Women's Premier League
-
‘సూపర్’ సోఫీ...
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయానికి ఓవర్ దూరంలో ఉంది. 6 బంతుల్లో 18 పరుగులు యూపీ వారియర్స్కు క్లిష్టమైన సమీకరణం. కానీ సోఫీ ఎకిల్స్టోన్... ఓటమి అంచున ఉన్న యూపీ వారియర్స్కు ఊపిరి పోసింది. 0, 6, 6, 4, 1లతో 17 పరుగులు బాదింది. ఆఖరి బంతి క్రాంతి గౌడ్ ఆడగా... సోఫీ రనౌటైంది. అయితే 17 పరుగుల రాకతో స్కోరు సమమైంది. దీంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చరిత్రలో తొలి సూపర్ ఓవర్కు పిచ్ సిద్ధమైంది.ముందుగా ఆర్సీబీ బౌలర్ కిమ్ గార్త్ వేసిన సూపర్ ఓవర్లో యూపీ 8 పరుగులు చేసింది. 6 బంతుల్లో 9 పరుగులు ఆర్సీబీ హిట్టర్లు రిచా ఘోష్, స్మృతి మంధానలకు సులువు! కానీ సోఫీ స్పిన్ ఉచ్చుతో ఆర్సీబీ బ్యాటర్లను అనూహ్యంగా కట్టడి చేసింది. బౌండరీ కాదు కదా... కనీసం ఒక బంతికి రెండు పరుగులైనా ఇవ్వకుండా 0, 1, 0, 1, 1, 1లతో 4 పరుగులే ఇచ్చింది. అంతే సోఫీ ‘సూపర్’స్టార్ అయ్యింది. యూపీ విజేతగా నిలిచింది.సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఎలీస్ పెరీ (56 బంతుల్లో 90 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. డానీ వ్యాట్ హాగ్ (41 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించింది. హెన్రీ, దీప్తి శర్మ, తాలియా తలా ఓ వికెట్ తీశారు. అనంతరం యూపీ వారియర్స్ సరిగ్గా 20 ఓవర్లలో 180 పరుగులు చేసి ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సోఫీ ఎకిల్స్టోన్ (19 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్స్లు), దీప్తి శర్మ (13 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్), శ్వేత (25 బంతుల్లో 31; 4 ఫోర్లు) దంచేశారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (బి) దీప్తిశర్మ 6; డానీ వ్యాట్ (సి) శ్వేత (బి) తాలియా 57; పెరీ (నాటౌట్) 90; రిచా (సి అండ్ బి) హెన్రీ 8; కనిక (రనౌట్) 5; వేర్హమ్ (రనౌట్) 7; కిమ్ గార్త్ (రనౌట్) 2; రాఘ్వీ బిస్త్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లలో) 180. వికెట్ల పతనం: 1–23, 2–117, 3–126, 4–136, 5–158, 6–180. వికెట్ల పతనం: 1–23, 2–117, 3–126, 4–136, 5–158, 6–180. బౌలింగ్: హెన్రీ 4–0–34–1, గ్రేస్ హారిస్ 1–0–11–0, దీప్తి శర్మ 4–0–42–1, సోఫీ 4–0–29–0, సైమా 1–0–8–0, క్రాంతి 3–0–26–0, తాలియా 3–0–30–1. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: నవ్గిరే (బి) రేణుక 24; వృందా (సి) స్మృతి (బి) రేణుక 14; దీప్తి (సి) రిచా (బి) స్నేహ్ రాణా 25; తాలియా (స్టంప్డ్) రిచా (బి) స్నేహ్ రాణా 0; శ్వేత (సి) రిచా (బి) పెరీ 31; గ్రేస్ (సి) స్నేహ్ రాణా (బి) కిమ్ 8; ఉమా (సి) వేర్హమ్ (బి) స్నేహ్ రాణా 14; హెన్రీ (బి) కిమ్ 8; సోఫీ (రనౌట్) 33; సైమా (రనౌట్) 14; క్రాంతి (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 180. వికెట్ల పతనం: 1–30, 2–48, 3–50, 4–72, 5–93, 6–123, 7–123, 8–134, 9–161, 10–180. బౌలింగ్: రేణుక 4–0–36–2, కిమ్ గార్త్ 4–0–40–2, స్నేహ్ రాణా 3–0–27–3, ఎక్తాబిస్త్ 3–0–26–0, పెరీ 2–0–10–1, వేర్హమ్ 4–0–40–0. డబ్ల్యూపీఎల్లో నేడుఢిల్లీ క్యాపిటల్స్ X గుజరాత్ జెయింట్స్ రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో... -
షినెల్ హెన్రీ హిట్టింగ్
బెంగళూరు: ఆల్రౌండర్ షినెల్ హెన్రీ (23 బంతుల్లో 62; 2 ఫోర్లు, 8 సిక్స్లు) భారీ షాట్లతో వీర విహారం చేయడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 టోర్నమెంట్లో యూపీ వారియర్స్ జట్టు తొలి విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో యూపీ వారియర్స్ 33 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. గత రెండు మ్యాచ్ల్లో పరాజయాలు చవిచూసిన యూపీ వారియర్స్ ఈ పోరులో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన హెన్రీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. గత మ్యాచ్లోనే తన పవర్ హిట్టింగ్ను ప్రపంచానికి చాటిన హెన్రీ... ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ను ఊచకోత కోసింది. కెపె్టన్ దీప్తి శర్మ (13), తహిల మెక్గ్రాత్ (24), శ్వేత సెహ్రావత్ (11), కిరణ్ నవగిరె (17) భారీ స్కోర్లు చేయలేకపోయారు. దినేశ్ వృందా (4), గ్రేస్ హ్యారిస్ (2), ఉమ ఛెత్రీ (3) విఫలమయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో జెస్ జాన్సన్ 4 వికెట్లు పడగొట్టగా... తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి, మరిజానె కాప్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 19.3 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (35 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో పోరాడినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (5), మరిజానె కాప్ (9), అనాబెల్ సదర్లాండ్ (5), జెస్ జాన్సెన్ (5), సారా బ్రైస్ (5) విఫలమయ్యారు. యూపీ వారియర్స్ బౌలర్లలో గ్రేస్ హ్యారిస్ ‘హ్యాట్రిక్’ సహా 4 వికెట్లు పడగొట్టగా... క్రాంతి గౌడ్ 4 వికెట్లు ఖాతాలో వేసుకుంది. షినెల్ హెన్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో నేడు విశ్రాంతి రోజు కాగా... సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో యూపీ వారియర్స్ తలపడుతుంది. హెన్రీ రికార్డు ఫిఫ్టీ తాజా సీజన్లో పాయింట్ల ఖాతా తెరిచేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న యూపీ వారియర్స్ ఎట్టకేలకు శుభారంభం చేసింది. బ్యాటింగ్లో హెన్రీ మెరుపులకు బౌలింగ్లో గ్రేస్ హ్యారిస్ ‘హ్యాట్రిక్’, క్రాంతి గౌడ్ మెరుపులు తోడవడంతో వారియర్స్ లీగ్లో తొలి విజయం నమోదు చేసుకుంది. టాపార్డర్ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో యూపీ జట్టు 14 ఓవర్లు ముగిసేసరికి 91/6తో నిలిచింది. వారియర్స్ జట్టు మిగిలిన ఆరు ఓవర్లలో మహా అయితే మరో 30 పరుగులు చేస్తుందేమో అనుకుంటే... హెన్రీ సుడిగాలిలా చెలరేగిపోయింది. శిఖా పాండే వేసిన 17వ ఓవర్లో 4,6,6 బాదిన హెన్రీ... 18వ ఓవర్లో మరో ఫోర్ కొట్టింది. ఇక అరుంధతి వేసిన 19వ ఓవర్లో మూడు సిక్సర్లతో విజృంభించింది. ఈ క్రమంలో హెన్రీ 18 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. డబ్ల్యూపీఎల్ 2023 సీజన్లో సోఫియా డాంక్లీ కూడా 18 బంతుల్లో హాఫ్సెంచరీ చేసింది. హెన్రీ దూకుడుతో చివరి నాలుగు ఓవర్లలో యూపీ వారియర్స్ జట్టు 67 పరుగులు పిండుకుంది. డబ్ల్యూపీఎల్లో ఇది రెండో అత్యధికం. హ్యారిస్ హ్యాట్రిక్ ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆకట్టుకోలేకపోయింది. జెమీమా రోడ్రిగ్స్ హాఫ్సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా... తక్కిన వాళ్లు ప్రభావం చూపలేకపోయారు. యువ మీడియం పేసర్ క్రాంతి గౌడ్ ధాటికి ఢిల్లీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. షఫాలీ వర్మ (30 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించినా... వేగంగా ఆడలేకపోయింది. బ్యాటింగ్లో రాణించిన హెన్రీ బంతితోనూ మెరిసి మరిజానె కాప్ను ఔట్ చేసింది. ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్లో గ్రేస్ హ్యారిస్ ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. 20వ ఓవర్ తొలి బంతికి నికీ ప్రసాద్ (18) క్యాచ్ ఔట్ కాగా... రెండో బంతికి అరుంధతి (0), మూడో బంతికి మిన్ను మణి (0) గోల్డెన్ డకౌట్గా పెవిలియన్ చేరారు. స్కోరు వివరాలు యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: కిరణ్ నవగిరె (సి) నికీ (బి) అరుంధతి 17; దినేశ్ వృందా (సి) సారా (బి) మరిజానె కాప్ 4;దీప్తి (సి) నికీ (బి) జెస్ జాన్సెన్ 13; తహిల మెక్గ్రాత్ (సి) అనాబెల్ (బి) జెస్ జాన్సెన్ 24; శ్వేతా సెహ్రావత్ (బి) అరుంధతి 11; గ్రేస్ హ్యారిస్ (బి) మరిజానె కాప్ 2; ఉమ (సి) సారా(బి) శిఖ 3; షినెల్ హెన్రీ (సి) జెమీమా (బి) జెస్ జాన్సెన్ 62; సోఫియా (సి) మరిజానె కాప్ (బి) జెస్ జాన్సెన్ 12; సైమా ఠాకూర్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 25; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–17, 2–38, 3–61, 4–79, 5–84, 6–89, 7–109, 8–166, 9–177, బౌలింగ్: మరిజానె కాప్ 4–0–18–2; శిఖ పాండే 4–0–39–1; అనాబెల్ సదర్లాండ్ 4–0–30–0; అరుంధతి రెడ్డి 4–0–52–2; జెస్ జాన్సెన్ 4–0–31–4. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) సైమా(బి) క్రాంతి గౌడ్ 24; మెగ్ లానింగ్ (బి) క్రాంతి గౌడ్ 5; జెమీమా (సి) దీప్తి (బి) క్రాంతి గౌడ్ 56; మరిజానె కాప్ (సి) సోఫియా (బి) హెన్రీ 9; అనాబెల్ (సి) దీప్తి (బి) గ్రేస్ హ్యారిస్ 5; జెస్ జాన్సెన్ (సి అండ్ బి) క్రాంతి గౌడ్ 5; సారా (స్టంప్డ్) ఉమ (బి) దీప్తి 5; నికీ (సి) హెన్రీ (బి) గ్రేస్ 18, శిఖ (నాటౌట్) 15; అరుంధతి రెడ్డి (సి) శ్వేత (బి) గ్రేస్ 0; మిన్ను మణి (సి అండ్ బి) గ్రేస్ 0; ఎక్స్ట్రాలు 2; మొత్తం: (19.3 ఓవర్లలో ఆలౌట్) 144. వికెట్ల పతనం: 1–26, 2–43, 3–76, 4–97, 5–106, 6–111, 7–111, 8–144, 9–144, 10–144, బౌలింగ్: షినెల్ హెన్రీ 4–0–42–1; సోఫియా 4–0–28–0; క్రాంతి గౌడ్ 4–0–25–4; గ్రేస్ హ్యారిస్ 223–0–15–4; దీప్తి శర్మ 4–0–25–1; తహిల మెక్గ్రాత్ 1–0–9–0. -
భళా బెంగళూరు...
వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నిలో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దూసుకుపోతోంది. టోర్నీ తొలి పోరులో గుజరాత్ జెయింట్స్ను అలవోకగా ఓడించిన ఆర్సీబీ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. ముందుగా పదునైన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేసిన ఆర్సీబీ... ఆ తర్వాత స్మృతి, వ్యాట్ దూకుడైన బ్యాటింగ్తో మరో 22 బంతులు మిగిలి ఉండగానే గెలుపు పూర్తి చేసుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 19.3 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (22 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా, సారా బ్రైస్ (19 బంతుల్లో 23; 2 ఫోర్లు) కాస్త పోరాడింది. మిగతా బ్యాటర్లంతా విఫలం కావడంతో జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుకా సింగ్ (3/23), జార్జియా వేర్హామ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా...గార్త్, బిష్త్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బెంగళూరు 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. స్మృతి మంధాన (47 బంతుల్లో 81; 10 ఫోర్లు, 3 సిక్స్లు), డానీ వ్యాట్ (33 బంతుల్లో 42; 7 ఫోర్లు) తొలి వికెట్కు 65 బంతుల్లోనే 107 పరుగులు జోడించి జట్టు విజయాన్ని సునాయాసం చేశారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (సి) పెరీ (బి) గార్త్ 17; షఫాలీ (సి) స్మృతి (బి) రేణుక 0; జెమీమా (స్టంప్డ్) రిచా (బి) వేర్హామ్ 34; నెదర్లాండ్ (సి) స్మృతి (బి) రేణుక 19; కాప్ (సి) వ్యాట్ (బి) బిష్త్ 12; జొనాసెన్ (సి) కనిక (బి) బిష్త్ 1; బ్రైస్ (స్టంప్డ్) రిచా (బి) వేర్హామ్ 23; శిఖా (సి) బిష్త్ (బి) రేణుక 14; రాధ (సి అండ్ బి) వేర్హామ్ 0; అరుంధతి రెడ్డి (సి) పెరీ (బి) గార్త్ 4; మిన్ను మణి (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 12; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 141. వికెట్ల పతనం: 1–1, 2–60, 3–62, 4–84, 5–87, 6–105, 7–130, 8–130, 9–132, 10–141. బౌలింగ్: రేణుక 4–0–23–3, కిమ్ గార్త్ 3.3–0–19–2, ఏక్తా బిష్త్ 4–0–35–2, జోషిత 2–0–21–0, వేర్హామ్ 4–0–25–3, కనిక 2–0–13–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) అరుంధతి (బి) శిఖా 81; డానీ వ్యాట్ (సి) జెమీమా (బి) అరుంధతి 42; ఎలీస్ పెరీ (నాటౌట్) 7; రిచా (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 5; మొత్తం (16.2 ఓవర్లలో 2 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1–107, 2–133. బౌలింగ్: కాప్ 2–0–27–0, శిఖా 4–0– 27–1, మిన్ను 1–0– 10–0, అరుంధతి 3.2–0–25–1, జొనాసెన్ 4–0–37–0, సదర్లాండ్ 2–0–18–0. -
ఉమెన్ ప్రీమియర్ లీగ్ : గుజరాత్ జెయింట్స్ పై బెంగళూరు మెరుపు గెలుపు (ఫోటోలు)
-
RCB Vs GG: ‘రాయల్’ విజయంతో మొదలు
‘పరుగుల వరద ఖాయం’... టాస్ సమయంలో విశ్లేషకురాలు మిథాలీరాజ్ చేసిన వ్యాఖ్య ఇది. ఆమె చెప్పినట్లుగానే డబ్ల్యూపీఎల్ తొలి పోరులో 400కు పైగా పరుగులు నమోదయ్యాయి. ఇరు జట్లూ భారీ షాట్లతో విరుచుకుపడి పూర్తి వినోదాన్ని పంచాయి. ముందుగా ఆష్లీ గార్డ్నర్, బెత్ మూనీ మెరుపులు గుజరాత్కు భారీ స్కోరును అందిస్తే రిచా ఘోష్, ఎలైస్ పెరీ తమ ఆటతో అదరగొట్టారు. ఫలితంగా లీగ్లో అత్యధిక పరుగుల ఛేదనతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) శుభారంభం చేసింది.వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) సీజన్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు రికార్డు లక్ష్య ఛేధనతో ఘనంగా ప్రారంభించింది. శుక్రవారం జరిగిన తొలి పోరులో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్ (37 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 8 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగగా, బెత్ మూనీ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు) కూడా అర్ధసెంచరీ సాధించింది.అనంతరం బెంగళూరు 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిచా ఘోష్ (27 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్లు), ఎలైస్ పెరీ (34 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీలు చేయగా, కనిక ఆహుజా (13 బంతుల్లో 30 నాటౌట్; 4 ఫోర్లు) రాణించింది. రిచా, కనిక ఐదో వికెట్కు 37 బంతుల్లోనే అభేద్యంగా 93 పరుగులు జత చేశారు. సిక్స్ల జోరు... ఓపెనర్ మూనీ ధాటిగా ఇన్నింగ్స్ను ఆరంభించినా... మరో ఎండ్లో 6 పరుగుల వ్యవధిలో వోల్వార్ట్ (6), హేమలత (4) వెనుదిరిగారు. అయితే మూనీ దూకుడు కొనసాగించింది. వేర్హామ్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన ఆమె 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. మూనీ వెనుదిరిగిన తర్వాత గార్డ్నర్ విధ్వంసం మొదలైంది. ప్రేమ ఓవర్లో ఆమె వరుసగా మూడు సిక్స్లు బాదింది. డియాండ్రా డాటిన్ (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా జోరు ప్రదర్శించడంతో గుజరాత్ స్కోరు దూసుకుపోయింది. 25 బంతుల్లోనే గార్డ్నర్ హాఫ్ సెంచరీని అందుకుంది. జోషిత వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కూడా గార్డ్నర్ 3 సిక్స్లతో చెలరేగింది. చివరి రెండు బంతుల్లో హర్లీన్ 2 ఫోర్లు బాది స్కోరును 200 దాటించింది. కీలక భాగస్వామ్యం... భారీ లక్ష్య ఛేదనలో 14 పరుగులకే తొలి 2 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ ఇబ్బందుల్లో పడింది. ఒకే ఓవర్లో కెప్టెన్ స్మృతి మంధాన (9), డానీ వ్యాట్ (4)లను గార్డ్నర్ వెనక్కి పంపించింది. ఈ దశలో పెరీ, రాఘ్వీ బిష్త్ (27 బంతుల్లో 25; 3 ఫోర్లు) భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది. ముఖ్యంగా పెరీ తన అనుభవంతో కొన్ని చక్కటి షాట్లు ఆడగా, తొలి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ ఆడుతున్న రాఘ్వీ అండగా నిలిచింది. 19 పరుగుల వద్ద హర్లీన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పెరీ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. మూడో వికెట్కు 55 బంతుల్లో 86 పరుగులు జోడించిన పెరీ, రాఘ్వీ తక్కువ వ్యవధిలో అవుటయ్యారు. బెంగళూరు విజయం కోసం 46 బంతుల్లో 93 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో గుజరాత్దే పైచేయిగా కనిపించింది. కానీ రిచా, కనిక భాగస్వామ్యం అసాధారణ ఆటతో జట్టును గెలిపించింది. ‘0’ వద్ద రిచా ఇచ్చిన క్యాచ్ను సిమ్రన్ వదిలేయడం కూడా బెంగళూరు జట్టుకు కలిసొచ్చింది. ఒకే ఓవర్లో 23 పరుగులు... ఆర్సీబీ 30 బంతుల్లో 63 పరుగులు చేయాల్సి ఉండగా గార్డ్నర్ వేసిన 16వ ఓవర్ ఆటను పూర్తిగా మలుపు తిప్పింది. ఈ ఓవర్లో రిచా ఏకంగా 4 ఫోర్లు, 1 సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ప్రియ ఓవర్లో కూడా 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన రిచా 23 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించింది. అనంతరం డాటిన్ బౌలింగ్లో మరో సిక్స్తో రిచా మ్యాచ్ను ముగించడం విశేషం. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) స్మృతి (బి) ప్రేమ 56; వోల్వార్ట్ (బి) రేణుక 6; హేమలత (సి) ప్రేమ (బి) కనిక 4; ఆష్లీ గార్డ్నర్ (నాటౌట్) 79; డాటిన్ (సి) వ్యాట్ (బి) రేణుక 25; సిమ్రన్ (బి) వేర్హమ్ 11; హర్లీన్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–35, 2–41, 3–85, 4–152, 5–182. బౌలింగ్: రేణుక 4–0–25–2, కిమ్ గార్త్ 4–0–34–0, జోషిత 4–0–43–0, కనిక 3–0–19–1, వేర్హామ్ 3–0–50–1, ప్రేమ 2–0–26–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (ఎల్బీ) (బి) గార్డ్నర్ 9; డానీ వ్యాట్ (బి) గార్డ్నర్ 4; పెరీ (సి) వోల్వార్ట్ (బి) సయాలీ 57; రాఘ్వీ (సి) సయాలీ (బి) డాటిన్ 25; రిచా ఘోష్ (నాటౌట్) 64; కనిక (నాటౌట్) 30; ఎక్స్ట్రాలు 13; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 202.వికెట్ల పతనం: 1–13, 2–14, 3–100, 4–109. బౌలింగ్: కాశ్వీ 2–0–22–0, గార్డ్నర్ 3–0–33–2, డాటిన్ 3.3–0– 41–1, తనూజ 3–0–29–0, సయాలీ 4–0–44–1, ప్రియ 3–0–29–0. -
ధనాధన్ సమరం
క్రీడాభిమానులను అలరించేందుకు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మూడో సీజన్కు శుక్రవారం తెరలేవనుంది. నెల రోజుల పాటు సాగనున్న ఈ సమరంలో 5 జట్లు 22 మ్యాచ్ల్లో తలపడనున్నాయి. సీనియర్ ప్లేయర్లతో పాటు యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధమవుతుండగా... సీజన్ ఆరంభ పోరులో శుక్రవారం గుజరాత్ జెయింట్స్ జట్టుతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఆడనుంది.వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ మూడో సీజన్కు వేళయింది. తొలి రెండు సీజన్లలో మెరిపించిన పలువురు యువతారలు ఆ తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో మరోసారి ఎమర్జింగ్ క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రపంచానికి చాటేందుకు అవకాశం లభించనుంది. గత సీజన్ మాదిరిగానే ఈసారీ ఐదు జట్ల మధ్య లీగ్ మ్యాచ్లు ముగిశాక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు నేరుగా ఫైనల్ బెర్త్ లభిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా రెండో ఫైనలిస్ట్ను నిర్ణయిస్తారు. » బెంగళూరుకు గాయాల బెడద వేధిస్తోంది. గతేడాది టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన సోఫీ డివైన్ తోపాటు కేట్ క్రాస్, స్పిన్నర్ ఆశ శోభన గాయాలతో టోర్నీ నుంచి వైదొలిగారు. » పేలవ ఫామ్తో జాతీయ జట్టులో చోటు కోల్పోయిన భారత ఓపెనర్ షఫాలీ వర్మ, పేసర్ అరుంధతి రెడ్డి డబ్ల్యూపీఎల్లో రాణించి తిరిగి టీమిండియాకు ఎంపిక కావాలని చూస్తున్నారు. వీరిద్దరు ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్నారు. » గత రెండు పర్యాయాలు రన్నరప్గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. షఫాలీ వర్మ, మెగ్ లానింగ్, జెమీమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మరిన్ కాప్, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, టిటాస్ సాధు, జెస్ జాన్సన్, రాధ యాదవ్తో క్యాపిటల్స్ బలంగా ఉంది. » తొలి సీజన్లో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుండగా... హేలీ మాథ్యూస్, యస్తిక భాటియా, నటాలియా స్కీవర్ బ్రంట్, అమేలియా కెర్ కీలకం కానున్నారు. » గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. అలీసా హీలీ అందుబాటులో లేకపోవడంతో యూపీ వారియర్స్ జట్టుకు భారత స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ కెపె్టన్గా వ్యవహరించనుంది. ఇక బెత్ మూనీ స్థానంలో ఆష్లీ గార్డ్నర్ గుజరాత్ జెయింట్స్ జట్టుకు సారథ్యం వహించనుంది. ఈ సీజన్లో మరో రెండు కొత్త (వడోదర, లక్నో) వేదికలపై కూడా మ్యాచ్లు నిర్వహించనున్నారు. -
ఆర్సీబీకి బ్యాడ్ న్యూస్.. సీజన్ మెత్తానికి స్టార్ ప్లేయర్ దూరం
డబ్ల్యూపీఎల్-2025 సీజన్ ఆరంభానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్, న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్(Sophie Devine) ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యారు. డొమాస్టిక్ క్రికెట్కు కొంత కాలంగా దూరంగా ఉండాలని డివైన్ నిర్ణయించుకున్నారు.ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది. అయితే సోఫీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని మాత్రం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించలేదు. ఇది నిజంగా ఆర్సీబీకి గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే గతేడాది డబ్ల్యూపీఎల్ టైటిల్ ఆర్సీబీ గెలుచుకోవడంలో డివైన్ది కీలక పాత్ర.2024 డబ్ల్యూపీఎల్ సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన డివైన్.. 136 పరుగులు చేసి ఆరు వికెట్లు పడగొట్టారు. దీంతో ఈ ఏడాది సీజన్కు ముందు ఆమెను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఇక ఈ స్టార్ ఆల్రౌండర్ నిర్ణయానికి బోర్డు పూర్తిగా మద్దతునిచ్చిందని ఉమెన్స్ హై పెర్ఫార్మెన్స్ డెవలప్మెంట్ హెడ్ లిజ్ గ్రీన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు."ఆటగాళ్ల ఫిట్నెస్, శ్రేయస్సు మాకు చాలా ముఖ్యం. మా హై పెర్ఫార్మెన్స్ యూనిట్ స్టాఫ్ నుంచి సోఫీకి ఎల్లప్పుడూ మద్దతు ఉంటుంది. ఆమె సరైన నిర్ణయమే తీసుకుందని మేము భావిస్తున్నాము. సోఫీకి ఇప్పుడు విశ్రాంతి ఎక్కువగా లభిస్తుంది. ఇది న్యూజిలాండ్ క్రికెట్కు సానుకూల ఆంశమని" గ్రీన్ వెల్లడించారు.కాగా డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో బరోడా వేదికగాగుజరాత్ జెయింట్స్తో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ టోర్నీకి వడోదరా (కొటాంబి స్టేడియం), బెంగళూరు (చిన్నస్వామి స్టేడియం), ముంబై (బ్రబోర్న్ స్టేడియం), లక్నో (ఎకానా క్రికెట్ స్టేడియం) ఆతిథ్యమివ్వనున్నాయి.డబ్ల్యూపీఎల్-2025 సీజన్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇదే..స్మృతి మంధాన, ఎస్ మేఘన, రిచా ఘోష్, ఎలీస్ పెర్రీ, జార్జియా వేర్హామ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభనా, , రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిష్త్, కేట్ క్రాస్, కనికా అహుజా, డాని-వ్యాట్ (యూపీ వారియర్స్ నుంచి ట్రేడ్).చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో రెండో టీ20.. వరల్డ్ రికార్డుపై కన్నేసిన అర్ష్దీప్ -
