text books
-
బంగ్లాదేశ్ విముక్తిని ప్రకటించింది ముజీబ్ కాదు.. జియా!
ఢాకా: బంగ్లాదేశ్లోని యూనుస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. ఆమె తండ్రి, బంగబంధు ముజిబుర్ రహా్మన్కు ప్రాధాన్యం తగ్గిస్తూ పాఠ్యాంశాలను మార్చాలని నిర్ణయించింది. పాఠ్యాంశాల్లో చారిత్రక ఘటనలను అతిగా చూపడం, కొందరు వ్యక్తులను అనవసరంగా కీర్తించడం వంటి వాటిని పూర్తిగా తొలగించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఒకటి నుంచి పదో తరగతి వరకు కొత్త సిలబస్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించనుంది. దీని ప్రకారం.. 1971లో బంగ్లాదేశ్కు స్వాతంత్య్రాన్ని ప్రకటించింది బంగబంధుగా పిలిచే షేక్ ముజిబుర్ రహా్మన్ కాదు..జియా ఉర్ రహా్మన్ అని ఉంటుంది. ఆ సమయంలో బంగ్లాదేశ్ మిలటరీ అధికారిగా జియా పనిచేస్తున్నారు. అనంతర కాలంలో బంగ్లా ఆరో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బంగ్లాదేశ్ విముక్తిని ప్రకటించింది ముజీబుర్ రహా్మన్ కాగా, ఆయన ఆదేశాల మేరకు జియా ఉర్ రహా్మన్ ఆ ప్రకటనను చదివారనేది అవామీ లీగ్ మద్దతుదారుల వాదన. అయితే, జియా ఉర్ రహా్మనే స్వయంగా స్వతంత్ర ప్రకటనను తయారు చేసి, ప్రకటించారన్నది బీఎన్పీ వాదన. బీఎన్పీ చీఫ్గా మాజీ ప్రధాని ఖలేదా జియా ఉన్నారు. పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా ముజీబ్ కుమార్తె కాగా ఖలేదా జియా కుమార్తె. 👉చదవండి : చిన్మయ్ కృష్ణదాస్కు నో బెయిల్ -
TG: ‘ముందు మాట’ వివాదం.. ఇద్దరు అధికారులపై వేటు
సాక్షి, హైదరాబాద్: తెలుగు పాఠ్యపుస్తకాల్లో తప్పిదాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలుగు టెక్ట్స్ బుక్స్లో వచ్చిన తప్పులను సీరియస్గా తీసుకున్న సర్కార్.. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసచారి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిపై చర్యలకు ఆదేశించింది. పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసచారి, రాధారెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేశ్కు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ గురుకుల సొసైటీ రమణ కుమార్కి ముద్రణ సేవల విభాగం డైరెక్టర్గా బాధ్యతలు కేటాయించారు.ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్బుక్లు పంపిణీ చేశారు. అయితే, విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండా ముద్రించింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామన్న ఉత్సాహంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి పేర్లతో పాఠ్య పుస్తకాల్లో ముద్రించి పంపిణీ చేశారు. కాగా, కొత్తగా వచ్చిన పుస్తకాలు అన్నింటినీ వెరిఫికేషన్ చేయగా విద్యార్థులకు పంపిణీ చేసిన అన్ని తరగతుల తెలుగు పుస్తకాల్లోని ముందు మాట పేజీలో తప్పులు ఉండటంతో ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.పాఠ్యపుస్తకాల్లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి, సంచాలకులు జగదీశ్వర్ పేర్లు ఉన్నాయి. దీంతో, అలర్ట్ అయిన విద్యాశాఖ విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ముందు మాటను మార్చి విద్యార్థులకు తిరిగి ఇవ్వనున్నారు. -
పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోండి.. తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: విద్యా సంవత్సరం ప్రారంభమైన వేళ తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో, పుస్తకాలన్నీంటినీ సేకరిస్తున్నారు.కాగా, ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో బుధవారం పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్బుక్లు పంపిణీ చేశారు. అయితే, విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండా ముద్రించింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామన్న ఉత్సాహంతో గత బీఆఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి పేర్లతో పాఠ్య పుస్తకాల్లో ముద్రించి పంపిణీ చేశారు. కాగా, కొత్తగా వచ్చిన పుస్తకాలు అన్నింటినీ వెరిఫికేషన్ చేయగా విద్యార్థులకు పంపిణీ చేసిన అన్ని తరగతుల తెలుగు పుస్తకాల్లోని ముందు మాట పేజీలో తప్పులు ఉండటంతో ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు.పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, సంచాలకులు జగదీశ్వర్ పేర్లు ఉన్నాయి. దీంతో, అలర్ట్ అయిన విద్యాశాఖ విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. -
ఆన్లైన్లో పాఠ్య పుస్తకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్గా తీర్చిదిద్దే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇంగ్లీష్ మీడియం బోధనను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్పీ) వంటి అధునాతన పద్ధతుల్లో విద్యా బోధన చేస్తోంది. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు బడి తెరిచిన మొదటి రోజే వారికి అవసరమైన పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లు వంటివి అన్ని వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక (జేవీకే) కిట్లను అందిస్తోంది. వచ్చే నెల 12న ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరానికి కూడా ఈ కిట్లు సిద్ధమవుతున్నాయి. పాఠ్య పుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. మరోపక్క 1 నుంచి 10 తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆన్లైన్లోనూ పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు–ఇంగ్లిష్ మీడియంలో వర్క్బుక్స్తో కలిపి మొత్తం 391 టైటిళ్లను పీడీఎఫ్ రూపంలో పాఠశాల విద్యా శాఖ వెబ్సైట్లో ఉంచింది. గతేడాది ఆన్లైన్లో ఉంచిన పుస్తకాలను దాదాపు 18 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 1,72,482 పాఠ్యపుస్తకాలు డౌన్లోడ్ అవడం విశేషం. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి విద్యార్థులకు కొత్తగా ఎన్సీఈఆర్టీ సిలబస్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో కొత్త సిలబస్ పుస్తకాలను కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. త్వరలో ఉర్దూ, తమిళం, ఒడియా, కన్నడ వంటి మైనర్ మీడియం బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను సైతం వెబ్సైట్లో ఉంచనున్నారు. పాఠాలను విద్యార్థులు విశ్లేషణాత్మకంగా అర్ధం చేసుకొని, సామరŠాధ్యలను మెరుగుపరుచుకొనేందుకు ఆన్లైన్ పీడీఎఫ్లోని ప్రతి పాఠానికి ఎస్సీఈఆర్టీ ‘క్యూఆర్’ కోడ్ను జత చేసింది. ఆ కోడ్ను స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేస్తే పుస్తకంలోని పాఠాన్ని ‘దీక్ష’ పోర్టల్లో వీడియో రూపంలో చూసే అవకాశం కూడా కల్పించారు. పీడీఎఫ్ పాఠ్య పుస్తకాలను https://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
Fact Check: ‘పచ్చ’ ముసుగుతో ‘కోడ్’కూతలా?
ఉన్నపళంగా చంద్రబాబును గద్దెనెక్కించేయాలనీ... ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేయాలనీ... ప్రజలను తప్పుదారి పట్టించి అధికార పక్షంపై ఏవగింపు కలిగించాలన్నది రామోజీ ఆకాంక్ష. అందుకోసం పదేపదే అబద్దాలను అచ్చేయడం... లేనిపోని అభాండాలకోసం పేజీలకు పేజీలు కేటాయించడం... అడ్డగోలుగా ఆరోపణలతో శునకానందం పొందడం ఈనాడుకు నిత్యకృతమైపోయింది. వాస్తవాలు తెలుసుకోకుండా అత్యుత్సాహంతో నిబంధనల్ని సైతం వారికి అనుకూలంగా మలచుకుంటున్నారు. గతేడాది ఇచ్చిన పాఠ్యపుస్తకాలపై సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రాలున్నాయనీ... ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ‘వీటికెలా ముసుగేస్తారు?’ అంటూ సొంత పైత్యాన్ని వండివార్చింది. సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు గత ప్రభుత్వం పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు ఇవ్వడంలో విఫలమైంది. నోటు పుస్తకాలు అస్సలు ఇవ్వలేకపోయింది. అప్పులు చేసి వారంతా పుస్తకాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. పైగా ‘పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వానిది కాద’ంటూ ఓ కొత్త వాదాన్ని తీసుకొచ్చింది. ‘ప్రైవేటు స్కూళ్లున్నాయి.. అక్కడ వసతులు బాగుంటాయి, మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి’ అంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సెలవిచ్చారు. ప్రజలకోసం ప్రభుత్వాలు ఏం చేయాలో తనకే తెలుసన్నట్టు నిత్యం గొంతు చించుకునే రామోజీకి ఆనాడు బాబు చేసిన వ్యాఖ్యల్లో తప్పిదం కనిపించలేదు. పైగా పూర్తిస్థాయిలో సర్కారు బడుల్లోని పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న సీఎం జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతూ ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసిందనీ, పిల్లలకు పుస్తకాలు ఇవ్వలేదని బరితెగించి అబద్ధాలు రాసింది. తీరా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 47 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్లను జగన్ చిత్రంతో ఉన్నవి అందించినట్టు ఒప్పుకుంది. ‘కోడ్’ నిబంధనలేంటో తెలుసుకోరా.. బాబు కోసం బరితెగించిన ఎల్లో మీడియా అన్నింటికి ముసుగులు వేస్తున్నారు.. మరి ఈ పుస్తకాల సంగతేంటని ప్రశ్నించింది. ‘ఇవన్నీ ఎన్నికల సంఘం కళ్లకు కనిపించవా అని నిలదీసింది. వాస్తవానికి ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక’’ విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తదితర వాటిపై ప్రజా ప్రతినిధుల ఫొటోలు, సందేశాలు వంటివి ఉండరాదని ఎన్నికల సంఘంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. అంటే ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఇచ్చేవాటిపై ఉండరాదని. కానీ 2023 జూన్ 12న పాఠశాలలు తెరిచిన మొదటి రోజు ఇచ్చిన జగనన్న విద్యాకానుక బ్యాగ్, నోటు పుస్తకాలకు, గతేడాది డిసెంబర్లో ఇచ్చిన ట్యాబ్స్పై ఉన్న సీఎం జగన్ స్టిక్కర్లకు ఈ నిబంధన వర్తించదని తెలిసినా... పాపం బాబుకు ఎలాగైనా మేలు చేయాలని... వారి మెప్పుపొందాలనీ... అబద్దపు వార్తను రామోజీ నేతృత్వంలోని ఈనాడు పతాక శీర్షిక చేసింది. కానీ వారికి తెలియని విషయమేంటంటే... ఎన్నికల సంఘం నియమావళిని నూరుశాతం పాటించాలన్న లక్ష్యంతో మార్చి 16వ తేదీ తర్వాత పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే చిక్కీలపై సీఎం ఫొటో ముద్రించిన ర్యాపర్ను తొలగించి విద్యార్థులకు అందించాలని పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఇవేమీ పట్టించుకోకుండానే ‘ఈనాడు’ ఉపాధ్యాయులపైనా, విద్యాశాఖ ఉన్నతాధికారులపైనా నిందలు వేస్తూ గాలివార్తను అచ్చేసింది. అసలు నిబంధన ఏంటంటే.. భారత ఎన్నికల సంఘం ప్రచురించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని పేజీ నంబరు 94లోని నిబంధన 5(1)లో ఏముందంటే.. లబ్దిదారుల కార్డులు, విద్యుత్ బిల్లులు, నిర్మాణ స్థలం ఫలకాలువంటి వాటిపై రాజకీయ కార్యకర్తల ఫోటోల ప్రదర్శన అంశంలో.. లబ్దిదారులకు పంపిణీ చేసిన లబ్దిదారుల కార్డులు, మోడల్ ప్రవర్తనా నియమావళి అమలు సమయంలో ఏర్పాటు చేసే ఫలకాలపై ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ కార్యకర్తల ఫొటోలు, సందేశాలు ఉండకూడదు. మోడల్ ప్రవర్తనా నియమావళి అమలుకు ముందు పంపిణీ చేసిన /ప్రతిష్టించిన లబ్దిదారుల కార్డులు, నిర్మాణ ఫలకాలు వంటి వాటిపై ఫొటోలు ఉన్నా తప్పులేదు. ఈనాడుపై చర్యలు తీసుకోండి ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ కార్యదర్శి అప్పిరెడ్డి ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నడుపుతున్న ఈనాడు దినపత్రిక టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని... దానిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మంగళవారం ఎన్నిక సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రజలకు అవసరమైన వార్తా కథనాలను ప్రచురించేందుకు బదులు చంద్రబాబు అభిప్రాయాలను ప్రచురిస్తోందని పేర్కొన్నారు. కొన్ని నెలలుగా ఈనాడు ప్రధాన సంచికలో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు, ప్రజల్లో దానిపై దురభిప్రాయం కలిగించేలా వక్రీకరించి కథనాలు అచ్చు వేస్తోందన్నారు. అందుకు నిదర్శనంగా మంగళవారం ప్రచురించిన ‘‘వీటికెలా ముసుగేస్తారు?’’ కథనాన్ని ఎన్నికల సంఘానికి అందించారు. ఈ కథనంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించిన బ్యాగులు, పుస్తకాలు, ఆహార పదార్థాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బొమ్మలకు ఎలా కవర్ చేయాలో ఈనాడు తన అభిప్రాయాలను వ్యక్తం చేసిందన్నారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన సూచన ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత లబ్దిదారుల కార్డులు, విద్యుత్ బిల్లులు, నిర్మాణ సైట్ ఫలకాలు వంటి వాటిపైనేతల ఫోటోలు ఉండకూడదని చెప్పారు. కోడ్ అమలుకు ముందు పంపిణీ చేసిన వాటికి ఈ నిబంధన వర్తించదని ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పునరుద్ధరణ, పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా అన్ని పుస్తకాలు, బ్యాగులు, ఆహార పదార్థాలను ప్రభుత్వమే పంపిణీ చేసిందని వాటిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫొటో ఉందనీ, ఇవన్నీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలుకు ముందే అందజేసినవని ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ ఈనాడు పత్రిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరువు తీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ రకమైన వార్తా కథనాల ద్వారా సాధారణ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు, భారత ఎన్నికల సంఘం పరువు తీయడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఈ తప్పుడు కథనం ప్రచురించిన ఆ దినపత్రిక, దాని ప్రచురణకర్తపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
బడి తెరిచిన మొదటి రోజే పుస్తకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులందరికీ పాఠశాలలు తెరిచే నాటికల్లా పాఠ్య పుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 1 నుంచి 10వ తరగతి వరకు అందరికీ బైలింగ్యువల్ పుస్తకాల ముద్రణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 42 లక్షల మంది విద్యార్థుల కోసం 4.55 కోట్ల పుస్తకాలను సిద్ధం చేస్తోంది. గతేడాది దాదాపు 27 లక్షల పుస్తకాలు మిగలడంతో మిగిలిన 4.28 కోట్ల పుస్తకాలు ముద్రిస్తున్నారు. ఈసారి పాఠ్యపుస్తకాల ముద్రణ బిడ్ను ఉత్తరప్రదేశ్కు చెందిన పితాంబరా ప్రెస్ పొందింది. 25 శాతం ముద్రణను స్థానిక ఎంఎస్ఎంఈలకు అప్పగిస్తారు. గత ఏడాది పుస్తకాల ముద్రణకు అత్యంత నాణ్యమైన 70 జీఎస్ఎం పేపర్ను వినియోగించారు. ఈ ఏడాది కూడా ఇదే నాణ్యత ఉండేలా ముద్రణ సంస్థకు నిబంధనలు విధించారు. పదో తరగతి ఫిజిక్స్ పుస్తకాలకు ప్రత్యేకంగా అత్యంత నాణ్యమైన 80 జీఎస్ఎం ఆర్ట్ పేపర్ను వినియోగిస్తున్నారు. స్కూళ్లు తెరిచేనాటికే ప్రతి విద్యార్థికీ జగనన్న విద్యా కానుక కింద అందించే కిట్లలో ఇతర వస్తువులతో పాటు అన్ని పుస్తకాలు అందిస్తారు. ఇందుకోసం మే 31 నాటికి మొదటి సెమిస్టర్ పుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు చేరతాయి. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అదనపు విద్యార్థులకు కూడా పుస్తకాలను అందించేందుకు 5 శాతం పాఠ్య పుస్తకాలను బఫర్ స్టాక్గా ఉంచుతారు. అన్ని మాధ్యమాలకూ ద్విభాషా పుస్తకాలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్, తెలుగు మీడియంతో పాటు ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం, కన్నడ మాధ్యమం స్కూళ్లు కూడా ఉన్నాయి. తెలుగు మాధ్యమం విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్ ద్విభాషా పుస్తకాలు ఇస్తారు. ఇతర మీడియం విద్యార్థులకు కూడా ఇంగ్లిష్తోపాటు వారు ఎంచుకున్న భాష ఉన్న ద్విభాషా పుస్తకాలు అందిస్తారు. దీంతోపాటు సవర, కొండ, కోయ, సుగాలి వంటి గిరిజన విద్యార్థులకు కూడా ఇదే విధానంలో పుస్తకాలు ముద్రిస్తున్నారు. ఇప్పటికే 1 నుంచి 9 తరగతులు ఇంగ్లిస్ మీడియంలోకి మారాయి. 2024–25 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి వస్తుంది. దీంతో 1 నుంచి 10 వరకు నూరు శాతం ఇంగ్లిష్ మీడియం బోధనలోకి వస్తుంది. విద్యార్థులకు స్థానిక సంస్కృతులు, జాతీయ అంశాలపై అవగాహన ఉండేలా తరగతులను మూడు కేటగిరీలుగా విభజించి సిలబస్ రూపొందించారు. 1 నుంచి 5 తరగతులకు 100 శాతం ఎస్సీఈఆర్టీ సిలబస్ ఉంటుంది. 6, 7 తరగతులకు ఇంగ్లిష్, సైన్సు, లెక్కల్లో ఎన్సీఈఆర్టీ సిలబస్, తెలుగు, హిందీ, సోషల్ స్టేట్ సిలబస్ ఉంటాయి. 8, 9, 10 తరగతులకు ఫస్ట్, సెకండ్ లాంగ్వేజ్ (తెలుగు, హిందీ) మినహా మిగతా సబ్జెక్టులన్నీ ఎన్సీఈఆర్టీ సిలబస్ ఉంటాయి. స్థానిక ముద్రణ సంస్థలకు 25%అవకాశం పాఠ్య పుస్తకాల ముద్రణ బిడ్ను ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీకి చెందిన పితాంబరా ప్రెస్ దక్కించు కుంది. ఈ సంస్థ 1 నుంచి 5, 7 తరగతుల పుస్తకాలు ముద్రిస్తుంది. పేజీకి రూ.0.33 ధర నిర్ణయించారు. స్థానిక ఎంఎస్ఎంఈలకు కూడా అవకాశం కల్పించడానికి 6, 8, 9, 10 తరగతుల పుస్తకాల ముద్రణ అప్పగిస్తారు. ఈ మేరకు ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహా్వనించారు. -
నడుస్తున్న చరిత్ర!
పాత చరిత్రను కొత్తగా లిఖించే మరోప్రయత్నం మొదలైంది. పిల్లల పాఠ్యపుస్తకాల్లో ప్రస్తుతం ఉన్న ‘ప్రాచీన చరిత్ర’ స్థానంలో ‘సంప్రదాయ (క్లాసికల్) చరిత్ర’ను ప్రవేశపెట్టనున్నారు. అంటే, ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక అంటూ బ్రిటీషు వారు చేసిన చరిత్ర విభజన ఇక చెరిగిపోనుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) వేసిన ఉన్నత స్థాయి సంఘం చేసిన ఈ సిఫార్సు చర్చ రేపుతోంది. అలాగే, ఇకపై ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ను తీసుకురావాలని సైతం సదరు కమిటీ సిఫార్సు చేసిందన్న వార్త తేనెతుట్టెను కదిలించింది. భారతదేశపు గతానికి సంబంధించిన కథనాలను ‘సరిచేసేందుకు’ ఈ మార్పులు తీసుకు వస్తున్నామన్నది ఎన్సీఈఆర్టీ కమిటీ మాట. ఇండియా స్థానంలో భారత్ అనే సిఫార్సును అంగీకరించలేదని ఎన్సీఈఆర్టీ వివరణనిచ్చినా, కమిటీ చేసిన ఇతర ప్రతిపాదనలపైనా అనుమానాలు, చర్చోపచర్చలు ఇప్పుడప్పుడే ఆగేలా లేవు. 2020 నాటి జాతీయ విద్యా విధానంలో భాగంగా సాంఘిక శాస్త్రాల్లో మార్పులు చేర్పులు సూచించడం కోసం రిటైర్డ్ చరిత్ర ప్రొఫెసర్ అయిన సీఐ ఐజాక్ సారథ్యంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని 2022లో ఎన్సీఈఆర్టీ నియమించింది. పాఠ్యప్రణాళికలో భాగంగా పిల్లలకు బోధించే అన్ని సబ్జెక్టుల్లోనూ ‘భారతీయ విజ్ఞాన వ్యవస్థ’ (ఐకేఎస్)ను ప్రవేశపెట్టాలని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది. ‘ప్రాచీన చరిత్ర’ బదులు ‘సంప్రదాయ చరిత్ర’ను పెట్టాలనే ప్రతిపాదనకు తనదైన సమర్థనను వినిపించింది. ప్రస్తుత పాఠ్యపుస్తకాల్లో మన వైఫల్యాలనే పేర్కొన్నారనీ, మొఘలులు, సుల్తానులపై మన విజయాలను చెప్పలేదనీ, కాబట్టి యుద్ధాలలో ‘హిందూ విజయాల’పై దృష్టి పెడుతూ పాఠ్యపుస్తకాలు మార్చాలనీ ఐజాక్ బృందపు వాదన. చరిత్రను చరిత్రగా చెప్పాల్సిందే! అందులో లోటుపాట్లను సవరించడమూ తప్పు కాదు. కానీ, సాక్ష్యాధారాలతో సాగాల్సిన ఆ చరిత్ర రచనను మతప్రాతిపదికనో, మరో ప్రాతిపదికనో మార్చాలనుకోవడమే సమస్య. ‘ఇండియా’ అంటూ ప్రతిపక్ష కూటమి తమకు తాము నామకరణం చేసుకున్న తరువాత నుంచి ఈ ‘ఇండియా’ వర్సెస్ ‘భారత్’ రచ్చ నడుస్తూనే ఉంది. భారత రాజ్యాంగం ‘ఇండియా... దటీజ్ భారత్’ అని పేర్కొన్నప్పటికీ, ప్రభుత్వం కొన్నాళ్ళుగా ఈ ‘భారత’ నామంపై కొత్త ప్రేమ కనబరు స్తోంది. ఆ మధ్య జీ–20 వేళ రాష్ట్రపతి అధికారిక విందు ఆహ్వానంలో సైతం ‘భారత్’ అనే పదాన్నే వాడడం వివాదం రేపింది. అసలు ‘ఇండియా’ అనే పేరే వలసవాద ఆలోచనకు ప్రతీక అన్నది అధికార పక్షం వాదన. ఏడువేల ఏళ్ళ నాటి విష్ణుపురాణం తదితర ప్రాచీన గ్రంథాల్లో ‘భారత్’ అని ఉపయోగించినందున ఆ పేరును వాడాలనేది ఐజాక్ కమిటీ సూచన. అయితే, ఇన్నేళ్ళుగా ‘ఇండియా’, ‘భారత్’లను పరస్పర పర్యాయపదాలుగానే వాడుతున్న దేశంలో ‘ఇండియా’ అని ఉన్నచోటల్లా పాఠ్యపుస్తకాల్లో ‘భారత్’ అని మార్చేయమని సిఫార్సు చేయడమే అర్థరహితం. ప్రభుత్వం తమనేమీ ప్రభావితం చేయలేదని ప్రొఫెసర్ ఐజాక్ అంటున్నారు కానీ, హిందూత్వ భావజాలం వైపు ఆయన మొగ్గు జగమెరిగిన సత్యం. పాలక పక్షపు ప్రాపకం కోసం చేసే ఇలాంటి ప్రతిపాదనలు, సిఫార్సులు గాలిలో నుంచి వాటంతట అవి ఊడిపడతాయని అనుకోలేం. అలా అనుకుంటే అమాయకత్వమే. ఆ మాటకొస్తే, 2018లోనే ప్రాచీన చరిత్రను తిరగరాసేందుకు తోడ్పడే నివేదికను సమర్పించాల్సిందిగా కేఎన్ దీక్షిత్ సారథ్యంలోని కమిటీని కోరారు. దీక్షిత్ సాక్షాత్తూ ఇండియన్ ఆర్కియలాజికల్ సొసైటీకి ఛైర్మన్, భారత పురావస్తు సర్వేక్షణ సంస్థకు మాజీ జాయింట్ డైరెక్టర్ జనరల్. తాజా సిఫార్సులు వచ్చే విద్యా సంవత్సరానికల్లా అమలులోకి రావచ్చట. పిల్లల పాఠ్యపుస్తకాల్లోనే కాక, విద్యావిషయక పరిశోధనలోనూ ఈ కమిటీ సిఫార్సులు చోటుచేసుకుంటాయని 2018లో సంస్కృతీశాఖ మంత్రిగా చేసిన మహేశ్శర్మ తదితరులు ఆశాభావంతో ఉన్నారు. అసలింతకీ కొత్తగా చేర్చదలచిన ఈ ‘సంప్రదాయ చరిత్ర’ అంటే ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దేశాన్ని పాలించిన రాజవంశాలన్నిటికీ పాఠ్యగ్రంథాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాలని ఐజాక్ కమిటీ ప్రతిపాదించింది. ఈ సమప్రాతినిధ్యం ప్రాంతాల ప్రాతిపదికన, చరిత్రలో ఆ వంశాల ప్రాధాన్యం ప్రాతిపదికనైతే ఫరవాలేదు. అలా జరుగుతుందా అన్నది ప్రశ్న. సంగీతం, సాహిత్యం, కళలు, వాస్తుశిల్పం, వాణిజ్యం, భక్తి ఉద్యమాల్లో ఎంతో భాగమున్న దక్షిణాది రాజవంశాలను ఎన్సీఈఆర్టీ పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంతకాలం ఉత్తర భారత దృక్కోణంలోనే నడుస్తున్న వారి పుస్తకాల్లో దక్షిణ భారత రాజవంశాలకూ తగినంత చోటిస్తారా? అది ఓ బేతాళప్రశ్న. అయితే, దేశంలో నిత్యం జరిగే చారిత్రక, పురావస్తు అధ్యయనాల్లో కొత్తగా బయటపడుతున్న అంశాలను సైతం పాఠ్యప్రణాళికలో చేర్చాలన్న కమిటీ సిఫార్సును తప్పక స్వాగతించాలి. చరిత్ర జడపదార్థం కాదు. దొరికిన సరికొత్త సాక్ష్యాధారాలతో ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చు కోవాలి. సమకాలీన అంశాలనూ చేర్చుకోవాలి. కానీ, కొత్త మార్పుల పేరిట పాలకపక్ష భావజాలా నికి అనుకూలంగానో, అన్నీ పురాణాల్లోనే ఉన్నాయిష అనో చరిత్రను మార్చాలని చూడడమే దుస్స హనీయం. అసలు సిసలు భారత్కు తామే ప్రతినిధులమని పిల్లలకు పాఠాలతో ఎక్కించి, రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే అంత కన్నా ఘోరం లేదు. చంద్రయాన్–3, నారీ శక్తి వందన్, కోవిడ్ నిర్వహణ లాంటి అంశాలకూ చోటిచ్చేలా ఎన్సీఈఆర్టీ ప్రణాళికా రచన చేసినట్టు విద్యాశాఖ చెబుతోంది. నిజానికి, పరిశోధన చేసి, పిల్లల వయసుకు తగిన పాఠాలతో ముందుకు రావడం ఎన్సీఈఆర్టీ పని. ఆ బాధ్యత వదిలేసి, అధికార పార్టీ రాజకీయ ఆలోచనలకు తగ్గట్టు, లేదా ఒక పక్షం విజయాలనే కీర్తిస్తున్నట్టు పాఠ్యాంశాలనే మార్చాలనుకుంటే అది సమగ్ర చరిత్ర కాదు. సమర్థనీయం కానే కాదు! -
NCERT: పాఠ్య పుస్తకాల్లో ఇండియా బదులు భారత్!
