి మద్దతు లేకపోవడంతో మంత్రులపై దాడి చేశారు. ఏదో రకంగా ప్రభుత్వంపై బురదజల్లాలనేది వారి లక్ష్యం. మీడియా ముందు హల్చల్ చేయాలని చూస్తున్నారు. మంత్రులపై దాడి ఘటనకు పవన్ బాధ్యత వహించాలి. జనసేన కార్యకర్తల దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. -హోంమంత్రి తానేటి వనిత జన సైనికులా.. సైకోలా? అసూయా ద్వేషాలకు ప్రతిరూపాలుగా ప్రవర్తిస్తున్న వపన్ కళ్యాణ్ అభిమనులని చెప్పుకునే ఉన్మాదుల దుశ్చర్యలు రోజురోజుకూ హద్దుమీరి పోతున్నాయి. విశాఖలో వైఎస్సార్ సీపీ నాయకుల మీద దాడి హేయమైనది. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి. -మంత్రి వేణు గోపాల కృష్ణ చెల్లుబోయిన జనసైనికులా? సైకో లా?? అసూయా ద్వేషాలకు ప్రతిరూపాలుగా ప్రవర్తిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులని చెప్పుకునే ఉన్మాదుల దుశ్చర్యలు రోజురోజుకూ హద్దుమీరి పోతున్నాయి. విశాఖ లో వైఎస్సార్సీపీ నాయకుల మీద దాడి హేయమైనది. దీనిని నేను తీవ్రం గా ఖండిస్తున్నాను. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. — VenuGopalaKrishna Chelluboina (@chelluboinavenu) October 15, 2022 ఆవు చెన్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా?. ఈ పవన్ కల్యాణ్ కనీసం ఒక చోటైనా గెలిచి ఉంటే క్రమశిక్షణ, విలువలు తెలిసుండేది. ఇతనికే క్రమశిక్షణ లేనప్పుడు ఇక ఇతని అభిమానులకు ఉంటుందా? ఎయిర్ పోర్టు దగ్గర జరిగిన ఘటనకు బాధ్యత వహించి పవన్ తక్షణమే సమాధానం చెప్పాలి. -మంత్రి నారాయణ స్వామి ఆవు చెన్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఈ @PawanKalyan కనీసం ఒక చోటైనా గెలిచి ఉంటే క్రమశిక్షణ, విలువలు తెలిసుండేది. ఇతనికే క్రమశిక్షణ లేనప్పుడు ఇక ఇతని అభిమానులకు ఉంటుందా? ఎయిర్ పోర్టు దగ్గర ఘటనకు బాధ్యత వహించి పవన్ తక్షణమే క్షమాపణ చెప్పాలి#JanaSenaGoons pic.twitter.com/qp0pVCpJFQ — Narayanaswamy Kalathuru (@NSwamy_Official) October 15, 2022 మొన్న కోనసీమ జిల్లాలో మంత్రి ఇంటిపై దాడికి తెగబడ్డారు. నేడు విశాఖలో అల్లర్లు సృష్టిస్తున్నారు. తమ ఓపికకు ఒక హద్దు ఉంటుంది. అయినా బాధ్యతాయుతమైన అధికార పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకుపోతున్నాం. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఏమాత్రం చోటులేదు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి.2/2 — Malladi Vishnu (@malladiysrcp) October 15, 2022 I strongly condemn the attack by @JanaSenaParty goons on @yvsubbareddymp garu, @JogiRameshYSRCP garu & @RojaSelvamaniRK garu in Vizag. This incident clearly Shows the true character of Janasena party today. Such misdemeanour acts are against to democratic values in the country. pic.twitter.com/okztqTdx23 — Maddila Gurumoorthy (@GuruMYSRCP) October 15, 2022 -
‘రియల్ ఎస్టేట్’ను కాపాడుకునేందుకే యాత్ర
కొవ్వూరు: రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నేతలు కొనుగోలు చేసిన భూముల ధరలు ఎక్కడ తగ్గిపోతాయో, తమ వ్యాపారాలు ఎక్కడ దెబ్బతింటాయోనన్న స్వార్థంతోనే అమరావతి పేరుతో వారు పాదయాత్ర చేస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత విమర్శించారు. అమరావతి రైతుల యాత్ర ముసుగులో పచ్చమీడియా సహకారంతో ఒక బూటకపు యాత్ర చేస్తున్నారని.. కానీ, రాష్ట్రంలో ఎక్కడా ఈ యాత్రను ప్రజలు స్వాగతించడంలేదన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. పచ్చమీడియాను అడ్డుపెట్టుకుని ప్రజల నుంచి సానుభూతి పొందాలని టీడీపీ ఆరాటపడుతోందన్నారు. ప్రజల్లో ఏదో రకంగా అలజడి సృష్టించి గొడవలు పెట్టుకునేందుకు రెచ్చగొట్టడం.. తద్వారా లబ్ధిపొందాలనే టీడీపీ నేతలు పనిచేస్తున్నారని ఆరోపించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ఆమోదించినట్టు గుర్తుచేశారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడంతో అన్ని విధాలుగా నష్టపోయామని.. భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటుచేస్తోందని వివరించారు. -
జాతి గర్వించదగ్గ వ్యక్తి.. జాషువా
సాక్షి, అమరావతి: కుల వివక్షకు వ్యతిరేకంగా కలమే ఆయుధంగా మలుచుకొని రచనలు చేసిన వ్యక్తి మహాకవి గుర్రం జాషువా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కొనియాడారు. నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా జయంతి వేడుకలను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. 1895లో గుంటూరు జిల్లా వినుకొండలో ఆయన జన్మించడం గుంటూరు జిల్లా ప్రజలందరికీ గర్వకారణమన్నారు. ఆయన జాతి గర్వించదగ్గ వ్యక్తి అని చెప్పారు. హోం శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. సమాజంలో బడుగు, బలహీనవర్గాల వారికి, మహిళలకు సమానత్వం కోసం కృషి చేసిన వ్యక్తి జాషువా అని ప్రశంసించారు. ఎక్కడైతే అవమానాలు పొందారో అక్కడే సత్కారాలు పొందారని చెప్పారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. గుర్రం జాషువా జాతి గర్వించదగిన కవి అని తెలిపారు. శాసనమండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... గుర్రం జాషువాతో వ్యక్తిగత సాన్నిహిత్యం ఉండటం తన అదృష్టమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జాషువా కోరుకున్న విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలను సమాజంలో ఓ స్థాయికి తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. శాసనమండలిలో విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. గుర్రం జాషువా సమసమాజాన్ని ఆశించారని తెలిపారు. ఎమ్మెల్యేలు అనంత వెంకట రామిరెడ్డి, హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, కల్పలతారెడ్డి, విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నేర పరిశోధనలో జాగిలాల పాత్ర కీలకం
సాక్షి, అమరావతి: నేర పరిశోధన, భద్రత చర్యల్లో పోలీసు జాగిలాల పాత్ర కీలకమైనదని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. పోలీసు జాగిలాల 20వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ను మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వనిత మాట్లాడుతూ నేరస్తుల జాడ కనిపెట్టడం, ప్రముఖుల భద్రత ఏర్పాట్లు, ఆగంతకులపై దాడి చేసి వారిని నిలువరించడం మొదలైన వాటిలో పోలీసు జాగిలాలు కీలక భూమిక నిర్వర్తిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలోని 177 పోలీసు జాగిలాల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక వెటర్నరీ వైద్యుడి పోస్టును ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మన పోలీసు శాఖ జాతీయ స్థాయిలో 189 అవార్డులు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. సైబర్ మిత్ర, ఉమెన్ హెల్ప్ డెస్క్, గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసుల నియామకం సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్కుమార్గుప్తా, డీజీ (ఇంటెలిజెన్స్) ఆంజనేయులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న జాగిలాల విన్యాసాలు పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా జాగిలాల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బాంబులను గుర్తించడం, వీఐపీలపై దాడికి పాల్పడేవారిని నిరోధించడం, ఆగంతకులపై దాడి చేయడం మొదలైన విన్యాసాలను ప్రదర్శించాయి. 20వ బ్యాచ్ కింద 35 జాగిలాలు, 52 మంది జాగిలాల సంరక్షకులు మంగళగిరిలోని ఆరో బెటాలియన్లో 8 నెలలపాటు శిక్షణ ఇచ్చారు. ఇక్కడ 2017 నుంచి ఇప్పటివరకు 4 బ్యాచ్ల కింద 124 జాగిలాలు, 175 మంది హ్యాండ్లర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ జాగిలాలను జిల్లా పోలీసు కేంద్రాలు, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, టీటీడీలకు కేటాయిస్తారు. -
గన్ ఫైర్ చేసిన హోంమంత్రి తానేటి వనిత
-
ఏపీ హోంమంత్రి తానేటి వనితతో స్ట్రెయిట్ టాక్
-
ఏపీ హోం మంత్రి తానేటి వనితతో స్ట్రెయిట్ టాక్ ప్రోమో
-
గోరంట్ల మాధవ్ ఇష్యూ.. ఎవరినీ వదిలేది లేదు: మంత్రి తానేటి వనిత
సాక్షి, రాజమండ్రి: ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఏపీ హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. మంత్రి వనిత మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వీడియో మార్ఫింగ్ అని ఎంపీ గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. దీంతో, గోరంట్ల మాధవ్ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాము. తప్పు చేస్తే ఎంపీ గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకుంటాము. ఇది రాజకీయ కుట్రలా ఉందనే అనుమానాలు ఉన్నాయి. కుట్రకు పాల్పడితే ఎవరినీ వదలేది లేదు. టీడీపీ హయంలో మహిళలపై ఎన్నో దారుణాలు జరిగాయి. కొందరు పెయిడ్ ఆర్టిస్టులు ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: నంద్యాలలో కానిస్టేబుల్ దారుణ హత్య -
‘క్రిమినల్ కేసుల్లో ఫోరెన్సిక్ ఫలితాలు కీలకం’
అనంతపురం: అనంతపురంలో రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభమైంది. ల్యాబ్ను హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హెంమంత్రి మాట్లాడుతూ, క్రిమినల్ కేసులు ఛేదించటంలో ఫోరెన్సిక్ ఫలితాలే కీలకమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతోనే ఫోరెన్సిక్ ల్యాబ్లను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నామన్నారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా పోలీసులు క్షణాల్లో స్పందించేలా వ్యవస్థలో మార్పు తెచ్చామని, ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలవుతుందన్నారు. సీఎం వైఎస్ జగన్ కృషి వల్లే దిశా చట్టం తెచ్చామని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. -
చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారు: తానేటి వనిత
-
ముంపు ప్రాంతాల ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకుంటాం: తానేటి వనిత
-
సీఎం వైఎస్ జగన్ మనందరి ధైర్యం: తానేటి వనిత
-
అయ్యన్న పాత్రుడు తప్పును ఒప్పుకోవడం మంచిది: తానేటి వనిత
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు స్థలం కబ్జాపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. మంత్రి తానేటి వనిత ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు. దాన్ని గుర్తించిన అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయనకు 15 రోజులకు ముందే నోటీసులు ఇచ్చారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు మాత్రమే పోలీసులు వచ్చారు. మహిళలను, దళితులను తన భర్త కించపరిచినట్టు మాట్లాడినప్పుడు ఆయన భార్య మాట్లాడలేదు. కానీ, ఇప్పుడు మాత్రం బయటకు వచ్చి రాజకీయ కుట్ర అని ఆరోపించడం దారుణం. దీన్ని రాజకీయ కుట్ర అనడం సరికాదు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు కుల ప్రస్తావన తీసుకువస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ నాయకులు కలిసి మా అధినేతపై కేసులు పెట్టడాన్ని రాజకీయ కుట్ర అంటారు. మా నాయకుడు ప్రతిపక్షంలో ఉండగా విశాఖ ఎయిర్పోర్టులో నిర్బంధించడం రాజకీయ కుట్ర అంటారు. మేము ఇటువంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ రకంగా చేయటం సరికాదని చెబుతున్నాము. తప్పును ఒప్పుకోవడం మంచిది. మా ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు’’ అని హితవు పలికారు. ఇది కూడా చదవండి: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు -
కాఫర్ డ్యాం పూర్తి కాకుండానే డయాఫ్రం వాల్ నిర్మించారు: మంత్రి అంబటి
-
ఏపీ: ఖరీఫ్ సాగుకు ముందస్తుగా గోదావరి జలాలు విడుదల
-
YSRCP Bus Yatra: సామాజిక న్యాయభేరి.. రెండో రోజు బస్సు యాత్ర
సాక్షి, విశాఖపట్నం: రెండో రోజు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కొనసాగుతోంది. శుక్రవారం పాత గాజువాక వైఎస్సార్ విగ్రహం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ బస్సు యాత్ర ప్రారంభానికి ముందు గాజువాకలో ఏర్పాటు చేసిన సభా వేదికపై హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 70 శాతం పదవులు ఇచ్చారు. దేశంలో ఎక్కడా కూడా ఇలా పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. జగనన్న తప్ప గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంత గౌరవం, రాజ్యాధికారం ఇచ్చిన వారు లేరు’’ అని అన్నారు. అంతకుముందు మంత్రి వనిత మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. అమలాపురం ఘటనలో టీడీపీ, జనసేన పాత్ర స్పష్టమైంది. అరెస్ట్ అయిన వారిలో ఈ రెండు పార్టీల వారే ఉన్నారు. ఆధారాలు, ఫొటోలు, వీడియోలతో ఆధారంగా వారిని అరెస్ట్ చేశాము. చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారు. నేను వీళ్ళ పాత్ర ఉందని ముందే చెప్పాను. బస్సు యాత్రకి స్పందన లేదనడం చంద్రబాబు అవివేకం. ప్రతీ చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సీఎం జగన్ పాలనను ప్రశంసిస్తున్నారు’’ అని తెలిపారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ..‘‘రాష్ట్రంలో సంతృప్తికర పాలన కొనసాగుతోంది. మళ్లీ సీఎం జగన్ను గెలిపిస్తామని ప్రజలు అంటున్నారు. దళితులను అవమానించిన వ్యక్తి చంద్రబాబు. మహానాడు కాదు.. అది వల్లకాడు. మేనిఫెస్టోను తుంగలో తొక్కిన వ్యక్తి, చరిత్ర హీనుడు చంద్రబాబు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి’’ అని అన్నారు. ‘సామాజిక న్యాయం అందుతుంటే కొన్ని ప్రతి పక్ష పార్టీ లు అల్లర్లు సృష్టిస్తున్నారు. దళిత మంత్రి ఇంటికి నిప్పు పెట్టడం అమానుషం. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం సమర్థిస్తున్నారా లేదా ప్రతి పక్షాలు సమాధానం ఇవ్వాలి. జగనన్న పాలనలో నేరుగా లబ్ధిదారులకు మేలు జరుగుతుంది..రాజకీయ దళారీలు లేరు. మూడేళ్లుగా మేలు జరుగుతుంటే జన్మ భూమి కమిటీలు భరించలేక పోతున్నాయి. మాట ప్రకారం పీడిత వర్గాలకు సమన్యాయం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందిస్తోంది. గడప గడపకి వెళ్తుంటే ప్రజలు జగన్ వెంట ఉంటామని అంటున్నారు’ అని తమ్మినేని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: హోరెత్తిన సామాజిక భేరి -