BCCI: చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఆరోజే
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) సమయం సమీపిస్తోంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా మొదలుకానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ తదితర బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాత్రం ఇంత వరకు ఈ టోర్నీలో పాల్గొనే సభ్యుల పేర్లు వెల్లడించలేదు.ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా(Rajiv Shukla) కీలక అప్డేట్ అందించారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును ఈనెల 18 లేదా 19వ తేదీల్లో ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా 2017లో టైటిల్ గెలిచిన పాకిస్తాన్.. చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది.భద్రతా కారణాల దృష్ట్యాఅయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ క్రమంలో అనేక చర్చోపచర్చల అనంతరం ఐసీసీ ఆదేశాల మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది. దీని ప్రకారం భారత జట్టు తమ మ్యాచ్లను తటస్థ వేదికైన దుబాయ్లో ఆడనుంది.ఇక తమ తొలి మ్యాచ్లో భాగంగా భారత్ ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది. కాగా ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ ఈ ఐసీసీ టోర్నీకి నేరుగా అర్హత సాధించగా.. వన్డే వరల్డ్కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ క్వాలిఫై అయ్యాయి. ఇక వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా ఈవెంట్లో ఆసీస్తో పాటు టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. మరోవైపు.. భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో సెమీ ఫైనల్ కూడా చేరలేకపోయిన పాకిస్తాన్.. సొంతగడ్డపై జరిగే చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం భారీ అంచనాలతో ముందుకు రానుంది. ఆసీస్ను వారి స్వదేశంలో వన్డే సిరీస్లో ఓడించడంతో పాటు.. సౌతాఫ్రికా గడ్డపై ఇంత వరకూ ఏ జట్టుకూ సాధ్యం కాని రీతిలో ప్రొటిస్ జట్టును వన్డే సిరీస్లో 3-0తో క్లీన్స్వీప్ చేసి జోరు మీదుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025గ్రూప్-‘ఎ’- ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాగ్రూప్-‘బి’- ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్డబ్ల్యూపీఎల్ వేదికలు ఎంపిక చేశాంఇదిలా ఉంటే..వచ్చే నెల 7 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభం కానుంది. గతేడాది రెండు (లక్నో, బరోడా) వేదికల్లో ఈ లీగ్ నిర్వహించగా... ఈ సారి నాలుగు నగరాల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మార్చి 2న డబ్ల్యూపీఎల్ ఫైనల్ జరగనుండగా... అదే నెల 21 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది.ఇక మే 25న ఐపీఎల్ తుదిపోరుకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఆతిథ్యమివ్వనుంది. 2024 ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ ట్రోఫీ చేజిక్కించుకోవడంతో... తొలిపోరు కూడా అక్కడే జరగనుంది.బీసీసీఐ కొత్త కార్యదర్శి అతడేఈ సమావేశంలో బోర్డు కార్యదర్శిగా దేవజిత్ సైకియా(Devjith Saikiya), కోశాధికారిగా ప్రభ్తేజ్ సింగ్ భాటియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రెండు పదవులకు వీరిద్దరే దరఖాస్తు చేసుకోవడంతో ఎన్నిక అవసరం లేకుండా పోయిందని... ఎన్నికల అధికారి వెల్లడించారు. మరోవైపు.. డబ్ల్యూపీఎల్ వేదికల ఎంపిక గురించి రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. అతి త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ సందర్భంగానే చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎప్పుడు ప్రకటిస్తామనే విషయాన్ని కూడా రాజీవ్ శుక్లా తెలిపారు.చదవండి: CT 2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. తొలిసారిగా ఆ ఇద్దరు -
ఆశ్చర్యం.. అనూహ్యం.. వారిపై కోట్ల వర్షం
షేక్ సిమ్రన్ బాను, కమిలిని, ప్రేమా రావత్ వీళ్ల పేర్లు మనకే కాదు... ప్రస్తుత భారత మహిళల జట్టు ప్లేయర్లకూ తెలియదు. ఎందుకంటే వీరెప్పుడు జాతీయ జట్టుకు ఆడలేదు. అసలు ఎంపికే కాలేదు. అలాగని జోనల్ ఈవెంట్లలో దంచేసిన రికార్డులేం లేవు. మైదానంలో పెద్దగా ఆడింది లేదు... ‘కౌన్ బనేగా కరోడ్పతి’లో పాల్గొంది లేదు. అయినా సరే రెండు గంటల వేలంలో కోటీశ్వరులయ్యారు. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) విశ్లేషకులు సైతం నివ్వెరపోయెలా వారి కొనుగోలు జరిగింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలం ఒకింత ఆశ్చర్యంగా.. అనూహ్యంగా జరిగిపోయింది. జాతీయ స్థాయిలో భారత జట్టు తరఫున ఆడిన క్రికెటర్లను పట్టించుకోని ఫ్రాంచైజీలు కనీసం దేశవాళీ క్రికెట్లోనూ కనిపించని ప్లేయర్లపై భారీ మొత్తమే ఖర్చు చేశాయి. అన్క్యాప్డ్ ప్లేయర్లను అందలం ఎక్కించాయి.పేలవంగా ఆడిన ప్లేయర్కు భారీ ధరబెంగళూరులో ఆదివారం జరిగిన ఈ వేలంలో 22 ఏళ్ల ముంబై బ్యాటర్ షేక్ సిమ్రన్ బానుకు ఏకంగా రూ. 1 కోటీ 90 లక్షలు లభించాయి. మినీ వేలంలో మేజర్ అమౌంట్ ఆమెకే దక్కింది. గుజరాత్ జెయింట్స్ ఆమె కోసం అంతమొత్తం వెచ్చించింది. అలాగనీ ఆమె ఒక మెరుపు బ్యాటర్గానీ, నిప్పులు చెరిగే బౌలర్ కానీ కాదు. రెండేళ్ల క్రితం 2022 సీజన్లో యూపీ వారియర్స్ తరఫున పేలవంగా ఆడి నిరాశపరిచింది. 9 మ్యాచ్ల్లో 29 పరుగులే చేసింది. దీంతో తర్వాత రెండు రెండు సీజన్లకు పక్కన బెట్టారు. ఇప్పుడేమో జెయింట్స్ పెద్దమొత్తానికి ఆమెను అక్కును చేర్చుకోవడం విశేషం.టీనేజ్ వికెట్కీపర్ బ్యాటర్కూ జాక్పాట్ఇక ముంబై ఇండియన్స్ కూడా 16 ఏళ్ల టీనేజ్ వికెట్కీపర్ బ్యాటర్ జి.కమలినిని రూ. 1 కోటి 60 లక్షలతో కొనుగోలు చేసింది. తమిళనాడుకు చెందిన ఆమె భారత అండర్–19 జట్టు తరఫున అది కూడా వేలం జరిగిన రోజే (ఆదివారం కౌలాలంపూర్లో ఆసియా కప్ అండర్–19 టోర్నీ) ఒక మ్యాచ్ ఆడింది. 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో అజేయంగా 44 పరుగులు చేసింది.మరోవైపు.. 23 ఏళ్ల ఉత్తరాఖండ్ లెగ్స్పిన్ ఆల్రౌండర్ ప్రేమా రావత్ను వేలంలో రూ. 1 కోటి 20 లక్షలకు పాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దక్కించుకుంది. రూ. కోటి పైచిలుకు పలికిన ఈ ముగ్గురు క్రికెటర్ల బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. కానీ మినీ వేలం వారి పాలిట మెగా జాక్పాట్గా మారింది.వారి వైపు ఫ్రాంచైజీలు కన్నెత్తి చూడలేదుఇక వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ డియాండ్రా డాటిన్ రూ. కోటి మార్క్ దాటిన ఏకైక విదేశీ ప్లేయర్. రూ. 1 కోటి 70 లక్షలకు ఆమెను గుజరాత్ జెయంట్స్ కొనుక్కుంది. 33 ఏళ్ల వెటరన్ కరీబియన్ క్రికెటర్ బేస్ ప్రైస్ రూ. 50 లక్షలు కాగా... యూపీ వారియర్స్, గుజరాత్లు పోటీపడ్డాయి.గతంలో ఆమెను (2023 సీజన్) రూ. 60 లక్షలకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకున్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టీమిండియా ప్లేయర్లు స్నేహ్ రాణా, పూనమ్ యాదవ్లపై ఐదు ఫ్రాంచైజీలు కన్నెత్తి చూడలేదు. కనీస ధరకైనా ఎవరూ తీసుకోకపోవడంతో వీరంతా అన్సోల్డ్ (అమ్ముడుపోని) క్రికెటర్లుగా మిగిలిపోయారు. వేలం తర్వాత ఫ్రాంచైజీలకు మిగిలింది?వేలానికి ముందు 15 మందిని అట్టిపెట్టుకున్న యూపీ వారియర్స్ ముగ్గురు ప్లేయర్లను తక్కువ ధరకే తీసుకొని మినీ వేలంలో మమ అనిపించింది. అలనా కింగ్ (రూ. 30 లక్షలు), క్రాంతి గౌడ్ (రూ. 10 లక్షలు), ఆరుషి గోయెల్ (రూ. 10 లక్షలు)... ఈ ముగ్గురికి కలిపి రూ. అరకోటి మాత్రమే ఖర్చు చేసింది. మొత్తం పర్సు రూ. 15 కోట్లు కాగా... అందరికంటే తక్కువగా రూ. 11 కోట్ల 60 లక్షలు ఖర్చు చేసిన ఈ ఫ్రాంచైజీ అందరికంటే ఎక్కువ (రూ.3 కోట్ల 40 లక్షలు) మొత్తాన్ని మిగుల్చుకుంది. గుజరాత్ (రూ.14 కోట్ల 60 లక్షలు) ఎక్కువగా ఖర్చు చేసింది. ఆ ఫ్రాంచైజీ వద్ద కేవలం రూ. 40 లక్షలే మిగిలున్నాయి. ఇక ఆర్సీబీ రూ. 13 కోట్ల 25 లక్షలు వెచ్చించి రూ. 1 కోటి 75 లక్షలు మిగుల్చుకుంది. రూ. 13 కోట్ల 35 లక్షలు ఖర్చు చేసిన ఢిల్లీ ఖాతాలో రూ. 1 కోటి 65 లక్షలు మిగిలున్నాయి. ముంబై రూ. 14 కోట్ల 55 లక్షలు ఖర్చు పెట్టింది. కేవలం రూ. 45 లక్షలే ఆ ఫ్రాంచైజీ వద్ద ఉన్నాయి. ప్రతీ ఫ్రాంచైజీ కూడా గరిష్ట సభ్యుల సంఖ్య (18)ను భర్తీచేసుకున్నాయి.మూడు ముక్కల్లో... ఇది వచ్చే 2025 సీజన్కు ముందు మినీ వేలం. 91 మంది భారతీయులు, 29 మంది విదేశీయులు కలిపి మొత్తం 124 మంది వేలానికి వచ్చారు. ఇందులో ఐదుగురు విదేశీ ప్లేయర్లు సహా 19 మంది క్రికెటర్లను ఫ్రాంచైజీలు రూ. 9.05 కోట్లకు కొనుక్కున్నాయి. అమ్ముడైన క్రికెటర్లు వీరే... (గరిష్టం నుంచి కనిష్ట వరుసలో) సిమ్రన్ బాను (రూ. 1.90 కోట్లు; గుజరాత్) డియాండ్రా డాటిన్ (రూ. 1.70 కోట్లు; గుజరాత్) కమలిని (రూ. 1.60 కోట్లు; ముంబై) ప్రేమా రావత్ (రూ. 1.20 కోట్లు; బెంగళూరు) శ్రీచరణి (రూ. 55 లక్షలు; ఢిల్లీ) నడిన్ డిక్లెర్క్ (రూ. 30 లక్షలు; ముంబై) డానియెల్లె గిబ్సన్ (రూ. 30 లక్షలు; గుజరాత్) అలానా కింగ్ (రూ. 30 లక్షలు; యూపీ) అక్షిత (రూ.20 లక్షలు; ముంబై) రాఘవి బిస్త్ (రూ. 10 లక్షలు; బెంగళూరు) జాగ్రవి పవార్ (రూ. 10 లక్షలు, బెంగళూరు) సంస్కృతి (రూ. 10 లక్షలు; ముంబై) క్రాంతి గౌడ్ (రూ. 10 లక్షలు; యూపీ) ఆరుషి గోయెల్ (రూ. 10 లక్షలు; యూపీ) నందిన్ కశ్యప్ (రూ. 10 లక్షలు; ఢిల్లీ) నికీ ప్రసాద్ (రూ. 10 లక్షలు; ఢిల్లీ) సారా బ్రిస్ (రూ.10 లక్షలు; ఢిల్లీ) ప్రకాశిక నాయక్ (రూ. 10 లక్షలు; గుజరాత్) జోషిత (రూ. 10 లక్షలు; బెంగళూరు) చదవండి: WPL 2025: ఏ జట్టులో ఎవరు? -
మినీ వేలం: యువ క్రికెటర్కు కళ్లు చెదిరే ధర.. ఎవరీ కమలిని?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలం సందర్భంగా తమిళనాడుకు చెందిన ఓ యువ క్రికెటర్పై కనక వర్షం కురిసింది. పదహారేళ్ల జి. కమలిని కోసం ముంబై ఇండియన్స్ భారీ మొత్తం ఖర్చు చేసింది. అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో ఉన్న ఈ ఆల్రౌండర్ను ఏకంగా రూ. 1.60 కోట్లకు కొనుగోలు చేసింది.19 స్థానాల కోసంభారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మినీ వేలంలో మొత్తం 120 మంద మహిళా క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఐదు జట్లలో కలిపి ఖాళీగా ఉన్న 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది, విదేశాల నుంచి 29 మంది ఆటగాళ్లు బరిలో నిలిచారు.రూ. 10 లక్షల కనీస ధరఇక బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ వేలంపాటలో జి. కమలిని రూ. 10 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఆమె కోసం ఢిల్లీ క్యాపిటల్స్తో పాటు ముంబై ఇండియన్స్ బిడ్ వేసింది. అయితే, ఈ ఆల్రౌండర్ను ఎలాగైనా తమ జట్టులోకి చేర్చుకోవాలని పట్టుబట్టిన ముంబై యాజమాన్యం.. ఢిల్లీతో పోటీ పడి ఆమె ధరను కోటి దాటించింది.అయినప్పటికీ ఢిల్లీ వెనక్కి తగ్గకపోవడంతో మరో అరవై లక్షలు పెంచి ఏకంగా 1.60 కోట్ల రూపాయలకు ముంబై కమలిని సేవలను సొంతం చేసుకుంది. కాగా అన్క్యాప్డ్ ప్లేయర్ అయినప్పటికీ జి.కమలిని కోసం వేలంలో భారీ డిమాండ్ రావడానికి కారణం.. ఆమె నైపుణ్యాలే.భారీ సిక్సర్లతో విరుచుకుపడే లెఫ్టాండర్ఇటీవల జరిగిన అండర్-19 మహిళల టీ20 ట్రోఫీలో తమిళనాడు టైటిల్ గెలవడంలో జి. కమలినిది కీలక పాత్ర. ఈ టోర్నమెంట్లో ఎనిమిది మ్యాచ్లలో కలిపి ఆమె 311 పరుగులు చేసింది. భారీ సిక్సర్లతో విరుచుకుపడే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. పార్ట్ టైమ్ స్పిన్నర్గానూ సేవలు అందించింది.అంతేకాదు.. ఈ లెగ్బ్రేక్ స్పిన్నర్ వివిధ కేటగిరీల్లో తమిళనాడు తరఫున వికెట్ కీపర్గానూ బరిలోకి దిగింది. అందుకే ఈ ఆల్రౌండర్ కోసం ముంబై భారీ మొత్తం ఖర్చు చేసింది. సౌతాఫ్రికా ఆల్రౌండర్ కోసంకాగా ముంబై ఇండియన్స్ మహిళా జట్టులో నాలుగు ఖాళీలు ఉండగా.. ఒక స్థానం జి. కమలిని భర్తీ చేసింది. ఇక ఈ వేలంలో కమలిని కంటే ముందు సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నదినె డి క్లర్క్ను ముంబై కొనుక్కుంది. ఆమె కోసం రూ. 30 లక్షలు వెచ్చించింది.డాటిన్కు రూ. 1.70 కోట్లుమరోవైపు.. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డియోండ్రా డాటిన్ను గుజరాత్ జెయింట్స్ రూ. 1.70 కోట్లకు సొంతం చేసుకుంది. యూపీ వారియర్స్తో పోటీపడీ మరీ డాటిన్ను దక్కించుకుంది. అదే విధంగా సిమ్రన్ షేక్ కోసం గుజరాత్ అత్యధికంగా రూ. 1.90 కోట్లు ఖర్చు చేసింది.అయితే, తొలి రౌండ్లో పూనమ్ యాదవ్, స్నేహ్ రాణా(కనీస ధర రూ. 30 లక్షలు) వంటి భారత ప్లేయర్లు అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. కాగా డబ్ల్యూపీఎల్లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ పేరిట ఐదు జట్లు పాల్గొంటున్నాయి. చదవండి: BGT: మహ్మద్ షమీకి బైబై! -
డబ్ల్యూపీఎల్ మినీ వేలానికి 120 మంది ప్లేయర్లు
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలంలో 120 మంది ప్లేయర్లు పాల్గొననున్నారు. ఈ నెల 15న జరగనున్న డబ్ల్యూపీఎల్ వేలంలో అందుబాటులో ఉన్న 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది ప్లేయర్లు, విదేశాల నుంచి 29 మంది ప్లేయర్లు బరిలో ఉన్నారు. ఇందులో అసోసియేషన్ దేశాలకు చెందిన ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. గుజరాత్ ఫ్రాంచైజీ వద్ద అత్యధికంగా రూ.4.4 కోట్లు ఉన్నాయి. గుజరాత్ నలుగురు ప్లేయర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉండగా... యూపీ వారియర్స్ జట్టు ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసుకోనుంది. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు తలా నలుగురు ప్లేయర్లను కొనుగోలు చేయనున్నాయి. భారత ఆటగాళ్లలో ఆల్రౌండర్ స్నేహ్ రాణా రూ. 30 లక్షల కనీస ధరతో వేలానికి రానుండగా... విదేశీ ప్లేయర్లలో డాటిన్ (వెస్టిండీస్), హీథర్ నైట్ (ఇంగ్లండ్)పై అదరి దృష్టి నిలవనుంది. వీరిద్దరూ రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొంటున్నారు. -
టైటిల్ గెలవకపోతేనేం: స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు
WPL 2024 Winner- RCBW: టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లితో తనను పోల్చడం సరికాదని భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పేర్కొంది. జాతీయ జట్టు తరఫున కోహ్లి సాధించిన విజయాలు వెలకట్టలేనివని కొనియాడింది. కేవలం టైటిల్ గెలవడం ఒక్కటే గొప్ప కెప్టెన్ అన్న పదానికి నిర్వచనం కాదంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీకి అందని ద్రాక్షగా ఉన్న ట్రోఫీని స్మృతి మంధాన అందించిన విషయం తెలిసిందే. ఐపీఎల్తో పాటు మహిళల కోసం బీసీసీఐ నిర్వహిస్తున్న వుమెన్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీని విజేతగా నిలిపింది. WPL 2024లో ఆర్సీబీకి టైటిల్ అందించింది. పదహారేళ్లుగా ఆర్సీబీతోనే ఉన్న విరాట్ కోహ్లికి సాధ్యం కాని ఘనతను స్మృతి సాధించింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పోలికల గురించి ప్రస్తావనకు రాగా స్మృతి మంధాన హుందాగా స్పందించింది. ‘‘మా ఇద్దరిని పోల్చి చూడటం సరైంది కాదు. ఆయన సాధించిన విజయాలు గొప్పవి. ఎంతో మందికి కోహ్లి ఆదర్శం. టైటిల్ గెలిస్తేనే గొప్ప కెప్టెన్ అంటే ఒప్పుకోను. విరాట్ని గౌరవించడం కూడా మనకు గౌరవం లాంటిదేనని భావిస్తా. ఇక మా ఇద్దరి జెర్సీల వెనకాల 18 ఉండటాన్ని కూడా పెద్దగా పోల్చి చూడాల్సిన పనిలేదు. అది కేవలం వ్యక్తిగత ఎంపిక మాత్రమే. నా పుట్టినరోజు 18న కాబట్టి నేను ఆ నంబర్ను నా జెర్సీ మీద వేయించుకున్నా. అంతేగానీ ఆ నంబర్ వేసుకున్నంత మాత్రాన నా ఆటను విశ్లేషించే తీరు మారకూడదు. అయినా గత పదహారేళ్లుగా ఆర్సీబీ పురుషుల జట్టు అద్భుతంగా రాణిస్తోంది. టైటిల్ గెలవనంత మాత్రానా వారి ప్రదర్శనను తక్కువ చేసి చూడకూడదు. ఆర్సీబీ అనేది ఒక ఫ్రాంఛైజీ. ఇక్కడ మహిళా, పురుష జట్లను వేర్వేరుగానే పరిగణించాలి’’ అని స్మృతి మంధాన మంగళవారం మీడియాతో వ్యాఖ్యానించింది. pic.twitter.com/SOWpkfIDny — priyam ~ media account (@dunkimedia) March 19, 2024 No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 -
ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా: స్మృతి మంధాన భావోద్వేగం
Womens Premier League 2024 Winner RCB: ‘‘ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. భావోద్వేగాలను అదుపుచేసుకోవడం కష్టంగా ఉంది. ఒక్క మాట మాత్రం గట్టిగా చెప్పగలను.. ఇదంతా సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది. మా జట్టును చూసి నిజంగా గర్వంగా ఉంది’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధాన ఉద్వేగానికి లోనైంది. Going down in the history books 📙🏆 pic.twitter.com/OrQkgRailK — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 బీసీసీఐ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ చాంపియన్గా ఆర్సీబీ నిలవడంతో స్మృతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రయాణంలో మేము ఎత్తుపళ్లాలెన్నో చూశాం. ఏదేమైనా ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబడటం అద్భుతంగా అనిపిస్తోంది. చివరి లీగ్ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ వంటిదైతే.. సెమీస్.. ఈరోజు ఫైనల్.. ఇలా ప్రధాన మ్యాచ్లన్నింటినిలోనూ సరైన సమయంలో సరైన విధంగా రాణించగలిగాం. గత సీజన్ మాకెన్నో పాఠాలు నేర్పింది. ముఖ్యంగా ప్లేయర్గా, కెప్టెన్గా నేనెంతో నేర్చుకున్నా. కష్టకాలంలో మేనేజ్మెంట్ నాకు అండగా నిలబడింది. ఇప్పుడు వారి కోసం మేము ట్రోఫీ గెలిచాం. జట్టులో ప్రతి ఒక్కరి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. ఆర్సీబీ ఫ్రాంఛైజీ కప్ గెలవడం ఎంతో ఎంతో సంతోషంగా ఉంది. ఆర్సీబీ అభిమానులు అందరిలోకెల్లా ఎంతో విశ్వసనీయంగా ఉంటారు. జట్టుకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తారు. వారి కోసం ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా.. ‘ఈసారి కప్ మనకే అంటారు కదా.. అవును ఈసారి కప్ మనదే’.. నా మాతృభాష కన్నడ కాకపోయినప్పటికీ.. అభిమానుల కోసం కచ్చితంగా ఇది మాత్రం కన్నడలో చెప్పాల్సిందే’’ అని హర్షం వ్యక్తం చేసింది. కాగా అరుణ్జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన WPL 2024 ఫైనల్లో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తద్వారా WPL రెండో ఎడిషన్ విజేతగా అవతరించింది. పదహారేళ్లుగా కప్ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ, ఫ్యాన్స్ కలను నెరవేర్చింది స్మృతి మంధాన సేన!! No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 గత సీజన్లో విఫలం కాగా గతేడాది స్మృతి మంధాన బ్యాటర్గా పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. మొత్తంగా ఎనిమిది మ్యాచ్లు ఆడి కేవలం 149 పరుగులు చేసింది. తాజా ఎడిషన్లో 10 మ్యాచ్లలో 300 పరుగులు చేసి టాప్-4లో నిలిచింది. -
# RCB: మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు!
ఆర్సీబీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ... నెట్టింట ఎక్కడ చూసినా ఇదే పేరు దర్శనమిస్తోంది. పదహారేళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పురుషుల జట్టుకు సాధ్యం కాని ఘనతను మహిళా జట్టు సాధించింది. వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లోనే ట్రోఫీ గెలిచి.. ‘‘ఇస్ సాలా కప్ నమదే’’ అని ప్రతి ఏడాది సందడి చేసే బెంగళూరు ఫ్యాన్స్.. ‘‘ఇస్ సాలా కప్ నమ్దూ’’ అంటూ సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. సమిష్టి కృషితో ఆర్సీబీని టైటిల్ విజేతగా నిలిపింది స్మృతి మంధాన సేన. No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 ఈ నేపథ్యంలో బెంగళూరు వుమెన్ టీమ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా గ్లెన్ మాక్స్వెల్, దినేశ్ కార్తిక్ తదితరులు స్మృతి సేన సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఆర్సీబీ సైతం.. ‘‘మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు’’ అన్నట్లుగా వీడియోను షేర్ చేసింది. Going down in the history books 📙🏆 pic.twitter.com/OrQkgRailK — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 మరోవైపు.. అదే సమయంలో అభిమానులు మాత్రం.. ‘‘లేడీస్ ఫస్ట్’ అనే నానుడిని ఆర్సీబీ మహిళలు నిజం చేశారు.. ఇక మిగిలింది మెన్స్ టీమ్’’ అంటూ ఫాఫ్ డుప్లెసిస్ బృందానికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు.. తమదైన శైలిలో మీమ్స్ సృష్టించి ఆర్సీబీ పురుషుల జట్టును ట్రోల్ చేస్తున్నారు. నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఆ మీమ్స్పై మీరూ ఓ లుక్కేయండి!! 18 🤝 18 📸: JioCinema pic.twitter.com/0SDwzLHvRM — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 RCB fans entering the office tomorrow#WPL2024 #WPLFinal #RCB pic.twitter.com/SKbaWNwqbN — ನಗಲಾರದೆ 𝕏 ಅಳಲಾರದೆ (@UppinaKai) March 17, 2024 Oreyy 😂 pic.twitter.com/FyEMLpAWws — Likhit MSDian (@LIKHITRTF) March 17, 2024 pic.twitter.com/93FufawCOn — t-riser (@techsaturation) March 17, 2024 కాగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ మహిళా జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ప్రత్యర్థిని తొలుత 113 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ.. 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించి WPL 2024 చాంపియన్గా అవతరించింది. చదవండి: WPL 2024: ప్రియుడితో కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చిన మంధాన.. ఫోటో వైరల్ Every RCB Fan right now 🥺😭pic.twitter.com/CLS1MDrEeZ — Vikas (@VikasKA01) March 17, 2024 -
WPL 2024: సూపర్ షబ్నమ్...