ఢిల్లీ: దేశంలోని అన్ని పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదానికి బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి NCERT ప్యానెల్ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రతిపాదనను అంతటా అమలు చేయాలని కోరుతూ మండలికి సిఫార్సు చేయనుంది. జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాలు, కొత్త సిలబస్, మార్పులు చేర్పులు, 2020 పాలసీకి సవరణలు, ఇతర ప్రణాళికల్ని ఖరారు చేసేందుకు 25 మందితో కూడిన ప్రత్యేక కమిటీ ఒక ఏర్పాటైంది. అయితే.. ఇండియా బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు NCERT ప్యానెల్ ఏకగ్రీవంగా అంగీకారం తెలిపినట్లు ప్యానెల్ చైర్మన్ ఐజాక్ బుధవారం వెల్లడించారు. కొత్త ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఇండియా బదులు భారత్ ఉంటుందని స్పష్టం చేశారాయన. చాలాకాలంగా ఈ ప్రతిపాదన పెండింగ్లో ఉన్నప్పటికీ.. తాజాగా ఏకగ్రీవంగా సభ్యులంతా ఆమోదం తెలిపినట్లు వెల్లడించారాయన. ఎన్సీఈఆర్టీ తరపున అన్ని పుస్తకాల్లో ఈ మార్పు రాబోతుందని ప్యానెల్ ఆశిస్తున్నట్లు తెలిపారాయన. అలాగే.. పాఠ్య పుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులు.. పురాతన చరిత్ర, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలని కూడా ప్యానెల్ సిఫార్సు చేసినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు.. వివిధ పోరాటాల్లో హిందూ విజయాలను పాఠ్యపుస్తకాల్లో హైలైట్ చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు. చరిత్రలో ఇప్పటిదాకా మన ఓటముల ప్రస్తావనే ఉంది. కానీ, మొఘలుల మీద, సుల్తానుల మీద మన విజయాల గురించి ప్రస్తావన లేదు అని అంటున్నారాయన. అయితే ఢిల్లీ ఎన్సీఈఆర్టీ ప్రధాన కార్యాలయానికి ఈ ప్రతిపాదన మాత్రమే వెళ్లిందని.. తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. ఈ దశలో ఈ పరిణామంపై స్పందించడం అవసరమని ఎన్సీఈఆర్టీ అంటోంది. ప్యానెల్ సిఫార్సులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ ఛైర్మన్ దినేష్ సక్లానీ స్పష్టంచేశారు. -
బడి బ్యాగు బరువు తగ్గించాలి!
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో చదివే విద్యార్థులపై పుస్తకాల బరువు తగ్గించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమలయ్యేలా చూడాలని పేర్కొంది. పుస్తకాల బరువు, దాని వల్ల ఎదురయ్యే పరిణామాలపై కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో చేసిన అధ్యయనం వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం.. 70శాతం మంది స్కూల్ విద్యార్థులపై పుస్తకాల భారం అధికంగా ఉంటోంది. దీనితో పిల్లల కండరాలు, మోకాళ్లపై ఒత్తిడి పడుతోంది. 22 శాతం మంది విద్యార్థులు వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఇంటికి రాగానే నీరసంగా, భుజాలు వంగిపోయి నొప్పితో ఇబ్బందిపడుతున్నారు. దీర్ఘకాలం పాటు ఈ ప్రభావం ఉంటోందని.. ఈ ఆరోగ్య సమస్యలు విద్యార్థి చదువుపై శ్రద్ధ కోల్పోయేందుకు కారణం అవుతున్నాయని అధ్యయనం నివేదిక స్పష్టం చేసింది. మితిమీరిన పుస్తకాలు, చదువుతో విద్యార్థులు సరిగా నిద్రపోవడం లేదని.. దీనితో తరగతి గదిలో చురుకుగా ఉండటం లేదని పేర్కొంది. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోందని వివరించింది. ప్రైవేటు స్కూళ్లు బహుళ అంతస్తుల భవనాల్లో ఉండటం, శక్తికి మించిన బరువుతో పిల్లలు మెట్లు ఎక్కడం వల్ల సమస్య పెరుగుతోందని తెలిపింది. ఈ క్రమంలో బడి బ్యాగుల బరువు విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు కచ్చితమైన నిబంధనలు ఉండేలా చూడాలని సూచించింది. ఐదేళ్ల నుంచి అడుగుతున్నా.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో స్కూల్ విద్యార్థులపై పుస్తకాల బరువు సమస్య తీవ్రంగా ఉందని ఈ అంశంపై అధ్యయనం చేసిన యశ్పాల్ కమిటీ గతంలోనే స్పష్టం చేసింది. చిన్నప్పట్నుంచే విద్యార్థులు అధిక బరువు మోయడం వల్ల కండరాలపై ఒత్తిడి పడి, భవిష్యత్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉందని మరికొన్ని అధ్యయనాలు కూడా తేల్చాయి. ఈక్రమంలో పుస్తకాల బరువు తగ్గించే చర్యలు చేపట్టాలని కేంద్ర విద్యా శాఖ ఐదేళ్ల క్రితమే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. ఆ దిశగా కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. పిల్లలు మోసే పుస్తకాల బరువు వారి బరువులో పది శాతానికి మించి ఉండకూడదని పేర్కొంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా కొంత కార్యాచరణ చేపట్టాయి. స్కూళ్లలో డిజిటల్ విధానం అమలు చేయాలని నిర్ణయించాయి. కానీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విద్యకు ప్రాధాన్యం, అవకాశాలు పెరిగాయి. విద్యా సంస్థలు దీనిని సది్వనియోగం చేసుకోవాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది. హోంవర్క్ సహా కొన్ని రాత పనులను డిజిటల్ విధానంలోకి మార్చడం వల్ల బరువు తగ్గించే వీలుందని పేర్కొంది. ఐదేళ్ల క్రితం ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో స్పందించలేదని.. ఇకనైనా ఆ దిశగా అడుగువేయాలని కేంద్ర విద్యాశాఖ తాజాగా అభిప్రాయపడింది. బ్యాగు బరువు ఇలా ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రెండో తరగతి విద్యార్థులకు 1.5 కిలోలు మాత్రమే పుస్తకాల బరువు ఉండాలి. 5 తరగతి వరకూ మూడు కేజీలు, 7వ తరగతి వరకు 4 కేజీలు, 9వ తరగతి వారికి 4.5 కేజీలు, పదో తరగతి వారికి 5 కేజీలకు మించి పుస్తకాల బరువు ఉండకూడదు. తెలంగాణ విద్యాశాఖ క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం.. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల పుస్తకాల బరువు 12 కేజీల వరకు, ఉన్నత పాఠశాల విద్యార్థుల పుస్తకాల బరువు 17 కేజీల వరకు ఉంటున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఐదో తరగతి చదివే విద్యార్థులు ఏకంగా 40 పుస్తకాలను మోయాల్సి వస్తోంది. పాఠ్య పుస్తకాలు, వర్క్బుక్స్, వర్క్ïÙట్స్, నోట్బుక్స్ ఇలా అనేకం బ్యాగులో కుక్కేస్తున్నారు. వీటికితోడు లంచ్ బాక్స్, నీళ్ల బాటిల్ కూడా కలసి పిల్లలపై భారం పడుతోంది. ప్రైవేటు స్కూళ్లు పుస్తకాల ముద్రణ సంస్థలతో కుదుర్చుకునే ఒప్పందాల కారణంగా ప్రతిదీ కొనాల్సిందేనని విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. భారంపై రాష్ట్ర విద్యాశాఖ దృష్టి పుస్తకాల బరువు తగ్గించే అంశంపై రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇటీవల చర్చించారు. ఈ అంశంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, కార్యాచరణను రూపొందించేందుకు అధికారులతో ఓ కమిటీ వేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులకు పుస్తకాల బరువు అధికంగా ఉంటోందని.. అలాంటి వాటిని కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలని ఆలోచనకు వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలైందని, అన్ని అంశాలను పరిశీలించి త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని విద్యాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. -
డిప్లొమాలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులకు అత్యున్నతస్థాయి విద్యనందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. సాంకేతిక విద్యలోనూ సీఎం జగన్ పలు సంస్కరణలు చేపట్టారు. విద్యార్థులు చదువు పూర్తి చేయగానే మంచి కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా పాఠ్యాంశాల్లో కూడా మార్పులు చేస్తున్నారు. సాంకేతిక విద్యలో ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా కరిక్యులమ్లో మార్పులు తెచ్చింది. డిప్లొమా స్థాయి నుంచి ఇండస్ట్రీ కనెక్ట్ విధానాన్ని అమలు చేస్తోంది. తాజాగా డిప్లొమాలో తొలిసారిగా ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను ముద్రిస్తోంది. ఈ విద్యా సంవత్సరం (2023–24)లో డిప్లొమా మొదటి ఏడాదికి ఆరు బ్రాంచ్లలో కొత్త కరిక్యులమ్ ప్రకారం 17 థియరీ, 10 ల్యాబ్ మాన్యువల్స్ను ప్రచురిస్తోంది. త్వరలో ఆటోమొబైల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్ బ్రాంచ్లలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. అదనపు సమాచారం కోసం పాఠ్యపుస్తకాల్లో వెబ్ లింక్లు, ఆడియో విజువల్ విద్యా సమాచారానికి అనుగుణంగా డిజిటల్ లింక్లు పొందుపరిచారు. విద్యార్థులు డిప్లొమా పరీక్షలతోపాటు బహుళ జాతీయ సంస్థ, పలు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించేలా మంచి క్వశ్చన్ బ్యాంక్లను కూడా రూపొందించడం విశేషం. విద్యార్థులకు అందుబాటు ధరల్లో ఇప్పటివరకు డిప్లొమా కోర్సుల్లో బోధనకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఆమోదించిన పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో పుస్తకాల ఎంపికలో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో విద్యార్థులకు మేలు చేకూర్చేలా సొంతంగా పాఠ్యపుస్తకాలు రూపొందించాలని సాంకేతిక విద్యా శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో సాంకేతిక విద్య, శిక్షణ మండలి తక్కువ ధరకు నాణ్యమైన పాఠ్య పుస్తకాలు, ప్రయోగశాల కరదీపికల ప్రాజెక్టును ప్రారంభించింది. వీటి రూపకల్పనకు ప్రత్యేక అధ్యాపక బృందాన్ని ఎంపిక చేసింది. పాఠ్య పుస్తక ప్రచురణలో 46 మంది రచయితలు, 20 మంది సంపాదకులు సేవలు అందించారు. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు మార్గదర్శకాల ప్రకారం అభ్యాస ఫలితాలకు తగినట్లుగా కంటెంట్ను రూపొందించింది. మార్కెట్ ధరలతో పోల్చితే తక్కువ ధరకు పాఠ్య పుస్తకాలను అందించనుంది. గతంలో ఏ పుస్తకం కొనాలన్నా రూ.200–రూ.300 ఖర్చు అయ్యేది. ఇప్పుడు మెరుగైన విషయ పరిజ్ఞానంతో ప్రభుత్వమే రూ.100 లోపు ధరలకు పాఠ్యపుస్తకాలను అందించనుంది. ముద్రిత ధరపై మరో 20 శాతం మేర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ప్రత్యేక రాయితీని కల్పిస్తోంది. కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి కొద్ది రోజుల్లోనే డిప్లొమా మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తెస్తాం. ఇప్పటికే సాధారణ సబ్జెక్టుల పుస్తకాలు, ల్యాబ్ మాన్యువల్లు సిద్ధంగా ఉన్నాయి. సీఎం జగన్ సూచనలతో సాంకేతిక విద్యా శాఖ, శిక్షణ మండలి పాఠ్యపుస్తకాలను ముద్రిస్తోంది. ఇవి తక్కువ ధరకే లభిస్తాయి. – చదలవాడ నాగరాణి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ -
ఏపీ: పాఠ్యపుస్తకాల విషయంలో విద్యాశాఖ కొత్త విధానానికి బీజం
సాక్షి, విజయవాడ: పాఠ్య పుస్తకాల విషయంలో ఏపీ విద్యాశాఖ కొత్త విధానానికి బీజం వేసింది. 1 నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్లో పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వెబ్సైట్లో ఫ్రీ డౌన్ లోడ్స్ను ఆయన బుధవారం ప్రారంభించారు. వెబ్సైట్ నుంచి ఎవరైనా ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. వాణిజ్య అవసరాలకు ఉపయోగించటం నిషేధమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను కేవలం 22 రోజుల వ్యవధిలో విద్యాశాఖ విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 61 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 72 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయి అయ్యింది. చదవండి: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. టాప్-3 జిల్లాలు ఇవే.. ఫలితాలపై రీవెరిఫికేషన్ కి మే 6 లోపు అప్లై చేసుకోవాలని మంత్రి బొత్స తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు, ప్రాక్టికల్స్ మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయని ఆయన వెల్లడించారు. మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకి ఫీజు చెల్లించుకోవాలని, విజయనగరం జిల్లాలో ఫలితాలు తగ్గడంపై సమీక్షిస్తామని మంత్రి అన్నారు. -
కావాల్సింది ‘వర్గ పోరాటాల చరిత్ర’
విద్యలో, ‘ప్రభుత్వ జోక్యం’ ఈ నాటిది కాదు. ఎప్పుడో 1848 లోనే, మార్క్స్, ఎంగెల్సు ఈ వాస్తవాన్ని ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో ప్రస్తావించారు. కులం, మతం, ప్రాంతం– అనే భేదాల్ని ఉపయోగించుకుని అధికారం లోకి రావడానికి ప్రతీ పార్టీ సహజంగానే ప్రయత్నిస్తుంది. అనేక రంగాలలో జరిగే అనేక ప్రయత్నాలలో, పాఠ్య పుస్తకాలలో చేసే ఈ మార్పులు కూడా ఒకటి. చిత్రం ఏమిటంటే, ‘ఉభయ’ పక్షాల వారూ, రాజుల్నీ, చక్రవర్తుల్నీ దోపిడీ వర్గ ప్రతినిధులుగా చూడరు. ఆ రాజులూ, చక్రవర్తులూ ఆ నాటి కాలాల్లో రైతుల శ్రమ మీదా, చేతివృత్తుల వారి శ్రమ మీదా ఆధారపడి బతికిన పరాన్న జీవులనీ, చెప్పరు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రచురించిన కొన్ని పాఠ్యపుస్తకాలలో వున్న చరిత్రకి సంబంధించిన కొన్ని పాఠాల్ని ఇప్పటి బీజేపీ ప్రభుత్వం తీసివెయ్యడం ఆరు నెలల కిందట (2022 జులైలో) జరిగింది. అది ఇప్పుడు ఒక వివాదంగా వుంది. కేంద్రంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకంగానూ, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకో రకంగానూ చరిత్ర పాఠాల్లో ఈ మార్పులు జరుగుతూ వచ్చాయి! గతంలో, ఎప్పుడు ఎలాంటి మార్పులు చేశారు– అనే వివరాలలోకి వెళ్ళడం ఇక్కడ సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు జరుగుతోన్న వివాదాన్నే ప్రధానంగా చూడాలి. సెంట్రల్ సిలబస్లో 6వ తరగతి నించీ 12వ తరగతి వరకూ వున్న సోషలూ, చరిత్రా పాఠాలు పిల్లలకి భారంగా తయారయ్యాయి కాబట్టి కొన్ని పాఠాల్ని తీసివెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ ప్రభుత్వం అంటే, అధికార పార్టీకి అనుకూలంగా వుండే ప్రొఫెసర్ల కమిటీ అన్నమాట! ‘సిలబస్ హేతుబద్ధీకరణ’ అనే పేరుతో, కొన్ని పాఠాలు తీసేశారు. వాటిలో అతి ప్రధానమైనది, దాదాపు 4 వందల యేళ్ళు పాలించిన మొఘల్ చక్రవర్తుల చరిత్ర. అలాగే, గాంధీ హత్యా, గుజరాత్లో మత కల్లోలాలూ, వగైరా, వగైరా. కాంగ్రెసు ప్రభుత్వం ప్రచురించిన పాఠ్యపుస్తకాలలో మొఘలుల పాలనకు విపరీతమైన ప్రాముఖ్యత ఇచ్చారనీ, ప్రాచీన హిందూ రాజుల చరిత్రకి ప్రాధాన్యత లేదనీ, దక్షిణ భారత దేశాన్నీ, ఈశాన్య భారతాన్నీ ఏలిన రాజుల్ని పట్టించుకోలేదనీ, కాంగ్రెసు మీద బీజేపీ సమర్థకుల విమర్శ. ముస్లిం మైనారిటీలను బుజ్జగించి, వారి ఓట్లను పొందడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం, ముస్లిం పాలకులకు అంత ప్రాధాన్యత ఇచ్చిందని కాంగ్రెసు మీద బీజేపీ ఆరోపణ. అయితే, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న మార్పులు, మత విద్వేషాలను రెచ్చగొట్టి, ఎన్నికల్లో మెజారిటీ హిందూ మతస్తుల ఓట్లను రాబట్టడా నికి చేసిన కుట్ర అని ప్రతిపక్షాల వాదన! విద్యలో, ‘ప్రభుత్వ జోక్యం’ అనేది ఈ నాటిది కాదు. ఎప్పుడో 1848 లోనే, మార్క్స్, ఎంగెల్సు ఈ వాస్తవాన్ని ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో ప్రస్తావించారు. ఆ ప్రభుత్వ జోక్యానికి వుండే పెట్టు బడిదారీ వర్గ స్వభావాన్ని కార్మికవర్గ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చాలని, ఆ ప్రణాళిక ఉద్దేశం. ఆ దృష్టితో చూసినప్పుడు కాంగ్రెస్సూ, బీజేపీ, రెండూ బూర్జువా వర్గ ప్రయోజనాలను కాపా డేవే. అలా కాపాడడం కోసం, అధికార పీఠం ఎక్కడానికి, అవి ఎంచుకునే పద్ధతులు తేడాగా వుంటాయి. ఉదాహరణకి, బీజేపీ ఎందుకు హిందూ మెజారిటీ ఓట్లమీద ఆధారపడుతుందీ అనే విషయం అర్థం చేసుకోవాలంటే, 1906లో ఏర్పడ్డ ‘ముస్లిం లీగ్’ గురించీ, 1915లో ఏర్పడ్డ ‘హిందూ మహాసభ’ గురించీ తెలుసుకోవాలి. అప్పుడు ఆ మతాలకు చెందిన భూస్వాములకూ, పరిశ్రమాధిపతు లకూ, వర్తకులకూ, రాజకీయ నాయకులకూ, అటువంటి వారి ప్రయోజనాల మధ్య వున్న వైరుధ్యాలను పరిశీలించాలి. అదంతా ఇక్కడ వీలుకాదు. సారాంశం ఏమిటంటే, మత సంస్థలు గానీ, మతంతో ముడిపడి వున్న రాజకీయాలు గానీ, నిజంగా మతాలకు సంబంధించిన అంశాలు కావు. ఇప్పుడే కాదు, కొన్ని వందల ఏళ్ళ కిందట మతం పేరుతో జరిగిన యుద్ధాల్లో కూడా, ఎంగెల్సు చెప్పి నట్టు, ‘స్పష్టమైన భౌతిక వర్గ ప్రయోజనాలు వుండినాయి’! ‘ఆ నాటి వర్గపోరాటాలు మత నినాదాల దుస్తులలో వుండి, వేరువేరు వర్గాల ప్రయోజనాలూ, అవసరాలూ, డిమాండ్లూ వంటివి, మతం అనే తెరవెనక మరుగు పడ్డాయ’నే విషయాన్ని ‘జర్మనీలో రైతు యుద్ధం’ అనే పుస్తకం లో ఎంగెల్సు చాలా వివరంగా చెపుతాడు. అది ఈ నాటికీ వాస్తవమే. పైకి, తక్షణంగా, ఒక కారణం (ఉదా: గోద్రా రైలు దహనం, ఆ తర్వాత జరిగిన మత కల్లోలాలు) కనిపించినప్పటికీ, అనేక లింకుల ద్వారా చరిత్రని పరికిస్తే, మనకి పాలకవర్గ ప్రయో జనాలు కనిపిస్తాయి. ‘వర్గ ప్రయోజనం’ అన్నప్పుడు రెండు వేరు వేరు వర్గాలు– అనే కాదు; ఒకే వర్గంలోనే, రెండు వేరు వేరు సెక్షన్ల ప్రయోజనాల మధ్యకూడా వైరుధ్యాలు ఉంటాయి. వర్గాలుగానూ, ఉపవర్గాలుగానూ, చీలివున్న సమాజంలో, పాలక వర్గ ప్రయోజనాలను కాపాడడానికి, ఒకే ఒక్క రాజకీయ పార్టీయే వుండదు. అనేక పార్టీలు వుంటాయి. కులం, మతం, ప్రాంతం– అనే భేదాల్ని ఉపయోగించుకుని అధికారం లోకి రావడానికి ప్రతీ పార్టీ సహజంగానే ప్రయత్నిస్తుంది. అనేక రంగాలలో జరిగే అనేక ప్రయత్నాలలో, పాఠ్య పుస్తకాలలో చేసే ఈ మార్పులు కూడా ఒకటి. ఈ చరిత్ర పుస్తకాలలో రాజుల్నీ, చక్రవర్తుల్నీ, చిత్రించేటప్పుడు, ఒక పక్షం మేధావులు అన్ని మతాల పాలకుల్నీ కొంత ‘సంస్కరణ వాద దృక్పథం’తో చూపుతారు. ఇంకో పక్షం మేధావులు హిందూ పాల కుల్ని మాత్రమే గొప్ప చేస్తూ, ముస్లిం రాజుల్ని దుష్టులుగా చూపు తారు. చిత్రం ఏమిటంటే, ఉభయ పక్షాల వారూ, రాజుల్నీ, చక్రవర్తుల్నీ దోపిడీ వర్గ ప్రతినిధులుగా చూడరు. ఆ రాజులే స్వయంగా దోపిడీ దారులనీ, వాళ్ళు శ్రామిక జనాలనించీ లాగిన కౌలూ, వడ్డీ, లాభాల వంటి శ్రమ దోపిడీ ఆదాయాల మీదే బతికిన వాళ్ళనీ మాత్రం గుర్తించరు. వాళ్ళ వీరత్వం గురించీ, యుద్ధ కళల గురించీ, కళా పోషణల గురించీ, వాళ్ళ పాండిత్య ప్రతిభల గురించీ, మత సామరస్యాల గురించీ, వాళ్ళ దైవభక్తి గురించీ, దానశీలతల గురించీ... ఇలా, ఇలా చిత్రించుకుంటూ పోతారు, ఇరుపక్షాల వారూ కూడా! అంతేగానీ, ఆ రాజులూ, యువరాజులూ, రాణులూ, యువ రాణులూ, ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టేవారు కాదనీ, వాళ్ళది వందలాది సేవక పరివారం మీద ఆధారపడిన పరమ సోమరి జీవితం అనీ మాత్రం, ఎక్కడా ఒక్క ముక్క అయినా రాయరు. ఆ రాజులూ, చక్రవర్తులూ ఆ నాటి కాలాల్లో రైతుల శ్రమమీదా, చేతి వృత్తుల వారి శ్రమ మీదా ఆధారపడి బతికిన పరాన్న జీవులనీ, చెప్పరు (స్కూలు పుస్తకాల్లో కాదు గానీ, చరిత్రకి సంబంధించిన ఇతర రచనల్లో, వర్గాల గురించీ, వర్గ పోరాటాల గురించీ రాసిన మేధావులు కొందరైనా వున్నారు). చరిత్రకి సంబంధించిన పాఠ్యపుస్తకాల వివాదం చూశాక, శ్రామిక వర్గ పక్షం వహించే రచయితలు చెయ్యాల్సింది ఏమిటి? ‘పిల్లల కోసం వర్గపోరాట చరిత్ర పాఠాలు’ రాయడం! ‘పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం’ పేరుతో రాసినట్టు, వర్గ దృక్పధంతో కొన్ని చరిత్ర పాఠాలు రాయాలనివుంది నాకు. బీజేపీ ప్రభుత్వం అంటే భయం లేదుగానీ, నా ‘హెర్నియా’ జబ్బు రాయనిస్తుందో లేదో చూడాలి! వ్యాసకర్త ప్రసిద్ధ రచయిత్రి రంగనాయకమ్మ -
2, 3 సెమిస్టర్ల పాఠ్యపుస్తకాలు సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన 2, 3 సెమిస్టర్ల పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్కుమార్ తెలిపారు. జగనన్న విద్యా కానుక కింద అందిస్తున్న ఈ పుస్తకాల పంపిణీకి సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలతో ఆయన మంగళవారం సర్క్యులర్ విడుదల చేశారు. 2022–23 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యా కానుక–3 కింద సెమిస్టర్–2, 3కు సంబంధించిన పాఠ్య పుస్తకాలు అక్టోబర్ 15 నుంచి 31 వరకు పూర్వపు 13 జిల్లాల గోడౌన్లకు సరఫరా చేసినట్లు తెలిపారు. జిల్లా బుక్ డిపో మేనేజర్లు మండల పాయింట్లకు వీటిని పంపిణీ చేసేందుకు వీలుగా షెడ్యూల్ను కూడా సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులకు ప్రతి పుస్తకం చేరేలా... సెమిస్టర్–1 పాఠ్యపుస్తకాల సరఫరాలో కొన్ని లోపాలు తలెత్తాయి. ఇప్పుడు అటువంటి సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులకు కమిషనర్ సూచించారు. అన్ని జిల్లాల బుక్ డిపోల మేనేజర్లు సెమిస్టర్–2, 3 పాఠ్యపుస్తకాల అన్ని టైటిళ్లను ఒకే షెడ్యూల్లో అందించాలి. అన్ని మండలాల విద్యాశాఖాధికారులు సెమిస్టర్–2, 3ల అన్ని పాఠ్యపుస్తకాలను తమ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సరఫరా చేయాలి. ప్రతి టైటిల్ బుక్ ప్రతి విద్యార్థికి చేరేలా చూసుకోవాలి. ప్రధానోపాధ్యాయులు అందరూ తమ స్కూలులో ప్రస్తుత నమోదు ప్రకారం మండల పాయింట్ల నుంచి అన్ని పాఠ్యపుస్తకాల శీర్షికలను తీసుకోవాలి. ఏ పాఠశాలలో అయినా ఆంగ్ల మాధ్యమంలో నమోదు పెరిగి, తెలుగు మాధ్యమంలో తగ్గితే మండల విద్యాధికారి ద్విభాషా పాఠ్యపుస్తకాలను ఆంగ్ల మాధ్యమం విద్యార్థుల కోసం సరఫరా చేయాలి. ఇంకా, మండలాల్లో చేరికలు పెరిగి ఏదైనా కొరత ఏర్పడితే మండల విద్యాధికారి సంబంధిత పత్రాలతో జిల్లా విద్యాధికారికి, జిల్లా బుక్ డిపో మేనేజర్కు తెలియజేసి అవసరమైన శీర్షికలను పొందాలి. ఉర్దూ, తమిళం, కన్నడ, ఒడియా మాధ్యమాల పాఠ్యపుస్తకాలు, సంస్కృతం పాఠ్యపుస్తకాలు కూడా ప్రింట్ అయి జిల్లా పాఠ్యపుస్తకాల మేనేజర్లకు సరఫరా అయ్యాయి. జిల్లా విద్యాధికారి, జిల్లా బుక్ డిపో మేనేజర్ ఈ పుస్తకాలను అవసరమైన పాఠశాలలకు సరఫరా చేయాలి. సెమిస్టర్–2, 3ల పాఠ్యపుస్తకాలు మొత్తం నవంబర్ 10వ తేదీలోపు పంపిణీ చేయాలి. ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాధికారులు, జిల్లా బుక్డిపో మేనేజర్లు పాఠ్యపుస్తకాల పంపిణీని పర్యవేక్షించాలి. ఏదైనా మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తిస్తే విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. -
హిందీలో ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలు
భోపాల్: వైద్య విద్యను హిందీలో అందించే లక్ష్యంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎంబీబీఎస్ మూడు సబ్జెక్టుల హిందీ పాఠ్యపుస్తకాలను విడుదల చేశారు. ఎంబీబీఎస్ కోర్సును హిందీలో అందిస్తున్న మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్ అని అన్నారు. ఇది స్వర్ణాక్షరాలతో లిఖింపబడుతుందని అభివర్ణించారు. ఆదివారం భోపాల్ మంత్రి అమిత్ షా ఎంబీబీఎస్లోని మెడికల్ బయో కెమిస్ట్రీ, అనాటమీ, మెడికల్ ఫిజియాలజీ సబ్జెక్టుల హిందీ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించారు. సాంకేతిక, వైద్య విద్యను మరో 8 భాషల్లోనూ ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పారు. ఇంగ్లిష్ తమకు రాదనే ఆత్మనూనతతో విద్యార్థులు బాధపడాల్సిన పనిలేదన్నారు. మాతృభాషల్లోనూ విద్యను కొనసాగించవచ్చని తెలిపారు. ఈ పాఠ్యపుస్తకాలను 97 మంది వైద్యులతో కూడిన బృందం రూపొందించిందని సీఎం చౌహాన్ చెప్పారు. కాగా, ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలను హిందీలో తీసుకురావడం వైద్యవిద్యలో సానుకూల పరిణామమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
నిజాం పాలనలో జీవిస్తునే దేశ స్వాతంత్ర్యంకోసం పోరాటం
-
ఈ రాతలకు ‘బుక్’ చేయాల్సిందే!