అమలాపురంలో పరిస్థితి పూర్తి అదుపులో ఉంది: హోంమంత్రి తానేటి వనిత
-
కోనసీమ ఆందోళనల్లో జనసేన, టీడీపీ హస్తం: హోంమంత్రి సీరియస్
సాక్షి, అమరావతి: కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీలు డిమాండ్ చేశాయని ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడం జరిగిందని హోంశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కోనసీమ జిల్లా పేరును మార్చవద్దంటూ అమలాపురంలో కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. మంత్రి విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హోంమంత్రి తానేటి వనిత ఈ ఘటనలపై తీవ్రంగా స్పందించారు. మహా మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయిన డా.బీఆర్ అంబేద్కర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. అలాంటి మహానుభావుని పేరును ఒక జిల్లాకు నామకరణం చేయడాన్ని వ్యతిరేకించడం బాధాకరమన్నారు. కోనసీమ జిల్లా ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్ కోనసీమగా పేరు మార్చిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాని ఆమె సూచించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీని వెనుక టీడీపీ, జనసేన పార్టీలున్నాయన్న అనుమానం ఉందన్నారు. చదవండి: Konaseema: కోనసీమ ఉద్రిక్తతలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి ‘గొడవలు చేసే వారి వెనుక ఉండి నడిపించే వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు 20 మందికి పైగా పోలీసులపై రాళ్లు రువ్వి గాయపరిచారు. స్కూల్ బస్సు లను కూడా తగులబెట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కొన్ని శక్తులు కుట్ర పూరితంగా ప్రయత్నిస్తున్నాయి. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై తప్పక చర్యలు ఉంటాయి. ఆందోళనకారులను, వారి వెనుక ఉండి నడిపించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశిస్తున్నాను’ అని హోంమంత్రి వెల్లడించారు. చదవండి: పచ్చని కోనసీమలో విధ్వంసాలు సృష్టించొద్దు: పిల్లి సుభాష్చంద్రబోస్ -
ఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు వ్యాఖ్యలు.. హోంమంత్రి కౌంటర్
సాక్షి, విజయవాడ: ఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు వ్యాఖ్యలకు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత కౌంటర్ ఇచ్చారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసమే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని ఆమె అన్నారు. ‘‘వాళ్ల పిల్లలను విదేశాల్లో ఇంగ్లీష్ మీడియం చదివించుకోవచ్చు.. పేదలు ఇంగ్లీష్ చదువులు చదవకూడదన్నదే చంద్రబాబు రూల్’’ అంటూ మంత్రి మండిపడ్డారు. చదవండి: బాబు పర్యటనకు దూరంగా గంటా శ్రీనివాసరావు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే మాటలు ఇవ్వేనా?.ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మొద్దబ్బాయిల్లా మారతారని తమకు ఇప్పటివరకూ తెలియదు. అలా కూడా ఆలోచించవచ్చా అని ప్రతిపక్షనేత చెప్పే వరకూ తెలియదంటూ మంత్రి ఎద్దేవా చేశారు. ‘‘ఈ మూడేళ్లు రాష్ట్రంలో జగన్ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వాల కంటే సంతోషంగా ఉన్నామని ధైర్యంగా చెబుతున్నారు. కరోనా సమయంలో టీడీపీ నేతలు ఎక్కడున్నారో వారికే తెలియదు. ఇప్పుడేమో జనాన్ని ఉద్దరించేస్తామని తయారయ్యారు. సీఎం జగన్ను పిల్లలందరూ మేనమామగా భావిస్తున్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసమే ఇంగ్లీష్ మీడియం’’ అని మంత్రి తానేటి వనిత అన్నారు. -
‘టీడీపీ తప్పుడు ప్రచారం.. ఇదేం రాజకీయం బాబు’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని.. చంద్రబాబు పాలనతో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సంఖ్య భారీగా తగ్గిందని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మహిళలకు భద్రత కోసం జీరో ఎఫ్ఐఆర్, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చామన్నారు. కఠినమైన శిక్షలు పడితేనే నేరాలు తగ్గుతాయని, అందుకే వేగంగా శిక్షలు వేసేలా చట్టం తెచ్చామని హోంమంత్రి అన్నారు. చదవండి: చంద్రబాబు, ఎల్లోమీడియాపై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు.. ‘‘మహిళలపై నేరాల నియంత్రణకి దిశ యాప్ తీసుకొచ్చాం. దిశ యాప్ని కోటి 28 లక్షలు మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. దిశ యాప్ వలన 900 మంది మహిళలను కాపాడాం. ఫోరెన్సిక్ ల్యాబ్ లు తెచ్చాం, మహిళ కోర్టులు తెచ్చాం. గతంలో ఎస్సీ, ఎస్టీ బాధితులకు రూ.50 కోట్లు పరిహారం ఇచ్చారు. సీఎం జగన్ పాలనలో ఇప్పటికే 120 కోట్లు పరిహారం ఇచ్చామని’’ మంత్రి అన్నారు. ‘‘మహిళకు భద్రతకు చర్యలు తీసుకుంటుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. బాధితులకు అండగా నిలవాల్సిన సమయంలో టీడీపీ వెళ్లి రాజకీయం చేస్తుంది. మహిళల భద్రత కోసం ప్రతి గ్రామంలో మహిళ పోలీస్ని నియమించాం. దిశ చట్టంపై కేంద్రం అడిగిన క్లారిఫికేషన్ను 20 రోజుల కిందట పంపాం. ఇప్పటికి రెండు సార్లు క్లారిఫికేషన్ అడిగితే సమాధానం పంపినట్లు హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. -
సత్వరమే స్పందించినా రాజకీయమా?
ఒంగోలు అర్బన్/ఒంగోలు/రేపల్లె రూరల్: బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో వివాహితపై జరిగిన లైంగిక దాడి దురదృష్టకరమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి బాధితులకు అండగా నిలిచిందని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి చర్యలు తీసుకున్నా టీడీపీ, ఇతర పార్టీలు రాజకీయం చేయడం దారుణమన్నారు. ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబులతో కలసి వనిత పరామర్శించారు. రూ.4.12 లక్షలను బాధిత కుటుంబానికి అందజేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా వ్యక్తిగతంగా కొంత మొత్తాన్ని అందించారు. అనంతరం తానేటి వనిత మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్నారు. బాధితురాలి భర్త అర్ధరాత్రి స్థానిక పోలీసులను సంప్రదిస్తే.. వారు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారని, తెల్లవారేసరికల్లా నిందితులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. నిందితులపై అట్రాసిటీ కేసుతోపాటు లైంగికదాడి, హత్యాయత్నం, దొంగతనం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ద్వారా బాధితులకు రూ.2 లక్షల పరిహారం అందజేశామని గుర్తు చేశారు. మహిళా, శిశు సంక్షేమం కింద మరో రూ.50 వేలు అందజేస్తున్నామన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. మహిళలపై అత్యాచారాలను ప్రభుత్వం సీరియస్గా పరిగణిస్తోందన్నారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ఢిల్లీలో ఉన్నా ఘటనపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ బాధితులకు సాయమందించేలా ఆదేశాలిచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దినేష్కుమార్, ఎస్పీ మలికాగర్గ్ తదితరులు పాల్గొన్నారు. హోం మంత్రి తానేటి వనిత కారును అడ్డుకుంటున్న టీడీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు హోం మంత్రి కాన్వాయ్పై దాడి కాగా హోం మంత్రి తానేటి వనిత కాన్వాయ్పై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఒంగోలు ఎన్ఎస్పీ గెస్ట్హౌస్ నుంచి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలసి బాధితురాలు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి బయలుదేరిన మంత్రి కాన్వాయ్ని అడ్డుకున్నారు. వనిత కారు అద్దాలను ధ్వంసం చేసేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకుంటున్నా వినకుండా ప్రజాప్రతినిధులను దూషించారు. ఈ ఘటన ఒంగోలు రాంనగర్ ఒకటో లైను వద్ద చోటు చేసుకుంది. దీనిపై సంతనూతలపాడు నియోజకవర్గ వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కొమ్మూరి సుధాకర్ మాదిగ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకురాలు రావుల పద్మజ, ట్రాన్స్జెండర్ గోను దుర్గ, శేషమ్మ, రావిపాటి సీత, ఆళ్ల వెంకటరత్నం తదితరులు దాడికి కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యాచార ఘటనలో నిందితులకు 15 రోజులు రిమాండ్ కాగా అత్యాచారానికి పాల్పడిన ఇరువురు నిందితులను రేపల్లె అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించారని సీఐ వి.సూర్యనారాయణ తెలిపారు. అదేవిధంగా ఈ ఘటనలో బాల నేరస్తుడిని గుంటూరు బాల నేరస్తుల న్యాయస్థానంలో హాజరుపర్చగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించారన్నారు. -
AP: అత్యాచార బాధితురాలిని పరామర్శించిన హోంమంత్రి
సాక్షి, ప్రకాశం జిల్లా: రైల్వే స్టేషన్లలో భద్రత పెంచే విధంగా చర్యలు చేపడతామని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్న రేపల్లె అత్యాచార బాధితురాలిని ఆమె పరామర్శించారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ, భర్తను నిద్రలేపిన నిందితులు.. టైం అడిగి కొట్టారని, భర్తపై దాడిని అడ్డుకోబోయిన భార్యపై అత్యాచారానికి ఒడిగట్టారన్నారు. రైల్వేస్టేషన్ దగ్గరలో ఉన్న నేతాజీ కాలనీకి చెందిన నిందితులను గంటల వ్యవధిలోనే పట్టుకుని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. చదవండి👉: ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు బాధిత కుటుంబాన్ని పరామర్శించానని, బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించామన్నారు. నిందితులపై అట్రాసిటీ, రాబరీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశామన్నారు. గోప్యత కోసమే పరామర్శకు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఇస్తున్నామని, పరామర్శ పేరుతో అలజడి చేస్తామంటే కుదరదన్నారు. ‘‘కొన్ని నేరాలు టీడీపీ కార్యకర్తలే చేస్తున్నారని, అంటే టీడీపీ ప్రోత్సహిస్తోంది అనాలా’’ అంటూ హోంమంత్రి తానేటి వనిత ప్రశ్నించారు. -
ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. హోంమంత్రి తానేటి వనిత కాన్వాయ్పై దాడికి యత్నించారు. ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్న రేపల్లె అత్యాచారం బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారు అద్దాలు పగులగొట్టేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. టీడీపీ కార్యకర్తల ఆందోళనలతో రహదారిపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హోంమంత్రి కాన్వాయ్ పై దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. చదవండి: టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం 17 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు కాన్వాయ్పై దాడి ఘటనలో 17 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి
సాక్షి, ఏలూరు జిల్లా: ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామంలో హత్యకు గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంజి నాగప్రసాద్ కుటుంబ సభ్యులను హోంమంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి ఆళ్ల నాని, ఎంపీ మార్గాని భరత్రామ్తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. పార్టీ కోసం గంజి ప్రసాద్ ఎంతో సేవ చేశారు. ఎవరైతే హత్యకు పాల్పడ్డారో ఆ ముగ్గురు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కుటుంబ సభ్యులు చెప్తున్న బజారీ అనే వ్యక్తిపై విచారణ జరుగుతోంది. బాధిత కుటుంబానికి కచ్చితంగా న్యాయం చేస్తాం. ఈ హత్యకు కారకులు, ప్రేరేపించినవారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. పార్టీ వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుదని హోం మంత్రి భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. హత్యకు సంబంధించిన వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. ఢిల్లీలో ఉన్న సీఎం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాము. ఏ పార్టీ అయినా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది. వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. అసలైన నిందితులకు శిక్ష పడేలా చూస్తాము. గ్రామంలోని నాయకులు సంయమనం పాటించాలి. వారి కుటుంబానికి న్యాయం చేయడం మా బాధ్యత' అని మాజీ మంత్రి ఆళ్ల నాని అన్నారు. చదవండి👉 (వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య) ఇదిలా ఉంటే శనివారం ఉదయం.. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంజి నాగప్రసాద్ (55) దారుణ హత్యకు గురయ్యారు. పాత కక్షల నేపథ్యంలో అదే పార్టీకి చెందిన ముగ్గురు యువకులు కత్తులతో దాడిచేసి ఆయనను హత్యచేశారు. అనంతరం వారు పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తుల ముసుగులో టీడీపీ వర్గీయులు పథకం ప్రకారం దాడికి పాల్పడ్డారు. అనంతరం ఎమ్మెల్యేను పక్కనే ఉన్న పాఠశాలలో నిర్బంధించారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. జిల్లా పోలీస్ యంత్రాంగం రంగప్రవేశం చేసి, నాలుగు గంటల అనంతరం ఎమ్మెల్యేను ఇంటికి పంపించారు. -