న్యూఢిల్లీ: వరుసగా మూడో మ్యాచ్లోనూ దీప్తి శర్మ (60 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగినా... యూపీ వారియర్స్ను గెలిపించలేకపోయింది. ఫలితంగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో యూపీ ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 8 పరుగుల తేడాతో యూపీ వారియర్స్పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెపె్టన్ బెత్ మూనీ (52 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించగా, లౌరా వోల్వార్ట్ (30 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకెల్స్టోన్ 3, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షబ్నమ్ షకీల్ (3/11) కీలక వికెట్లతో ఆరంభంలోనే యూపీని దెబ్బ తీసింది. దాంతో స్కోరు 35/5 వద్ద నిలిచింది. అయితే దీప్తి, పూనమ్ ఖేమ్నర్ (36 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడి జట్టును విజయానికి చేరువగా తెచ్చారు. వీరిద్దరు 78 బంతుల్లో అభేద్యంగా 109 పరుగులు జోడించారు. చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా, దీప్తి 2 సిక్సర్లతో సహా మొత్తం 17 పరుగులే వచ్చాయి. పట్టికలో మూడో స్థానం కోసం ఇంకా పోటీ మిగిలే ఉంది. యూపీ, బెంగళూరుకు చెరో 6 పాయింట్లు ఉండగా, యూపీ మ్యాచ్లు పూర్తయ్యాయి. నేడు ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్లో బెంగళూరు గెలిస్తే ప్లే ఆఫ్కు అర్హత పొందుతుంది. ఒకవేళ భారీ తేడాతో ఓడిపోకున్నా బెంగళూరుకే ప్లే ఆఫ్స్ అవకాశం ఉంది. ఇక 4 పాయింట్లున్న గుజరాత్ చివరి మ్యాచ్లో గెలవడంతో పాటు భారీ రన్రేట్ సాధించాలి. -
WPL 2024: సూపర్ స్మృతి...
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోరీ్నలో తొలి అంచెపోటీలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయంతో ముగించింది. ఓపెనర్, కెపె్టన్ స్మృతి మంధాన (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్స్లు), టాపార్డర్ బ్యాటర్ ఎలీస్ పెరీ (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్స్లు) చెలరేగడంతో బెంగళూరు 23 పరుగుల తేడాతో యూపీ వారియర్స్పై గెలుపొందింది. ఈ లీగ్లో ఆర్సీబీకిది మూడో విజయం. మొదట బ్యాటింగ్కు దిగిన బెంగళూరు నిరీ్ణత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఆంధ్ర అమ్మాయి సబ్బినేని మేఘన (21 బంతుల్లో 28; 5 ఫోర్లు)తో ఒపెనింగ్ వికెట్కు చకచకా 51 పరుగులు జతచేసిన స్మృతి ఆ తర్వాత పెరీ అండతో దూకుడు పెంచింది. ఇద్దరు ధనాధన్ ఆటతీరు కనబరచడంతో యూపీ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. రెండో వికెట్కు 10.4 ఓవర్లలో 95 పరుగులు జతచేశారు. మంధాన 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 146 పరుగుల వద్ద స్మృతి ని్రష్కమించగా, 33 బంతుల్లో అర్ధశతకం సాధించిన పెరీ ఆఖరి ఓవర్లో అవుటైంది. రిచా ఘోష్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించింది. ఆంధ్ర అమ్మాయి అంజలి శర్వాణి, దీప్తి శర్మ, సోఫీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేయగలిగింది. కెపె్టన్, ఓపెనర్ అలీసా హీలీ (38 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్స్లు) పవర్ప్లేలో దంచేసింది. మరో ఓపెనర్ కిరణ్ నవ్గిరే (18) సహా చమరి ఆటపట్టు (8), గ్రేస్ హారిస్ (5), శ్వేత సెహ్రావత్ (1) స్వల్ప వ్యవధిలో ని్రష్కమించడంతో యూపీ లక్ష్యానికి దూరమైంది. దీప్తి శర్మ (22 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), పూనమ్ (24 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు పోరాడారు. నేటి నుంచి ఢిల్లీ వేదికపై రెండో అంచె పోటీలు జరుగుతాయి. మంగళవారం జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. -
క్రికెట్ ఫ్యాన్స్కు ఇక పండగే... WPI షెడ్యూల్ వచ్చేసింది
-
క్రికెట్ ఫ్యాన్స్కు ఇక పండగే.. డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది
క్రికెట్ అభిమానుల ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. డబ్ల్యూపీఎల్-2024 టోర్నీ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెరకు మంగళవారం బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. బెంగళూరు వేదికగా జరగనున్న తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. తొలి సీజన్లో కేవలం ముంబైకే పరిమితమైన . డబ్ల్యూపీఎల్.. ఈ సారి రెండు నగరాల్లో జరగనుంది. ఈ సీజన్లో మొదటి దశ మ్యాచ్లు బెంగళూరులో రెండో దశ మ్యాచ్లు దిల్లీలో జరగనున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 4 వరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు జరగనున్నాయి. అనంతరం మార్చి 5 నుంచి మిగిలిన దశ మ్యాచ్లు ఢిల్లీలో జరగనున్నాయి. మార్చి 15న ఎలిమినేటర్ మ్యాచ్, మార్చి 17న ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలో జరగనున్నాయి. మొత్తం అన్ని మ్యాచ్లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. కాగా భారత్లో మహిళల క్రికెట్ను అభివృద్ది చేసేందుకు గతేడాది డబ్ల్యూపీఎల్ తొలి సీజన్కు బీసీసీఐ శ్రీకారం చుట్టింది డబ్ల్యూపీల్ షెడ్యూల్ 2024 ►ఫిబ్రవరి 23- ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు) ►ఫిబ్రవరి 24- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్స్ (బెంగళూరు) ►ఫిబ్రవరి 25- గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (బెంగళూరు) ►ఫిబ్రవరి 26- యూపీ వారియర్స్ vs దిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు) ►ఫిబ్రవరి 27- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ (బెంగళూరు) ►ఫిబ్రవరి 28- ముంబై ఇండియన్స్ vs యూపీ వారియర్స్ (బెంగళూరు) ►ఫిబ్రవరి 29- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs దిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు) ►మార్చి 1- యూపీ వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ (బెంగళూరు) ►మార్చి 2- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ (బెంగళూరు) ►మార్చి 3- గుజరాత్ జెయింట్స్ vs దిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు) ►మార్చి 4- యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (బెంగళూరు) ►మార్చి 5- దిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (ఢిల్లీ) ►మార్చి 6- గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ) ►మార్చి 7- యూపీ వారియర్స్ vs ముంబై ఇండియన్స్ (ఢిల్లీ) ►మార్చి 8- దిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్స్ (ఢిల్లీ) ►మార్చి 9- ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ (ఢిల్లీ) ►మార్చి 10- దిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ) ►మార్చి 11- గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్స్ (ఢిల్లీ) ►మార్చి 12- ముంబయి ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ) ►మార్చి 13- దిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (ఢిల్లీ) ►మార్చి 15- ఎలిమినేటర్ (ఢిల్లీ) ►మార్చి 17- ఫైనల్ (ఢిల్లీ) చదవండి: అయోధ్యలో కోహ్లిని పోలిన వ్యక్తి.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం! వీడియో -
డబ్ల్యూపీఎల్: అవార్డులు ఎవరికి? విన్నర్ ప్రైజ్మనీ ఎంతంటే! పీఎస్ఎల్ విజేత కంటే..
Womens Premier League 2023: మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ విజేతగా నిలిచి ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్ అరంగేట్ర చాంపియన్గా రికార్డులకెక్కింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి హర్మన్ సేన ఈ మేరకు చరిత్ర సృష్టించింది. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది మొట్టమొదటి డబ్ల్యూపీఎల్ ట్రోఫీని ముద్దాడి సంబరాల్లో మునిగిపోయింది. మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రవేశపెట్టిన డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ను మధుర జ్ఞాపకంగా మిగుల్చుకుంది. ఇక ఈ విజయంతో చాంపియన్ ముంబై, వివిధ విభాగాల్లో సత్తా చాటిన క్రికెటర్లు గెలుచుకున్న ప్రైజ్మనీ ఎంతో తెలుసా?! డబ్ల్యూపీఎల్-2023 అవార్డులు, ప్రైజ్మనీ ►విజేత- ముంబై ఇండియన్స్ వుమెన్- గోల్డెన్ ట్రోఫీ- రూ. 6 కోట్లు ►రన్నరప్- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- రూ. 3 కోట్లు ►మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ హేలీ మాథ్యూస్(ముంబై ఇండియన్స్)- రూ. 5 లక్షలు ►ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు)- మెగ్ లానింగ్(ఢిల్లీ క్యాపిటల్స్)- 9 ఇన్నింగ్స్లో 345 పరుగులు- రూ. 5 లక్షలు ►పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు)- హేలీ మాథ్యూస్(ముంబై ఇండియన్స్)- 16 వికెట్లు ►ఫెయిర్ ప్లే అవార్డు- ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ►క్యాచ్ ఆఫ్ ది సీజన్: హర్మన్ప్రీత్ కౌర్(ముంబై)- యూపీ వారియర్జ్ దేవికా వైద్య క్యాచ్- రూ. 5 లక్షలు ►సఫారీ పవర్ఫుల్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్- సోఫీ డివైన్ (ఆర్సీబీ)- 8 ఇన్నింగ్స్లో 13 సిక్సర్లు- రూ. 5 లక్షలు ►ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్- యస్తికా భాటియా(ముంబై)- రూ. 5 లక్షలు. పాకిస్తాన్ సూపర్ లీగ్ విజేత కంటే మహిళా ప్రీమియర్ లీగ్ విజేతకు అందిన మొత్తం పీఎస్ఎల్ చాంపియన్ లాహోర్ కలందర్స్ గెల్చుకున్న మొత్తం కంటే దాదాపు రెట్టింపు కావడం విశేషం. ఈ ఏడాది పీఎస్ఎల్ విన్నర్గా అవతరించిన లాహోర్ రూ. 3.4 కోట్లు ప్రైజ్మనీ అందుకోగా.. రన్నరప్ ముల్తాన్ సుల్తాన్స్ సుమారు 1.37 కోట్ల రూపాయలు గెలుచుకుంది. The young promising wicketkeeper-batter shined bright in a victorious season for @mipaltan 👏👏@YastikaBhatia becomes the emerging player of the season 👌#TATAWPL pic.twitter.com/hO8qMDUkty — Women's Premier League (WPL) (@wplt20) March 26, 2023 చదవండి: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్కు షాక్.. భరత్కు చోటు IPL 2023: ఐపీఎల్ తోపులు వీరే.. సింహభాగం రికార్డులు యూనివర్సల్ బాస్వే..! Raw emotions 🎥 A moment to savor for @mipaltan 👌 👌 #TATAWPL | #Final | #DCvMI pic.twitter.com/wdf7t07NMJ — Women's Premier League (WPL) (@wplt20) March 26, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WPL 2023 Final: తొలి టైటిల్ కొట్టేదెవరు?
ముంబై: ప్రతిష్టాత్మకంగా తొలి సారి నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చివరి ఘట్టానికి చేరింది. టోర్నీ మొదటి విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది. నేడు డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతుంది. టోర్నీ ఆరంభంలో దూకుడు కనబర్చి దూసుకెళ్లిన ముంబై ఆ తర్వాత వెనుకబడటంతో ఫైనల్ చేరేందుకు ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చింది. ఢిల్లీ మాత్రం సరైన సమయంలో సత్తా చాటి వరుస విజయాలతో పాటు రన్రేట్ను పెంచుకొని అగ్రస్థానంతో తుది పోరుకు అర్హత సాధింది. ఢిల్లీ బ్యాటింగ్ భారం ఓపెనర్ లానింగ్తో పాటు షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్లపై ఉంది. ఆల్రౌండర్గా మరిజాన్ కప్ ఇప్పటి వరకు కీలక పాత్ర పోషించింది. మరో వైపు హర్మన్ప్రీత్ ఫామ్లో లేకపోయినా నాట్ సివర్, హీలీ మాథ్యూస్ ముంబైకి భారీ స్కోరు అందించగలరు. అమేలియా కెర్ రూపంలో ధాటిగా ఆడే మరో బ్యాటర్ కూడా ఉంది. ప్రత్యర్థి కంటే బలమైన బౌలింగ్ లైనప్ ముంబై ఆశలను పెంచుతోంది. సైకా ఇషాక్ 15 వికెట్లతో ఫామ్లో ఉండగా, పేసర్ ఇసీ వాంగ్ పదునేమిటో ఎలిమినేటర్లో కనిపించింది. ఈ నేపథ్యంలో ఆసక్తికర ఫైనల్ సమరం ఖాయం. -
Womens Premier League 2023:ప్లేఆఫ్కు యూపీ వారియర్స్
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్లో చివరిదైన మూడో ప్లేఆఫ్ బెర్త్ కూడా ఖరారైంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ దశకు అర్హత పొందగా... ఈ రెండు జట్ల సరసన యూపీ వారియర్స్ చేరింది. సోమవారం జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్ మూడు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ను ఓడించింది. యూపీ గెలుపుతో గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు సాధించింది. హేమలత (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్లు), యాష్లే గార్డ్నర్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీలు చేశారు. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, పార్శవి చోప్రా రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం యూపీ వారియర్స్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించి విజయం సాధించింది. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన యూపీ వారియర్స్ను తాలియా (38 బంతుల్లో 57; 11 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్రేస్ హారిస్ (41 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్స్లు) ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 78 పరుగులు జోడించారు. తాలియా అవుటయ్యాక గ్రేస్ హారిస్ యూపీని విజయం దిశగా నడిపించింది. ఏడు బంతులు మిగిలి ఉండగా హారిస్ పెవిలియన్ చేరగా... సోఫీ ఎకిల్స్టోన్ (13 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) యూపీ విజయాన్ని ఖాయం చేసింది. ముంబై ఇండియన్స్కు ఢిల్లీ షాక్ సోమవారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టుకు షాక్ ఇచ్చింది. ఈ టోర్నీలో ఆడిన తొలి ఐదు మ్యాచ్ల్లో గెలిచి అందరికంటే ముందుగా ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న ముంబై ఆ తర్వాత ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడం గమనార్హం. ముందుగా ముంబై జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు చేసింది. పూజ వస్త్రకర్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), హర్మన్ప్రీత్ కౌర్ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు), ఇసీ వాంగ్ (24 బంతుల్లో 23; 1 సిక్స్), అమన్జ్యోత్ కౌర్ (16 బంతుల్లో 19; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజాన్ కప్ (2/13), శిఖా పాండే (2/21), జెస్ జొనాసెన్ (2/25) ముంబైని కట్టడి చేశారు. అనంతరం ఢిల్లీ దూకుడుగా ఆడి 9 ఓవర్లలో వికెట్ నష్టపోయి 110 పరుగులు చేసి గెలిచింది. షఫాలీ వర్మ (15 బంతుల్లో 33; 6 ఫోర్లు, 1 సిక్స్) అవుటవ్వగా.. మెగ్ లానింగ్ (22 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), అలైస్ క్యాప్సీ (17 బంతుల్లో 38 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్స్లు) ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశారు. ‘ఫైనల్ బెర్త్’ రేసులో ముంబై, ఢిల్లీ ప్రస్తుతం ఢిల్లీ, ముంబై 10 పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన రన్రేట్ ఆధారంగా ఢిల్లీ టాప్ ర్యాంక్లో, ముంబై రెండో ర్యాంక్లో నిలిచాయి. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో బెంగళూరుతో ముంబై (మధ్యాహ్నం గం. 3:30 నుంచి)... యూపీతో ఢిల్లీ (రాత్రి గం. 7:30 నుంచి) ఆడతాయి. ముంబై, ఢిల్లీ జట్లలో భారీ తేడాతో నెగ్గిన జట్టు ‘టాప్’ ర్యాంక్తో నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తుంది. మూడో స్థానంలో నిలిచిన యూపీ వారియర్స్తో రెండో స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. -
సూపర్ సోఫీ...
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఫామ్లోకి వచ్చింది. ఆడిన తొలి ఐదు మ్యాచ్ల్లో ఓడిపోయిన బెంగళూరు జట్టు వరుసగా రెండో విజయం అందుకుంది. గుజరాత్ జెయింట్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహిళల ఫ్రాంచైజీ క్రికెట్లో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం. బెంగళూరుకు ఆడుతున్న న్యూజిలాండ్ క్రికెటర్ సోఫీ డివైన్ (36 బంతుల్లో 99; 9 ఫోర్లు, 8 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం పరుగు తేడాతో సెంచరీని కోల్పోయింది. స్మృతి (31 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), సోఫీ తొలి వికెట్కు 9.2 ఓవర్లలో 125 పరుగులు జోడించడం విశేషం. సోఫీ అవుటయ్యాక ఎలీస్ పెరీ (12 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు), హీథెర్ నైట్ (15 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడు కొనసాగిస్తూ బెంగళూరు జట్టును విజయతీరానికి చేర్చారు. అంతకుముందు గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. లౌరా వోల్వార్ట్ (42 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్లు), యాష్లే గార్డ్నర్ (26 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ముంబై ఇండియన్స్కు తొలి ఓటమి ఆడిన ఐదు మ్యాచ్ల్లో గెలిచి అజేయంగా ఉన్న ముంబై ఇండియన్స్కు తొలి ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్ ఐదు వికెట్ల తేడాతో ముంబై జట్టును ఓడించింది. తొలుత ముంబై జట్టు 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. హేలీ మాథ్యూస్ (35; 1 ఫోర్, 3 సిక్స్లు), ఇసీ వాంగ్ (32; 4 ఫోర్లు, 1 సిక్స్), హర్మన్ప్రీత్ కౌర్ (25; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్స్టోన్ (3/15), రాజేశ్వరి (2/16), దీప్తి శర్మ (2/35) రాణించారు. అనంతరం యూపీ వారియర్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. తాలియా మెక్గ్రాత్ (38; 6 ఫోర్లు, 1 సిక్స్), గ్రేస్ హారిస్ (39; 7 ఫోర్లు) మెరిపించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ (13 నాటౌట్; 1 ఫోర్), సోఫీ ఎకిల్స్టోన్ (16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) యూపీ జట్టు విజయాన్ని ఖాయం చేశారు. -
హర్మన్ ధనాధన్ హాఫ్ సెంచరీ.. ప్లే ఆఫ్స్కు ముంబై
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఓటమెరుగని ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన పోరులో హర్మన్ప్రీత్ కౌర్ బృందం 55 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్పై ఘనవిజయం సాధించింది. ముంబైకిది వరుసగా ఐదో విజయం. ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (30 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్ అర్ధసెంచరీ బాదింది. ఓపెనర్ యస్తిక భాటియా (37 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, గుజరాత్ బౌలర్లలో ఆష్లే గార్డ్నెర్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం గుజరాత్ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 107 పరుగులే చేయగలిగింది. హర్లీన్ డియోల్ (23 బంతుల్లో 22; 3 ఫోర్లు), కెపె్టన్ స్నేహ్ రాణా (19 బంతుల్లో 20; 3 ఫోర్లు) కష్టంగా రెండు పదుల స్కోరు దాటారు. మిగతావారంతా చేతులెత్తేశారు. నట్ సీవర్ బ్రంట్, హేలీ మాథ్యూస్ చెరో 3 వికెట్లు తీయగా, అమెలియా కెర్కు 2 వికెట్లు దక్కాయి. నేడు జరిగే మ్యాచ్లో యూపీ వారియర్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (రనౌట్) 44; హేలీ (సి) డన్క్లే (బి) గార్డ్నెర్ 0; నట్ సీవర్ (ఎల్బీ) (బి) గార్త్ 36; హర్మన్ప్రీత్ (సి) హర్లీన్ (బి) గార్డ్నెర్ 51; అమెలియా (సి) గార్త్ (బి) కన్వార్ 19; ఇసి వాంగ్ (సి అండ్ బి) స్నేహ్ రాణా 0; హుమైరా (రనౌట్) 2; ధార (నాటౌట్) 1; అమన్జోత్ (సి) డన్క్లే (బి) గార్డ్నెర్ 0; కలిత (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 7, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–1, 2–75, 3–84, 4–135, 5–136, 6–145. బౌలింగ్: గార్డ్నెర్ 4–0–34–3, కిమ్ గార్త్ 4–0–31–1, స్నేహ్ రాణా 4–0–17–1, తనూజ 4–0–32–1, అనాబెల్ 4–0–42–0. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: సోఫియా (ఎల్బీ) (బి) నట్ సీవర్ 0; మేఘన (సి) నట్ సీవర్ (బి) హేలీ 16; హర్లీన్ (ఎల్బీ) (బి) వాంగ్ 22; అనాబెల్ (ఎల్బీ) (బి) హేలీ 0; గార్డ్నెర్ (సి) కలిత (బి) అమెలియా 8; స్నేహ్ (ఎల్బీ) (బి) నట్ సీవర్ 20; హేమలత (సి) వాంగ్ (బి) అమెలియా 6; సుష్మ (నాటౌట్) 18; గార్త్ (సి) హర్మన్ (బి) నట్ సీవర్ 8; తనూజ (సి) యస్తిక (బి) హేలీ 0; మాన్సి (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 107. వికెట్ల పతనం: 1–0, 2–34, 3–34, 4–48, 5–48, 6–57, 7–85, 8–95, 9–96. బౌలింగ్: నట్ సీవర్ 4–0–21–3, సయిక 4–0–20–0, ఇసి వాంగ్ 3–0–19–1, హేలీ మాథ్యూస్ 4–0–23–3, అమెలియా కెర్ 4–0–18–2, అమన్జోత్ 1–0–6–0. -
వారెవ్వా హర్మన్.. ఎదురులేని ముంబై.. వరుసగా నాలుగో విజయం
UP Warriorz vs Mumbai Indians Women- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఎనిమిది వికెట్లతో యూపీ వారియర్స్ను ఓడించింది. ముంబైకిది వరుసగా నాలుగో విజయం. కాగా... టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్కు దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. ఓపెనర్, కెప్టెన్ అలీసా హీలీ (46 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్స్), తాలియా మెక్గ్రాత్ (37 బంతుల్లో 50; 9 ఫోర్లు) రాణించారు. అనంతరం ముంబై 17.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి గెలిచింది. యస్తిక భాటియా (27 బంతుల్లో 42; 8 ఫోర్లు, 1 సిక్స్), నట్ సీవర్ (31 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 53 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) యూపీ బౌలర్లను ధనాధన్ ఆటతో హడలెత్తించారు. సోమవారం జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. చదవండి: Virat Kohli: ఏంటిది కోహ్లి?! పాపం భరత్.. మరీ ఇంత కోపమా? అదొక్కటే కనిపించిందా? వైరల్ Virat Kohli: ఎవరికీ అందనంత ఎత్తులో! ఇక కోహ్లి సాధించాల్సింది అదొక్కటే Two teams ✅ Two captains 😎 Dramatic twists and turns 💥 One winner at the end of it 💪 The story of @mipaltan making it 4️⃣ in 4️⃣ 👌👌 #TATAWPL | #UPWvMI pic.twitter.com/ZVF1Gwqbxw — Women's Premier League (WPL) (@wplt20) March 13, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WPL 2023: చెలరేగిన మరిజన్, షఫాలీ.. ఢిల్లీ చేతిలో గుజరాత్ చిత్తు
Gujarat Giants vs Delhi Capitals Women- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అసాధారణ విజయం సాధించింది. బౌలింగ్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజన్ కాప్ (5/15), బ్యాటింగ్లో షఫాలీ వర్మ (28 బంతుల్లో 76 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగారు. దీంతో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై జయభేరి మోగించింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. లోయర్ ఆర్డర్లో కిమ్ గార్త్ (37 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్గా నిలిచింది. హర్లీన్ డియోల్ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు), జార్జియా వేర్హామ్ (25 బంతుల్లో 22; 2 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడారు. ఢిల్లీ మీడియం పేసర్ మరిజన్ (4–0–15–5) బెంబేలెత్తించింది. శిఖాపాండేకు 3 వికెట్లు దక్కాయి. బ్యాటింగ్ ఆర్డర్లోని తొలి 4 వికెట్లను మరిజనే పడగొట్టింది. దీంతో 28 పరుగులకే గుజరాత్ 5 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా కేవలం 7.1 ఓవర్లలో 107 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు షఫాలీ, కెప్టెన్ మెగ్ లానింగ్ (15 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) అజేయమైన ఓపెనింగ్ భాగస్వామ్యంతో జట్టుకు అలవోక విజయం అందించారు. గార్డ్నెర్ వేసిన 4వ ఓవర్లో షఫాలీ, లానింగ్ కలిసి 4, 4, 6, 1, 4, 4లతో 23 పరుగులు రాబట్టడం విశేషం. షఫాలీ 19 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. డబ్ల్యూపీఎల్లో నేడు ముంబై ్ఠ Vs యూపీ వారియర్స్ రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
లానింగ్, జొనసెన్ చెలరేగగా...