రెండున్నర దశాబ్దాలుగా ప్రయివేటు స్కూళ్ల పాఠ్య పుస్తకాలను ముద్రించేది ఇద్దరు ముగ్గురు పబ్లిషర్లే. ఇక ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలయితే ఆ పుస్తకాలకు వసూలు చేసే మొత్తానికి ఒక పద్ధతీ పాడూ లేదు. పైపెచ్చు విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగైదు నెలలు గడిచేదాకా పుస్తకాలు అందుబాటులోకి వచ్చేవి కావు. కాకపోతే ఇవేవీ రామోజీరావుకు తప్పుగా అనిపించలేదు. ఎన్నడూ భారీగా వసూలు చేసే ప్రయివేటు పాఠశాలల్ని గానీ, సకాలానికి అందివ్వలేని పబ్లిషర్లను గానీ... వారిని నియంత్రించలేని ప్రభుత్వాన్ని గానీ ప్రశ్నించలేదు. ఈ ఏడాది నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పద్ధతిని మార్చారు. పబ్లిషర్ల కోసం ఓపెన్ టెండర్లు పిలిచారు. ధరలను ప్రభుత్వమే నిర్ణయించింది. అంతకన్నా ఎక్కువకు విక్రయించడానికి వీల్లేదంటూ... విద్యార్థుల తల్లిదండ్రులపై పెను భారం పడకుండా చేసింది. ఓపెన్ టెండర్లలో ఎక్కువ మంది పబ్లిషర్లు ఎంపికయ్యారు కనక పుస్తకాల సరఫరా కూడా బాగానే ఉంది. కాకపోతే ఇదంతా చేసింది చంద్రబాబు కాదు కనక... షరా మామూలుగా రామోజీ విమర్శల రాగం అందుకున్నారు. ప్రయివేటు స్కూళ్లతోను, పబ్లిషర్లతోను కుమ్మక్కును నిరూపించే రాతలకు దిగారు. పుస్తకాలెక్కడ? అంటూ అబద్ధాలు అచ్చేస్తున్నారు. ఈ వ్యవహారంలో నిజానిజాలేంటో ఒకసారి చూద్దాం... ప్రయివేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల కోసం పాఠ్య పుస్తకాలను ముద్రించడం, విక్రయించటం వంటివి చేయటానికి ప్రయివేటు పబ్లిషర్లను అనుమతిస్తూ 2006– 07 విద్యా సంవత్సరంలోనే నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓపెన్ టెండర్ల ద్వారా ప్రయివేటు పబ్లిషర్లకు అప్పగించింది. దీనికి వారు ఏటా పుస్తకం ధరలో ఐదు శాతాన్ని రాయల్టీగా చెల్లించాలి. ఇదిగో... నాటి నుంచి గతేడాది వరకూ పుస్తక ముద్రణను ఎమెస్కో బుక్స్, విజయవాణి ప్రింటర్స్, ప్రజాశక్తి దినపత్రిక, విశాలాంధ్ర చేస్తూ వచ్చాయి. అయితే ఈ విద్యా సంవత్సరానికి (2022–23) టెండర్లు పిలిచేటపుడు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి. ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలకు అధిక ధరలు వసూలు చేస్తున్నారని, తరగతిని బట్టి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటున్నాయని ఫిర్యాదులొచ్చాయి. పైపెచ్చు ప్రభుత్వం సరఫరా చేసే పుస్తకాల కంటే ఆక్స్ఫర్డ్, రత్నసాగర్, ఓరియెంట్ బ్లాక్స్వాన్, మాక్స్మిల్లర్ వంటి ప్రయివేటు పబ్లిషర్లు ముద్రించే పుస్తకాలను వాడటానికే ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు ఆసక్తి చూపిస్తున్నాయని, ఇవి ఖరీదైనవి కావడంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోందని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అంతేకాక ప్రయివేటు స్కూళ్లు ఇలా చేయటం వల్ల విద్యార్థులు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన నాణ్యమైన కంటెంట్ ఉన్న పాఠ్యపుస్తకాలకు దూరమవుతున్నారనీ ప్రభుత్వం గుర్తించింది. వీటన్నిటికీ తోడు... గత మూడేళ్లుగా ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులెవరూ తమ పుస్తకాలను కొనుగోలు చేయడం లేదని పేర్కొంటూ పబ్లిషర్లు 25 శాతమే రాయల్టీ చెల్లించారు. వారు విక్రయించిన పాఠ్యపుస్తకాల వివరాలను, ఆడిటింగ్ నివేదికలను కూడా ప్రభుత్వానికి సమర్పించలేదు. ఇవన్నీ చూశాక... ప్రచురణకర్తలు ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను పాటించటం లేదని, తక్కువ నాణ్యత గల పేపర్పై రంగులతో ముద్రిస్తున్నారని, అది విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోందని గుర్తించింది. ధరలు అధికంగా ఉండటంతో నియంత్రించాలని భావించింది. ప్రైవేటుకూ ప్రభుత్వమే పుస్తకాల సరఫరా... ప్రైవేటు విద్యారంగంలో జరుగుతున్న పుస్తక దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వ విద్యార్థులతో సమానంగా ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన పుస్తకాలను ముద్రించి సరఫరా చేయాలని ఈ ఏడాది ఏప్రిల్ 3న ప్రభుత్వం నిర్ణయించింది. గతం కంటే నాణ్యమైన పుస్తకాలు ముద్రించేందుకు వీలుగా టెండర్లు పిలవగా 83 సంస్థలు ముందుకు వచ్చాయి. వీటిలో 57 సంస్థలు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎన్టీపీఎల్ నుంచి పేపర్ అందిన తేదీ నుంచి 20 రోజుల్లో పుస్తకాల ముద్రణ, సరఫరా చేసేందుకు అంగీకరించాయి. ఈ 57 సంస్థలకూ వాటి సామర్థ్యానికి అనుగుణంగా ముద్రణ వర్క్స్ను కేటాయించారు. దీనికంటే ముందే... అవసరమైన పేపరు సరఫరా చేస్తామని ఈ ఏడాది మార్చిలోనే ఎన్టీపీఎల్ అంగీకరించింది. దాంతో మార్చి 28, మే 26 తేదీల్లో విద్యాశాఖ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి ప్రైవేట్, అన్–ఎయిడెడ్ పాఠశాల పిల్లలకు విద్యాశాఖే పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తుందని స్పష్టంచేసింది. ఈ మేరకు అధికారులు వారికి అవగాహన కల్పించారు. మొదటి సెమిస్టర్ నాటికే 1,25,14,786 పుస్తకాలు... ఈ విద్యా సంవత్సరంలో 24,44,942 మంది విద్యార్థులు స్టేట్ సిలబస్తో ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నట్లు లెక్కతేల్చగా, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు 18,02,879 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అవసరమని ఇండెంట్ ఇచ్చాయి. మిగిలిన విద్యార్థులు పాత పుస్తకాలను ఉపయోగించుకుంటారని తెలిపాయి. దీని ప్రకారం ఈ జూలై 25వ తేదీ మొదటి సెమిస్టర్ నాటికి జిల్లాల్లోని విద్యార్థులకు అవసరమైన 1,39,84,625 పాఠ్య పుస్తకాల్లో 1,25,14,786 పుస్తకాలను సరఫరా చేసింది. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ధరలు నిర్ణయించింది. -
పది రోజుల్లో ఇంటర్ పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జూనియర్ కాలేజీలకు మరో పది రోజుల్లో ఇంటర్ పాఠ్య పుస్తకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, తెలుగు అకాడమీ డైరెక్టర్ దేవసేన తెలిపారు. ‘సాక్షి’ప్రతినిధితో సోమవారం ఆమె మాట్లాడుతూ.. పేపర్ కొరత కారణంగానే ముద్రణ ఆలస్యమైందన్నారు. ‘‘ఈ పుస్తకాలకు నాణ్యమైన పేపర్ను ఉపయోగిస్తాం. పేపర్ రేట్లు ఇటీవల విపరీతంగా పెరిగాయి. పాత కాంట్రాక్టు సంస్థల్లో ఒకటి మాత్రమే పేపర్ అందించడానికి ముందు కొచ్చింది. ప్రభుత్వం ఇటీవల వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంతో తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలకు డిమాండ్ పెరిగింది. దీంతో గతంలో వచ్చిన పేపర్ అవి ముద్రించడానికే ఉపయోగించాల్సి వచ్చింది. అవసరమైన పేపర్ను తెప్పించేందుకు అధికారులు సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రవాణాకు ఇబ్బంది ఏర్పడింది’’అని చెప్పారు. మార్కెట్లో ఖరీదుకు అందించే పుస్తకాలను ఇప్పటికే ముద్రించామని, ప్రభుత్వ కాలేజీలకు ఉచితంగా ఇవ్వాల్సిన పుస్తకాల్లో కొన్ని ముద్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పేపర్ అందిన మూడు రోజుల్లో ప్రింటింగ్ పూర్తి చేస్తామని తెలిపారు. తర్వాత వారం రోజుల్లో అన్ని కాలేజీలకు అందిస్తామన్నారు. పేపర్ కొరత సమస్య తెలంగాణకే కాదని, అన్ని రాష్ట్రాలకూ ఉందని వెల్లడించారు. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత అంతర్జాతీయంగానూ పేపర్ ఖరీదు పెరిగిందన్నారు. తాము టెండర్లు పిలిచినప్పటికి, ఇప్పటికి పేపర్ ఖరీదు రెట్టింపు అయిందని, అయినా నాణ్యత విషయంలో రాజీ పడకుండా విద్యార్థులకు మంచి పుస్తకాలు అందించాలనే సంకల్పంతో ఉన్నామని వివరించారు. -
తెలంగాణ: పుస్తకాల ముద్రణ ఇంకా ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠ్య పుస్తకాల పంపిణీ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటివరకూ 63 శాతమే పంపిణీ జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. మిగతా 37 శాతం పాఠ్యపుస్తకాలను ముద్రించాల్సి ఉంది. ఈ ప్రక్రియకు ఇంకా సమయం పట్టేలా కన్పిస్తోంది. అయితే, మరో పది రోజుల్లో మొత్తం పుస్తకాలను విద్యార్థుల వద్దకు చేరుస్తామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటికే బోధన మొదలైంది. సర్కారీ బడుల్లో మాత్రం పుస్తకాల కొరత కారణంగా బోధన చేపట్టలేదు. దీన్ని కప్పి పుచ్చుకోవడానికి బ్రిడ్జ్ కోర్సు పేరుతో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. జూలైలోనూ పుస్తకాలు ఇవ్వకుండా, బోధన మొదలవ్వకపోతే విద్యార్థుల్లో ప్రమాణాలు ఎలా పెరుగుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 24 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తారు. విద్యా శాఖ అంచనా ప్రకారం దాదాపు 1.67 కోట్ల పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంటుంది. బడులు మొదలై నెల రోజులకుపైగా గడిచినా ఇప్పటివరకూ 1.07 కోట్ల పుస్తకాలనే బడులకు పంపారు. ఇంకా 60 లక్షల పుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. విద్యార్థులందరికీ సరిపడా పుస్తకాలు లేకపోవడంతో పంపిణీ కార్యక్రమంలో ఉపాధ్యాయులూ తికమక పడుతున్నారు. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే స్థానికంగా ఇబ్బందులొస్తున్నాయని అంటున్నారు. దీంతో స్కూళ్లకు చేరిన పుస్తకాలను కూడా పంపిణీ చేయడం లేదు. ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన చేపట్టాల్సి ఉండటంతో ద్విభాషలో పుస్తకాలు ముద్రించారు. పది రోజుల్లో ఇస్తాం: శ్రీనివాసచారి, డైరెక్టర్ ప్రభుత్వ పుస్తక ముద్రణ విభాగం పుస్తకాలకు అవసరమైన కాగితం ఆలస్యంగా రావడంతోనే సకాలంలో ముద్రించలేకపోయాం. ఇప్పటికే 63 శాతం జిల్లాలకు పంపాం. వాటిని వెంటనేపంపిణీ చేయమని చెప్పాం. మిగతావి కూడా మరో పది రోజుల్లో పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. -
పేపర్ సంక్షోభం! ఇక 'పుస్తకాలు' ఉండవేమో!
No textbooks for students: పాకిస్తాన్లో లోపభూయిష్టమైన విధానాలు, ద్రవ్యోల్బణం తదితర కారణాల రీత్యా తీవ్రమైన పేపర్ సంక్షోభం తలెత్తింది. దీని ఫలితంగా వచ్చే ఏడాది విద్యాసంవత్సరానికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండే అవకాశం లేదని పాకిస్థాన్ పేపర్ అసోసియేషన్ అధికారులు చెబుతున్నారు. అదువల్ల స్కూళ్లు ఆలస్యంగా ఆగస్టులో ప్రారంభమవుతాయని పాకిస్థాన్ పేపర్ మర్చంట్ అసోసియేషన్, పాకిస్థాన్ అసోసియేషన్ ఆఫ్ ప్రింటింగ్ గ్రాఫిక్ ఆర్ట్ ఇండస్ట్రీ, పేపర్ పరిశ్రమకు సంబంధించిన ఇతర సంస్థలు తెలిపాయి. పేపర్ ధర పెరగడం వల్ల ప్రచురణకర్తలు ధరను నిర్ణయించలేకుపోతున్నారని పాకిస్తాన్కి చెందిన స్థానికి మీడియా పేర్కొంది. అందువల్లే సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తుంక్వా వంటి పాఠ్యపుస్తకాల బోర్డులు ఇక ముద్రించలేమని స్పష్టం చేశాయి. దీంతో పాకిస్తాన్ కాలమిస్ట్ అయాజ్ అమీర్ దేశంలోని అసమర్థలైన పాలకుల పై విమర్శల వర్షం కురిపించారు. అంతేకాదు పాకిస్తాన్ గత రుణాలను చెల్లించేందుకు అప్పుల తీసుకునే విషవలయంలో చిక్కుకుపోయిందంటూ ఆవేదన చెందారు. ప్రస్తుతం ఏ దేశాలు పాకిస్తాన్కి రుణ సాయం చేయడానికి ఇష్టపడని దుస్థితలో ఉందని చెప్పారు. దీన్ని చైనా క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తుందన్నారు. ఆ దిశగానే రుణాలు, పెట్టుబడుల చెల్లింపుల విషయమై ఈ తరుణంలోనే పాకిస్తాన్తో గట్టి బేరం కుదుర్చుకుని పరిస్థితిని చక్కబెట్టుకునేందుకు యత్నిస్తోందన్నారు. ఈ మేరకు పాకిస్తాన్ 2021-22 ఆర్థిక సంవత్సారానికి గానూన సుమారు రూ. 30 వేల కోట్ల చైనా ట్రేడ్స్ ఫైనాన్స్ ఉపయోగించినందుకు సుమారు రూ. వెయ్యి కోట్లు పైనే వడ్డిని చెల్లించిందని నివేదిక పేర్కొంది. (చదవండి: యుద్ధం క్లైమాక్స్కి చేరుకుంటున్న వేళ...రష్యాకి ఊహించని ఝలక్!) -
AP: స్కూళ్ల ప్రారంభానికి ముందే ‘పుస్తకం’ సిద్ధం
సాక్షి, అమరావతి: గణగణ గంటలు మోగడమే ఆలస్యం.. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందచేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పాఠశాలల పునఃప్రారంభానికి నెల రోజుల ముందే విద్యార్ధులకు అందించాల్సిన పాఠ్యపుస్తకాలను సిద్ధంగా ఉంచడం గమనార్హం. స్కూళ్లు తెరిచిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి 3.38 కోట్ల పుస్తకాలను జగనన్న విద్యాకానుకతో సహా అందించనున్నారు. గత సర్కారు హయాంలో నవంబర్ – డిసెంబర్ వరకు కూడా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో అందించలేని దుస్థితి నెలకొనగా ఇప్పుడు స్కూళ్లు ప్రారంభం కావడమే ఆలస్యం అనే రీతిలో చర్యలు చేపట్టడం విద్యారంగంపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ నెలలోనే అమ్మ ఒడి పథకం కింద లబ్ధి చేకూర్చనుంది. ప్రభుత్వ పాఠశాలలకు పెరిగిన ఆదరణ అధికారంలోకి రాగానే విద్యారంగ సంస్కరణలు చేపట్టిన సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు ద్వారా స్కూళ్లలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను సమకూర్చడంతో లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల బాట పట్టారు. స్కూళ్లు తెరిచిన వెంటనే జగనన్న విద్యాకానుక ద్వారా విద్యార్ధులకు 3 జతల యూనిఫారం, బెల్టు, బూట్లు, సాక్సులు, బ్యాగుతో పాటు ఇంగ్లీషు డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్కుబుక్స్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారం లేకుండా సెమిస్టర్లవారీగా 1 నుంచి 10వ తరగతి వరకు 330 రకాల టైటిళ్ల పుస్తకాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, కన్నడ, తమిళం, ఒరియా మాధ్యమాలతో కూడిన ఈ పుస్తకాలను ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులకు అందచేస్తారు. గతంలో ఏడాది మొత్తానికి ఒకే ఒక పాఠ్య పుస్తకాన్ని ఇవ్వడం వల్ల పరిమాణం పెరిగి విద్యార్ధులు అధిక బరువులు మోయలేక అల్లాడేవారు. పైగా కొద్ది రోజులకే చిరిగిపోయేవి. ఈ పరిస్థితిని గమనించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 6వ తరగతినుంచి సెమిస్టర్ విధానానికి శ్రీకారం చుట్టింది. సెమిస్టర్ల వారీగా పుస్తకాలను అందించడం వల్ల మోత బరువు నుంచి విముక్తి లభించింది. ఈసారి మొదటి సెమిస్టర్ కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు 3,38,70,052 పాఠ్య పుస్తకాలను అందించనున్నారు. గుత్తాధిపత్యానికి తెర జూలై 4వతేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో విద్యాశాఖ ఇప్పటికే ముద్రణ ప్రక్రియ పూర్తి చేసి మండల కేంద్రాలకు సరఫరా చేపట్టింది. నెల రోజుల ముందే మండల కేంద్రాలకు 60 శాతానికి పైగా పుస్తకాలు చేరుకున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మిగతావి కూడా చేరనున్నాయి. గతంలో నేతలు, ప్రింటర్ల ఇష్టారాజ్యంగా ముద్రణ వ్యవహారాలు నడిచేవి. మే ఆఖరు వరకు కూడా పుస్తకాల ముద్రణ టెండర్లే ఖరారయ్యేవి కావు. ఇప్పుడు వాయువేగంతో అన్నీ పూర్తి చేసి స్కూళ్లు తెరవటానికి ముందే పుస్తకాలను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. గతంలో నలుగురైదుగురి గుత్తాధిపత్యంతో ముద్రణ జరగడం వల్ల చాలా జాప్యం జరిగేది. ఈసారి టెండర్లకు ముందుకు వచ్చిన 20 మంది ప్రింటర్లకు కూడా ముద్రణకు అవకాశమిచ్చారు. ప్రైవేట్ స్కూళ్లకూ ప్రభుత్వం నుంచే... ఈ విద్యాసంవత్సరం ప్రైవేట్ స్కూళ్లకు కూడా ప్రభుత్వమే పాఠ్యపుస్తకాల ముద్రణ చేపట్టి పంపిణీ చేస్తోంది. గతంలో ప్రైవేట్ పాఠశాలలకు ప్రైవేట్ ప్రింటర్లు సరఫరా చేయడం వల్ల తల్లిదండ్రులపై మోయలేని భారం పడేది. ప్రభుత్వ ధర కన్నా నాలుగైదు రెట్లు అధిక ధరలకు పుస్తకాలను విక్రయించి సొమ్ము చేసుకునేవారు. ఈ అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం ఈదఫా ఆ పాఠ్యపుస్తకాల ముద్రణ కూడా తానే ప్రైవేట్కు అప్పగించి స్కూళ్లకు నేరుగా పంపిణీ చేస్తోంది. మారుపేర్లతో మాయచేస్తూ.. 2007 వరకు ప్రభుత్వమే ప్రైవేట్ స్కూళ్లకు అందించే విధానం ఉండగా ఆ తరువాత ప్రైవేట్కే విడిచిపెట్టారు. ఫలితంగా ప్రింటర్లు తక్కువ ముద్రణ చూపిస్తూ ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొడుతూ వస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన కంటెంట్ను వేరే పబ్లిషర్లకు అందించి మారుపేర్లతో ముద్రణ చేపడుతూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఉదాహరణకు ఫస్ట్ క్లాస్ పాఠ్యపుస్తకాల సెట్ ప్రభుత్వ ధర రూ.280గా మాత్రమే ఉండగా స్కూళ్లలో ప్రైవేట్ ముద్రణ పేరుతో రూ.2 వేల వరకు గుంజేవారు. ఇప్పుడు ప్రభుత్వమే ప్రైవేట్ స్కూళ్లకూ పాఠ్యపుస్తకాలు అందించనున్నందున తల్లిదండ్రులపై అధిక భారం తప్పనుంది. ప్రైవేట్ స్కూళ్లకు అవసరమైన పుస్తకాలకు సంబంధించి విద్యాశాఖ ముందుగానే ఇండెంట్లు తీసుకుంది. మొత్తం 13,635 ప్రైవేట్ స్కూళ్లలో 24 లక్షల మంది విద్యార్ధులుండగా 12,721 స్కూళ్లు 18.02 లక్షల మందికి పుస్తకాల కోసం ఇండెంట్లు ఇచ్చాయి. వీరికి కావాల్సిన 1.36 కోట్ల పాఠ్యపుస్తకాలను కూడా ప్రభుత్వమే ముద్రణ చేపట్టి ఆయా స్కూళ్లకు అందించేలా ఏర్పాట్లు చేసింది. ద్విభాషా పాఠ్యపుస్తకాలు ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో విద్యార్ధులకు సౌకర్యంగా ఉండేందుకు పాఠ్యపుస్తకాలను బైలింగ్యువల్ (ద్విభాషా) విధానంలో మిర్రర్ ఇమేజ్తో ముద్రించి పంపిణీ చేయనున్నారు. ఒకపక్క తెలుగు, దానికి ఎదురు పేజీలో ఇంగ్లీషులో పాఠ్యాంశాలు ఉండటంతో విద్యార్ధులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇప్పటికే 6, 7 తరగతుల విద్యార్ధులకు ఈ సిలబస్తో పాఠ్యపుస్తకాలు అందించారు. ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతి విద్యార్ధులకు కూడా సీబీఎస్ఈ సిలబస్ పుస్తకాలు అందిస్తారు. రానున్న రెండేళ్లలో 10వ తరగతి వరకు అన్ని తరగతుల్లోనూ సీబీఎస్సీ సిలబస్ అమల్లోకి రానుంది. ప్రభుత్వ స్కూళ్లకు పాఠ్యపుస్తకాల పంపిణీ ఇలా.. జిల్లా ఇండెంట్ ఇప్పటివరకు ఇచ్చినవి శ్రీకాకుళం 2039753 748657 విజయనగరం 1691284 681190 విశాఖపట్నం 2745643 1267638 ప.గోదావరి 3670404 1626840 తూ.గోదావరి 2563960 1159599 కృష్ణా 2495376 1123140 గుంటూరు 3057027 1500467 ప్రకాశం 2471675 1269181 నెల్లూరు 2065629 821382 కడప 2001972 931523 కర్నూలు 3415546 1612591 అనంతపురం 2946820 1391097 చిత్తూరు 2704963 1266852 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం 33870052 15400157 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– నోట్: ఇవి కాకుండా ప్రస్తుతం 70 లక్షల పుస్తకాలను ప్రింటింగ్ ప్రెస్ల నుంచి గోడౌన్లకు తరలిస్తున్నారు. మొత్తం పుస్తకాల తరలింపు రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది. ద్విభాషా పాఠ్యపుస్తకాలు ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు పాఠ్యపుస్తకాలను బైలింగ్యువల్ (ద్విభాషా) విధానంలో మిర్రర్ ఇమేజ్తో ముద్రించి పంపిణీ చేయనున్నారు. ఒకపక్క తెలుగు, దానికి ఎదురు పేజీలో ఇంగ్లిష్లో పాఠ్యాంశాలు ఉండటంతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇప్పటికే 6, 7 తరగతుల విద్యార్థులకు ఈ సిలబస్తో పాఠ్యపుస్తకాలు అందించారు. ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతికి కూడా సీబీఎస్ఈ సిలబస్ పుస్తకాలు అందిస్తారు. రానున్న రెండేళ్లలో 10వ తరగతి వరకు అన్ని తరగతుల్లోనూ సీబీఎస్సీ సిలబస్ అమల్లోకి రానుంది. -
పాఠ్య పుస్తకాలకు తడ‘బడి’..