మహిళలకు అండగా ‘దిశ’ స్టేషన్లు
పీఎం పాలెం (భీమిలి): దిశ పోలీస్స్టేషన్లు మహిళల రక్షణకు నిరంతరం అండగా ఉంటాయని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు . శనివారం విశాఖలోని ఎండాడ దిశ పోలీస్స్టేషన్ను ఆమె సందర్శించారు. మహిళలు, బాలికలపై జరుగుతోన్న అమానుష ఉదంతాలు తనని తీవ్రంగా కలిచి వేస్తున్నాయన్నారు. దిశ పోలీస్స్టేషన్లు రాష్ట్రవ్యాప్తంగా ఆపదలో ఉన్న 900 మంది మహిళలకు రక్షణ కల్పించాయని వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.24 కోట్ల మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లు చెప్పారు. విశాఖ దిశ పోలీస్ స్టేషన్ పరిధిలో 7.31 లక్షల మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపారు. దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తరవాత విధిగా దిశ పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ (ఎస్వోఎస్) చేయించుకోవాలని సూచించారు. ఎస్వోఎస్ సమయంలో కొంత సమాచారం ఇవ్వవలసి ఉంటుందని అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మహిళలకు అవగాహన కల్పించడానికి స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆమె తిలకించారు. -
గోపాలపురం ఎమ్మెల్యేపై దాడి.. స్పందించిన హోంమంత్రి
సాక్షి, విశాఖపట్నం: ఎండాడలో ‘దిశ’ పోలీస్ స్టేషన్ను హోం మంత్రి తానేటి వనిత శనివారం సందర్శించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణ కోసమే దిశ యాప్, దిశ చట్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చారని హోంమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 24 లక్షల మందికి పైగా దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. చదువుకొనే ప్రతి విద్యార్థిని దిశా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: AP: ఏలూరు కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత మహిళలపై దాడులను సీఎం జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరన్నారు. ఇటీవల మహిళలపై దాడులు చేయడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. వారే దాడులు చేసి వారే తిరిగి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. విశాఖ నగరంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన టీడీపీ నేత పై కేసు నమోదు చేశామన్నారు... జి.కొత్తపల్లి ఘటనపై స్పందిస్తూ.. ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై జరిగిన దాడిపై ఆమె స్పందిస్తూ.. ఎమ్మెల్యేపై జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకున్నానన్నారు. ఇప్పటికే తాను జిల్లా ఎస్పీతో మాట్లాడానని.. దాడి ఎందుకు జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారన్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేపై దాడి జరిగిందన్నారు. -
‘దిశ చట్టంతోనే రమ్య కుటుంబానికి న్యాయం జరిగింది’
సాక్షి, అమరావతి: రమ్య హత్య కేసులో శశికృష్ణకు ఉరి ఖరారు కావడంపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. కోర్టు విధించిన ఈ చారిత్రాత్మకమైన తీర్పుని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హత్య జరిగిన పది గంటల వ్యవధిలో శశికృష్ణను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు వారం రోజుల్లో ఛార్జ్ షీటు వేశారని తెలిపారు. 8 నెలల వ్యవధిలో తీర్పు వచ్చిందని, రమ్య కేసులో తీర్పుపై దిశ చట్టం ప్రభావం ఎంతైనా ఉందన్నారు. ‘ఆడ పిల్లలు ఇబ్బంది పడకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి దిశ యాప్ తీసుకువచ్చారు.. దిశ చట్టం పెండింగులో ఉన్నప్పటికీ పోలీసులకు కావాల్సిన సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేశారని’ చెప్పారు. దిశ చట్టంతోనే రమ్య కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు దిశ చట్టంపై హేళన మానుకోవాలని హితవు పలికారు. -
అత్యాచార ఘటనపై చంద్రబాబు రాజకీయం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచార ఘటనను చంద్రబాబు నీచ రాజకీయానికి వాడుకుంటున్నారని హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు బాధితురాలి వివరాలు బహిర్గతం చేయరాదని చట్టాలున్నా చంద్రబాబు ప్రచారం కోసం మీడియా ముందు అన్నీ బహిర్గతం చేయడం దారుణమన్నారు. ఈ కేసులో నిందితుల్ని మూడు గంటల్లోనే పట్టుకున్నట్లు గుర్తుచేశారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల పరిహారం అందజేశామన్నారు. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కోసం సిఫార్సు చేశామని, ఇంటిస్థలాన్ని, ఇంటిని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ దిశ చట్టానికి కేంద్ర మహిళా మంత్రిత్వశాఖ సానుకూలంగా స్పందించి, హోంశాఖకు సిఫార్సు చేసిందని తెలిపారు. -
రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
తాళ్లపూడి: రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. మండలంలోని ప్రక్కిలంక నుంచి చిట్యాల వరకూ ఆర్అండ్బీ రోడ్డుకు ప్రక్కిలంకలో ఆదివారం ఆమె శంకుస్థాపన చేశారు. రూ.3.40 కోట్లతో ఎనిమిది కిలోమేటర్ల మేర ఈ బీటీ రోడ్డు పనులు చేపడుతున్నారు. శంకుస్థాపన అనంతరం తాళ్లపూడిలోని అబుబాకర్ మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో మంత్రి వనిత పాల్గొన్నారు. ముస్లింల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని అన్నారు. మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ పోశిన శ్రీలేఖ, ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కాకర్ల వెంకటేశ్వరరావు, ఆర్అండ్బీ డీఈ హరికృష్ణ, ఏఈ సమీర్, సర్పంచులు యాళ్ల స్వప్న, కొమ్మిరెడ్డి పరశురామారావు, ఎల్లిన శివ, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తాం: హోంమంత్రి తానేటి వనిత
సాక్షి, విజయవాడ: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటన హేయనీయమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఘటనకు సంబంధించిన నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ప్రభుత్వం ఉపేక్షించదని తెలిపారు. నిందితులను ఉరి తీయడం న్యాయస్థానం పరిధిలో ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారని పేర్కొన్నారు. బాధితురాలికి ఇల్లు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని, యువతి చేస్తానంటే ఉద్యోగం కూడా ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు సూచించామని హోంమంత్రి పేర్కొన్నారు. యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని, నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం జగన్ ఆదేశించారని తానేటి వనిత తెలిపారు. పెస్టిసైడ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగిని తొలగించామని తెలిపారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశారని అన్నారు. చంద్రబాబు మానసికంగా బాధపడుతున్న యువతి విషయంలోనూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగినపుడు ఇంత వేగంగా చర్యలు తీసుకోలేదని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఒంగోలు పర్యటన దృష్టి మరల్చేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. చదవండి👉: బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు వెళ్తే టీడీపీ దౌర్జన్యం చేసింది: వాసిరెడ్డి పద్మ -
ఏసీబీ, దిశ ఎస్ఈబీలకు ప్రాధాన్యత ఇవ్వాలి: సీఎం జగన్
-
అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీకి యాప్: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏసీబీ, దిశ, ఎస్ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అధికారులను ఆదేశించారు. దిశ తరహాలో అవినీతి ఫిర్యాదులకుగానూ ఏసీబీ యాప్ తేవాలని ఆయన అధికారులకు సూచించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో హోం శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏసీబీకి యాప్ ద్వారా ఆడియో ఫిర్యాదు సైతం చేయొచ్చని పేర్కొన్నారు. అవినీతి చోటు చేసుకుంటున్న విభాగాలను క్లీన్ చేయాల్సిందేని ఆయన అధికారులను ఆదేశించారు. నెలరోజుల్లోగా ఏసీబీ యాప్ రూపకల్పన జరగనుందని, నేర నిర్ధారణకు ఫోరెన్సిక్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. అలాగే మండల స్థాయి వరకూ ఏసీబీ స్టేషన్లు ఉంటాయని చెప్పారు. ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ ఉంటుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటు ఉండరాదని తెలిపారు. మూలాల్లోకి వెళ్లి కూకటివేళ్లతో పెకిలించేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం.. విద్యాసంస్థలపైనా ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. చీకటి ప్రపంచంలో వ్యవహారాలను నిర్మూలించాలని తెలిపారు. ప్రతినెలా ఈ అంశాల్లో ప్రగతిని నివేదించాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఈబీకి ప్రత్యేక కాల్ సెంటర్ నంబర్ ఉంటుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: ఎప్పటికీ వైఎస్ జగన్కు విధేయుడినే: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి -
ఫ్రెండ్లీ పోలీసింగ్ను పక్కాగా అమలు చేస్తాం: ఏపీ డీజీపీ
సాక్షి, అమరావతి: ఫ్రెండ్లీ పోలీసింగ్ను పక్కాగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్రైమ్ రేటు తగ్గింపు, నాటు సారా అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. నెల్లూరు కోర్టులో దొంగతనంపై సాక్ష్యాలు ఆధారంగా ముందుకెళ్లామని చెప్పారు. విచారణలో వాస్తవాలని బట్టి ముందుకెళ్లాలని తెలిపారు. కేసులపై ఆరోపణలు చేయవచ్చు, కానీ వాస్తవాలు విచారణలో బయటపడతాయని తెలిపారు. ఎవరిదగ్గరైనా ఆధారాలుంటే ఇవ్వాలని సమన్లు జారీ చేశామని అన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేపట్టామని పేర్కొన్నారు. దిశ యాప్లో రిజిస్టర్ చేసుకుంటే మహిళల వ్యక్తిగత సమాచారానికి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఆలూరు ఘటనలో 82 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. శాంతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. కఠినంగా లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఉషశ్రీ చరణ్ ర్యాలీకి, చిన్నారిని తీసుకెళ్లే సమయానికి గంట తేడా ఉందని చెప్పారు. పాడేరు, మన్యం జిల్లాల్లో పోలీసు కార్యాలయాలు 15 రోజుల్లోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. -
హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తానేటి వనిత
సాక్షి, అమవరావతి: ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా మంత్రి తానేటి వనిత సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అప్పగించిన బాధ్యతను శక్తి వంచన లేకుండా నిర్వర్తిస్తానని తెలిపారు. న్యాయం, చట్టం వివక్ష లేకుండా అందిస్తున్న ప్రభుత్వంలో.. ఫ్రెండ్లీ పోలీస్, క్విక్లీ రెస్పాన్స్ విధానంతో పనిచేస్తామని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో మూడు ఏళ్లుగా సీఎం జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఫ్రెండ్లీ పోలీసింగ్లో ఏపీకి జాతీయ అవార్డులు కూడా తీసుకొచ్చారని కొనియాడారు. ‘టెక్నాలజీ వినియోగలోనూ మన పోలీస్ విభాగం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. రాబోయే రెండేళ్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాం. మహిళలపై నేరాల నియంత్రణకు కృషి చేస్తాం. దిశ చట్టం కేంద్రంలో పెండింగ్లో ఉన్నా అందులోని అంశాలను అమలు చేస్తున్నాం. దిశా యాప్ ద్వారా 900 మందికిపైగా ఆడపిల్లల్లను కాపాడారు. పోలీస్ వ్యవస్థలో పారదర్శకత, ఫ్రెండ్లీ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్ అమలును కొనసాగిస్తాం. శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడ రాజీ పడకుండా పనిచేస్తాం. జగనన్న స్ఫూర్తి తోనే పనిచేస్తాం’ అని తెలిపారు. చదవండి: వైద్యారోగ్య శాఖ మంత్రిగా విడదల రజిని బాధ్యతలు -
పోరస్ బాధితులకు సీఎం జగన్ రూ. 25 లక్షల పరిహారం..