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్ మరోసారి భారీ స్కోరుతో విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్పై జయభేరి మోగించింది. ముందుగా క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల స్కోరు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (42 బంతుల్లో 70; 10 ఫోర్లు, 3 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెస్ జొనసెన్ (20 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది. సహచరులు తడబడినా... తాహ్లియా మెక్గ్రాత్ (50 బంతుల్లో 90 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) అసాధారణ పోరాటం చేసి అజేయంగా నిలిచింది. లానింగ్ అర్ధ సెంచరీ తొలి రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడిన ఓపెనర్లు లానింగ్, షఫాలీ ఆ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. షబ్నిమ్ ఐదో ఓవర్లో లానింగ్ ఒక సిక్స్, రెండు బౌండరీలతో 16 పరుగులు పిండుకుంది. రాజేశ్వరి వేసిన ఆరో ఓవర్లో షఫాలీ ఫోర్ కొడితే లానింగ్ మూడు బౌండరీలతో రెచ్చిపోయింది. పవర్ ప్లేలో ఢిల్లీ స్కోరు 62/0. మరుసటి ఓవర్లోనే షఫాలీ (17; 1 ఫోర్, 1 సిక్స్) ఆటను తాహ్లియా ముగించగా, మెగ్ లానింగ్ మాత్రం తన ధాటిని కొనసాగించి 32 బంతుల్లో (7 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీ సాధించింది. తర్వాత కాసేపు వాన ఆటంకపరిచింది. ఆట తిరిగి మొదలయ్యాక 11వ ఓవర్లో ఢిల్లీ స్కోరు 100 దాటింది. స్వల్ప వ్యవధిలో మరిజన్ (16; 2 ఫోర్లు), లానింగ్ నిష్క్రమించారు. తర్వాత వచ్చిన జెమిమా (22 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు), క్యాప్సీ (10 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్స్లు) కూడా ఢిల్లీ వేగాన్ని కొనసాగించారు. ఆఖర్లో జొనసెన్ భారీ సిక్సర్లతో విరుచుకుపడింది. దీంతో ఆఖరి 4 ఓవర్లలో ఢిల్లీ 58 పరుగులు సాధించడంతో వరుసగా రెండో మ్యాచ్లోనూ 200 మార్క్ దాటింది. మెక్గ్రాత్ ఒంటరి పోరాటం కొండంత లక్ష్యం ముందుంటే యూపీ వారియర్స్ టాపార్డర్ నిర్లక్ష్యంగా వికెట్లను పారేసుకుంది. కెప్టెన్ అలీసా హీలీ (17 బంతుల్లో 24; 5 ఫోర్లు), శ్వేత (1), కిరణ్ నవ్గిరే (2) ‘పవర్ ప్లే’లోనే పెవిలియన్కెళ్లారు. తర్వాత వచ్చిన వారిలో తాహ్లియా ఒంటరిపోరాటం చేసింది. దీప్తి శర్మ (12), దేవిక వైద్య (21 బంతుల్లో 23; 2 ఫోర్లు)లు దూకుడుగా ఆడబోయి వెనుదిరిగారు. బ్యాటింగ్లో మెరుపులు మెరిపించిన జొనసెన్ స్పిన్ బౌలింగ్తో యూపీని చావుదెబ్బ తీసింది. మెక్గ్రాత్ 36 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మెక్గ్రాత్... ఆఖరి ఓవర్లలో ఆమె ఫోర్లు, సిక్సర్లు బాదడంతో యూపీ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (బి) రాజేశ్వరి 70; షఫాలీ (సి) నవ్గిరే (బి) తాహ్లియా 17; మరిజన్ (సి) దీప్తిశర్మ (బి) ఎకిల్స్టోన్ 16; జెమిమా నాటౌట్ 34; క్యాప్సీ (సి) ఎకిల్స్టోన్ (బి) షబ్నిమ్ 21; జొనసెన్ నాటౌట్ 42; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1–67, 2–96, 3–112, 4–144. బౌలింగ్: షబ్నమ్ 4–0–29–1, అంజలీ 3–0–31–0, రాజేశ్వరి గైక్వాడ్ 2–0–31–1, తాహ్లియా మెక్గ్రాత్ 3–0–37–1, దీప్తిశర్మ 4–0–40–0, సోఫీ ఎకిల్స్టోన్ 4–0–41–1. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: హీలీ (సి) జెమిమా (బి) జొనసెన్ 24; శ్వేత (సి) తానియా (బి) మరిజన్ 1; కిరణ్ నవ్గిరే (సి) క్యాప్సీ (బి) జొనసెన్ 0; తాహ్లియా మెక్గ్రాత్ నాటౌట్ 90; దీప్తిశర్మ (సి) రాధ (బి) శిఖా 12; దేవిక (సి) రాధ (బి) జొనసెన్ 23; సిమ్రన్ నాటౌట్ 6; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–29, 2–31, 3–31, 4–71, 5–120. బౌలింగ్: మరిజన్ 4–1–29–1, శిఖాపాండే 4–0–18–1, జెస్ జొనసెన్ 4–0–43–3, నోరిస్ 2–0–25–0, క్యాప్సీ 4–0–25–0, రాధ 1–0–11–0, అరుంధతి 1–0–14–0. డబ్ల్యూపీఎల్లో నేడు గుజరాత్ జెయింట్స్ Vs బెంగళూరు రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
రెండు ముంబై ఇండియన్స్ జట్లు.. రెండు వేర్వేరు ఆరంభాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్, వుమెన్స్ ప్రీమియర్ లీగ్లలో ముంబై బేస్డ్, రిలయన్స్ ఓన్డ్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మెన్స్ టీమ్, డబ్ల్యూపీఎల్లో ముంబై ఇండియన్స్ వుమెన్స్ టీమ్ రెండూ ప్రపంచంలోనే మేటి జట్లు అన్న విషయంతో అందరూ ఏకీభవించాల్సిందే. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఈ విషయాన్ని ఇదివరకే ప్రూవ్ చేసుకోగా.. డబ్ల్యూపీఎల్ ప్రారంభమైన కొద్ది రోజులకే ముంబై ఇండియన్స్ వుమెన్స్ టీమ్ ఈ విషయాన్ని రుజువు చేసింది. డబ్ల్యూపీఎల్లో ఎంఐ వుమెన్స్ టీమ్ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసి టైటిల్ రేసులో ముందువరుసలో నిలిచింది. ఎంఐ మెన్స్ టీమ్ విషయానికొస్తే.. 15 ఐపీఎల్ ఎడిషన్లలో 5 సార్లు ఛాంపియన్గా, ఐదు ఛాంపియన్స్ లీగ్ ఎడిషన్లలో రెండుసార్లు విజేతగా నిలిచిన ఈ జట్టు.. కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేనప్పటికీ, కొన్ని గడ్డు పరిస్థితుల దృష్ట్యా గత రెండు సీజన్లుగా దారుణంగా విఫలమవుతూ వస్తుంది. స్టార్ ఆటగాళ్లు అందుబాటు లేకపోవడం, జూనియర్లు ఇప్పుడిప్పుడే కుదురుకుంటుండటం వల్ల ఎంఐ టీమ్కు ఈ పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులు ఎలా ఉన్నా , వెంటనే సర్దుకుని తిరిగి గెలుపు ట్రాక్పై ఎక్కడం ఆ జట్టుకు ఇది కొత్తేమీ కాదు. కాబట్టి గత సీజన్ల గెలుపోటములతో పని లేకుండా, రాబోయే సీజన్లో ఎంఐ మెన్స్ టీమ్ సత్తా చాటి మరో టైటిల్ సాధిస్తుందని ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. రాబోయే సీజన్లో బుమ్రా అందుబాటులో ఉండడన్న విషయం తప్పిస్తే.. ఆ జట్టు అన్ని విభాగాల్లో పర్ఫెక్ట్గా ఉంది. బ్యాటింగ్లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్.. ఆల్రౌండర్ల కోటాలో టిమ్ డేవిడ్, కెమరూన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్, బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్, జేసన్ బెహ్రెన్డార్ఫ్, డుయాన్ జన్సెస్, పియుష్ చావ్లా లాంటి ఆటగాళ్లతో ముంబై ఇండియన్స్ మెన్స్ టీమ్ పటిష్టంగా ఉంది. గాయపడిన బుమ్రా, జై రిచర్డ్సన్ స్థానాల్లో ఇద్దరు అనుభవజ్ఞులైన పేసర్లు దొరికితే ఈ విభాగంలోనూ ఆ జట్టు పటిష్టంగా మారుతుంది. ఇదిలా ఉంటే, డబ్ల్యూపీఎల్లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం సోషల్మీడియాలో వైరలవుతోంది. అదేంటంటే.. తొట్టతొలి ఐపీఎల్ను ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో ప్రారంభించగా.. అందుకు భిన్నంగా డబ్ల్యూపీఎల్లో ఎంఐ వుమెన్స్ టీమ్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ విషయాన్ని నెటిజన్లు, ముఖ్యంగా ముంబై ఇండియన్స్ అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే 4 వరుస పరాజయాలతో అరంగేట్రం ఐపీఎల్ సీజన్ను ప్రారంభించిన ఎంఐ మెన్స్ టీమ్.. 2013, 2015, 2017, 2019, 2020ల్లో ఐపీఎల్ ఛాంపియన్గా.. 2011, 2013 ఛాంపియన్స్ లీగ్ విజేతగా నిలిచింది. ఎంఐ మెన్స్ టీమ్కు భిన్నంగా వుమెన్స్ టీమ్ ప్రస్తానం సాగుతుండటంతో వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందోనని ఎంఐ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎంఐ వుమెన్స్ టీమ్ స్టార్లతో నిండి ఉంది కాబట్టి, ఆ జట్టే తొలి డబ్ల్యూపీఎల్ టైటిల్ ఎగురేసుకుపోతుందని కొందరు ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. -
WPL 2023 GG Vs RCB: స్పెషల్ డే.. ‘స్పెషల్ మ్యాచ్’.. అందరికి ఎంట్రీ ఫ్రీ
WPL 2023- International Women's Day 2023: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రికెట్ ప్రేమికులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బంపరాఫర్ ఇచ్చింది. వుమెన్ ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా మార్చి 8 నాటి మ్యాచ్ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ టీమ్ మధ్య బుధవారం మ్యాచ్ జరుగనుంది. అందరికీ ఉచిత ప్రవేశం మహిళా దినోత్సవ కానుకగా ఈ ఆసక్తికర పోరును నేరుగా చూసేందుకు వీలు కల్పించారు నిర్వాహకులు. ఈ మేరకు.. ‘‘మహిళా దినోత్సవాన్ని మేము ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం. మార్చి 8, 2023న టాటా డబ్ల్యూపీఎల్లో గుజరాత్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్ వీక్షించేందుకు అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ముంబై- ఆర్సీబీ మధ్య సోమవారం నాటి మ్యాచ్ సందర్భంగా స్క్రీన్ మీద ఈ మేరకు ప్రకటన చేసిన నిర్వాహకులు.. సోషల్ మీడియా వేదికగా మరోసారి ఈ శుభవార్తను పంచుకున్నారు. దీంతో బీసీసీఐపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టిక్కెట్లు ఉచితంగా ఇవ్వడం కంటే కూడా మహిళా క్రికెటర్లకు సమున్నత గౌరవం కల్పిస్తున్న తీరుకు ఫిదా అయ్యామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా స్టేడియం పరిమితికి తగ్గట్లు కొన్ని షరతులతో ఫ్రీగా టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ముంబై టాప్ భారత మహిళా క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ బీసీసీఐ మహిళా ప్రీమియర్ లీగ్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మార్చి 4న ముంబై ఇండియన్స్- గుజరాత్ జెయింట్స్ మ్యాచ్తో లీగ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన గుజరాత్పై 143 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఇక రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ తలపడగా.. లానింగ్ బృందం 60 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. స్పెషల్ డే.. స్పెషల్ మ్యాచ్ మూడో మ్యాచ్లో గుజరాత్- యూపీ వారియర్స్ పోటీ పడగా.. యూపీ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక నాలుగో మ్యాచ్ ముంబై- ఆర్సీబీ మధ్య జరుగగా.. స్మృతి మంధాన సేనకు ముంబై చేతిలో 9 వికెట్ల తేడాతో పరాభవం ఎదురైంది. ఇక ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు జరుగగా.. ముంబై రెండింటిలో ఘన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంతవరకు రెండేసి మ్యాచ్లు ఆడి రెండింట్లోనూ ఓడిన గుజరాత్- ఆర్సీబీ మార్చి 8న గెలుపు కోసం పోటీపడనున్నాయి. మహిళలకు ప్రత్యేకమైన రోజున మరి విజయం ఎవరిని వరిస్తుందో!! చదవండి: WPL 2023: ఆర్సీబీ రాత ఇంతేనా.. మహిళల ఐపీఎల్లోనూ నిరాశ తప్పదా..? PSL 2023: మార్టిన్ గప్తిల్ వీరవిహారం.. 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో.. View this post on Instagram A post shared by Women's Premier League (WPL) (@wplt20) -
WPL 2023: ముంబై సూపర్ షో
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ ధనాధన్ ఆల్రౌండ్ షోతో వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం జరిగిన పోరులో 9 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ను చిత్తు చేసింది. బౌలింగ్లో 3 వికెట్లు పడగొట్టిన హేలీ మాథ్యూస్ బ్యాటింగ్లో (38 బంతుల్లో 77 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగింది. టాపార్డర్ బ్యాటర్ నట్ సీవర్ బ్రంట్ (29 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా మెరుపు అర్ధ సెంచరీ సాధించడంతో ఛేదన సులువైంది. మొదట బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. రిచా ఘోష్ (26 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, సయిక ఇషాక్, అమెలియా కెర్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ హేలీ, బ్రంట్ల అజేయ అర్ధ సెంచరీలతో 14.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 159 పరుగులు చేసింది. అందరూ అంతంతే! బెంగళూరు స్కోరైతే 150 దాటింది కానీ... ఏ ఒక్క బ్యాటర్ది చెప్పుకోదగ్గ స్కోరుగానీ, ఇన్నింగ్స్ను కుదుటపర్చిన భాగస్వామ్యంగానీ లేవు. అదే బెంగళూరు పాలిట శాపమైంది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన (17 బంతుల్లో 23; 5 ఫోర్లు) మొదలు మేగన్ షట్ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు) దాకా ఐదుగురు బ్యాటర్లు రిచా, కనిక ఆహుజా (13 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయాంక పాటిల్ (15 బంతుల్లో 23; 4 ఫోర్లు) 20 పైచిలుకు పరుగులు చేశారు. అందరు ఇలా వచ్చి అలా షాట్లు బాదేసి పెవిలియన్కు వెళ్లినవారే! ఇందులో ఏ ఒక్కరు నిలబడినా, మెరుపుల భాగస్వామ్యం నమోదైనా పరిస్థితి మరోలా ఉండేది. అయితే ముంబై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంలో సమష్టిగా సఫలమయ్యారు. హేలీ, బ్రంట్ ఫిఫ్టీ–ఫిఫ్టీ ముంబై ముందున్న లక్ష్యం 156 పరుగులు. అంత సులభమైందేమీ కాదు. కానీ యస్తిక భాటియా (19 బంతుల్లో 23; 4 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన హేలీ మాథ్యూస్ తొలి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగింది. స్కోరు జోరందుకున్న సమయంలో యస్తికను ప్రీతి బోస్ వికెట్ ముందు దొరకబుచ్చుకుంది. 45 పరుగుల వద్ద తొలి వికెట్ కూలగా, బెంగళూరుకు అదే ఆఖరి ఆనందం అయ్యింది. తర్వాత నట్ సీవర్ వచ్చాక హేలీ వేగం మరో దశకు చేరింది. బెంగళూరు కెప్టెన్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఫలితం లేకపోయింది. అటు బ్రంట్, ఇటు హేలీ బౌండరీలను అవలీలగా బాదేస్తుంటే ఆద్యంతం ‘పవర్ ప్లే’నే కనిపించింది. పదో ఓవర్లోనే హేలీ 26 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. 10.2 ఓవర్లోనే జట్టు స్కోరు 100 దాటింది. మేగన్ షట్ వేసిన 12, శ్రేయాంక పాటిల్ వేసిన 13వ ఓవర్లలో బ్రంట్, హేలీలు ఫోర్లతో చెలరేగిపోయారు. దీంతో ఈ రెండు ఓవర్లలోనే ముంబై 40 పరుగులు చేయడంతో లక్ష్యాన్ని 5.4 ఓవర్ల ముందే ఛేదించింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) వాంగ్ (బి) హేలీ 23; సోఫీ (సి) అమన్జోత్ (బి) సయిక 16; దిశ (బి) సయిక 0; ఎలైస్ పెర్రీ రనౌట్ 13; హీథెర్నైట్ (బి) హేలీ 0; రిచాఘోష్ (సి) నట్ సీవర్ (బి) హేలీ 28; కనిక (సి) యస్తిక (బి) పూజ 22; శ్రేయాంక (ఎల్బీ) (బి) నట్ సీవర్ 23; మేగన్ (స్టంప్డ్) యస్తిక (బి) అమెలియా 20; రేణుక (బి) అమెలియా 2; ప్రీతి నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 155. వికెట్ల పతనం: 1–39, 2–39, 3–43, 4–43, 5–71, 6–105, 7–112, 8–146, 9–154, 10–155. బౌలింగ్: హేలీ 4–0–28–3, నట్ సీవర్ 3–0–34–1, సయిక ఇషాక్ 4–0–26–2, ఇసి వాంగ్ 2–0–18–0, అమెలియా కెర్ 3.4–0–30–2, కలిత 1–0–10–0, పూజ 1–0–8–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ నాటౌట్ 77; యస్తిక (ఎల్బీ) (బి) ప్రీతి 23; నట్ సీవర్ నాటౌట్ 55; ఎక్స్ట్రాలు 4; మొత్తం (14.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 159. వికెట్ల పతనం: 1–45. బౌలింగ్: రేణుక 3–0–28–0, ప్రీతి బోస్ 4–0–34–1, మేగన్ షట్ 3–0–32–0, ఎలైస్ పెర్రీ 1.2–0–18–0, శ్రేయాంక 2–0–32–0, సోఫీ డివైన్ 1–0–11–0. డబ్ల్యూపీఎల్లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ X లక్నో విజార్డ్స్ రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం. -
WPL 2023: నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు.. కనీసం: స్మృతి మంధాన
WPL 2023- Smriti Mandhana: ఇంతవరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా సరే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉన్న క్రేజే వేరు. రోజురోజుకు ఆర్సీబీ అభిమానగణం పెరుగుతుందే తప్ప తగ్గటం లేదనడంలో సందేహం లేదు. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా స్టార్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్సీబీ నాయకుడిగా జట్టును ముందుండి నడిపించిన కోహ్లి ట్రోఫీ గెలవకపోయినా తన అద్భుత ఆట తీరుతో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. గత సీజన్తో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన కోహ్లి ప్రస్తుతం ఆటగాడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్మృతి సారథ్యంలో ఇదిలా ఉంటే.. భారత మహిళా క్రికెట్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ మహిళా ప్రీమియర్ లీగ్ మార్చి 4న ఆరంభమైన విషయం తెలిసిందే. ఐదు జట్లు పోటీపడుతున్న ఈ టీ20 లీగ్లో ఆర్సీబీ వుమెన్ టీమ్కు టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కెప్టెన్. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్తో మార్చి 5న మ్యాచ్ పూర్తి చేసుకున్న స్మృతి సేన.. సోమవారం ముంబై ఇండియన్స్తో తలపడనుంది. నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లితో తనను పోలుస్తూ వస్తున్న వార్తలపై విలేకరుల ప్రశ్నకు స్మృతి ఈ విధంగా సమాధానమచ్చింది. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి పోలికలు నాకు అస్సలు నచ్చవు. ఎందుకంటే కోహ్లి తన కెరీర్లో ఇప్పటికే ఎన్నో అద్భుత రికార్డులు సాధించాడు. నేను ఆ స్థాయికి చేరుకోవాలని కోరుకోవడమే తప్ప.. కనీసం కోహ్లి రికార్డులకు దరిదాపుల్లో కూడా లేను. ముఖ్యంగా ఆర్సీబీకి కోహ్లి అందిస్తున్న సేవలు అమోఘం. నేను కూడా తనలా ఉండేందుకు, జట్టును గొప్ప స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తా’’ అని స్మృతి పేర్కొంది. కాగా డబ్ల్యూపీఎల్-2023 వేలంలో భాగంగా ఆర్సీబీ అత్యధికంగా 3.4 కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్మృతి మంధానను కొనుగోలు చేసింది. ఇక కోహ్లి, స్మృతి జెర్సీ నంబర్ 18 కావడం విశేషం. ఇదిలా ఉంటే డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్లో ఆర్సీబీ 60 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఆర్సీబీ కెప్టెన్గా కోహ్లి ఘనత.. ఇక 2013 నుంచి ఆర్సీబీ కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లి.. 2021 సీజన్ తర్వాత నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. సారథిగా 140 మ్యాచ్ల్లో 66 విజయాలు.. 70 పరాజయాలు నమెదు చేశాడు. మరో 4 మ్యాచ్లలో ఫలితం తేలలేదు. కోహ్లి సారథ్యంలో ఆర్సీబీ 2016లో రన్నరప్గా నిలిచింది. మరో మూడుసార్లు ప్లేఆఫ్స్(2015, 2020, 2021 )చేరింది. ఇక సుదీర్ఘకాలం తర్వాత ఫామ్లోకి వచ్చిన ఈ రన్మెషీన్ అంతర్జాతీయ క్రికెట్లో 74 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. చదవండి: WPL 2023: ఎంఎస్డీ పేరును బ్యాట్పై రాసుకుని హాఫ్ సెంచరీ బాదిన యూపీ వారియర్జ్ బ్యాటర్ Ind Vs Aus: ‘అసలు సెలక్టర్లు ఏం చేస్తున్నారు.. వాళ్లు రాజీనామా చేయాల్సిందే’.. టీమిండియా దిగ్గజం వ్యాఖ్యలు వైరల్ -
డబ్ల్యూపీఎల్లో సందడి చేయనున్న బాలీవుడ్ హీరోయిన్లు
మహిళల ప్రీమియర్ లీగ్ అరంగేట్ర సీజన్కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ముంబైలోని డీవై పాటిల్ క్రికెట్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ లీగ్లో మొత్తం ఐదు జట్లు పాల్గొననున్నాయి. ఇక తొలి డబ్ల్యూపీఎల్ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో బాలీవుడ్ హీరోయిన్లు కృతి సనన్, కియారా అద్వానీ ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ అందాల భామల డ్యాన్స్తో పాటు పంజాబీ రాప్ సింగర్ ఏపీ దిల్లాన్ కూడా సందడి చేయునున్నాడు. కాగా ఈ ఈవెంట్ ప్రారంభానికి ముందు కియారా, కృతి సనన్, దిల్లాన్ రిహార్స్ల్స్లో కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్ల్యూపీఎల్ పూర్తి షెడ్యూల్? మార్చి 4: గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 5: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్, (3:30 PM, బ్రబౌర్న్) మార్చి 5: UP వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 6: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 7: ఢిల్లీ క్యాపిటల్స్ vs UP వారియర్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 8: గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30) PM) , బ్రబౌర్న్) మార్చి 9: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 10: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs UP వారియర్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 11: గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7: 30 PM) , డివై పాటిల్) మార్చి 12: UP వారియర్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 13: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, డివై పాటిల్) మార్చి 14: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 21: UP వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 24: ఎలిమినేటర్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 15: UP వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, డివై పాటిల్) మార్చి 16: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 18: ముంబై ఇండియన్స్ vs UP వారియర్స్ (3:30 PM, DY పాటిల్ ) మార్చి 18: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 20: గుజరాత్ జెయింట్స్ vs UP వారియర్స్ (3:30 PM, బ్రబౌర్న్) మార్చి 20: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 21: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ (3:30 PM, డివై పాటిల్) మార్చి 26: ఫైనల్ (7:30 PM, బ్రబౌర్న్) లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే.. టీవీ: స్పోర్ట్స్18 నెట్వర్క్ డిజిటల్ మీడియా: జియో సినిమా యాప్, వెబ్సైట్ View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: WPL 2023: తొలి మ్యాచ్కు ముందే గుజరాత్కు భారీ షాక్.. స్టార్ క్రికెటర్ దూరం! -
తొలి మ్యాచ్కు ముందే గుజరాత్కు భారీ షాక్.. స్టార్ క్రికెటర్ దూరం!
మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్కు సర్వం సిద్దమైంది. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్తో ఈ లీగ్ షురూ కానుంది. ఈ మ్యాచ్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా శనివారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే తొలి మ్యాచ్కు ముందే గుజరాత్ జెయింట్స్కు ఊహించని షాక్ తగిలింది. వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ డియాండ్రా డాటిన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమైంది. ముంబై వేదికగా జరిగిన వేలంలో డాటిన్ను రూ. 60 లక్షలకు గుజరాత్ జెయింట్స్ కొనుగొలు చేసింది. ఇక గుజరాత్ తమ జట్టులో డాటిన్ స్థానాన్ని ఆస్ట్రేలియా యువ ఆల్రౌండర్ కిమ్ గార్త్తో భర్తీ చేసింది. ఈ విషయాన్ని సోషల్మీడియా వేదికగా గుజరాత్ ప్రకటించింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో కిమ్ గార్త్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు డాటిన్ దూరం కావడంతో ఈ క్యాష్రిచ్ లీగ్లో భాగమయ్యే ఛాన్స్ గార్త్కు దక్కింది. రూ.60 లక్షల కనీస ధరకు గార్త్తో గుజరాత్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక లీగ్లో గుజరాత్ జట్టు కెప్టెన్గా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ బెత్ మూనీ వ్యవహరించనుంది. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు.. భరత్కు నో ఛాన్స్! కిషన్ అరంగేట్రం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WPL 2023: పూర్తి షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే
WPL 2023 Full Schedule- Where To Watch: మహిళా క్రికెట్ అభివృద్ధిలో భాగంగా బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వుమెన్ ప్రీమియర్ లీగ్కు శనివారం(మార్చి 4) తొలి అడుగుపడనుంది. ముంబై ఇండియన్స్- గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య పోటీతో ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది. డబ్ల్యూపీఎల్ తొలి టైటిల్ కోసం ఐదు జట్లు పోటీపడనున్నాయి. ముంబైలో జరుగనున్న ఈ టీ20 లీగ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ట్రోఫీ కోసం అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. కాగా లీగ్ దశలో డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో ఐదు జట్లు పోటీపడతాయి. అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లు ప్లే ఆఫ్స్కు చేరుకుంటాయి. పాయింట్ల పట్టికలో ప్రథమస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్తో మరో ఫైనలిస్టు ఖరారవుతుంది. ఈ నేపథ్యంలో డివై పాటిల్ స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరుగననున్న 22 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు.. పూర్తి షెడ్యూల్.. ఎవరితో ఎవరు? మ్యాచ్ ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం).. 1. మార్చి 4- శనివారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 2. మార్చి 5- ఆదివారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- బ్రబౌర్న్ స్టేడియం- మధ్యాహ్నం 3.30 గంటలకు.. 3. మార్చి 5- ఆదివారం- యూపీ వారియర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 4. మార్చి 6- సోమవారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ - బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 5. మార్చి 7- మంగళవారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ యూపీ వారియర్స్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 6. మార్చి 8- బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 7. మార్చి 9- గురువారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 8. మార్చి 10- శుక్రవారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ యూపీ వారియర్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 9. మార్చి 11- శనివారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 10. మార్చి 12- ఆదివారం- యూపీ వారియర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్ - బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 11. మార్చి 13- సోమవారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ - డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 12. మార్చి 14- మంగళవారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 13. మార్చి 15- బుధవారం- యూపీ వారియర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 14. మార్చి 16- గురువారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 15. మార్చి 18- శనివారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ యూపీ వారియర్స్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- మధ్యాహ్నం 3.30 గంటలకు 16. మార్చి 18- శనివారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 17. మార్చి 20- సోమవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ యూపీ వారియర్స్- బ్రబౌర్న్ స్టేడియం- మధ్యాహ్నం 3.30 గంటలకు 18. మార్చి 20- సోమవారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 19. మార్చి 21- మంగళవారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- మధ్యాహ్నం 3.30 గంటలకు 20. మార్చి 21- మంగళవారం- యూపీ వారియర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- బ్రబౌర్న్ స్టేడియం-రాత్రి 7.30 గంటలకు 21. మార్చి 24- శుక్రవారం- ఎలిమినేటర్ మ్యాచ్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 22. మార్చి 26- ఆదివారం- ఫైనల్ మ్యాచ్- బ్రబౌర్న్ స్టేడియం-రాత్రి 7.30 గంటలకు లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే.. టీవీ: స్పోర్ట్స్18 నెట్వర్క్ డిజిటల్ మీడియా: జియో సినిమా యాప్, వెబ్సైట్ చదవండి: IND vs AUS: టెస్టు మ్యాచ్ కేవలం మూడు రోజులా? దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన రోహిత్ శర్మ IND Vs AUS: చిరాకు తెప్పించాలనుకున్నాడు.. అశ్విన్ చర్యకు మైండ్బ్లాక్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WPL 2023: మహిళా ప్రీమియర్ లీగ్ 5 జట్లు, కెప్టెన్లు, హెడ్కోచ్లు వీరే!
Women's Premier League 2023 All 5 WPL Squads: భారత క్రికెట్ మండలి తొలిసారి ప్రవేశపెట్టిన చారిత్రాత్మక మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్కు రంగం సిద్ధమైంది. ఐదు ఫ్రాంచైజీ జట్ల మధ్య శనివారం (మార్చి 4) నుంచి మహిళా క్రికెటర్ల పోటీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్-2023కి సంబంధించిన జట్ల పూర్తి వివరాలు మీకోసం.. మహిళా ప్రీమియర్ లీగ్-2023 జట్లు, కెప్టెన్లు, హెడ్కోచ్లు 1.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- స్మృతి మంధాన- బెన్ సాయెర్ 2. ఢిల్లీ క్యాపిటల్స్- మెగ్ లానింగ్- జొనాథన్ బాటీ 3. యూపీ వారియర్స్- అలిసా హేలీ- జాన్ లూయీస్ 4. గుజరాత్ జెయింట్స్- బెత్ మూనీ- రేచల్ హెయిన్స్ 5. ముంబై ఇండియన్స్- హర్మన్ప్రీత్ కౌర్- చార్లెట్ ఎడ్వర్డ్స్ 5 జట్ల సభ్యులు వీరే! 1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్మృతి మంధాన (కెప్టెన్), రేణుకా సింగ్, ఎలిస్ పెర్రీ, సోఫీ డివైన్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దీక్షా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఆశా షిబానా, హీథర్ నైట్, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతి బోస్, పూనమ్ ఖెనార్, మేగన్ షట్, సహానా పవార్ 2. ఢిల్లీ క్యాపిటల్స్ మెగ్ లానింగ్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, మరిజానే క్యాప్, టైటాస్ సాధు, అలిస్ కాప్సీ, తారా నోరిస్, లారా హ్యారిస్, జేసియా అక్తర్, మిన్ను మణి, తాన్యా భాటియా, పూనమ్ యాదవ్, జెస్ జొనాస్సెన్, స్నేహదీప్తి, అరుంధతి రెడ్డి, అపర్ణ మొండాల్. 3. యూపీ వారియర్స్ అలిసా హేలీ (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), సోఫియా ఎక్లిస్టోన్, తహ్లియా మెక్గ్రాత్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలి శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్, కిరణ్ నవ్గిరే, గ్రేస్ హారిస్, దేవికా వైద్య, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, పార్షవితా చోప్రా, శ్వేతా సెహ్రావత్, ఎస్. యశశ్రీ, సిమ్రన్ షేక్. 4. గుజరాత్ జెయింట్స్ బెత్ మూనీ (కెప్టెన్), ఆష్లీ గార్డనర్, సోఫియా డంక్లీ, అన్నాబెల్లె సదర్లాండ్, హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, సబ్బినేని మేఘన, జార్జియా వేర్హామ్, మాన్సీ జోషి, డి. హేమలత, మోనికా పటేల్, తనూజా కన్వర్, స్నేహ రాణా (వైస్ కెప్టెన్), సుష్మా వర్మ, హర్లీ గాలా, అశ్వని కుమారి, పరునికా సిసోడియా, షబ్నం మహ్మద్. 5. ముంబై ఇండియన్స్ జట్టు హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్లె వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, జింటిమణి కలిత. చదవండి: WPL 2023 Auction: స్మృతికి అంత ధరెందుకు? వాళ్లకేం తక్కువ కాలేదు.. హర్మన్ విషయంలో మాత్రం.. -
ఢిల్లీ సారథిగా ఐదుసార్లు ఐసీసీ ట్రోఫీ గెలిచిన కెప్టెన్
WPL 2023- Delhi Capitals Squad- Captain: ఢిల్లీ క్యాపిటల్స్ తమ మహిళా జట్టు కెప్టెన్ పేరును ప్రకటించింది. ఆస్ట్రేలియాకు ఐదుసార్లు ప్రపంచకప్ అందించిన మెగ్ లానింగ్ను సారథిగా నియమించినట్లు తెలిపింది. ఆమెకు డిప్యూటీగా టీమిండియా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ను ఎంపిక చేసినట్లు గురువారం వెల్లడించింది. కాగా మార్చి 4 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)-2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్సీబీ స్మృతి మంధాన, ముంబై ఇండియన్స్ హర్మన్ప్రీత్కౌర్, గుజరాత్ జెయింట్స్ బెత్ మూనీ, యూపీ వారియర్జ్ అలిసా హేలీలను సారథులుగా నియమించినట్లు ప్రకటించాయి. ఆరోజే తొలి మ్యాచ్ ఎట్టకేలకు ఢిల్లీ సైతం తమ కెప్టెన్ పేరును తాజాగా రివీల్ చేసింది. కాగా ఆస్ట్రేలియాకు చెందిన 30 ఏళ్ల మెల్ లానింగ్ రైట్హ్యాండ్ బ్యాటర్. ఆసీస్కు ఐదుసార్లు ఐసీసీ ట్రోఫీ అందించిన ఘనత ఆమెది. 2014, 2018, 2020, 2023 టీ20 ప్రపంచకప్, 2022 వన్డే వరల్డ్కప్ గెలిచింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 5న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్తో డబ్ల్యూపీఎల్ ప్రయాణం ఆరంభించనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇక ఢిల్లీ కెప్టెన్, వైస్ కెప్టెన్లుగా నియమితులు కావడం పట్ల మెగ్ లానింగ్, జెమీమా రోడ్రిగ్స్ హర్షం వ్యక్తం చేశారు. కాగా ఫిబ్రవరి 13న జరిగిన వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ను రూ.1.1కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, రోడ్రిగ్స్కు మాత్రం భారీ మొత్తంలో 2.2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: మెగ్ లానింగ్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, మరిజానే క్యాప్, టైటాస్ సాధు, అలిస్ కాప్సీ, తారా నోరిస్, లారా హ్యారిస్, జేసియా అక్తర్, మిన్ను మణి, తాన్యా భాటియా, పూనమ్ యాదవ్, జెస్ జొనాస్సెన్, స్నేహదీప్తి, అరుంధతి రెడ్డి, అపర్ణ మొండాల్. చదవండి: IND Vs AUS: స్టన్నింగ్ క్యాచ్.. అడ్డంగా దొరికిపోయిన శ్రేయాస్ BGT 2023: పుజారా భయపడుతున్నాడు.. అయ్యర్ పిరికిపందలా ఉన్నాడు! ముందుందిలే.. -
WPL: ‘శక్తి’మంతంగా డబ్ల్యూపీఎల్ ఆంథెమ్.. రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం!
Women's Premier League 2023 Anthem: భారత క్రికెట్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ బీసీసీఐ నిర్వహించనున్న మహిళా ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)కు సమయం ఆసన్నమైంది. ఐదు ఫ్రాంఛైజీలకు సంబంధించిన జట్లతో కూడిన టీ20 లీగ్ మార్చి 4న ఆరంభం కానుంది. ముంబై ఇండియన్స్- గుజరాత్ జెయింట్స్తో ప్రారంభ సీజన్కు తెరలేవనుంది. మహిళా శక్తికి అద్దం పట్టేలా ఈ నేపథ్యంలో బీసీసీఐ డబ్ల్యూపీఎల్ ఆంథెమ్ను విడుదల చేసింది. ‘‘యేతో బస్ షురువాద్ హై (ఇది కేవలం ఆరంభం మాత్రమే)’’ అంటూ మొదలైన ఈ గీతం అమ్మాయిల సంకల్ప బలానికి, మహిళా శక్తికి అద్దం పట్టేలా సాగింది. కఠిన సవాళ్లను ఎదుర్కొని జీవితంలో ముందుకు సాగుతున్న మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా స్ఫూర్తిదాయక పదాల కూర్పుతో అద్భుతంగా ఉంది. గూస్బంప్స్ రావడం ఖాయం మహిళా క్రికెటర్లు ఎవ్వరికీ తీసిపోరని, అంకితభావంతో వాళ్లు ఇక్కడిదాకా చేరిన తీరుకు నిదర్శనంగా నిలిచింది. అందుకు తగ్గట్లే సంగీతం కూడా అదిరిపోయింది. మొత్తానికి ఈ పాట వింటే గూస్బంప్స్ రావడం ఖాయం. మహిళా శక్తిని వివరిస్తూ ‘‘జాగీ హుయీ శక్తి అబ్ మేరే పాస్ హై, దేఖో అభి, యేతో బస్ షురువాద్ హై!’’ అంటూ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసిన ఈ పాటను మీరు కూడా వినేయండి! మహిళా దినోత్సవానికి ముందే మరో కానుక ‘‘యా దేవి సర్వభూతేశు, శక్తి రూపేన సమస్థితా నమస్తస్యయై నమస్తస్యయై నమస్తస్యయై నమస్తస్యయై నమస్తస్యయై.. నమో నమః ధమ్ ధమ్ ధ మ మ ధమ్ ధమ్ ధమ్ ధ మ మ ధమ్ ధమ మైదాన్ మే గూంజే మేరీ శక్తి అబ్ ఆస్మాన్ మే’’ అంటూ నేటితరం ఆడబిడ్డలకు సవాళ్లు స్వీకరించడం ఓ అలవాటులా మారిపోయిందని.. విజయగర్జన చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ.. ఆకాశమే హద్దుగా ఆటలో తమను తాము నిరూపించుకుంటామంటూ సాగిన పాట జోష్ నింపుతోంది. నెటిజన్లు ఈ గీతానికి ఫిదా అవకుండా ఉండలేకపోతున్నారు. మహిళా దినోత్సవానికి ముందే మహిళా క్రికెటర్లకు అద్భుతమైన పాట రూపంలో కానుక ఇచ్చారంటూ బీసీసీఐని కొనియాడుతున్నారు. చదవండి: Jasprit Bumrah: న్యూజిలాండ్కు వెళ్లనున్న బుమ్రా Ind Vs Aus: ఇప్పటి వరకు అత్యంత చెత్త పిచ్ ఇదే! కానీ 109 పరుగులకే ఆలౌట్ కావడం వారి వైఫల్యమే! అప్పుడు కూడా ఇదే మాట అంటారా? View this post on Instagram A post shared by Women's Premier League (WPL) (@wplt20) -
WPL 2023: ముంబై ఇండియన్స్ కెప్టెన్గా టీమిండియా సారథి
Women Premier League 2023: మహిళా ప్రీమియర్ లీగ్ ఆరంభ సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ పేరును ప్రకటించింది. టీమిండియా సారథి హర్మన్ప్రీత్ కౌర్కు సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. కాగా హర్మన్ప్రీత్ భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలిగా ఉండి.. మిథాలీ రాజ్ తర్వాత కెప్టెన్సీ పగ్గాలు అందుకుంది. ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళా టీ20 టోర్నీలో జట్టును సెమీస్ వరకు చేర్చింది. అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్లో 150 టీ20లు ఆడిన తొలి మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. సరికొత్త ఇన్నింగ్స్ ఇరవై ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టిన హర్మన్ప్రీత్.. దాదాపు దశాబ్దకాలంగా అన్ని ఫార్మాట్లలోనూ జట్టుకు వెన్నుముకగా ఉంది. ఆమె అందించిన సేవలకు గానూ అర్జున అవార్డు లభించింది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కుటుంబంలో అడుగుపెట్టిన హర్మన్.. డబ్ల్యూపీఎల్లో కెప్టెన్గా సరికొత్త ఇన్నింగ్స్ ఆరంభించనుంది. ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ మహిళా జట్టు హెడ్కోచ్గా ఉన్న చార్లెట్ ఎడ్వర్డ్తో పలు మ్యాచ్లలో తలపడ్డ హర్మన్.. మెంటార్ ఝులన్ గోస్వామి ఉన్న జట్టుకు సారథ్యం వహించడం విశేషం. ఇక.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన ఘనత ముంబైది. గుజరాత్తో మ్యాచ్తో ఆరంభం ఇప్పుడు ఇద్దరు టీమిండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, హర్మన్ప్రీత్ కౌర్ ఒకే ఫ్రాంఛైజీ జట్లకు సారథులుగా ఉండటం మరో విశేషం. దీంతో ముంబై ఫ్యాన్స్ సంబరాలు రెట్టింపయ్యాయి. తొలి సీజన్లో ముంబై టైటిల్ సాధించాలని అభిమానులు హర్మన్కు ఆల్ది బెస్ట్ చెబుతున్నారు. ఇక ముంబై ఇండియన్స్- గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్తో మార్చి 4న మహిళా ప్రీమియర్ లీగ్కు తెరలేవనుంది. ముంబై ఇండియన్స్ మహిళా జట్టు కోచింగ్ స్టాఫ్ హెడ్కోచ్- చార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లండ్) బౌలింగ్ కోచ్, మెంటార్- ఝులన్ గోస్వామి(ఇండియా) బ్యాటింగ్ కోచ్- దేవికా పల్షికార్(ఇండియా) ఫీల్డింగ్ కోచ్- లిడియా గ్రీన్వే(ఇంగ్లండ్) ముంబై ఇండియన్స్ జట్టు హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్లె వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, జింటిమణి కలిత. చదవండి: Yashasvi Jaiswal: అరంగేట్రంలోనే అదరగొట్టిన యశస్వి జైస్వాల్.. డబుల్ సెంచరీతో..! -
యూపీ వారియర్స్ వైస్ కెప్టెన్ గా దీప్తి శర్మ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే యూపీ వారియర్స్ జట్టు వైస్ కెప్టెన్ గా భారత ఆల్రౌండర్ దీప్తి శర్మను నియమించారు. ఆ్రస్టేలియా స్టార్ ప్లేయర్ అలీసా హీలీని ఇప్పటికే కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్కే చెందిన దీప్తి శర్మ ఇప్పటి వరకు భారత జట్టు తరఫున 92 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడి 941 పరుగులు చేయడంతోపాటు 102 వికెట్లు పడగొట్టింది. 25 ఏళ్ల దీప్తి ప్రస్తుతం ఐసీసీ టి20 ర్యాంకింగ్స్లో బౌలింగ్, ఆల్రౌండర్ విభాగాల్లో నాలుగో స్థానంలో ఉంది. -
ఆర్సీబీ కెప్టెన్గా స్మృతి మంధాన
వచ్చే నెలలో ముంబైలో జరిగే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కెప్టెన్గా స్మృతి మంధానను నియమించారు. భారత జట్టు వైస్ కెప్టెన్ అయిన స్మృతిపై ఇటీవల జరిగిన వేలం కార్యక్రమంలో ఆర్సీబీ రూ. 3 కోట్ల 40 లక్షలు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. స్మృతికి ఆర్సీబీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పురుషుల ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ కెప్టెన్గా ఉన్న డు ప్లెసిస్, మాజీ సారథి విరాట్ కోహ్లి ట్విటర్లో ప్రకటించడం విశేషం. -
WPL 2023: ఆర్సీబీ కెప్టెన్ ఆమే.. ప్రకటించిన కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్
WPL 2023- RCB- Smriti Mandhana: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్గా భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన ఎంపికైంది. బీసీసీఐ చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న మహిళా ప్రీమియర్ లీగ్ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఈ మేరకు టీమిండియా వైస్ కెప్టెన్కు అవకాశం ఇచ్చింది. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించింది. ప్రకటన చేసిన కోహ్లి, ఫాఫ్ ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రస్తుత కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్తో స్మృతి మంధాన కెప్టెన్గా నియమితురాలైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. స్మృతికి ఆల్ ది బెస్ట్ చెబుతూ వీరిద్దరు ఇచ్చిన సందేశానికి సంబంధించిన వీడియోను ఫ్రాంఛైజీ ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తాము ఊహించిందే నిజమైందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నంబర్ 18 తమకు ప్రత్యేకమంటూ కోహ్లితో ముడిపెట్టి మీమ్స్తో సందడి చేస్తున్నారు. కాగా టీమిండియా స్టార్ ఓపెనర్గా మంధానకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థాంక్యూ... ఇక ఈ విషయంపై స్పందించిన టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన.. ఆర్సీబీ మహిళా జట్టు కెప్టెన్గా ఎంపికకావడం అద్భుతమైన ఫీలింగ్ అని హర్షం వ్యక్తం చేసింది. విరాట్, ఫాఫ్ సారథ్యంలో జట్టు ఇప్పటికే తామేంటో నిరూపించుకుందన్న స్మృతి.. తాను కూడా ఆర్సీబీని విజయవంతంగా ముందు నడిపిస్తానని పేర్కొంది. మేనేజ్మెంట్ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని.. ఇందుకు అభిమానుల మద్దతు కూడా కావాలని కోరింది. అత్యధిక ధరకు డబ్ల్యూపీఎల్ వేలం-2023లో స్మృతి కోసం 3.4 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఆర్సీబీ. ఈ క్రమంలో తొలి వుమెన్ ప్రీమియర్ లీగ్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్గా స్మృతి మంధాన పేరు రికార్డులకెక్కింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ ఇటీవలే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తమ మెంటార్గా నియమించుకున్న సంగతి తెలిసిందే. కాగా మార్చి 4 నుంచి వుమెన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం కానుంది. చదవండి: Cheteshwar Pujara: అయ్యో పుజారా! ఒకే ఒక్కడు.. తొలి క్రికెటర్.. కానీ పాపం.. IND vs AUS: రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ ఓపెనర్ దూరం! From one No. 18 to another, from one skipper to another, Virat Kohli and Faf du Plessis announce RCB’s captain for the Women’s Premier League - Smriti Mandhana. #PlayBold #WPL2023 #CaptainSmriti @mandhana_smriti pic.twitter.com/sqmKnJePPu — Royal Challengers Bangalore (@RCBTweets) February 18, 2023 -
30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం.. మిన్ను మణి విజయగాథ ఇదే!