► వేసవి సెలవుల అనంతరం జూన్ 13 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ విద్యా సంవత్సరంలోనే 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎక్కువ సంఖ్యలో పాఠ్య పుస్తకాలను ముద్రించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియే పూర్తికాక పోవడంతో విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందే పరిస్థితి లేకుండా పోయింది. ► పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రక్రియ ఫిబ్రవరి, మార్చి నుంచే మొదలవ్వాల్సి ఉంది. సాధారణంగా ఏప్రిల్, మేలో పుస్తకాల ముద్రణ పూర్తయినా, విద్యార్థులకు జూలై వరకూ అందని పరిస్థితి ఉండేది. ఇప్పుడు పుస్తకాల ముద్రణ పెరగడంతో పాటు, ఇప్పటివరకు ముద్రణకు టెండర్లే ఖరారు కాకపోవడంతో స్కూళ్లు తెరిచినా కనీసం రెండు నెలల వరకు పుస్తకాల పంపిణీ జరిగే అవకాశం కన్పించడం లేదని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జూన్ 13 నుంచి మొదలయ్యే విద్యా సంవత్సరంలోనే 1 నుంచి 8 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించింది. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ ఈ దిశగా కార్యాచరణ కన్పించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందించే పరిస్థితి లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని గమనిస్తే స్కూళ్లు తెరిచినా, కనీసం రెండు నెలల వరకూ విద్యార్థి చేతికి పుస్తకం వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. రెండేళ్లుగా కరోనా వల్ల విద్యా సంస్థలు దాదాపుగా మూతపడ్డాయి. అరకొరగా నడిచినా పాఠశాల విద్యపై కరోనా తీవ్ర ప్రభావం చూపించిందని ప్రభుత్వ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ప్రస్తు తం తిరిగి గాడిలో పడుతున్న సమయంలో పాఠ్యపుస్తకాలు ఆలస్యం కానుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాల విద్య కమిషనర్ దీనిపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. రెండు భాషలతో పెరిగిన ముద్రణ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం తెలుగు, ఇంగ్లిష్ 2భాషల్లో (బై లింగ్వల్) పుస్తకాలను ముద్రించాలని నిర్ణయించింది. ఒక వైపు ఇంగ్లిష్, మరోవైపు తెలుగు భాషలో పాఠాలను ముద్రిస్తారు. దీంతో పుస్తకం బరువు దాదాపు రెట్టింపు కానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కో సబ్జెక్టును రెండు భాగాలుగా విభజించారు. సమ్మేటివ్ అసెస్మెంట్–1 (ఎస్ఏ–1) వరకు ఉన్న సిలబస్ను ఒక పుస్తకంలో, ఎస్ఏ–2లో ఉన్న సిలబస్తో మరో పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయించారు. దీంతో ఈసారి ఎక్కువ సంఖ్యలో పుస్తకాలు ప్రింట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 24 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా వీటిని అందజేస్తారు. ఉచితంగా అందించే పుస్తకాలను 2.10 కోట్ల వరకు, ప్రైవేటులో విక్రయానికి మరో 1.40 కోట్ల పుస్తకాలు ముద్రించాల్సి ఉంది. గతంలో ఉచితంగా అందించే పుస్తకాలకు రూ. 60 కోట్లు వెచ్చిస్తే... ఇప్పుడు రూ.120 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. ఖరారు కాని టెండర్లు ప్రభుత్వ ముద్రణాలయంలో యంత్రాలన్నీ చాలావరకు పాతబడి, ముద్రణకు అనుకూలంగా లేవని చెబుతున్నారు. ఫలితంగా ప్రైవేటు ముద్రణాలయాల్లో వీటిని ముద్రించాల్సి ఉంది. దీని కోసం ప్రత్యేకంగా కమిటీ ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చైర్మన్గా ఉండే ఈ కమిటీలో ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ, పరిశ్రమల శాఖ నుంచి ఓ అధికారి, ప్రభుత్వ ముద్రణాలయం ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. అయితే ఇప్పటివరకు ఈ కమిటీ సీనియస్గా భేటీ అయిన దాఖలాల్లేవు. కమిటీ భేటీ లేకుండానే టెండర్ల ప్రక్రియ చేపట్టారనే విమర్శలున్నాయి. పేపర్ అందించేందుకు తమిళనాడు పేపర్ మిల్స్, పంజాబ్కు చెందిన సాతియా పేపర్స్, చండీగఢ్కు చెందిన మరో సంస్థ టెండర్లు వేసింది. అయితే ఇప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తికాకపోవడం గమనార్హం. పుస్తకాలు ఆలస్యంగా వస్తే బోధనతో పాటు విద్యార్థులు చదువుకోవడమూ కష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూన్ నెలాఖరు లక్ష్యంగా పెట్టుకున్నాం పుస్తకాల ముద్రణకు సంబంధించిన టెండర్లు ఈ నెల 16న తెరుస్తాం. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎల్–1ను గుర్తించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తారు. ద్విభాష ముద్రణ కావడం వల్ల ఈసారి పుస్తకాల ముద్రణ ఎక్కువ సంఖ్యలో చేయాల్సి వస్తోంది. వీలైనంత త్వరగా పుస్తకాలు ముద్రించే ప్రయత్నం చేస్తున్నాం. స్కూళ్ళు తెరిచే సమయానికి కొన్ని పుస్తకాలు అందించడంతో పాటు అన్ని పుస్తకాలను జూన్ నెలాఖరులోగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – ఎస్ శ్రీనివాసచారి (డైరెక్టర్, ప్రభుత్వ పుస్తకాలు, స్కూల్ ఎడ్యుకేషన్) సకాలంలో పుస్తకాలు ఇవ్వాలి : చెరుకు ప్రద్యుమ్నకుమార్ (ప్రభుత్వ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్, కరీంనగర్) ఆంగ్ల భాషలో బోధన చేపడుతున్న నేపథ్యంలో ముందే విద్యార్థుల చేతికి పుస్తకాలు అందాలి. అప్పుడే వాళ్ళకు కొత్త విధానంపై కొంత అవగాహన ఏర్పడుతుంది. అదే విధంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేందుకు అవసరమైన ప్రిపరేషన్ చేసుకునే వీలుంటుంది. పుస్తకాలు ఆలస్యమైతే సిలబస్ పూర్తి కోసం బోధనను పరుగులు పెట్టించాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతి ఏటా ఆలస్యంతో ఇబ్బంది పాఠ్య పుస్తకాల ముద్రణ ఆలస్యం ప్రతి ఏటా ఇబ్బందిగా మారుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించాలి. విద్యార్థులకు ఇచ్చే పుస్తకాలను విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత తిరిగి తీసుకుని, లైబ్రరీలో భద్రపరిచి, కొత్త వారికి ఇవ్వాలి. దీనివల్ల ఆలస్యం సమస్య తలెత్తదు. ప్రభుత్వ ఖజానాపై భారమూ తగ్గుతుంది. – మామిడోజు వీరాచారి (లోకల్ కేడర్ ప్రభుత్వ టీచర్ల సంఘం అధ్యక్షుడు) -
తిరియాటి.. సదవాటి.. రాసాటి!
కేంజాతి (వినండి).. తిరియాటి (మాట్లాడండి).. సదవాటి (చదవండి).. రాసాటి (రాయండి).. లిపిలేని కోయ భాషలోని పదాలివి. ప్రాథమిక పాఠశాలల్లో చేరే గిరిజన విద్యార్థులకు మాతృభాషలో తప్ప తెలుగు, ఇతర భాషల్లో ఏ మాత్రం ప్రావీణ్యం ఉండదు. దీంతో వారికి విద్యాబోధన ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో గిరిజన గూడేల్లోని అడవి బిడ్డలకు వారి మాతృభాష ఆధారిత బహుళ భాషా విద్యాబోధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వశిక్షా అభియాన్ ద్వారా ఇకపై గిరిజన పాఠశాలల్లో కోయ భాషలోని పదాలను తెలుగు అక్షరాలతో రాసేలా బోధన చేస్తూ.. లిపి లేని ఆ భాషలకు ఊపిరి పోయాలని సంకల్పించింది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కొండకోనల్లో అంతరించిపోతున్న అరుదైన కోయ భాషలకు రాష్ట్ర ప్రభుత్వం ఊపిరిలూదుతోంది. లిపి కూడా లేని వివిధ కోయ భాషలకు తెలుగులోనే అక్షర రూపం ఇచ్చి.. గిరిపుత్రులకు విద్యాబుద్ధులు నేర్పే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సహజంగా గిరిజన తండాల్లో మూడొంతుల మంది గిరిజనులకు మాతృభాష తప్ప మరో భాష రాదు. ఈ కారణంగా వారు విద్యకు దూరమై సమాజంలో వెనుకబాటుకు గురవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చి, వారి జీవితాల్లో విద్యా సుగంధాలు నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గిరిజనులు మాతృభాషను కొనసాగిస్తూనే తెలుగు భాషను అభ్యసించేలా వినూత్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేలా కార్యక్రమాన్ని చేపట్టింది. 6 భాషలు.. 920 పాఠశాలల్లో అమలు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో 8 జిల్లాల్లోని 920 పాఠశాలల్లో ఆరు రకాల కోయ భాషల్లో అమలు చేయనున్నారు. ఈ విధానాన్ని ‘కోయ భారతి’ పేరిట ఉభయ గోదావరి జిల్లాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించారు. అయితే, గత పాలకులకు దీనిపై చిత్తశుద్ధి లేకపోవడంతో ఏడాది తిరగకుండానే ‘కోయ భారతి’ కార్యక్రమం అటకెక్కింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం గిరిజనులకు వారి మాతృభాషలో తెలుగును సులువైన విధానంలో అలవాటు చేసేందుకు ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలు రూపొందించింది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రారంభించింది. పాఠ్య పుస్తకాలు, మెటీరియల్ను గిరిజన భాషలోనే రూపొందించి పంపిణీ చేసింది. చింతూరు మండలం చట్టి పాఠశాలలో కోయ భాషలో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు ఉభయ గోదావరి జిల్లాల్లో (కోయ), శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో (సవర), విశాఖపట్నం జిల్లాలో (కొండ, కువి, ఆదివాసీ), కర్నూలు, అనంతపురం జిల్లాల్లో (సుగాలి) భాషలకు అనుగుణంగా ప్రత్యేక పాఠ్య పుస్తకాలను తీసుకొచ్చింది. సర్వశిక్షా అభియాన్ సూచనల మేరకు ఐటీడీఏల్లో ఆరు భాషలపై పట్టున్న నిపుణుల తోడ్పాటు తీసుకున్నారు. వారి ఆలోచనల మేరకు 1 నుంచి 3వ తరగతి వరకూ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలను సిద్ధం చేశారు. రూ.60 లక్షల వ్యయంతో పాఠ్యాంశాలు రూపొందించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 920 పాఠశాలల్లో 18,795 మంది గిరిజన విద్యార్థులకు తెలుగు, ఇతర సబ్జెక్టులను గిరిజన భాషలోనే బోధిస్తారు. ఇందుకోసం గిరిజన ఉపాధ్యాయులతో పాటు వారు లేనిచోట ఆ భాషపై కాస్తోకూస్తో పట్టున్న విద్యా వలంటీర్లను నియమించి, శిక్షణ ఇచ్చి నియామక పత్రాలు అందజేశారు. యవ్వ.. ఇయ్య భాషలోనే.. కోయ భాషలో అమ్మను యవ్వ అని.. నాన్నను ఇయ్య అంటారు. అన్నను దాదా.. అక్కను యక్క అంటారు. చెట్టును మరం అని.. ఈగను వీసి అని.. కోడి పుంజును గొగ్గోడు అని.. పిల్లిని వెరకాడు అని పిలుస్తారు. కూడికేకు (కూడిక), తీసివేతాకు (తీసివేత), బెచ్చోటి (ఎంత పరిమాణం), దోడ తిత్తినే (అన్నం తిన్నావా), బాత్ కుసిరి (ఏం కూర), దెమ్ము (పడుకో), ఏరు వాట (నీరు ఇవ్వు, పెట్టు), మీ పెదేరు బాత (నీ పేరు ఏమిటి) వంటి పదాలు ఇకపై గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఈ పదాలు వాడుకలోకి రానున్నాయి. ప్రాథమిక విద్యార్థులకు వారు మాట్లాడే మాతృ భాషలోనే బోధన చేయడం వల్ల వారిలో అభ్యసన స్థాయిని పెంచడంతోపాటు వారి భాష, సంస్కృతి, సంప్రదాయాలను చెక్కు చెదరకుండా కాపాడాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఇతర భాషలపై పట్టు సాధించేందుకే.. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధించడమనేది ఇతర భాషలపై పట్టు సాధించేందుకు ఎంతో దోహదపడుతుంది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలను రూపొందించారు. మాతృభాషలో బోధన వలన డ్రాపౌట్లు కూడా తగ్గుతాయి. – ఆకుల వెంకటరమణ, పీవో, ఐటీడీఏ, చింతూరు మాతృభాషా బోధన మంచి నిర్ణయం మాతృభాషలో బోధనకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక స్థాయిలో గిరిజన విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అక్షరం ముక్కలు రాక అన్ని రకాలుగా వెనుకబాటుకు గురవుతున్న గిరిజనులకు ఇది సువర్ణావకాశమనే చెప్పాలి. – ముర్రం దూలయ్య, ఉపాధ్యాయుడు, జీపీఎస్ పాఠశాల, చట్టి, చింతూరు మండలం కోయభాషలో బోధన ఎంతో అవసరం కొత్తగా పాఠశాలలకు వెళ్లే పిల్లలకు వాడుకలో ఉన్న కోయభాషలో బోధన ఎంతో అవసరం. ఇతర భాషలు నేర్చుకోవాలంటే వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. కోయభాషలో పాఠాలు చెబుతుంటే మా పిల్లలకు సులువుగా అర్థమవుతుంది. కోయభాషతో పాటు తెలుగులో కూడా చెబుతుండటం బాగుంది. – తుర్రం బాయమ్మ, గిరిజన విద్యార్థి తల్లి, చింతూరు -
పుస్తకాల్లేని చదువులు.. విద్యార్థుల చింత
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసలే టీవీ పాఠాలు. వాటిని వింటున్న విద్యార్థులు చాలా తక్కువ. అధికారుల లెక్కల ప్రకారం 9, 10 తరగతుల విద్యార్థులు కొంతమేరకు టీవీ పాఠాలను చూస్తున్నా.. ఎక్కువ మంది విద్యార్థులు చదువు లకు దూరమయ్యారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. తమ పిల్లలకు విద్యా బోధన ఎలా? అని ఆవేదన చెందుతున్నారు. టీవీ పాఠాలు పెద్దగా అర్థంకావడం లేదని, కనీసం పుస్తకాలున్నా కొంతవరకు వాటిని చదువుకొని ఉపాధ్యాయులను ఫోన్లలో అడిగి సందేహాలను నివృత్తి చేసుకునే వారమని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో టీచర్లు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నా.. అవి అత్యధిక మంది విద్యార్థులకు చేరడం లేదు. 8 జిల్లాల్లో అందని పాఠ్య పుస్తకాలు రాష్ట్రంలోని 8 జిల్లాల్లో విద్యార్థులకు ఇంతవరకు పాఠ్య పుస్తకాల పంపిణీనే ప్రారంభించలేదు. ఆదిలాబాద్, జోగుళాంబ, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్నగర్, ములుగు, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లా కేంద్రాలకు పాఠ్య పుస్తకాలు చేరినా వాటిని మండల స్థాయికి, పాఠశాలలకు పంపించి విద్యార్థులకు పంపిణీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. 12 జిల్లాల్లో 20 శాతంలోపే పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు ఇవ్వగా, ఆరు జిల్లాల్లో 20-50 శాతంలోపు పంపిణీ చేశారు. కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే ఎక్కువ మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందినట్లు అధికారులు తేల్చారు. విందామన్నా.. నెట్వర్క్తో ఇబ్బంది చాలా జిల్లాల్లో విద్యార్థులు టీవీ పాఠాలను వినేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. టీవీల్లో ఏయే సమయాల్లో ఆ పాఠాలను బోధిస్తారనే విషయంపై అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారు. టీచర్లు కొంత చొరవ తీసుకొని వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి పాఠాలు ప్రసారమయ్యే సమయం తెలియజేస్తున్నారు. దీంతో కొద్దిమంది వాటిని వింటున్నారు. మిగతా విద్యార్థుల్లో స్మార్ట్ ఫోన్లు కలిగిన కొందరు విద్యార్థులు టీశాట్ యాప్లను డౌన్లోడ్ చేసుకొని పాఠాలను విందామనుకుంటే నెట్వర్క్ సమస్యలతో వీడియో పాఠాలను వినలేకపోతున్నారు. పుస్తకాలు ఇవ్వలేదు మా పాప పదో తరగతి రామన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. ఆన్లైన్ తరగతులు ప్రారంభమై 12 రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు పుస్తకాలు రాలేదు. ఆన్లైన్ తరగతులు జరుగుతున్న నేపథ్యంలో ఏమైనా సందేహాలు చూసుకునేందుకు పుస్తకాలు లేవు. దీంతో ఇబ్బంది పడుతోంది. - సుభద్ర, విద్యార్థిని తల్లి, రామన్నపేట ఏమి అర్థం కావడం లేదు ఆన్లైన్ పాఠాలు జరుగుతున్నా పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఆన్లైన్లో పాఠాలు చూడటం తప్పæ పుస్తకంలో చదువుకునే వీలులేకుండా పోతోంది. సందేహం వస్తే పుస్తకాలు లేకపోవటంతో ఏమీ అర్థంకావడం లేదు. - రాకేశ్, 10వ తరగతి ,బాలుర ఉన్నత పాఠశాల, మంచిర్యాల పుస్తకాలు లేకుండా విద్య ఎలా? ఆన్లైన్లో బోధించేటప్పుడు విద్యార్థులకు పుస్తకాలు ముందు ఉండాలి. అర్థంకాని అంశాలను అందులో చూసి చదువుకుంటారు. పుస్తకాలు లేకుండా విద్యార్థులకు విద్యనందించడం సాధ్యం కాదు. పుస్తకాలు లేకుండా క్లాస్లు నిర్వహిస్తే ప్రయోజనం ఉండదు. అందరికీ పుస్తకాలు అందేలా చూడాలి. - తుకారం, టీచర్, రెబ్బెన, ఆసిఫాబాద్ జిల్లా -
పుస్తకాలన్నింట్లో క్యూఆర్ కోడ్.. స్కాన్ చేయండి పాఠాలు వినండి.