-
అవసరమైతే పోరస్ ఫ్యాక్టరీని సీజ్ చేస్తాం: హోంమంత్రి తానేటి వనిత
-
పోరస్ ఫ్యాక్టరీ ప్రమాదం చాలా బాధాకరం: హోంమంత్రి తానేటి వనిత
-
అవసరమైతే పోరస్ ఫ్యాక్టరీని సీజ్ చేస్తాం: హోంమంత్రి తానేటి వనిత
సాక్షి, విజయవాడ: పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన బాధితుల్ని ఆంధ్రా ఆస్పత్రిలో హోం మంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పోరస్ ఫ్యాక్టరీ ప్రమాదం చాలా బాధాకరం. బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. బాధితులందరికీ అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఫ్యాక్టరీ యాజమాన్యం తరపున రూ.25 లక్షల పరిహారం అందజేస్తాం. ఇక్కడ ఫ్యాక్టరీ వద్దని స్థానికులు అంటున్నారు. ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించాం. అవసరమైతే ఫ్యాక్టరీని సీజ్ చేస్తాం' అని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. చదవండి: (ఏలూరు: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి) -
హోం శాఖ అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నా: తానేటి వనిత
ఉమ్మడి ఆంధ్రపదేశ్లో తొలిసారి మహిళకు హోం మంత్రి పదవి కట్టబెట్టిన ఘనత దివంగత మహానేత వైఎస్సార్దైతే, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేశారు. వరుసగా ఇద్దరు దళిత మహిళలకు కీలకమైన ఈ బాధ్యతలు కేటాయించారు. రాష్ట్ర హోం, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత ఈ మాటలన్నారు. మొదటి విడతలోనే మంత్రి పదవి వస్తుందని ఊహించలేదన్నారు. రెండోసారి హోం శాఖ అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియోజకవర్గానికి వచ్చిన వనిత బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా ఏమన్నారంటే.. –కొవ్వూరు ప్రశ్న: పోలీసులపై పని ఒత్తిడి అధికంగా ఉంది. వారాంతపు సెలవులు కొన్నిచోట్ల సక్రమంగా అమలు కావడం లేదన్న వాదనలు ఉన్నాయి? మంత్రి: క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఇబ్బందులను తెలుసుకుంటాను. పోలీసులకు కచ్చితంగా వారాంతపు సెలవులు అన్నిచోట్లా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి ఫ్రెండ్లీ పోలీసింగ్కు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎంతో అవసరం. ఏ సమస్యపైనైనా ప్రజలు నిర్భయంగా స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే ప్రజలకు, పోలీసులకు మధ్య çసుహృద్భావ వాతావరణం ఉండాలి. దీనివల్ల ప్రజల్లో సదభిప్రాయం కలుగుతుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. మహిళలు, యువతులపై అకృత్యాల నివారణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే ప్రభుత్వం ప్రతి పోలీసు స్టేషన్లో మహిళా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. దిశ సహాయ కేంద్రం పేరుతో మహిళా కానిస్టేబుల్ను నియమించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ప్రతి జిల్లాకి ఒక దిశ పోలీసు స్టేషన్తో పాటు ప్రత్యేకంగా దిశ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. దిశ యాప్ ద్వారా పోలీసుల నుంచి ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకున్నాం. మంత్రివర్గ పునర్ వ్యవస్ధీకరణ ఎలా ఉంది? మంత్రి వర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 70 శాతం పదవులు కేటాయించడం ద్వారా సామాజిక విప్లవానికి సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, కాపు, మైనారిటీ వర్గాలకు చెందిన ఐదుగురు మంత్రులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం ఓ చారిత్రక నిర్ణయం. భవిష్యత్తు తరాల రాజకీయాలకు సీఎం ఓ దిక్సూచిగా నిలిచారు. హైవే పెట్రోలింగ్ వాహనాల్లో పోలీసుల పని తీరుపై విమర్శలున్నాయి. దీనిపై మీ స్పందన.? హైవేల్లో ప్రమాదాలు సంభవించిన సమయంలో తక్షణ సాయం అందించేందుకు నిర్దేశించిన హైవే పెట్రోలింగ్ వాహనాల పనితీరు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటాం. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేలా చూస్తాం. పోలీసుల్లో అవినీతి నియంత్రణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు.? అవినీతి అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. అందుకు ప్రజల వైఖరిలోను మార్పు రావాల్సిన అవసరం ఉంది. డబ్బులిస్తేనే తొందరగా పని అవుతుందన్న భావన నుంచి ప్రజలు బయటికి వస్తేనే అవినీతి కట్టడి అవుతుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటున్నారు.? రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. శాంతిభద్రతలకు విఘాతం కలించే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ఇటీవల తాడేపల్లిగూడెం నిట్ కళాశాలలో ర్యాగింగ్ అంశం తెరపైకి వచ్చింది. కళాశాలల్లో ర్యాగింగ్ నియంత్రణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు.? ర్యాగింగ్కి పాల్పడితే కలిగే అనర్థాలు, శిక్షల గురించి విద్యార్థుల్లో అవగాహన పెంపొందిస్తాం. విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. ప్రతీ కళాశాలలో ర్యాగింగ్ నియంత్రణ కమిటీల పనితీరును మెరుగు పరిచేలా చర్యలు తీసుకుంటాం. -
తానేటి వనిత అనే నేను..
-
AP New Cabinet: జగన్ మార్క్.. సామాజిక న్యాయం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కేబినెట్ పునర్వవస్థీకరణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు అగ్రాసనం వేశారు. కేబినెట్ కూర్పులో పార్టీ అజెండా ప్రకారం ఎస్సీ, బీసీ వర్గాలకు మూడొంతులు ప్రాతినిధ్యం కల్పిస్తూనే సామాజిక సమతూకాన్ని కూడా పాటించారు. తొలి కేబినెట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహించగా జిల్లాల పునర్విభజన తరువాత ఏర్పడుతున్న కేబినెట్లో ప్రాతినిధ్యం నాలుగుకు పెరిగింది. పార్టీపై నిబద్ధత, పనితీరు, సీనియారీటీ, నాయకత్వ పటిమ, సమర్థతలే కొలమానంగా మంత్రుల ఎంపిక జరిగింది. రెండేళ్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల టీమ్గా సీఎం కేబినెట్లోకి ఏరికోరి మంత్రులను తీసుకున్నారు. జిల్లాల విభజన తరువాత ఏర్పడ్డ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి నలుగురుకి ప్రాతినిధ్యం లభించడంపై జిల్లాల్లో పార్టీ శ్రేణులు సంబరాలలో మునిగితేలుతున్నాయి. తొలి కేబినెట్లో మంత్రులుగా ఉన్న పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనితలకు మరోసారి చోటు కల్పించారు. కాకినాడ జిల్లా నుంచి ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు తొలిసారి కేబినెట్లో అవకాశం లభించింది. ఉమ్మడి జిల్లా నుంచి నలుగురుకి ప్రాతినిధ్యం కలి్పంచగా ఎస్సీల నుంచి ఇద్దరికి, బీసీల నుంచి ఒకరికి అవకాశం కల్పించారు. నాలుగోసారి మంత్రిగా విశ్వరూప్ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనుంగ శిష్యుడైన విశ్వరూప్ నాలుగోసారి మంత్రి అవుతున్నారు. 2009లో వైఎస్ కేబినెట్లో తొలిసారి మంత్రిగా నియమితులైన విశ్వరూప్ వైఎస్ మరణానంతరం కిరణ్కుమార్రెడ్డి కేబినెట్లో కూడా కొనసాగారు. మంత్రిగా పదవీ కాలం ఆరు నెలలుండగానే మహానేతతో ఉన్న అనుబంధంతో పదవిని తృణప్రాయంగా విడిచిపెట్టి జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. ఆవిర్భావం నుంచి పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసి కోనసీమలో ఎస్సీ సామాజికవర్గంతో పాటు ఇతర సామాజికవర్గాల్లో మంచి పట్టు సాధించి సమర్థత కలిగిన నేతగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే తొలి కేబినెట్లో ఉన్న విశ్వరూప్ను రెండోసారి కేబినెట్లోకి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకున్నారు. విశ్వరూప్ను కేబినెట్లో కొనసాగించడం ద్వారా కోనసీమ జిల్లాలో బలమైన సామాజికవర్గాల పరంగా మంచి ముద్ర వేస్తారని నేతలు విశ్లేషిస్తున్నారు. విశ్వరూప్ వివాదరహితుడిగా ఉండడం రెండోసారి మంత్రి పదవి దక్కడానికి ఒక కారణమైంది. మరోసారి కేబినెట్లోకి వేణు బీసీ సంక్షేమశాఖా మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రెండోసారి కేబినెట్లోకి తీసుకున్నారు. వేణు ఎంపిక ద్వారా బలహీనవర్గాలలో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి సీఎం సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు ముఖ్య అనుచరుడిగా ఆయన ఉండేవారు. కోనసీమలో రాజోలు ప్రాంతానికి చెందిన వేణు సమర్థతను గుర్తించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడిగా చేశారు. అనంతరం ఓదార్పు యాత్రలో జగన్మోహన్రెడ్డి వెంట నడిచిన వేణు నాటి నుంచి పార్టీ పట్ల విధేయతతో పనిచేశారు. శెట్టిబలిజల్లో బలమైన నేతగా ఉన్న వేణును రామచంద్రపురం నుంచి పోటీచేయించి ఎమ్మెల్యేను చేసి తొలి కేబినెట్లో మంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు రెండోసారి కేబినెట్లో కూడా ప్రాతిని«ధ్యం కలి్పంచడం ద్వారా ఆ సామాజికవర్గానికి సముచిత స్థానం దక్కింది. వేణు వాగ్ధాటితో పార్టీ వాణిని బలంగా వినిపించడం, బీసీ సంక్షేమశాఖను సమర్థంగా నిర్వహించడం కూడా కలిసి వచ్చింది. శ్రమించిన వనితకు మరో చాన్స్ కొవ్వూరు నియోజకవర్గం ఏర్పాటు తరువాత తొలి మహిళా ఎమ్మెల్యే, మంత్రిగా తానేటి వనితకు రెండోసారి సీఎం జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో అవకాశం కలి్పంచారు. 2012లో వైఎస్సార్ సీపీలో చేరిన వనిత అప్పటి నుంచి పార్టీ కోసం శ్రమించారు. సాధారణ గృహిణిగా ఉన్న వనిత తండ్రి, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని పార్టీ ప్రగతిలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2019లో వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యే అయిన వనిత తొలి కేబినెట్లో స్త్రీశిశుసంక్షేమశాఖ మంత్రిగా సమర్థవంతమైన సేవలందించారు. జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా మహిళలకు ఆది నుంచి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కొవ్వూరు నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎమ్మెల్యేగా ఉన్న వనితకు మంత్రి పదవి కట్టబెట్టారు. సమర్థత, పార్టీలో సామాజిక సమతూకాలను బేరీజు వేసుకుని వనితకు మరోసారి అవకాశం కల్పించడం ద్వారా ఎస్సీలలో మాదిగ సామాజిక వర్గానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రాతినిధ్యం కల్పించడంపై హర్షం వ్యక్తమవుతోంది. నిబద్ధతకు గుర్తింపు మూడు దశాబ్దాలపాటు తునిలో రాజకీయాలను శాసించిన యనమల వంటి రాజకీయ వటవృక్షాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేసిన తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాను ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్లో తొలిసారి తీసుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో ఒక సైనికుడిలా పనిచేస్తూ వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో పోరాట పటిమతో పార్టీని విజయ పథం వైపు నడింపించడం తాజా మంత్రి వర్గంలో తీసుకోవడానికి దోహదం చేసింది. వాస్తవానికి తొలి కేబినెట్లోనే చాన్స్ దక్కుతుందని పార్టీ శ్రేణులు ఆశించాయి. చివరకు వివిధ సమీకరణల్లో ప్రభుత్వ విప్ లభించింది. అప్పుడే మలివిడత కేబినెట్లో బెర్త్ ఖాయమైంది. అందుకు అనుగుణంగానే కాకినాడ జిల్లా నుంచి రాజాను మంత్రి పదవి వరించింది. తుని నియోజకవర్గం నుంచి వరుసగా రెండు పర్యాయాలు యనమల సోదరుడిపై గెలుపొందడమే కాకుండా నియోజకవర్గ టీడీపీ నేతలకు సింహస్వప్నంగా నిలిచారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వంటి అక్రమ కేసులతో వేధింపులు ఎదుర్కొన్నారు. వైఎస్సార్ సీపీని వీడి పారీ్టలోకి రావాలని పలు ప్రలోభాలకు గురిచేసినా లెక్క చేయకుండా పార్టీ పైన, అధినేత జగన్పైన ఎంతో విశ్వాసంతో పార్టీ వెన్నంటి నిబద్ధతతో నిలవడం కలిసి వచ్చింది. కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలుంటే ఆరు నియోజకవర్గాల నుంచి కాపు సామాజిక వర్గీయులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మలి కేబినెట్లో రాజాకు అవకాశం కల్పించి ఆ సామాజిక వర్గానికి పెద్ద పీటేశారు. తునిలో ఆ సామాజికవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం ఇదే ప్రథమం. మంత్రి పదవి కూడా జగన్మోహన్రెడ్డి కేబినెట్లో దక్కడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆ సామాజికవర్గీయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కోనసీమకు జోడు పదవులు... జిల్లాల విభజన తరువాత కోనసీమకు జోడు పదవులు దక్కాయి. జిల్లాల పునర్విభజన తరువాత దాదాపు ఒకో జిల్లాకు ఒకో మంత్రి పదవి దక్కిన క్రమంలో కోనసీమ జిల్లాకు ఒకేసారి రెండు బెర్త్లు దక్కాయి. ఆ రెండు కూడా ఎస్సీ, బీసీలకే కట్టబెట్టడం ద్వారా ఆ వర్గాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఉన్న అభిమానం తేటతెల్లం అవుతోంది. కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వు›కావడంతో ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్టయ్యింది. అమలాపురం నుంచి విశ్వరూప్, రామచంద్రపురం నుంచి వేణులను కేబినెట్లోకి తీసుకోవడం ద్వారా సీనియర్లను కొనసాగించినట్టయింది. వైఎస్సార్ సీపీకి తొలి నుంచి వెన్నంటి నిలుస్తోన్న ఎస్సీ, బీసీ సామాజికవర్గాలకు ఈ కేబినెట్లో సముచిత స్థానం కల్పించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న బీసీలు, కాపులు, మాల, మాదిగలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడంపై పార్టీ శ్రేణుల్లోనే కాకుండా మూడు జిల్లాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
