Vijaya Lakshmi
-
HYD: జారిపడ్డ మేయర్ విజయలక్ష్మి
సాక్షి,హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్ గద్వాల విజయలక్ష్మికి తృటిలో ప్రమాదం తప్పింది. నగర సుందరీకరణ పనుల్లో భాగంగా నగరంలో సోమవారం(ఫిబ్రవరి 3) పాదయాత్ర చేస్తున్న సందర్భంగా నాగార్జున సర్కిల్ ఫుట్పాత్పై మేయర్ కాలుజారి కిందపడ్డారు.కిందపడ్డ మేయర్ను పక్కనే ఉన్న హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఓదార్చారు.అనంతరం స్వల్ప గాయాలతో మేయర్ తన పాదయాత్రను కొనసాగించారు. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కారు దిగనున్న కడియం, కేకే, అల్లోల
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల వేళ.. భారత రాష్ట్ర సమితి పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో కాంగ్రెస్లో చేరనున్నట్టు ఆ పార్టీ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు ప్రకటించారు. ఎప్పుడు చేరేది అతిత్వరలో వెల్లడిస్తానని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ అపాయింట్మెంట్ ఖరారైన తర్వాత ఆమె సమక్షంలో కాంగ్రెస్లో చేరాలని కేశవరావు భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు వరంగల్ లోక్సభ స్థానం అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించాక కూడా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు టికెట్ దక్కించుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య హఠాత్తుగా బరి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు గురువారం రాత్రి లేఖ రాశారు. కాగా కడియం శ్రీహరి, కావ్య కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. కడియం శ్రీహరి వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కీలక నేతలు వరుసగా పార్టీకి గుడ్బై చెబుతుండటం, చివరకు టికెట్ దక్కించుకున్న వారు సైతం వేరే పార్టీలోకి వెళుతుండటం బీఆర్ఎస్లో కలకలం సృష్టిస్తోంది. కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరడం ఇప్పటికే ఖాయం కాగా.. ఇలా ఇద్దరు నేతలు దాదాపుగా ఒకే సమయంలో తమ కుమార్తెలతో సహా బీఆర్ఎస్ను వీడనుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి పలువురు కీలక నేతల నిష్క్రమణలు కొనసాగుతుండగా.. తాజాగా పార్టీ సెక్రెటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావు (కేకే) కూడా అదే బాట పట్టారు. ‘కాంగ్రెస్ పార్టీ నాకు సొంత ఇల్లు లాంటిది. నేను పుట్టింది, పెరిగింది కాంగ్రెస్లోనే. 53 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ లోనే పని చేశా. ఆ పార్టీలోనే చనిపోవాలనుకుంటున్నా. తీర్థయాత్రలకు వెళ్లినవారు ఎప్పటికైనా ఇంటికే చేరతారు. 84 ఏళ్ల వయసులో నేను కూడా నా సొంత ఇల్లు కాంగ్రెస్లో చేరతా..’ అని కేకే గురువా రం నాడిక్కడ మీడియాకు చెప్పారు. అంతకుముందు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తో కేకే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అర్ధాంతరంగా ముగిసినట్లు సమాచారం కాగా..ఆ తర్వాత బంజారాహిల్స్ నివాసంలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్లో చేరా ‘బీఆర్ఎస్లో నేను పని చేసింది పదేళ్లు మాత్రమే. తెలంగాణ కోసమే బీఆర్ఎస్లో చేరా. కానీ కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది. నేను మొదటి సారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యా. ప్రస్తుతం నేను బీఆర్ఎస్కు ఇంకా రిజైన్ చేయలేదు. నా కూతురు చేరిన రోజే నేను కాంగ్రెస్లో చేరబోవడం లేదు. ఏ రోజు చేరేదీ తేదీ ఖరారు అయిన తర్వాత చెబుతా..’ అని కేకే చెప్పారు. నేను బీఆర్ఎస్లో ఉండి చేసేదేమీ లేదు ‘కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా ఆయనపై గౌరవం ఉంది. బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలు బాగా సహకరించారు. కానీ సుదీర్ఘ కాలం కాంగ్రెస్లో పనిచేశా. పీసీసీ అధ్యక్ష పదవి మొదలు కొని రాజ్యసభ వరకు నాకు కాంగ్రెస్ ఎన్నో అవకా శాలు ఇచ్చింది. ప్రస్తుతం రాజకీయ చరమాంకంలో ఉన్న నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా చేసేదేమీ లేదు. కేసీఆర్కు కూడా ఇదే చెప్పా. బీఆర్ఎస్కు సంబంధించిన అంశాలపై కూడా ఆయనతో మాట్లాడా. కవిత అరెస్టుతో పాటు పార్టీ అంతర్గత అంశాలపైనా చర్చ జరిగింది. కవితను అక్రమంగా అరెస్టు చేశారు. బీఆర్ఎస్లోనే కొనసాగాలని అనుకుంటున్న నా కుమారుడు విప్లవ్ నిర్ణయం మంచిదే..’ అని కేశవరావు అన్నారు. నేను మాత్రం పార్టీ మారను: విప్లవ్కుమార్ పార్టీ మారే విషయంలో తన తండ్రి కేశవరావు, సోదరి విజయలక్ష్మి తీసుకునే నిర్ణయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేకే కుమారుడు విప్లవ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్లో చేరే విషయంపై వారు స్పష్టత ఇచ్చిన తర్వాతే, దానిపై తన అభిప్రా యం వెల్లడిస్తానని చెప్పారు. తాను మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్కు గట్టి మద్దతుదారుడినని, కేసీఆర్ నాయకత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. కేసీఆర్ ప్రభు త్వంలో విప్లవ్కుమార్ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేయడం తెలిసిందే. కేకే నివాసానికి ఇంద్రకరణ్రెడ్డి కేసీఆర్తో భేటీ తర్వాత కేకే బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి కేకేతో భేటీ అయ్యారు. ఇంద్రకరణ్రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా ఇంద్రకరణ్రెడ్డి, అరవింద్రెడ్డితో పాటు కేకే కుమా ర్తె, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఈనెల 30న కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం. మీ కుటుంబానికి ఏం తక్కువ చేశా?: కేసీఆర్ విశ్వసనీయ సమాచారం మేరకు.. కేసీఆర్తో జరిగిన భేటీలో బీఆర్ఎస్లో పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలతో కూడిన ఓ నోట్ను కేకే అందజేశారు. ఈ సందర్భంగానే కేకేతో పాటు విజయలక్ష్మి పార్టీని వీడుతున్నారనే వార్తలు ప్రస్తావనకు వచ్చాయి. దీనిపై కేకే వివరణ ఇస్తూ.. రాజకీయంగా ఇదే తన చివరి ప్రయాణం అని, కాంగ్రెస్లోనే చనిపోతానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ యూ ట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో కేకే వెల్లడించిన అభిప్రాయాలపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పదేళ్లు అధికారం, పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారడాన్ని ప్రజలు గమనిస్తారు. మీ ఆలోచన మానుకోండి. మీ కుటుంబానికి పార్టీ తక్కువేమీ చేయలేదు. మీకున్న రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ సెక్రటరీ జనరల్ పదవితో పాటు రెండు పర్యాయాలు రాజ్యసభకు పంపించా. మీ కుమారుడికి కార్పొరేషన్ పదవి ఇచ్చా. మీరు కోరిన మీదటే పార్టీలో ఎంతోమంది నిబద్ధత కలిగిన వారిని పక్కన పెట్టి మరీ మీ కూతురు విజయలక్ష్మికి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవి ఇచ్చాం. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో పెద్దరికంతో వ్యవహరించాల్సింది పోయి మీడియాలో నాపైనా, పార్టీ నాయకులపైనా విమర్శలు చేయడం సరికాదు..’ అంటూ కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ అర్ధంతరంగా ముగిసిందని సమాచారం. -
ఆ విషయంలో చాలా హర్ట్ అవుతాడు
-
ఫతేనగర్ వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించిన మేయర్ విజయలక్ష్మీ
-
జీహెచ్ఎంసీ చరిత్రలోనే మొదటిసారి.. కౌన్సిల్ సమావేశం రసాభాస
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని అధికారులు బహిష్కరించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, వాటర్ బోర్డు అధికారులు బయటకు వెళ్లిపోయారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే మొదటిసారిగా అధికారులు బాయ్కాట్ చేశారు. వివరాల ప్రకారం.. నగరంలో వర్షాల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర విమర్శలు చేశారు. అలాగే సమావేశాలకు కూడా బీజేపీ కార్పోరేటర్లు వినూత్న వేషధారణతో నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్ల తీరుపై అధికారులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్లు గొడవ చేస్తున్నారంటూ సమావేశాం నుంచి జలమండలి అధికారులు సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో, వారికి మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులు నిలిచి సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. అయితే, గతంలో విపక్ష కార్పొరేటర్లు మాత్రమే సమావేశాలను బహిష్కరించేవారు. తాజాగా అధికారులే సమావేశాలను బాయ్కాట్ చేశారు. కాగా, జీహెచ్ఎంసీ చరిత్రలోనే అధికారులు బాయ్కాట్ చేయడం ఇదే మొదటిసారి. అనంతరం బీజేపీ కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ.. ప్రశ్నలు అడిగతే అధికారుల పారిపోయారని ఎద్దేవాచేశారు. పిల్లలు చనిపోతున్నారని నిరసన తెలిపితే మాపై కేసులు పెడతారా?. అధికారులు మమ్మల్ని కాదు.. మేయర్ను అవమానించారు అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో మేయర్ విజయలక్ష్మీ సీరియస్ అయ్యారు. అధికారులకు సిగ్గులేదా? అని మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఎస్సై, డ్రైవర్ దుర్మరణం.. -
తోడుగా ఉన్న భర్త చనిపోయాడు, చేతికందిన కొడుకు కూడా: బలగం నటి
థియేటర్లోనే కాదు ఓటీటీలోనూ అదరగొడుతోంది బలగం సినిమా. మార్చి 3న థియేటర్లలో రిలీజైన ఈ చిన్న సినిమా పెద్ద విజయం సాధించింది. ఇందులో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపు రావడంతో పాటు పెద్దపెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో కొమురయ్య చెల్లి పోశవ్వ పాత్రను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఓవైపు అన్న చనిపోయాడని ఏడుస్తూనే అందరినీ ఓ కంట కనిపెడుతూ, అవకాశం దొరికినప్పుడల్లా సూటిపోటి మాటలంటూ గొడవలకు కారణమవుతూ ఉంటుంది. ఈ పాత్రలో అద్భుతంగా నటించిన విజయలక్ష్మి తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. 'నేను నాటకాలు వేస్తుంటాను. నంది సహా ఎన్నో అవార్డులు వచ్చాయి. హరికథలు కూడా చెప్పేదాన్ని. నేను చేసిన తొలి చిత్రం బలగం. ఇది యదార్థంగా జరుగుతున్న కథ. నాకు ఈరోజు ఇంతమంచి పేరు రావడానికి కారణం వేణుగారే. ఈ సినిమా సహజంగా రావడానికి ఎంత కష్టపడ్డారనేది నాకు తెలుసు. ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డాం. నా భర్త చనిపోయాక నా పిల్లల పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు కొడుకులు ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకున్నారు. నా చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ సమయంలో అతడి భార్య గర్భవతి. నా జీవితంలో తట్టుకోలేని విషాదమది. అన్ని విధాలుగా తోడుండే భర్త చనిపోవడం, ఆయన మరణించిన నాలుగేళ్లకు చేతికందిన కొడుకు అకస్మాత్తుగా ప్రాణాలు వదలడంతో ఎంతో బాధపడ్డాను. ఆ సంఘటన నుంచి నేనింతవరకు తేరుకోలేకపోతున్నాను' అంటూ ఎమోషనలైంది విజయ లక్ష్మి. -
శుభాల్లో, అశుభాల్లో మేనత్త! అచ్చం ‘బలగం’ సినిమాలో పోచవ్వలాగానే! కరీంనగర్ కోడలు..
ఇప్పుటి సంగతి ఏమోగాని ఒకప్పుడు ప్రతి ఇంట్లో మేనత్తల అజమాయిషీ ఉండేది. శుభాల్లో, అశుభాల్లో మేనత్త వచ్చి దగ్గర ఉండి మంచీ చెడ్డకు నిలిచేది. అనుబంధాల ఆనవాలు చెప్పేది. ‘బలగం’ సినిమా చూసి అందులో మేనత్త పోచవ్వగా నటించిన నటి విజయలక్ష్మిలో అందరూ తమ మేనత్తలను పోల్చుకుంటున్నారు. సురభి ఆర్టిస్టయిన 65 ఏళ్ల విజయలక్ష్మికి ఇదే తొలి సినిమా. ఇంతకాలం గ్రాంథిక సంభాషణలు మాత్రమే పలికిన ఆమె పోచవ్వగా తెలంగాణ నుడికారాన్ని మెరిపించారు. ఆమె గొప్ప హరికథా కళాకారిణి కూడా. విజయలక్ష్మి పరిచయం. ‘తల వెంట్రుకంత అదృష్టమైనా తల చూపాలి కదా’ అన్నారు సురభి విజయలక్ష్మి. 65 ఏళ్లకు ఆమెకు అదృష్టం తల చూపిందనే అనుకోవాలి. సురభి ఆర్టిస్టుగా స్టేజ్ మీద ఎంత పేరున్నా, భాగవత కళాకారిణిగా ఎంత గుర్తింపున్నా ఇప్పుడు ‘బలగం’ సినిమాలో పోచవ్వగా చేసిన పాత్రే ఆమెకు ఎక్కువ పేరు, గుర్తింపు, ఉనికి ఇచ్చింది. పల్లెటూరి పెద్ద వయసు స్త్రీల విసురు, కసురు, మాట విరుపు, ఆర్ద్రత, అన్నింటినీ పోచవ్వ పాత్రలో రక్తి కట్టించడమే కారణం. ఆమె ఉద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ‘మా సురభి పరివారమంతా చాలా సంతోషంగా ఉన్నారు. సినిమా రంగం నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇదంతా చాలా కొత్తగా ఉంది’ అన్నారామె. హైదరాబాద్ చందా నగర్లోని సురభి కాలనీలో నివాసం ఉంటున్న విజయలక్ష్మి ఒక రకంగా రంగస్థలంపైనే పుట్టారు. ఆమె తల్లి ప్రఖ్యాత నటి కమలాదేవి. తండ్రి నాగభూషణం. అయితే ఆరుగురు అక్కచెల్లెళ్లలో విజయలక్ష్మి మాత్రమే నటిగా స్టేజ్ మీద కొనసాగారు. ‘మూడేళ్ల వయసు నుంచే నాటకాల్లో పాత్రలు చేశాను. కృష్ణుడు, లోహితాస్యుడు... వయసు వచ్చాక దేవకి, సావిత్రి, అనసూయ, కాంతామతి... ఈ పాత్రలన్నీ పోషించేదాన్ని. సురభిలో ఏ పాత్రైనా ఎవరైనా చేయాలని రూలు. అందువల్ల మగవేషాలు కూడా వేశాను. కృష్ణుడిగా, బాలనాగమ్మలో మాయల పకీరుగా నటించాను’ అన్నారు విజయలక్ష్మి. కరీంనగర్ కోడలు యుక్త వయసు రాగానే కరీంనగర్కు చెందిన బంధువుల కుర్రాడు కేశవరావుతో వివాహం జరిగింది. అతను కూడా నటుడు. భార్యాభర్తలిద్దరూ కలిసి నాటక సమాజం నడిపారు. అయితే పిల్లల చదువుల కోసం సురభీ నటీనటులు వేరే చోట్లకు వెళ్లిపోతుండటంతో అందరూ కలిసి సంచారం చేసే పరిస్థితి పోయింది. ‘నేను చిన్నప్పటి నుంచి బాగా పాడేదాన్ని. హరికథలంటే ఆసక్తి ఉండేది. హరికథ నేర్చుకుంటే నేనొక్కదాన్నే ప్రదర్శన ఇవ్వొచ్చు. అలా హరికథా కళాకారిణిగా మారాను. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నల్గొండ... ఈ నాలుగు జిల్లాల్లో నేను తిరగని పల్లెటూరు లేదు. మహాభారతాన్ని 18 రోజులు ఒకే ఊరిలో ఉండి చెప్పేదాన్ని. నవరాత్రులొస్తే రాత్రి 8 నుంచి ఒంటి గంట వరకూ నా హరికథ ఉండేది.’ అంటారామె. తెలంగాణ పలుకుబడి ‘బలగం సినిమాలో పోచవ్వ పాత్ర కోసం ఆర్టిస్టులను వెతుక్కుంటూ దర్శకుడు వేణు సురభి కాలనీకి వచ్చారు. అందరూ ఆడిషన్స్ ఇస్తుంటే నేనూ ఇచ్చాను. ఆశ్చర్యంగా నన్నే సెలెక్ట్ చేశారు. ఇంతకుముందు ఒకటి రెండు సినిమాలలో నటించినా నాకంటూ అసలు డైలాగు లేదు. ఇదే తగిన నిడివి ఉన్న మొదటి సినిమా. కాని తెలంగాణ మాండలికం. నేనేమో జీవితమంతా రంగస్థలం మీద, హరికథల్లోనూ గ్రాంథికం మాట్లాడతాను. రోజువారి జీవితంలో కూడా నా భాష గ్రాంథికంలా ఉంటుంది. కాని హరికథలు చెప్పడానికి తెలంగాణ పల్లెలకు వెళ్లినప్పుడు అక్కడి స్త్రీలను గమనించిన అనుభవం నాకు ఉపయోగపడింది. డైలాగులను ఆ స్త్రీలు చెప్పినట్టుగా చెప్పాను. నేను నిజంగా అక్కడి ప్రాంత స్త్రీ అని, ఊరిలోని స్త్రీ చేత ఆ పాత్ర చేయించారని అనుకుంటున్నవాళ్లు చాలామంది ఉన్నారు’ అని నవ్వారామె. సినిమాలో మేనత్తగా ఆమె ముఖ్యపాత్రల మధ్య వైషమ్యాలు తొలిగేలా చేయడంలో కీలకపాత్ర పోషిస్తారు. అందువల్ల చాలామంది విజయలక్ష్మిలో తమ మేనత్తను వెతుక్కున్నారు. ‘మన సమాజంలో మేనత్తకు ఎప్పటికీ ఇంటి ఆడబిడ్డ స్థానం ఉంటుంది. సోదరులు ఆమెను గౌరవించాల్సిందే. వదిన అయినా, మరదలు అయినా ఇంటి ఆడపడుచుకు తల వొంచాల్సిందే. ఆ అధికారం నా పాత్రలో చూపించాను’ అన్నారు విజయలక్ష్మి. సినిమా నటీమణుల్లో శాంతకుమారిని ఇష్టపడే విజయలక్ష్మి ఒక రకంగా కొత్త ప్రయాణం మొదలెట్టారు. ఆమె ఇద్దరు కొడుకులు, కూతురు జీవితాల్లో స్థిరపడ్డారు కనుక నటనకు ఎక్కువ సమయం ఇవ్వాలనుకుంటున్నారామె. పోచవ్వకు ఆల్ ది బెస్ట్. చదవండి: బంగారంలాంటి ఆలోచన -
Vijayalakshmy Subramaniam: సరిగమలే ఔషధాలు