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యా బోధన ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో విద్యార్థులు ఇళ్ల వద్దే ఉండి డిజిటల్ పాఠాలు వినేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకున్న విద్యార్థులకు అందించే పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ను ముద్రించింది. విద్యార్థులు వాటిని మొబైల్ ఫోన్తో స్కాన్ చేస్తే ఆడి యో, వీడియో పాఠాలు వస్తాయి. గతంలో కొన్ని సబ్జెక్టులకు పైలట్ ప్రాజెక్టుగా ముద్రించిన క్యూ ఆర్ కోడ్ను ప్రభుత్వం ఈసారి అన్ని సబ్జెక్టుల పుస్తకాల్లో ముద్రించింది. దీంతో విద్యార్థులు మరింత మెరుగ్గా పాఠాలను అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. జిల్లా కేంద్రాల నుంచి పంపిణీ చేసేందుకు.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు మొత్తం 1.42 కోట్ల పాఠ్య పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 41 శాతం పుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరాయి. అక్కడి నుంచి వెంటవెంటనే మండల కేంద్రాలకు, పాఠశాలలకు పంపిణీ చేసేలా జిల్లాల్లో అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మిగతా పాఠ్య పుస్తకాలనూ ఈ నెలాఖరులోగా స్కూల్ పాయింట్కు చేరేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులతోపాటు గురుకులాల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా ఉచితంగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తోంది. వాటిలో ఆరు నుంచి నుంచి టెన్త్ వరకు చదువుకునే దాదాపు 14 లక్షల మంది విద్యార్థులకు క్యూఆర్ కోడ్ ముద్రించిన పుస్తకాలను ఇస్తారు. విద్యార్థులు స్మార్ట్ఫోన్లో ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినప్పుడు ఆ పాఠానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు, ఆడియోతో కూడిన వివరాలను పొందగలుగుతారు. లాక్డౌన్తో మిగిలిపోయిన సేల్ పుస్తకాలు రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ముద్రించిన సేల్ పుస్తకాలు భారీగా మిగిలిపోయాయి. 2020–21 విద్యా సంవత్సరంలో 35 లక్షల వరకు సేల్ పుస్తకాలను ముద్రించగా, అందులో 17 లక్షల పుస్తకాలను మాత్రమే విద్యార్థులు కొనుగోలు చేశారు. కరోనా కారణంగా ప్రత్యక్ష బోధన లేకపోవడంతో విద్యార్థులు పుస్తకాలను కొనుక్కోలేదు. దీంతో దాదాపు 18 లక్షల పుస్తకాలు మిగిలిపోయాయి. అయితే వాటిని 2021–22 విద్యా సంవత్సరంలో విక్రయించుకునేందుకు ప్రింటర్లు విద్యాశాఖ అనుమతి కోరారు. ఈ అంశంపై తాము నిర్ణయం తీసుకోలేమని, ప్రభుత్వానికి లేఖ రాశామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో బడులెన్ని..? పాఠశాలలు విద్యార్థులు ప్రభుత్వ 30,135 26,88,805 ప్రైవేట్ 10,763 32,37,448 మొత్తం 40,898 59,26,253 -
మరాఠా మనసు గెలిచిన తెలుగోడు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహారాష్ట్రలో మన తెలుగు రచయిత గంటేడ గౌరునాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన రాసిన గేయం మరాఠాల మనసులను హత్తుకుంది. తొమ్మిదో తరగతి తెలుగు వాచకంలో ఆయన రాసిన ‘పాడుదమా స్వేచ్ఛాగీతం’కు అక్కడి ప్రభుత్వం మొదటి పాఠ్యాంశంగా చోటు కల్పించింది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన గంటేడ గౌరునాయుడు గిరిజన ఆశ్రమ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. స్థానిక అంశాలకు యాస, భాషలను జోడించి వందలాది కవితలు, కథలు, గేయాలను రాశారు. తాను పనిచేస్తున్న పాఠశాల విద్యార్థులకు ఏటా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఆలపించేందుకు కొత్త పాటను పరిచయం చేయాలని సంకల్పించుకున్నారు. ఆ ప్రయత్నంలో ఆయన కలం నుంచి జాలువారిందే.. ‘పాడుదమా స్వేచ్ఛాగీతం.. ఎగరేయుదమా జాతిపతాకం’ అనే దేశభక్తి గేయం. ఈ గీతాన్ని ఆయన గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల కోసం 1990లో రచించారు. మూడు దశాబ్దాలుగా మార్మోగుతున్న గేయం స్వాతంత్రోద్యమ ఘటనలను, అందులోని సమరయోధులను గుర్తు చేస్తూ.. నాటి సన్నివేశాలు కళ్లముందు కదలాడుతున్నట్టుగా ఈ గేయాన్ని రాశారు. అప్పట్లో ఈ పాట విన్న అనంతపురం జిల్లా కలెక్టర్ లెనిన్బాబు అనే గాయకుడితో పాడించి రికార్డింగ్ చేయించారు. దీనికి ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి సూర్యనారాయణరావు వాద్య సహకారాన్ని అందించారు. అనంతరం జనవిజ్ఞానవేదిక, ప్రజానాట్యమండలి తదితర సంస్థలు, సంఘాలు ప్రారంభ గీతంగా దీన్ని వినియోగించుకున్నాయి. ఇలా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల్లో మూడు దశాబ్దాలుగా ఈ గేయం మార్మోగుతోంది. దేశం గొప్పతనం గురించి చెప్పే గేయం మా రాష్ట్రంలోని తెలుగు వాచకంలో మీరు రాసిన ‘పాడుదమా స్వేచ్ఛాగీతం’ అనే దేశభక్తి గేయం పాఠ్యాంశంగా చేర్పించాలనుకుంటున్నాం.. ఇందుకు మీ అనుమతి కావాలంటూ మహారాష్ట్ర తెలుగు విభాగం ప్రత్యేక అధికారి తులసి భరత్ భూషణ్ అడిగేసరికి ఎంతో సంతోషం కలిగింది. దేశం గొప్పతనం గురించి చెప్పే చాలా మాటలు, కథలు, గేయాలు వచ్చాయి. కానీ, గురజాడ మాటల్లో.. దేశమంటే మట్టికాదు మనుషులు. అందుకే నా రచనలో దేశం కోసం మనుషులు చేసిన వీరోచిత పోరాటాలను భావితరాలకు అందించాలనిపించింది. ఆ దిశగా ఎన్నో కవితలు, కథలు రాశాను. అందులో పాడుదమా స్వేచ్ఛాగీతం ఒకటి. –గంటేడ గౌరునాయుడు, గేయ రచయిత చదవండి: సీఎం జగన్ నన్ను బతికిస్తున్నాడమ్మా.. ‘వృథా’కు కట్టడి: మూడంచెల వ్యూహం -
ఇటు తెలుగు.. అటు ఇంగ్లిష్
సాక్షి, అమరావతి: విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు పలు సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇటు మాతృభాషతోపాటు అటు ఆంగ్లభాషలోనూ విద్యార్థులు రాణించేలా ప్రోత్సహిస్తూ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ మార్పు ప్రక్రియ సరళంగా జరిగేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి పాఠశాల విద్యలో ఎలిమెంటరీ స్థాయిలో ’మిర్రర్ ఇమేజ్ పాఠ్య పుస్తకాలు’ అందించేందుకు సిద్ధమైంది. రెండు మాధ్యమాల్లో పాఠ్యాంశాలు ఉండటం ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బోధన సులభం కానుంది. ఇప్పటికే మనబడి నాడు–నేడు ద్వారా సరికొత్తగా తీర్చిదిద్దిన పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు సిలబస్ను మార్చింది. విద్యార్థులకు సులభంగా ఉండేలా విద్యారంగ నిపుణులతో సరికొత్తగా పాఠ్యాంశాలను రూపొందించింది. ఈ పుస్తకాలను సరికొత్తగా మిర్రర్ ఇమేజ్ తరహాలో ఒక పేజీలో తెలుగు, ఎదుటి పేజీలో ఇంగ్లిష్లో పాఠ్యాంశాలుండేలా రూపొందించారు. ►రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ నిపుణుల సహకారంతో తెలుగు–ఇంగ్లిష్ భాషల్లో తొలిసారిగా రూపొందించిన మిర్రర్ ఇమేజ్ పాఠ్య పుస్తకాలను ఈ ఏడాది నుంచి విద్యార్థులకు అందించనున్నారు. ►ఒకటి నుంచి ఆరో తరగతి వరకు తెలుగు,ఇంగ్లీష్, గణితం సిలబస్లో మార్పులు చేశారు. ►ఈవీఎస్ (ఎన్విరాన్ మెంటల్ సైన్స్) ఇకపై 3వ తరగతి నుంచి ఉండేలా సిలబస్ రూపకల్పన. ►ఆరో తరగతిలో సోషల్, హిందీ పాఠ్యాంశాల్లో మార్పులు చేశారు. ►ఈఏడాది తొలిసారిగా ప్రభుత్వపాఠశాలల్లో చదివే విద్యార్థులకు వర్క్ బుక్స్ అందించనున్నారు. ►గతంలో కేవలం 25 మంది కవుల రచనలే ఉండగా ఈసారి అన్ని ప్రాంతాలు, మాండలికాలు, సంస్కృతులకు పెద్దపీట వేస్తూ 116 మందికిపైగా కవుల రచనలను పాఠ్యాంశాలుగా చేర్చారు. ►రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రాధమిక విద్యలో సెమిస్టర్ విద్యా విధానం అమలులోకి తెస్తున్నారు. పాఠ్యపుస్తకాలను కూడా సెమిస్టర్ల వారీగానే విద్యార్థులకు అందచేస్తారు. దీనివల్ల పుస్తకాల బరువు భారం చాలావరకు తగ్గుతుంది. ప్రాథమిక విద్య చరిత్రలోనే తొలిసారిగా.. ‘రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ పలువురు విద్యారంగ నిపుణులతో చర్చించి 1 నుంచి 6వ తరగతి వరకు పాఠ్యాంశాల్లో మార్పులు చేసింది. నూతన పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించి 116 మంది కవుల రచనల నుంచి అంశాలను చేర్చాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నత ఆలోచనలతో పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. తొలిసారిగా 1వ తరగతి నుంచి పిల్లలకు వర్క్ బుక్స్ను ప్రవేశపెట్టడంతోపాటు టీచర్స్ హ్యాండ్బుక్ కూడా ఇస్తున్నాం. ప్రాథమిక విద్య చరిత్రలోనే తొలిసారిగా సెమిస్టర్ విధానాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్నాం’ – డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి, రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ -
సిలబస్ నుంచి పౌరసత్వం, నోట్లరద్దు కట్
న్యూఢిల్లీ: కరోనా కారణంగా విద్యా సంవత్సరం తగ్గించాల్సి రావడంతో సిలబస్ను కూడా సీబీఎస్ఈ తగ్గించింది. దీనికోసం తొలగించిన అంశాల్లో లౌకికవాదం, పౌరసత్వం, జాతీయ వాదం, నోట్ల రద్దు వంటి అంశాలు. 9 నుంచి 12 తరగతుల వారికి దాదాపు 30 శాతం సిలబస్ ను తగ్గిస్తూ తాజా సిలబస్ను బుధవారం వెల్లడించింది. ఇందులో పదో తరగతిలో తొలగించిన వాటిలో ప్రజాస్వామ్యం– వైవిధ్యత, లింగం, కులమతాలు, ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు, సమస్యలు వంటి అంశాలు ఉన్నాయి. 11వ తరగతిలో సమాఖ్యవిధానం, పౌరసత్వం, జాతీయవాదం, భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు లౌకిక వాదం అనే అంశాలను తొలగించారు. 12వ తరగతిలో భారత్తో పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశాల సంబంధాలు, భారతదేశ ఆర్థిక అభివృద్ధి, భారత్ లో సామాజిక ఉద్యమాలు, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలను తొలగించారు. విద్యార్థులపై భారం పడకుండా ఉండేలా సిలబస్ను రూపొందించినట్లు హెచ్చార్డీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సిలబస్ నుంచి ఇంటర్నల్ పరీక్షల్లోగానీ, సంవత్సరాంతపు పరీక్షల్లోగానీ ప్రశ్నలు రావని సీబీఎస్ఈ తెలిపింది. ఈ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఒక్కసారి మాత్రమే.. 9 నుంచి 12 తరగతుల వరకూ తగ్గించిన సిలబస్ కేవలం ఒక్క విద్యా సంవత్సరానికి (2020–21) మాత్రమేనని సీబీఎస్ఈ సెక్రెటరీ అనురాగ్ తిపాఠి చెప్పారు. 190 సబ్జెక్టులకు సంబంధించి 30 శాతం సిలబస్ తగ్గించామని చెప్పారు. ఏఏ అంశాలను తొలగించారో స్పష్టంగా తెలిసేందుకు పాఠశాలలు ఎన్సీఈఆర్టీ రూపొందించిన క్యాలెండర్ను పాటించాలని సూచించారు. తొలగించిన అంశాలకు సంబంధించిన పాఠాలు సిలబస్లో ఎక్కడో ఒక చోట ఉండేలా చూసుకున్నామని చెప్పారు. -
పాఠ్యపుస్తకాలొచ్చేశాయ్!
నల్లగొండ : ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుతున్నాయి. ఇప్పటికే 90శాతానికిపైనే పుస్తకాలు వచ్చాయి. ప్రతి సంవత్సరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యేనాటికి పుస్తకాలు అందించాల్సి ఉంది. గత సంవత్సరం కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలు సగం పాఠశాలలు గడిచే వరకు కూడా రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈసారి అలా కాకుండా పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందించాలని నిర్ణయించి సరఫరా చేస్తోంది. జిల్లాలో ప్రభుత్వ, జిల్లాపరిషత్, గురుకులాలతో పాటు ఇతర ప్రభుత్వ యాజమాన్యాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందిస్తూ వస్తోంది. ఇప్పటికే ఆన్లైన్లో విద్యార్థి ఇన్ఫో అనే సైట్ ద్వారా పాఠ్యపుస్తకాల వివరాలను నమోదు చేస్తున్నారు. దీనికి తోడు ఆయా జిల్లా విద్యాశాఖాధికారులనుంచి విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎన్ని పుస్తకాలు అవసరమో నేరుగా ఉన్నతాధికారులు ఇండెంట్ తీసుకుంటున్నారు. వాటి ఆధారంగానే జిల్లాకు పుస్తకాలు పంపిస్తున్నారు. అవసరం 8లక్షలు.. జిల్లాకు 8లక్షల పాఠ్యపుస్తకాలు అవస రం అని ఇండెంట్ పంపారు. వాటి ఆ« దారంగానే నెల రోజులుగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివర కు 7.25 లక్షల పాఠ్యస్తకాలు జిల్లాకు చే రాయి. ఇంకా 75వేలు రావాల్సి ఉంది. మాడుగులపల్లి మినహా అన్ని మండలాలకు... జిల్లాకు వచ్చిన పాఠ్యపుస్తకాలన్నింటినీ జిల్లా విద్యాశాఖాధికారులు ఎప్పటికప్పుడు మండలాల వారీగా ఆయా ఇండెంట్ను బట్టి పంపిణీ చేశారు. జిల్లాలో 31 మండలాలు ఉండగా ఒక్క మాడుగులపల్లి మండలం మినహా మిగతా 30 మండలాలకు ఇప్పటికే పాఠ్యపుస్తకాలు చేర్చారు. మరో రెండు రోజుల్లో మిగిలిన పుస్తకాలు కూడా రానున్నాయి. వాటిని మాడుగులపల్లి మండలానికి పంపిస్తామని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. స్కూల్ పాయింట్లకు పాఠ్యపుస్తకాలు రాష్ట్ర విద్యాశాఖ నుంచి వచ్చిన పుస్తకాలను అధికారులు మండలాల వారీగా పంపిణీ చేశారు. అక్కడినుంచి మండల విద్యాధికారి వాటిని స్కూల్ పాయింట్లకు పంపిస్తున్నారు. పాఠశాలలు మొదట జూన్ 2 నుంచే ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే మండల పాయింట్లకు చేరిన పుస్తకాలు స్కూల్పాయింట్లకు చేరుతున్నాయి. ఎండ తీవ్రతతో జూన్ 12 నుంచి పాఠశాలలు తెరుస్తామని చెప్పడంతో పాఠ్యపుస్తకాల పంపిణీకి మరింత సమయం లభించింది. దీంతో అన్ని పాఠశాలలకు పునః ప్రారంభం లోపే పాఠ్యపుస్తకాలు అందనున్నాయి. కొన్ని సబ్జెక్టులు రావాల్సి ఉంది విద్యాశాఖ నుంచి పాఠ్యపుస్తకాలు ఇప్పటికే 90శాతం పై చిలుకు చేరాయి. వాటిల్లో 10వ తరగతి తెలుగు మీడియం సోషల్ టెక్టŠస్బుక్, 4వ తరగతి ఎన్విరాన్మెంట్ బుక్తో పాటు కొన్ని పుస్తకాలు రావాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వాటిని కూడా త్వరలోనే పంపిస్తారని చెబుతున్నారు. పక్కదారి పట్టకుండా చర్యలు పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టే అవకాశం లేదు. విద్యార్థుల ఆధారంగానే పాఠ్యపుస్తకాలు పంపిస్తున్నారు. గతంలో పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల కంటే 10శాతం ఇండెంట్ ఎక్కువ పెట్టేవారు.ఉన్నతాధికారులు వాటికి చెక్ పెట్టారు. ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికే పుస్తకాలు పంపిస్తున్నారు. దీనికి తోడు అచ్చయ్యే ప్రతి పుస్తకంపై ఒక క్రమసంఖ్యను ముద్రించడంతో పాటు ఫ్రీ అని ఎంబ్లమ్ కూడా ముద్రిస్తుండడంతో ఆ పుస్తకాలు బయట విక్రయిస్తే పట్టుకునే అవకాశం ఉంది. ఒకవేళ పుస్తకాలు బయట కనిపిస్తే ఆ బుక్ మీద ఉన్న నంబర్ ఆధారంగా అది ఏ జిల్లా బుక్కో తేలిపోనుంది. పాఠశాలల ప్రారంభానికి ముందే పుస్తకాలు పాఠశాలలు ప్రారంభం కాకముందే పాఠ్యపుస్తకాలు చేరుతాయి. ఇప్పటికే 8లక్షల పుస్తకాలు అవసరం ఉండగా, 7.25లక్షలు వచ్చాయి. మిగిలినవి కూడా రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – సరోజినీదేవి, డీఈఓ నల్లగొండ -
పాఠ్య పుస్తకాలొచ్చాయ్
పాపన్నపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రారంభమైంది. 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలలు తెరిచేనాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు మెదక్ పాఠ్యపుస్తక నిల్వ కేంద్రం నుంచి జిల్లాలోని పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీని ప్రారంభించినట్లు డిపో మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఫీజులు లేకుండా విద్య అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో పాతికేళ్ల నుంచి ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీని ప్రారంభించింది. జిల్లాలో మొత్తం 143 ఉన్నత, 132 ప్రాథమికోన్నత, 632 ప్రాథమిక, 7 మోడల్, 15 కేజీబీవీ పాఠశాలలున్నాయి. ఇందులో సుమారు 1.20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ 6,02,517 పాఠ్య పుస్తకాలు అవసరమవుతాయి. ఇప్పటికే మెదక్లోని పాఠ్యపుస్తక నిల్వ కేంద్రంలో 34,521 పుస్తకాలు నిల్వ ఉన్నాయి. ఇంకా 5,67,996 పుస్తకాలు అవసరముండగా శుక్రవారం నాటికి 4,49,480 పుస్తకాలు వచ్చాయి. మరో 1,18,516 పుస్తకాలు రావాల్సి ఉన్నాయి. 1 నుంచి 10వ తరగత వరకు విభిన్న మీడియంలలో కలసి 165 టైటిల్స్ అవసరం ఉండగా ఇప్పటి వరకు 117 టైటిల్స్ వచ్చాయి. మరో 48 రావాల్సి ఉంది. ఇప్పటికే హవేలిఘణపూర్, మెదక్, శంకరంపేట(ఏ), రేగోడ్ మండలాలకు పంపిణీ చేసినట్లు డిపో మేనేజర్ శ్రీకాంత్ వెల్లడించారు. ఆతర్వాత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వివిధ మండలాలకు సరఫరా చేస్తామన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా వాటిపై బార్కోడ్ ముద్రించినట్లు సమాచారం. పుస్తకాల పంపిణీ తర్వాత అక్విటెన్స్ కూడా పాఠశాలల వారీగా రికార్డు చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధిత హెచ్ఎంలదే పూర్తి బాధ్యత ఉంటుందని తెలిసింది. బడులు తెరిచే నాటికి పూర్తి జూన్1న పాఠశాలలు తెరిచేనాటికి పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి చేస్తాం. నిర్ణయించిన షెడ్యూల్కనుగుణంగా ఎంఈఓలు పాఠ్యపుస్తకాలు తీసుకెళ్లే చర్యలు చేపట్టాలి. ఇంకా కొన్ని టైటిల్స్, పుస్తకాలు రావాల్సి ఉంది. అవి రాగానే అన్ని పాఠశాలలకు పూర్తిస్థాయిలో అందజేస్తాం. –శ్రీకాంత్, గోదాం ఇన్చార్జి -
సరఫరా అరకొరే
కొవ్వూరు : ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల పట్ల సర్కారు నిర్లక్ష్య ధోరణిì ప్రదర్శిస్తోంది. పాఠశాలలు తెరిచి పక్షం రోజులయినా ఇంతవరకు యూనిఫాంలు పూర్తి స్థాయిలో అందించలేదు. దాదాపు సగం పాఠ్య పుస్తకాలు నేటికీ విద్యార్థులకు చేరలేదు. పాఠశాలలు తెరిచే సమయానికి యూనిఫాంలు, పుస్తకాలు అందిస్తామంటూ జిల్లా కలెక్టర్ భాస్కర్ ప్రకటనలు గుప్పించారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఇంతవరకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు పంపిణీ కాలేదు. జిల్లా వ్యాప్తంగా 3,257 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలున్నాయి. వీటికి 16,18,664 పాఠ్య పుస్తకాలు అందించాల్సి ఉండగా ఇంతవరకు ఐదు విడతల్లో కేవలం 10,88,415 పుస్తకాలు మాత్రమే ఆయా మండలాలకు పంపిణీ చేశారు. బుధవారం మూడు లారీల్లో 84,893 పుస్తకాలు వచ్చాయి. వీటిని ఆయా మండల కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. అక్కడి నుంచి ప్రభుత్వ పాఠశాలకు చేరడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. గత ఏడాది మిగిలినవి 1,54,010 పుస్తకాలు ఉన్నాయి. వీటన్నింటిని మినహాయిస్తే రావాల్సిన పాఠ్యపుస్తకాల్లో సుమారు సగం మాత్రమే పంపిణీ అయినట్లు స్పష్టమవుతోంది. మరో వైపు పాఠాలు ప్రారంభమైనా పుస్తకాలు అందకపోవడంతో చదువులో వెనుకబడి పోతా మని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇంగ్లీషు పుస్తకాలు అందాల్సి ఉంది అసలే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో కాస్త పరిజ్జానం తక్కువ. ఇప్పుడు ప్రధానంగా ఇంగ్లీషు మీడియం పుస్తకాలు ఎక్కువ శాతం సరఫరా కాలేదు. దీంతో విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. ఎనిమిదో తరగతికి తెలుగు, హిందీ, ఇంగ్లీషు బైలాజికల్ సైన్స్ పుస్తకాలు, ఏడో తరగతి వాళ్లకు ఇంగ్లీషు మీడియం సోషల్ స్టడీస్, ఆరో తరగతికి హిందీ రీడర్, ఇంగ్లీషు మీడియం జనరల్ సైన్స్, ఇంగ్లీషు రీడర్, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం లెక్కలు పుస్తకాలు రాలేదు. తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకుమాత్రం పూర్తిస్థాయిలో సరఫరా చేశారు. కుట్టుకూలీకి దిక్కులేదు జిల్లా వ్యాప్తంగా 48 మండలాలకు గాను ఇరవై మండలాల్లో విద్యార్థులకు క్లాత్ సరఫరా చేశారు. మరో ఇరవై ఎనిమిది మండలాల్లో చిన్నారులకు కుట్టించిన యూనిఫాంలు అందజేశారు. క్లాత్ ఇచ్చిన ఇరవై మండలాలకు ఇంత వరకు కుట్టుకూలీ సొమ్ములివ్వలేదు. ఈ భారం, బాధ్యత ఆయా ప్రధానోపాధ్యాయుల పైనే మోపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2,06,720 మంది, ఎయిడెడ్ పాఠశాలల్లో 15,185 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున యూనిఫాంలు ఉచితంగా అందించాల్సి ఉంది. ఇంత వరకు ఐదు విడతల్లో క్లాత్, కుట్టిన యూని ఫాంలు అందించామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో జత కుట్టడానికి ఆడ, మగపిల్లలు అయినా రూ.40 లు మాత్రమే కుట్టుకూలీ ధరగా నిర్ణయించారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల వరకు ఇదే కుట్టుకూలీ ధరగా నిర్ణయించారు. ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల విద్యార్థులకు అదనంగా చున్నీ ఇస్తారు. అయినా కుట్టుకూలీ ధర మాత్రం అందరికీ ఒక్కటే నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఇరవై మండలాల్లో యూనిఫాం కుట్టుకూలీ భారం ప్రధానోపాధ్యాయులపై పడుతుంది. దీంతో ఈ మండలాల్లో అరకొరగానే యూనిఫాంలు వేసుకుని విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారు. ఇంత వరకు ఈ సొమ్ములు రాలేదు. రెండు జతలు రూ.400లుగా నిర్ణయించారు. దీనిలో ఎనభై కుట్టుకూలీ మినహాయిస్తే రూ.320లు క్లాత్ ధరగా తేల్చారు. వాస్తవంగా మార్కెట్లో ఈ సొమ్ములు కుట్టుకూలీకే సరిపోతాయి. ఈ సంవత్సరం మాత్రం రెండు జతలు రూ.600లకు పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు సొమ్ములు మాత్రం విడుదల కాలేదు. కొలతలు సరాసరిన పెట్టి కుట్టించి ఇవ్వడంతో కొన్ని చోట్ల యూనిఫాంలు వదులుగా ఉండడం, చాలకపోవడం, బిగుతుగా ఉండడం వలన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. -
అరకొరే వచ్చాయ్!
సాక్షి, విశాఖపట్నం: వేసవి సెలవులు పూర్తయ్యాయి. పాఠశాలలు తెరచుకున్నాయి.అయినా పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో జిల్లాకు చేరలేదు. వచ్చిన అరకొర పుస్తకాల పంపిణీ పూర్తి కాలేదు. జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న వారు సుమారు 6.10 లక్షల మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ప్రాథమిక పాఠశాలల్లో 3.10 లక్షలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1.80 లక్షలు, ఉన్నత పాఠశాలల్లో 1.20 లక్షల మంది చదువుతున్నారు. ఒకటి నుంచి ఐదు తరగతుల వారికి తెలుగు, ఇంగ్లిష్, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టుల్లో బోధన ఉంటుంది. హైస్కూల్ పిల్లలకు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, గణితం, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం సబ్జెక్టులుంటాయి. ఇలా వీరందిరికీ సుమారు 19 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం. పాఠశాలలు తెరిచాక ఇప్పటివరకు సగం అంటే దాదాపు 10 లక్షల పాఠ్య పుస్తకాలు వచ్చాయి. వీటిని ఆయా స్కూళ్లకు ఎమ్మార్సీ కార్యాలయాల నుంచి పంపిణీ చేయిస్తున్నారు. ఇంకా మరో 9 లక్షల పుస్తకాలు రావాల్సి ఉంది. ఇవి మరో వారం రోజుల్లో రావచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పూర్వ విద్యార్థుల నుంచి గతేడాది పుస్తకాలను సేకరించి బుక్ బ్యాంక్ను ఏర్పాటు చేస్తున్నారు. కొత్తవి వచ్చే వరకు వీటితో విద్యాబోధన సాగిస్తున్నారు. ఎందుకీ ఆలస్యం! ఈ ఏడాది నుంచి విద్యాశాఖ పాఠ్య పుస్తకాలకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తోంది. ఈ పుస్తకాలపై క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ఉంటుంది. వీటిని స్కాన్ చేయడం ద్వారా డిజిటల్ లెస్సన్స్ను ఆండ్రాయిడ్ మొబైళ్లు, ట్యాబ్లు, కంప్యూటర్లలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిని విద్యార్థులు చదువుకోవడానికి వీలవుతుంది. ఇదంతా కొత్త విధానం కావడం వల్ల పుస్తకాల ముద్రణ, సరఫరా, పంపిణీ ఆలస్యమవుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. నెలాఖరుకల్లా రావచ్చు.. జిల్లాకు ఇప్పటిదాకా 10 లక్షల పాఠ్య పుస్తకాలు వచ్చాయి. వీటిని ఆయా పాఠశాలల్లో పంపిణీ చేయిస్తున్నాం. మరో 9 లక్షల పుస్తకాలు అవసరమవుతాయి. ఇవి ఈ నెలాఖరుకల్లా వస్తాయని భావిస్తున్నాం. అప్పటిదాకా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా బుక్ బ్యాంకులో ఉంచిన గతేడాది పుస్తకాలతో విద్యాబోధన సాగిస్తున్నాం.– బి.లింగేశ్వరరెడ్డి,జిల్లా విద్యాశాఖాధికారి -
పాఠ్య పుస్తకాలు ఎప్పుడిస్తారు?
పాతపట్నం: విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పాఠశాలలు ప్రారంభించి పది రోజులు గడుస్తున్నా ఇంత వరకు విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు సరఫరా చేయకపోవడమే ఇందుకు నిదర్శమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యాదర్శి, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వేసవి సెలవుల్లోనే పాఠ్యపుస్తకాలను అందజేయాల్సి ఉన్నా పాలకులు నిర్లక్ష్యం వహించారని దుయ్యబట్టారు. పుస్తకాలు అందజేయకపోతే పాఠాలు బోధిస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు టెలి కాన్ఫరెన్స్లు, సమావేశాలు ఏర్పాటు చేసి సమయాన్ని వృథా చేయడమే తప్ప ఇంత వరకు పుస్తకాలు, యూనిఫాం అందజేయలేదన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయని స్పష్టం చేశారు. -
తొలి పాఠమెలా?