‘మా అమ్మా నాన్నలు ఇకపై నన్ను టీవీలో చూస్తారు’అని సంతోష పడింది మిన్ను మణి. దేశీయంగా ఆమె ఆడిన క్రికెట్ మేచ్లుటీవీలో టెలికాస్ట్ కాలేదు. ‘విమెన్స్ ప్రీమియర్ లీగ్’ కోసం 30 లక్షలకు మిన్ను మణిని ఢిల్లీ క్యాపిటల్స్ సొంతంచేసుకున్నాక ఆమె ఆట తప్పక టెలికాస్ట్ కానుంది. రోజుకు నాలుగు బస్సులు మారి 52 కిలోమీటర్ల దూరంలోని క్రికెట్ స్టేడియంకు వెళ్లిప్రాక్టీస్ చేసిన మణి కేరళలో ఈస్థాయికి ఎదిగిన తొలి గిరిజన మహిళా క్రికెటర్. మహిళా క్రికెట్ ఇప్పుడు విజయ పరంపరలో ఉంది. నిర్లక్ష్య వర్గాల నుంచి కూడా ఈ ఆటకు చేరొచ్చు అని చెబుతున్న మిన్ను మణిది కూడా ఒక విజయగాధ. ‘ముప్పై లక్షల రూపాయలు. నా జీవితంలో చూస్తానని అనుకోలేదు. మొదట నేనొక స్కూటీ కొనుక్కోవాలి. బస్సుల్లో తిరుగుతూప్రాక్టీసుకు ఇకపై వెళ్లను. ఆ తర్వాతే ఆ డబ్బుతో ఏం చేయాలో ఆలోచిస్తాను’ అంది మిన్ను మణి. ఫిబ్రవరి 13న ముంబైలో ‘విమెన్స్ ప్రీమియర్ లీగ్’ కోసం మహిళా క్రికెటర్ల వేలం జరుగుతున్నప్పుడు మిన్ను మణి హైదరాబాద్లో సౌత్ జోన్ తరపున ఇంటర్ జోన్ టోర్నమెంట్ ఆడుతోంది. ఆ రోజున 91 బాల్స్కు 74 కొట్టి నాటౌట్గా నిలిచింది. ఆట ఒకవైపు సాగుతూ ఉన్నా మనసంతా ముంబై ఆక్షన్ మీదే ఉంది. ‘పెద్ద పెద్ద మహిళా క్రికెటర్లకు కూడా వేలంలో ధర పలకకపోతుండే సరికి నిరాశ కలిగింది. నా బేస్ ప్రైస్ 10 లక్షలు పెట్టారు. ఎవరూ తీసుకోరేమో అనుకున్నాను. కానీ ఢిల్లీ, బెంగళూరు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 30 లక్షలకు ఢిల్లీ కేపిటల్స్ నన్ను సొంతం చేసుకుంది. అప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ మాటల్లో చెప్పలేను’ అంది మిన్ను మణి. ‘ఆ విషయం ఫోన్లో చెప్తే మా అమ్మా నాన్నలు డబ్బు గురించి కాక నా ఆట గురించి అడిగారు. టీవీలో వస్తుందా అన్నారు. వస్తుంది అని చె΄్పాను’ అంది సంతోషంగా. కరూచియ 23 ఏళ్ల మిన్ను మణిది కేరళలోని వయనాడ్ జిల్లాలోని గిరిజన గూడెం. ఇది బ్రహ్మగిరి కొండల అంచున ఉంటుంది. మణిది ‘కరూచియ’ గిరిజన తెగ. వీళ్లు తమను తాము కొండ బ్రాహ్మణులుగా చెప్పుకుంటారు. తమ ఆచారాలు స్ట్రిక్ట్గా పాటిస్తారు. గురి చూసి బాణం వేయడంలో మేటిగా పేరు గడించారు. కాని ఇప్పుడు వారంతా చిన్న చిన్న పనులు చేసుకు బతుకుతున్నారు. మిన్ను మణి తండ్రి మణి రోజు కూలి. తల్లి వసంత గృహిణి. చిన్నప్పటి నుంచి మిన్ను మగపిల్లలతో కలిసి పొలాల్లో టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడేది. ఎలిమెంటరీ స్కూల్లో రన్నర్గా ప్రతిభ చూపేది. 8 వ తరగతిలో హైస్కూల్లో చేరాక ఆమె ప్రతిభను ఆ స్కూల్లో ఎల్సమ్మ బేబీ అనే పీయీటీ టీచరు గుర్తించింది. ‘మిన్ను రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. రైట్ హ్యాండ్ బ్యాట్స్ఉమన్. బౌలింగ్లో బ్యాటింగ్లో ఆ అమ్మాయి టాలెంట్ చూసి చాలా దూరం వెళుతుందని అనుకున్నాను’ అంటుంది ఆ పీయీటీ టీచర్. ఆ పీయీటీ టీచరే పూనుకుని తిరువనంతపురంలోని కేరళ క్రికెట్ అసొసియేషన్ దగ్గరకు తీసుకువెళితే వారు పరీక్షించి ట్రయినింగ్ ఇచ్చారు. దాంతో మిన్ను మణి ముందు వయనాడ్ జిల్లా జట్టుతో అటు పిమ్మట అండర్ 16 జట్టుతో ఆ తర్వాత కేరళ రాష్ట్ర మహిళా జట్టుతో ఆడటం మొదలుపెట్టింది. కష్టే ఫలి అయితే మిన్ను మణి క్రికెట్ ఆడటానికి మొదట తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ‘కేరళలో అమ్మాయిలు అథ్లెట్లుగా రాణిస్తారు. నన్ను కూడా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్గా చూడాలని మా అమ్మానాన్నలు అనుకున్నారు. క్రికెట్ మగవాళ్ల ఆట అని వారి అభి్రపాయం. కాని మా పీయీటీ టీచరు వారిని ఒప్పించి నన్ను క్రికెట్లోకి తీసుకెళ్లింది. నేను క్రికెట్ బాగా ఆడుతున్నానని తెలిశాక వారు మనస్ఫూర్తిగా ్రపోత్సహించసాగారు’ అంది మిన్ను. కానీ క్రికెట్లాంటి ఖరీదైన ఆటకు కావలసిన మంచి కిట్ కూడా మిన్ను దగ్గర లేదు. వాళ్ల నాన్న అప్పులు చేసి మిన్ను ఆట కొనసాగేలా చూశాడు. మిన్నుప్రాక్టీసు చేయాలంటే వారి గూడేనికి 52 కిలోమీటర్ల దూరంలోని కృష్ణగిరి క్రికెట్ స్టేడియమే గతి. అంత దూరం వెళ్లడానికి మిన్ను తెల్లవారు జామునే లేచి ఇంటి పనుల్లో తల్లికి సాయం చేసి నాలుగు బస్సులు మారి స్టేడియంకు చేరుకునేది. తిరిగి ఇల్లు చేరే సరికి సాయంత్రం 7 అయ్యేది. ‘అలిసిపోయేదాన్ని. కాని పట్టుదలగా ఆట కొనసాగించాను’ అంటుంది మిన్ను. ఆటలో విజయాలు మిన్ను మణి కేరళ అండర్ 23లో ఆ తర్వాత భారత్ అండర్ 23 జట్టులో ప్రతిభ చూపింది. ఇండియా ఏ జట్టుకు ఎంపికై ఆడింది. విమెన్స్ ఆల్ ఇండియా ఒన్ డే టోర్నమెంట్లో 8 మేచ్లు ఆడి 246 పరుగులు చేసి 12 వికెట్లు తీసింది. దాంతో అందరి దృష్టి మిన్ను మీద పడింది. క్రికెట్ ఆడటం మొదలెట్టాక వచ్చిన కొద్ది పాటి డబ్బులో ప్రతి పైసా తన కోసం తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి ఉపయోగించింది. మిగిలిన డబ్బుతో చిన్న ఇల్లు కడితే 2018 వరదల్లో ఆ ఇల్లు దెబ్బతింది. క్రికెట్ అభిమానులు ఆదుకుని రిపేర్లు చేయించారు. ఇప్పుడు 30 లక్షల సంపాదన స్థాయికి మిన్ను చేరింది. ‘దీని కంటే జాతీయ జట్టులో స్థానంపొందడమే నాకు ఎక్కువ ఆనందం. అదే నా లక్ష్యం’ అంటోంది మిన్ను మణి. -
అందాలన్నీ ఆర్సీబీలోనే.. స్మృతి, సానియా, ఎల్లిస్..!
మహిళల ఐపీఎల్ (WPL)లో అందమైన జట్టు ఏది అంటే..? ఏమాత్రం తడుంకోకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు చెప్పాలి. విధ్వంసకర ఆటతో పాటు మతి పోగొట్టే అందాలన్నీ ఆర్సీబీ సొంతమయ్యాయనడం అతిశయోక్తి కాదు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధన, ఆసీస్ ఆల్రౌండర్ ఎల్లిస్ పెర్రీ, ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్, ఆసీస్ పేసర్ మెగాన్ షట్, న్యూజిలాండ్ ఆల్రౌండర్ సోఫీ డివైన్, టీమిండియా పేసర్ రేణుకా సింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే జట్టు నిండా అందాలే ఉన్నాయి. ఇన్ని అందాలు చాలవన్నట్లు.. ఆర్సీబీ తమ కుటుంబంలోకి క్రికెటేతర అందాన్ని కూడా ఆహ్వానించింది. బెంగళూరు ప్రాంచైజీ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను మెంటార్గా నియమించుకుంది. జట్టు అందాల పూతోటగా మారడం పట్ల ఆర్సీబీ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని అందాలన్నీ ఒకే చోట చేరినట్లుందని సంబురపడిపోతున్నారు. అందంతో పాటు తమ ప్లేయర్స్ ఆటలోనూ మహరాణులంటూ మురిసిపోతున్నారు. ఆటతో పాటు అందాలను ఆస్వాదించే వారికి ఆర్సీబీ వంద శాతం కనువిందు కలిగిస్తుందని గర్వంగా చెప్పుకుంటున్నారు. కాగా, ఫిబ్రవరి 13న జరిగిన WPL మెగా వేలంలో ఆర్సీబీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అందాలన్నిటినీ ఏకం చేసింది. వేలంలో స్మృతి మంధనను 3.4 కోట్ల రికార్డు ధర వెచ్చించి సొంతం చేసుకున్న ఆర్సీబీ యాజమాన్యం.. రిచా ఘోష్ను 1.9 కోట్లకు, ఎల్లిస్ పెర్రీని 1.7 కోట్లకు, రేణుకా సింగ్ను 1.5 కోట్లకు, సోఫీ డివైన్ను 50 లక్షలకు, హీథర్ నైట్ను 40 లక్షలకు, మెగాన్ షట్ను 40 లక్షలకు, కనిక అహుజను 35 లక్షలకు, డేన్ వాన్ నికెర్క్ను 30 లక్షలకు, ఎరిన్ బర్న్స్ను 30 లక్షలకు, ప్రీతి బోస్ను 30 లక్షలకు, కోమల్ జంజద్ను 25 లక్షలకు, ఆశా శోభనను 10 లక్షలకు, దిశా కాసత్ను 10 లక్షలకు, ఇంద్రాణి రాయ్ను 10 లక్షలకు, పూనమ్ ఖేమ్నర్ను 10 లక్షలకు, సహన పవార్ను 10 లక్షలకు, శ్రేయాంక పాటిల్ను 10 లక్షలకు సొంతం చేసుకుంది. The pioneer in Indian sports for women, a youth icon, someone who has played Bold and broken barriers throughout her career, and a champion on and off the field. We are proud to welcome Sania Mirza as the mentor of the RCB women’s cricket team. 🤩#PlayBold @MirzaSania pic.twitter.com/eMOMU84lsC — Royal Challengers Bangalore (@RCBTweets) February 15, 2023 వేలంలో మొత్తంగా 18 ప్లేయర్లను (12 మంది స్వదేశీ, ఆరుగురు విదేశీ ప్లేయర్లు) కొనుగోలు చేసిన ఆర్సీబీ.. తాజాగా తమ హెడ్ కోచ్గా న్యూజిలాండ్కు చెందిన బెన్ సాయర్ను నియమించుకుంది. ఆర్సీబీ పర్స్లో ఇంకా 10 లక్షలు మిగిలాయి. -
WPL 2023: డబ్ల్యూపీఎల్ షెడ్యూల్, వేదికలు.. ఫైనల్ అప్పుడే!
Women's Premier League- 2023- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభ సీజన్కు సర్వం సిద్ధమైంది. ఐదు ఫ్రాంచైజీ జట్ల మధ్య వచ్చే నెల 4 నుంచి అమ్మాయిల మెరుపులు మొదలవుతాయి. దీనికి సంబంధించిన మొత్తం 22 మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ను మంగళ వారం విడుదల చేశారు. డీవై పాటిల్ స్టేడియంలో మార్చి 4న జరిగే తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో గుజరాత్ జెయింట్స్ తలపడుతుంది. ఫైనల్ 26న జరుగుతుంది. ఈ సీజన్లో నాలుగు రోజులు రెండేసి మ్యాచ్లు జరుగుతాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలవుతాయి. మొత్తం 22 మ్యాచ్ల్లో 11 చొప్పున బ్రబౌర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియాల్లో నిర్వహిస్తారు. మహిళా ప్రీమియర్ లీగ్-2023 జట్లు 1.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2. ఢిల్లీ క్యాపిటల్స్ 3. యూపీ వారియర్స్ 4. గుజరాత్ జెయింట్స్ 5. ముంబై ఇండియన్స్ చదవండి: వివాదంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్.. ఆటగాళ్లు ఇంజక్షన్లు తీసుకుంటారు.. వాళ్లు సూపర్స్టార్లు.. ఫిట్నెస్ లేకున్నా అంటూ.. WPL 2023: ఆర్సీబీ మెంటార్గా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా -
RCB: ఆర్సీబీ మెంటార్గా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా
Women Premier League 2023 -RCB- Sania Mirza: మహిళల ప్రీమియర్ లీగ్-2023 నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది. క్రికెటేతర ప్లేయర్ను తమ కుటుంబంలోకి ఆహ్వానించింది. భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాను ఆర్సీబీ మెంటార్గా నియమించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా బుధవారం వెల్లడించింది. తమ మహిళా జట్టుకు మార్గదర్శనం చేసేందుకు ఇంతకంటే గొప్ప వ్యక్తి మరొకరు దొరకరంటూ సానియాకు స్వాగతం పలికింది. నమస్కార సానియా మీర్జా ‘‘మా కోచింగ్ సిబ్బంది క్రికెట్కు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటుంది. అయితే, కఠిన పరిస్థితులు, ఒత్తిడిని అధిగమించేందుకు మా మహిళా క్రికెటర్లకు సరైన మార్గదర్శి ఉండాలని భావించాం. చాంపియన్ అథ్లెట్, అవరోధాలు అధిగమించి దిగ్గజ ప్లేయర్గా ఎదిగిన వ్యక్తిని మా మెంటార్గా నియమించాం. మా కుటుంబంలోకి ఆమెకు స్వాగతం పలుకుతున్నాం. నమస్కార సానియా మీర్జా’’ అని ఆర్సీబీ ట్వీట్ చేసింది. ఆర్సీబీ నిర్ణయంపై అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు. మెంటార్గా సరైన వ్యక్తిని ఎన్నుకున్నారంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. కఠిన సవాళ్లను ఎదుర్కొని కాగా టెన్నిస్ స్టార్గా ఎదిగే క్రమంలో ఎన్నో కఠిన సవాళ్లు ఎదుర్కొన్న సానియా మీర్జా.. వాటన్నింటినీ అధిగమించి ఒక్కో మెట్టు ఎక్కుతూ లెజెండ్గా ఎదిగారు. గ్రాండ్స్లామ్లతో సత్తా చాటి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఇటీవలే ఆటకు వీడ్కోలు పలికిన ఆమె ఇప్పుడు సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. మహిళా క్రికెట్ జట్టుకు మెంటార్గా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. చదవండి: రెండోసారి పెళ్లి చేసుకున్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్ Ind Vs Aus 2nd Test: ఆసీస్తో రెండో టెస్టు ప్రత్యేకం.. ప్రధాని మోదీని కలిసిన పుజారా Chetan Sharma: వివాదంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్.. ఆటగాళ్లు ఇంజక్షన్లు తీసుకుంటారు.. వాళ్లు సూపర్స్టార్లు.. ఫిట్నెస్ లేకున్నా అంటూ.. While our coaching staff handle the cricket side of things, we couldn’t think of anyone better to guide our women cricketers about excelling under pressure. Join us in welcoming the mentor of our women's team, a champion athlete and a trailblazer! 🙌 Namaskara, Sania Mirza! 🙏 pic.twitter.com/r1qlsMQGTb — Royal Challengers Bangalore (@RCBTweets) February 15, 2023 -
సూర్యకుమార్ యాదవ్ తరహా విధ్వంసం.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న వీడియో
క్రికెట్కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఈ వీడియోలో రాజస్థాన్కు చెందిన ముమల్ మెహర్ అనే ఓ బాలిక.. టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తరహా విధ్వంకర షాట్లతో విరుచుకుపడుతుంది. ముమల్ అచ్చం సూర్యకుమార్లా 360 డిగ్రీస్లో షాట్లు ఆడుతుంది. Kal hi toh auction hua.. aur aaj match bhi shuru? Kya baat hai. Really enjoyed your batting. 🏏👧🏼#CricketTwitter #WPL @wplt20 (Via Whatsapp) pic.twitter.com/pxWcj1I6t6 — Sachin Tendulkar (@sachin_rt) February 14, 2023 బౌలింగ్ చేస్తున్నది అబ్బాయి అయినా ఏమాత్రం బెరుకు లేకుండా ప్రొఫెషనల్లా నలుదిక్కులా షాట్లు ఆడి అందరి మనసులను దోచుకుంటుంది. ముమల్ విన్యాసాలకు సంబంధించిన ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. లేడీ స్కై అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియోను బట్టి చూస్తే రాజస్థాన్లో ఏదో మారుమూల ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణగా తెలుస్తోంది. ముమల్ విన్యాసాలకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం ఫిదా అయ్యాడు. సచిన్ ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ.. నిన్ననే కదా వేలం అయ్యింది.. అప్పుడే విధ్వంసం మొదలైందా..? అంటూ కామెంట్ చేశాడు. అత్యద్భుతం.. ముమల్ బ్యాటింగ్ విన్యాసాలను నిజంగా ఎంజాయ్ చేశానంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. ये वीडियो राजस्थान की बताई जा रही है। जिस तरह ये बेटी शॉट्स लगा रही है इसकी बैटिंग में सूर्यकुमार यादव की झलक है। ऐसे टैलेंट को प्रमोट कर अच्छी ट्रेनिंग मिलनी चाहिए। @ashokgehlot51 जी, इस बच्ची के टैलेंट को सही मंच दिलाएँ जिससे ये एक दिन देश की जर्सी पहने। pic.twitter.com/vd1TkhVeVt — Swati Maliwal (@SwatiJaiHind) February 13, 2023 ముమల్ విన్యాసాలకు సంబంధించిన వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ సైతం ట్విటర్లో షేర్ చేశారు. భవిష్యత్తులో ముమల్ టీమిండియా జెర్సీ ధరించే స్థాయికి ఎదిగేందుకు తోడ్పడాలని ఆమె రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ను అభ్యర్ధించారు. మొత్తంగా ముమల్ వీడియో సోషల్మీడియాలో వైరలవుతోంది. ఇదిలా ఉంటే, ముంబై వేదికగా నిన్న (ఫిబ్రవరి 13) తొట్టతొలి మహిళల ఐపీఎల్ వేలం జరిగిన విషయం తెలిసిందే. మెగా వేలంలో చాలామంది భారత మహిళా క్రికెటర్లపై కనకవర్షం కురిసింది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3.4 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకోగా.. దీప్తి శర్మ (యూపీ వారియర్జ్, 2.6 కోట్లు), జెమీమా రోడ్రిగెజ్ (ఢిల్లీ క్యాపిటల్స్, 2.2 కోట్లు), షెఫాలీ వర్మ (ఢిల్లీ క్యాపిటల్స్, 2 కోట్లు), రిచా ఘోష్ (ఆర్సీబీ, 1.9 కోట్లు), పూజా వస్త్రాకర్ (ముంబై ఇండియన్స్, 1.9 కోట్లు), టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (ముంబై ఇండియన్స్, 1.8 కోట్లు), రేణుకా సింగ్ (ఆర్సీబీ, 1.5 కోట్లు), యస్తికా భాటియా (ముంబై ఇండియన్స్, 1.5 కోట్లు) భారీ ధర పలికిన వారిలో ఉన్నారు. -
వారిపై ఢిల్లీ క్యాపిటల్స్కు అమితమైన ఆసక్తి.. కోహ్లి విషయంలో మాత్రం ఎందుకో అలా..
WPL Auction 2023: నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన తొలి మహిళల ఐపీఎల్ వేలంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్, అండర్-19 వరల్డ్ కప్ 2023 విన్నింగ్ కెప్టెన్, లేడీ సెహ్వాగ్గా పేరొందిన షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. షెఫాలీ కోసం ఆర్సీబీ సైతం తీవ్రంగా పోటీపడినప్పటికీ పట్టు వదలని ఢిల్లీ ఎట్టకేలకు భారత సివంగిని దక్కించుకుంది. షెఫాలీని ఢిల్లీ దక్కించుకున్న తర్వాత సోషల్మీడియాలో ఓ ఆసక్తికర విషయం విపరీతంగా ట్రోల్ అయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్ గతంలోకి ఓసారి తొంగి చూస్తే.. ఈ ఫ్రాంచైజీ అండర్-19 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ల అడ్డాగా పేరొందింది. అండర్-19 వరల్డ్కప్లో భారత్ను జగజ్జేతగా నిలిపిన ఉన్ముక్త్ చంద్ 2011-13 మధ్యలో నాటి ఢిల్లీ డేర్డెవిల్స్కు ప్రాతినిధ్యం వహించగా.. 2018 అండర్-19 వరల్డ్కప్లో టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన పృథ్వీ షా.. గత నాలుగు సీజన్లు ఢిల్లీ ఫ్రాంచైజీకే ఆడుతున్నాడు. వీరి తర్వాత భారత్ను అండర్-19 వరల్డ్కప్-2022 విజేతగా నిలిపిన యశ్ ధుల్ను 2022 ఐపీఎల్ సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కోటి రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది. తాజాగా తొలి మహిళల అండర్-19 టీ20 వరల్డ్కప్ నెగ్గిన భారత యువ జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. భారత అండర్-19 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్లపై అమితాసక్తి కనబరుస్తూ వస్తున్న ఢిల్లీ ఫ్రాంచైజీ, 2008 అండర్-19 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్, నేటి భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని మాత్రం ఎందుకో ఆర్సీబీకి వదిలేసింది. పై పేర్కొన్న ఆటగాళ్లలో కొందరు ఢిల్లీకి చెందిన వారు కానప్పటికీ కొనుగోలు చేసిన డీసీ ఫ్రాంచైజీ.. కోహ్లి ఢిల్లీ వాస్తవ్యుడైనప్పటికీ అతన్ని మిస్ చేసుకుంది. -
Viral: భారత క్రికెట్కు సంబంధించిన ఆసక్తికర విషయం
WPL Auction 2023: మహిళల తొట్టతొలి ఐపీఎల్ వేలం తర్వాత భారత క్రికెట్కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. యాదృచ్ఛికంగా జరిగిందో లేక ఆయా ఫ్రాంచైజీల ప్రణాళికల ప్రకారం జరిగిందో తెలీదు కానీ.. భారత పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళా జట్టు సారధి హర్మన్ప్రీత్ కౌర్లు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో ఉన్నారు. నిన్న జరిగిన వేలంలో హర్మన్ను ముంబై ఇండియన్స్ 1.8 కోట్ల ధర వెచ్చింది సొంతం చేసుకోగా.. రోహిత్ 2011 నుంచి ఈ ఫ్రాంచైజీలోనే కొనసాగుతున్నాడు. అయితే రోహిత్ ముంబైతో జతకట్టే సమయానికి టీమిండియా కెప్టెన్గా లేడు. ఇటీవలే అతను కోహ్లి నుంచి ఆ బాధ్యతలను తీసుకున్నాడు. ఏదిఏమైనప్పటికీ భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్ల కెప్టెన్లు ముంబై ఇండియన్స్లో చేరడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఈ విషయం నిన్నటి నుంచి సోషల్మీడియాలో వైరలవుతోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ఉన్న రోహిత్.. ముంబై ఇండియన్స్ను 5 సార్లు ఛాంపియన్గా నిలిపాడు. హర్మన్ కూడా అదే రేంజ్లో సక్సెస్ సాధిస్తుందని ఆశిద్దాం. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్టులోని జెర్సీ నంబర్ 18 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్నారు. నిన్న జరిగిన వేలంలో ఆర్సీబీ వుమెన్ జెర్సీ నంబర్ 18 స్మృతి మంధనను 3.4 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. WPLలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఇక పురుషుల క్రికెట్లో జెర్సీ నంబర్ 18 విరాట్ కోహ్లి ఐపీఎల్ పుట్టుక నుంచి ఆర్సీబీలోనే కొనసాగుతున్నారు. ఐపీఎల్ మరే ఇతర క్రికెటర్ కోహ్లిలా ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించింది లేదు. అయితే కోహ్లికి ఒక్క లోటు మాత్రం ఉంది. అతను ఒక్కసారి కూడా ఆర్సీబీని ఛాంపియన్గా నిలబెట్టలేకపోయాడు. మొత్తంగా టీమిండియా కెప్టెన్లు, జెర్సీ నంబర్ 18 ఐపీఎల్లో వేర్వేరు జట్లుగా విడిపోవడం ఆసక్తికర పరిణామం. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్-ఆర్సీబీల పోరు ఎంత హోరాహోరీగా సాగుతుందో WPLలో కూడా ఈ రెండు జట్ల మధ్య అంతే రసవత్తర పోరులు సాగే అవకాశం ఉంది. WPLలో ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్న ఆటగాళ్లు.. స్మృతి మంధాన (రూ.3.40 కోట్లు) రిచా ఘోష్ (రూ.1.90 కోట్లు) ఎలీస్ పెర్రీ (రూ.1.70 కోట్లు) రేణుక సింగ్ (రూ.1.50 కోట్లు) సోఫీ డివైన్ (రూ.50 లక్షలు) హీతెర్ నైట్ (రూ.40 లక్షలు) మేగన్ షుట్ (రూ.40 లక్షలు) కనిక అహుజ (రూ.35 లక్షలు) డేన్వాన్ నికెర్క్ (రూ.30 లక్షలు) ఎరిన్ బర్న్స్ (రూ.30 లక్షలు) ప్రీతి బోస్ (రూ.30 లక్షలు) కోమల్ జంజద్ (రూ.25 లక్షలు) ఆశ శోభన (రూ.10 లక్షలు) దిశ కాసత్ (రూ.10 లక్షలు) ఇంద్రాణి రాయ్ (రూ.10 లక్షలు) పూనమ్ ఖేమ్నర్ (రూ.10 లక్షలు) సహన పవార్ రూ.10 లక్షలు శ్రేయాంక పాటిల్ రూ.10 లక్షలు WPLలో ఆర్సీబీ సొంతం చేసుకున్న ప్లేయర్స్.. నటాలీ సివర్ (రూ.3.20 కోట్లు) పూజ వస్త్రకర్ (రూ.1.90 కోట్లు) హర్మన్ప్రీత్ కౌర్ (రూ.1.80 కోట్లు) యస్తిక భాటియా (రూ.1.50 కోట్లు) అమేలియా కెర్ (రూ.1 కోటి) అమన్జోత్ కౌర్ (రూ.50 లక్షలు) హేలీ మాథ్యూస్ (రూ.40 లక్షలు) క్లొయ్ ట్రియాన్ (రూ.30 లక్షలు) హిదెర్ గ్రాహమ్ (రూ.30 లక్షలు) ఇసాబెలె వోంగ్ (రూ.30 లక్షలు) ప్రియాంక బాల (రూ.20 లక్షలు) ధార గుజ్జార్ (రూ.10 లక్షలు) హుమైరా కాజి (రూ.10 లక్షలు) జింతిమని కలిత (రూ.10 లక్షలు) నీలమ్ బిష్త్ (రూ.10 లక్షలు) సయిక ఇషాక్ (రూ.10 లక్షలు) సోనమ్ యాదవ్ (రూ.10 లక్షలు) -
ధోని, కోహ్లి వల్ల కూడా కాలేదు.. అరుదైన రికార్డు నెలకొల్పిన టీమిండియా స్టార్ ఆల్రౌండర్
Deepti Sharma: భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ అరుదైన రికార్డు నెలకొల్పింది. మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ బరిలోకి దిగడం ద్వారా ఈ టీమిండియా ఆల్రౌండర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇంతకు ఏంటా రికార్డు అంటే..? రైట్ హ్యాండ్ ఆఫ్ బ్రేక్ బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ డాషింగ్ బ్యాటర్ అయిన దీప్తి శర్మ.. వరుసగా 50కి పైగా (2016-21 మధ్యలో 54) వన్డేలు, 50 టీ20లు (2020-23) ఆడిన తొలి భారత క్రికెటర్గా రికార్డు సృష్టించింది. భారత పురుష క్రికెటర్లు, అత్యంత ఫిట్గా ఉండే విరాట్ కోహ్లి, మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనికి సైతం సాధ్యం కాని ఈ రికార్డును దీప్తి తన ఖాతాలో వేసుకుని ఔరా అనిపించింది. భారత్ తరఫున ఏ పురుష క్రికెటర్కు కాని మహిళా క్రికెటర్కు కాని సాధ్యం కాని ఈ రికార్డును దీప్తి తన పేరిట లిఖించుకుని శభాష్ అనిపించుకుంది. 25 ఏళ్ల దీప్తి ఇప్పటివరకు తన అంతర్జాతీయ కెరీర్లో 2 టెస్ట్లు, 80 వన్డేలు, 87 టీ20లు ఆడింది. ఇందులో 152 టెస్ట్ పరుగులు, 1891 వన్డే పరుగులు, 914 టీ20 పరుగులు సాధించింది. బౌలింగ్లో 5 టెస్ట్ వికెట్లు, 91 వన్డే వికెట్లు, 96 టీ20 వికెట్లు దీప్తి ఖాతాలో ఉన్నాయి. దీప్తి ఇప్పటివరకు వన్డేల్లో ఓ సెంచరీ, 12 హాఫ్ సెంచరీలు, టెస్ట్ల్లో 2 హాఫ్ సెంచరీలు, టీ20ల్లో 2 హాఫ్ సెంచరీలు చేసింది. వన్డేల్లో ఓసారి 5 వికెట్లు, 2 సార్లు 4 వికెట్లు, టీ20ల్లో ఓ సారి 4 వికెట్ల ఘనత దీప్తి ఖాతాలో ఉన్నాయి. కాగా, నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన మహిళల తొట్టతొలి ఐపీఎల్ మెగా వేలంలో దీప్తి రికార్డు ధరను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. యూపీ వారియర్జ్ దీప్తిని 2.6 కోట్టు వెచ్చించి సొంతం చేసుకుంది. యూపీ వారియర్జ్ తరఫున దీప్తినే అత్యధిక ధర పలికిన ప్లేయర్ కావడం విశేషం. ఓవరాల్గా చూస్తే వేలంలో అత్యధిక ధర రికార్డును టీమిండియా డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధన సొంతం చేసుకుంది. మంధనను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3.4 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. మంధనను దక్కిన మొత్తం పాకిస్తాన్లో జరిగే పీఎస్ఎల్లో స్టార్ ఆటగాళ్లకు లభించే మొత్తంతో పోలిస్తే రెండింతలకు ఎక్కువ. పీఎస్ఎల్ పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్కు లభించే 1.2 కోట్లే అత్యధికం. -
గుజ్రాత్ జెయింట్స్ జట్టు ఇదే.. అత్యధిక ధర ఎవరికంటే?