ఆమె సంగీత విద్వాంసురాలు. అంతేకాదు... వైద్యరంగంలో ప్రొఫెసర్. వృత్తిని ప్రవృత్తిని మేళవించారామె. సరిగమలు వైద్యానికి ఔషధాలయ్యాయి. రాగాలు ఆరోగ్యాన్నిచ్చే టానిక్లవుతున్నాయి. తీయని కృతులు షుగర్ లెవెల్స్ తగ్గిస్తున్నాయి. సంగీత లయ బీపీకి గిలిగింత పెడుతోంది. ప్రొఫెసర్ విజయలక్ష్మి సుబ్రహ్మణ్యమ్... కర్ణాటక సంగీతంలో రాగాల మీద పరిశోధన చేశారు. ఆ రాగాలు డిప్రెషన్ను దూరం చేయడానికి ఏ విధంగా దోహదం చేస్తాయనే విషయాలను శాస్త్రబద్ధం చేశారు. సంగీతం అనారోగ్యాన్ని మాయం చేస్తుందనడానికి ప్రత్యక్ష నిదర్శనం తానేనని కూడా చెబుతారామె. ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ప్రమాదానికి గురై చక్రాల కుర్చీలో గడిపిన సమయంలో సంగీత సాధన ద్వారా వేగంగా సాంత్వన పొందిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్గా తన వృత్తిని సంగీతం పట్ల మక్కువతో మేళవించి రాగాలతో చేస్తున్న వైద్యం గురించిన వివరాలను సాక్షితో పంచుకున్నారు. ► తంజావూరు సరస్వతి మహల్ ‘‘నేను పుట్టింది బెంగళూరు, కర్నాటకలో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నాలో సంగీతాభిలాష ఎలా మొదలైందని చెప్పడం కష్టమే. ఎందుకంటే మా ఇల్లే ఒక సంగీత నిలయం. నానమ్మ గాత్రసాధనతోపాటు వయొలిన్ సాధన కూడా చేసేవారు. అమ్మ ఉద్యోగపరంగా సైన్స్ టీచర్, కానీ ఆమె కూడా సంగీతంలో నిష్ణాతురాలు. మా నాన్న శిక్షణ పొందలేదనే కానీ సంగీతపరిజ్ఞానం బాగా ఉండేది. అలా నాకు మా ఇంటి గోడలే సరిగమలు నేర్పించాయి. నాన్న ఉద్యోగరీత్యా దేశంలో అనేకచోట్ల పెరిగాను. గుజరాత్, బరోడాలో ఉన్నప్పుడు సంగీతంతోపాటు భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. సంగీతం నాకు ధారణ శక్తికి బాగా ఉపకరించింది. దాంతో చదువులోనూ ముందుండేదాన్ని. ఎంబీబీఎస్లో సీటు వచ్చిన తర్వాత నా చదువు, అభిరుచి రెండు వేర్వేరు ప్రపంచాలయ్యాయి. రెండింటినీ వేరుగా చూడడం నాకు సాధ్యపడలేదు. నాకు తెలియకుండానే కలగలిపి చూడడం మొదలైంది. సంగీతాన్ని ఒక కళగా సాధన చేయడంతో సరిపెట్టకుండా ఒక శాస్త్రంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. నాదయోగ, రాగచికిత్సల గురించి అప్పుడు తెలిసింది. తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీలో సంగీతంతో వైద్యవిధానాల గురించి గ్రంథాలున్నాయి. మెడిసిన్తోపాటు మ్యూజిక్ని కూడా విపరీతంగా చదివాను. రాష్ట్రంలో మూడవ ర్యాంకుతో కర్ణాటక సంగీతంలో కోర్సు పూర్తి చేశాను. మన దగ్గరున్న పురాతన రాతిశాసనాలతోపాటు విదేశాల్లో ఉన్న మ్యూజిక్ థెరపీలను తెలుసుకున్నాను. వైద్యానికీ– సంగీతానికీ మధ్య ఉన్న, మనం మరిచిపోయిన బంధాన్ని పునఃప్రతిష్ఠ చేయాలనే ఆకాంక్ష కలిగింది. ► మతిమరపు దూరం మ్యూజిక్ థెరపీ అనగానే అందరూ ఇక మందులు మానేయవచ్చని అపోహపడుతుంటారు. అలాగే మందులు కొనసాగించాల్సినప్పుడు ఇక మ్యూజిక్తో సాధించే ప్రయోజనం ఏముంది అని తేలిగ్గా తీసేస్తుంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే... మా దగ్గరకు వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ మూడు వందలకు పైగా డయాబెటిస్తో ఇన్సులిన్ తీసుకునేవాడు. మ్యూజిక్ థెరపీతో ఇన్సులిన్ అవసరం లేకుండా మందులు సరిపోయే దశకు తీసుకురాగలిగాం. నత్తితో ఇబ్బంది పడే పిల్లలు అనర్గళంగా మాట్లాడేటట్లు చేసింది సంగీతం. రెండు రోజులకోసారి డయాలసిస్ చేసుకుంటూ కిడ్నీ దాత కోసం ఎదురు చూస్తున్న పేషెంట్కి ఉపశమనం దొరికింది. ఇక నరాలు, నాడీ సంబంధ సమస్యలను నయం చేసి చూపిస్తున్నాం. ప్రతి పేషెంట్నీ వాళ్ల ఆహారవిహారాలు, ఇతర ఆరోగ్య సమస్యల ఆధారంగా విశ్లేషించి ప్రతి ఒక్కరికీ వారికి మాత్రమే ఉపకరించే సంగీత విధానాన్ని సూచిస్తాం. కొంతమంది కోసం ప్రత్యేకంగా పాటలు రాసి కంపోజ్ చేసి ఇస్తాం. పేషెంట్ ఇష్టాలు, మత విశ్వాసాల ఆధారంగా మ్యూజిక్ థెరపీని డిజైన్ చేస్తున్నాం. అయితే దీనికి ప్రత్యామ్నాయ వైద్యవిధానం అర్హత ఉన్నప్పటికీ ఇంకా ధృవీకరణ రాలేదు. కాంప్లిమెంటరీ మెడిసిన్గానే ఆచరణలో పెడుతున్నాం. వార్ధక్యం కారణంగా అల్జైమర్స్, డిమెన్షియాతో బాధపడుతున్న వాళ్లకు మ్యూజిక్ థెరపీతో అద్భుతాలు సాధించామనే చెప్పాలి. ఓ పెద్దాయన అయితే... భార్య పేరు కూడా మర్చిపోయాడు. నేను స్వయంగా పాట పాడుతూ ఆయన ప్రతిస్పందించే తీరును గమనిస్తున్నాను. ఆశ్చర్యంగా పాటలో తన భార్య పేరు రాగానే చిన్న పిల్లవాడిలాగ ‘యశోదా’ అంటూ పెద్దగా అరిచాడు. మా పరిశోధనాంశాల ఆధారంగా మ్యూజిక్ థెరపీని శాస్త్రబద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను’’ అని చెప్పారు ప్రొఫెసర్ విజయలక్ష్మి. ఇదీ ఆమె మొదలు పెట్టిన ‘ఇల్నెస్ టూ వెల్నెస్ ’ జర్నీ. సరిగమలతో రాగాల వైద్యం త్వరలోనే అందరికీ అందుబాటులోకి రావాలని ఆకాంక్షిద్దాం. రాగాల చికిత్స సంగీతం ఆరోగ్యప్రదాయినిగా అందరికీ అందుబాటులోకి తేవాలనే ఆకాంక్షలున్న వాళ్లందరం ఇండియన్ మ్యూజిక్ థెరపీ అసోసియేషన్ (ఐఎమ్టీఏ)గా సంఘటితమయ్యాం. ఇలాంటి సమూహాలు ఇంకా ఉన్నాయి. కానీ మనదేశంలో మ్యూజిక్ థెరపీ శాస్త్రబద్ధంగా, ఒక వ్యవస్థీకృతమైన అధీకృత సంస్థ ఏదీ లేదు. ఆ లోపాన్ని భర్తీ చేయడానికి ఇటీవల మంగళూరులో మా ఎనెపోయా మెడికల్ యూనివర్సిటీలో ఆన్లైన్ కోర్సు ప్రారంభించాం. ఇది డాక్టర్ల కోసం మాత్రమేకాదు, వైద్యరంగంలో పని చేసే అందరూ ఈ కోర్సు చేయవచ్చు. ఇక నా ప్రయత్నంలో స్పెషల్ చిల్డ్రన్కి మ్యూజిక్ థెరపీ కోర్సు, డయాబెటిస్, హైపర్టెన్షన్, కిడ్నీ ఫెయిలయ్యి డయాలసిస్తో రోజులు గడుపుతున్న పేషెంట్లకు మెరుగైన ఫలితాన్ని చూశాను. – ప్రొ‘‘ విజయలక్ష్మి సుబ్రమణ్యమ్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఓటోరైనోలారింగాలజీ, ఎనెపోయా మెడికల్ కాలేజ్, మంగళూరు, కర్ణాటక – జనరల్ సెక్రటరీ, ఐఎమ్టీఏ – వాకా మంజులారెడ్డి. -
ప్రేమ కోసం ప్రేమగా
ధనం వృద్ధి ΄పొందటానికి కొంత సమయం పడుతుంది. విత్తనాన్ని భూమిలో నాటితే ఫలం చేతికి అందటానికి సమయం పడుతుంది, కానీ క్షణంలో ఫలితాన్ని అందజేసేది ప్రేమ ఒక్కటే. ప్రేమతో కూడిన ఒక్క మాట, ఒక చర్య అద్భుతాలను సృష్టిస్తుంది. ఈ ప్రేమకు వయసుతో పనిలేదు. రక్తసంబంధం ఉండాలని నియమం లేదు. కుల మతాల ప్రసక్తే లేదు.మరో గొప్ప విషయం ఏమిటీ అంటే ఇచ్చేవారికీ, పుచ్చుకునే వారికీ సంతోషం కలిగించే శక్తి కేవలం ప్రేమకు మాత్రమే ఉంది. ఒక్కసారి ప్రేమ గొప్పతనం అర్థం అయ్యాక, ప్రేమను పంచటంలోని మాధుర్యం అనుభవం అయిన తరువాత కఠినంగా కఠోరంగా ఉండటం సాధ్యం కాదు. పరిస్థితుల దృష్ట్యా కొన్నిసార్లు కావాలని కఠినంగా ఉండాలని ప్రయత్నించినా రాతి అడుగున దాగిన నీటి బుగ్గలాగా పెల్లుబికి వస్తుంది ప్రేమ. మట్టితో కూడిన చెరువు నీటికుండలో చిన్న పటిక ముక్క వేస్తే మట్టి విడిపో యి స్వచ్ఛమైన నీరు తయారవుతుంది. అనేక సమస్యలు, ఒత్తిడులతో మనశ్శాంతికి దూరం అయిపో తున్న నేటి సమాజంలో శాంతిని చేకూర్చగల ఏకైక మార్గం ప్రేమ. కేవలం యువతీ యువకుల మధ్య కలిగేదే ప్రేమ అనే భ్రమ నుంచి బయటపడితే ప్రతిజీవి తోటి వారి అందరిపట్ల పశుపక్ష్యాదుల పట్ల, ప్రకృతి పట్ల చూపించేది అంతా ప్రేమే. ఒక కర్మాగారం చాలా చిక్కు సమస్యలలో మునిగి పో యింది. కార్మికుల మధ్య తగులాటలు, శత్రుత్వాలు. అప్పటివరకు ఉన్న అధికారి ఆ ఒత్తిడిని తట్టుకోలేక పదవికి రాజీనామా చేసి వెళ్లిపో యాడు. అతని స్థానంలో మరొక అధికారిని నియమించారు. కొద్దికాలంలోనే కర్మాగారం పరిస్థితి చక్కబడింది. మునుపటి శత్రుత్వం నిండిన వాతావరణం మారిపో యి చక్కని వాతావరణం ఏర్పడింది. పైవారు కొత్త అధికారిని ప్రశంసలతో ముంచెత్తారు. ఇటువంటి మార్పు కోసం ఆ కొత్త అధికారి ఉపయోగించిన ఏకైక ఆయుధం ప్రేమ. ఉదయం రాగానే అందరినీ ఒక్కొక్కరినీ పిలిచి ప్రేమగా పలకరించేవాడు. వారి యోగక్షేమాలను విచారించేవాడు. మీకు ఏ కష్టం వచ్చినా చెప్పండి నేను ఉన్నాను. మనందరం ఒక కుటుంబం అని ప్రేమగా మాట్లాడేవాడు. ఆ చిన్న పని వల్ల ఆయన అందరికీ ఆత్మీయుడిగా మారిపో యాడు.ఆయన సంతోషం కోసం అందరూ గొడవలు మానేసి పరస్పరం స్నేహంగా ఉండటంప్రా రంభించారు. మనం ప్రస్తుతం నివసిస్తున్న ఈ సమాజంలోఅన్నీ వుండి కూడా కాస్తంత ప్రేమ కోసం అలమటించే వారు ఎందరో ఉన్నారు. అయిన వారందరూ దూర్రప్రాం తాలకు తరలిపో గా ఒంటరితనంతో బాధపడుతూ కాస్తంత ఆప్యాయత కోసం, తపించి పో యే వారికి ఊరట కలిగేలా మనకు ఉన్న సమయంలో కొద్ది సమయం ఇటువంటి వారికోసం కేటాయించి ప్రేమతో నాలుగు మాటలు మాట్లాడితే వారికి ఎంతో ఉత్సాహం కలుగుతుంది. జీవితం పట్ల ఆసక్తి నశించిపో యి జీవించే వారికి జీవితం పట్ల ఆసక్తి కలుగుతుంది. అంతేకాదు, ప్రేమను చవిచూసిన వారు ఇతరులకు ప్రేమను పంచగలుగుతారు. మన దైనందిన జీవితంలో మనకు సేవలందించే వారిపట్ల ప్రేమతో నాలుగు మంచి మాటలు మాట్లాడితే, వారంతా మనకు మరింత దగ్గరవుతారు. వారితోపాటు మన జీవితం కూడా ఆనందమయంగా మారుతుంది. – పొత్తూరి విజయలక్ష్మి -
భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన అంబర్పేట పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై మల్లేష్ తెలిపిన మేరకు.. శ్రీనివాసులు, టి.విజయలక్ష్మి(35)లు గోల్నాక తిరుమలనగర్లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ చీరలు విక్రయిస్తుంటాడు. ఇంట్లో కూడా టైలర్ పని చేస్తుంటాడు. చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్వేర్ ఇంజనీర్) ఇందులో భాగంగా శనివారం భార్య కోసం జాకెట్ను కుట్టాడు. తది నచ్చలేదని భార్య చెప్పింది. దీంతో శ్రీనివాస్ బ్లౌజ్ కుట్లు విప్పి నువ్వే నచ్చినట్టు కుట్టుకో అని చెప్పాడు. దీంతో మనస్థాపానికి చెందిన విజయలక్ష్మి బెడ్రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది. యధావిధిగా శ్రీనివాసులు తన పనిలో నిమగ్నమయ్యాడు. పాఠశాలకు వెళ్లిన పిల్లలు మధ్యాహ్నం వచ్చి తలుపు తట్టగా తల్లి స్పందించలేదు. బలవంతంగా తలుపులు తీసి చూడగా విజయలక్ష్మి ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అద్దె చెల్లించని నటి.. అర్ధరాత్రి నడిరోడ్డుపైకి పడేశారు
సాక్షి, చెన్నై: నటి విజయలక్ష్మిని సినిమా కష్టాలు వీడటం లేదు. అద్దె చెల్లించలేదంటూ ప్లాట్ మేనేజర్ ఆమె సామాన్లు బయట పడేశాడు. రోడ్డున పడ్డ ఆమె అర్ధరాత్రి వేళ చేసిన హంగామాతో చివరకు పోలీసులు ప్రత్యామ్నాయం కల్పించారు. నామ్ తమిళర్ కట్చి నేత, నటుడు, దర్శకుడు సీమాన్ తనను మోసం చేశారంటూ గతంలో నటి విజయలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆత్మహత్యాయత్నాలు చేయడం వంటి పరిణామాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సీమాన్కు వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో నామ్ తమిళర్ కార్యకర్తలు పలుమార్లు ఆమెకు బెదిరింపులు కూడా ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు అంటూ సినిమా కష్టాలు విజయలక్ష్మిని వీడటం లేదు. చదవండి: (కారులో నగ్నంగా వీడియో తీసి వేధిస్తున్నాడు!) సామాన్లు బయట పడేశారు! టీనగర్ హబీబుల్లా రోడ్డులోని ఓ సర్వీసు అపార్ట్మెంట్లో విజయలక్ష్మి, ఆమె సోదరి ఉన్నారు. ఆమె సోదరి అనారోగ్యం పాలు కావడంతో కొద్ది రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. శనివారం రాత్రి డిశ్చార్జ్ కావడంతో ఇంటికి చేరుకున్న ఆమెకు షాక్ తప్పలేదు. తమ ప్లాట్లో మరో వ్యక్తి ఉండడంతో మేనేజర్ విఘ్నేశ్వరన్ను సంప్రదించారు. మూడు నెలలుగా అద్దె చెల్లించని దృష్ట్యా సామన్లు మరో గదిలో పెట్టినట్టు చెప్పారు. దీంతో ఆందోళన చెందిన విజయలక్ష్మి, మీడియాకు సమాచారం అందించారు. తన సామాన్లు బయట పడేశారని, రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఈ ప్లాట్లో రాజకీయ నేత హరినాడర్ అన్నయ్య తీసుకొచ్చి ఉంచారని, ఆయన్ను సంప్రదించకుండా తనను రోడ్డున పడేశారని కన్నీటి పర్యంతం అయ్యారు. కాసేపు తన దైన శైలిలో ఆమె హంగామా సృష్టించారు. తామేమీ ఆమె సామాన్లు బయట పడేయలేదని, ఓ గదిలో ఉంచామని, తమ ప్లాట్ సిబ్బంది శివాను చెప్పుతో కొట్టడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మేనేజర్ విఘ్నేశ్వరన్ పేర్కొన్నారు. హరినాడర్కు ఈ ప్లాట్కు సంబంధం లేదని, ఆమెను జావెద్ అనే వ్యక్తి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ ఈ వ్యవహారం ముదరడంతో పాటు సీమాన్ నువ్వయినా ఆదుకో అంటూ విజయలక్ష్మి కన్నీటి పర్యంతం కావడంతో చివరకు పోలీసులు రంగంలోకి దిగారు. తేనాంపేట పోలీసులు విచారించి విజయలక్ష్మికి ప్రత్యామ్నాయం కల్పించారు. అయితే ఇది తాత్కాలికం కావడం గమనార్హం. ఇన్నాళ్లు సీమాన్ను నోటికి వచ్చినట్టు దుమ్మెత్తి పోసిన విజయలక్ష్మి తాజాగా తనను ఆదుకోవాలని కన్నీటి పర్యంతం కావడం గమనార్హం. -
నకిలీ ఐఏఎస్ అరెస్ట్
హనుమాన్జంక్షన్ రూరల్ (గన్నవరం): నకిలీ ఐఏఎస్ అధికారి అవతారమెత్తి వసూళ్లకు పాల్పడుతున్న పెద్దాడ విజయలక్ష్మి అనే ఓ కిలాడీ లేడి కృష్ణాజిల్లా, హనుమాన్జంక్షన్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సంస్కరణల కమిటీ చైర్మన్నంటూ వసూళ్లు చేయబోయి అడ్డంగా బుక్కైంది. ఈ కేసు వివరాలను నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు సోమవారం విలేకరులకు వెల్లడించారు. రిటైర్డ్ ఐఏఎస్ సుజాతరావుగా నమ్మించి... గుంటూరు జిల్లా మంగళగిరిలోని మన్యం వారి వీధికి చెందిన పెద్దాడ విజయలక్ష్మి... పద్మభూషణ్ కేఎల్ రావు కుమార్తె, సీనియర్ ఐఏఎస్ అధికారి కె.సుజాతరావు పేరుతో పలువురిని నమ్మించి కేఎల్ రావు విగ్రహ ఏర్పాటు పేరుతో వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులకు ఎలా చిక్కిందంటే.. హనుమాన్జంక్షన్లోని వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యులు డాక్టర్ దుట్టా రామచంద్రరావుకు చెందిన సీతామహాలక్ష్మి నర్సింగ్ హోంకు ఈ నెల 8వ తేదీన ఓ కారులో వచ్చిన విజయలక్ష్మి తాను ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సంస్కరణల కమిటీ చైర్మన్ సుజాతరావునని, తాను తిరుపతి వెళుతున్నానని, పూజల కోసం రూ.3,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అనుమానించిన రామచంద్రరావు తనయుడు రవిశంకర్ నేరుగా కె.సుజాతరావుకు ఫోన్ చేయగా, తాను హైదరాబాద్లోనే ఉన్నానని ఆమె చెప్పారు. నకిలీ అధికారి ఫోటోలు తీసేందుకు యత్నించటంతో వెంటనే పరారయ్యారు. ఆ తర్వాత ఎస్పీ రవీంద్రబాబుకు కె.సుజాతరావు ఫోన్ చేసి నకిలీ అధికారిని పట్టుకోవాలని కోరారు. రవిశంకర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం రాత్రి ఆమెను విజయవాడలో పట్టుకున్నారు. టీడీపీతో కిలాడీ లేడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని విచారణలో వెల్లడించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో దిగిన ఫోటో ఆమె వద్ద పోలీసులకు లభించింది. -
కడపలో విజయలక్ష్మిగారిల్లు...
శరన్నవరాత్రులకు చాలామంది ఇళ్లలో అమ్మవార్లతో పాటు బొమ్మలు కూడా కొలువు తీరడం మామూలే. ఆ ‘బొమ్మల సభ’లోకి చుట్టుపక్కలవాళ్లకు, చుట్టాలకూ సాదర ఆహ్వానం ఉంటుంది. దేవుళ్లు, రాక్షసులు, వాగ్గేయకారులు, మహానాయకులు.. ఎందరెందరో సభలో కొలువై కనిపిస్తారు. జ్ఞానకాంతులను విరజిమ్ముతూ, జీవన వేదాలను సందేశపరిచే ఇలాంటి బొమ్మల కొలువులలో కడపలోని విజయలక్ష్మిగారింటి కొలువు గురించి మరీ మరీ చెప్పుకోవాలి. వీలు చేసుకుని చూసి రావాలి. కడప జిల్లా కడప పట్టణంలోని ప్రకాష్నగర్ క్లాసిక్ టవర్స్లో నివాసం ఉంటున్నారు విజయలక్ష్మి. ఈ ఏడాది శరన్నవరాత్రులకు ఆమె తన ఇంట్లో తొమ్మిది మెట్ల మీద దేవతల బొమ్మల్ని కొలువుదీర్చారు. వాగ్గేయకారులనూ గళం విప్పించి కూర్చోబెట్టారు. ఒక మూల ‘వివాహ భోజనంబు’ అంటూ ఘటోత్కచుడు లడ్లు తింటుంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఏడుకొండలవాడు, గోశాల.. ఒకటేమిటి, ఒకరేమిటి! అనేక ఘట్టాలను, ఘటికులను సృష్టికి ప్రతి సృష్టి చేశారు విజయలక్ష్మి కృష్ణయ్యర్, ఆమె భర్త చంద్రశేఖరరావు. దసరా పండుగ అంటే వీరికి బొమ్మల ప్రతిష్ఠే. విజయలక్ష్మి ఎం.కామ్ చదివారు. ఇద్దరూ చరిత్రకారులు. పదకొండేళ్లుగా ఇంట్లో అందమైన బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. ‘‘చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ బొమ్మల కొలువు పెట్టేవారు. వివాహమైన కొన్ని సంవత్సరాల తరవాత కడపలో మా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టాలనే ఆలోచన కలిగింది. వెంటనే బొమ్మలు సేకరించడం ప్రారంభించాను. కంచి, చెన్నై, మధురై ప్రాంతాల నుంచి చాలా బొమ్మలు తెప్పించాను’’ అంటూ తాను సేకరించిన బొమ్మల గురించి చెప్పారు విజయలక్ష్మి. యాత్రాస్థలాలకు వెళ్లినప్పుడు అక్కడ తన మనసుకి నచ్చిన బొమ్మలు తెచ్చుకోవటంతో పాటు.. బంధువులు, స్నేహితులు ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారితో కూడా బొమ్మలు తెప్పించుకునేవారు. అలా చాలా బొమ్మలు సమకూర్చుకోగలిగారు విజయలక్ష్మి దంపతులు. ‘‘బొమ్మల కొలువుకి అన్నీ మట్టితో చేసిన బొమ్మలే కొంటాను. ప్లాస్టిక్వి, ఫైబర్వి నాకు ఇష్టం లేదు’’ అని చెప్పారు విజయలక్ష్మి.విజయలక్ష్మి ఐదు వరుసలతో ప్రారంభించిన ఈ బొమ్మల కొలువు ఇప్పుడు తొమ్మిది వరుసలకు చేరింది. అరుణాచల గిరి ప్రదక్షిణ, సప్తాశ్వ రథారూఢుడైన సూర్యభగవానుడు, రావణ దర్బారు, ఆంజనేయస్వామి తోక మీద కూర్చోవడం, స్తంభం పగల గొట్టుకుని వచ్చిన నరసింహావతారం, కామాక్షి వ్రతం చేసే మహిళలు, సత్యనారాయణ వ్రతం, పెళ్లి తంతుతో కూడిన బొమ్మలు, కృష్ణుడు గోపికలు, బృందావనం, గుహుడు... ఇలా రకరకాల బొమ్మలను కొని అమర్చారు విజయలక్ష్మి. ‘‘బొమ్మల కొలువు కేవలం కాలక్షేపం కోసం కాదు, ఇతరులకు విజ్ఞానాన్ని పంచడం కోసం కూడా. మా ఇంటికి వచ్చిన పిల్లలందరికీ ఈ బొమ్మలకు సంబంధించిన కథలు చెబుతాం. పిల్లలు ఆసక్తి చూపుతుండటంతో మాకు మరింత ఉత్సాహంగా ఉంటోంది. భావితరాలకు నాకు తోచినది చెప్పాలనేది కూడా నా ఆకాంక్ష’’ అన్నారు విజయలక్ష్మి. ‘‘ఈ పది రోజులు మా అపార్ట్మెంట్ అంతా సందడిసందడిగా ఉంటుంది. పిల్లలే కాకుండా పెద్ద వాళ్లు కూడా వస్తారు. ఉదయాన్నే ప్రసాదం చేసి ఇంటికి వచ్చినవారికి పెడతాను. సాయంత్రం వాయనాలు ఇస్తాను’’ అని ఆమె తెలిపారు. బొమ్మలను అందంగా అమర్చడం చాలా కష్టంతో కూడిన పని. అయితే అందరూ వచ్చి ప్రశంసిస్తూంటే కష్టం మరచిపోతామంటారు విజయలక్ష్మి. ‘‘పది రోజులు పూర్తయ్యాక బొమ్మలను తీసేటప్పుడు మనసుకి కష్టంగా ఉంటుంది. కాని తప్పదు కదా, బొమ్మలను తీసి ముందుగా పేపర్లో చుట్టి, ఆ పైన గడ్డితో చుట్టి, వాటిని అట్టపెట్టెలలో భద్రపరుస్తాం’’ అని ఆమె చెప్పారు. ‘మరపొచ్చి’ తప్పనిసరి తమిళనాడు సంప్రదాయం ప్రకారం అతిథులు ఒక కొత్త బొమ్మ తెచ్చి, బొమ్మల కొలువు పెట్టిన వారికి ఇస్తారు. అలా ఇంట్లో బొమ్మల సంఖ్య పెరుగుతుంది. కానీ ఇక్కడ అటువంటి సంప్రదాయం లేదు. అన్నీ నేను కొన్న బొమ్మలే. అరేంజ్మెంట్ ప్రతి సంవత్సరం మారుస్తాను. ‘మరపాచ్చి’ అని చెక్క బొమ్మలు ఉంటాయి. అవి బొమ్మల కొలువులో తప్పనిసరి. ఈ బొమ్మలను పది రోజులు ఉంచి పదకొండో నాడు తీసేస్తాం. నవమి రోజున బొమ్మలను పడుకోబెడతాం. విజయదశమి రోజున నిలబెట్టి, ఆ మరుసటి రోజున తీసేస్తాం. బొమ్మల కొలువు తత్త్వగుణానికి ప్రతీక.– విజయలక్ష్మి – వైజయంతి పురాణపండ -
గడ్డినీ తినేశారు..
సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యుల అక్రమాల చిట్టాలో పశువులు తినే గడ్డీ చేరిపోయింది. రైతులకు దక్కాల్సిన రాయితీలను అడ్డదారిలో ఆయన కుమార్తె కాజేసిన చిల్లర వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కోడెల శివప్రసాద్ కుమార్తెకు ఔషధాల తయారీ కంపెనీతోపాటు సాయికృప అనే ఓ సంస్థ ఉంది. కరవు కాలంలో పశువులకు సైలేజీ (మాగుడు) గడ్డి పంపిణీ చేయడం ఈ కంపెనీ ఉద్దేశాలలో ఒకటి. పచ్చి గడ్డిని కోసి శుద్ధి చేసి కార్బోహైడ్రేట్లను సేంద్రియ ఆమ్లాలుగా మార్పు చేసి పోషక విలువలకు ఎటువంటి నష్టం లేకుండా తిరిగి మేతగా ఉపయోగిస్తారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఈ సంస్థ సైలేజీ గడ్డి పంపిణీకి పశు సంవర్థక శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట, నకరికల్లు, రొంపిచర్ల తదితర ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాలోని కొన్ని గ్రామాలకు గడ్డి సరఫరా చేసే బాధ్యత స్వీకరించి నిధులు కాజేసేందుకు పథక రచన చేసింది. భారీ ఇండెంట్తో ఖజానాకు చిల్లు నిబంధల ప్రకారం ఒక్కో గ్రామంలో 5 ఎకరాల్లో సైలేజీ గడ్డి పెంపకానికి తొలుత అనుమతి ఇచ్చినా, ఆ తర్వాత ఈ నిబంధనను మార్చేస్తూ పశు సంవర్థక శాఖ డైరెక్టర్ సోమశేఖర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ గడ్డి పెంపకానికి ఒప్పందం కుదుర్చుకున్న రైతులకు పశు సంవర్థక శాఖ ఎకరానికి రూ.10 వేలు కౌలు ఇస్తుంది. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం కూడా రూ.11 నుంచి 12 వేల వరకు కరవు పనుల కింద ఇచ్చేది. పంపిణీ కంపెనీలు సైలేజీ యంత్రం ద్వారా 50 కిలోల నుంచి గరిష్టంగా 400 కిలోల వరకు గాలి చొరబడడానికి వీలు లేకుండా గడ్డిని చుట్ట చుట్టి మోపు (బేల్స్)గా తయారు చేస్తాయి. ఈ గడ్డికి కిలో రూ.6.80 చొప్పున (రవాణా, లోడింగ్, అన్లోడింగ్ కలుపుకుంటే కేజీ రూ.9 నుంచి రూ.11 వరకు) ప్రభుత్వం పశు సంవర్థక శాఖతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కంపెనీలకు ఇస్తుంది. ఇందులో లబ్ధిదారుడు భరించాల్సింది కిలో గడ్డికి రూ.2 మాత్రమే. ఈ నేపథ్యంలో అప్పట్లో గుంటూరు జిల్లా జేడీ రజనీ కుమార్, డైరెక్టర్ సోమశేఖర రావు సత్తెనపల్లి నియోజకవర్గానికి 200 టన్నులతో ఇండెంట్ ప్రారంభించి 500, 1000, 1500 టన్నులకు పెంచి కోడెల కుమార్తె కంపెనీ సాయికృపకు ఇచ్చారు. ఒక్క 2017–18లోనే ఈ సంస్థ 20 వేల టన్నుల గడ్డిని రైతులకు పంపిణీ చేసినట్టు లెక్కలు చూపి కోట్లాది రూపాయలు కాజేసినట్టు తేలింది. తమకింకా 2,800 టన్నులకు బిల్లులు రావాల్సి ఉందని పశు సంవర్థక శాఖకు లేఖ రాయడం విజిలెన్స్ విభాగం దృష్టికి రావడంతో విషయం బయటకు పొక్కింది. లబ్ధిదారు నుంచి కిలో గడ్డికి రూ.2 చొప్పున వసూలు చేయాల్సిన మొత్తాన్ని కోడెల ఆయా గ్రామాల్లోని అనుచరులతో కట్టించి.. ఆ గడ్డి రవాణా, లోడింగ్, అన్లోడింగ్ కూడా వారే చేసినట్లు రాతకోతలు పూర్తి చేసే వారని సమాచారం. -
కోడెల బండారం బట్టబయలు
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అధికారం అండతో ఇన్నాళ్లూ సాగించిన దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ వసూళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే చూపించాలంటూ కోడెల సవాలు విసిరి రెండు రోజులు గడవకముందే రంజీ క్రికెట్ క్రీడాకారుడిపై దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మిని ఆదేశాలతో కోడెల శివప్రసాదరావుతోపాటు ఆయన కుమారుడు శివరాంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో తన కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి సాగించిన అరాచకాలు, అక్రమ వసూళ్లకు కోడెల శివప్రసాదరావు అండగా నిలిచినట్లు మరోమారు తేటతెల్లమైంది. కోడెల కుమారుడు, కుమార్తెపై గతంలో నమోదైన కేసుల్లో శివప్రసాదరావును సైతం నిందితుడిగానే చేర్చాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. దౌర్జన్యాలను ప్రశ్నిస్తే దాడులే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోడెల శివరాం, విజయలక్ష్మి చెలరేగిపోయారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో వారు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అప్పట్లో రాజ్యాంగబద్ధమైన పదవిలో కోడెల శివప్రసాదరావు తన కుమారుడు, కుమార్తెకు సంపూర్ణంగా సహకరించారు. వారి ఇలాకాలో ల్యాండ్ కన్వర్షన్ జరగాలన్నా, అపార్టుమెంట్ నిర్మాణాలకు అనుమతులు రావాలన్నా కోడెల ట్యాక్స్ (కే ట్యాక్స్) చెల్లించాల్సిందే. చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకూ ఎవరినీ వదల్లేదు. దౌర్జన్యాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగేవారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి, బాధితులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేసేవారు. కోడెల కుటుంబంపై విచారణకు ‘సిట్’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కోడెల కుటుంబం వల్ల నష్టపోయిన వారంతా ధైర్యంగా ముందుకొస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై గళం విప్పుతున్నారు. నేరుగా పోలీసు స్టేషన్లకు వెళ్లి, కోడెల కుటుంబంపై ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే నరసరావుపేటలో కోడెల కుమారుడు, కుమార్తెలపై దాదాపు 10 కేసులు నమోదు కావడం గమనార్హం. కోడెల కుటుంబం చేసిన అన్యాయాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడితే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని బాధితులు చెబుతున్నారు. కోడెల కుటుంబంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలని పోలీసు ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. రంజీ క్రికెటర్ నుంచి రూ.15 లక్షలు వసూలు నరసరావుపేట టౌన్: స్పోర్ట్స్ కోటాలో రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షల వసూలు చేసిన కోడెల శివరాం ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశాడని ఆంధ్ర రంజీ జట్టు క్రీడాకారుడు బుడుమూరు నాగరాజు శనివారం గుంటూరు జిల్లా నరసరావుపేట డీఎస్పీ రామవర్మకు ఫిర్యాదు చేశాడు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి బుడుమూరు నాగరాజు ఆంధ్ర రంజీ జట్టు తరఫున ఐదేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. రెండేళ్ల క్రితం విజయవాడకు చెందిన భరత్చంద్ర ద్వారా నాగరాజుకు కోడెల శివరాం పరిచయమయ్యాడు. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఏఎల్పీ ఉద్యోగం ఇప్పిస్తానని శివరాం నమ్మబలికాడు. దాంతో నాగరాజు అతడికి 2018 ఫిబ్రవరి 27న రూ.15 లక్షలు సమర్పించుకున్నాడు. నాగరాజు నుంచి డబ్బులు తీసుకున్నట్టు ఓ బాండ్, ఉద్యోగ నియామక ధ్రువపత్రాలు ఇచ్చి మరుసటి రోజు కాన్పూర్కు వెళ్లమని శివరాం చెపాడు. శివరాం చెప్పినట్టే నాగరాజు ఉద్యోగ నియామక పత్రాలు తీసుకుని మరుసటి రోజు కాన్పూర్కు వెళ్లాడు. అక్కడ శివరాంకు చెందిన ఓ వ్యక్తి నాగరాజును కలిసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు భర్తీ చేసేప్పుడు నీకు కబురు చేస్తామని చెప్పాడు. దీంతో నాగరాజు వెనక్కి వచ్చేశాడు. కోడెల కుటుంబంపై ఇటీవల వరుసగా నమోదవుతున్న కేసులు చూసి తాను కూడా మోసపోయానని నాగరాజు నిర్ధారించుకున్నాడు. కోడెల శివప్రసాదరావుకు ఫోన్లో జరిగిన విషయాన్ని వివరించగా డబ్బులు తిరిగి ఇప్పిస్తానని ఆయన చెప్పడంతో ఈ నెల 2వ తేదీన నాగరాజు నరసరావుపేటలోని కోడెల నివాసానికి వెళ్లాడు. అక్కడ నాగరాజుపై కోడెల అనుచరులు దాడి చేశారు. బలవంతంగా బాండ్ పేపరు లాక్కొని చించేశారు. తాను పోలీసులను ఆశ్రయిస్తానని నాగరాజు చెప్పడంతో శుక్రవారం డబ్బులు తిరిగి ఇస్తానని అతడిని నరసరావుపేటకు రప్పించారు. గుంటూరులోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దగ్గరకు వెళితే డబ్బులు ఇస్తారని నాగరాజుకు చెప్పారు. గుంటూరుకు వచ్చి కోడెలకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో నాగరాజు చివరకు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నరసరావుపేట డీఎస్పీని కలిసి, తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. శివప్రసాదరావు, శివరాంపై కేసు నమోదు బాధితుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుతో కోడెల శివప్రసాదరావు, కోడెల శివరాంలపై చీటింగ్, ఫోర్జరీ డాక్యుమెంట్ తయారీ, సెక్షన్ 420, 468, 472, 477, 387, రెడ్ విత్ 34 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట టూటౌన్ సీఐ అళహరి శ్రీనివాసరావు తెలిపారు. -
కోడెల కుమార్తెపై మరో కేసు
సాక్షి, గుంటూరు : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మీపై మరో కేసు నమోదైంది. నరసరావుపేటలో ఓ లేఔట్ అనుమతి కోసం రూ. 15 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు దిగారని బాధితుడు, రియల ఎస్టేట్ వ్యాపారి కోటిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. మొదటగా రూ. 10 లక్షలకు సెటిల్మెంట్ అయిందని, మళ్లీ ఇప్పుడు మిగతా ఐదు లక్షలు కూడా ఇవ్వాలని విజయలక్ష్మీ బెదిరిస్తున్నారని కోటిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా విజయలక్ష్మీపై గతంలో కూడా ఒక కేసు నమోదైంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. భూ యజమానులను బెదిరించి రూ.15 లక్షల ‘కే’ ట్యాక్స్ వసూలు చేశారు. మరో రూ.5 లక్షల కోసం వేధింపులకు దిగడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. (చదవండి : కోడెల ట్యాక్స్ వెనక్కి ఇప్పించండి) -
కోడెల కుమార్తెపై ఫిర్యాదు
-
కోడెల కుమార్తెపై కేసు
నరసరావుపేట టౌన్: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం సాగించిన అరాచక పర్వం మరొకటి వెలుగు చూసింది. సోదరుడిని మించిన సోదరిగా కోడెల కుమార్తె అవినీతి వ్యవహారం బట్టబయలైంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని డాక్టర్ పూనాటి విజయలక్ష్మి విలువైన భూమి కబ్జాకు అనుచరులతో కలసి ప్రయత్నం చేశారు. భూ యజమానులను బెదిరించి రూ.15 లక్షల ‘కే’ ట్యాక్స్ వసూలు చేశారు. మరో రూ.5 లక్షల కోసం వేధింపులకు దిగడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని రామిరెడ్డిపేటకు చెందిన అర్వపల్లి పద్మావతికి కేసానుపల్లి వద్ద ఎకరం పొలం ఉంది. ఆ భూమిని 2002లో రావిపాడుకి చెందిన పూదోట మారయ్య వద్ద కొనుగోలు చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విలువైన ఆస్తులు, అమాయకుల భూములపై కోడెల కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి కన్నేసి.. లేని వివాదాలను సృష్టించి ‘కే’ ట్యాక్స్ వసూలు చేశారు. కేసానుపల్లిలో రోడ్డు వెంట పద్మావతికి ఉన్న విలువైన ఎకరా భూమిపై కోడెల కుమార్తె విజయలక్ష్మి కన్నుపడింది. చదవండి: (కోడెల తనయుడు శివరామ్పై కేసు నమోదు) రెండేళ్ల కిందట ఆమె ఆంతరంగికుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, ముఖ్య అనుచరుడు కళ్యాణం రాంబాబు ఆ పొలం వద్దకు వెళ్లి భూ యజమానులను బెదిరించారు. ముందుగానే సృష్టించిన నకిలీ పత్రాలను చూపించి ఆ పొలాన్ని కోడెల కుమార్తె విజయలక్ష్మి కొనుగోలు చేసిందని, మరోమారు భూమి వద్దకు వస్తే హతమారుస్తామని బెదిరించారు. విజయలక్ష్మి వద్దకు వెళ్లి ముడుపులు (కే ట్యాక్స్) చెల్లించి వ్యవహారాన్ని చక్కదిద్దుకోవాలని, లేకుంటే పొలానికి ఫెన్సింగ్ వేస్తామని బెదిరించారు. దీంతో బాధితురాలు, కుమారుడు గోళ్లపాడులోని సేఫ్ కంపెనీ వద్దకు వెళ్లి విజయలక్ష్మిని కలిశారు. ఆమెను పొలం విడిచి వెళ్లాలని, లేకుంటే తమకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రూ.15 లక్షలు ఇస్తామని, అవి కూడా విడతల వారీగా కడతామని ఒప్పందం చేసుకున్నారు. అనుకున్న ప్రకారం రూ.15 లక్షల్ని 3 విడతలుగా చెల్లించారు. గత ఏడాది జనవరిలో పొలంలో ఉన్న సుబాబుల్ తోటను నరికించేందుకు పొలం యజమాని పద్మావతి, ఆమె భర్త వెళ్లగా రాంబాబు, శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని మరో రూ.5 లక్షలు చెల్లిస్తేనే పొలంలోకి అడుగు పెట్టనిస్తామని, లేకుంటే చంపుతామని బెదిరించారు. దీంతో భయపడిన భూ యజమానులు మిన్నకుండిపోయారు. నాలుగు రోజుల కిందట పొలం వద్దకు వెళ్లిన పద్మావతి, ఆమె భర్తపై శ్రీనివాసరావు, రాంబాబు మరో ముగ్గురు కలసి దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయలక్ష్మి, ఆమె అనుచరులు కళ్యాణం రాంబాబు, శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై షేక్ మహ్మద్ షఫీ తెలిపారు. -
అన్నా.. అందుకే వెళ్లిపోతున్నా...
‘అన్నా.. నేను ఇక టీచర్ను కాలేను. ఈ ప్రభుత్వానికి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం లేనట్లుంది. మళ్లీ నోటిఫికేషన్ విడుదలలోనూ జాప్యం జరుగుతుందని పేపర్లు, టీవీల్లో చూశాను. ఇక నేను ఈ ప్రపంచంలో ఉండలేను. నా పిల్లల్ని నువ్వే చూసుకోవాలి’ – బుధవారం కర్నూలులో ఆత్మహత్య చేసుకున్న విజయలక్ష్మి తన అన్నతో చెప్పిన చివరి మాటలివి.. టీచర్ కావాలన్నది ఆమె కల. ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించడంతో.. తన చిరకాల స్వప్నం సాకారం కానుందని సంబరపడింది. మొక్కవోని స్థైర్యంతో రేయింబవళ్లు కష్టపడి చదివింది. ఓ పక్క కోచింగ్ కోసం అమ్మ.. అన్న.. భర్త.. వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. అయినా ఉద్యోగం సాధించగలనన్న ఆత్మవిశ్వాసంతో ఆమె చదువును కొనసాగించింది. అయితే ప్రభుత్వం ప్రకటించినట్టుగా నోటిఫికేషన్లను విడుదల చేయకపోవడంతో నిరాశ నిస్పృహలకు లోనైంది. తిరిగి అక్టోబర్ 10న నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించిన ప్రభుత్వం.. మళ్లీ మొండిచేయి చూపడంతో తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఇక ఎప్పటికీ తన కల నెరవేరదేమోనన్న ఆందోళనతో అన్నకు ఫోన్ చేసి చనిపోతున్నానని చెప్పి.. ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. కర్నూలు /దేవనకొండ : కోడుమూరు మండలం వలుకూరుకు చెంది న చంద్రప్ప, లక్ష్మీదేవి కుమార్తె విజయలక్ష్మి. పదో తరగతి వరకు కోడుమూరు జెడ్పీ హెచ్ఎస్, ఇంటర్ కర్నూలు కేవీఆర్లో పూర్తి చేసింది. ఇంకా చదువుకుంటానని చెప్పినా తల్లిదండ్రులు వినకుండా పెళ్లి చేశారు. 2008లో దేవనకొండ మండలం కరివేములకు చెందిన ఆటో డ్రైవర్ గిడ్డయ్యతో వివాహం జరిపించారు. వారికి తరుణ్తేజ, ప్రహాసిని సంతానం. దేవనకొండ మండలంలో పోస్టుమాస్టర్గా పనిచేసే విజయలక్ష్మి తండ్రి చంద్రప్ప గతేడాది గుండెపోటుతో మృతిచెందారు. తల్లి, అన్న ఓబులేష్ శారదానగర్లోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. టీచర్ కావాలన్నది విజయలక్ష్మి కల. వివాహం చేయడంతో తన కల నెరవేరదేమోనని బెంగపడింది. అయితే.. భర్త సహకారంతో కర్నూలు లక్ష్మీ కళాశాలలో టీటీసీ పూర్తిచేసింది. ఏడేళ్ల నుంచి డీఎస్సీ కోచింగ్. టీటీసీ పూర్తవగానే విజయలక్ష్మి డీఎస్సీ కోచింగ్ కోసం కర్నూలులోని తల్లి, అన్న వద్దకు చేరింది. 2011 నుంచే ఓ కోచింగ్ సెంటర్లో టెట్, డీఎస్సీ కోసం శిక్షణ తీసుకుంది. 2012లో జరిగిన టెట్ కమ్ టీఆర్టీలో తక్కువ మార్కులు రావడంతో మళ్లీ గట్టిగా పోరాడాలని నిర్ణయం తీసుకుంది. 2014లో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చినా అప్పుడు పిల్లలు, కుటుంబ బాధ్యతల కారణంగా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. వచ్చే డీఎస్సీలో కచ్చితంగా ఉద్యోగం సాధించాలని 2014 నుంచి రేయింబవళ్లు చదివేది. 2017 డిసెంబర్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఎంతో సంతోషపడింది. అయితే నోటిఫికేషన్ను ప్రభుత్వం వాయిదా వేసింది. మళ్లీ ఈ ఏడాది జూలైలో నోటిఫికేషన్ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రూ.15 వేలు ఖర్చు చేసి డీఎస్సీ కోచింగ్ కూడా తీసుకుంది. అయితే.. నోటిఫికేషన్ విడుదలలో ప్రభుత్వం జాప్యం చేసింది. ముచ్చటగా మూడోసారి అక్టోబర్ 10న నోటిఫికేషన్ వస్తుందని చెప్పిన ప్రభుత్వం.. దానిని విడుదల చేయకపోవడంతో విజయలక్ష్మి తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఇక నోటిఫికేషన్ రాదేమోనని భయపడింది. అమ్మ, అన్న, భర్త తన కోసం వేలాది రూపాయలు ఖర్చు పెట్టారని.. వారందరికీ ఏం చెప్పుకోవాలని తలచి చివరకు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. నోటిఫికేషన్ రాదేమోనన్నబెంగతో ప్రాణాలు తీసుకుంది నా భార్యకు చాలా ఆత్మవిశ్వాసం. లక్షల మందిలో మనకు ఉద్యోగం ఎలా వస్తుందని నేను ప్రశ్నిస్తే.. చదివితే ఎవరికైనా వస్తుందనేది. రేయింబవళ్లు కష్టపడేది. అక్టోబర్ 10వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. మళ్లీ ఇవ్వకపోవడంతో తాను టీచర్ కాలేనేమోనని భయపడిపోయింది. స్నేహితులు, కుటుంబ సభ్యులం అందరం ధైర్యం చెప్పాం. అయినా ఇక నోటిఫికేషన్ రాదేమోనని మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది. – గిడ్డయ్య, విజయలక్ష్మి భర్త ప్రభుత్వం నాటకాలాడుతోంది.. డీఎస్సీ నోటిఫికేషన్ పేరుతో ప్రభు త్వం నాటకాలాడుతోంది. పేపర్లు, టీవీల్లో ప్రకటనలతో సరిపెడుతోంది. టీచర్, విద్యార్థి నిష్పత్తి అంటూనే ఉద్యోగాల్లో కోత పెడుతోంది. డీఎస్సీ, టెట్ కోసం చదివిన నిరుద్యోగులు ప్రభుత్వ నిర్వాకంతో అసహనానికి లోనవుతున్నారు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. – రామశేషయ్య, యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు -
కాగితాలు ఏరుకునే చిన్నారిని లాలించిన పద్మారావు!