మంత్రి పదవికి రాజీనామా తర్వాత మీడియాతో తానేటి వనిత
-
బాల్య వివాహాలకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బాల్య వివాహాలను ప్రభుత్వం అరికడుతోందని, ఒక్క అనంతపురం జిల్లాలోనే గత మూడేళ్లలో 1,508 బాల్య వివాçహాలను అడ్డుకుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత శాసన మండలిలో చెప్పారు. అనంతపురం జిల్లాలో బాల్య వివాహాలపై ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఎన్జీవోల సహాయంతో అనంతపురం జిల్లాలో 2019 ప్రారంభంలో 396, 2019 చివరలో 337, 2020లో 357, 2021లో 418 బాల్య వివాçహాలను అడ్డుకున్నట్లు తెలిపారు. బాల్య వివాహల నియంత్రణకు వైఎస్సార్ కిశోరి వికాసం కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లాలోని అన్ని పాఠశాలలు, జానియర్ కాలేజీల్లో అవగాహన తరగతులు నిర్వహించినట్టు తెలిపారు. సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శు (మహిళా పోలీసు)ల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నట్టు తెలిపారు. కొత్తగా 17 స్టేడియాలు రాష్ట్రంలో కొత్తగా 17 స్టేడియాల అభివృద్ధికి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో తెలిపారు. కొన్ని పూర్తిగా ప్రభుత్వ నిధులతో, మరికొన్ని పీపీపీ విధానంలో, ఇంకొన్ని ఖేల్ ఇండియా పథకంలో చేపడుతున్నట్టు వివరించారు. 1.53 లక్షల క్వింటాళ్ల బియ్యం స్వాధీనం ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేసి 2019 నుంచి ఇప్పటి వరకు 1.53 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు మంత్రి కొడాలి నాని శాసన మండలిలో చెప్పారు. -
రాజన్న కలను జగనన్న నిజం చేస్తున్నారు: మంత్రి తానేటి వనిత
-
ఏపీలో ‘మహిళా సాధికారత’ను ఎలుగెత్తి చాటుదాం
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం మనదని, మహిళా పక్షపాతి అయిన సీఎం జగనన్న పాలనలో మహిళలకు భరోసా కలుగుతోందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు. రాష్ట్రంలోని జెడ్పీ, మునిసిపల్ చైర్పర్సన్లు, మేయర్లు, జెడ్పీటీసీ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల ద్వారా మహిళలకు జరుగుతున్న మేలును మహిళా సదస్సు ద్వారా ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. మహిళల పట్ల సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను విశదీకరించి ప్రజలకు తెలియచేయాలని సూచించారు. చదవండి: (చంద్రబాబు చెంచాలు మద్యం తాగి మాట్లాడుతున్నారు: పద్మజ) పండుగలా జరుపుకోవాలి: రోజా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి మహిళా సదస్సును పండుగలా జరుపుకోవాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సీఎం జగన్ మహిళలకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రీజనల్ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ ఇన్చార్జ్లు, మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, నగర అధ్యక్షులతో రోజా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చదవండి: (మేం చెప్పిందే చేశాం.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం: మల్లాది విష్ణు) -
అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది
సాక్షి, అమరావతి: అంగన్వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు చరిత్రను ఎవరూ మరిచిపోలేదని, నేడు అంగన్వాడీలు, ఆశాలకు సీఎం వైఎస్ జగన్ మేలు చేస్తుంటే ఓర్వలేక వాస్తవాలను వక్రీకరిస్తూ చంద్రబాబు అండ్ కో చేస్తున్న దు్రష్పచారాలను ప్రజలు గమనిస్తున్నారని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం. మహిళల జీవన ప్రమాణాలు పెంచడానికి, ఆర్ధికంగా వారికి అండగా నిలవడానికి సీఎం జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. అలాంటి ప్రభుత్వం మీద ఈర‡్ష్య, అసూయలతో చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. బాబుతో కుమ్మక్కైన ఎర్ర పార్టీల్లోని కొందరు ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. వీరిని అదే జాతికి చెందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 సంస్థలు తమ భుజాలపై మోస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాయి.’ అని మంత్రి వనిత పేర్కొన్నారు. -
‘టీడీపీ నేతలు మహిళలపై అకృత్యాలు చేయడం మానలేదు’
సాక్షి, కృష్ణా: విజయవాడకు చెందిన 14 సంవత్సరాల మైనర్ బాలిక ఆత్మహత్య చాలా బాధాకరమని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ.. సమాజంలో ఇలాంటి ఘటనలు నిరంతరం జరుగుతున్నాయని మనం ఎన్ని చట్టాలు చేసినా, కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇలాంటి వాటికి పుల్ స్టాప్ పడడం లేదని అవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ ఇటీవల సత్ఫలితాలనిస్తోందని చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. దీనికి కారణమైన టీడీపీ కార్పొరేటర్ విజయ జైన్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలుగుదేశం పార్టీ నేతలు గతంలోనూ, ఇప్పుడు మహిళలపై అకృత్యాలు చేయడం మానలేదుని మండిపడ్డారు. మొన్న లోకేష్ అనుచరుడు, నేడు కేశినేని నాని అనుచరుడు మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. స్త్రీని ఆట బొమ్మగా ఆడుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం జగన్ని వేలెత్తి అర్హత లేదని సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్త్రీల పట్ల అనేక చట్టాలు చేస్తూ మహిళా సంక్షేమం కోసం 1800 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. -
పాడి రైతులకు మంచి రోజులు : సీఎం జగన్
కనీసం ఒక లీటర్ మంచి నీళ్ల సీసా ధర కూడా పాలకు రావడం లేదని, ఇలాగైతే ఎలా బతకాలని అక్కచెల్లెమ్మలు నా పాదయాత్ర సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చాలని అప్పుడే నిర్ణయించుకున్నా. అందుకే పాలుపోసే అక్కచెల్లెమ్మలకు మంచి రేటు వచ్చేట్టుగా, ఎటువంటి మోసం, దళారులు లేని పరిస్థితిని అమూల్ ద్వారా తీసుకువచ్చాం. ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో అమూల్ పాల సేకరణ చేస్తోంది. ఇప్పుడు ఏడవ జిల్లాగా అనంతపురంలో అడుగుపెట్టింది. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమూల్తో పోటీ వల్లే ప్రైవేట్ డెయిరీలు కూడా పాల రేట్లు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని, వాళ్లకేదైనా అదనపు ఆదాయం గ్రామంలోనే ఏర్పాటు కావాలన్నదే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే పరిస్థితి రావడంతో పాటు మెరుగైన అవకాశాలు ఇవ్వాలన్న తపన, తాపత్రయంతో పలు కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. అనంతపురం జిల్లాలో జగనన్న పాల వెల్లువ శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో అమూల్ రంగ ప్రవేశం వల్ల పాడి ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మ, రైతన్నలకు మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే కేవలం దానిమీదే ఆధారపడితే సరిపోని పరిస్థితుల్లో పాడిని తోడుగా చేసుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో పాల ఉత్పత్తికి, పాడి పెంపుదలకు అమూల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. అక్క చెల్లెమ్మలే యజమానులు ► అమూల్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉన్న సంస్థ. దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. పాలు పోస్తున్న అక్కచెల్లెమ్మలే అమూల్ యాజమానులు. అందుకే మార్కెట్లో ఏ ఇతర ప్రైవేటు డెయిరీ కంటే అమూల్ ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేస్తుంది. ► పాలు కొనుగోలు చేయడమే కాకుండా ప్రాసెసింగ్లో అమూల్కు అపార అనుభవం ఉంది. పాల నుంచి నేరుగా చాక్లెట్లు తయారు చేసే స్థాయికి అమూల్ ఎదిగింది. ప్రపంచ సంస్థలతో పోటీ పడుతోంది. అందువల్లే ఎలాంటి మోసాలు, కల్తీ, దళారుల డెడద లేకుండా అక్కచెల్లెమ్మలకు మంచి రేటు ఇస్తోంది. వచ్చిన లాభాలను కూడా బోనస్ రూపంలో ప్రతి ఆరు నెలలకోసారి అక్కచెల్లెమ్మలకు వెనక్కు ఇస్తోంది. సహకార రంగంలో ఇంతకన్నా గొప్ప పరిస్థితి ఎప్పుడూ, ఎక్కడా చూడలేం. ► మన రాష్ట్రంలో సహకార రంగాన్ని నీరుగార్చిన నేపథ్యంలో అక్కడో, ఇక్కడో ఉన్న కొద్దొ గొప్పో డెయిరీలు సహకార రంగంలో ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తుల గుప్పిట్లో ఉన్నాయి. వాస్తవానికి సహకార రంగంలో ఉండటం అంటే ఇలా.. అని చూపించిన పరిస్థితి దేశం మొత్తం మీద అమూల్లోనే ఉంది. లాభాలు పాలు పోసే అక్కచెల్లెమ్మలకే వస్తాయి అని అమూల్ చూపించింది. అందుకే అమూల్కు అంత ప్రాధాన్యత. అమూల్ రాకతో పోటీతో పాటు మార్పు ►నా పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ పాలు పోసే అక్కచెల్లెమ్మలు, రైతులు వచ్చి వాటర్ బాటిల్ చూపించే వారు. మార్కెట్లో వాటర్ బాటిల్ ధర రూ.23 అయితే, లీటరు పాలు అంత కన్నా తక్కువకే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఇలా అయితే మేం ఎలా బతకాలని అడిగే వారు. ఈ పరిస్థితిని మార్చడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. ► అమూల్ రావడం వల్ల మిగిలిన పాలు సేకరించే డెయిరీలు కూడా పోటీలో లీటరుకు రూ.5 నుంచి రూ.20 వరకు పెంచి ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడే ఎందుకు రేటు పెరిగిందంటే.. గతంలో గ్రామ స్థాయిలో మోసాలే కారణం. పాలు పోసిన వెంటనే గతంలో వాళ్లు చెప్పిందే క్వాలిటీ, ఇచ్చేదే రేటు అనే పరిస్థితులు ఉండేవి. ► రాష్ట్రంలో పాలు సేకరించే ప్రతి చోటా బీఎంసీయూ (బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు) ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. దాదాపు 4,900 బీఎంసీయూలు, 11,690 ఏఎంసీయూ (ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్)లను ఏర్పాటు చేస్తోంది. ► అమూల్ విస్తరించే కొద్దీ, ప్రతి గ్రామంలో ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్తాం. వీటి వల్ల అక్కచెల్లెమ్మలు పాలు పోసేటప్పుడు అక్కడికక్కడే.. పాలు పోసిన వెంటనే ఎన్ని లీటర్లు పోశారు.. ఎంత ధర వస్తుందని వివరిస్తూ రశీదు ఇస్తారు. నేరుగా క్వాలిటీ టెస్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. మీ కళ్ల ముందే పారదర్శక పద్ధతిలో పాల సేకరణ జరుగుతుంది. మోసాల నివారణకు చర్యలు ► పాల సేకరణలో జరిగే మోసాలను నివారించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ధ్యాస పెట్టింది. తనిఖీలు విస్తృతంగా చేపట్టింది. దీనివల్ల ఇప్పటికే పలు ప్రాంతాల్లో 20 కేసులు నమోదయ్యాయి. ఇలా పట్టుబడిన కేసుల్లో ప్రైవేటు డెయిరీలు లీటరుకు 45 పైసల నుంచి రూ.10.95 వరకు పాడి రైతులకు తక్కువ చెల్లిస్తున్నట్టు వెల్లడైంది. ► ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో బాలమృతం, అంగన్వాడీ సెంటర్లకు పాల సరఫరాపై అమూల్తో అవగాహన ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేశారు. అమూల్ ఎండీ ఆర్ఎస్ సోథీ, కైరా మిల్క్ యూనియన్ ఎండీ అమిత్ వ్యాస్, బనస్కాంత మిల్క్ యూనియన్ ఎండీ సంగ్రామ్ చౌదరి, సబర్కాంత మిల్క్ యూనియన్ ఎండీ అనిల్ బయాతీలకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. దేవుడి దయతో ప్రజలందరికీ ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. -
బాబాజీరావుకు వైఎస్ విజయమ్మ పరామర్శ
సాక్షి, దేవరపల్లి/కొవ్వూరు: గోపాలపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకుడు, రాష్ట్ర మంత్రి తానేటి వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావును వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైదరాబాద్లోని సీటీ న్యూరో ఆసుపత్రిలో బుధవారం పరామర్శించారు. బాబాజీరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా బాబాజీరావు యోగక్షేమాలను ఆమె అడిగి తెలుసుకుని, ఆరోగ్యం త్వరగా మెరుగుపడి కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ మంత్రి తానేటి వనిత, కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం బాబాజీరావు ఆరోగ్యం మెరుగుపడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