తొట్టి తొలి మహిళల ప్రీమియర్ లీగ్ వేలం ముంబై వేదికగా ఆట్టహాసంగా జరిగింది. ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ యాష్లే గార్డ్నర్ చరిత్ర సృష్టించింది. గార్డ్నర్ రూ.3.20 కోట్ల భారీ ధరకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. దీంతో వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న విదేశీ క్రికెటర్గా గార్డ్నర్ నిలిచింది. ఇక ఓవరాల్గా మంధాన తర్వాత అత్యధిక ధర సొంతం చేసుకున్న రెండో క్రికెటర్గా గార్డ్నర్ నిలిచింది. ఇక ఈ వేలంలో భాగంగా గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసిన క్రికెటర్లపై ఓ లూక్కేద్దం. గుజరాత్ జెయింట్స్ దక్కించుకున్న క్రికెటర్ల వీరే యాష్లే గార్డ్నర్- (రూ3.20 కోట్లు) బెత్ మూనీ- రూ.2 కోట్లు జార్జియా వేర్హమ్ -రూ.75 లక్షలు స్నేహ్ రాణా- రూ.75 లక్షలు అనాబెల్ సదర్లాండ్- రూ.70 లక్షలు డియాండ్ర డాటిన్- రూ.60 లక్షలు సోఫియా డన్క్లే- రూ.60 లక్షలు సుష్మా వర్మ- రూ.60 లక్షలు తనూజ కన్వర్- రూ.50 లక్షలు హర్లీన్ డియోల్- రూ.40 లక్షలు అశ్వని కుమారి- రూ.35 లక్షలు హేమలత- రూ.30 లక్షలు మాన్సి జోషి- రూ.30 లక్షలు మోనిక పటేల్- రూ.30 లక్షలు సబ్బినేని మేఘన- రూ.30 లక్షలు హర్లీ గాల- రూ.10 లక్షలు పరుణిక సిసోడియా- రూ.10 లక్షలు షబ్నమ్ షకీల్- రూ.10 లక్షలు మొత్తం ప్లేయర్లు: 18 విదేశీ ప్లేయర్లు: 6 చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండు టెస్టు.. టీమిండియాకు బిగ్షాక్! -
WPL 2023: స్మృతికి అంత ధరెందుకు? వాళ్లకేం తక్కువ కాలేదు.. హర్మన్ విషయంలో మాత్రం..
WPL 2023 Auction Details In Telugu: అద్భుతమైన ఆట... నాయకత్వ ప్రతిభ... మార్కెటింగ్కు అవకాశం ఉన్న ప్రచారకర్త... ఒక మహిళా క్రికెటర్లో ఈ మూడు లక్షణాలు ఉంటే ఆమె కోసం జట్లు పోటీ పడటం సహజమే... ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. తొలి మహిళా ప్రీమియర్ లీగ్ వేలంలో అందరికంటే ఎక్కువ విలువతో భారత స్టార్ ప్లేయర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన శిఖరాన నిలిచింది. వేలంలో అందరికంటే ముందుగా ఆమె పేరు రాగా... ముంబై, బెంగళూరు స్మృతిని దక్కించుకునేందుకు హోరాహోరీగా పోటీ పడ్డాయి. చివరకు రూ. 3 కోట్ల 40 లక్షలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ స్టార్లు యాష్లే గార్డ్నర్, నటాలీ సివర్ రూ. 3 కోట్ల 20 లక్షలతో రెండో స్థానంలో నిలిచారు. ఆశ్చర్యకరంగా భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు మాత్రం ఆశించిన విలువ దక్కలేదు. నాలుగు టీమ్లు హర్మన్ కోసం ప్రయత్నించినా...చివరకు రూ. 1 కోటి 80 లక్షల వద్దే హర్మన్ వేలం ముగిసింది. మొత్తంగా చూస్తే పురుషుల ఐపీఎల్ తరహాలో కొన్ని సంచలనాలు, కొంత ఆశ్చర్యం, మరికొంత అనూహ్యం కలగలిపి తొలి మహిళల లీగ్ వేలం సాగింది. అయితే డబ్బుల విలువ, అంకెలను పక్కన పెట్టి చూస్తే భారత మహిళల క్రికెట్లో కొత్త లీగ్, అందు కోసం సాగిన వేలం కొత్త ప్రస్థానానికి పునాది వేసింది. ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మొదటిసారి నిర్వహించబోతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మొదటి అంకమైన ప్లేయర్ల వేలం ఘనంగా ముగిసింది. మొత్తం 448 మంది వేలంలోకి రాగా... ఐదు జట్లలోకి కలిపి మొత్తం 87 మంది ఎంపికయ్యారు. నిబంధనల ప్రకారం గరిష్టంగా టీమ్కు 18 మంది చొప్పున మొత్తం 90 మందికి అవకాశం ఉన్నా.... యూపీ 16 మందికి, ముంబై 17 మందికే పరిమితమయ్యాయి. మిగిలిన మూడు జట్లు బెంగళూరు, ఢిల్లీ, గుజరాత్ 18 మంది చొప్పున తీసుకున్నాయి. టాప్–10 జాబితాలో వేలంలో ఎక్కువ మొత్తం పలికిన టాప్–10 జాబితాలో భారత్ నుంచి స్మృతి మంధానతో పాటు దీప్తి శర్మ (రూ.2 కోట్ల 60 లక్షలు), జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2 కోట్ల 20 లక్షలు), షఫాలీ వర్మ (రూ. 2 కోట్లు), పూజ వస్త్రకర్ (రూ.1 కోటి 90 లక్షలు), రిచా ఘోష్ (రూ. 1 కోటి 90 లక్షలు), హర్మన్ప్రీత్ కౌర్ (రూ. 1 కోటి 80 లక్షలు) ఉన్నారు. త్రిషకు మొండిచేయి సీనియర్ జట్టుకు ఆడిన షఫాలీ, రిచా కాకుండా ఇటీవల అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు నుంచి ఆరుగురు అమ్మాయిలకు లీగ్లో అవకాశం దక్కింది. అయితే అండర్–19 ప్రపంచకప్లో రాణించిన హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిషను వేలంలో ఎవరూ తీసుకోలేదు. మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలోని రెండు వేదికల్లో డబ్ల్యూపీఎల్ నిర్వహిస్తారు. ఈ టోర్నీలో మొత్తం 22 మ్యాచ్లు జరుగుతాయి. మహిళల ప్రీమియర్ లీగ్ కావడంతో వేలం కార్యక్రమాన్ని కూడా మహిళనే నిర్వహించడం విశేషం. 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలం కార్యక్రమం చేసిన మల్లిక సాగర్ డబ్ల్యూపీఎల్ వేలంను నిర్వహించింది. వేలం విశేషాలు... అందుకే స్మృతి కోసం పోటీ భారత జట్టు ఓపెనర్ స్మృతి మంధానకు భారీ విలువ పలకవచ్చనే అంచనా తప్పలేదు. ఇప్పటికే మహిళల బిగ్బాష్ లీగ్, ‘హండ్రెడ్’ లీగ్లలో ఆడి ఆమె సత్తా చాటింది. దాంతో సహజంగానే ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. భారీ షాట్లు ఆడగల రిచా ఘోష్పై కూడా జట్లు నమ్మకం ఉంచాయి. టీమిండియా టాప్ ప్లేయర్లలో దీప్తి శర్మ తన సొంత రాష్ట్రం జట్టు యూపీ తరఫున ఆడనుంది. ప్రస్తుతం టి20 క్రికెట్లో వరల్డ్ నంబర్వన్ ఆల్రౌండర్ అయిన యాష్లే గార్డ్నర్పై కూడా టీమ్లు ఆసక్తి చూపించాయి. వారికి కూడా తక్కువేం కాదు ఆసీస్ ఇతర అగ్రశ్రేణి ప్లేయర్లు అలీసా హీలీ, మెగ్ లానింగ్లకు కూడా మంచి విలువ దక్కింది. గుర్తింపు ఉన్నా ఇక.. మహిళల టి20 క్రికెట్లో ఎంతో గుర్తింపు తెచ్చుకొని లీగ్ వేలంలో అమ్ముడు పోకుండా మిగిలిన అగ్రశ్రేణి ప్లేయర్లలో డానీ వ్యాట్, కేథరీన్ బ్రంట్, అమీ జోన్స్, అలానా కింగ్, సుజీ బేట్స్, చమరి అటపట్టు తదితరులు ఉన్నారు. హర్మన్ విషయంలో మాత్రం ►భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కోసం గుజరాత్ మినహా మిగతా నాలుగు జట్లూ పోటీ పడ్డాయి. అయితే చివరకు ఊహించిన మొత్తం మాత్రం ఆమెకు దక్కలేదు. ►అసోసియేట్ దేశాల నుంచి ఒకే ఒక ప్లేయర్ తారా నోరిస్ (అమెరికా) ఎంపికైంది. లెఫ్ట్ఆర్మ్ పేసర్ అయిన తారా స్వస్థలం ఫిలడెల్ఫియా. ►యూఏఈకి చెందిన మనిక గౌర్ కోసం గుజరాత్ ఆసక్తి చూపించింది. అయితే వారి కోటా పూర్తి అయిందని తేలడంతో ఆ జట్టు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ►16 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ పేస్ బౌలర్ షబ్నమ్ షకీల్ ఈ వేలంలో ఎంపికైన అతి పిన్న వయస్కురాలు. స్మృతి తర్వాత వేలంలో టాప్–10 ►యాష్లే గార్డ్నర్ -రూ. 3 కోట్ల 20 లక్షలు ►నటాలీ సివర్ -రూ. 3 కోట్ల 20 లక్షలు ►దీప్తి శర్మ -రూ. 2 కోట్ల 60 లక్షలు ►జెమీమా రోడ్రిగ్స్ - రూ. 2 కోట్ల 20 లక్షలు ►బెత్ మూనీ -రూ. 2 కోట్లు ►షఫాలీ వర్మ -రూ. 2 కోట్లు ►పూజ వస్త్రకర్ -రూ. 1 కోటి 90 లక్షలు ►రిచా ఘోష్ -రూ. 1 కోటి 90 లక్షలు ►సోఫీ ఎకిల్స్టోన్- రూ. 1 కోటి 80 లక్షలు ►హర్మన్ప్రీత్ - రూ. 1 కోటి 80 లక్షలు – సాక్షి క్రీడా విభాగం చదవండి: Hardik Pandya: ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి.. Womens T20 WC 2023: ఇండియా-పాకిస్తాన్ వరల్డ్కప్ మ్యాచ్లో ఘోర తప్పిదం -
WPL Auction 2023: అన్ సోల్డ్గా మిగిలిపోయిన తెలంగాణ అమ్మాయి
ముంబై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 13) జరుగుతున్న తొట్టతొలి మహిళల ఐపీఎల్ (WPL) మెగా వేలంలో టీమిండియా క్రికెటర్లు అనూహ్య ధరలు దక్కించుకున్నారు. తొలి రౌండ్ వేలం పూర్తయ్యే సరికి అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్గా స్మృతి మంధాన ఉంది. స్టార్ ఓపెనర్ అయిన స్మృతిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ 3.4 కోట్లకు ధర వెచ్చింది సొంతం చేసుకుంది. ఈమె తర్వాత దీప్తి శర్మ (యూపీ వారియర్జ్, 2.6 కోట్లు), జెమీమా రోడ్రిగెజ్ (ఢిల్లీ క్యాపిటల్స్, 2.2 కోట్లు), షెఫాలీ వర్మ (ఢిల్లీ క్యాపిటల్స్, 2 కోట్లు), రిచా ఘోష్ (ఆర్సీబీ, 1.9 కోట్లు), పూజా వస్త్రాకర్ (ముంబై ఇండియన్స్, 1.9 కోట్లు), టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (ముంబై ఇండియన్స్, 1.8 కోట్లు), రేణుకా సింగ్ (ఆర్సీబీ, 1.5 కోట్లు), యస్తికా భాటియా (ముంబై ఇండియన్స్, 1.5 కోట్లు) భారీ ధర పలికిన వారిలో ఉన్నారు. మెగా వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్లేయర్లు ఇప్పటివరకు లిస్టింగ్లోకి రాగా.. కర్నూలుకు చెందిన కేశవరాజుగారి అంజలి శర్వాణిని యూపీ వారియర్జ్ 55 లక్షలకు దక్కించుకుంది. తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష 10 లక్షల బేస్ప్రైజ్ విభాగంలో లిస్టింగ్కు వచ్చినప్పటికీ ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చ లేదు. వేలం ట్రెండ్ను బట్టి త్రిషకు భారీ ధర దక్కుతుందని అంతా ఊహించారు. అయితే, ఈ అమ్మాయిని జట్టులో చేర్చుకునేందుకు ఏ జట్టు ఆసక్తి కనబర్చకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వేలంలో మరో దఫా లిస్టింగ్ అయ్యే ఛాన్స్ ఉండటంతో చివర్లో అయినా ఏదో ఒక జట్టు ఈ అమ్మాయిని దక్కించుకోవచ్చు. 17 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన త్రిష ఇటీవల జరిగిన అండర్-19 టీ20 వరల్డ్కప్లో సత్తా చాటడం ద్వారా వెలుగులోకి వచ్చింది. సీనియర్ జట్టుకు ఆడకపోవడం ఈ అమ్మాయికి మైనస్ అయ్యుండవచ్చని క్రికెట్ ఫాలోవర్స్ అనుకుంటున్నారు. తెలంగాణలోని భద్రాచలానికి చెందిన త్రిష.. అండర్-19 వరల్డ్కప్-2023 ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ (24 నాటౌట్) ఆడి టీమిండియాను జగజ్జేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్, లెగ్ బ్రేక్ బౌలింగ్ చేసే త్రిష.. ఫీల్డింగ్లోనూ అదరగొడుతుంది. వేలం ప్రక్రియ ఇవాళ రాత్రి వరకు సాగనుండటంతో ఏదో ఒక జట్టు త్రిషను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం. కాగా, వేలంలో తొలి రౌండ్ పూర్తయ్యే సరికి త్రిషతో పాటు భారత్కు చెందిన క్రికెటర్లు తాన్యా భాటియా, సుష్మ వర్మ, పూనమ్ యాదవ్, హ్రిషిత బసు, సౌమ్య తివారి, అర్చనా దేవి, మన్నత్ కశ్యప్, నజ్లా సీఎంసీ, సోనమ్ యాదవ్, షబ్నమ్ షకీల్, ఫలక్ నాజ్, సోనియా మెందియా, శిఖా షాలోట్, హర్లీ గాలా అన్ సోల్డ్గా మిగిలిపోయారు. ఇప్పటివరకు కేవలం 78 మాత్రమే వేలానికి రాగా.. ఇంకా 412 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంది. -
WPL వేలంలో జాక్పాట్ కొట్టిన కర్నూలు అమ్మాయి
ముంబై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 13) జరుగుతున్న తొట్టతొలి మహిళల ఐపీఎల్ (WPL) మెగా వేలంలో టీమిండియా క్రికెటర్లపై కనక వర్షం కురుస్తుంది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ 3.4 కోట్లకు సొంతం చేసుకోగా.. దీప్తి శర్మ (యూపీ వారియర్జ్, 2.6 కోట్లు), జెమీమా రోడ్రిగెజ్ (ఢిల్లీ క్యాపిటల్స్, 2.2 కోట్లు), షెఫాలీ వర్మ (ఢిల్లీ క్యాపిటల్స్, 2 కోట్లు), రిచా ఘోష్ (ఆర్సీబీ, 1.9 కోట్లు), పూజా వస్త్రాకర్ (ముంబై ఇండియన్స్, 1.9 కోట్లు), టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (ముంబై ఇండియన్స్, 1.8 కోట్లు), రేణుకా సింగ్ (ఆర్సీబీ, 1.5 కోట్లు), యస్తికా భాటియా (ముంబై ఇండియన్స్, 1.5 కోట్లు) భారీ ధర పలికిన వారిలో ఉన్నారు. Young Anjali Sarvani is next with a base price of INR 30 Lakh She is SOLD to @UPWarriorz for INR 55 Lakh #WPLAuction — Women's Premier League (WPL) (@wplt20) February 13, 2023 వేలంలో ఊహించని ధర పలికిన వారిలో కర్నూలు అమ్మాయి కేశవరాజుగారి అంజలి శర్వాణి కూడా ఉంది. 25 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన శర్వాణిని యూపీ వారియర్జ్ 55 లక్షలకు దక్కించుకుంది. 30 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో పోటీపడ్డ అంజలీని యూపీ వారియర్జ్ పోటీపడి మరీ సొంతం చేసుకుంది. కర్నూలు జిల్లాలోని ఆదోనికి చెందిన శార్వాణి ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి, సత్తా చాటింది. ఆ సిరీస్లో శర్వాణి ఆడిన 5 మ్యాచ్ల్లో 8.73 సగటున 3 వికెట్లు పడగొట్టింది. టీమిండియా తరఫున ఓవరాల్గా 6 టీ20లు ఆడిన శర్వాణి 2/34 అత్యుత్తమ ప్రదర్శనతో 3 వికెట్లు తీసుకుంది. ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 వరల్డ్కప్లో కూడా శర్వాణి సభ్యురాలిగా ఉంది. -
ముంబైలో మహిళల ప్రీమియర్ లీగ్ వేలం.. భారీ ధర పలికిన భారత క్రికెటర్లు
-
స్మృతి మంధానకు జాక్ పాట్.. ఎన్ని కోట్లంటే?
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన జాక్ పాట్ కొట్టింది. ముంబై వేదికగా జరుగుతోన్న ఈ వేలంలో స్మృతి మంధానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.3.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. మంధాన కోసం ఆది నుంచే ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఆఖరికి బెంగళూరు ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. కాగా ఈ వేలంలో మంధాన తన బేస్ ప్రైస్ రూ.50లక్షలగా నిర్ణయించుకుంది. మరోవైపు భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ను రూ. 1.8 కోట్లకు మంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అదే విధంగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ యాష్ గార్డెనర్ను రూ.3.2 కోట్ల భారీ ధరకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకోంది. ఇక ఈ వేలంలో మొత్తం 90 బెర్త్ల కోసం 409 మంది క్రికెటర్లు వేలం బరిలో ఉన్నారు. Join us in welcoming the first Royal Challenger, Smriti Mandhana! 😍 Welcome to RCB 🔥#PlayBold #WeAreChallengers #WPL2023 #WPLAuction pic.twitter.com/7q9j1fb8xj — Royal Challengers Bangalore (@RCBTweets) February 13, 2023 చదవండి: Hardik Pandya: ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి.. -
ముంబైలో మహిళల ప్రీమియర్ లీగ్ వేలం
-
WPL 2023 Auction: ముగిసిన ఐపీఎల్ వేలం.. స్మృతి మంధానకు భారీ ధర
ముగిసిన వేలం.. స్మృతి మంధానకు భారీ ధర తొలి మహిళల ప్రీమియర్ లీగ్కు సంబంధించిన వేలం ముగిసింది. ముంబై వేదికగా జరిగిన ఈ వేలంలో మొత్తం 87 మంది క్రికెటర్లు అమ్ముడు పోయారు. క్రికెటర్లను కొనుగోలు చేయడానికి ఐదు ఫ్రాంచైజీలు రూ. 59.5 కోట్ల మొత్తాన్ని వెచ్చించాయి. ఈ వేలంలో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్గా నిలిచింది. మంధానను రూ.3.4 కోట్ల భారీ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. అదే విధంగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ ఆష్లీ గార్డనర్ను గుజరాత్ జెయింట్స్ కోసం రూ. 3.2 కోట్లను వెచ్చించి సొంతం చేసుకుంది. వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్గా గార్డనర్ నిలిచింది. ►ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ను రూ.40లక్షలకు రాయల్ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ►వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ను రూ.40లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ►భారత ఆల్రౌండర్ దయాళన్ హేమలతను రూ. 30 లక్షలకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ►భారత ఆల్రౌండర్ దేవికా వైద్యను రూ. 1.4 కోట్లకు యూపీ వారియర్జ్ కొనుగోలు చేసింది. ►ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఆలిస్ క్యాప్సేను రూ. 75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ►ఆంధ్రా క్రికెటర్ సబ్బెనేని మేఘనను రూ. 30 లక్షలకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ►భారత క్రికెటర్ కిరణ్ నవ్గిరేను రూ. 30 లక్షలకు యూపీ వారియర్జ్ దక్కించుకుంది. ►ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్రేస్ హారిస్ను రూ. 75లక్షలకు యూపీ వారియర్జ్ కొనుగోలు చేసింది. ►భారత అండర్-19 క్రికెటర్ శ్వేతా సెహ్రావత్ను రూ. 40 లక్షలకు యూపీ వారియర్జ్ సొంతం చేసుకుంది. ►భారత ఆల్రౌండర్ స్నేహ్ రాణాను రూ.75 లక్షలకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది. ►దక్షిణాఫ్రికా స్టార్ ఆల్రౌండర్ మారిజాన్ కాప్ను రూ.1.5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ► భారత స్పిన్నర్ రాధా యాదవ్ను రూ.40 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది ►టీమిండియా యువ పేసర్ అంజలి శర్వణిను రూ.55 లక్షలకు యూపీ వారియర్జ్ సొంతం చేసుకుంది. ►భారత యువ వికెట్ కీపర్ రిచా ఘోష్కు భారీ ధర దక్కింది. రిచాను రూ. 1.9 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. ► భారత వికెట్ కీపర్ యాస్తిక భాటియను రూ.1.5 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ► ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ అన్నాబెల్లె సదర్లాండ్ను రూ. 70 లక్షలకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది. ► వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ డియాండ్రా డాటిన్ను రూ.60లక్షలకు గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది. ►భారత ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ను రూ. 1.9 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది ► ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ను రూ.1.1కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ►భారత స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మను రూ. 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ►భారత స్టార్ క్రికెటర్ జెమ్మిమా రోడ్రిగ్స్ను రూ. 2.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది ►ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ బెత్ మూనీని రూ.2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది. ►ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ నాట్ స్కివర్ను రూ.3.2 కోట్ల భారీ ధరకు ముంబై దక్కించుకుంది. ► టీమిండియా పేసర్ రేణుకా సింగ్ను రూ.1.5 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది ► భారత స్టార్ ఆల్రౌండర్ దీప్తిశర్మను రూ.2.6 కోట్లకు యూపీ వారియర్జ్ కొనుగోలు చేసింది. ►మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో తొలి రౌండ్ ముగిసింది. తొలి సెట్లో స్మృతి మంధాన(రూ.3.4కోట్లు) భారీ దక్కించుకున్న ప్లేయర్గా నిలిచింది ►ఇంగ్లడ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్స్టోన్ను రూ.1.8 కోట్లకు యూపీ వారియర్జ్ దక్కించుకోంది ►ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఎలీస్ పెర్రీని రూ.1.7 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ►ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ యాష్ గార్డెనర్ను రూ. 3.2 కోట్ల భారీ ధరకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది ► న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ సోఫియా డివైన్ను రూ. 50 లక్షలకు ఆర్సీబీ కొనుగోలు చేసింది ►భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ను రూ. 1.8 కోట్లకు మంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. స్మృతి మంధానకు భారీ ధర మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన భారీ ధరకు అమ్ముడుపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ 3.4 కోట్లకు మంధానను సొంతం చేసుకుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం జరుగనుంది. తొలిసారి నిర్మహించనున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 టోర్నీ క్రికెటర్ల వేలం కార్యక్రమం సోమవారం మొదలైంది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు మొదలైన ఈ కార్యక్రమాన్ని స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. మహిళా లీగ్ వేలం మహిళ మల్లిక సాగర్ నేతృత్వంలో జరగనుండటం విశేషం. మల్లిక 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలం కార్యక్రమాన్ని నిర్వహించింది. మొత్తం 90 బెర్త్ల కోసం 409 మంది క్రికెటర్లు వేలం బరిలో ఉన్నారు. -
ఐపీఎల్ వేలం నిర్వహించనున్న మహిళ ఎవరో తెలుసా..?