అది సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప్రాంతం. అప్పుడు సమయం రాత్రి సుమారు ఏడెనిమిది గంటలు కావస్తోంది. వాహనాలు రొద చేస్తూ రోడ్డుపై వెళ్తున్నాయి. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇదే రహదారిలో ఓ చిన్నారి చిత్తు కాగితాలను ఏరుకుని వాటిని రిక్షాలో వేసుకుని తోసుకుంటూ వెళుతోంది. ఆ సమయంలో పాత జైలు సమీపంలోని ఓ కళ్లద్దాల దుకాణంలో కూర్చుని ఉన్న మంత్రి పద్మారావు ఆ చిన్నారి కష్టాన్ని కళ్లారా చూశారు. ఆ దృశ్యం ఆయన మనసును కదిలించింది. వెంటనే తన భద్రతా సిబ్బందితో బాలికను పిలుచుకు రమ్మని ఆదేశించారు. వారు ఆమెను మంత్రి చెంతకు తీసుకువచ్చారు. పద్మారావు తన సొంత కూతురిలా ఒడిలో కూర్చోపెట్టుకుని మరీ ఆ చిన్నారిని లాలించారు. ఆమె కుటుంబానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన పేరు విజయలక్ష్మి అని.. సికింద్రాబాద్ తుకారాంగేట్ వద్ద ఉంటున్నామని చెప్పింది. తల్లి సరోజ నిత్యం మోండా మార్కెట్ పరిసర ప్రాంతాల్లో చిత్తు కాగితాలు ఏరుకుని కుటుంబాన్ని పోషిస్తోందని వివరించింది. తాను సికింద్రాబాద్ సుభాష్ రోడ్లోని నాగెల్లి దుర్గయ్య స్మారక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నానంది. చదువుకుంటూనే నిత్యం తల్లి ఏరితెచ్చే చిత్తు కాగితాలను దుకాణంలో విక్రయిస్తుంటానని చెప్పింది. మోండా మార్కెట్ వద్ద తల్లి పోగుచేసిన చిత్తు కాగితాల మూటలను ప్రతిరోజూ రాత్రి ఏడు గంటల సమయంలో మూడు చక్రాల బండిలో వేసుకుని రాంగోపాల్పేట్లోని ఓ దుకాణానికి తీసుకెళ్లి అమ్ముతానంది. పదకొండేళ్ల చిన్న వయసులోనే బతుకు బండిని లాగడంలో తల్లికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న విజయలక్ష్మిని మంత్రి పద్మారావు అభినందించారు. ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తానన్నారు. ఈ ఉదంతం శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మంత్రి చలించిన తీరు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. – బన్సీలాల్పేట్ -
స్థానిక నివాసాలపైనే దృష్టి
విజయనగరం ఫోర్ట్: అంతా ఆరోగ్యం గా ఉండాలంటే అందుబాటులో సి బ్బంది ఉండాలి. పనిచేసే చోట నివా సం ఉండకుండా ఎక్కడో ఉంటూ రాకపోకలు చేయడంవల్ల ఒక్కోసారి అర్ధరాత్రి సేవలు అందించలేకపోవచ్చు. అందుకే ఉద్యోగం ఎక్కడో అక్కడే నివాసం ఉండాలన్నది నా ఉద్దేశం. సిబ్బంది కచ్చితంగా దీనిని పాటించాలి. దీనిపైనే దృష్టి పెడుతున్నాను. ఇంకా శాఖాపరంగా ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కొత్తగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా బాధ్యతలు చేపట్టిన విజయలక్ష్మి చెప్పారు. సాక్షితో శనివారం ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ♦ ఇంటర్వ్యూల సమయంలో స్థానికంగా ఉంటామని చెబితేనే ఉద్యోగాలకు ఎంపిక చేస్తాం. కానీ ఏఎన్ఎం, రెండో ఏఎన్ఎం, ఇతర ఉద్యోగులు చాలా మంది స్థానికంగా నివాసం ఉండట్లేదని నా దృష్టికి వచ్చింది. అలాంటివారిపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవడానికైనా వెనుకాడేది లేదు. కచ్చితంగా వారు స్థానికంగా నివాసం ఉండాల్సిందే. ♦ జిల్లాలో ఏదైనా ప్రాంతంలో డెంగీవ్యాధి ఉన్నట్టు తెలిస్తే తక్షణం దానికి గల కారణాలను ఆరా తీస్తాం. అసలు ఇలాంటివాటిని ముందస్తుగానే నియంత్రించేందుకు చర్యలు చేపడతాం. ప్రజలకు ఆరోగ్యంపైనా... పారి శుద్ధ్యంపైనా అవగాహన కల్పి స్తాం. పంచాయతీరాజ్, మున్సి పాలిటీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల సహకారంతో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటాం. ♦ గిరిజన ప్రాంత ప్రజలు కొంతమంది అవగాహన లేక ప్రభుత్వం అందించిన దోమతెరలను వినియోగించడం లేదు. అటువంటి వారితో నేరుగా మాట్లాడి, వారిని చైతన్యపరచి దోమ తెరలు వినియోగించేలా చర్యలు తీసుకుంటాం. ♦ వాతావరణ మార్పులవల్ల అక్కడక్కడా జ్వరా లు ప్రబలుతున్నాయి. ఎక్కడైనా అలాంటి సమ స్య ఉన్నట్టు తెలిస్తే వెంటనే అదుపునకు చర్యలు తీసుకుంటాం. వైద్యశిబిరాలు వెనువెంటనే ఏర్పా టు చేసి చికిత్సలు అందిస్తాం. రక్తనమూనాలు సేకరించి మలేరియా వంటివి సోకినట్టయితే పర్యవేక్షణ పెంచి మందులు అందిస్తాం. గ్రామంలో క్లోరినేషన్, స్ప్రేయింగ్ వంటివి చేపడతాం. ♦ జిల్లాలో తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు పూర్తిస్థాయిలో అందకపోవడానికి వాహనాలు చాలక పోవడమే కారణం. దీనివల్ల సేవలు పూర్తి స్థాయిలో అందకపోవచ్చు. వాటి సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకుంటాం. ♦ ఇంకా ఇళ్లల్లోనే గిరిజన ప్రాంతాల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. మూఢ నమ్మకాల కారణంగానే వారు ఆస్పత్రులకు చివరివరకూ తరలించేందుకు సుముఖత చూపడంలేదు. వారిని సిబ్బంది ముందుగానే గుర్తించి ఆస్పత్రిలో చేరేలా చైతన్యపరిచేలా చూస్తాం. ఇటీవల ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటు చేశాం. దీనివల్ల కొంతవరకూ రవాణాకు ఇబ్బంది ఉండకపోవచ్చు. -
భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన
అనుమంచిపల్లి(జగ్గయ్యపేట): తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన చేసిన ఘటన గ్రామంలో ఆదివారం చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన బి.పుష్పంకుమార్ తెలంగాణలో పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. 15 ఏళ్ల కిందట ఖమ్మంకు చెందిన విజయలక్ష్మీతో వివాహమైంది. వీరికి సంతానం కలగకపోవడంతో ఓ ఆడపిల్లను దత్తత తీసుకొని పెంచుకొంటున్నారు. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో వేర్వేరుగా జీవనం సాగించటంతో పాటు విడాకులు తీసుకొనేందుకు కోర్టుకు వెళ్లారు. కేసు కోర్టులో ఉండగా తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నాడని, న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. భార్యాభర్తల బంధువుల మధ్య వాగ్వాదం జరగటంతో విజయలక్ష్మీ చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
అమ్మా అప్పా ఓ తమిళబ్బాయి
ధనుష్ చాలా పాపులర్. ఇది మనందరికీ తెలుసు. మరీ ఇంత పాపులర్ అనుకోలేదు. ‘నా కొడుకంటే నా కొడుకు’ అని కొట్టుకునేంత పాపులర్! ఎన్డీ తివారీని ‘మా డాడీ.. మా డాడీ’ అని ఒకబ్బాయన్నాడు. కోర్టులు తేల్చాయి. ఇప్పుడు ధనుష్ను నా కొడుకంటే... నా కొడుకని లొల్లి చేస్తున్నారు ఇద్దరు నాన్నలు. కోర్టులు తేల్చాలి. ఇదీ సంగతి. ఎవర్ని ముంచుతారో... ఎవర్ని తేలుస్తారో? ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చూసి ఎంజాయ్ చేసినవాళ్లు ‘కొడుకుకు ప్రేమతో’ అన్న ఈ సినిమా చదివి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం... ధనుష్ ఎవరు? సూపర్స్టార్ రజనీకాంత్ అల్లుడు. ఒకప్పటి తమిళ దర్శకుడు కస్తూరి రాజా తనయుడు. తెలుగులో ‘7/జి బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాలు తీసిన తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ తమ్ముడు. మనకు ఇంతవరకే తెలుసు. అయితే ఇవన్నీ అబద్ధాలు అంటోంది ఓ వృద్ధ తమిళ జంట. ‘అతడు మా రక్తం పంచుకు పుట్టిన కన్నబిడ్డ’ అంటున్నారు. అంతే కాదు... ‘కావాలంటే పుట్టుమచ్చలు పరీక్షించుకోండి. డీఎన్ఏ టెస్టులు చేసుకోండి. ధనుష్ ముమ్మాటికీ మా బిడ్డే’ అంటూ న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఆ దంపతుల పేర్లు ఆర్. కదిరేశన్, మీనాక్షి. కోర్టు ఈ వృద్ధ దంపతుల వాదనను అర్థం చేసుకుని, ధనుష్కి సమన్లు జారీ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరీ కదిరేశన్?? ధనుష్ మామగారైన సూపర్స్టార్ రజనీకాంత్ హీరో కాకముందు బస్ కండక్టర్గా పనిచేసిన సంగతి తెలిసిందే. యాదృచ్ఛికమో.. మరొకటో... కదిరేశన్ కూడా కండక్టరే. ప్రస్తుతం ఆయన వయసు 60 ఏళ్లు. ఇటీవలే రిటైర్ అయ్యారు. చెన్నైకు సుమారు 500 కిలోమీటర్లు దూరంలో మధురై జిల్లాలోని మేలూర్ ఆయన స్వగ్రామం. కదిరేశన్కు ముగ్గురు పిల్లలు. ముగ్గురిలో ధనుష్ చిన్నోడని ఆయన చెబుతున్నారు. ‘‘ధనుష్ అసలు పేరు కలైసెల్వన్. మేలూర్లో రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించాడు. పదవ తరగతి వరకూ నగరంలోని ఆర్.సి. హయ్యర్ సెకండరీ స్కూల్, గవర్నమెంట్ బాయ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్స్లో చదువుకున్నాడు. 12వ తరగతి కోసం శివగంగ జిల్లాలోని తిరుపత్తూర్లో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాం. కానీ, చదువు మధ్యలోనే మానేసి, సినిమా పిచ్చితో చెన్నై చేరుకున్నాడు. కçస్తూరి రాజాతో చేతులు కలిపాడు. అప్పట్నుంచీ మాకు దూరమయ్యాడు. మా కుమారుణ్ణి కలవాలని మేము చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మీరే మాకు న్యాయం చేయాలి’’ అని కదిరేశన్ దంపతులు కోర్టు పిటిషన్లో పేర్కొన్నారు. నెలకు 65 వేలు కావాలి! కదిరేశన్ కోర్టులో ధనుష్ మా కుమారుడే అని పేర్కొనడంతో పాటు ప్రతి నెల తమ ఖర్చులకు 65 వేలు ఇప్పించాల్సిందిగా కోరారు. మరో ఇద్దరు సంతానం ఉన్నప్పటికీ, వాళ్లు తమ ఆరోగ్యానికీ ఇతర నెలవారీ ఖర్చులకు సరిపడా డబ్బులు ఏర్పాటు చేయలేకపోతున్నారని తెలిపారు. కదిరేశన్, మీనాక్షి దంపతుల వాదనలు విన్న తర్వాత జనవరి 12లోపు న్యాయస్థానం ముందు హాజరు కావాలని ధనుష్ని న్యాయమూర్తి ఆదేశించారు. గతేడాది నవంబర్ 25న ఈ సంఘటన జరిగింది. ధనుష్ తమ కుమారుడే అని నిరూపించడానికి సాక్ష్యాధారాలుగా బర్త్ సర్టిఫికేట్, టెన్త్ క్లాస్ టీసీ, 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ధనుష్ తన పేరును నమోదు చేసుకున్న సర్టిఫికేట్లను సమర్పించారు. ధనుష్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘తుళ్లువదో ఇళమై’ 2002 మేలో విడుదలైంది. తర్వాత కొన్నాళ్లకు సినిమాల్లో ధనుష్ను చూసి గుర్తు పట్టామని కదిరేశన్ దంపతులు చెబుతున్న మాట. అయితే చిత్ర పరిశ్రమలో ఇటువంటి కేసులు కొత్తేమీ కాదు. ‘నేనే చిరంజీవి పెద్ద కుమారుణ్ణి’ అంటూ గతంలో ఓ జూనియర్ ఆర్టిస్ట్, ‘నేను ఫలనా సినీ ప్రముఖుడికి ఫలానా’ అని మరికొందరు మీడియా, మానవ హక్కుల సంఘాలు, న్యాయస్థానాల ముందుకు వచ్చి తమ వాదనలు వినిపించారు. సదరు కేసులన్నీ కొన్ని రోజులకే కంచికి చేరుకున్నాయి. ధనుష్ కేసు మాత్రం కోర్టు సాక్షిగా కొత్త కొత్త మలుపులు తీసుకుంటోంది. దీనిపై పలు వాదనలు జరిగాయి. మేలూర్ కోర్టులో కేసు కొట్టేయవలసిందిగా ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ చుక్కెదురైంది. బర్త్ సర్టిఫికేట్లో పేరు లేదా? న్యాయస్థానంలో ధనుష్ సమర్పించిన బర్త్ సర్టిఫికేట్ జూన్ 21, 1993లో ఇష్యూ చేసినట్టు ఉందని కదిరేశన్ పేర్కొన్నారు. అందులో ఉన్నట్టు జూలై 28, 1983న ధనుష్ జన్మించాడనేది పూర్తిగా అవాస్తవమన్నారు. ‘అయినా... పదేళ్ల తర్వాత ఇష్యూ చేసిన బర్త్ సర్టిఫికేట్లో పిల్లాడి పేరు ఎందుకు లేదు? అప్పటికి అతను ఐదవ తరగతికి వచ్చుంటాడు కదా?’ అని ప్రశ్నించారు. ఆర్.కె. వెంకటేశ్ ప్రభు రాజాగా ఉన్న తన పేరును ధనుష్గా 2003లో మార్చుకున్నట్టు ఈ హీరో విన్నవించగా, 2002లోనే ధనుష్గా తన పేరును ఈ హీరో పేర్కొన్నట్టు స్పష్టం చేసే పేపర్లను కదిరేశన్ దంపతులు న్యాయస్థానం ముందుంచారు. దాంతో కేసు జటిలమైంది. పుట్టుమచ్చ... తప్పలేదు రచ్చ! కదిరేశన్, మీనాక్షి చేస్తున్న వాదనల్లో నిజం లేదంటూ ధనుష్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించడంతో పాటు కొన్ని ఆధారాలు సమర్పించారు. అయితే... కదిరేశన్ సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు ఉన్నాయి. ధనుష్ న్యాయవాదులు సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు లేవు. దీనిపై న్యాయమూర్తి ప్రశ్నించగా... అసలు కదిరేశన్ దంపతులు పేర్కొన్న పుట్టుమచ్చులు ధనుష్కు లేవని అతడి తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. అప్పుడు పుట్టుమచ్చల వెరిఫికేషన్ కోసం ఫిబ్రవరి 28లోపు న్యాయస్థానం ముందు ధనుష్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. దాంతో మంగళవారం విజయలక్ష్మి, కస్తూరి రాజాలతో కలసి ధనుష్ మేలూర్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు రిజిస్టార్ సమక్షంలో మేలూర్ రాజాజీ ప్రభుత్వాసుపత్రి డీన్ ధనుష్ పుట్టుమచ్చలను పరిశీలించారు. అనంతరం ఈ కేసు వాదనను గురువారానికి వాయిదా వేశారు. అయితే గురువారం నాడు డీఎన్ఎ టెస్ట్ కోసం కదిరేశన్ దంపతులు కోర్టుకు సమర్పించాల్సిన నివేదికలను పూర్తి స్థాయిలో ఇవ్వలేదని న్యాయస్థానం కేసుని మార్చి 9కి వాయిదా వేసింది. కోర్టులో ఏం తీర్పు వస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ధనుష్... కస్తూరి రాజా కొడుకే – విసు కస్తూరి రాజా దర్శకత్వం వహించిన తొలి తమిళ చిత్రం ‘ఎన్ రాసావిన్ మనసిలే’ పాతికేళ్ల క్రితం విడుదలైంది. అంతకుముందు ఆయన దర్శక–నిర్మాత–నటుడు విసు దగ్గర 16 సినిమాలకు పని చేశారు. ఆ విధంగా విసుతో కస్తూరి రాజా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ‘ధనుష్ తమ కుమారుడే’ అని కదిరేశన్ దంపతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో విసు పెదవి విప్పారు. ‘‘కస్తూరి రాజా కుటుంబం నాకు చాలా ఏళ్లుగా తెలుసు. నా దగ్గర అసిస్టెంట్గా చేశాడు. ధనుష్ పుట్టినప్పుడు కస్తూరి రాజా నా దగ్గరే పని చేస్తున్నాడు. ధనుష్... కస్తూరి రాజా–విజయలక్ష్మిదంపతుల కొడుకే. అందులో సందేహం లేదు’’ అంటూ తన కుటుంబంతో కలసి చిన్నప్పుడు ధనుష్ దిగిన ఫొటోను బయటపెట్టారాయన. సిక్స్ ఇయర్స్... స్వీట్ మెమరీ! కదిరేశన్, మీనాక్షి దంపతులు ధనుష్ చిన్నప్పటి ఫొటోలు... అంటూ కొన్ని ఫొటోలను బయటపెడితే... ధనుష్ కూడా తన చిన్న నాటి ఫొటోను ఆ మధ్య ట్వీట్ చేశారు. ఆ ఫొటోలో తన సిస్టర్స్ విమల గీత, కార్తీకా దేవితో కలసి ఉన్నాడు బుజ్జి ధనుష్. అప్పుడు తన వయసు ఆరేళ్లని ఈ హీరో పేర్కొన్నారు. ‘అవి గోల్డెన్ డేస్. మరచిపోలేనివి’ అని కూడా అన్నారు. మరి.. పదో తరగతి వరకూ తమ దగ్గరే ఉన్నాడని కదిరేశన్ దంపతులు చెబుతున్న నేపథ్యంలో ఆరేళ్ల వయసులో సోదరీమణులతో కలసి ధనుష్ దిగిన ఫొటో ఎక్కణ్ణుంచి వచ్చింది? – సత్య పులగం -
మున్సిపాలిటీలకు నిధులు మంజూరు
14వ ఆర్థిక సంఘం నిధులు రూ.148.79 కోట్లు ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద మరో రూ.137.28 కోట్లు మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ విజయలక్ష్మి మడకశిర : మున్సిపల్ రీజనల్ పరిధిలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఉన్న 38 మున్సిపాలిటీలకు నిధులు మంజూరైనట్లు మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. 2016 - 17వ ఆర్థిక సంవత్సరంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.148.79 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద మరో రూ.137.28 కోట్లు మున్సిపాలిటీలకు మంజూరయ్యాయన్నారు. ఆమె సోమవారం మడకశిరకు వచ్చిన సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సబ్ప్లాన్ నిధుల్లో ఎస్సీల అభివృద్ధికి రూ.77.65 కోట్లు, ఎస్టీల అభివృద్ధికి రూ.59.63 కోట్లు కేటాయించారన్నారు. 2015 - 16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.101.60 కోట్లు, సబ్ప్లాన్ నిధులు రూ.333.36 కోట్లు కూడా మున్సిపాలిటీలకు వచ్చాయన్నారు. ఈ నాలుగు జిల్లాల పరిధిలో గత డిసెంబరుకు రూ.212.35 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉండగా, రూ.109.84 కోట్లు(52శాతం) మాత్రమే వసూలైనట్లు తెలిపారు. పన్ను వసూళ్లను 75శాతానికి పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రీజనల్ పరిధిలోని కర్నూలు, తాడిపత్రి, కడప, ప్రొద్దుటూరు, శ్రీకాళహస్తి, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలకు మొదటి విడతలో ఏహెచ్పీ కింద రూ.27,900 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. అదే విధంగా హౌసింగ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలకు బీఎల్సీ కింద 17,470 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. 38 మున్సిపాలిటీల పరిధిలో స్వచ్ఛభారత్ కింద 56,333 మరుగుదొడ్లను నిర్మించామన్నారు. 162 కమ్యూనిటీ మరుగుదొడ్లను మంజూరు చేశామని, ఇందులో 68 పూర్తి చేశామని తెలిపారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో 84,677 కుక్కలు ఉంటే అందులో 42,247 కుక్కలకు ఆపరేషన్లు చేయించామన్నారు. మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఈ - ఆఫీస్కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇంతవరకు రీజనల్ పరిధిలో 3,485 ఫైళ్లను ఈ - ఆఫీస్ ద్వారా నిర్వహించామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రవేశపెట్టిన ‘పురసేవ’ యాప్ద్వారా 5,200 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 4,500 పరిష్కరించామని చెప్పారు. మున్సిపాలిటీల పరిధిలో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. స్వైపింగ్ మిషన్ల కోసం 3,700 దరఖాస్తులు రాగా 960 మిషన్లను సరఫరా చేశామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ప్రకాష్, కమిషనర్ నయీద్అహమ్మద్ పాల్గొన్నారు. -
బాంబే గ్రూపు రక్తం కోసం ఎదురుచూపులు..