అమ్మలా ఆలోచించారు
సాక్షి, అమరావతి: పిల్లల ఆరోగ్యం పట్ల ఒక తల్లి ఎంత శ్రద్ధ తీసుకుంటుందో ముఖ్యమంత్రి జగన్ ఓ మేనమామగా అంతకుమించి ఆలోచిస్తున్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ అందచేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమని, దీనివల్ల పేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇన్ఫెక్షన్ల బారినపడ్డ పిల్లలు తమ సమస్యను ఎవరితోనూ చెప్పుకోలేక మానసిక ఆందోళనకు గురవడం వల్ల చదువులపై ప్రభావం పడుతుందన్నారు. మంగళవారం ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మంత్రి వనిత మాట్లాడారు. రెండు నెలలకు సరిపడా స్కూళ్లకు స్టాక్ ‘గతంలో స్కూళ్లలో టాయిలెట్స్ కూడా ఉండేవి కాదు. ఇప్పుడు నాడు– నేడు ద్వారా రన్నింగ్ వాటర్తో టాయిలెట్స్ సదుపాయం కల్పించడం వల్ల పిల్లలు నిశ్చింతగా పాఠశాలలకు వస్తున్నారు. విద్య, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో నిర్వహించే స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా 10 లక్షల మంది విద్యార్ధులకు న్యాప్కిన్స్ అందచేస్తాం. ప్రతీ స్కూల్లో నోడల్ ఆఫీసర్ దీనిని పర్యవేక్షిస్తారు. దీంతోపాటు వైఎస్సార్ చేయూత స్టోర్స్ ద్వారా కూడా తక్కువ ధరకే బ్రాండెడ్ న్యాప్కిన్స్ అందుబాటులో ఉంచుతున్నాం. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, నైన్ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నాం. అక్టోబర్, నవంబర్ నెలలకు సరిపడా స్టాక్ ఇప్పటికే స్కూళ్లకు పంపించాం. ముఖ్యమంత్రి జగన్ మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా ఏడాదికి రూ.1,800 కోట్లు కేటాయిస్తున్నారు. రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. దిశ యాప్ తెచ్చి మహిళలకు చక్కటి వరాన్ని ఇచ్చారు. మీరు తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వల్ల ఎంతోమంది పేద కుటుంబాల్లో వారి తల్లిదండ్రులు ఇవ్వలేనివి పిల్లలకు అందుతున్నాయి’ అని మంత్రి వనిత పేర్కొన్నారు. -
‘దిశ’తో మహిళల్లో ఆత్మస్థైర్యం
సాక్షి, అమరావతి: దిశ బిల్లు, దిశ యాప్ వల్ల మహిళల్లో చైతన్యం పెరిగిందని.. మహిళల భద్రత, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలను చూసి ఓర్వలేక టీడీపీ నేత నారా లోకేశ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. మహిళలను అవమాన పరిచే రీతిలో పార్టీ మహిళా నేతల సమక్షంలో ‘దిశ’ప్రతులను తగలబెట్టడం లోకేశ్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. బుధవారం సచివాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. దిశ బిల్లు చట్ట రూపం దాల్చడంలో జాప్యం జరుగుతున్నా, మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించిందన్నారు. దిశ యాప్ ద్వారా మహిళలు, యువతులపై దాడులను ముందుగానే అడ్డుకుని రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని మహారాష్ట్ర, చత్తీస్గఢ్, జార్ఖండ్ ‘దిశ’ను అమలు చేసేందుకు అధ్యయనం చేస్తున్నాయన్నారు. మహిళల రక్షణకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దిశ బిల్లును శాసనసభ, శాసన మండలి ఆమోదంతోనే కేంద్ర ప్రభుత్వానికి పంపామని మంత్రి స్పష్టం చేశారు. శాసన మండలి సభ్యుడిగా బిల్లు గురించి లోకేశ్ అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ప్రస్తుతం బిల్లు చట్టంగా మారే క్రమంలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉందన్నారు. దీనిపై లోకేష్ కేంద్రానికి లేఖ ఎందుకు రాయలేదని ఆమె ప్రశ్నించారు. పరిహారంపై అవహేళన దారుణం గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్యం, ఇతర సహాయాల నిమిత్తం బాధిత మహిళ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తోందని మంత్రి వనిత చెప్పారు. దీనిపై లోకేశ్ హేళనగా మాట్లాడటం దారుణం అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క బాధితురాలికీ న్యాయం జరగలేదన్నారు. ప్రభుత్వ చర్యల వల్లే బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. -
మహిళల భద్రత పై రాజీ పడే ప్రసక్తే లేదు: మంత్రి తానేటి వనిత
-
దిశ చట్టం ప్రతులు లోకేష్ చింపడం దారుణం: మంత్రి తానేటి వనిత
సాక్షి, అమరావతి: దిశ చట్టం ప్రతులు నారా లోకేష్ చింపడం దారుణమని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. గతంలో ఎప్పుడైనా టీడీపీ ప్రభుత్వం ఇలాంటి చట్టం తీసుకొచ్చిందా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో, శాసన మండలిలో దిశ చట్టాన్ని ఆమోదించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అనూషపై యాసిడ్ దాడి జరిగితే పరిహారం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు పరిహారం కోసం విమర్శలు చెస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారని, వాళ్ల ప్రభుత్వంలో మహిళలపై దాడులు జరిగితే ఏనాడు టీడీపీ నేతలు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ రోజు మహిళల కోసం తమపై విమర్శలు చేస్తే ఎవరూ నమ్మరని, దిశ చట్టంతో పాటు మహిళలకు నేరాలు జరగకుండా కాపాడేందుకు దిశ యాప్ను తీసుకొచ్చామని వెల్లడించారు. తమ ప్రభుత్వం నమ్మకం కలిగించడం వలన మహిళలు ధైర్యంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. గతంలో మహిళలపై కేసుల విచారణకు 4 నెలలు పట్టేది కానీ ఈ ఏడాది 40 రోజులలోనే విచారణ పూర్తి చేసిన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు మహిళలపై దాడులు జరిగితే వారం రోజుల్లోనే చాలా కేసుల్లో విచారణ పూర్తి చేశామని మంత్రి తానేటి వనిత తెలిపారు. చదవండి: నెల్లూరు: యువతిపై దాడి చేసిన ఇద్దరు నిందితుల అరెస్ట్ -
మంత్రి తానేటి వనితకు మాతృ వియోగం
కొవ్వూరు: రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాతృమూర్తి సుశీల (76) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జొన్నకూటి బాబాజీరావు సతీమణి అయిన సుశీల ఉపాధ్యాయురాలిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. రెండో కుమార్తె వనిత గతంలో గోపాలపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఎన్నికై రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. కాగా, తాళ్లపూడి మండలం తుపాకులగూడెంలోని ఫామ్హౌస్లో సుశీల అంత్యక్రియలు నిర్వహించారు. సీఎం పరామర్శ.. మంత్రి తానేటి వనిత మాతృమూర్తి సుశీల మృతి పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి వనితకు ఫోన్ చేసి పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. కాగా, మంత్రి తానేటి వనితను, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావును హోం మంత్రి సుచరిత ఆదివారం పరామర్శించారు. -
ఏపీలో మోడల్ అంగన్వాడీ కేంద్రాలు
-
ప్రేమికులపై దాడి: బాధితురాలికి రూ.5లక్షల పరిహారం
సాక్షి, గుంటూరు: తాడేపల్లి పరిధిలోని సీతానగరంలో జరిగిన ప్రేమికులపై దాడి ఘటనలో గాయపడిని బాధితురాలిని గుంటూరు జీజీహెచ్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం బాధితురాలిని ఏపీ మంత్రులు సుచరిత, తానేటి వనిత పరామర్శించారు. బాధితురాలికి ధైర్యం చెప్పి.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల పరిహారం అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ‘‘కృష్ణా తీరంలో జరిగిన ఘటన హేయమైన చర్య. నిందితులను పట్టుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాం. తప్పు చేసినవారు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం. ఇప్పటికే నాలుగు పోలీసు బృందాలను నియమించాం. భవిష్యత్లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటాం. 15 లక్షల మంది ఇప్పటివరకు దిశ యాప్ను డౌన్ లోడ్ చేసుకున్నారు. త్వరితగతిన దర్యాప్తు జరిగేలా భవిష్యత్లో మరిన్ని చర్యలు తీసుకుంటాం. మూడు చోట్ల ఫోరెన్సిక్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నాం.. ఇప్పటికే ఈ ల్యాబుల్లో సిబ్బందిని నియామిస్తున్నాం. ఇలాంటివి జరగకుండా నిఘా, భద్రత ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం’’ అని తెలిపారు. అనంతరం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ‘‘సీతానగరం ఘటన దురదృష్టకరం. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.5లక్షల పరిహారం.. స్త్రీ,శిశు సంక్షేమశాఖ నుంచి మరో రూ.50వేలు అందజేస్తాం. ఇద్దరు వ్యక్తులు నేరానికి పాల్పడినట్టు ప్రాథమికంగా తేలింది. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది’’ అన్నారు. చదవండి: ప్రేమికులపై దాడి ఘటన: విచారణకు ప్రత్యేక పోలీస్ బృందాలు -
సీఎం జగనన్న పథకాలే స్త్రీలకు శ్రీరామ రక్ష: తానేటి వనిత
సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పథకాలే మహిళలకు శ్రీరామ రక్ష అన్నారు మంత్రి తానేటి వనిత. జగనన్న పరిపాలనలో ప్రతి పథకంలోనూ మహిళలకు పెద్దపీట వేశారని తెలిపారు. ఈ సందర్భంగా తాననేటి వనిత ‘‘మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వంలో అమ్మఒడి నుంచి ఆసరా, చేయూత వరకు.. ఒక్కో మహిళకు రూ.లక్షల్లో లబ్ది జరుగుతోంది. మహిళలు సీఎంలుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని’’ తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు తానేటి వనిత. ఆమె మాట్లాడుతూ.. ‘‘డ్వాక్రా మహిళలను చంద్రబాబు ఎందుకు మోసం చేశారు. మహిళ అభివృద్ధి కోసం చంద్రబాబు ఏం చేశారు. టీడీపీ హయాంలో మహిళలపై లెక్కలేనని అఘాయిత్యాలు జరిగినా.. దిశ లాంటి చట్టాన్ని ఎందుకు తేలేకపోయారు. టీడీపీ హయాంలో ఒక్కరికైనా ఇళ్ల స్థలం ఇచ్చారా.. 31 లక్షల మంది మహిళలకు సీఎం జగన్ ఇళ్లు కట్టిస్తున్నారు’’ అని తానేటి వనిత మండిపడ్డారు. -
కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన మంత్రి తానేటి వనిత
-
8న మొబైల్ కొనే మహిళలకు 10 శాతం రాయితీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళల సంక్షేమం, భద్రత దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తూ ఇప్పటికే విప్లవాత్మక చట్టం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి భద్రత, సంక్షేమం, పురోభివృద్ధికి సంబంధించి గురువారం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తన క్యాంపు కార్యాలయంలో హోం, మహిళా సంక్షేమం, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, మెప్మా తదితర శాఖల అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ముందు రోజు.. ఈ నెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలని, దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్తో 2,000 స్టాండ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దిశ యాప్ కోసం ఎంపిక చేసిన షాపింగ్ సెంటర్లలో ఆ రోజు (8వ తేదీ) మొబైల్ ఫోన్ల కొనుగోలుపై మహిళలకు 10 శాతం రాయితీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా భద్రత, సాధికారతపై షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించాలని, ప్రతి వింగ్ నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు సత్కారం చేయాలని నిర్ణయించారు. పోలీసు శాఖలో పని చేస్తున్న మహిళలందరికీ ఆ రోజు స్పెషల్ డే ఆఫ్గా ప్రకటించనున్నారు. క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ సీఎం నిర్ణయాలు, ఆదేశాలు ఇంకా ఇలా.. – అంగన్వాడీ ఉద్యోగులందరికీ ఏటా హెల్త్ చెకప్ చేయించాలి. – నాన్ గెజిటెడ్ మహిళా ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు. – చేయూత కిరాణా దుకాణాల్లో అందుబాటులో శానిటరీ పాడ్స్ ఉంచాలి. ఇందు కోసం సెర్ప్, మెప్మా, హెచ్ఎల్ఎల్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోవాలి. – ప్లస్–1, ప్లస్–2లో విద్యార్థినులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – జూనియర్ కాలేజీల నుంచి పైస్థాయి కాలేజీల వరకు ‘దిశ’పై ప్రచారం నిర్వహిస్తూ హోర్డింగులు ఏర్పాటు చేయాలి. ఇందులో దిశ యాప్ సహా అన్ని వివరాలు ఉండేలా చూడాలి. దిశ కింద తీసుకుంటున్న చర్యలు, దీనిపై అవగాహన కల్పించేలా విస్తృతంగా ప్రచారం కొనసాగాలి. – ఈ సమావేశంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతం సవాంగ్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ ఏ రవిశంకర్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్, డీఐజీ (టెక్నికల్ సర్సీసెస్) జి పాలరాజు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, దిశ ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: (ఏక కాలంలో అంగన్వాడీ భవనాల పనులు) -
టీడీపీ మేనిఫెస్టోపై చర్యలేవి..?