తిరుపతి ఎడ్యుకేషన్: కొత్త విద్యాసంవత్సరం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఏటా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తోంది. ఈ ఏడాది తరగతి, మీడియంల వారీగా దాదాపుగా 21.46లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయి. తిరుపతిలోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విక్రయ కార్యాలయం, ఎమ్మార్సీ కేంద్రాల్లో గత ఏడాది మిగిలిన పుస్తకాలు 3.74లక్షలు. ఇవికాకుండా మరో 17.71లక్షలు అవసరమవుతాయి. కానీ ఇప్పటివరకు 3.27లక్షల పుస్తకాలు మాత్రమే చేరాయి. ఇంకా 14.44లక్షలు సరఫరా కావాల్సి ఉంది. గతేడాది కంటే పరిస్థితి దారుణంగా ఉంది. ఇదే సమయానికి గత ఏడాది 9.68లక్షలు సరఫరా అయ్యాయి. పాఠ్యపుస్తకాల సరఫరా ఇలా... వేసవి సెలవులకు ముందే తరగతి, మీడియంల వారీగా ఎన్ని పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయోజిల్లా విద్యాశాఖ లెక్కలేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తుంది. పాఠ్యపుస్తకాల ముద్రణకు ప్రభుత్వం టెండర్ పిలిచి ప్రింటింగ్ ప్రెస్కు కేటాయిస్తుంది. ముద్రణ పూర్తయిన పాఠ్యపుస్తకాలను జి ల్లాలోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విక్రయ కార్యాలయానికి విడతల వారీగా సరఫరా చేస్తుంది. వీ టిని జిల్లాలోని 66 మండలాల్లో ఉన్న మండల వ నరుల కేంద్రాలకు తరలించి, అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేస్తారు. ఇవన్నీ పాఠశాలల పునః ప్రారంభం(జూన్ 12వ తేదీ)లోపు పూర్తి స్థాయిలో సరఫరా చేయాలి. ఇది ఏటా జరిగే ప్రక్రియ. నివేదికలో ఆలస్యం.. పాఠ్యపుస్తకాల అవసరంపై రాష్ట్ర విద్యాశాఖకు జిల్లా అధికారులు నివేదిక పంపిస్తారు. పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య తదితర విషయాలు ఆన్లైన్లో పొందుపరచడంతో ఈ ఏడాది జిల్లాకు ఎన్ని పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయో రాష్ట్ర విద్యాశాఖే నిర్ణయించింది. మండలాల వారీగా పాఠ్యపుస్తకాల సంఖ్యను పంపించింది. దీనిని సరిచూసి జిల్లా విద్యాశాఖకు నివేదిక పంపించా ల్సిన బాధ్యత మండల విద్యాశాఖాధికారులది. అయితే ఈ నివేదిక పంపించడంలో జాప్యం అయినట్లు సమాచారం. దీనికితోడు పాఠ్యపుస్తకాల్లో క్యూఆర్ కోడ్ను ముద్రించనున్న నేపథ్యంలో ఆలస్యం అయినట్లు తెలిసింది. సకాలంలో సిలబస్ సందేహమే... 21లక్షల పాఠ్యపుస్తకాల్లో ఇప్పటివరకు కేవలం 3లక్షల పాఠ్యపుస్తకాలే సరఫరా అయ్యాయి. పూర్తి స్థాయిలో సరఫరా కావడానికి దాదాపుగా మరో 15రోజుల సమయం పట్టనుంది. విద్యాసంవత్సర క్యాలెండర్ ప్రకారం సిలబస్ కష్టమని ఉపాధ్యాయులంటున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించలేకపోయిన సబ్జెక్టు ఉపాధ్యాయులకు అక్షింతలు తప్పవు. సకాలంలో పాఠ్యపుస్తకాలు అందజేస్తే, డిసెంబరు కల్లా సిలబస్ పూర్తి చేసి రివిజన్ ప్రారంభించవచ్చు. వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి కనీస మార్కులతో పాసయ్యేలా చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలకు ఉపాధ్యాయులు బలికావాల్సి వస్తోందని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. మరో పది రోజుల్లో ఇస్తాం నాలుగు రోజుల నుంచి పాఠ్యపుస్తకాలు సరఫరా అవుతున్నాయి. ఇప్పటికి 3.27లక్షలు పాఠ్యపుస్తకాలు వచ్చాయి. గత ఏడాది మిగిలిన 2.57లక్షల పాఠ్యపుస్తకాలు మా వద్ద ఉన్నాయి. వీటిని మండలాల వారీగా పంపించనున్నాం. సోమవారం కేవీబీ.పురం, తొట్టంబేడు మండలాలకు సరఫరా చేశాం. మరో పది రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని మండలాలకు పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తాం. –ఎం.వెంకటేశ్వరరావు, మేనేజర్,ప్రభుత్వ పాఠ్యపుస్తకాలవిక్రయ కార్యాలయం, తిరుపతి -
జూనియర్ కళాశాలల్లో సమస్యలు తీరేనా..?
కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ విద్యకు ఆదరణ కరువవుతోంది. జిల్లాలో పలు జూనియర్ కళాశాలల్లో సమస్యలు తిష్ట వేసి ఉన్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక దృష్టి సారించి, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. అలాగే కేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఇంటర్ కళాశాలల్లో కనీస వసతులు సమకూరలేదనే విమర్శలున్నాయి. కళాశాలల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టడంలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఇంటర్ విద్యకు రోజురోజుకు ఆదరణ కరువవుతోంది. కళాశాలకు కావల్సిన కనీస వసతుల కల్పన, పూర్తిస్థాయిలో అధ్యాపకుల నియామకంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వ కళాశాలలపై ప్రభుత్వం చిన్నచూపు చూడడంతో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంటర్ చదివించాలంటే తల్లిదండ్రులు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇందుకు వేలాది రూపాయలు వెచ్చించాల్సి ఉంది. కళాశాలలు పున:ప్రారంభమైనా.. కళాశాలలు పున:ప్రారంభమైనా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు లేవు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి విద్యార్థుల చేతిలో పుస్తకాలు ఉండాలి.. కాని అది అమలు కావడం లేదు. జిల్లాలో 26 ప్రభుత్వ, 20 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 12 వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 77 వేలకు పైగా పుస్తకాలు అవసరం. సంబం«ధిత పుస్తకాలు త్వరలో జిల్లాకు రానున్నాయి. తరగతులు ప్రారంభం.. జూన్ 1 నుంచి జూనియర్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. ద్వితీయ సంవత్సరానికి తరగతులు మొదలయ్యాయి. ప్రథమ సంవత్సవానికి అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆర్ట్స్, సైన్సు గ్రూపు విద్యార్థులకు ప్రభుత్వమే పాఠ్య పుస్తకాలను ఉచితంగా ఇస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ప్రతి విద్యార్థికి పుస్తకాలు అందించాల్సి ఉన్నప్పటకీ ఇంతవరకూ ఈ ప్రక్రియ ఓ కొలిక్కిరాకపోవడంతో విమర్శలకు తావిస్తోంది. వేధిస్తున్న సొంత భవనాల కొరత.. జిల్లాలో 26 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా ఇందులో 21 వాటికి సొంత భవనాలు ఉన్నాయి. మిగతా 5 వాటికి సొంత భవనాల్లేవు. హైస్కూల్స్లో షిఫ్ట్ పద్ధతిన కళాశాలలను నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు ఉర్దూ, మైదుకూరు ఉర్దూ, రాజంపేట ఉర్దూ, నందలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనాల్లేవు. ఈ పరిస్థితుల్లో ఆయా కళాశాలల విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కనీస వసతులు కరువు.. సొంత భవనాల్లేని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కనీస వసతులు కూడా కరువు. కనీసం మంచినీరు. మరుగుదొడ్లు కూడా లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి సొంత భవనాలను ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదేనా ప్రైవేటుకు దీటంటే.. ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యాబోధన జరుగుతోంది. కొన్ని విద్యా సంస్థలు వేసవి సెలవుల్లోనే తరగతులను నిర్వహించాయి. కానీ ప్రభుత్వ కళాశాలల్లో సకాలంలో పాఠ్యపుస్తకాలు అందని పరిస్థితి. ప్రైవేటుకు దీటుగా రాణించాలంటే సకాలంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉందని విద్యావేత్తలు, మేధావులు చెబుతున్నారు. 15 రోజుల్లో పాఠ్య పుస్తకాలు.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు పదిహేను రోజుల్లో పాఠ్య పుస్తకాలు అం దజేస్తాం. విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాల జాబితాను ప్రభుత్వానికి పంపాం. త్వరలో వస్తాయి. అలాగే సొంత భవనాల గురించి కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపాం. సమస్యను త్వరలో పరిష్కరిస్తాం. – చంద్రమౌళి, జిల్లా వృత్తివిద్యాధికారి. ఇంటర్మీడియట్ -
పుస్తకం.. ఆలస్యం!
‘పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజే పిల్లలు పాఠ్యప్తుకాలతో బడికి రావాలి.. ఆ మేరకు పుస్తకాల పంపిణీ చేపట్టండి’ ఏటా విద్యాశాఖకు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు ఇవీ. కానీ అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. పుస్తకాలు మాత్రం పుణ్యకాలం గడిచిపోయాక విద్యార్థి చేతికందుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 17 రోజుల్లో పాఠశాలల తలుపులు తెరుచుకోనుండగా.. ఇంతవరకూ ఒక్క పుస్తకమూ జిల్లాకు చేరలేదు. అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాలలు మరో 17 రోజుల్లో పునఃప్రారంభం కానున్నాయి. కానీ ఇప్పటిదాకా జిల్లాకు ఒక్కటంటే ఒక్క పుస్తకమూ చేరలేదు. ముద్రణ కూడా ఇంకా పూర్తి కాలేదు. ముద్రణ పూర్తయి అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి చేరి ఇక్కడి నుంచి మండలాలకు అక్కడి నుంచి పాఠశాలలకు చేర్చి విద్యార్థుల చేతికి అందేలోపు పుణ్యకాలం కాస్తా పూర్తవుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఏడాది ముచ్చటే : బడులు తెరిచిన తర్వాత ఓవైపు సిలబస్ జరుగుతుండడం, మరోవైపు పాఠ్యపుస్తకాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. అయితే మూడేళ్ల కిందట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజే ప్రభుత్వ పాఠశాలలవిద్యార్థుల చేతుల్లో పాఠ్యపుస్తకాలు ఉండాలనే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా జిల్లా చరిత్రలో తొలిసారిగా ఆ ఏడాది పాఠ్యపుస్తకాలు పాఠశాలలు ప్రారంభం నాటికే వచ్చేశాయి. అయితే ఇది కేవలం ఆ ఏడాదికి మాత్రమే పరిమితమైంది. తర్వాత ఏడాది నుంచి షరా మూమాలే. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తెలుగు, కన్నడ, ఉర్దూ మీడియం 1–10 తరగతుల విద్యార్థులకు సుమారు 23,80,250 పాఠ్యపుస్తకాలు అవసరం. మిగులుస్టాకు 2,74,621 పుస్తకాలు ఉన్నాయి. ఇవిపోను 21,05,629 పుస్తకాలు అవసరం. ముద్రణా సంస్థ నుంచి ఇప్పటిదాకా ఒక్క పుస్తకమూ రాలేదు. ఆన్లైన్ కష్టాలు ఈ సంవత్సరం ఇండెంట్ వివరాలను ఆన్లైన్లో పంపాలని రాష్ట్ర అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో గతేడాది ముద్రణ సంస్థ నుంచి జిల్లా కేంద్రానికి చేరిన పుస్తకాల వివరాలను జిల్లా అధికారులు ఆన్లైన్లో పొందుపరిచారు. అలాగే జిల్లానుంచి ఆయా మండలాలకు పంపిన పాఠ్య పుస్తకాల వివరాలు, మండలాల నుంచి ఆయా పాఠశాలలకు సరఫరా చేసిన పుస్తకాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. అయినా కూడా రాష్ట్ర అధికారులు ఒక నిర్ణయానికి రాలేదు. తాజాగా మరోసారి ఎంఈఓల నుంచి ఇండెంట్ కోరారు. దీన్నిబట్టి చూస్తుంటే ఈ సంవత్సరం ఎన్ని పుస్తకాలు అవసరమవుతాయన్న దానిపై ప్రభుత్వానికి ఇంకా స్పష్టత లేదని తెలుస్తోంది. గడువు ముంచుకొస్తుండడంతో యూడైస్ లెక్కల ఆధారంగా విద్యార్థుల నంఖ్యను తీసుకుని ఆ ప్రకారం విడతల వారీగా పుస్తరాలు ముద్రించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో తొలివిడతగా ముద్రించిన పుస్తకాలను త్వరలోనే జిల్లాకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. విద్యార్థి చేతికి అందేదెప్పుడో పుస్తకాలు ముద్రణ సంస్థ నుంచి నేరుగా జిల్లా కేంద్రంలోని గోడౌన్కు చేరుతాయి. అక్కడి నుంచి మండల పాయింట్లకు పంపుతారు. మండల పాయింట్ల నుంచి స్కూళ్లకు పంపి విద్యార్థులకు పంపిణీ చేస్తారు. ఈ తతంగం పూర్తి కావాలంటే కనీసం రెండునెలలకు పైగా సమయం అవుతుంది. అప్పటిదాకా విద్యార్థులు బడులకు వెళ్లి ఏమి చదువుకుంటారో, ఉపాధ్యాయులు వారికి ఎలా పాఠాలు చెబుతారో అధికారులకే తెలియాలి. -
తొలిరోజే విద్యార్థులకు పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్ : బడి తెరిచిన మొదటిరోజే విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. జూన్ ఒకటో తేదీన పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని, ఆ రోజుకల్లా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఎనిమిదో తరగతి వరకే యూనిఫాం పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని, ఈ ఏడాది నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు కూడా యూనిఫాం ఇస్తామని స్పష్టం చేశారు. పాఠశాలల పున:ప్రారంభం నేపథ్యంలో శుక్రవారం కడియం శ్రీహరి ఎస్ఎస్ఏ భవన్లో జిల్లా విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కొత్త విద్యాసంవత్సరాన్ని విజయవంతంగా నడిపించాలని, జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఉన్నందున వేసవి సెలవులను ముందుకు జరిపామని పేర్కొన్నారు. దీంతో ఈ ఉత్సవాల్లో పాఠశాల విద్యార్థులు పాల్గొనే అవకాశముంటుందని చెప్పారు. 8 లక్షల మంది విద్యార్థినులకు ‘కిట్స్’ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారి 85 కోట్ల రూపాయల ఖర్చుతో ఎనిమిది లక్షల మంది విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందిస్తున్నట్లు కడియం శ్రీహరి చెప్పారు. జెడ్పీ స్కూళ్లు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థినులందరికీ ఈ కిట్లు అందిస్తామన్నారు. ఈ కిట్లలో విద్యార్థినులకు అవసరమైన కాస్మొటిక్ వస్తువులు ఉంటాయని, అవన్నీ బ్రాండెడ్ వస్తువులేనని చెప్పారు. ఒక్కో కిట్ ధర రూ.400 వరకు ఉంటుందని, ప్రతి కిట్లో మూడు నెలలకు సరిపోయేలా వస్తువులుంటాయన్నారు. ఏటా నాలుగుసార్లు ఈ కిట్లు సరఫరా చేస్తామన్నారు. కిట్ల పంపిణీలో స్థానిక నేతలను కూడా భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. జూలైలో అన్ని పాఠశాలల్లో హరితహారం జూలైలో అన్ని పాఠశాలల్లో పెద్ద ఎత్తున హరితహారం నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఈసారి విద్యా వాలంటీర్ల అవసరం లేకుండా కొత్త ఉపాధ్యాయులతో పాఠశాలలు నిర్వహిద్దామని అనుకున్నామని.. కానీ కోర్టు కేసుల వల్ల మళ్లీ వాలంటీర్లను నియమించుకోవల్సి వస్తోందని వివరించారు. ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. విద్యా సంవత్సరం అకడమిక్ కేలండర్పై జూన్ మొదటి వారంలో వర్క్షాప్ నిర్వహిస్తామన్నారు. ఈ వర్క్షాప్లో సీసీఈ (నిరంతర సమగ్ర మూల్యాంకనం)పై కూడా సమీక్ష చేస్తామని, ఇందులో వచ్చిన ప్రతిపాదనలను అమలు చేస్తామన్నారు. -
గుణ పాఠం నేర్వరా..!
కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుడు బోధన చేయాలన్నా... విద్యార్థి పాఠం నేర్చుకోవాలన్నా పాఠ్యపుస్తకం తప్పనిసరి. అలాంటి పాఠ్యపుస్తకం విద్యార్థికి చేరడంలో ఏటా జాప్యం జరుగుతూనే ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభం రోజుకు విద్యార్థులందరికి ఉచిత పాఠ్యపుస్తకాలతోపాటు యూనిఫాం అందజేస్తామంటూ అటు పాలకులు ఇటు అధికారులు చెబుతున్న మాటలు ప్రతి ఏటా నీటి మీద రాతలుగా మిగులుతున్నాయి. గతేడాది కూడా పుస్తకాలు, యూనిఫాం పంపిణీలో జాప్యం చోటు చేసుకుంది. పాఠ్యపుస్తకాలైతే విద్యా సంవత్సరం ప్రారంభమైన రెండు నెలల తరువాత కూడా కొన్ని టైటిల్స్ను ఇచ్చారు. మరి కొన్నింటిని ఇవ్వకుండానేవదిలేశారు. ఇక యూనిఫాం గురించి చెప్పనవసరం లేదు. ఎందుకుంటే పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చే నెలరోజుల వ్యవధిలో కూడా కొన్ని పాఠశాలలకు అందించారు. ఇక ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సకాలంలో అందే పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పటి వరకు డిపోకు పుస్తకాలే రాలేదు. మారని ప్రభుత్వ తీరు విద్యా సంవత్సరం ముగిసే సమయానికే పాఠ్యపుస్తకాలు సరఫరా చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అయినా పాఠ్యపుస్తకాల సరఫరాలో ఏటా జాప్యం జరుగుతూనే ఉంది. ప్రతి ఏటా పాఠ్యపుస్తకాల సరఫరా ప్రహసనంగా మారుతోందనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా చాలా మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుండటంతో అవి మూతపడే దిశగా అడుగులేస్తున్నాయి. ఇంకా జిల్లాకు చేరుకోని నూతన పాఠ్యపుస్తకాలు 2017–18 విద్యా సంవత్సరం ఏప్రిల్ 23తో ముగిసింది. ఈ ఏడాది జూన్ 12వ తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఏప్రిల్ నెలాఖరుకు జిల్లాకు అవసరమైన పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేస్తేనే పాఠశాలలు పునః ప్రారంభించే నాటికి అవి విద్యార్థుల చేతిలో ఉంటాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు జిల్లా పుస్తక గోదాముకు చేరుకోలేదు. 13.50 లక్షలు అవసరం జిల్లాలో 2470 ప్రాథమిక, 262 ప్రాథమికోన్నత, 307 ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ప్రతి ఏటా ఉచిత పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. జిల్లాలోని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ సుమారు 1,72,377 మంది విద్యార్థులకు ఈ ఏడాది 13,50,000 పుస్తకాలు అవసరమని విద్యాశాఖ గుర్తించింది. నూతన పాఠ్య పుస్తకాలు ఇప్పటి వరకు డిపోకు చేరుకోలేదని మేనేజర్ పెంచలమ్మ తెలిపారు. టెండర్ పూర్తి పాఠ్యపుస్తకాలను కడప బుక్ డిపో నుంచి జిల్లాలోని అన్ని మండలాలకు తరలించేందుకు విద్యాశాఖ టెండర్ను పూర్తి చేసింది. సంబంధిత పాఠ్యపుస్తకాలను తరలించే టెండర్ను ఈ ఏడాది గతానికి భిన్నంగా ఆర్టీసీ వారు రూ. 6,07,500 టెండర్ను దక్కించుకున్నారు. పాఠ్యపుస్తకాలు గోడౌన్కు రాగానే సంబంధిత పుస్తకాల తరలింపును ప్రారంభిస్తారు. -
ఈసారీ ఆలస్యమే
విద్యాసంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయం ప్రభుత్వానికి తెలుసు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పాఠ్యపుస్తకాలు ఇవ్వాలనీ తెలుసు. అయినా పాఠ్యపుస్తకాల పంపిణీ చేయడంలో ఏటా సర్కారు విఫలమవుతోంది. ఇది విద్యార్థులకు శాపంగా మారుతోంది. సర్కారు పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీకి ఏటారూ.కోట్లు వెచ్చిస్తున్నా, వాటిని సకాలంలో అందుబాటులోకితీసుకురావడం లేదు. ఈ ఏడాది అదే పరిస్థితినెలకొననున్నదన్న విసయం స్పష్టమవుతోంది. సాక్షి, తిరుపతి:ప్రైవేటు పాఠశాలల కంటే ఒకడుగు ముందుగా ఉండాల్సిన సర్కారు బడులు వెనకడుగు వేస్తున్నాయి. ఓ వైపు ప్రైవేటు పాఠశాలలు సెలవుల్లోనూ గప్చిప్గా తరగతులు నిర్వహిస్తున్నారు. అందుకు తగ్గట్టు వారు ముందే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించారు. అయితే సర్కారు మాత్రం పాఠాలు నేర్వలేకపోతోంది. మరో నెల రోజుల్లో బడులు తెరవనున్నా... ఇంత వరకు పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభమే కాలేదు. అందుకు అవసరమైన ఇండెంట్ కూడా క్షేత్రస్థాయి నుంచి విద్యాశాఖకు అందలేదని విశ్వసనీయ సమాచారం. దీంతో ఈ సారి పాఠ్యపుస్తకాలు సమయానికి అందే అవకాశాలు లేవని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండెంట్పై స్పష్టత లేదు జిల్లాలోని ప్రతి పాఠశాలల నుంచి ఎన్ని పాఠ్యపుస్తకాలు అవసరమనే వివరాలను మండల విద్యాశాఖ అధికారులు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ మార్చి నెలలోనే పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియకు స్వస్తి పలికినట్లు ప్రచారం జరుగుతోంది. అలా సేకరించిన వివరాలను మండలాల నుంచి జిల్లాలకు, అక్కడ నుంచి రాష్ట్రా ఉన్నతాధికారులకు పుస్తకాల ఇండెంట్ పంపాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయి నుంచి పాఠ్యపుస్తకాల ఇండెంట్ విద్యాశాఖ సేకరించలేదని తెలిసింది. కేవలం డైట్ లెక్కల ప్రకారమే పాఠ్యపుస్తకాలను ముద్రించటానికి విద్యాశాఖ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గత ఏడాది ముద్రించిన పాఠ్యపుస్తకాల్లో 2.50 లక్షలు మిగులు ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చెబుతున్న మాట. మిగులు పోను 19.50 లక్షల పాఠ్యపుస్తకాలు ముద్రించి పంపుతామని జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే జిల్లా అధికారులు మాత్రం తమ వద్ద మిగులు పుస్తకాలు లేవని చెబుతున్నారు. అయితే రాష్ట్ర, జిల్లా అధికారుల మధ్య ఈ లెక్కలు తేలాల్సి ఉంది. ముద్రణ ఎప్పుడు..పుస్తకాలు చేరేదెప్పుడు? గత ఏడాది ఏప్రిల్లోనే పుస్తకాల ముద్రణ పూర్తి చేశారు. ఆ పుస్తకాలు జిల్లాకు చేరి, అక్కడి నుంచి మండలాలకు, గ్రామాలకు చేరటానికే ఆలస్యమైంది. గత ఏడాది పాఠశాలలు పునఃప్రాంభమైనా సమయానికి పుస్తకాలు అందించలేకపోయా రు. అయితే ఈ ఏడు ఇంకా పుస్తకాల ముద్రణే ప్రారంభం కాలేదంటే... పరిస్థితి అర్థం చేసుకోవ చ్చు. వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభమైలే... జూలైలో కాని పుస్తకాలు అందే అవకాశాలు లేవని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారంలో టెండర్లు పిలుస్తాం పాఠ్యపుస్తకాల పంపిణీకి సంబంధించి మరో వారం రోజుల్లో టెండర్లు పిలుస్తాం. డైట్ లెక్కల ప్రకారమే పాఠ్యపుస్తకాల ముద్రణ జరుగుతుంది. పాఠ్యపుస్తకాలు ముద్రిస్తున్నారా? లేదా? అనే విషయంపై మా వద్ద స్పష్టమైన సమాచారం లేదు. – పాండురంగ స్వామి -
నేటినుంచి మండలాలకు పాఠ్యపుస్తకాలు
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే ఉచిత పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు ఆదివారం నుంచి మూడో విడత సరఫరా చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు అందుబాటులో ఉండి పుస్తకాలను అందుకోవాలని, అక్కడి నుంచి వెంటనే పాఠశాలలకు పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
‘బడుల్లో భగవద్గీత తప్పనిసరి చేయాలి’
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పాఠశాలల్లో భగవద్గీతను చదవడం తప్పనిసరి చేయాలంటూ రూపొందించిన ప్రైవేటు మెంబర్ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ ఈ బిల్లును సభ ముందుంచుతారు. విద్యాసంస్థల పాఠ్య పుస్తకాల్లో నైతిక బోధనగా భగవద్గీత నిర్భంధ బోధన బిల్లుగా ఈ బిల్లును వ్యవహరించనున్నారు. అయితే మైనార్టీలకు చెందిన విద్యాసంస్థల్లో దీన్ని కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధనను ఈ బిల్లులో చేర్చలేదు. -
పాఠ్యపుస్తకాల్లో 36-24-36.. కేంద్రమంత్రి ఆగ్రహం
మహిళల శరీర కొలతల గురించి పాఠ్యపుస్తకంలో అభ్యంతరకరంగా ప్రచురించిన ప్రచురణకర్త మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఒక ప్రైవేటు పబ్లిషర్ ప్రచురించిన ఈ పుస్తకంలో.. మహిళలకు, పురుషులకు శరీరాకృతిలో చాలా తేడా ఉంటుందని చెప్పారు. మహిళల్లో అయితే 36-24-36 కొలత అత్యుత్తమమని అన్నారు. అందుకే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ లాంటి పోటీలలో ఈ కొలతలు ఉన్నవారినే పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. పురుషులకైతే.. వి షేప్ బాగుంటుందని అన్నారు. అయితే.. ఆరోగ్యం, శారీరక విద్యకు సంబంధించిన ఈ పుస్తకాన్ని తాము అసలు 12వ తరగతి విద్యార్థులకు ఇవ్వమని చెప్పలేదని సీబీఎసఈ అంటోంది. పుస్తకంలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తీవ్రంగా మండిపడ్డారు. మహిళల గురించి అసలు ఎక్కడా అనకూడని విషయాలను ఏకంగా పుస్తకంలో ప్రచురించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఎస్ఈ పాఠశాలలన్నీ కేవలం ఎన్సీఈఆర్టీ పుస్తకాలను మాత్రమే ఉపయోగించాలని, అప్పుడు మాత్రమే వారికి సరైన చదువు అబ్బుతుందని, అదే అందరికీ మంచిదని ఆయన చెప్పారు. అలాగే ఈ పుస్తకాన్ని ప్రచురించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించానన్నారు. సీబీఎస్ఈ స్కూళ్లన్నింటిలో సరైన పుస్తకాలు ఉండేలా చూడాలని చెప్పారు. ఢిల్లీకి చెందిన న్యూ సరస్వతి హౌస్ అనే ప్రచురణ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. పుస్తకంలో ఆ పేజీ ఉన్న భాగం వరకు ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో సీబీఎస్ఈ నుంచి హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖ వరకు ప్రతి ఒక్కరూ గట్టిగా స్పందించారు. ఇది పూర్తిగా తప్పుడు సమాచారమని, అసలు తమ గుర్తింపు ఉన్న స్కూళ్లకు ప్రైవేటు పబ్లిషర్లు ప్రచురించే పుస్తకాలు వాడాలని తాము చెప్పబోమని సీబీఎస్ఈ తెలిపింది. ఇంతకుముందు కూడా పుస్తకాల విషయంలో ఇలాగే తప్పులు దొర్లాయి. బి అంటే బాంబు అని, సి అంటే చాకు అని ఉత్తరప్రదేశ్లోని కొన్ని స్కూళ్లలో ఉపయోగించిన పుస్తకాల్లో ప్రచురించారు. -
జిల్లాకు 80 వేల పాఠ్యపుస్తకాలు
విద్యారణ్యపురి : జిల్లాకు కొత్తగా పలు తరగతులకు సంబంధించి అన్ని టైటి ల్స్ కలిపి 80 వేల పాఠ్యపుస్తకాలు వచ్చాయని డీఈఓ పి.రాజీవ్ తెలిపా రు. ఈ విద్యాసంవత్సరం ఆరంభం లోనే 15లక్షలకు పైగా ఉచిత పాఠ్యపుస్తకాలు రాగా పంపిణీ చేశారు. అయి తే, పలు పాఠశాలల్లో పుస్తకాలు సరి పోలేదని, అదనంగా మరికొన్ని పుస్తకాలు కావాలని ఎంఈఓల ప్రతిపాదనలతో డీఈఓ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈమేరకు పుస్తకాలు చేరుకున్నాయి. ఏయే పాఠశాలల విద్యార్థుల కు పుస్తకాలు తక్కువ పడ్డాయో వివరాలతో హెచ్ఎంలు డీఈవో కార్యాల యానికి వచ్చి అవసరమైన పుస్తకాలు తీసుకెళ్లాలని డీఈవో సూచించారు. -
ముద్రణకు నోచుకోని పాఠ్య పుస్తకాలు!