అరుదైన బాంబే గ్రూపు రక్తం కోసం ప్రాణాపాయస్ధితిలో రోగి ఎదురుచూస్తోంది. మిలియన్ ప్రజల్లో కేవలం నలుగురికి మాత్రమే ఉంటే ఈ రకం బ్లడ్గ్రూపు రక్తం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి పాలనాయంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. అరుదైన బాంబే గ్రూపు రక్తాన్ని సేకరించి రోగి ప్రాణాలు కాపాడేందుకు ఆస్పత్రి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమారం గ్రామానికి చెందిన విజయలక్ష్మీ, ఆదంలు భార్యభర్తలు. రెండో సారి గర్భం దాల్చిన విజయలక్ష్మీకి స్థానిక జిల్లా వైద్యులు వైద్యసేవలు అందించారు. అమెది అత్యంత అరుదైన బాంబే బ్లడ్గ్రూపని తేలడంలో ఈనెల 13వ తేదిన గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. తల్లి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడడంతో శస్ర్తచికిత్స చేసి ఆడ శిశువును బయటకు తీశారు. అప్పటికే శిశువు మృతి చెందింది. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావమైంది. తక్షణమే రెండు బ్యాటిళ్ల రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి. అయితే అమె రక్తానికి మ్యాచ్ అయ్యే బాంబే బ్లడ్ గ్రూపు రక్తం అందుబాటులో లేదు. శతవిధాల ప్రయత్నించగా చార్మినార్ తలసేమియా బ్లడ్బ్యాంకులో ఒక బ్యాటిల్ రక్తం ఉందని తెలుసుకుని తక్షణమే అక్కడి నుంచి కొలుగోలు చేశారు. మరో బ్యాటిల్ రక్తం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతంలోనే విజయలక్ష్మీ మోకాలిచిప్పకు శస్ర్తచికిత్స అవసరమైన నేపధ్యంలో ఆమెది అత్యంత అరుదైన బాంబే బ్లడ్గ్రూపు రక్తంగా వైద్యులు గుర్తించారు. నిమ్స్ ఆస్పత్రిలో నెలరోజుల పాటు వేచిఉన్న తర్వాత బాంబే బ్లడ్గ్రూపు రక్తాన్ని ముంబై నుంచి సేకరించిన అనంతరం శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రి అధికారులు ముంబైలోని మహాత్మగాంధీ సేవసమితి బ్లడ్బ్యాంకు నిర్వాహకులను సంప్రదిస్తున్నారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న విజయలక్ష్మీ ప్రాణాలు కాపాడేందుకు తమవంతు కషిచేస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ జేవీరెడ్డి తెలిపారు. ఈ రకం రక్తాన్ని గుర్తించేందుకు గాంధీ బ్లడ్బ్యాంకులో తగిన వైద్యపరికరాలు ఉన్నాయని, ఇక్కడకు వచ్చే రక్తదాతల్లో బాంబే బ్లడ్గ్రూప్ రక్తం ఉన్నవారు ఎవరూలేరని గాంధీ బ్లడ్బ్యాంకు ఇన్చార్జి డాక్టర్ భీష్మ తెలిపారు. బాంబే బ్లడ్ గ్రూప్ అంటే... జన్యుపరంగా సంక్రమించే ఈ రకం బ్లడ్గ్రూప్ను ముంబై(ఒకప్పటి బొంబాయ్)కు చెందిన డాక్టర్ వైఎం బెండీ 1952లో గుర్తించారు. దీంతో ఈ రకం రక్తానికి బాంబే బ్లడ్ గ్రూప్ అని నామకరణం చేశారు. అత్యంత అరుదైన ఈ రక్తం ఓ నెగిటివ్ గ్రూప్లోని మరో సబ్టైప్. దీనికి వైద్యపరిభాషలో ‘ఓహెచ్’గా పిలుస్తారు. బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం మిలియన్ మందిలో నలుగురికి మాత్రమే ఉండే అవకాశం ఉందని నిపుణులు నిర్ధారించారు. దేశంలో తొమ్మిది మందికి అవసరం... దేశంలో తొమ్మిది మందికి బాంబే బ్లడ్ గ్రూపు రక్తం అవసరం ఉందని తేలింది. కొంతమంది కలిసి బాంబే బ్లడ్గ్రూప్ డాట్ ఓఆర్జీ పేరిట ఓ వైబ్సైట్ను నిర్వహిస్తున్నారు. ఈ రకమైన బ్లడ్ అవసరమైన వారు ఈ వైబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకుంటే డోనర్లను వెతికి పట్టుకుని అవసరమైన రక్తాన్ని అందిస్తారు. ప్రస్థుతం ఈ వెబ్సైట్లో తొమ్మిది మంది తమకు బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం అవసరమని తమపేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో హైదరాబాద్కు చెందిన బేబీ సరియాఅమీన్, అనంతపురంకు చెందిన శైలజలు ఉండడం గమనార్హం. ఈ వెబ్సైట్ విశ్లేషణ ప్రకారం మహారాష్ట్రలోనే ఈ బ్లడ్గ్రూప్ రక్తం ఉన్నవారు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. -
కేసీఆర్ స్ఫూర్తితోనే దత్తత
జిల్లాపరిషత్ : హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారని, ఆయన స్ఫూర్తితోనే జెడ్పీ ఆవరణలో గార్డెన్ను దత్తత తీసుకున్నామని జిల్లా సహాయ ఆడిట్ అధికారి కె.విజయలక్ష్మి తెలిపారు. శుక్రవారం నగరంలోని సుభాష్నగర్లో గల జెడ్పీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గార్డెన్ను తమ కార్యాలయ సిబ్బంది అందరం కలిసి దత్తత తీసుకున్నామని తెలిపారు. గార్డెన్లో దాదాపు 100కు పైగా మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరోపణలు అభూతకల్పనలు
నైతిక విలువలతో ఉద్యోగం చేస్తున్నా.. ఉద్యోగంలో చేరకముందే తండ్రి ఆస్తి సంక్రమించింది విశాఖపట్నం : అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, అభూతకల్పనలని ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ ఎం.విజయలక్ష్మి స్పష్టం చేశారు. పీఎంపాలెంలోని తన ఇంటిపై ఏసీబీ దాడుల సందర్భంగా పత్రికల్లో వచ్చిన కధనాల్లో వచ్చిన ఆరోపణలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. అక్రమ ఆస్తులుగా పేర్కొన్నవన్నీ ఉద్యోగంలో చేరకముందే తండ్రి నుంచి తనకు సంక్రమించాయని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1994లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పలు ప్రాంతాల్లో మహిళలు, పిల్లల పట్ల ఎంతో నిబద్ధతతో, నిజాయితీతో పనిచేస్తూ సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నానన్నారు. అయితే తనపై కొందరు పనిగట్టుకొని చేసిన తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. లంచం తీసుకోవడమే కాదు.. ఇవ్వడం కూడా నేరమని భావించే తనపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఉన్నత కుటుంబం స్వతహాగానే తమది ఆస్తిపాస్తులున్న కుటుంబమని విజయలక్ష్మి పేర్కొన్నారు. 1986లో వివాహం తర్వాత తండ్రి ద్వారా తనకు సంక్రమించిన మూడో వంతు ఆస్తిని విక్రయించి 1994కు ముందే.. అంటే సర్వీసులో చేరకముందు ఇక్కడ వేరే ఆస్తులు కొన్నామన్నారు. సహజంగానే ఇప్పుడు వాటి మార్కెట్ విలువ పెరిగిందన్నారు. అఆగే ఉద్యోగంలో చేరిన 1994 నాటికి తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి వెల్లడించానని వివరించారు. భర్త వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులతో పాటు, తన తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి ప్రతి ఏటా నివేదిస్తున్నానని చెప్పారు. తన జీతాన్ని పొదుపు చేస్తూ ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం బంగారం సమకూర్చుకుంటుంటే.. అదేదో తప్పు అన్నట్లు.. దాన్ని అక్రమ ఆస్తి అని ఆరోపించడం తన మానసిక స్థైర్యాన్ని కోల్పోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 22 ఏళ్ల సర్వీసులో ఏనాడూ ఆరోపణలు ఎదుర్కోలేదన్నారు. తన సర్వీసు రిజిస్టరే దీనికి సాక్ష్యమన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల నియామకాల్లో అవినీతికి పాల్పడ్డానన్న ఆరోపణలు నిరాధారమైనవన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలు మొత్తం ఎంపిక ప్రక్రియను ఆన్లైన్లోనే పారదర్శకంగా నిర్వహించామన్నారు. తన కుమార్తె పెళ్లి మరో రెండు నెలల్లో ఉన్నందున తమ ఇంటి పైఅంతస్తును నివాసయోగ్యంగా చేయడానికి కొంత నగదు బ్యాంకు నుంచి డ్రా చేసి ఇంట్లో ఉంచామన్నారు. అలాగే తన కుటుంబానికి మూడు ఖరీదైన కార్లు లేవన్నారు. తన భర్త 2010లో బ్యాంకు రుణంతో కొన్న కారు, కుమార్తె తన ఉద్యోగం ద్వారా సంపాదించిన సొమ్ముతో కొన్న సెకండ్ హ్యాండ్ కారు మాత్రమే ఉన్నాయన్నారు. తనవి కాని ఆస్తులను తన అక్రమ ఆస్తులుగా చూపించడాన్ని ఖండిస్తున్నానన్నారు. భర్త కుటుంబ ఆస్తి వివాదాలే కారణం! ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ విజయలక్ష్మి భర్త తరఫు కుటుంబానికి సంబంధించి ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఈ ఆక్కసుతోనే కొందరు విజయలక్ష్మి కుటుంబంపై తప్పుడు ఆరోపణలతో ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుల ఆధారంగానే ప్రాథమిక విచారణ కూడా జరపకుండా నేరుగా సోదాలకు దిగినట్లు సమాచారం. అందువల్లే ఉద్యోగంలో చేరడానికి ముందు ఉన్న విజయలక్ష్మి ఆస్తులను అక్రమ ఆస్తులుగా మీడియా ముందు చూపించారు. ఐసీడీఎస్లో చేరినప్పటి నుంచి ఈమె నిబద్ధతతోనే పని చేస్తున్నారని తోటి అధికారులు చెబుతున్నారు. -
విజయలక్ష్మి..
(కాకినాడ) : పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తే ఏదైనా సాధ్యమని నిరూపిస్తోంది కాకినాడ దిగుమర్తివారి వీధికి చెందిన కాదా విజయలక్ష్మి. తాజాగా విడుదలైన ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 467 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. అంతేకాదు వివిధ పోటీ పరీక్షలు, జాతీయ, అంతర్జాతీయ గణిత ఒలంపియాడ్లో ప్రథమ ర్యాంకులు సాధించింది. రామానుజన్ గణిత పోటీల్లో జిల్లా ప్రథమస్థానం కైవసం చేసుకుంది. పదో తరగతి ఫలితాల్లోనూ టాపే.. 2015 పదోతరగతి పరీక్ష ఫలితాల్లో 9.8 పాయింట్లు సాధించగా, అదేసంవత్సరం ఏపీఆర్జేసీ ప్రవేశపరీక్షల్లో రాష్ట్రస్థాయి 13వ ర్యాంక్ సాధించింది. అలాగే పాలిసెట్ 2016 ప్రవేశపరీక్షల్లో 120 మార్కులకు 118 సాధించి రాష్ట్రస్థాయిలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఎటువంటి శిక్షణ కేంద్రాలకు వెళ్లకుండా పాఠశాలస్థాయిలో ఉన్న సిలబస్ను ప్రతిరోజూ సమీక్షించుకుంటూ, ప్రత్యేక ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కావడం వల్లే ఈ ర్యాంకులు సాధించానని విజయలక్ష్మి చెబుతోంది. ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి జేఈఈ మెయిన్స్లో ప్రతిభ చూపి ప్రముఖ ఐఐటీ విద్యాసంస్థలో కంప్యూటర్ సైన్స్ అభ్యసించి సైన్స్ ఇంజనీర్గా స్థిరపడాలనేది తన లక్ష్యమంది. తనకు త ల్లిదండ్రులు కుమార్, సుబ్బలక్ష్మిల ప్రోత్సాహం ఎంతో ఉందని ఆమె చెబుతోంది. -
విజయలక్ష్మి హత్యకేసులో నిందితుడి అరెస్ట్
జిల్లాకేంద్రంలోని శ్రీకంఠం సర్కిల్ వద్దనున్న ప్రశాంతిలాడ్జిలో హత్యకు గురైన విజయలక్ష్మి(24) కేసులో నిందితుడిని అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు బస్వరాజ్ మాయమాటలు చెప్పి విజయలక్ష్మిని రెండు రోజుల క్రితం లాడ్జికి తీసుకువచ్చాడు. అనంతరం పథకం ప్రకారం హత్య చేసి పరారయ్యాడు. విజయలక్ష్మికి ఇదివరకే వేరొక వ్యక్తితో వివాహం అయింది. తనను పెళ్లి చేసుకోలేదనే కారణంతోనే బసవరాజ్ ఈ హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేధిస్తున్నాడని చంపేసింది!
భర్తను హత్య చేసి.. పోలీసులకు లొంగిపోయిన భార్య నల్లకుంట: అనుమానంతో నిత్యం వేధిస్తున్న భర్తను చాకుతో పొడిచి చంపిందో భార్య. అనంతరం పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. నల్లకుంట సీఐ వి.యాదగిరి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా వర్ని మండలం నాగారానికి చెందిన మాట్లా గంగాధర్(48), విజయలక్ష్మి దంపతులు జీవనోపాధి కోసం పదేళ్ల క్రితం నగరానికి వచ్చి నల్లకుంట నర్సింహ బస్తీలో అద్దెకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. గంగాధర్ ఏ పని చేయకుండా ఖాళీ ఉంటుం డగా.. విజయలక్ష్మి శివం రోడ్డులోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఆయాగా పని చేస్తోంది. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని గంగాధర్ అనుమానం పెంచుకున్నాడు. నిత్యం తాగి వచ్చి ఆమెను మానసిక, శారీరక వేధింపులకు గురి చేసేవాడు. శుక్రవారం రాత్రి 10 గంటలకు పీకలదాక మద్యం తాగి ఇంటికి చేరుకున్న గంగాధర్ భార్యతో గొడవపడ్డాడు. నిత్యం తనను వేధించుకుతింటున్న భర్తను ఎలాగైనా కడతేర్చాలని విజయలక్ష్మి నిర్ణయించుకుంది. రాత్రి కుటుంబ సభ్యులంతా భోజనం చేసిన తర్వాత విజయలక్ష్మి తల్లి నాగమ్మ, చిన్న కుమార్తె పక్క గదిలో పడుకోగా, భార్యాభర్తలు మరో గదిలో పడుకున్నారు. ముందే వేసుకున్న పథకం ప్రకారం విజయలక్ష్మి శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గాఢ నిద్రలో ఉన్న భర్త కడుపులో చాకుతో నాలుగు పోట్లు బలంగా పొడిచింది. కడుపు బాగా చీరుకు పోవడంతో పేగులు బయటకు వచ్చి గంగాధర్ అక్కడికక్కడే మరణించాడు. ఉదయం వరకూ శవంతో పాటు ఇంట్లోనే ఉన్న నిందితురాలు విజయలక్ష్మి ఉదయం 6.15 గంటలకు నేరుగా నల్లకుంట పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. ఇన్స్పెక్టర్ యాదగిరిరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి హత్య జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం గంగాధర్ మృతదేహాన్ని అతడి పెద్దకుమార్తెకు అప్పగించారు. విధిలేని పరిస్థితుల్లోనే హత్య: నిందితురాలు అనుమానంతో తనను భర్త నిత్యం వేధిస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో హత్య చేశానని నిందితురాలు విజయలక్ష్మి తెలిపింది. మద్యానికి బానిసై వచ్చిన డబ్బు మొత్తం ఖర్చు చేసేవాడని, దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారడంతో తాను ఓ కళాశాలలో ఆయాగా చేరానని చెప్పింది. అయితే, వివాహేతర సంబంధం పెట్టుకున్నానని భావించి నిత్యం మానసిక వేధింపులకు గురి చేసేవాడని, జీహెచ్ఎసీలో పని చేసి పదవీ విరమణ పొందిన తన తల్లికి వచ్చే పెన్షన్ డబ్బు కూడా తీసుకొని తాగేవాడని తెలిపింది. నన్ను చంపి జైలుకెళ్తానని ఒకసారి హెచ్చరించాడని, అంతేకాకుండా పెద్ద చాకు కొని తెచ్చి ఇంట్లో దాచాడని విజయలక్ష్మి చెప్పింది. ఎప్పటికైనా తనను చంపేస్తాడనే భయంతోనే శనివారం తెల్లవారుజామున తానే భర్తను పొడిచి చంపానని ఆమె పేర్కొంది. -
విచారణకు హాజరైన దర్శన్
♦ గంటపాటు ఛాలెంజింగ్ స్టార్ను ♦ విచారణ చేసిన పోలీసులు సాక్షి, బెంగళూరు: ప్రముఖ శాండల్వుడ్ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తన ఇంటికి వచ్చి గొడవ పడుతున్నారంటూ భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్శన్ను శనివారం విచారణ చేశారు. దాదాపు గంట పాటు పోలీసులు దర్శన్ను విచారణ చేశారు. ఈనెల 9న విజయలక్ష్మి నివాసం ఉంటున్న సౌత్రిడ్జ్ అపార్ట్మెంట్కు దర్శన్ చేరుకొని అక్కడ గొడవ చేయడంతో పాటు సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారంటూ విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాల్సిందిగా పోలీసులు దర్శన్కు సూచించారు. ఫిర్యాదు నమోదైన చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీస్ స్టేషన్లో దర్శన్ విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా దర్శన్ను విచారణకు త్యాగరాజనగర్లోని ఏసీపీ కార్యాలయానికి పోలీసులు మార్చారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం త్యాగరాజనగర్లోని ఏసీపీ కార్యాలయానికి దర్శన్ చేరుకున్నారు. బనశంకరి ఉపవిభాగం ఏసీపీ లోకేష్కుమార్ నటుడు దర్శన్పై అందిన ఫిర్యాదులకు సంబంధించి దర్శన్ను విచారణ చేశారు. దర్శన్ ఇచ్చిన వివరణలను సైతం వీరు నమోదు చేసుకున్నారు. ‘నేను ఈనెల 9న ఆ అపార్ట్మెంట్కు వెళ్లిన విషయం నిజమే. ఆ సమయంలో అక్కడున్న సెక్యూరిటీ గార్డు మీరు ఈ ప్రాంతానికి రావడానికి వీళ్లేదు అంటూ నన్ను అడ్డుకున్నాడు. అప్పుడు నీకు ఈ విషయానికి సంబంధం లేదు’ అని అతనితో గట్టిగా చెప్పాను. అంతేకానీ దాడికి పాల్పడలేదు అని పేర్కొన్నట్లు సమాచారం. కాగా, దర్శన్ త్యాగరాజనగర్లోని ఏసీపీ కార్యాలయానికి వస్తున్నట్లు తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. రాజీకి ప్రయత్నిస్తున్న అంబి ఇక దర్శన్, విజయలక్ష్మి దంపతుల మధ్య రాజీ కుదిర్చి తిరిగి వారు దాంపత్య జీవనాన్ని కొనసాగించేందుకు సీనియర్ నటుడు, మంత్రి అంబరీష్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దంపతులిద్దరితోనూ అంబరీష్ ఈ విషయంపై మాట్లాడారు. మరో రెండు రోజుల్లో దంపతులిద్దరినీ కూర్చోబెట్టి వివాదాన్ని పరిష్కరించే దిశగా చర్చించనున్నారని తెలుస్తోంది. ఇక ఇదే సందర్భంలో రాష్ట్ర మహిళా క మిషన్ సైతం సోమవారం రోజున దంపతులిద్దరి నుంచి వివరాలను సేకరించి వారి మధ్య సయోధ్యను కుదిర్చే ప్రయత్నం చేయనుందని సమాచారం. -
ఆడియో టేప్ దుమారం
విజయలక్ష్మిని దర్శన్ దూషిస్తున్నట్లుగా ఆడియో టేప్ సమసిపోని దర్శన్ దంపతుల గొడవ అంబరీష్ చర్చలు బెంగళూరు: శాండల్వుడ్ నటుడు దర్శన్ కుటుంబ జీవితంలో రేగిన కల్లోలం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. విజయలక్ష్మిని దర్శన్ అసభ్య పదజాలంతో దూషిస్తున్నట్లుగా ఓ ఆడియో టేప్ వాట్సాప్లో సంచలనం సృష్టిస్తోంది. శుక్రవారం వాట్సాప్ గ్రూప్లలో వినిపించిన ఈ ఆడియోటేప్లో అత్యంత అసభ్య పదజాలం వినిపించింది. అయితే ఈ ఆడియో టేప్లో ఉన్నది దర్శన్ గొంతు కాదని ఆయన భార్య విజయలక్ష్మి చెబుతుండడం గమనార్హం. ‘ పదమూడేళ్లుగా దర్శన్తో కలిసి ఉన్నాను, ఆయన నోటి వెంట ఎప్పుడూ ఇలాంటి పదజాలాన్ని నేను వినలేదు. అసలు ఆ గొంతు దర్శన్ది కాదు, మా మధ్య ఉన్న మనస్పర్థలను ఉపయోగించుకొని ఎవరో ఇదంతా సృష్టిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఇక విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్శన్ను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ఉదయమే విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు దర్శన్కు సూచించినప్పటికీ తన తల్లికి అనారోగ్యంగా ఉన్న కారణంగా శుక్రవారం సాయంత్రం సమయానికి విచారణకు హాజరవుతానని దర్శన్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇదే సందర్భంలో దంపతులిద్దరి మధ్య నెలకొన్న మనస్పర్ధలను రాజీ ద్వారా నివృత్తి చేసేందుకు అటు రాష్ట్ర మహిళా కమిషన్తో పాటు సీనియర్ నటుడు అంబరీష్ సైతం ప్రయత్నిస్తున్నారు. -
మంచినబెలెలో అమానుషం
ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు తీవ్రంగా గాయపడిన దంపతులు, కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లీ కుమారుడి మృతి బెంగళూరు(బనశంకరి) : కుటుంబం గాఢనిద్రలో ఉండగా దుండగులు నిప్పు పెట్టిన ఘటనలో తల్లితో పాటు కుమారుడు మృతిచెందగా ఇంటి పెద్ద తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన రాష్ర్ట రాజధానికి 150 కిలోమీటర్ల దూరంలోని తావరకెరె పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు..... మాగడి తాలూకా మంచినబెలెలో భోజన్న, విజయలక్ష్మి(45) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి భరత్(19)అనే కుమారుడున్నాడు. భూముల విషయంలో అదే గ్రామానికి చెందిన కొందరితో వీరికి వివాదం నెలకొంది. ఈక్రమంలో భోజన్న, విజయక్ష్మి, భరత్ గాఢనిద్రలో ఉండగా శనివారం వేకువజామున మూడుగంటల సమయంలో దుండగులు ఆ ఇంటి తలుపునకు గడియ వేసి తర్వాత ఇంటిపై కిరోసిన్ చల్లి నిప్పుపెట్టి ఉడాయించారు. ఉవ్వెత్తున మంటలు ఎగసి ఇళ్లంతా వ్యాపించడంతో అందులో ఉన్న కుటుంబసభ్యులు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు మేల్కొని భోజన్నను లక్కసంద్రలోని అభయ్ ఆసుపత్రికి, విజయలక్ష్మిని విక్టోరియా ఆస్పత్రికి, భరత్ను సెయింట్జాన్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ తల్లీ కుమారుడు మృతి చెందగా భోజన్న పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై తావరకెరె పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల ఆచూకీకోసం తీవ్రంగా గాలిస్తున్నారు. -
కొత్త మేయర్ పై ఉత్కంఠ!