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడరమేశ్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డ, ఎన్నికల కమీషనర్లా కాకుండా చంద్రబాబు ఏజెంట్లా వ్యవహరిస్తున్నారంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ తన పరిధి దాటి, మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారంటూ మండి పడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ ఏకపక్ష నిర్ణయాలపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ.. నిమ్మగడ్డ తీరు ఒంటెద్దు పోకడలా ఉందంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసినా స్పందించని నిమ్మగడ్డ.. ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవడంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. ఉన్నత పదవిలో ఉంటూ ఆయన ఇలా వ్యవహరించడం సరికాదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈ ఎన్నికల ఫలితాలు ఆయను గుణపాఠం నేర్పుతాయని మంత్రి హెచ్చరించారు. నిమ్మగడ్డ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంటే, ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న నిమ్మగడ్డ తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నాడని మంత్రి తానేటి వనిత కామెంట్ చేశారు. ప్రభుత్వం పట్ల నిమ్మగడ్డ కక్షపూరిత ధోరణి సరికాదని ఆమె మండి పడ్డారు. ఎన్నికల కమిషనర్కు ఎన్నికలు సజావుగా నిర్వహించే హక్కు ఉంటుందని, ఆ హక్కును ఉపయోగించి ఎన్నికలు సజావుగా జరిగేటట్టు చూడాలే కానీ ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని హితవు పలికారు. ఎస్ఈసీ స్థాయికి మించి జోక్యం చేసుకుంటున్నారు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక అధికారిలా కాకుండా చంద్రబాబు ఏజెంట్లా వ్యవహరిస్తున్నాడని, ఉన్నతాధికారుల విషయంలో తన స్థాయికి మించి ఆయన జ్యోక్యం చేసుకొంటున్నాడని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేశ్ గౌడ్ ధ్వజమెత్తారు. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇలాంటి ఎన్నికల కమీషనర్ లేడని, గతంలో పని చేసిన ఎస్ఈసీలను చూసైనా ఆయన హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలి ఆయన సూచించారు. చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలా.. చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలు బొమ్మ అని, నిమ్మగడ్డను చంద్రబాబు అడిస్తున్నాడని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఫైరయ్యారు. మంత్రులపై ఫిర్యాదు చేస్తూ గవర్నర్కు రాసిన లేఖ నిమ్మగడ్డ రాసింది కాదని, చంద్రబాబు రాసిన లేఖనే ఆయన యధాతధంగా గవర్నర్కు పంపాడని ఆరోపించారు. మంత్రులు, వైసీపీ నేతలపై బురద చల్లేందుకే నిమ్మగడ్డ ఇలా వ్యవహరిస్తున్నాడని, ఆయన మానసిక స్థితి సరిగా లేదని ఎమ్మెల్యే విమర్శించారు. రాజ్యాంగ బద్దంగా పనిచేయడం లేదు.. ఉన్నత రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాజ్యాంగ బద్దంగా పనిచేయడం లేదని, ఆయన వ్యవహరిస్తున్న తీరు టీడీపీకి గులాంగిరి చేసినట్లుందని వైస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానంద రెడ్డి ఆరోపించారు. గ్రామాల్లో వైషమ్యాలను సృష్టించేందుకు చంద్రబాబు ప్లాన్కు అనుగుణంగా పనిచేస్తున్న నిమ్మగడ్డ.. అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఏకగ్రీవాలనేవి ఎప్పటినుంచో ఉన్నాయని, అది కూడా తెలుసుకోకుండా మాట్లాడటం నిమ్మగడ్డ స్థాయికి సరికాదన్నారు. -
మంత్రిగా అవకాశం ఇవ్వడం నా అదృష్టం: తానేటి వనిత
సాక్షి, పశ్చిమగోదావరి: లక్ష మంది పనిచేస్తున్న మహిళా స్త్రీ, శిశు సంక్షేమశాఖకు మంత్రిగా పనిచేసే అవకాశం ఇవ్వడం నా అదృష్టమని మంత్రి తానేటి వనిత అన్నారు. మహిళా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ సంక్షేమ పథకాల అమలుపై పశ్చిమగోదావరి జిల్లాలో రాష్ట్ర స్దాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి వనిత, ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ, డైరెక్టర్ కృతికా శుక్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళల పథకాలపై సీఎం దృష్టికి తీసుకెళ్లినపుడు వెంటనే స్పందిస్తారు. 12 సంవత్సరాలుగా ఈ శాఖలో ప్రమోషన్లు రాలేదు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపే సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ శాఖకు నిధులు కూడా కొరతే. సంవత్సరానికి రూ.500 కోట్లు కేటాయిస్తే, నేడు జగనన్న ప్రభుత్వం రూ.1,800 కోట్లు కేటాయించింది. చదవండి: ('బీజేపీ జై శ్రీరాం కాకుండా చేసిన అభివృద్ధి చెప్పాలి') గర్భవతులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణతో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా మహిళల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారు. మహిళలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి చేయూత కార్యక్రమం ప్రారంభించారు. మహిళలు రాజకీయంగా ముందుండేందుకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం అవకాశం కల్పించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అండగా ఉండేందుకు దిశ చట్టాన్ని తీసుకొచ్చారు' అని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ఉనికిని చాటుకునేందుకే.. ఇప్పటివరకు రాజధాని, కులాల అంశాలు తెరపైకి తెచ్చినా స్పందన లేకపోవడంతో కొత్తగా దేవుడిని ముందుకు తెచ్చారు. ప్రతిపక్షం తమ ఉనికిని చాటుకునేందుకే ఈ అంశాల్ని తెర మీదకు తెచ్చింది. అందులో భాగంగానే.. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. టీడీపీ సమయంలో విజయవాడలో దేవాలయాల కూల్చివేతపై బీజేపీ ఎందుకు మాట్లడలేదు. దుర్గ గుడి అభివృద్ధికి సీఎం జగన్ రూ.70 కోట్లు విడుదల చేశారు. టీడీపీ కూల్చి వేసిన గుడులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పునర్నిర్మించేందుకు ఈరోజు శంకుస్థాపన చేశారు. టీడీపీ దేవుడుని అడుపెట్టుకుని నీచమైన రాజకీయాలు చేయడం సరికాదు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. అధికార పార్టీ చేసే పనులపై తప్పొప్పులు మాట్లాడాలి కానీ దేవుడిని అడుపెట్టుకుని రాజకీయం చేయడం సరికాదు' అని మంత్రి తానేటి వనిత అన్నారు. చదవండి: (ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ) -
విప్లవాత్మక పథకం అమ్మఒడి: మంత్రి వనిత
-
దారుణాలు సహించం: తానేటి వనిత
సాక్షి, కాకినాడ: నగరంలోని గోళీలపేటలో లైంగిక దాడికి గురైన బాలికను మహిళా, శిశు సంక్షేమ మంత్రి తానేటి వనిత, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి జీజీహెచ్లో శనివారం పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. బాలికకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి తక్షణ సాయం లక్ష రూపాయలు అందచేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క బాలిక, మహిళపై అత్యాచారాలు జరగకూడదని ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. (చదవండి: తుపాన్ మృతులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా) నిఘా కొరవడిన మారుమూల ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. బాధిత బాలికకు ప్రభుత్వం రూ.10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తోందన్నారు. దిశ చట్టం కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని, త్వరలోనే కొన్ని సవరణలతో చట్టం తీసుకొస్తామన్నారు. దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించామని, కేసులపై సత్వరమే స్పందిస్తున్నామని మంత్రి తానేటి వనిత తెలిపారు. (చదవండి: దారుణం.. పసిమొగ్గపై పైశాచికం) బాధితురాలికి అండగా ఉంటాం: మంత్రి వేణుగోపాల కృష్ణ లైంగిక దాడికి గురై జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాలికను మంత్రి వేణుగోపాలకృష్ణ పరామర్శించారు. బాధితురాలికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. చిన్నారిపై పాశవిక దాడి.. మనస్సు కలిచివేస్తోందన్నారు. నిందితులను పట్టుకోడానికి పోలీస్ బృందాలు నిర్విరామంగా గాలిస్తున్నాయని తెలిపారు. మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. -
మానవత్వం చాటుకున్న మంత్రులు..