♦ పబ్లిషర్లు, ప్రింటర్ల గొడవల్లో ఇరుక్కుపోయిన విద్యాశాఖ ♦ ప్రభుత్వ ఆధ్వర్యంలో సేల్ పుస్తకాల ముద్రణ? ♦ అయినా ఈ నెల 21 నుంచి పై తరగతుల బోధన అసాధ్యమే! సాక్షి, హైదరాబాద్: పబ్లిషర్లు, ప్రింటర్ల గొడవల్లో విద్యాశాఖ ఇరుక్కుపోయింది. ఫలితంగా ఈ నెల 21 నుంచి ప్రారంభం కావాల్సిన వచ్చే విద్యా సంవత్సరపు పాఠ్యాంశాల బోధనను ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది. విద్యా వార్షిక కేలండర్ ప్రకారం ఈ నెల 21 నుంచి వచ్చే నెల 23వ తేదీ వరకు (ఏప్రిల్ 23 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు) పై తరగతుల బోధనను ప్రారంభించాలి. కానీ ప్రింటర్ల ఖరారు విషయంలో ముందస్తుగా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టలేకపోయిన అధికారులు, వారిపై ఓ ముఖ్య కార్యాలయం నుంచి వచ్చిన ఒత్తిడి, కోర్టు వివాదాలతో విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. పక్కాగాలేని ప్రభుత్వ ప్రణాళిక ఈ విద్యా సంవత్సరంలో పక్కా ప్రణాళిక మేరకు ముందుగానే పుస్తకాలను అందిస్తామని, మార్చి 21 నుంచే పైతరగతులకు సంబంధించిన విద్యాబోధనను ప్రారంభిస్తామని విద్యాశాఖ చెప్పింది. కాని కొంతమంది ప్రైవేటు పబ్లిషర్లు ప్రణాళిక ప్రకారం పన్నిన ఉచ్చులో పడి..పుస్తకాల ముద్రణకే మోక్షం లభించని పరిస్థితికి కారణమైంది. 2016-17 విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లోనూ ప్రభుత్వ సిలబస్తో కూడిన పాఠ్య పుస్తకాలనే వినియోగించాలని ఈసారి ప్రభుత్వం నిబంధన విధించింది. అతిక్రమిస్తే ప్రైవేటు పాఠశాలలపైనా చర్యలు తప్పవని స్పష్టం చేసింది. వివాదాల కారణంగా సేల్ పాఠ్య పుస్తకాల ముద్రణ విషయంలో ముద్రణ టెండర్లే ఖరారు కాకపోవడంతో విద్యాశాఖ ఆందోళనలో పడిం ది. ఇప్పటికిప్పుడు సేల్పుస్తకాలను తాము ముద్రించలేకపోయినా కనీసం జూన్ 13 నాటికైనా ప్రభుత్వ స్కూళ్లకు అవసరమైన 1.70 కోట్ల ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు ప్రైవేటు పాఠశాలలకు అవసరమైన 1.50 కోట్ల సేల్ పుస్తకాలను తాము ముద్రిస్తే ఎలా ఉంటుం దున్న ఆలోచనలు చేస్తోంది. దీనిపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
బ్రెయిలీలో పాఠ్యపుస్తకాలు సిద్ధం
తెలంగాణ వ్యాప్తంగా బ్రెయిలీ పాఠశాలలకు బ్రెయిలీ పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధం చేసినట్టు బ్రెయిలీ ప్రెస్ మేనేజర్ రమేశ్ మంగళవారం తెలిపారు. అలాగే సర్వ శిక్షాభియాన్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బ్రెయిలీ పుస్తకాలను పంపిణీకి సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 2,320 క్యాలెండర్లు, 2,500 పుస్తకాలు తయారు చేసినట్లు తెలిపారు. జిల్లాల ఉపాధ్యాయులు సర్వ శిక్షాభియాన్ ద్వారా ఉచితంగా పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా నార్వే దేశం నుంచి దాదాపు రూ.30 లక్షల విలువ గల ప్రింటర్లు కొనుగోలు చేస్తున్నట్లు రమేశ్ తెలిపారు. దీనివల్ల పుస్తకాలను కొరత లేకుండా సరఫరా చేస్తామన్నారు. -
స్కూళ్లు..సమస్యల గూళ్లు !
గుంటూరు ఎడ్యుకేషన్ : జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మొత్తం కలిపి 3,458 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 3,48,724 మంది చదువుతున్నారు. దశాబ్దాల కిందట నిర్మించిన శిథిల భవనాల్లో రెండు వేల పాఠశాలలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నామని ఓ వైపు ప్రభుత్వం చెబుతుండగా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. పాఠశాలలు ప్రారంభమై పది రోజులు దాటినా ప్రభుత్వ స్కూళ్లల్లోని నాలుగు లక్షల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. జిల్లాలో అవసరమైన 26,37,753 పాఠ్య పుస్తకాల్లో ఇప్పటికీ ఎనిమిది లక్షలకు పైగా రావాల్సి ఉన్నాయి. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, కేజీబీవీ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న 2.50 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రెండు జతల చొప్పున యూనిఫాం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత విద్యాసంవత్సరంలో ఇవ్వాల్సిన యూనిఫాం ప్రస్తుత విద్యాసంవత్సరంలో పంపిణీ చేశారు. పల్నాడులోని పలు మండలాల్లో యూనిఫాం పంపిణీ పూర్తిస్థాయిలో జరగలేదు. నీటికీ కరువే.. పాఠశాలల్లో సురక్షిత తాగునీరు అందడం లేదు. జిల్లాలోని 400 ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు మినహా 3600 ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలల్లో సురక్షిత తాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు శూన్యం. ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న ఏజెన్సీల నిర్వాహకులు తెచ్చే తాగునీటిపైనే ఆధారపడుతున్నారు. తరగతి గదుల కొరత.. అదనపు తరగతి గదుల నిర్మాణం ప్రహసనంగా మారింది. గుర్తింపు లేని పాఠశాలలపై తల్లిదండ్రుల్లో పెరుగుతున్న అవగాహనతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగు తోంది. తదనుగుణంగా నూతన తరగతి గదులు నిర్మాణాలు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలోని 300 పాఠశాలల్లో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. బాపట్ల నియోజకవర్గంలో 219పాఠశాలలుండగా కేవలం మూడు పాఠశాలలకే పక్కా భవనాలున్నాయి. చందోలు ఎస్టీ కాలనీలో స్థలం లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలకు పక్కా భవనం సౌకర్యం లేదు. దాతల సహకారంతో కాలువ కట్టపై ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులోనే పాఠశాలకు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మంతెనవారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలకు మాత్రం గదుల కొరత తీవ్రంగా ఉంది. తూతూ మంత్రంగా బడిపిలుస్తోంది.. ప్రభుత్వ పాఠశాలల ప్రగతిపై విస్తృత ప్రచారానికి ఉద్దేశించిన బడి పిలుస్తోంది కార్యక్రమం జిల్లాలో తూతూ మంత్రంగా సాగింది. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత ఏడాది ప్రభుత్వ రంగంలో 61 శాతం, ప్రైవేటు పాఠశాలల్లో 31 శాతం ఎన్రోల్మెంట్ ఉండగా, ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల వాటా మాత్రం 48 శాతానికి పెరిగింది. ప్రశ్నార్ధకంగా డీఎస్సీ నియామకాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన డీఎస్సీ-2014 నియామకాలు ఎప్పుడు చేపడుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలు తెరిలో లోగానే పోస్టింగ్స్ కల్పిస్తామని పదే పదే ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకూ మెరిట్ జాబితాను సైతం విడుదల చేయలేదు. డీఎస్సీ 2012 ద్వారా జిల్లాలో 404 పోస్టులు భర్తీ అయిన తరువాత మరలా ఇప్పటి వరకూ ఉపాధ్యాయ నియామకాల ఊసే లేదు. ఫలితంగా గత రెండేళ్లుగా నూతన నియామకాలు, పదవీ విరమణతో ఖాళీ అయిన పోస్టులు భారీగా పేరుకుపోయాయి. డీఎస్సీ-2014 ద్వారా జిల్లా 951 పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయించారు. బదిలీలతో గందరగోళ పరిస్థితులు వేసవి సెలవుల్లో నిర్వహించాల్సిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియను ప్రభుత్వం పాఠశాలలు తెరిచి తరగతులు కొనసాగుతున్న తరుణంలో చేపట్టేందుకు సిద్ధమైంది. త్వరలోనే బదిలీలు చేపట్టేందుకు నిర్ణయించిన ఫలితంగా ఉపాధ్యాయుల తమ దష్టి అంతా బదిలీలపైనే సారించే అవకాశముడటంతో పాఠశాలల్లో విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారనుంది. -
'యోగాను పాఠ్యాంశాల్లో చేరుస్తాం'
విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద నిర్వహించిన జిల్లా ఒలింపిక్ రన్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యోగాను పాఠ్యాంశాల్లో చేర్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. యోగా వంటి క్రీడల్లో భాగస్వామ్యం ఉన్న వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. -
ఎక్కడి పుస్తకం అక్కడే..!
దేవుడు వరమిచ్చినా.. పూజారి అనుగ్రహించలేదన్నట్టుంది జిల్లాలో పాఠ్య పుస్తకాల సరఫరా. ప్రతి సంవత్సరం సకాలంలో పుస్తకాలు రాక ఇబ్బంది పడుతుంటే..ఈ సారి సకాలంలో వచ్చినా వాటిని పంపిణీ చేయకపోవడంతో సమస్య తలెత్తింది. డబ్బుల చెల్లింపులో వచ్చిన పంచాయతీ విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెట్టింది. మహబూబ్నగర్ విద్యావిభాగం : ప్రతి ఏటా జిల్లాకు పాఠ్యపుస్తకాలు చేరడంలో ఆలస్యం జరిగేది.. కానీ, ఈ ఏడాది పాఠ్యపుస్తకాలు సకాలంలో జిల్లా గోదాంకు చేరినా సరఫరా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పుస్తకాలు సరఫరా చేసే వాహన కాంట్రాక్టర్కు ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో పాటు, పుస్తకాలను లోడ్ చేసే కూలీలకు వేతనం కూడా ఇవ్వలేదు. దీంతో వారు పాఠ్యపుస్తకాల సరఫరా నిలిపివేశారు. పాఠ్యపుస్తకాలు సరిపడినన్ని ఉన్నా విద్యార్థులకు అందజేయలేని దుస్థితిలో విద్యాశాఖ ఉంది. పాఠశాలలు తెరిచేనాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేస్తామని ప్రకటించిన విద్యాశాఖాధికారులు, నిధులు లేవని చేతులెత్తేయడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. 15లక్షల పుస్తకాలే సరఫరా.. జిల్లాలో 2,725 ప్రాథమిక, 578 యూపీఎస్, 657 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటి లో సుమారు 4.50లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారికి 2015-16 విద్యాసంవత్సరానికి 25,54,404 పాఠ్యపుస్తకాలు అవస రం. వీటిలో జిల్లాకు 24,28, 821 పాఠ్యపుస్తకాలు వచ్చాయి. పుస్తకాల ను మండల కేంద్రాలకు తరలించేం దుకు టెండర్లు నిర్వహించి రూ.9లక్షలకు ప్రదీప్కుమార్ అనే కాంట్రాక్టర్ కు అప్పగించారు. టెండర్ల సందర్భం గా వాహనాల డీజిల్ఖర్చు, లేబర్ చార్జీలకు కొంత మొత్తం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మే 26 నుంచి పాఠ్యపుస్తకాల సరఫరా ప్రా రంభించారు. 20రోజుల్లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. అప్పటి నుంచి మొదటి విడత 64 మండలాలకు సరఫరా చేసిన తర్వాత కాంట్రాక్టర్, లే బర్ జిల్లా విద్యాశాఖాధికారిని కలిసి తమకు డీజిల్కు, కూలి డబ్బులు చె ల్లించాలని కోరారు. నిధులు లేవని.. వారంరోజుల్లో ఇస్తామని చెప్పడంతో రెండోవిడత 14మండలాలకు మొత్తం ఇప్పటివరకు 15,12,345 పాఠ్యపుస్తకాలను మండలాలకు సరఫరా చేశా రు. ఒక్క పైసాకూడా విడుదల చేయకపోవడంతో తమకు కూలి డబ్బులు చెల్లిస్తేనే పాఠ్యపుస్తకాలను సరఫరా చే స్తామని లేబర్ రాకపోవడంతో కాం ట్రాక్టర్లు నాలుగు రోజులుగా వాహనాలను గోదాం ఎదుటే నిలుపుకొని ఉన్నారు. ప్రతి ఏటా ముందుగానే చెల్లించే వారు.. ప్రతి ఏటా టెండర్ తర్వాత పుస్తకాలు సరఫరా చేసేట ప్పుడు వాహనాల డీజిల్కు, లేబర్ కూలి చెల్లించేందుకు టెండర్ ధరలో 30శాతం నిధులు విడుదల చేసే వారు. కానీ, ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్కపైసా ఇవ్వలేదు. లేబర్ కూలి చెల్లిస్తేనే వస్తమంటున్నారు. డీఈఓ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. ప్రతిరోజు వాహనాల కిరాయి రూ.2వేలు చెల్లిస్తూ నాలుగు రోజులుగా వృథాగా గోదాం ఎదుట నిలుపుకున్నాం. -ప్రదీప్కుమార్, పుస్తకాల సరఫరా కాంట్రాక్టర్. నిధులు లేకపోవడం వల్లనే... నిధులు లేక పోవడం వల్లే డబ్బులు చెల్లించలేదు. టెండర్ సందర్భంగా మొత్తం సరఫరా చేసిన తర్వాతనే డబ్బులు ఇస్తామని ఏజేసీ చెప్పారు. కానీ, ముందుగానే చెల్లించాలని కాంట్రాక్టర్ అడుగుతున్నాడు. వెంటనే వారికి కొంత డబ్బు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. పాఠ్యపుస్తకాలు ఇప్పటికే అన్ని మండలాలకు చేరాయి. మిగతా పుస్తకాలు వెంటనే చేరవేసేలా చర్యలు తీసుకుంటాం. -నాంపల్లి రాజేష్ ,జిల్లా విద్యాశాఖాధికారి -
ఎదురుచూపులే..
పాఠ్యపుస్తకాలు అందక విద్యార్థుల ఇక్కట్లు ఇప్పటివరకు 40 శాతం లోపే సరఫరా ‘ప్రైవేటు’కు మరిన్ని కష్టాలు బాన్సువాడ: విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందుగానే విద్యార్థులకు సరిపడా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. ఇప్పటికే మండల కార్యాలయూలకు పుస్తకాలు చేరాల్సి ఉండగా.. ఇంతవరకూ ఆ ఊసే లేదు. సిలబస్ మారిన పుస్తకాల పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. కొత్త పుస్తకాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదని వాపోతున్నారు. జూన్ ఒకటి నాటికి పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఈసారి ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలనే ఉపయోగించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు తెరిచే నాటికి ప్రతి పాఠశాలలో విద్యార్థులకు సరిపడా పాఠ్య పుస్తకాలు అందించాలన్నదే ఉన్నతాధికారుల లక్ష్యం. అయితే పుస్తకాల పంపిణీలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. 2015-16 విద్యా సవత్సరానికి గాను జిల్లా లో సుమారు 18 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటి వరకు అన్ని పుస్తకా లు కలిపి 40 శాతం కూడా పంపిణీ కాలేదు. ఇప్పటికే పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉం డగా, ఆలస్యం జరుగుతుండడంతో అధికారులు ఆదోళన చెందుతున్నారు. రెండు, మూడేళ్ల క్రితం వరకు రవాణా చార్జీల మంజూరీరులో ఎదురైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ఈ ఏడాది ముందుగానే నిధుల సమీకరణపై దృష్టి సారించారు. ‘ప్రైవేటు’కు మరిన్ని కష్టాలు.. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాగోలా పుస్తకాలు పంపిణీ చేస్తుండగా, ప్రైవేటు వి ద్యా సంస్థల యాజామాన్యాలకే ప్రతి ఏడాది ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్/తెలుగు మీడియూలలో ప్రభుత్వ పుస్తకాలనే బోధించాలనే నిబంధన ఉండడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎలాగోలా సర్దుబాటు చేసుకొనే వారు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు ప్రైవేటు పబ్లిషర్స్ పుస్తకాలను విని యోగించారు. అయితే ప్రస్తుతం 1వ తరగతి నుంచే ప్రభుత్వ ముద్రిత పుస్తకాలను ఉపయోగించాలని విద్యాశాఖ ఆదేశించడంతో ప్రైవేటు యాజమాన్యాలు అయోమయానికి గురవుతున్నాయి. రాష్ట్ర పాఠ్య పుస్తకాల ము ద్రణా కేంద్రం నుంచి జిల్లాకు పాఠ్య పుస్తకా లు అందకపోవడంతో విద్యార్థులు అవస్థల పాల వుతున్నారు. పాఠ్య పుస్తకాల కొరత విద్యార్థులకు కొరకరాని కొయ్యగా మారింది. డబ్బులు వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేద్దామన్నా దొరకడం లేదు. జిల్లాలో 22 పాఠ్య పుస్తకాల విక్రయ కేంద్రాలు ఉండగా, వాటిలో అవసరమైన పుస్తకాలు అందుబాటులో లేక ఇబ్బందు లు ఎదురవుతున్నాయి. గత ఏడాది జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం సుమా రు 5 లక్షల పుస్తకాలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, అందులో 20 శాతం పుస్తకాలు మాత్రమే సరఫరా చేశారు. దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నో వ్యవప్రయాసలు కోర్చి తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చేర్పించిన తల్లిద్రండులకు ప్రస్తుతం పాఠ్య పుస్తకాల కోసం తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వ పుస్తకాలు ఉపయోగకరమే.. 1వ తరగతి నుంచే ప్రభుత్వ ముద్రిత పుస్తకాలను ప్రవేశపెట్టడం విద్యార్థులకు ప్రయోజనకరమేనని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులను మార్చారు. జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా పాఠశాల స్థాయిలో పాఠ్య పుస్తకాల సిలబస్లో మార్పులు చేశారు. పరిమితికి లోబడి, బట్టీ విధానానికి అనుకూలమైన రాష్ట్ర సిలబస్కు అదనంగా సీబీఎస్ఈ సిలబస్ను జోడించారు. విద్యార్థుల్లో ప్రశ్నించేతత్వం, ప్రాక్టికల్గా ఆలోచించేలా సిలబస్ రూపకలప్పన చేయడాన్ని విద్యావేత్తలు స్వాగతిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, పాఠ్య పుస్తకాల ముద్రణలో గతం మాదిరిగానే జాప్యం జరుగుతోంది. గత ఏడాది రవాణాకు సంబంధించి ఎంఈఓలకు నిధులు ఇవ్వాల్సి ఉన్నట్లు తెలిసింది. కాగా గత అనుభవాల దృష్ట్యా ఈ నెలాకరుకల్లా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
పాఠ్య పుస్తకాల్లో ‘నల్లగొండ’
మన పాఠ్యపుస్తకాలు.. మన చరిత్ర నాగార్జున్ సాగర్ ప్రాజెక్టు, బేతవోలు చెరువుల వివరాలు కవులు, పోరాట యోధుల జీవిత విశేషాలు 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు, సాంఘిక శాస్త్రంలో ప్రస్తావన చిలుకూరు: సమైక్య పాలనలో మరుగున పడిపోయిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కరువులు, కళాకారులు, పోరాటయోధుల జీవన గాథలు ఇకపై మన విద్యార్థులు పాఠ్యాంశాలుగా చదువుకోనున్నారు. ఈ విద్యాసంవత్సరం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పాఠ్య పుస్తకాల్లో జిల్లాకు చెందిన ప్రముఖ ప్రాజెక్టులు, ప్రాంతాల విశేషాలు, కవులు, కళాకారులు, తెలంగాణ పోరాట యోధుల జీవిత విశేషాలను పాఠ్యాంశాలుగా పొందుపరిచారు. 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు, సాంఘిక శాస్త్రం పుస్తకాల్లో వీటిని చేర్చారు. చిలుకూరు మండలం బేతవోలు చెరువు, పోరాట యోధులు ఆరుట్ల కమలాదేవి, ఉప్పల మల్సూరు, కవులు సుద్దాల హనుమంతు, భాస్కర్రెడ్డి తోపాటు నాగార్జునసాగర్ ప్రాజెక్టు, పోచంపల్లి చేనేతను ప్రస్థావనకు తెచ్చారు. వీటి వల్ల భవితరం పౌరులైన విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునే వీలుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. చేనేత కార్మికులకూ స్థానం జిల్లాలో చేనేత వస్త్రాలకు పేరుగాంచిన భూదాన్పోచంపల్లి చేనేత కార్మికులు గురించి 7వ తరగతి తెలుగు వాచకంలో వివరించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టై అండ్ డై చీరలు ఎలా నేస్తారు, కార్మికుల నైపుణ్యాన్ని వివరించారు. పోరాట యోధుడు మల్సూర్ ప్రస్థావనం.. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఉప్పల మల్సూర్ ప్రస్థావ 6వ తరగతి తెలుగు పుస్తకంలో ఉంది. మల్సూర్ జీవన విధానం, రాజకీయ జీవితం, రైతాంగ పోరాటంలో ఆయన పాత్రను వివరించారు. ‘మిషన్ కాకతీయ’లో బేతవోలు చెరువు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన మిషన్ కాకతీయ చెరువుల అభివృద్థి పథకాన్ని వివరిస్తూ చిలుకూరు మండలం బేతవోలు చెరువు గురించి 7వ తరగతి సాంఘిక శాస్త్రంలో చెప్పారు. ఈ చెరువుకు సంబంధించిన పూర్తి వివరా లు పాఠ్యాంశంలో పొందుపరిచారు. చెరువు పేరు, ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మిం చారు, ఆయకట్టు తదితర వివరాలు ఉన్నాయి. ప్రముఖ కవి భాస్కర్రెడ్డి జిల్లాలోని అంకుశాపురం గ్రామానికి చెందిన ప్రముఖ కవి బద్దం భాస్కర్రెడ్డి(చెరబండరాజు) గురించి 6వ తరగతి తెలుగులో పుస్తకంలో ప్రస్థావించారు. భాస్కర్రెడ్డి ఉపాధ్యాయుడిగా, కవిగా చేసిన సేవలు, రాసిన విప్లవ గేయాలు, కథలు, నవలలను వివరించారు. గమ్యం, ముట్టడి, పల్లవి లాంటి కవితా సంకలనాలు, కత్తిపోటు పాటలు తదితర వివరాలు తెలియజేశారు. ఆరుట్ల కమలాదేవి జీవిత చరిత్ర ఆలేరుకు చెందిన తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు ఆరుట్ల కమలాదేవి గురించి 7వ తరగతి తెలుగు పుస్తకంలో ప్రస్తావించారు. ఉద్యమ స్ఫూర్తి, బాల్య జీవితం, బాల్య వివాహాలు, రాజకీయ అవగాహన, ఎమ్మెల్యేగా ఎన్నిక తదితర అంశాలను తెలియజేస్తూ పాఠ్యాంశాన్ని రూపొందించారు. సుద్దాల హనుమంతు గుండాల మండలం సుద్దాలకు చెందిన సుద్దాల హనుమంతు గురించి 6వ తరగతి తెలుగు వాచకంలో పొందుపరిచారు. ఆయన రాసిన చైతన్య గీతాలు, బుర్రకథలు, గొల్లసుద్దులు, పిట్టల దొర తదితర రచనల గురించి వివరించారు. నాగార్జున్సాగర్ గురించి... 6వ తరగతి తెలుగు వాచకంలో నాగార్జున సాగర్ గురించి విద్యార్థులకు తెలియజేశారు. లేఖ పాఠ్యాంశంలో నాగార్జున సాగర్ గురించి పూర్తి వివరాలు పొందుపరిచారు. పొడవు, నీటి సామర్థ్యం, ప్రకృతి అందాలు, సాగర్ చుట్టు పక్కల చూడదగిన ప్రదేశాలు, ప్రాజెక్టు నిర్మాణ శైలి తదితర అంశాలను విద్యార్థులకు పాఠ్యాంశంగా అందించారు. విద్యార్థులకు ఎంతగానో ఉపయోగం పాఠ్యపుస్తకాల్లో జిల్లాకు అధిక ప్రాధన్యం ఇవ్వడం సంతోషం. దీని వల్లన జిల్లా యొక్క ప్రాధాన్యతను విద్యార్థులు తెలుసుకోగలరు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని పలు అంశాలు పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి. - చలసాని శేఖర్, ప్రధానోపాధ్యాయులు, జెడ్పీహెచ్ఎస్ చిలుకూరు. -
ఏం చదవాలి?