♦ అధికార టీఆర్ఎస్లో జోరుగా చర్చలు ♦ ప్రచారంలో బొంతు రామ్మోహన్, విజయలక్ష్మి పేర్లు ♦ మరో ఇద్దరు బీసీ నేతలూ రేసులో ఉన్నారంటున్న పార్టీవర్గాలు ♦ అధినేత మదిలో ఎవరున్నారో తెలియని పరిస్థితి ♦ 11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక.. అదే రోజున తొలి సమావేశం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్లో ప్రస్తుతం మేయర్ పదవిపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ ఎన్నికల్లో 150 డివిజన్లకుగాను టీఆర్ఎస్ 99 డివిజన్లను సొంతం చేసుకుని సింగిల్ మెజారిటీ పార్టీగా అవతరించింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎవరిని వరిస్తాయనేది ఉత్కంఠగా మారింది. ఈసారి మేయర్ పీఠం బీసీ జనరల్కు రిజర్వు అయింది. పరోక్ష పద్ధతిలో కార్పొరేటర్లే మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. అసలు మేయర్ ఎన్నికకు సంబంధించి ఇప్పటిదాకా తమ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని టీఆర్ఎస్ బయటపెట్టలేదు. ఎందుకంటే సరిపడ మెజారిటీ రాకుంటే ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితిని టీఆర్ఎస్ ఎదుర్కుని ఉండేది. కాబట్టే ముందుగా మేయర్ అభ్యర్థి విషయాన్ని పక్కన పెట్టిందనే అభిప్రాయముంది. కానీ ఎక్స్అఫీషియో ఓట్లు కూడా అవసరం లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకునే స్థాయిలో టీఆర్ఎస్ మెజారిటీ సాధించింది. దీంతో కార్పొరేటర్లుగా గెలిచిన పలువురు నేతల్లో ఆశలు పెరిగిపోయాయి. ఎన్నికల ప్రచారం సమయంలోనే టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థులుగా పార్టీ యువజన విభాగం నేత బొంతు రామ్మోహన్, పార్టీ సెక్రెటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు (కేకే) కుమార్తె విజయలక్ష్మిల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వలస సంఖ్యే ఎక్కువ: ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒకింత వింత పరిస్థితిని ఎదుర్కొంది. హైదరాబాద్లో పెద్దగా పట్టులేకపోవడం, క్షేత్రస్థాయిలో సరైన నాయకత్వం లేకపోవడంతో తొలుత డివిజన్లలో పోటీ పడగలిగిన అభ్యర్థుల కొరత వెంటాడింది. అయితే టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్ ’తో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు గులాబీ గూటికి చేరారు. దాంతో ఆయా డివిజన్లలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముందు నుంచీ పార్టీలో కొనసాగిన నేతలు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేటర్లుగా అందివచ్చిన అవకాశం కంటే... వివిధ పార్టీల నుంచి వలస వచ్చి టికెట్లు దక్కించుకుని విజయం సాధించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. గత జీహెచ్ఎంసీ పాలకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఫ్లోర్లీడర్లుగా వ్యవహరించిన వారు సైతం ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగి గెలిచారు. కానీ వారెవరూ ఇప్పటికిప్పుడు మేయర్ పీఠాన్ని ఆశించే పరిస్థితి లేదు. దీంతో ఒకవిధంగా టీఆర్ఎస్లో మేయర్ పదవి కోసం పెద్దగా పోటీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు అధినేత కేసీఆర్ మనసులో ఏముందో తెలుసుకోలేకపోతున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా బొంతు రామ్మోహన్, గద్వాల విజయలక్ష్మిల పేర్లు ప్రచారంలో ఉన్నాయని, మరో ఇద్దరు బీసీ నేతలూ ఆశిస్తున్నారని అంటున్నారు. టీఆర్ఎస్ కొత్త కార్పొరేటర్లంతా శనివారం సీఎం కేసీఆర్ను కలసినప్పుడూ మేయర్ అభ్యర్థిత్వం అంశం చర్చకు రాలేదని సమాచారం. ఎన్నిక జరగాల్సిన 11వ తేదీ దాకా మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల విషయంలో ఇదే గోప్యత కొనసాగవచ్చని చెబుతున్నారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో జీహెచ్ఎంసీ తొలి సర్వసభ్య సమావేశం కూడా 11వ తేదీనే జరగనుంది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. -
పార్టీ మారి...విజయాన్ని చేరి!
ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో చివరి నిమిషంలో పార్టీలు మారిన కొందరు జంప్ జిలానీలను అనూహ్యంగా విజయలక్ష్మి వరించింది. హయత్నగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరి లోకి దిగిన సామ తిరుమల రెడ్డి గతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో పని చేశారు. బల్దియా ఎన్నికల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్లోకి దూకి...విజయం సాధించారు. చంపాపేట్, వనస్థలిపురం డివి జన్ల నుంచి సామ రమణారెడ్డి, జిట్టా రాజశేఖర్రెడ్డిలు గత బల్దియా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా గెలుపొందారు. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన అనంతరం మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు అధికార పార్టీ అభ్యర్థులుగా అవే సిట్టింగ్ స్థానాల నుంచి ఎన్నికకావడం విశేషం. గడ్డిఅన్నారం డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేసిన భవాని ప్రవీణ్ కుమార్ చివరి నిమిషంలో టీఆర్ఎస్లో చేరి కార్పొరేటర్గా విజయం సాధించారు. వీరందరూ పార్టీలు మారినా గెలుపొందడంతో సంబరాలు చేసుకుంటున్నారు. -
కేకే కుమార్తె ఆందోళన
హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్ నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు కె. కేశవరావు కుమార్తె విజయలక్ష్మి మంగళవారం ఎన్ బీటీ నగర్ లో ఆందోళన చేపట్టారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓటరు కార్డులున్నా అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు. మాసబ్ ట్యాంక్ లోని 36, 37 పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఎంఐఎం రిగ్గింగ్ కు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. తార్నాకా డివిజన్ మాణికేశ్వర్ నగర్ లోనూ ఓటర్లు ఆందోళనకు దిగారు. గుర్తింపు కార్డు ఉన్నా ఓటు వేయనీయడం లేదని తెలిపారు. -
తోడు...
ఆ ఫ్లాట్ మీదుగా నడుస్తుంటే గంగాధరానికి వయొలిన్ సవ్వడి వినిపించింది. ఆశ్చర్యపోయాడు. ఈ ఇంట్లో వయొలిన్ వాయించేది ఎవరబ్బా?సంశయిస్తూనే తలుపు తడితే నవ్వుతూ విజయలక్ష్మి కనిపించింది. చేతిలో వయొలిన్. ఆ వేళే బజారుకు వెళ్లి, దానిని కొనుక్కొచ్చి, సాయంత్రం నుంచి సాధన చేస్తోందట. ‘బాగుందా’ అని నవ్వింది. గంగాధరానికి ఇది ఇంకా ఆశ్చర్యం. ఆమె భర్త ఇటీవలే చని పోయాడు. పిల్లలు కర్మాంతరాలు చేసి వెళ్లిపోయారు. వెళ్లే ముందు మాతో వచ్చి ఉండమ్మా.. అని ఎంతఅడిగినా వెళ్లలేదు. సరే.. పెద్ద వయసు.. అలవాటు పడిన ఇల్లు అనుకుంటే ఈ సంగీతం ఏమిటి? ఒక దిగులూ బాధా లేకుండా ఈ నవ్వు ఏమిటి?ఏవో మాటలు చెప్పి తన ఫ్లాట్కు వచ్చేశాడు. ఫ్లాటా అది? అడవిలా ఉంది. ఎక్కడి బట్టలు అక్కడే. ఎక్కడి గిన్నెలు అక్కడే. ఒక మూల గుట్టలు పడిన న్యూస్ పేపర్లు. ఇంకో వైపు తుడవని టీ మరకలు. మనిషి కూడా ఒక కళా కాంతీ లేకుండా. అతని భార్య కూడా కొద్ది రోజుల క్రితమే క్యాన్సర్తో మరణించింది. ఇన్నాళ్లూ ఆమె అతనికి అన్నీ అమర్చిపెట్టింది. పిలిస్తే పలికి... పిలకపోయినా పలికి... ఇప్పుడు ఒక్కడే చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో తెలియక అవస్థ పడుతున్నాడు. గదులు తెలియడమే ఇల్లు తెలియడం అనుకున్నాడు.గంగాధరం- విజయలక్ష్మి... పక్కపక్కగా ఉండే ఫ్లాట్లు. ఒకేలాంటి కష్టం. కాని విజయలక్ష్మి ఒకలా ఉంది. గంగాధరం మరోలా ఉన్నాడు. ‘మీకు మీవారు పోయారన్న బెంగ లేదా’ అడిగాడొక రోజు. ‘ఎందుకు లేదు?’ ఎదురు ప్రశ్న వేసింది. ‘ఉంటుంది. బాధ ఉంటుంది. బెంగ ఉంటుంది. ఇన్నాళ్లు కలిసి జీవించడం వల్ల జ్ఞాపకాలు ఉంటాయి. అవన్నీ ఎంతవాస్తవమో భర్త పోయాక ఆర్థిక ఇబ్బందులు గనక లేకపోతే స్త్రీ చేసే మొదటి పని రిలాక్స్ కావడమే అనేది కూడా అంతేవాస్తవం. ఇన్నాళ్లూ భర్తే తానై తానే భర్తైబతికి ఉంటుంది కదా. ఇప్పుడన్నా కనీసం కొత్త స్నేహితులతో మాట్లాడవచ్చు. పాత అలవాట్లను నెమరు వేసుకోవచ్చు. తీరిగ్గా పుస్తకాలు చదువుకోవచ్చు. ఇక వంట పని అంటారా... భర్త చనిపోతే భార్యకు ఆ చాకిరీ తగ్గుతుందే తప్ప పెరగదు’... గంగాధరం జవాబు చెప్పలేకపోయాడు. నిజానికి అతడి కష్టం చెప్పనలవిగాకుండా ఉంది. ఎవరి మీదనో తెలియని కోపంగా ఉంది. సాయంత్రమైతే చాలు ఇంట్లో ఉండలేక ఫ్లాట్కు తాళం వేసి బయటకు వెళ్లిపోతున్నాడు.తిరిగి తిరిగి ఇంటికి చేరుకుంటే కాస్తయినా పలకరించే విజయలక్ష్మే అతడికిప్పుడు అతి పెద్ద ఓదార్పు. సంవత్సరం గడిచింది. ఇద్దరి మధ్యా పరిచయం పెరిగింది. స్నేహం పెరిగింది. మనసులోని మాట ఏదైనా చెప్పేయవచ్చు అన్న చనువు కూడా పెరిగిందేమోనని గంగాధరానికి అనిపించింది. ‘మనం పెళ్లి చేసుకుందామా’ అడిగాడు.‘ఏంటి?’ నవ్వింది. ‘ఏంటి’.. మళ్లీ నవ్వింది. పడీ పడీ నవ్వింది. ‘నేను మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి?’ ‘తోడు కోసం’‘తోడు కోసమా?’ నవ్వుతూ అంది- ‘నాకు తెలుసు తోడంటే ఏమిటో? మగవాడి దృష్టిలో తోడంటే బట్టలు ఉతకడం, ఇల్లు ఊడ్చడం, అంట్లు తోమడం, వండి వార్చడం... ఇవన్నీ చేసిపెట్టడమే మీకు కావలసిన తోడు. ఇన్నాళ్లు అవి చేసి చేసి విసిగిపోయి ఉన్నాను. ఇప్పుడే వాటి నుంచి బయట పడ్డాను. మళ్లీ తోడు అనే అందమైన ముసుగు వేసి నన్ను ఈ రాద్ధాంతంలోకి లాగకండి’... లేచి ఫ్లాట్కు వచ్చేశాడు. ఆ రాత్రి చాలా ఆలోచించాడు. స్త్రీ గౌరవించే, స్త్రీ కోరుకునే, స్త్రీ అభిమానించే మగతోడు ఎలా ఉండాలి? కొంచెం అందినట్టు అనిపించింది. మరుసటి రోజు బజారుకు వెళ్లాడు. ఇంటికి అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకున్నాడు. బూజు కట్టెలు వెతికి బూజు దులుపుకున్నాడు. బట్టలు సర్దుకున్నాడు. తడిబట్ట పెట్టి టీపాయ్లు కప్బోర్డులు మెరిసేలా తుడుచుకున్నాడు. పని మనిషి ఉండొచ్చు. కాని మన ఇంటి మీద శ్రద్ధ ఉండాల్సింది మనకే కదా. ఇక వంట పని. కొద్దిగా తెలుసు. ఇప్పుడు ఇంకాస్త మనసు పెట్టి వండటం నేర్చుకున్నాడు. చూడటానికే కాదు, తినడానికి కూడా ఆకర్షణీయంగా ఉండే పదార్థాలు చేయడం ఇప్పుడు తనకు వచ్చు. ఒకరోజు ఆమెను భోజనానికి పిలిచాడు. కుదురుగా ఉన్న ఇంట్లో ముచ్చట గొలిపే డైనింగ్ టేబుల్ మీద రుచికరమైన భోజనం. ‘తోడంటే ఏమిటో నాకు తెలిసింది’ అన్నాడు. నవ్వుతూ చూసింది. ‘అవును. తోడంటే బాధ్యతలో సగం. బరువులో సగం. బంధంలో సగం.సంతోషంలో సగం. కన్నీటిలో సగం. ఒక సంపూర్ణమైన అనుబంధానికి మనిద్దరం చెరో సగం’... చెప్తూ ఆమె వైపు చూశాడు. ఆమె కోసం చూశాడు.యాభై ఏళ్ల స్త్రీ ఆమె. సగం జీవితాన్ని దాటేసిన స్త్రీ. కాని తన ఎదురుగా ఉన్న మగవాణ్ణి, తనను తాను మార్చుకున్న మగవాణ్ణి, స్త్రీ గౌరవించి ప్రేమించేలా సిద్ధమైన ఆ మగవాణ్ణి చూసి పదహారేళ్ల అమ్మాయిలా ముచ్చట పడింది. తుళ్లి పడింది.హృదయంలో ప్రేమ ఉప్పొంగగా దగ్గరగా వచ్చి చేతిని అందుకుని మనస్ఫూర్తిగా ముద్దాడింది. ఒక కొత్త ప్రయాణం- అర్థవంతంగా మొదలైంది. ఓల్గా -
రోడ్డు ప్రమాదంలో మహిళా సర్పంచ్ మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కింద పడ్డ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా గండే డ్ మండలం మహ్మదాబాద్ గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.,.. మహబూబ్నగర్ జిల్లా మద్దూరు మండలం పల్లెల్ర గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి(31) తన సోదరుడు అనిల్(24)తో కలిసి మహబూబ్నగర్ నుంచి కోస్గి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన రెండు బైకులు పరిగి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు కింద పడ్డాయి. దీంతో విజయలక్ష్మి, అనిల్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
బొబ్బిలిలో మరో ప్రత్యూష
మానసిక వికలాంగురాలికి సవతి తల్లి వేధింపులు మరుగుదొడ్డి వద్ద ఉంచుతూ నిత్యం చిత్రవధ స్థానికులు ఫిర్యాదుతో కదిలిన ఐసీడీఎస్ అధికారులు బొబ్బిలి: తెలంగాణలో సవతి తల్లి వేధింపుల నుంచి బయటపడిన ప్రత్యూష పరిస్థితి ఇంకా కళ్ల ముందు కదలాడుతుండగానే ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలిలో అలాంటి సంఘటన వెలుగుచూసింది. బొబ్బిలి మున్సిపాలిటీలో బిల్ కలె క్టరుగా పనిచేస్తున్న కాంతారావుకు ముగ్గురు పిల్లలు. భార్య చారుమతిదేవి 2008లో మృతి చెందింది. తల్లితో రెండో కూతురు విజయలక్ష్మికి మంచి అనుబంధం ఉంది. అగ్రికల్చరల్ బీఎస్సీ పూర్తి చేసిన ఆమె, తల్లిలేని జీవితాన్ని ఊహించుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించడంతో మెడ నరాలు దెబ్బతిని మానసిక వికలాంగురాలైంది. భర్తలేని దేవి అనే మహిళను కాంతారావు మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. వీరి వద్దే విజయలక్ష్మి ఉంటోంది. సవతి తల్లి దేవి విజయలక్ష్మిని సరిగా చూడకపోవడమే కాకు ండా, మరుగుదొడ్డి వద్ద ఉంచి, అక్కడే తిండి పెట్టడం, నిత్యం కొడుతూ వేధిస్తుండడంతో స్థానికులు ఎప్పటికప్పుడు నిలదీసేవారు. ఇటీవల ప్రత్యూష ఘ టన వెలుగులోకి రావడంతో స్పందించిన స్థానికులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారమివ్వడంతో వారు చర్యలకు ఉపక్రమించారు. -
మహిళ ఆత్మహత్య
పెద్దాపురం : పెద్దాపురం నుంచి కట్టమూరు వెళ్లే రోడ్డుమార్గంలో ఉన్న సత్తెమ్మ కాలనీలో ఆదివారం మధ్యాహ్నం మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు యండవిల్లి విజయలక్ష్మి (30) భర్త చనిపోవడంతో సత్తెమ్మ కాలనీలో తన పిల్లలతో నివాసం ఉంటోంది. కొన్నాళ్లుగా విజయలక్ష్మి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతోంది. ఉదయం సమీపంలోని చర్చికు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సంఘటనపై స్థానికులు నుంచి వివరాలను సేకరించారు. ఎస్సై వై.సతీష్ ఆదేశాల మేరకు అడిషినల్ ఎస్సై ఏసుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీవీ మెరకలో ఉరి వేసుకుని వ్యక్తి .. సఖినేటిపల్లి : మద్యానికి బానిసై, ఆర్థిక ఇబ్బందులు తాళలేక వీవీ మెరకలో సైపు రామకృష్ణ (33) తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం రాత్రి జరిగినట్టుగా అనుమానిస్తున్న ఈ సంఘటన ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు చూడడంతో వెలుగులోకి వచ్చింది. ఎస్సై కృష్ణభగవాన్ కథనం ప్రకారం రామకృష్ణ భార్య ఉపాధి రీత్యా విదేశాల్లో ఉంటోంది. మృతుడు వీవీమెరక గాంధీనగర్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో రామకృష్ణ మద్యానికి బానిసై, ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయాడు. గొందిలో నివాసం ఉంటున్న వదిన కటికిరెడ్డి సీతామహలక్ష్మి ఆదివారం మరిది రామకృష్ణను చూడడానికి వీవీ మెరకలోని ఇంటికి వచ్చింది. ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. -
విద్యావంతులే బోల్తాపడుతున్నారు!
- సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న సిటీవాసులు - వరుడు, ఫ్రెండ్ రూపంలో దగా - పార్శిల్ గిఫ్ట్ పంపిస్తామని లక్షల్లో దోచుకుంటున్న వైనం సాక్షి, సిటీబ్యూరో: మొన్న...భారత్ మ్యాట్రీమోని కన్నడిగూడ వెబ్సైట్లో తార్నాకలో ఉంటున్న 54 ఏళ్ల విజయలక్ష్మి పేరు రిజిస్టర్ చేసుకుంది. చందన్ డేవిడ్ పటేల్ అనే వ్యక్తి తన ప్రొఫైల్కు లైక్ కొట్టడంతో అతని వివరాలను తెలుసుకునేందుకు వెబ్సైట్ వాళ్లకు రూ. 5 వేలు చెల్లించింది. తనకు పెళ్లి అయి విడాకులయ్యాయని, యూకేలోని ఆయిల్ రిఫైనరీలో ఇంజినీర్గా పనిచేస్తున్నానని అతను పేర్కొన్నాడు. ఇలా వీరిమధ్య సన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలోనే 40 వేల యూఎస్ డాలర్లు, వెడ్డింగ్ రింగ్, బంగారు ఆభరణాలతో పాటు విడాకుల పత్రాలతో పార్సిల్ పంపుతున్నానని ఆమెకు చెప్పాడు. అలా ఆమెకు మరుసటి రోజు డాక్టర్ ఫిలిప్స్ నుంచి వచ్చిన ఫోన్కాల్తో కార్ట్కోడ్తో పాటు కస్టమ్స్ టాక్స్, మనీ లాండరింగ్ కింద దాదాపు 15,89,000ల ఆయా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసింది. మరో నాలుగు లక్షలు కట్టాలని మళ్లీ కాల్ రావడంతో అనుమానం వచ్చిన పెద్దావిడ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను జూలై 21న ఆశ్రయించింది. ఈ మేరకు ఢిల్లీకి వెళ్లి వలపన్ని చందన్ డేవిడ్ పటేల్ అలియాస్ డూయిస్ను అరెస్టు చేసి తీసుకొచ్చారు. నిన్న...మెట్టుగూడలో ఉంటున్న పద్మిని కూడా విజయలక్ష్మి మాదిరిగానే మోసపోయింది. భారత్ మ్యాట్రీమోని కన్నడిగూడ వెబ్సైట్లో పేరు రిజిస్టర్ చేసుకుంది. అమెరికాలో డెంటిస్ట్గా పనిచేస్తున్నానని దేవ్ ప్రిన్స్ అడిగ పరిచయం చేసుకున్నాడు. గిఫ్ట్ పంపుతున్నానని చెపి.. డబ్బు కాజేశాడు. మళ్లీ డబ్బు పంపించమని అడగడంతో మోసపోయానని గ్రహించిన ఆమె జూలై 17న సైబర్ పోలీసులను ఆశ్రయించింది. అతడిని హైదరాబాద్ రప్పించి పట్టుకొనేందుకు సైబర్ పోలీసులు పథకం వేశారు. తాజాగా... తెలుగు దినపత్రికలో సబ్ఎడిటర్గా పనిచేస్తున్న యువతికి ఆరు నెలల క్రితం ఫేస్బుక్లో స్కాట్లాండ్కు చెందిన జాన్సన్ మోరేతో పరిచయం ఏర్పడింది. అలా అతను ఆమె కుటుంబానికి చాలా దగ్గరయ్యాడు. వారం క్రితం 15 వేల పౌండ్లు, రింగ్, ల్యాప్టాప్, సెల్ఫోన్ పార్శిల్ పంపుతున్నానని చెప్పాడు. మరుసటి రోజే కార్తీ అగర్వాల్ కస్టమ్స్ అధికారిగా ఫోన్ చేసి డెలివరీ చార్జీస్ కింద రూ. 42,500లు, మనీ లాండరింగ్ కింద 1,30,000, టాక్స్ కింద 1,70,000లు చెల్లించాలని బ్యాంక్ ఖాతాలు ఇచ్చాడు. ఆ యువతి ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేసింది. మళ్లీ యాంటీ టైస్టు డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామని, 2,90,000లు బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని కోరడంతో అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులను బుధవారం ఆశ్రయించింది. ఇలా విద్యావంతులు, సంపన్నులు, భారీగా డబ్బు వస్తుందని మరికొందరు సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. లక్షల్లో డబ్బులు చెల్లించి పీకల్లోతు నష్టపోయాక సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఫేస్బుక్ చాటింగ్ స్నేహంతో కొందరు... మ్యాట్రీమోనిలో వరుడి రూపంలో మరికొందరు... లాటరీ తగిలిందని ఇంకొందరు...ఇన్సూరెన్స్ డబ్బులు నాలుగింతలు చేస్తామని మరికొందరు... ఇలా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్లో నెలకు పదుల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయంటే ఇక్కడ వాటి తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని సైబర్ పోలీసులు సామాజిక మాధ్యమాలు, పత్రికా ప్రకటనల ద్వారా అవగాహన కలిగించినా... ఉన్నత విద్యావంతులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను పట్టుకుంటున్నా.... వారి నుంచి మాత్రం డబ్బు రికవరీ కావడం లేదు. అందుకే సైబర్ నేరగాళ్ల విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీ మూల్యం తప్పదని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్త అవసరం ప్లస్ 371, ప్లస్ 371 నంబర్లతో వచ్చే ఫోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫేస్బుక్లో వ్యక్తిగత సమాచారం పెట్టకపోవడమే ఉత్తమం. కొన్ని సంస్థలు బూటకపు ఈ మెయిల్స్తో నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్నాయి. నగదు లావాదేవీల్లో నయా వంచన జరుగుతోంది. అమ్మాయిలు కూడా ఊరికే ఎదుట వ్యక్తులను నమ్మి లక్షలు లక్షలు ధారపోయరాదు. సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తత అవసరం. ముగ్గురు నైజీరియన్ల అరెస్టు సాక్షి, సిటీబ్యూరో: లాటరీ తగిలిందని సిటీకి చెందిన ఓ అమ్మాయిని మోసగించిన ముగ్గురు నైజీరియన్లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. న్యూఢిల్లీలోని మహవీర్ మార్గ్లో నిందితులు ఒడిడి అనిరియోడి వాల్స్, కెమాకర్ ఆంటోనీ, జెన్వోబసి గోస్పెల్ ఇకెన్నాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు....వారిని అక్కడి సీఎంఎం టిస్ హజారి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారంట్పై నగరానికి బుధవారం తీసుకొచ్చారు. వివరాలు... మూడు కోట్ల 60 లక్షల సమ్సాంగ్ లాటరీ తగిలిందని జూన్ తొలివారంలో మల్కాజిగిరికి చెందిన ఓ అమ్మాయి సెల్కి ఎస్ఎంఎస్ వచ్చింది. డబ్బు పంపించాలంటే చిరునామాతో పాటు బ్యాంక్ ఖాతా వివరాలు పంపించామన్నారు. దీంతో ఎగిరి గంతేసిన ఆమె పూర్తి వివరాలు పంపింది. ఆ తర్వాత రోజు సమ్సంగ్ కంపెనీ డెరైక్టర్ జేమ్స్ మోర్గాన్ విన్నింగ్ లాటరీ గెలుచుకుందని మెయిల్ పంపించారు. లావాదేవీలు సాఫీగా సాగేందుకు భారత్లోని ఆర్బీఐ అధికారులు కాంటాక్ట్లో ఉంటారని తెలిపారు. ఇన్కమ్ టాక్స్ క్లియరెన్స్, యాంటి టైస్టు సర్టిఫికెట్, కస్టమ్స్ క్లియరెన్స్ కోసం వివిధ బ్యాంక్ ఖాతాలు ఇవ్వగా అందులో 15,50,800లు డిపాజిట్ చేసింది. ఆ తర్వాత కూడా డబ్బులు డిపాజిట్ చేయమని కాల్స్ రావడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్స్ ఏసీపీ జయరామ్, ఇన్స్పెక్టర్ మహమ్మద్ రియాజుద్దీన్, ఎస్ఐ విజయ్ వార్తన్ బృందం న్యూఢిల్లీకి వెల్లి మహవీర్ మార్గ్లో ముగ్గరు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఒడిడి అనిరియోడి వాల్స్, కెమాకర్ అంటోనీ, జెన్వోబసి గోస్పెల్ ఇకెన్నాల నుంచి ఐదు ల్యాప్టాప్లు, పది సెల్ఫోన్లు, ఎనిమిది ఇంటర్నెట్ డేటాకార్డులు, 53 అక్టివ్ సిమ్కార్డులు, 1,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకడైన ఒడిడి అనిరియోడి వాల్స్ నైజీరియాలో పోలీసు అధికారిగా పనిచేసి...2013లో భారత్కు బిజినెస్ వీసాపై ఢిల్లీకి వచ్చాడు. కాలపరిమితి ముగిసినా అక్రమంగా ఢిల్లీలోనే ఉంటున్నారు. -
ఇరుకు గదుల్లో ఇక్కట్లు..