తాడేపల్లిరూరల్ (మంగళగిరి): ఆటో ఢీకొని గాయాలపాలై రోడ్డుపక్కన పడి ఉన్న ఓ రైతును..అదే మార్గంలో వెళ్తున్న మంత్రులు పరామర్శించి ఆస్పత్రికి తరలించిన ఘటన గురువారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకెళితే.. హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత కేబినెట్ సమావేశానికి హాజరై తిరిగి వస్తుండగా, గుంటూరు జిల్లా ఉండవల్లి–అమరావతి కరకట్టపై ఇస్కాన్ ఆలయం సమీపంలో రోడ్డు పక్కన గాయాలపాలైన ఓ రైతు కనిపించాడు. అది గమనించిన మంత్రులు ఏం జరిగిందని ఆరా తీశారు. తాను మోపెడ్పై తన స్వగ్రామానికి వెళ్తుండగా ఆటో అతను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయాడని బాధితుడు సమాధానమిచ్చాడు. దీంతో హోంమంత్రి సుచరిత తన కాన్వాయ్లోని ఓ వాహనాన్ని కేటాయించి ఆ రైతును తాడేపల్లి పట్టణ పరిధిలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆస్పత్రి యాజమాన్యానికి ఫోన్ చేసి వెంటనే అతనికి చికిత్స అందించాలని సూచించారు. -
మానవత్వం చాటుకున్న మహిళా మంత్రులు
సాక్షి, తాడేపల్లి : ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడి రాష్ట్ర మహిళా మంత్రులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాలు.. దొండపాడుకు చెందిన నరసింహారావు గురువారం కరకట్ట రోడ్డుపై వెళుతున్న సమయంలో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరసింహారావుకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న హోంమంత్రి సుచరిత కరకట్టపై గాయాలతో పడిఉన్న నరసింహారావును చూశారు. వెంటనే వాహనాన్ని ఆపి మరో మంత్రి తానేటి వనితతో కలిసి నరసింహారావును తమ కాన్వాయ్లో ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం నరసింహారావు పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తక్షణ సహాయం అందించి తన ప్రాణాలను కాపాడినందుకు హోంమంత్రి సుచరిత, మరో మంత్రి తానేటి వనితకు నరసింహారావు కృతజ్ఞతలు తెలిపాడు. -
‘బీసీ ప్రజలకు చరిత్రలో లిఖించే రోజు’
సాక్షి, పశ్చిమగోదావరి : దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా బీసి కులాలను గుర్తించి 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. ఏలూరు వేదికగా జరిగిన బీసి గర్జనలో బీసీలకు ఇచ్చిన హమీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేశారన్నారు. ఏలూరులో మంగళవారం బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరక్టర్లకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడుతూ.. ప్రతి బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు నిర్ణయాలు తీసుకున్నారన్నారు. బీసీలు ముఖ్యమంత్రికి ఎల్లవేళలా రుణపడి ఉంటారన్నారు. చదవండి: బీసీల దమ్ము ఎంతో చూపిస్తాం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాల ప్రజలకు ఈ రోజు చరిత్రలో లిఖించే రోజు అని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెలుగుదేశం హయంలో చంద్రబాబు నాయుడు బీసీలను కేవలం ఓట్ల బ్యాంకుగా మాత్రమే చూశారని విమర్శించారు. బీసీలకు మాయ మాటలు చెప్పి వారిని అణగదొక్కారన్నారు. బీసీకు రాజ్యాధికారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్న మంత్రి రాష్ట్రంలోని వెనుకబడిన బడుగు బలహీన వర్గాలను గుర్తించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. చదవండి: బీసీలంతా వైఎస్ జగన్కు రుణపడ్డాం మహిళ పక్షపాతిగా సీఎం వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి తానేటి వనితా అన్నారు. ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో బీసీలు తమ పార్టీకి వెనుముక అంటూ వైఎస్ జగన్ చెప్పారని గుర్తు చేశారు. ప్రతి బిడ్డను చదివించేందుకు అమ్మవడి అనే పథకాన్ని తీసుకువచ్చారని, దిశ అనే చట్టం మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలలోను తీసుకురాలేదని పేర్కొన్నారు. పోలవరం, రాజధాని అంశంలో ప్రజలకు ఆలోచనల దిశగా ముఖ్యమంత్రి వెళ్తున్నారని, ఎన్నో లక్షల మందికి ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే భవిష్యత్తు పొతుందని టీడీపీ అడ్డుకుంటుంని మండిపడ్డారు. చదవండి: బీసీ కార్పొరేషన్లతో సామాజిక విప్లవం ఈ సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, తానేటి వనితా, ఎమ్మెల్యేలు కొఠారు అబ్బాయ చౌదరి, జీఎస్ నాయుడు, ఏలీజా, కారుమూరి నాగేశ్వరరావు, పుప్పాల వాసుబాబు, తల్లారి వెంకట్రావు, ముదునూరి ప్రసాదరాజు, ఎంపీ మార్గాని భరత్, డీసీఎమ్ఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ, డీసీబీసీ చైర్మన్ కవూరు శ్రీనివాస్, జిల్లాకు చెందిన కార్పొరేషన్ చైర్మన్లు గుబ్బల తమ్మయ్య, ఇళ్ల భాస్కరరావు,పేండ్ర వీరన్న,అనంతలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
ఏపీకి పూర్వ వైభవం: ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జాతీయ జెండా ఆవిష్కరించి.. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పొట్టి శ్రీ రాములు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో మంత్రి తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బాయి చౌదరి, కలెక్టర్ రేవు ముత్యాలు రాజు, ఎస్పీ నారాయణ నాయక్, జాయింట్ కలెక్టర్లు వెంకట రమణా రెడ్డి, తేజ్ భరత్, ఆర్డీవో పనబాక రచన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఆళ్ల నాని, తానేటి వనితా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకువచ్చారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం జరపాలని నిర్ణయించారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. -
'తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు'
సాక్షి, పశ్చిమగోదావరి : అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయకుంటే చర్యలు తప్పవని మంత్రి తానేటి వనిత హెచ్చరించారు. కొన్ని శాఖల అధికారులపై అవినీతి ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని, పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని ఆమె పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో ఎంత సఖ్యతగా మెలుగుతారో వారు కూడా ప్రజలతో అంతే స్నేహపూర్వంగా మెలగాలని మంత్రి తెలిపారు. ప్రజా సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. (ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి అవంతి) -
చదువుల తల్లిని చిదిమేసిన మేనమామలు
కర్నూలు జిల్లాకు చెందిన 8వ తరగతి బాలికపై సొంత మేనమామలు ఇద్దరు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆ బాలిక ఆరు నెలల గర్భవతి అని తేలింది. పోక్సో చట్టం కింద అన్నదమ్ములు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఈ బాలికను తమ సంరక్షణలో ఉంచుకుని, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ నెలలో ఆమె విజయవాడలోని ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ బాలిక సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవడం వల్లే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సాక్షి, అమరావతి: లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించడానికి పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్వల్ అఫెన్సెస్) చట్టం అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వేస్తే రాష్ట్రం రెండడుగులు ముందుకేసింది. చిన్నారులపై పెరిగిపోతున్న అత్యాచారాలు, లైంగిక దాడులు, అక్రమ రవాణా, నీలి చిత్రాల్లో వాడుకోవడం వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పోక్సో చట్టానికి సవరణలు చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం దోషులకు కఠిన శిక్షలు పడేలా, బాధితులకు అన్ని రకాలుగా న్యాయం జరిగేలా వెన్నంటి ఉంటోంది. ఈ కేసుల విచారణకు ప్రత్యేకంగా ఫ్రెండ్లీ కోర్టును ఏర్పాటు చేసింది. ప్రభుత్వ చర్యల కారణంగా బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయగలుగుతున్నారు. కొత్త చట్టం మార్చి నుంచి అమల్లోకి వచ్చింది. పోక్సో కొత్త నిబంధనల ప్రత్యేకతలు స్కూళ్లు, క్రెష్ సెంటర్లలో పని చేస్తున్న సిబ్బంది గత చరిత్రపై పోలీస్ నివేదికలు తెప్పించుకోవాలి. బాధితులకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి. పిల్లలతో పని చేసే సంస్థలు, వ్యక్తులు, పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులకు శిక్షణ ఇవ్వాలి. తమను తాము రక్షించుకునేలా పిల్లలకు అవగాహన కలిగించాలి. బాధితుల గురించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలకు సిఫారసు చేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తక్షణ ఉచిత వైద్య పరీక్షలు, మానసిక ఆరోగ్యం కోసం కౌన్సెలింగ్, ఉచిత న్యాయ సహాయం అందించాలి. బాధితుల చదువుకు ఆటంకం కలగకూడదు. దోషుల నుంచి బెదిరింపులు రాకుండా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో సంచలన తీర్పు విజయవాడ రూరల్లో ఒక బాలికపై 2017లో అత్యాచారానికి పాల్పడిన నిందితునికి విజయవాడ స్పెషల్ కోర్టు విచారణ జరిపి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. రక్షణ కల్పించాల్సిన అధికారులు, సమీప బంధువులు తీవ్రమైన లైంగిక దాడికి పాల్పడితే దోషులకు ఉరిశిక్ష విధించే అవకాశం ఉంది. రాష్ట్రంలో విప్లవాత్మక చర్యలు ఈ కేసుల విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రుల్లో 13 దిశ సెంటర్లను ఏర్పాటు చేసింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. పోలీసులు ఈ కేసుల సమాచారాన్ని ఐదుగురు సభ్యులుగల చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీకి ఇవ్వడంతో వారు పిల్లల సంరక్షణకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ కోర్టులో ఈ కేసుల విచారణను ప్రత్యేకంగా చేపడుతున్నారు. కోర్టుల్లో అందరికీ కనపడేలా కాకుండా న్యాయవాది, న్యాయమూర్తి, టైపిస్టులు మినహా ఎవరూ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని విధాలా ఆదుకుంటున్నాం అత్యాచారానికి గురైన బాలికల విషయంలో అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నాం. పలు కేసులను సీఎం వైఎస్ జగన్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లోని రెండు సంఘటనలకు బాధిత బాలికలకు రూ.10 లక్షల చొప్పున సాయం అందించారు. ప్రభుత్వం ఇటువంటి కేసుల్లో బాధితులకు రూ.లక్ష అందజేస్తోంది. దోషులకు కఠిన శిక్షలు పడేలా పోలీస్, ఐసీడీఎస్ శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. పోక్సో చట్టానికి సవరణల తర్వాత బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారు. - తానేటి వనిత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తున్నాం దోషులపై సత్వరమే కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూనే బాధితులకు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సాయం అందిస్తున్నాం. పోక్సో చట్టం అమలు పరిచే అధికారులకు ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వైద్యులు, న్యాయవాదులు బాధితులతో సున్నితంగా వ్యవహరించేలా అవగాహన కల్పిస్తున్నాం. పాఠశాలల్లోని పిల్లలందరికీ ఈ చట్టం గురించి తెలియజెపుతున్నాం. - కృతికా శుక్లా, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ -
అంగన్వాడీల చరిత్రలో సరికొత్త అధ్యాయం
-
ఏ సీఎం కూడా ఆయనలా చేయలేదు: మంత్రి
సాక్షి, పశ్చిమ గోదావరి: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్ 11వ వర్థంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలోని రాజాశేఖరరెడ్డి విగ్రహాంతో పాటు కొవ్వూరు పట్టణంలోని ఆయన విగ్రహాలకు మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదే విధంగా పేదలకు వస్త్రాలు పంపిణీ చేయడమే కాకుండా వృద్ధులకు పండ్లు,రొట్టెలు పంచారు. అలాగే టీడీపీకి చెందిన పలువురు కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ హయాంలో చాలా మంది ముఖ్యమంత్రులు పని చేశారన్నారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం పని చేసినట్లుగా ఏ సీఎం కూడా చేయలేదన్నారు. తండ్రి అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారని, తండ్రిలాగే పేదల పక్షపాతిగా ఆయన పని చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. -
‘దళితులపై చంద్రబాబు మొసలి కన్నీరు’
సాక్షి, విజయవాడ: ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు లేదని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి నిప్పులు చెరిగారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా అంటూ అవమానించిన చంద్రబాబు వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఎస్టీలకు తెలివి ఉండదని చంద్రబాబు హేళన చేశారని.. ఆయనను చూసి ఎస్సీ, ఎస్టీలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. ‘‘రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీలకు ఎవరూ ఇవ్వనన్నీ పథకాలు అమలు చేస్తున్నాం. కోటి 13 లక్షల మందికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్దే ఎస్సీ, ఎస్టీలకు ఏడాదిలోనే 13వేల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో అందించాం. దళితులు, గిరిజనులపై దాడులు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటున్నామని’’ మంత్రి వెల్లడించారు. (చదవండి: చంద్రబాబు దళిత ద్రోహి: దళిత నేతలు) పశ్చిమగోదావరి: చంద్రబాబు దళిత ద్రోహి అని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. ఏనాడూ దళితులను ఆయన పట్టించుకోలేదన్నారు. దళితులపై చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ కేబినెట్లో ఐదుగురు దళితులకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. చంద్రబాబుకు దళితులు గుణపాఠం చెబుతారని తానేటి వనిత అన్నారు.(చదవండి: ‘చంద్రబాబుకు ప్రేమలేదు.. అంతా డ్రామా’) -
సంపూర్ణ పోషణే లక్ష్యం
-
దేశంలో ఎక్కడా లేని విధంగా..
సాక్షి, అమరావతి : దేశంలో ఎక్కడా లేని విధంగా పేద పిల్లలకు పోషక ఆహారాన్ని అందిస్తున్నామని, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా రెట్టింపు పోషక ఆహారం అందిస్తున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాల పేద పిల్లల కోసం అదనంగా 500 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. 1800 కోట్ల రూపాయలతో పోషక ఆహారాన్ని అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. అంగన్వాడీ కేంద్రాలను 1400 కోట్ల రూపాయలతో నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకి పి1, పి2 విద్యా విధానాన్ని తెస్తున్నామన్నారు. పిల్లలకి ఎల్కేజీ, యూ కేజీ విద్యను అందిస్తామని, ఇది అంగన్వాడీ చరిత్రలోనే విప్లవాత్మకమైన మార్పుగా దేశంలో నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.