♦ పూర్తి స్థాయిలో అందని పాఠ్యపుస్తకాలు ♦ సైన్స్, ఇంగ్లిష్ పుస్తకాల కొరత ♦ ఏటా ఇదే తంతు కడప ఎడ్యుకేషన్ : పాఠశాలలు తెరిచేలోపు విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందిస్తామని వేసవికి ముందు నుంచే ఊదరగొట్టిన జిల్లా విద్యాశాఖాధికారుల మాటలు ఆచరణలో అమలు కాలేదు. పాఠ శాలలు పునఃప్రారంభమై వారం కావస్తున్నా నేటికీ పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు అందలేదు. జిల్లాలో 4,449 పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకూ 2.47 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ 17,61,460 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా ఇప్పటి వరకు 8,79,716 పుస్తకాలే జిల్లాకు చేరాయి. గత ఏడాది మిగిలిపోయిన 2,95,789 పుస్తకాలతో కలిపి ఈ ఏడాది 11,75,505 పుస్తకాలను వివిధ మండలాలకు చేరవేశారు. మిగిలిన 5,85,955 పుస్తకాలు రావాల్సి ఉంది. ఉర్దూ మీడియంకు సంబంధించి ఒకటవ తరగతి నుంచి పది వరకు ఒక్క పుస్తకం కూడా రాలేదు. జిల్లాకు రావ లసిన మిగతా పాఠ్య పుస్తకాలు త్వరలో వస్తాయని, వచ్చిన వెంటనే విద్యార్థులకు అందజేస్తామని డీఈఓ బండ్లపల్లె ప్రతాప్రెడ్డి తెలిపారు. అందని పుస్తకాల వివరాలు.. - ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ - రెండవ తరగతి తెలుగు, ఇంగ్లిష్ - మూడవ తరగతి సైన్స్ - నాలుగవ తరగతి తెలుగు, ఇంగ్లిష్, సైన్స్ - ఐదవ తరగతి తెలుగు - అరవ తరగతి (ఇంగ్లిష్ మీడియం) లెక్కలు, సైన్స్, సోషియల్ - ఏడవ తరగతి (ఇంగ్లిష్ మీడియం) సైన్స్ - 6,7,8,9 తరగతుల హిందీ - ఎనిమిదవ తరగతి (ఇంగ్లిష్ మీడియం) ఫిజికల్ సైన్స్ -
అన్నప్రాశన రోజే ఆవకాయ
ఈ మధ్య ప్రవేశపెట్టిన ఆంగ్ల పాఠ్యపుస్తకాలు ‘విద్యార్థుల’ మానసిక స్థాయిని మించి ఉన్నాయి. డిగ్రీ, పీజీ స్థాయి వారికి పరిచయం చేసే క్లిష్టమైన పదజాలం పాఠాల్లో వాడటం విడ్డూ రం. విద్యా ప్రణాళికలో విషయాత్మకతకు కాని, లక్ష్యాత్మకతకు కాని చోటులేదు. కేవలం సృజనాత్మకతకే పెద్దపీట వేశారు. ఉదా హరణకు ఒక కథను ఇచ్చి దాన్ని సంభాషణ రూపంలో ఇంగ్లిష్ లో రాయమనడం, చదవని పద్యాన్ని ఇచ్చి అం దులో ప్రశ్నలడగడం, క్రికెట్ కామెంటరీ రాయ మనడం పసి మనసులను క్షోభ పెట్టడమే. ఇది కార్పొరేట్ స్కూళ్లకే కాని ప్రభుత్వ పాఠశాలలకు ఉపయోగకరం కాదు. తెలంగాణలో పేద విద్యా ర్థినీ, విద్యార్థులకు ఇది మేలు కలిగించదు. పాఠంలో చదివిన ప్రశ్నలు రావు. ఉపాధ్యాయులకు వారిని ఎలా సిద్ధం చేయాలో తెలియని పరిస్థితి. ఇది విద్యార్థులను నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంది. పాఠ్యపుస్తకాలను సరళతరం చేసి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఎల్కేజీ, యూకేజీ ప్రాథమిక ఇంగ్లిష్ మీడి యం పాఠశాలలు ప్రవేశ పెట్టడం వలన విద్యార్థులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం ఏర్పడుతుంది. దేవళ్ల సుధాసాగర్ బెల్లంపల్లి, ఆదిలాబాద్ బెల్టుషాపులు రద్దు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఆర్టీసీ బస్సులో వారికి ప్రత్యేకంగా బాక్స్ ఏర్పాటు చేశారు. మహిళలపై అఘా యిత్యాల పట్ల దృష్టిపెడుతూ చట్టాల ద్వారా శిక్షించే విధంగా నిర్భయ చట్టాన్ని అమలుచేయబోతున్నారు. ఈ నేపథ్యంలో పనిలో పనిగా, రాష్ట్రంలో మహిళలకు కన్నీరు కురిపిస్తున్న బెల్టు షాపులను వెంటనే రద్దుచేయాలి. ఉద్యోగమో, కూలోనాలో చేసు కుంటూ కుటుంబాన్ని పోషించే మహిళలు తమ వీధుల్లో ఉన్న బెల్టు షాపుల వల్ల చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మహి ళలు పని చేసి తిరిగి వచ్చే సరికి, ఇంట్లో దాచిన డబ్బులను భర్త తీసుకుని బెల్టు షాపుల్లోని చీప్ లిక్కర్ తాగి కట్టుకున్న భార్యను బెల్టుతో బాదేస్తుంటే ఆ కుటుంబం పరువు బజారులో పడు తోంది. ఈ దుస్థితి నుంచి మహిళలను, కుటుంబాలను బయట పడవేయాలంటే, తెలంగాణ వ్యాప్తంగా చీప్ లిక్కర్, గుడుంబా అమ్మే బెల్టు షాపులను ప్రభుత్వం రద్దు చెయ్యాలి. బెల్టు షాపుల వలన జనాల జీవితాలు అప్పుల పాలవుతున్నాయి, బెల్టు షాపు లను రద్దుచేస్తే తప్ప తెలంగాణ బాగుపడదని జనాభిప్రాయం. ప్రభుత్వం మద్యం మీద వచ్చే ఆదాయంతో మనుగడ సాగించా లనుకుంటే, ఇక సంక్షేమానికి అర్థం పరమార్ధం ఉండవు. కె.అమన్రాజీవ్ కుతుబుల్లాపూర్, రంగారెడ్డి జిల్లా ఆ బౌన్సర్ ఓ గుణపాఠం ఇటీవల ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్పై దూసుకొచ్చిన ఓ బౌన్సర్ అతని నిండు ప్రా ణాలను బలితీసుకోవడం క్రికె ట్ చరిత్రలో దురదృష్టకర ఘ టన. భారత క్రికెట్ ఆటగాడు రమణ్ లాంబా అతి పిన్న వ యసులో ఇలాగే క్రికెట్ బంతి తగిలి మృత్యువాతపడ్డాడు. జెంటిల్మ్యాన్ గేమ్గా పేరు గాంచిన క్రికెట్లో ఈ దుర్ఘ టనతో అర్థాంతరంగా ఒక వర్ధమాన క్రికెటర్ అసువులు బాయడం దిగ్భ్రాంతికరం. క్రీడ వినోదం కావాలి కాని విషాదం మిగల్చరాదు. బుగ్గన మధుసూదనరెడ్డి, బేతంచర్ల, కర్నూలు జిల్లా -
పుస్తకాల్లేవ్ !
వైరా : విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా జిల్లాలోని పలు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా పాఠ్య పుస్తకాలు అందలేదు. ఓవైపు త్రైమాసిక పరీక్షలు ప్రారంభం కావస్తుండగా.. పుస్తకాలు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పాఠశాలల సిబ్బంది పలుమార్లు జిల్లా అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం. దీంతో జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో 10 గురుకుల పాఠశాలల్లో అదే పరిస్థితి... జిల్లాలోని వైరా, అడవిమల్లెల, ములకలపల్లి, కల్లూరు, నేలకొండపల్లి, ఎర్రుపాలె ం, టేకులపల్లి, దమ్మపేట, పాల్వంచ, అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికలు, బాలుర పాఠశాలల్లో సగానికి పైగా విద్యార్థులను పుస్తకాల కొరత వేధిస్తోంది. ఆయా పాఠశాలల్లో 5 నుంచి పదో తరగతి వరకు సుమారు 7,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇందులో సగం మంది పుస్తకాలు లేక తరగతి గదుల్లో ఖాళీగానే కూర్చుంటున్నారు. అందాల్సిన పుస్తకాలివే.... 5వ తరగతిలో ఈవీఎస్, తెలుగు, గణితం, ఇంగ్లిష్, 6వ తరగతిలో తెలుగు, గణితం, భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రం, 7వ తరగతిలో హిందీ, గణితం, భౌతిక, సాంఘిక శాస్త్రాలు, 8వ తరగతిలో గణితం, భౌతికశాస్త్రం, బయాలజీ, సోషల్, 9వ తరగతిలో హిందీ, ఇంగ్లిష్, గణితం, భౌతికశాస్త్రం, బయాలజి, సోషల్, 10లో ఇంగ్లిష్, గణితం, భౌతికశాస్త్రం, బయాలజి, సోషల్ పుస్తకాలు ఇప్పటి వరకు 50 శాతానికి పైగా రావాల్సి ఉంది. అగమ్యగోచరంగా ‘పది’ విద్యార్థులు... ఈ ఏడాది పదో తరగతిలో సిలబస్ మారడంతో గత ఏడాది పుస్తకాలను తీసుకునే అవకాశం కూడా లేదు. వైరా సాంఘిక సంక్షేమ బాలికల గురుకల పాఠశాలలో 79 మంది విద్యార్థులు ఉండగా వారిలో సగానికి పైగా మంది పుస్తకాలు లేకుండానే తరగతులకు హాజరవుతున్నారు. ఈ ఏడాది సిలబస్ మారడం, పుస్తకాల కొరతతో ఉపాధ్యాయునులు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఏజేసీ పరిశీలనలో కూడా ఇవే సమస్యలు... ఏజేసీ బాబురావు ఇటీవల వైరాలోని పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చే య గా, తాము పుస్తకాలు లేకుండానే పాఠాలు వింటున్నామని పలువురు విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చినా.. నేటికీ విద్యాశాఖాధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేదు. -
స్కూల్ పుస్తకాల పై రక్తపు మరకలు
-
ఎలా ‘నోట్’ చేసుకోవాలి
మోర్తాడ్ : విద్యాహక్కు చట్టం అభాసుపాలవుతోంది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సామగ్రి (పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, బ్యాగులు, చెప్పులు, యూనిఫాం)ని ప్రభుత్వమే సరఫరా చేయాలి. కేవలం యూని ఫాంలు, పాఠ్య పుస్తకాలతోనే సరిపెడుతున్నారు. జిల్లాలో 1,573 ప్రాథమిక, 265 ప్రాథమికోన్నత, 461 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 41 ఎయిడెడ్ , 30 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 2.40 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలలు పాఠశాలలు ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు విద్యా సామగ్రిని ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వాల్సి ఉంది. కానీ యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలను మాత్రమే సరఫరా చేసింది. ముందుగా టెండర్లను నిర్వహించి సామగ్రిని ప్రభుత్వం సేకరించకపోవడంతో నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, బ్యాగులు, చెప్పులు విద్యార్థులకు సరఫరా కాలేదు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వమే తనకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో విద్యార్థులకు న్యాయం జరగడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో ఎక్కువ మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే ఉంటారు. వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో విద్యా సామగ్రి కొనుగోలు వారికి తలకు మించిన భారంగా మారిం ది. విద్యా సామగ్రి ధరలు మార్కెట్లో భారీ గానే పెరిగాయి. పెరిగిన ధరలకు అనుగుణం గా విద్యార్థుల కుటుంబాల ఆదాయం పెరగలేదు. దీంతో ప్రభుత్వంపై వారు ఆధారపడి ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని కొనుగోలు చేసి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలి విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం విద్యా సామగ్రిని కొనుగోలు చేసి ఇవ్వాలి. ప్రభుత్వం చట్టాన్ని పాటించక పోతే ఎలా. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని విద్యాహక్కు చట్టంలో విద్యా సామగ్రిని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం చట్టం ప్రకారం పని చేయాలి.- సత్యానంద్, బీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
కళకళ.. వెలవెల
సాక్షి, సిటీబ్యూరో: వేసవి ముగియడంతో నగరంలోని ప్రభు త్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ గురువారం పునఃప్రారంభమయ్యాయి. కొత్త దుస్తులు, పుస్తకాల బ్యాగులు తగిలించుకొని వచ్చిన విద్యార్థులతో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు కళకళలాడగా, సర్కారీ స్కూళ్లు మాత్రం విద్యార్థులు లేక బోసిపోయాయి. కొత్తగా చేరుతున్న చిన్నారులతో పాటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెంట రావడంతో పలు ప్రైవేటు పాఠశాలలు కిటకిటలాడా యి. ప్రభుత్వ పాఠశాలల్లో తొలిరోజు ఉపాధ్యాయులంతా వచ్చినప్పటికీ.. విద్యార్థులు పెద్దగా హాజరు కాలేదు. సెలవులకు ఊళ్లకు వెళ్లిన విద్యార్థలు కొందరు తిరిగి రాకపోవడం, ఎండ తీవ్రత ఇంకా తగ్గకపోవడం కూడా కారణాలు కావచ్చని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉంటే..జిల్లావ్యాప్తంగా ఏ పాఠశాల్లోనూ విద్యార్థులకు కనీసం ఒక్కజత యూనిఫారాన్ని కూడా విద్యాశాఖ అధికారు లు అందజేయలేదు. విద్యార్థులకు ఉచి త పాఠ్యపుస్తకాలను కూడా అరకొరగానే పంపిణీ చేశారు. తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య ఏ యేటికాయేడు తీవ్రంగా పడిపోతోంది. అదేమీ లేదని అధికారులంటున్నప్పటికీ ఇది వాస్తవం. సాధారణంగా వేసవి సెలవుల్లో బడిబాట, విద్యా పక్షోత్సవాలు.. తదితర కార్యక్రమాల ద్వారా విద్యార్థుల నమోదు ను పెంచుకోవటానికి విద్యాశాఖ కసరత్తు చేయ టం పరిపాటి. కానీ ఈసారి అలాంటి కార్యక్రమాలేవీ జరగకుండానే పుణ్యకాలం కాస్తా ముగిసిపోయింది. విద్యాశాఖ అధికారులు వేసవి సెలవు ల షెడ్యూల్లో బడిఈడు బాలలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేందుకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం విచారకరం. పాఠ్య పుస్తకాల కొరత! పాఠశాలల పునఃప్రారంమైనా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో అందలేదు. ప్రతిఏటా పాఠ్యపుస్తకాల కొరత విద్యార్థులను వేధిస్తున్నా..ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. జూన్ 12నుంచి పాఠశాలలు తెరిచిన వెం టనే.. నగరంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందిస్తామని విద్యాశాఖ అధికారులు చే సిన ప్రకటనలు కాగితాలకే పరిమితయ్యాయి. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాల్లో 65 శాతం పుస్తకాలు మాత్రమే పాఠశాలలకు చేరాయి. మిగిలిన 35 శాతం పుస్తకాలు స్కూళ్లకు ఎప్పుడొస్తాయో అంతుబట్టని దుస్థితి నెలకొంది. పుస్తకాలు ఇవ్వకుంటే విద్యార్థులు బడి రాకుండా పోయేందుకు ఆస్కారం ఇచ్చినట్లవుతుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. యూనిఫారాలు లే వ్ ! ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం మరోమారు సుస్పష్టంగా కనిపిస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన యూనిఫారాల గురించి అటు ఆర్వీఎంలోనూ.. ఇటు విద్యాశాఖలో ఆ హడావిడేమీ కనిపించడం లేదు. హైదరాబాద్ జిల్లాలో 1.07లక్షలమందికి 2.14లక్షల జతలు సిద్ధం కావాల్సి ఉండగా..నేటివరకు ఒక్క జత కూడా రెడీ కాలేదని తెలిసింది. కనీసం కాంట్రాక్టర్ నుంచి బట్ట(క్లాత్)కూడా అందలేదు. కమీషన్లకు కక్కుర్తిపడిన ప్రభుత్వ పెద్దలు.. అధ్వాన్నపు కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టడమే ఈ జాప్యానికి కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
16 నుంచి నూతన పాఠ్యపుస్తకాలపై శిక్షణ
వైవీయూ : ఈనెల 16 నుంచి 26వ తేదీ వరకు 9, 10 తరగతుల నూతన పాఠ్యపుస్తకాలు, పరీక్షల సంస్కరణలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఈఓ కె. అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 16వ తేదీ నుంచి ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. స్కూల్కాంప్లెక్స్లు, ఎంఆర్సీలు లేదా మండల అభివృద్ధి కార్యాలయాల నందు ఆర్ఓటీ టర్మినల్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కాలంలో ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయమని తెలిపారు. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు కూడా వారి సబ్జెక్టు రోజున సమీపంలోని శిక్షణ కేంద్రానికి పంపాలని కోరారు. స్కూల్ కాంప్లెక్స్, ఎంఆర్సీ లలోని ఆర్ఓటీ టర్మినల్స్కు ఏవైనా మరమ్మతులు ఉంటే సరిచేయించి వాటిని శిక్షణకు సిద్ధం చేయాలని కోరారు. ఈ నెల 16న అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 17న తెలుగు, 18న ఇంగ్లీషు, 19న హిందీ, 20న గణితం, 21 ఫిజికల్ సైన్స్, 23 బయోలాజికల్సైన్స్, 24న సోషియల్, 25న ఉర్దూ, 26న సంస్కృతం ఉపాధ్యాయులు హాజరుకావాలని కోరారు. -
పుస్తకాలొచ్చాయ్..
జిల్లాలో ఉచిత పంపిణీకి 23.02 లక్షల పాఠ్యపుస్తకాలు పదో తరగతి కొత్త పాఠ్యపుస్తకాలు సిద్ధం మార్చి నాటికి పాఠశాలలకు... ఒంగోలు ఒన్టౌన్, న్యూస్లైన్: జిల్లాలోని పాఠశాలల్లో 2014-15 విద్యా సంవత్సరంలో 1 నుంచి పదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్న విద్యార్థులకు 27.82 లక్షల పాఠ్యపుస్తకాలు జిల్లా విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ మొత్తంలో ప్రభుత్వరంగ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 23.02 లక్షల పాఠ్యపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎ.రాజేశ్వరరావు ‘న్యూస్లైన్’కు తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న అన్ని వర్గాల విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేస్తారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన, పొందని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విక్రయించేందుకు 4280 లక్షల పాఠ్యపుస్తకాలను సిద్ధం చేస్తున్నారు. ఈ విద్యార్థులందరూ మార్కెట్లో పాఠ్యపుస్తకాలను కొనుక్కోవాల్సిందే. జిల్లా విద్యాశాఖచే గుర్తింపు పొందిన పుస్తకాల షాపులు, సూపర్బజార్లలో వీరికి పాఠ్యపుస్తకాలను విక్రయిస్తారు. విద్యాశాఖ ముందస్తు అనుమతి లేకుండా పాఠ్యపుస్తకాలను విక్రయించడం నేరం. 59 శాతం పాఠ్యపుస్తకాలు సిద్ధం: జిల్లాలో విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు 59 శాతం పాఠ్యపుస్తకాలు జిల్లా పాఠ్యపుస్తకాల గోడౌన్లో సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు మొత్తం 23.62 లక్షల పాఠ్యపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ మొత్తానికి గత సంవత్సరం పంపిణీ చేయగా మిగిలిన పాఠ్యపుస్తకాలు 1.16 లక్షలు గోడౌన్లో నిల్వ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఈ ఏడాది పంపిణీకి నికరంగా 21.85 లక్షల పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. అయితే ఈ మొత్తంలో ఇప్పటి వరకు 12.05 లక్షల పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం నుంచి ఒంగోలు గోడౌన్కు చేరినట్లు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల జిల్లా మేనేజర్ జె.నాగరాజు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఇంకా 9.20 లక్షల పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలు 50 శాతంపైగా వచ్చాయి. 9,10 తరగతుల ఒకేషనల్ విద్యార్థులు, మదర్సాల్లో చదువుతున్న మైనార్టీ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తున్నారు. పదో తరగతి పాఠ్యపుస్తకాలు మార్పు ఈ ఏడాది పదో తరగతి పాఠ్యపుస్తకాలు మారాయి. ప్రస్తుతం 1 నుంచి 9వ తరగతి వరకు నిరంతర చరిత్రగా మూల్యాంకనం (సీసీఈ) విధానం ప్రకారం పాఠ్యపుస్తకాలు రూపొందించారు. ఈ ఏడాది పదో తరగతి పాఠ్యపుస్తకాలను కూడా సీసీఈ విధానంలో రూపొందించారు. పదో తరగతి విద్యార్థులకు మొత్తం 4.19 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమని అంచనా వేశారు. ఈ మొత్తంలో 3.14 లక్షల పాఠ్యపుస్తకాలు ఉచిత పంపిణీకి, 1.05 లక్షల పాఠ్యపుస్తకాలు మార్కెట్లో విక్రయిస్తారు. పదో తరగతి పాఠ్యపుస్తకాలు పంపిణీకి సిద్ధమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యపుస్తకాలన్నీ పంపిణీకి సిద్ధమయ్యాయి. గణితంలో కొన్ని పాఠ్యపుస్తకాలు వచ్చాయి. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. మార్చి నాటికి పాఠశాలలకు... విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలన్నింటినీ మార్చి ఆఖరుకు పాఠశాలలకు చేర్చేందుకు ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు సిలబస్ మారిన దృష్ట్యా ఏప్రిల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించే నాటికి ప్రస్తుతం 9వ తరగతి చదువుతూ 2014-15లో 10వ తరగతికి వచ్చే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారు. వేసవి సెలవుల్లో ఈ పుస్తకాలపై విద్యార్థులు అవగాహన పెంచుకుంటారనేది ప్రభుత్వ భానవ, ఏటా పాఠ్యపుస్తకాల పంపిణీ, మేలో ప్రారంభమవుతుండగా ప్రస్తుతం ఈ నెలాఖరు నుంచే పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠ్యపుస్తకాలను మండలాలకు చేరవేసేందుకు సోమవారం రవాణా టెండర్లను కూడా ఖరారు చేయనున్నాయి. -
సగం పాఠాలయ్యాక శిక్షణా.. .?
=కొత్త పాఠ్య పుస్తకాలపై ఐదు నెలల తర్వాత శిక్షణ తరగతులు =రాజీవ్ విద్యామిషన్ నిర్వాకం =పెదవి విరుస్తున్న ఉపాధ్యాయులు నూజివీడు, న్యూస్లైన్ : నూతన పాఠ్యపుస్తకాలు వచ్చి, పాఠశాలలు ప్రారంభమై ఐదు నెలలు గడిచిన తరువాత వాటిపై ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే దాదాపు సగం పాఠాలు బోధించడం పూర్తయిన తరువాత శిక్షణనిచ్చి ఏం ప్రయోజనమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రణాళిక లేకుండా రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) అధికారులు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులపై ఇటు ఉపాధ్యాయ వర్గాల్లో, అటు తల్లిదండ్రుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో పలు తరగతుల పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి మార్చింది. దీనిలో భాగంగా 4 నుంచి 8వ తరగతి వరకు నూతన పాఠ్యపుస్తకాలను తీసుకొచ్చింది. ఈ పాఠ్యాంశాలపై ఈ నెల 18 నుంచి 20 వరకు ప్రాథమికోన్నత స్థాయిలో 6, 7, 8 తరగతులకు గణితం, సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం బోధించే ఉపాధ్యాయులకు జిల్లా వ్యాప్తంగా శిక్షణనిస్తున్నారు. ఈ పాఠ్యపుస్తకాలలోని పాఠ్యాంశాలపై పాఠశాలల ప్రారంభానికి ముందే శిక్షణనిచ్చి ఉంటే ఎంతో ఉపయోగం ఉండేదని ఉపాధ్యాయ వర్గాలే కాకుండా మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు. పాఠశాలలు తెరిచి ఇప్పటికే ఐదు నెలలు గడిచిన తరువాత, సిలబస్ దాదాపు సగం పూర్తయ్యాక శిక్షణనివ్వడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటనేది ఆర్వీఎం అధికారులకే తెలియాలి. నూతన పాఠ్యపుస్తకాలలో అనేక కొత్త అంశాలను చేర్చారు. ముఖ్యంగా ఆంగ్ల పాఠ్యపుస్తకాలలోని అంశాలు బోధించాలంటే కొంత సంక్లిష్టంగానే ఉందనేది ఉపాధ్యాయుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో పుస్తకాలు విద్యార్థుల చేతికి రాకముందే ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించి ఉంటే విద్యార్థులకు ఉపయోగం కలిగి ఉండేది. అసలే సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా విద్యార్థులకు పనిదినాలు తగ్గిపోవడంతో సెలవు దినాలలో కూడా పాఠశాలలకు వెళ్లాల్సివస్తున్న నేపథ్యంలో మరల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా ఆర్వీఎం అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, తద్వారా ఫలితాలు ఉపయోగకరంగా ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.