‘గుడ్లు, బియ్యం, నూనె ఇవ్వడం కన్నా రోజూ భోజనం పెడితే బాగుంటుంది. ఇరుకు గదుల్లో పిల్లలతో కలిసి కూర్చోవాలన్నా, ఆరోగ్య సమస్యలు చెప్పుకోవాలన్నా నానా తిప్పలు పడుతున్నాం’ అంటూ బాలింతలు, గర్భిణులు, పిల్లల తల్లులు స్త్రీ, శిశుసంక్షేమశాఖ (ఐసీడీఎస్) జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ పి.విజయలక్ష్మికి మొరబెట్టుకున్నారు. జిల్లాలో 25 ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 5,143 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 86,721 మంది గర్భిణులు, బాలింతలు, 85,935 మంది 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులు, 1,46,780 మంది ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలు ఉన్నారు. వారి ఇబ్బందులను తెలుసుకోవాలనుకున్న ‘సాక్షి’ మీడియా..ఆ బాధ్యతను నిర్వర్తిం చాలని కోరగా ఆ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ విజయలక్ష్మి శనివారం ‘వీఐపీ రిపోర్టింగ్’ చేశారు. ప్రాజెక్టు డెరైక్టర్ విజయలక్ష్మి (స్వామినగర్లో) : ఇక్కడ బాధ్యులెవరు? ఎంత మంది పిల్లలుండాలి? ఇప్పుడెంత మంది ఉన్నారు? ఆ హాజరు పట్టీ ఇలా ఇవ్వండి. అంగన్వాడీ వర్కర్ భాగ్యలక్ష్మి : 15 మంది ఉన్నారు మేడమ్. 30 మంది పిల్లలుండాలి. తల్లులు వచ్చి తీసుకువెళ్లారు మేడమ్. పీడీ : మరి నీవేం చేస్తున్నావు? ఆటా, పాటా అన్నీ పిల్లలకు నేర్పిస్తున్నావా? వర్కర్ : పాటలు నేర్పిస్తున్నాను, వాళ్లు పాడుతున్నారు మేడమ్. పీడీ : ఏమమ్మా నీ పేరేమిటి? నీకు ఎన్నో నెల? ఈ అంగన్వాడీ కేంద్రం ఎలా పనిచేస్తోంది? ఆహారం బాగా అందిస్తున్నారా? బాలింత : నాపేరు పద్మండీ. ఎనిమిదో నెలండీ. వారానికి నాలుగు గుడ్లు ఇస్తున్నారు. కేంద్రం బాగానే ఉంది. రెండు టీటీ ఇంజక్షన్లు కూడా చేశారు. పీడీ : మీకు బియ్యం, నూనె, కందిపప్పు ఎందుకు ఇస్తున్నారో తెలుసా? మీకెవరైనా చెప్పారా? బాలింత : బరువు పెరగడానికే కదండీ.. ఎవరూ చెప్పలేదు మేడమ్! పీడీ : మీ బరువు పెరగడానికి కాదు తల్లీ.. కడుపులో ఉన్న బిడ్డ బరువు, పెరిగి ఆరోగ్యంగా ఉంటుందని. అశ్రద్ధ చేయకండి సుమా. బాలింత : సరే మేడమ్! పీడీ : నీ పేరేమిటి, ఏమైనా సమస్యలున్నాయా? బాలింత : అనురాధండీ. మేడమ్! పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో చిన్ని గదిలో చాలా ఇరుకిరుగ్గా కూర్చుంటున్నారండీ. కనీసం వెలుతురు కూడా రావడం లేదు. పీడీ : పిల్లలందరికీ సరిపోయేలా కొత్త భవనం నిర్మించేందుకు అధికారులతో మాట్లాడి ప్రతిపాదనలు పంపిస్తాను. పీడీ : ఏవమ్మా నీ పేరేమిటి, పిల్లలకు పౌష్టికాహారం ఎలా అందిస్తున్నారు? పిల్లలంతా వస్తున్నారా? బాలింత : దేవి మేడమ్. పిల్లలకు గుడ్లు ఇస్తున్నారు కానీ.. వాళ్లు ఆడుకోవడానికి కేంద్రంలో అవకాశం కనిపించడం లేదండీ. మీరే ఏదైనా చేయాలి. పీడీ : పిల్లల ఇబ్బందులు నేను కూడా చూశాను కదా. మీరు చెప్పినట్టే ప్రీ స్కూల్ పిల్లల కోసం కాస్త విశాలంగా ఉండే గది ఏర్పాటు చేయిస్తాను. వారు ఆడుకోవడానికి కూడా ఏదైనా చూద్దాం మరి. (మరొకరిని ఉద్దేశించి) నీ పేరేమిటి? ఏదైనా చెప్పదలుచుకున్నావా, పర్లేదు చెప్పమ్మా. నీ పేరు కేంద్రంలో నమోదు చేసుకున్నారా? క్రమం తప్పకుండా ఏఎన్ఎం చెకప్చేస్తున్నారా, లేదా? బాలింత : రామలక్ష్మి మేడమ్. పేరు నమోదు చేసుకున్నారు. ఏఎన్ఎం వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు కానీ మేడమ్.. వారానికి నాలుగు గుడ్లు, కందిపప్పు, బియ్యం కాకుండా మాకు ప్రతి రోజు భోజనం పెట్టే ఏర్పాటు చేయండి చాలు. పీడీ : మంచి ఐడియా ఇచ్చావు తల్లీ. అది నా పరిధిలో ఉండదమ్మా. కానీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాను. పీడీ : ఏమ్మా బియ్యం, కందిపప్పు, నూనె ఎంతెంత ఇస్తున్నారు? అన్ని సక్రమంగానే అందుతున్నాయా? భయపడకుండా చెప్పండి. ఒకేసారి నాలుగు గుడ్లు ఉడికించి ఇస్తున్నారా లేక మామూలు గుడ్లు ఇస్తున్నారా. బాలింత : అన్నీ ఇస్తున్నారు మేడమ్. గుడ్లు ఉడికించి వారానికి నాలుగు ఇస్తున్నారు. పీడీ: నీ పేరేటమ్మా, నీకు ఎన్నో నెల, కేంద్రం ఎలా పనిచేస్తోంది, అన్ని సక్రమంగా అందుతున్నాయా, ఏమైనా తేడాలున్నాయా? బాలింత : లావణ్య మేడమ్. ఎనిమిదో నెలండీ. బియ్యం, నూనె సక్రమంగానే అందుతున్నాయి. పీడీ: మీరెవరు? ఇప్పుడు వచ్చారేమిటి? సూపర్వైజర్: మేడమ్.. నా పేరు భాగ్యలక్ష్మి. నేను ఇక్కడ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. ఇటీవలే జాయిన్ అయ్యాను.. అందుకే ఆలస్యమైంది మేడమ్. పీడీ (కాకినాడ అర్బన్ ముత్తానగర్లో) : ఏమమ్మా నీ పేరేమిటి, పౌష్టికాహారం బాగా అందుతోందా? బాలింత : కావేరి అండీ. గర్భిణులకు పండ్లు, పాలు, డ్రైప్రూట్స్ వంటివి సరఫరా చేయాలి. పౌష్టికాహారంగా ఇస్తున్న బియ్యం, పప్పు, నూనె వారం రోజులకు కూడా సరిపోవడం లేదండీ. నెలలో 20 రోజులకు సరిపడా పౌష్టికాహారం అందించేలా చూడండి మేడమ్. పీడీ : ప్రభుత్వం నుంచి అందే పౌష్టికాహారం పూర్తిగా అందేలా చూస్తాను. నెలలో 20 రోజుల విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానమ్మా. (మరొకరిని ఉద్దేశించి):నీ పేరేమిటమ్మా, ఏమైనా సమస్యలున్నాయా? బాలింత : గౌరి అండీ. పక్కా భవనం లేక గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికలు కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలతో పాటు కూర్చుని ఆరోగ్యసమస్యలు తెలుసుకుందామంటే ఇబ్బందమ్మా. నెలవారీ ఇంజక్షన్లు అంగన్వాడీ కేంద్రాల్లో కాకుండా మున్సిపల్ స్కూలుకు వెళ్లి చేయించుకుంటున్నామమ్మా. పీడీ : మీ సమస్య అర్థమైంది. సొంత భవనాల విషయంపై చర్యలు తీసుకుంటాను. (మరో మహిళతో) నీ సమస్య ఏమిటమ్మా? మహిళ : మణి అండీ. నాలుగేళ్ల మా బాబు గౌతమ్ కిరణ్ రెండుకాళ్లూ చచ్చుబడిపోయాయి. నడవలేడు, మాట్లాడలేడు. చాలా మంది డాక్టర్లకు చూపించానమ్మా. క్రమేపీ నడుస్తాడని చెబుతున్నారు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. పిల్లవాడికి పౌష్టికాహారం అందించలేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ కేంద్రం ద్వారా ఇస్తున్న ఫుడ్ తీసుకొని పెడుతున్నాను. పింఛన్ ఇప్పించి ఆదుకోవాలమ్మా. పీడీ : అధికారులకు నివేదించి సాధ్యమైనంత వరకు సాయమందేలా చూస్తాను. పొద్దుపోతోంది వెళ్లొస్తా... - ప్రజెంటర్స్ : లక్కింశెట్టి శ్రీనివాసరావు, అనుసూరి ఆనందరావు, పళ్ల రమేష్బాబు అన్ని కేంద్రాలకూ శాశ్వత భవనాలు.. ప్రతి అంగన్వాడీ కేంద్రాన్నీ మోడల్ కేంద్రంగా తీర్చిదిద్ది అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలనేదే మా లక్ష్యం. దశలావారీగా అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలను నిర్మించాలన్న సంకల్పంతో ఉన్నాం. 2013-14 లో 372 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలకు మంజూరు చేశాం. 2014-15లో పట్టణాలు, గ్రామాల్లో ఉన్న కేంద్రాలకు అనువైన స్థలాలను సేకరిస్తున్నాం. ఐదేళ్లలో జిల్లాలోని అన్ని కేంద్రాలకూ పక్కా భవనాలు నిర్మించాలనేది లక్ష్యం. అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తుంటే పట్టణాల్లో ఇప్పుడిస్తున్న రూ.3వేలను త్వరలో రూ.5 వేలకు పెంచే ప్రతిపాదన ఉంది. గ్రామాల్లో ఇంటి అద్దె కింద రూ.750 ఇస్తున్నాం. మానసిక వికలాంగులైన విద్యార్థులను గుర్తించి, అవసరమైన వైద్యసాయంతో పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని బిడ్డకు, తల్లికి అందజేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్న బియ్యం, పప్పులను మర ఆడించి నూనె కలుపుకొని తింటే గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా తయారవుతారు. తల్లి కడుపులోని బిడ్డకు ఏ విధమైన పౌష్టికాహార లోపం రాకూడదన్న ఉద్దేశంతో వారానికి అందజేస్తున్న నాలుగు గుడ్లు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాల్లోనే తల్లులు తినాలి. అంగన్వాడీ కార్యకర్తలు పౌష్టికాహారాన్ని అందజేయకుంటే నా దృష్టికి తీసుకురండి. - పి.విజయలక్ష్మి, పీడీ -
మాటల్లో గారడీ.. ప్రయాణంలో దోపీడీ
సిద్దిపేట రూరల్ : డబ్బును దాచేందుకు ఆటోలో బ్యాంక్కు వెళ్తున్న ఓ వృద్ధురాలిని మాటలతో మస్కా కొట్టిన ఇద్దరు మహిళలు నగదును దోపీడీ చేసిన సంఘటన శుక్రవారం సిద్దిపేట పట్టణంలో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని బక్రిచెప్యాల గ్రామానికి చెందిన మల్లోజి విజయలక్ష్మి గ్రామానికి చెందిన ఓ ఆటోలో తన వద్ద ఉన్న రూ. 2.50 లక్షలను ఓ చేతి సంచిలో పెట్టుకుని సిద్దిపేటలో ఉంటున్న తన కుమారుడి వద్దకు బయలుదేరింది. ఈ క్రమంలో రాజీవ్ రహదారి పొన్నాల స్టేజీ వద్ద గుర్తుతెలియని ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరు పురుషులు ఆటో ఎక్కారు. ఆటోలో ప్రయాణిస్తున్న విజయలక్ష్మిని మాటల్లో పెట్టి ఆమెకు తెలియకుండానే చేతిలో ఉన్న సంచిని కత్తిరించి అందులో గల రూ. 2.50 లక్షలను అనుమానం రాకుండా నొక్కేశారు. పాత బస్టాండ్ వద్ద అందరూ ఆటో నుంచి దిగారు. అప్పటికే ఆటోలో వస్తున్న విజయలక్ష్మి కోసం తన కుమారుడు అక్కడ సిద్ధంగా ఉండడంతో ఆమెను తీసుకుని డబ్బులను జమ చేసేందుకు పట్టణంలోని ఎస్బీహెచ్ బ్యాంక్కు తీసుకెళ్లాడు. డబ్బులను జమ చేసే ఓచర్లో పేర్లు రాసి నోట్లు లెక్కించడానికి సంచిని తెరిచి చూడగా అందులోని డబ్బు మాయమైంది. సంచికి కత్తిరించిన ఆనవాళ్లు కనిపించడంతో బాధితురాలు డబ్బులు దోపిడీకి గురయ్యాయని లబోదిబోమంది. వెంటనే కుమారుడితో కలిసి స్థానిక వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీధర్ వన్టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని చోరీకి సంబంధించిన వివరాలను బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. వెంటనే పట్టణంలో పోలీసులను అలర్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సురేందర్రెడ్డి తెలిపారు. -
ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
శివాజీనగర్/వర్ని : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 41వ జన్మదినోత్సవాన్ని ఆదివారం జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జరిపారు. జిల్లాకేంద్రంలోని గాయత్రినగర్లో పార్టీ అధికార ప్రతినిధి గైనికాడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి, పంచిపెట్టారు. ఈసందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల పక్షాన పోరాడే నాయకుడన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి జిల్లా నుంచి పోరాడారని గుర్తుచేశారు. తెలంగాణ జిల్లాల్లో పార్టీని మరింత బలపర్చేందుకు క్షేత్రస్థాయి నుంచి కృషిచేస్తున్నామన్నారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. నాయకులు ప్రమోద్, నవీన్, స్వరూప, లక్ష్మి, కిషన్, రాజా, భిక్షపతి పాల్గొన్నారు. వర్నిలో మండల కేంద్రంలో ఆదివారం వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. శ్రీనివాసకాలనీలోని చర్చికి వెళ్లి పాస్టర్ రవిబాబు సమక్షంలో ప్రార్థనలు చేశారు. జగన్మోహన్రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని ప్రార్థించారు. ఈ సందర్బంగా పార్టీ జిల్లా నాయకుడు జలాల్పూర్ తజ్ముల్ మాట్లాడుతూ తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయ సాధన కోసం కృషిచేస్తున్నారన్నారు. ఆయన హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్ మండల కన్వీనర్ గంగుల లలేందర్, విద్యార్థి విభాగం మండల కన్వీనర్ విశ్వచారి, సంజయ్, అభిమాన్యు, నిఖిల్, విజయ్, జానిబాబా పాల్గొన్నారు. -
తెలుగువారిలో ఎంతో టాలెంట్
స్వరానుబంధం..! ‘పల్లె కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రల’ పాట, ‘బురద నవ్వింది కమలాలుగా’ అని ‘విశ్వంభర’లోని కవితలు వినగానే.. ఎలా గోరటి వెంకన్న, డాక్టర్ సి.నారాయణ రెడ్డి గుర్తుకు వస్తారో.. అలానే కర్ణాటక సంగీతంలో లాల్గుడి పేరు వినగానే లాల్గుడి గోపాల అయ్యర్ జయరామన్ బిడ్డలు లాల్గుడి జీజేఆర్ కృష్ణన్, విజయలక్ష్మి గుర్తుకు వస్తారు. ప్రతిభ లేని వారిని ఘనమైన కుటుంబ నేపథ్యం కూడా రక్షించలేదని అంటున్న వారికి... సంగీతమే నిజయమైన ప్రపంచం. ‘కళాసాగారం’ సంస్థ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చి వారు ‘సిటీ ప్లస్’తోముచ్చటించారు. మా పూర్వీకులు త్యాగరాజ శిష్యులు. నాటి నుంచి నేటి వరకు సంగీతంతో మా అనుబంధం కొనసాగుతోంది. దాన్ని అందిపుచ్చుకుని భక్తితో ముందుకు సాగుతున్నాం. పూర్వీకుల ఆశీర్వాదంతో వయోలిన్లో ప్రతిభ సంపాదించాం. లాల్గుడి బాణీ... కర్ణాటక సంగీతానికే మకుటాయమానం లాల్గుడి జయరామన్. లాల్గుడి అనేది మా తల్లిదండ్రుల ఊరు. సంగీతం గురించి చర్చ వస్తే లాల్గుడి శైలి అని చెబుతారు. అంతగా జయరామన్ సంగీత ప్రపంచంలో సుప్రసిద్ధులయ్యారు. అందుకే కర్ణాటక సంగీతమన్నా, వయోలిన్ పాటలు వినపడ్డా ‘లాల్గుడి వారి బాణీ’ అని ఠక్కున అనేస్తారు. జీజేఆర్ కృష్ణన్తో నాది రక్త సంబంధం. ఐదేళ్ల నుంచే కర్ణాటక సంగీతం, వయోలిన్పై మక్కువ కలిగింది. నాన్న జయరామన్తో కలసి కచేరీలు చేశాం. ఊపిరి ఉన్నంత వరకూ ఇలా కచేరీలు చేస్తూనే ఉంటాం. సంగీతం ద్వారా వారు ఆశించినట్లు సమాజంలో విలువలు పెంపొందించి, ప్రేమ, కరుణ, సేవానిరతి నింపుతాం. మరో ప్రపంచం సంగీతం ద్వారానే సాధ్యం. అంకితభావంతోనే... నేడు పిల్లలకు చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ గురు, శిష్య పరంపరను విడవకూడదు. సమగ్రంగా సంగీతం, వయోలిన్ నేర్చుకోవాలంటే 20 నుంచి 30 ఏళ్లు పడుతుంది. ఈ రంగంలో రాణించాలంటే... చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి ఉండాలి. ఏకాగ్రత, శ్రద్ధ, వికాసం, పఠనం, జ్ఞాపక శక్తి.. ఇవన్నీ శాస్త్రీయ సంగీతం ద్వారా అలవడతాయి. తెలుగువారిలో ఎంతో టాలెంట్ శాస్త్రీయ సంగీతంలో తెలుగువారూ తక్కువేం కాదు. ఎంతో ప్రతిభ ఉన్నా... తక్కువ మంది ఇటువైపు వస్తున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. విద్యార్థి దశ నుంచే ప్రోత్సహించాలి. హైదరాబాద్తో ఆత్మీయ అనుబంధం చిన్న నాటి నుంచి ఇక్కడికి వచ్చి వెళుతూనే ఉన్నా. మా అమ్మ వైపు బంధువులు సికింద్రాబాద్లో ఉండేవారు. ఇక్కడ కచేరీ అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. తమిళనాడులో సంగీతానికి ప్రాముఖ్యం ఎంతో ఉంది. అందుకే అక్కడ పచ్చగా వర్ధిల్లుతోంది. కోన సుధాకర్రెడ్డి -
రుణమాఫీ కోరుతూ డ్వాక్రా మహిళల ధర్నా
ఆకివీడు : ఎటువంటి షరతులు లేకుండా డ్వా క్రా రుణాలను పూర్తిగా మాఫీ చేయూలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జిల్లా కార్యదర్శి జి.విజయలక్ష్మి డిమాండ్ చేశారు. మహిళా సంఘం ఆధ్వర్యంలో స్థానిక మండల సమాఖ్య కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలు గురువారం ధర్నా చేశారు. అనంతరం సమాఖ్య కార్యాలయంలో బైఠయించి చంద్రబాబు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. విజయలక్ష్మి మాట్లాడుతూ డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు హామీ ఇవ్వడంతో మహిళలు టీడీపీకి పట్టం కట్టారన్నారు. రుణమాఫీ చేస్తారని ఆశగా ఎదురుచూస్తే.. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. నేటికీ రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. సంక్షేమ, పెన్షన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారికి రుణమాఫీ వర్తించదనడం దుర్మార్గమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీని అమలు చేయూలని డిమాండ్ చేశారు. ఐద్వా డివిజన్ శాఖ కార్యదర్శి డి.కల్యాణి మాట్లాడుతూ రుణమాఫీ కోసం ఆశతో ఎదురుచూస్తున్న డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయన్నారు. సభ్యులకు తెలియకుండానే పొదుపు సొమ్ముల్ని బ్యాం క్లు బకాయిలకు జమచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల అశలు వమ్ము అయితే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా మండల శాఖ అధ్యక్షులు దొడ్డి పద్మ, కార్యదర్శి బి.సత్యవతి, పట్టణ శాఖ అధ్యక్షులు యర్రా కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
కొత్త పుస్తకాలు
హోసూరు వంటలు మీకు ‘రామక్కగారి సుమ’ తెలుసా? ఇరవై ఏళ్లుంటాయంతే! తమిళనాడులోని హోసూరులో ఉంటుంది. ‘తల్లి నుడి కోసం, తల్లినుడిలో మాటకోసం, పాటకోసం’ తపన పడే తెలుగు తావు అది. అలాంటి నేలమీది ‘మాలగేర్లో’ పుట్టిన సుమ వాళ్లమ్మ పేరునే ఇంటిపేరుగా పెట్టుకుంది. వాళ్లమ్మ చేసే వంటల్నే కథలుగా మలిచింది. ఒబ్బట్లు, శాస్తాలు, చల్లిపిండి, సబ్బచ్చి బోండాలు, కజ్జాయలు, పులగూరాకు, వెదురుకొమ్ము చారు, పొట్లినంజర మసాలు, పెసలబేడల పాయసం, మొలక ఉలవల చారు... ‘ఉలవల చారు గములు మా ఇల్లు దాటి ఊరుదాటి దిన్నలో మేకలు మేపుతా ఉండే మా అమ్మ దగ్గరకు పోయి నా మింద దూర్లు చెప్పినట్లుంది. ఉడికిన చారును దించుకొని, నీళ్లను ఇంకొక గిన్నెలోకి వంచుకొంటా ఉండగా మా అమ్మాఅబ్బలు వచ్చేసినారు.’ మీకూ నోరూరుతోందా! వంటల్ని రుచి చూపించే సాకుతో వాళ్ల బతుకుల్నీ రుచి చూపించారీ రచయిత్రి. హోసూరు కథలు హోసూరు ప్రాంతీయుడు అగరం వసంత్ గతంలో ‘తెల్లకొక్కర్ల తెప్పం’ కథాసంకలనం తెచ్చారు. ఇప్పుడు ‘వెండిమొయిళ్లు బండబతుకులు’ కథలతో మళ్లీ పలకరిస్తున్నారు. పాముకడుపోడు, పాక్కాయల తోపు, జనిగిలోడు, జొన్నకడ్లగుడి లాంటి 54 పొట్టికథలున్నాయిందులో. లత్తనాయాలు, పుంగుమాటలు, ఇటెంకిటెంకలాంటి ఎన్నో జాతైన మాటలతోపాటు, సింతలేని సితరంగి సంతకొక బడ్డని కన్నెంట లాంటి చమత్కారపు సామెతలూ నాలుక్కి తగులుతాయి. ‘ఇది మా తావు తెలుగు కాదు కదా’ అనుకునేదే లేదు. అక్కున చేర్చుకోవాల్సిన తెలుగు! ‘మన బతుకేమో, మన మాటేమో’ అన్నట్టుగా రాస్తూపోవాలనే (స.వెం.) రమేశప్ప స్ఫూర్తితో కలం పట్టిన ఇతర హోసూరు కథకుల సంకలనం ‘మోతుకుపూల వాన’. నంద్యాల నారాయణరెడ్డి, ఎన్.సురేఖ, కృష్ణకళావతి, అమరనారా బసవరాజు, అశ్వత్థరెడ్డి, మునిరాజు లాంటివాళ్లు రాసిన 19 కథలున్నాయిందులో. ‘మరచిన తెలుగుమాటలు దొరుకుచోటు’ హోసూరు అనిపిస్తుంది ఇవి చదివితే. దీనికి సాక్ష్యంగా అన్నట్టు వచ్చిన పుస్తకం ‘పొరుగు తెలుగు బతుకులు’. హోసూరు నుంచి వచ్చిన సాహిత్యం మీది (రేడియో) వ్యాసాల సంకలనం ఇది. తొలిపలుకి(టెలిఫోన్), అలపలుకి (సెల్ఫోన్), మిన్నులువు (రేడియో), కోగురేకు (బ్లేడ్), ఉల్లాకు (కరపత్రం), మలయిక (ఎక్స్కర్షన్) లాంటి ఎన్నో కడుపునింపే మాటలున్న కథల్ని మనసునిండేలా విశ్లేషించారు విజయలక్ష్మి. -
కమిషనర్ వర్సెస్ ఉద్యోగులు
ఒంగోలు, న్యూస్లైన్ : ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ విజయలక్ష్మి-ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. కమిషనర్ వేధింపులు తట్టుకోలేకపోతున్నామంటూ కార్యాలయంలోని టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు, ఉద్యోగులు బుధవారం మూకుమ్మడిగా సెలవుపెట్టి వెళ్లడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఇప్పటికే కమిషనర్ తీరుపై అక్కడి అధికారులు, ఉద్యోగులు అనేకసార్లు నిరసన వ్యక్తం చేశారు. తాజాగా టౌన్ప్లానింగ్ ఉద్యోగులు మూకుమ్మడిగా సెలవుపెట్టి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని రాతపూర్వకంగా రాసి కమిషనర్కు కూడా అందజేశారు. అంతేగాకుండా మున్సిపల్ పరిపాలనాధికారికి కూడా ఫ్యాక్స్ ద్వారా పంపారు. అనంతరం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను కలిసిన టౌన్ప్లానింగ్ విభాగం ఉద్యోగులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము తీసుకున్న ఈ నిర్ణయానికి నగరపాలక సంస్థ కార్యాలయంలోని అన్ని విభాగాల నుంచి కూడా మద్దతు ఉందని వారు పేర్కొన్నారు. గురువారం ఉదయం సమావేశం నిర్వహించుకుని తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. గతంలో కూడా కమిషనర్ వైఖరికి నిరసనగా కార్యాలయ ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టారని, అయినప్పటికీ ఆమె తీరులో ఏమాత్రం మార్పు రాలేదని అసిస్టెంట్ సిటీ ప్లానర్ చంద్రబోస్ ఈ సందర్భంగా వెల్లడించారు. దీనిపై తామంతా ఎస్సీ, ఎస్టీ కమిషన్కు, మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కార్యాలయంలో కమిషనర్ తీరుతో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దీనిపై విచారణ చేపట్టాలని ఆ కమిషన్ను కోరతామన్నారు. ఒంగోలు నగర అభివృద్ధికి సంబంధించి కమిషనర్ నుంచి తమకు ఎటువంటి సహకారం ఉండటం లేదన్నారు. అంతేగాకుండా ఉద్యోగులను కించపరుస్తూ ఆమె మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో దాదాపు 55 వేల వరకు నిర్మాణాలుండగా, వాటిలో 1978కి ముందుగా..అంటే మాస్టర్ ప్లాన్ రాకపూర్వం జరిగిన నిర్మాణాలు కూడా ఉన్నాయని తెలిపారు. కానీ, అవి ప్లాన్ ప్రకారం లేవంటూ కమిషనర్ తమను బాధ్యులను చేస్తూ మెమోలు జారీ చేసి వేధిస్తున్నారని ఆయన వివరించారు. నగరంలో 10 ట్రాఫిక్ జంక్షన్లను గుర్తించి బీవోటీ పద్ధతిలో వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయిస్తే కమిషనర్ అడ్డుపడుతున్నారని తెలిపారు. కార్పొరేషన్కు చెందిన ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు దృష్టిసారిస్తే..దాన్ని కూడా కమిషనర్ అడ్డుకుంటున్నారని చెప్పారు. ఏ కారణంగా లేకుండానే ఇలాంటి అనేక అభివృద్ధి పనులకు కమిషనర్ బ్రేకులు వేస్తూ తమను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని అసిస్టెంట్ సిటీ ప్లానర్ చంద్రబోస్ వివరించారు. వాటన్నింటినీ ఉన్నతాధికారులకు వివరించి ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరతామని ఆయన పేర్కొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటుతో వరించిన విజయలక్ష్మి
పాలకొల్లు అర్బన్, న్యూస్లైన్ : ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో రెండు చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఫలితాలను తారుమారు చేశాయి. ఈ పోస్టల్ బ్యాలెట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయాన్ని అందించాయి. ఆగర్రు ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ తరపున పోటీ చేసిన పొనుకుమట్ల వీరాస్వామికి కేవలం ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటుతో విజయలక్ష్మి వరించింది. ఓట్ల లెక్కింపులో వీరాస్వామికి 779 ఓట్లు లభించగా టీడీపీ అభ్యర్థి కలిదిండి శ్రీనివాసరాజుకు 784 ఓట్లు లభించాయి. ఈ దశలో టీడీపీ అభ్యర్థి 5 ఓట్ల మెజార్టీతో నిలిచారు. అయితే పోస్టల్ బ్యాలెట్లు 6 పోలవ్వగా ఆరు కూడా వీరాస్వామికే లభించాయి. దీంతో ఒక ఓటు తేడాతో వీరాస్వామి గెలుపొందినట్లు ఆర్వో సూర్యనారాయణ ప్రకటించారు. 5 ఓట్ల మెజార్టీతో కొండబాబు గెలుపు పాలకొల్లు రూరల్-2 నుంచి వైఎస్సార్ సీపీ తరఫున చిట్టూరి ఏడుకొండలు (కొండబాబు) 5 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు పోస్టల్ బ్యాలెట్తో కలుపుకుని 826ఓట్లు లభించగా టీడీపీ అభ్యర్థి పెచ్చెట్టి నాగరాజుకు 819 ఓట్లు లభించాయి. అయితే చెల్లని ఓట్లు తిరిగి లెక్కించడంతో నాగరాజుకు మరో 2 ఓట్లు లభించాయి. దీంతో కొండబాబు కేవలం 5 ఓట్ల తేడాతో గెలిచినట్లయ్యింది. -
ముగిసిన మున్సి‘పోల్స్’
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్లైన్: మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు పోలీసులు శక్తి వంచన లేకుండా సాయం చేశారు. ఆదివారం ఉదయం 9:30 ప్రాంతంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో 10వ వార్డు పోలింగ్బూత్లో పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి భర్త బొంగుల రవి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి టీఆర్ఎస్ వారిని బయటకు పంపాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడే ఉన్న టీ ఆర్ఎస్ పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్ను నీఅంతు చూస్తానని పోలింగ్ అధికారి ఎదుటనే బొంగులరవి బెదిరించారు. విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకోగా, బొంగులరవి ఒక్కసారిగా తన అనుచరులతో ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారిని నివారించకుండా చోద్యం చూశారు. ఈ దృశ్యాలు కాసేపటికే ‘సాక్షి’ టీవీలో ప్రసారం కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి రమాకాంత్ స్పందించారు. వెంటనే విచారణ జరిపాలని జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించారు. స్పందించిన కలెక్టర్ సంఘటనకు బాధ్యులైన ఇరువురినీ వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించడంతో డీఎస్పీ వెంకటేశ్, సీఐ శివశంకర్ వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగిని అరెస్టు మధ్యాహ్నం 12 గంటలకు ఓటు వేసేందుకు వచ్చిన ఉపాధ్యాయురాలు జ్యోతిని టీఆర్ఎస్కు ప్రచారం చేస్తున్నారంటూ సీఐ ఆమెను అరెస్టు చేశారు. ఇదేమని ప్రశ్నించిన ఆమె భర్తను సైతం అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సమయంలో ఉపాధ్యాయురాలు ఉన్న ప్రాంతంలోనే కాంగ్రెస్ అభ్యర్థి బొంగుల విజయలక్ష్మి ఉన్నప్పటికీ ఆమెను ఏమీ అనని పోలీసులు ఉపాధ్యాయురాలిని అరెస్టు చేయడంతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తాయి. 20వ వార్డులో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావల్సి ఉండగా సిబ్బంది ఈవీఎంలను అమర్చడంలో ఆలస్యం కావడంతో అరగంట పాటు ఆలస్యంగా ప్రారంభమైంది. 21వ వార్డు పోలింగ్బూత్ వద్ద కాంగ్రెస్ అభ్యర్థి గోవర్ధన్ నాయక్ విధి నిర్వాహణలో ఉన్న పోలీస్ సిబ్బందిని దూషించడంతో కొద్దిసేపు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ను అడ్డుకున్న నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పట్టణంలోని 7వ వార్డులో పోలింగ్ను అడ్డుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణ బోగస్ ఓట్లు వేయిస్తున్నారని బీజేపీ అభ్యర్థి రమేశ్తో పాటు టీడీపీ అభ్యర్థి సురేందర్లు పోలింగ్ను అడ్డుకున్నారు. చనిపోయిన ఓటర్ల పేర్లపైన ఓట్లు వేయిస్తున్నారని పోలింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో 10 నిమిషాల పాటు పోలింగ్ను నిలిపివేశారు. అనంతరం పోలింగ్ అధికారి ఓటర్లు గుర్తింపు కార్డుతో పాటు ఆధార్ కార్డుతో వస్తేనే అనుమతి ఇస్తామని తెలపడంతో పోలింగ్ ఏజెంట్లు తిరిగి పోలింగ్ ప్రారంభించేందుకు అంగీకరించడంతో 15 నిమిషాల తర్వాత పోలింగ్ పునఃప్రారంభించారు. -
ఎంపీపీ అభ్యర్థి ఎంపికలో అచ్చెన్న డ్రామా
శ్రీకాకుళం సిటీ, న్యూస్లైన్: కోటబొమ్మాళి మండలంలో తన మాటకు ఎదురే ఉండదని రీతిలో వ్యవహిస్తున్న మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఎంపీపీ విషయంలో తన వర్గంలోని వారికే గట్టి షాక్ ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఈ పదవిని మాజీ ఎంపీపీ వెలమల విజయలక్ష్మితోపాటు తిలారు సర్పంచ్ తర్రా రామకృష్ణ ఆశిస్తున్నారు. దీంతో అచ్చెన్న తెరవెనుక రాజకీయానికి తెరతీశారు. రామకృష్ణకు మద్దతు ఇస్తున్నట్లు అచ్చెన్న ప్రకటిస్తే విజయలక్ష్మికే మద్దతని అచ్చెన్న సోదరుడు ప్రసాద్ అంటున్నారు. ఎంపీపీగా రామకృష్ణ పేరును బుధవారమే ప్రకటించిన అచ్చెన్న ఆ విషయాన్ని విజయలక్ష్మికి చెప్పి బరిలోంచి తప్పుకోవాలన్నారు. దీంతో నామినేషన్ వే సేందుకు సిద్ధమైన ఆమె నిరుత్సాహంగా ఉండిపోయారు. ఆమె మరో ఆరుగురితో పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తనకు అవకాశం ఇవ్వకపోతే పార్టీని వీడుతానని రామకృష్ణ హెచ్చరించడంతో అచ్చెన్న సీను నుంచి తాను తప్పుకుని మండల పార్టీ అధ్యక్షుడు బోయిన రమేష్ను పంపించి తర్రాకే మద్దతిస్తున్నట్లు చెప్పించారు. మరోవైపు విజయలక్ష్మికీ అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చేలా సోదరుడు ప్రసాద్ ద్వారా కబురు పంపించి గురువారం ఆమె చేత నామినేషన్ వేయించారు. దీనివెనుక లోగుట్టు పరిశీలించిన రామకృష్ణ తన తల్లి దమయంతితో హడావుడిగా నామినేషన్ వేయించారు. దీంతో అచ్చెన్న వ్యూహం బెడిసికొట్టింది. అయినప్పటికీ గురువారం బయటకు రాకుండా కథ నడిపించే యత్నం చేశారు. తర్రా వంటి సీనియర్ నేత వేరే పార్టీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఎంపీపీ ఆశ చూపించారని, ఏదిఏమైనా అచ్చెన్నకు సన్నిహితురాలైన విజయలక్ష్మికే ఆయన ఎంపీపీ ఇప్పిస్తారని ఆయన స్వభావం తెలిసిన వారు అంటున్నారు. దీంతో ఎంపీపీ అభ్యర్థిత్వం రాకపోతే తర్రా బృందం పార్టీని వీడేందుకు వీలుగా గురువారం రాత్రి తిలారులో సమావేశమయ్యారు. ఏక్షణంలోనైనా అచ్చెన్న తన నిర్ణయం మార్చుకుంటే గట్టిగా బుద్ధి చెప్పడానికి కార్యకర్తలు సిద్ధపడుతున్నారు. ఇదే తీరులో అటు విజయలక్ష్మి అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది. -
అమ్మకానికి బంగారుతల్లి
మెదక్ రూరల్, న్యూస్లైన్: మూడవ కాన్పులోనూ ఆడ బిడ్డే పుట్టిందని పొత్తిళ్లలో ఉండాల్సిన మూడు రోజుల పసికందును తల్లిదండ్రులు విక్రయానికి పెట్టిన సంఘటన మండల పరిధిలోని రాజీపేట పంచాయతీ కప్రాయిపల్లి తండాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన లకావత్ పీర్యా, విజ్యా దంపతులకు ఎస్న ఐదేళ్లు, అరుణ మూడేళ్ల ఇద్దరు ఆడబిడ్డలున్నారు. కాగా కుమారుడు కావాలని కోరుతున్న ఆ దంపతులకు మూడు రోజుల క్రితం జరిగిన కాన్పులోనూ మళ్లీ ఆడ బిడ్డేపుట్టింది. దీంతో ఆ దంపతులు తమకు పోషించే శక్తి లేదని, కాన్పునకు అయిన ఖర్చు రూ. 6 వేలు ఇచ్చి తీసుకు పోవచ్చని తండాలో పలువురికి తెలిపారు. ఈ విషయం కప్రాయిపల్లి అంగన్వాడీ టీచర్ దృష్టికి రావటంతో ఆమె ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించింది. దీంతో విషయం తెలుసుకున్న శిశుసంరక్షణ జిల్లా అధికారి రత్నం, సీడీపీఓ విజయలక్ష్మి, సూపర్ వైజర్ వింధ్యావాహినిలు తండాకు చేరుకుని శిశువు తల్లిదండ్రులను ప్రశ్నించారు. వారు మాట్లాడారు. తమకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, మూడో కుమార్తెను పోషించే శక్తి లేదని తేల్చి చెప్పారు. పోషించే స్తోమత లేనప్పడు కు.ని ఆపరేషన్ చేయించుకోవచ్చ కదా అధికారులు ప్రశ్నించగా.. కుమారుడు కోసం ఎదురు చూశాం అని సమాధానం చెప్పారు. దీంతో అధికారులు మాట్లాడుతూ కనీసం వారం రోజులైనా తల్లి పాలు ఇవ్వండని, పొత్తిళ్ల పాపకు గేదె పాలు, డబ్బా పాలు పడితే ఆరోగ్యం క్షీణిస్తుందని, వారం తర్వాత వచ్చి తీసుకెళతామన్నారు. ఇందుకు వారు ససేమీరా అన్నారు. దీంతో చేసేది లేక అధికారుల ఆ పసిగుడ్డును సంగారెడ్డి శిశువిహార్కు తరలించారు. ఆడశిశువులు.. అంగడి సరుకులు పొత్తిళ్లలో ఉండాల్సిన ఆడశిశువులు అంగడి సరుకులవుతున్నారు. మండల పరిధిలోని వాడి పంచాయతీ మెట్టు తండాకు చెందిన లంబాడి రవి, అనితలకు మూడో కాన్పులోను ఆడ బిడ్డే పుట్టిందని మూడు నెలల క్రితం టేక్మాల్లోని ఓ తండాలో విక్రయించిన విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే అధికారులు స్పందించి ఆ తరువాత పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. గిరిజనులు మగబిడ్డ కోసం రెండో పెళ్లి చేసుకున్న సందర్భాలు తండాల్లో కోకొల్లలు. ఒక వేళ ఆడపిల్లలు పుడితే ఇలా గుట్టు చప్పుడు కాకుండా అమ్మకానికి పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గిరిజనులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వివాహిత అనుమానాస్పద మృతి
ముమ్మిడివరం, న్యూస్లైన్ : వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు, మృతురాలి తల్లి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన మందపాక సునీల్ కుటుంబం 20 ఏళ్ల క్రితం ముమ్మిడివరంలో స్థిరపడ్డారు. స్వర్ణకారుడైన సునీల్ కులవృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన సరస్వతి(35)ని 2004లో అతడు పెళ్లి చేసుకున్నాడు. వారికి ఏడేళ్ల కుమార్తె విజయలక్ష్మి, ఐదేళ్ల కుమారుడు రేవంత్ ఉన్నారు. ప్రస్తుతం ముమ్మిడివరం నగర పంచాయతీలోని బళ్ల గేటు సెంటర్ వద్ద ఓ ప్రైవేట్ పాఠశాల సమీపంలో వీరు నివసిస్తున్నారు. ఇలాఉండగా సోమవారం రాత్రి దైవ దర్శనం కోసం సునీల్ విజయవాడకు వెళ్లాడు. భర్త ఇంట్లో లేని సమయంలో సరస్వతి పూజగదిలోని పాలవెల్లికి ఉన్న తాడుతో ఉరివేసుకున్నట్టుగా చనిపోయి ఉంది. మంగళవారం మధ్యాహ్నం సమీప బంధువు సూర్యచంద్ర ఆమె మృతదేహాన్ని గమనించాడు. ఈ మేరకు విజయవాడలో ఉన్న సునీల్తో పాటు గుంటూరు జిల్లా పొన్నూరులో ఉన్న సరస్వతి బంధువులకు సమాచారం ఇచ్చాడు. భార్యాభర్తలు ఎప్పుడూ గొడవలు పడిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. బుధవారం ఉదయం సరస్వతి తల్లి చింతాడ గంగాభవాని, తమ్ముడు రమేష్బాబు ముమ్మిడివరానికి చేరుకున్నారు. తన కుమార్తె మృతిపై అనుమానం ఉందని గంగాభవాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ముమ్మిడివరం సీఐ మహమ్మద్ అలీ, ఎస్సై జేజే రత్నప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం మమ్మిడివరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రత్నప్రసాద్ తెలిపారు. -
జగన్ కోసం పూజలు
రాజమండ్రిసిటీ, న్యూస్లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటూ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి గురువారం రాజమండ్రి గౌతమఘాట్లోని అయ్యప్పస్వామి గుడిలో సాయిబాబా విగ్రహాన్ని పాలతో, విభూతితో అభిషేకించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై జగన్ను 485 రోజుల పాటు జైలులో పెట్టారన్నారు. ఏతప్పు చేయనందునే ఆయన కడిగిన ముత్యంలా బయట పడ్డారన్నారు. అనంతరం అఖండ జ్యోతిని వెలిగించారు. రాజమండ్రి సిటీ, రూరల్ కో-ఆర్డినేటర్లు బొమ్మన రాజ్కుమార్, ఆకుల వీర్రాజు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గెడ్డం రమణ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు లంక సత్యనారాయణ, ఎస్సీ సెల్ రాష్ట్ర సభ్యులు మాసా రామజోగ్, నగర అధికార ప్రతినిధులు కె. సాగర్, డి. వీరబాబు, దొండపాటి సత్యంబాబు, మాజీ కార్పొరేటర్ ఇసుకపట్ల శ్రీనివాస్, నగర వీవర్స్సెల్ కన్వీనర్ కోటా, వైఎస్సార్ సేవాసమితి అధ్యక్షుడు కె. సాయి పాల్గొన్నారు.