మహిళల ఐపీఎల్ (WPL) తొట్టతొలి వేలాన్ని నిర్వహించేందుకు మల్లిక సాగర్ అడ్వానీ అనే మహిళను బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే. ఇనాగురల్ WPL యొక్క వేలం ఇవాళ (ఫిబ్రవరి 13) ముంబైలో జరుగనుంది. ఈ నేపథ్యంలో వేలం నిర్వహించనున్న మల్లిక గురించి తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ముంబైకి చెందిన మల్లిక అడ్వానీ పురాతన పెయింటింగ్స్ (ఆర్ట్)ను సేకరించే వృత్తిలో ఉన్నారు. ఆమె మోడ్రన్ అండ్ కాన్టెంపరరీ ఇండియన్ ఆర్ట్ అనే ముంబై ఆధారిత సంస్థకు ఆర్ట్ కలెక్టర్ కన్సల్టెంట్గా పని చేస్తున్నారు. అలాగే ఆమె ఆర్ట్ ఇండియా కన్సల్టెంట్స్ ఫర్మ్లో పార్ట్నర్గా కూడా ఉన్నారు. ఆక్షన్లు నిర్వహించడంలోనూ మల్లికకు పూర్వ అనుభవం ఉంది. 🥁🥁🥁 Doubling the #vivoProKabaddiPlayerAuction excitement is our auctioneer Mallika Sagar! Let's welcome our first Indian auctioneer and get ready for a 🤯 auction this season. pic.twitter.com/Qhw1YkC1rP — ProKabaddi (@ProKabaddi) August 26, 2021 పుండోల్స్ అనే ముంబై బేస్డ్ సంస్థ తరఫున వైవిధ్యభరితంగా వేలం నిర్వహించి గతంలో ఆమె వార్తల్లోకెక్కారు. క్రీడలకు సంబంధించిన వేలం నిర్వహణలోనూ మల్లికకు ప్రవేశం ఉంది. 2021 ప్రో కబడ్డీ లీగ్ వేలాన్ని ఆమె సక్సెస్ఫుల్గా నిర్వహించింది. వృత్తి రిత్యా మల్లికకు సంబంధించిన వివరాలు ఇవి. కాగా, పురుషుల ఐపీఎల్ వేలం ప్రక్రియను గతంలో హగ్ ఎడ్మియాడెస్, రిచర్డ్ మ్యాడ్లీ లేక చారు శర్మ నిర్వహించిన విషయం తెలిసిందే. మహిళల లీగ్ కోసం మహిళా ఆక్షనీర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో బీసీసీఐ మల్లిక పేరును కొద్ది రోజుల కిందటే తెరపైకి తెచ్చింది. ఇదిలా ఉంటే, ఇవాళ జరుగబోయే WPL వేలంలో మొత్తం 409 మంది మహిళా క్రికెటర్లు పాల్గొననుండగా.. కేవలం 90 స్లాట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. లీగ్లో పాల్గొనబోయే 5 జట్లు కనీసం 15 మంది ప్లేయర్లను కొనుగోలు చేస్తాయి. ఆయా ఫ్రాంచైజీలు ప్లేయర్ల కోసం 9 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫుల్ పర్స్ వ్యాల్యూ 12 కోట్లుగా ఉంది. ఒక్కో జట్టుకు కేవలం ఆరుగురు ఫారిన్ ప్లేయర్లను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. వేలంలో పాల్గొంటున్న క్రికెటర్లలో 24 మంది 50 లక్షల కనీస ధరకు, 30 మంది 40 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో పేర్తు రిజిస్టర్ చేసుకున్నారు. 50 లక్షల విభాగంలో ఉన్నప్లేయర్లలో హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధానా, దీప్తి శర్మ, షెఫాలీ వర్మ వంటి భారత క్రికెటర్లు.. ఎలైస్ పెర్రీ(ఆస్ట్రేలియా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), సోఫీ డెవినె (న్యూజిలాండ్), డియాండ్ర డొటిన్ (వెస్టిండీస్) వంటి విదేశీ ప్లేయర్లు ఉన్నారు. వేలం ప్రక్రియ ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభంకానుంది. ముంబై వేదికగా మార్చి 4 నుంచి WPL మొదలు కానుంది. ఐదు జట్లు 22 మ్యాచ్లు ఆడతాయి. మార్చి 22న ఫైనల్ జరుగుతుంది. -
Gujarat Giants: గర్జిస్తున్న ఆసియా సింహం.. ఏ ఛాలెంజ్కైనా సిద్ధం
WPL 2023: మహిళల ఐపీఎల్లో అహ్మదాబాద్ బేస్డ్ ఫ్రాంచైజీ అయిన గుజరాత్ జెయింట్స్ ఆదివారం (ఫిబ్రవరి 12) నాడు తమ జట్టు లోగోను ట్విటర్ వేదికగా ఆవిష్కరించింది. వేలానికి ఓ రోజు ముందే గుజరాత్ జెయింట్స్ లోగోను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. క్రికెట్ అభిమానులను, ముఖ్యంగా గుజరాత్ ప్రాంత వాసులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ లోగోలో గర్జిస్తున్న ఆసియా సింహం (సివంగి) చిహ్నాన్ని పొందుపర్చింది ఫ్రాంచైజీ యాజమాన్యం. Presenting the Gujarat Giants @wplt20 team logo: the Asiatic Lioness roaring and looking forward to any challenge! The Asiatic Lion, found only in Gujarat's Gir National Park, is an enduring symbol of the state. [1/2] pic.twitter.com/SAntd2Lrev — Gujarat Giants (@GujaratGiants) February 12, 2023 ఈ లోగోకు గర్జిస్తున్న ఆసియా సింహం.. ఏ ఛాలెంజ్కైనా సిద్ధం అన్న కామెంట్స్ను జోడించారు. ఈ రకం ఆసియా సింహం (సివంగి) గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్లో మాత్రమే కనిపిస్తుంది. గర్జించే సింహం యొక్క చిహ్నం గుజరాత్ రాష్ట్ర గౌరవానికి ప్రతీక అంటూ ట్వీట్లో పేర్కొంది గుజరాత్ జెయింట్స్ యాజమాన్యం. గుజరాత్ జెయింట్స్ లోగో ప్రస్తుతం సోషల్మీడియాలో, క్రికెట్ సర్కిల్స్లో వైరలవుతోంది. కాగా, అదానీ స్పోర్ట్స్లైన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే అహ్మదాబాద్ ఆధారిత సంస్థ గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీను 1289 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చింది సొంతం చేసుకుంది. WPLలో ఇదే అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీ. దీని తర్వాత ముంబై ఇండియన్స్ (ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, 912.99 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, 901 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (జేఎస్డబ్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్, 810 కోట్లు), లక్నో సూపర్ జెయింట్స్ (క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, 757 కోట్లు) ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇవాళ (ఫిబ్రవరి 13) జరుగబోయే WPL తొలి వేలంలో కూడా గుజరాత్ జెయింట్స్ తమ హవా చూపనుందని సమాచారం. కొందరు దేశీయ ఆటగాళ్ల కోసం ఎంత మొత్తమైనా వెచ్చించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్రాంచైజీకి టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మెంటార్గా వ్యవహరిస్తుంది. -
WPL 2023: డబ్ల్యూపీఎల్ వేలానికి వేళాయె.. వివరాలివే
ముంబై: బీసీసీఐ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహించనున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 టోర్నీ క్రికెటర్ల వేలం కార్యక్రమం నేడు జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మహిళా లీగ్ వేలం మహిళ మల్లిక సాగర్ నేతృత్వంలో జరగనుండటం విశేషం. మల్లిక 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలం కార్యక్రమాన్ని నిర్వహించింది. మొత్తం 90 బెర్త్ల కోసం 409 మంది క్రికెటర్లు వేలం బరిలో ఉన్నారు. ఇందులో భారత్ నుంచి 246 మంది... విదేశీ జట్ల నుంచి 163 మంది ఉన్నారు. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రేణుక సింగ్, రిచా ఘోష్ (భారత్), ఎలీస్ పెర్రీ, బెత్ మూనీ, అలీసా హీలీ, మేగన్ షుట్ (ఆస్ట్రేలియా), నాట్ సివెర్, సోఫీ ఎకిల్స్టోన్ (ఇంగ్లండ్), డియాండ్ర డాటిన్ (వెస్టిండీస్) తదితరులకు భారీ మొత్తం లభించే అవకాశముంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ జట్లు పాల్గొంటున్న డబ్ల్యూపీఎల్ మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో జరుగుతుంది. -
డబ్ల్యూపీఎల్ వేలం.. బరిలో 409 మంది
ముంబై: వచ్చే నెలలో తొలిసారి నిర్వహించనున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 టోర్నీ వేలం బరిలో నిలిచిన ప్లేయర్ల జాబితాను మంగళవారం విడుదల చేశారు. మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో జరిగే ఈ టోర్నీలో ఐదు జట్లు బరిలో ఉన్నాయి. గరిష్టంగా 90 బెర్త్ల కోసం మొత్తం 409 మంది క్రికెటర్లు పోటీపడనున్నారు. ఈనెల 13న ముంబైలో మధ్యాహ్నం 2:30 నుంచి వేలం కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 1525 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకోగా... చివరకు 409 మందిని ఎంపిక చేశారు. ఇందులో 246 మంది భారత క్రికెటర్లు... 163 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. మొత్తం 24 మంది క్రికెటర్లు గరిష్ట కనీస ధర రూ. 50 లక్షల విభాగంలో ఉన్నారు. ఐదు ఫ్రాంచైజీలు రూ. 12 కోట్లు చొప్పున వేలంలో వెచ్చించడానికి వీలు ఉంది. ఒక్కో జట్టు 15 నుంచి 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చు. గరిష్టంగా ఆరుగురు విదేశీ క్రికెటర్లను తీసుకోవచ్చు. వేలం బరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, షబ్నమ్, శరణ్య, నల్లపురెడ్డి శ్రీచరణి, స్నేహ దీప్తి, కట్టా మహంతి శ్రీ, వై.హేమ, బారెడ్డి అనూష, చల్లా ఝాన్సీలక్ష్మీ, విన్నీ సుజన్... హైదరాబాద్ నుంచి అరుంధతి రెడ్డి, గొంగడి త్రిష, యషశ్రీ, మమత, ప్రణవి, కోడూరి ఇషిత ఉన్నారు. చదవండి: కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్న టీమిండియా ఆల్రౌండర్ . -
మహిళల ఐపీఎల్ మార్చి 4 నుంచి ప్రారంభం
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహిళల ఐపీఎల్కు (డబ్ల్యూపీఎల్) ముహూర్తం ఖరారైంది. ముంబైలోని బ్రబోర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లో మార్చి 4 నుంచి లీగ్ ప్రారంభంకానున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అధికారికంగా ప్రకటించారు. 22 రోజుల పాటు సాగే డబ్ల్యూపీఎల్ మార్చి 26తో ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. లీగ్ ఆరంభ మ్యాచ్ గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల మధ్య జరుగుతుందని తెలిపారు. అలాగే లీగ్కు సంబంధించిన వేలం టీ20 వరల్డ్కప్లో భారత్-పాక్ మ్యాచ్ అయిపోయిన మరుసటి రోజే (ఫిబ్రవరి 13) ముంబైలో జరుగుతుందని స్పష్టం చేశాడు. కాగా, డబ్ల్యూపీఎల్లో పాల్గొనే ఐదు ఫ్రాంచైజీలను ఐపీఎల్ యజమాన్యాలే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆయా జట్లను సొంతం చేసుకున్న యజమాన్యాల వివరాలు.. అదానీ స్పోర్ట్స్లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (అహ్మదాబాద్, 1289 కోట్లు)-గుజరాత్ జెయింట్స్ ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ముంబై, 912.99 కోట్లు)- ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బెంగళూరు, 901 కోట్లు)- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జేఎస్డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఢిల్లీ, 810 కోట్లు)- ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (లక్నో, 757 కోట్లు)-లక్నో సూపర్ జెయింట్స్ -
ముంబై జట్టు హెడ్ కోచ్గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
డబ్ల్యూపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ తమ జట్టు హెడ్ కోచ్గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ను ఎంపిక చేసింది. . 2017లో క్రికెట్కు వీడ్కోలు పలికిన 43 ఏళ్ల చార్లెట్కు కోచింగ్లో విశేష అనుభవం ఉంది. మూడు ఫార్మాట్లలో కలిపి 309 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన చార్లెట్ 10,273 పరుగులు సాధించింది. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్లో సదరన్ వైపర్స్ జట్టుకు, సదరన్ బ్రేవ్ (హండ్రెడ్ టోర్నీ) జట్టుకు, ఆస్ట్రేలియాలో మహిళల బిగ్బాష్ లీగ్లో సిడ్నీ సిక్సర్స్ జట్టు హెడ్ కోచ్గా పనిచేసిన చార్లెట్ అమెరికా క్రికెట్ జట్టుకు కూడా కొంతకాలం శిక్షణ అందించారు. మరోవైపు డబ్ల్యూపీఎల్ వేలం కార్యక్రమం ఈనెల 13న ముంబైలో జరుగుతుంది. ఒక్కో జట్టు కనిష్టంగా 15 మందిని గరిష్టంగా 18 మంది క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు వీలుంది. ఒక్కో జట్టు వేలంలో రూ. 12 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా భారత బౌలింగ్ దిగ్గజం జులన్ గోస్వామిని తమ జట్టు మెంటార్, బౌలింగ్ కోచ్గా ముంబై నియమించుకుంది. మరోవైపు భారత మాజీ ఆల్రౌండర్ దేవిక పల్షికార్ను బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు అప్పజెప్పారు. చదవండి: టాపార్డరే కీలకం: మిథాలీ -
Womens T20 World Cup: వేలంపై కాదు... పాక్తో సమరంపైనే దృష్టి
కేప్టౌన్: మహిళల టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్తో జరిగే సమరంపైనే తాము దృష్టి పెట్టామని, మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కోసం నిర్వహించే వేలంపై ఆలోచించడం లేదని భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొంది. దక్షిణాఫ్రికా గడ్డపై అండర్–19 అమ్మాయిల జట్టు సాధించిన వరల్డ్కప్ స్ఫూర్తితో తమ ప్రపంచకప్ వేట సాగుతుందని చెప్పింది. మెగా ఈవెంట్లో హర్మన్ సేన 12న జరిగే తమ తొలి మ్యాచ్లో పాక్లో తలపడుతుంది. మరుసటి రోజే ముంబైలో మహిళా క్రికెటర్ల వేలం కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం జట్టు కెప్టెన్లతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హర్మన్ మాట్లాడుతూ ‘ప్రపంచకప్పే అన్నింటికంటే ముఖ్యమైంది. దాని తర్వాతే ఏదైనా..! ఐసీసీ మెగా ఈవెంట్పైనే మేం దృష్టి సారించాం. మిగతావి ఎప్పుడూ ఉండేవే. ఓ క్రికెటర్గా ఏది ప్రధానమో ఏది అప్రధానమో నాకు బాగా తెలుసు. దేనిపై దృష్టి సారించాలో కూడా తెలుసు. గత నెల షఫాలీ వర్మ నేతృత్వంలోని అండర్–19 మహిళల జట్టు సాధించిన వరల్డ్కప్ను మేమంతా చూశాం. జూనియర్ టీమ్ స్ఫూర్తితో మేం కూడా ప్రపంచకప్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాం’ అని వివరించింది. అలాగే దేశంలో జరిగే మహిళల లీగ్లతో జాతీయ జట్లకు చాలా మేలు జరుగుతుందని చెప్పింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల్లో జరుగుతున్న లీగ్లతో ఆ జట్లు ఏ స్థాయిలో ఉన్నాయో... అలాగే డబ్ల్యూపీఎల్తో మన జాతీయ జట్టు, అమ్మాయిలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని, నాణ్యమైన విదేశీ క్రికెటర్లతో కలిసి ఆడటం వల్ల నైపుణ్యం పెరుగుతుందని భారత కెప్టెన్ తెలిపింది. వేలం ఇబ్బందికరమే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సారథులు ప్రపంచకప్ సమయంలోనే క్రికెటర్ల వేలం జరగనుండటం ఇబ్బందికరమని అభిప్రాయపడ్డారు. ‘కొందరు క్రికెటర్లు వేలంలో అమ్ముడుపోతారు. మరికొందరేమో మిగిలిపోతారు. ఇంకొందరికి ఎక్కువ ధర, కొందరికి తక్కువ ధర లభిస్తుంది. ఇది క్రికెటర్ల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది’ అని న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ పేర్కొంది. ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ మాట్లాడుతూ ‘నిజంగా ఇది (వేలం) ఇబ్బందికర పరిణామమే. ప్రపంచకప్లో ఆడేందుకు వచ్చిన అమ్మాయిలను తప్పకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కొందరు జీర్ణించుకుంటారు. ఇంకొందరు జీర్జించుకోలేరు. ఇది కాస్త ఆటపై ప్రభావం చూపుతుంది’ తెలిపింది. -
WPL 2023: అంబానీ వర్సెస్ అదానీ.. తొలి మ్యాచ్లో ముంబైతో అహ్మదాబాద్ ‘ఢీ’
Women Premier League 2023: మహిళల క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాందిగా ఉమెన్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) త్వరలోనే ఆరంభం కానుంది. లీగ్లోని అన్ని మ్యాచ్లు ముంబైలోనే జరుగనున్నాయి. నగరంలోని బ్రబోర్న్, డీవై పాటిల్ స్టేడియాలను టోర్నీ వేదికలుగా ఎంపిక చేశారు. షెడ్యూల్పై బోర్డు ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా... మార్చి 4న తొలి మ్యాచ్ జరుగుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 22 మ్యాచ్లు భారత కార్పొరేట్ దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలకు చెందిన ముంబై, అహ్మదాబాద్ టీమ్లు ఈ పోరులో తలపడే అవకాశం ఉంది. ముంబైలోని ప్రధాన స్టేడియం వాంఖడేను ఐపీఎల్ కోసం మాత్రమే వినియోగిస్తారు. మొత్తం 22 మ్యాచ్లు ఉండే ఈ టోర్నీ ఫైనల్ మార్చి 26న జరుగుతుంది. ప్లే ఆఫ్స్నకు మూడు టీమ్లు ఐదు జట్లు పాల్గొంటున్న డబ్ల్యూపీఎల్లో మూడు టీమ్లు ప్లే ఆఫ్స్నకు అర్హత సాధిస్తాయి. లీగ్ దశలో ఒక్కో టీమ్ ఇతర నాలుగు జట్లతో (మొత్తం 8 మ్యాచ్లు) తలపడుతుంది. అత్యధిక పాయింట్ల జట్టు ఫైనల్కు చేరితే... మరో ఫైనలిస్ట్ కోసం తర్వాతి రెండు టీమ్ల మధ్య ఎలిమినేటర్ నిర్వహిస్తారు. ఫ్రాంచైజీ ఒప్పందాలు ఖరారు చేసేందుకు శుక్రవారం ఐదు టీమ్ల యాజమాన్యాలతో బీసీసీఐ సమావేశమైంది. మహిళల ఐపీఎల్ జట్లను కొనుగోలు చేసిన సంస్థలు ఇవే 1. అదానీ స్పోర్ట్స్లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (అహ్మదాబాద్, 1289 కోట్లు) 2. ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ముంబై, 912.99 కోట్లు) 3. రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బెంగళూరు, 901 కోట్లు) 4. జేఎస్డబ్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఢిల్లీ, 810 కోట్లు) 5. క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (లక్నో, 757 కోట్లు) చదవండి: BGT 2023: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. తీవ్రంగా శ్రమిస్తున్న టీమిండియా! ఫోటోలు వైరల్ Shaheen Afridi: షాహీన్ అఫ్రిది 'నిఖా' హోగయా.. ప్రత్యేక అతిధి ఎవరంటే..? -
‘జెయింట్స్’ హెడ్ కోచ్గా రేచల్ హేన్స్
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో అత్యధిక మొత్తంతో టీమ్ను సొంతం చేసుకున్న అహ్మదాబాద్ యాజమాన్యం అందరికంటే వేగంగా, చురుగ్గా టీమ్ నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఈ టీమ్ ‘గుజరాత్ జెయింట్స్’కు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ను ఇటీవలే మెంటార్గా ఎంపిక చేయగా, ఇప్పుడు టీమ్ హెడ్ కోచ్ను ప్రకటించింది. ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ రేచల్ హేన్స్ ‘జెయింట్స్’కు హెడ్ కోచ్గా వ్యవహరించనుంది. గత ఏడాదే ఆటకు గుడ్బై చెప్పిన హేన్స్ ఆసీస్ తరఫున ఆరు ప్రపంచకప్ విజయాల్లో భాగంగా ఉండటం విశేషం.ఆస్ట్రేలియా తరఫున ఆమె 6 టెస్టులు, 77 వన్డేలు, 84 టి20ల్లో ప్రాతినిధ్యం వహించింది. దీంతో పాటు మరో రెండు నియామకాలను కూడా అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ప్రకటించింది. ఇటీవలే వరల్డ్కప్ నెగ్గిన భారత మహిళల అండర్–19 టీమ్కు కోచ్గా వ్యవహరించిన నూషీన్ అల్ ఖదీర్ను బౌలింగ్ కోచ్గా... తుషార్ అరోథేను బ్యాటింగ్ కోచ్గా ఎంపిక చేశారు. గత ఏడాది మహిళల టి20 చాలెంజ్ టోర్నీ నెగ్గిన ‘సూపర్ నోవాస్’కు కోచ్గా పని చేసిన అనుభవం నూషీన్కు ఉండగా, బరోడా మాజీ క్రికెటర్ తుషార్ భారత సీనియర్ మహిళల టీమ్కు కోచ్గా బాధ్యతలు నిర్వర్తించాడు. -
WPL Players Auction: 90 మందికే ఛాన్స్! కానీ 1000 పేర్లు నమోదు..
ఆరంభ మహిళల ఐపీఎల్(డబ్ల్యూపీఎల్)కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ మెగా టోర్నీలో భాగమయ్యేందుకు ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెటర్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక మహిళల ఐపీఎల్కు సంబంధించిన మొట్టమొదటి వేలం ముంబై వేదికగా ఫిబ్రవరి 13న బీసీసీఐ నిర్వహించనుంది. కాగా న్యూస్ 18 రిపోర్ట్ ప్రకారం.. ఈ వేలంలో పాల్గొనేందుకు దాదాపు 1000 మంది మహిళా క్రికెటర్లు తమ పేర్లను రిజిష్టర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. "అరంగేట్ర మహిళల ఐపీఎల్లో ఆడేందుకు చాలా మంది క్రికెటర్లు ఆసక్తిగా ఉన్నారు. ఐపీఎల్ వేలం కోసం ఇప్పటికే 1000 మంది వరకు అమ్మాయిలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో భారత్తో పాటు విదేశీ క్రికెటర్లు కూడా ఉన్నారు" అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించినట్లు న్యూస్ 18 పేర్కొంది. 90 మందికే అవకాశం.. ఈ తొలి మహిళల ఐపీఎల్ సీజన్లో మొత్తం ఐదు ఫ్రాంచైజీలు భాగం కానున్నాయి. ఒక్కో ప్రాంఛైజీకి 18 మంది క్రికెటర్లను కొనుగోలు చేసుకోనేందుకు బీసీసీఐ అనుమతించింది. అంటే మొత్తంగా 90 మంది మాత్రమే ఈ వేలంలో అమ్ముడుపోతారు. 90 స్థానాలకు ఇక మొత్తం ఐదు ఫ్రాంచైజీలను దక్కించుకోవడానికి ఆయా సంస్ధలు మొత్తంగా రూ.4669.99 కోట్లను వెచ్చించాయి. మహిళల ఐపీఎల్ జట్లను కొనుగోలు చేసిన సంస్థలు ఇవే 1. అదానీ స్పోర్ట్స్లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (అహ్మదాబాద్, 1289 కోట్లు) 2. ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ముంబై, 912.99 కోట్లు) 3. రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బెంగళూరు, 901 కోట్లు) 4. జేఎస్డబ్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఢిల్లీ, 810 కోట్లు) 5. క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (లక్నో, 757 కోట్లు) -
గుజరాత్ జెయింట్స్ హెడ్ కోచ్గా ఆసీస్ మాజీ క్రికెటర్
ఆరంభ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీ తమ జట్టు ప్రధానకోచ్గా ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ రచెల్ హేన్స్ను నియమించింది. అదే విధంగా తుషార్ అరోథేను బ్యాటింగ్ కోచ్గా, భారత మాజీ స్పిన్నర్ నూషిన్ అల్ ఖదీర్ను బౌలింగ్ కోచ్గా గుజరాత్ ఎంపికచేసింది. కాగా తొట్టతొలి అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ను సొంతం చేసుకున్న భారత జట్టుకు ప్రధాన కోచ్గా నూషిన్ అల్ ఖదీర్ పని చేశాడు. అతడి నేతృత్వంలోని భారత జట్టు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. ఇక ఈ ముగ్గురు గుజరాత్ జెయింట్స్ మెంటార్ మిథాలీ రాజ్తో కలిసి పనిచేయనున్నారు. రచెల్ హేన్స్.. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టులో చాలా కాలం పాటు కీలక సభ్యురాలిగా కొనసాగింది. అదే విధంగా ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టులో హేన్స్ భాగంగా ఉంది. ఆమె ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు 6 టెస్టులు, 77 వన్డేలు, 84 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించింది. ఆమె వన్డేల్లో అద్భుతంగా రాణించింది. హేన్స్ 77 వన్డేల్లో 2585 పరుగులు చేసింది. అందులో 19 అర్ధ సెంచరీలతో పాటు రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. డబ్ల్యూపీఎల్ వేలం ఎప్పుడంటే? మహిళల ఐపీఎల్కు సంబంధించిన తొట్టతొలి వేలం ఫిబ్రవరి 13న ముంబై వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా వేలంలో దాదాపు 1000 మంది WPLకు సంబంధించిన వివరాలు.. లీగ్లో మొత్తం జట్లు: 5 మ్యాచ్ల సంఖ్య (అంచనా): 22 వేదికలు (అంచనా): బ్రబౌర్న్ స్టేడియం (ముంబై), డీవై పాటిల్ స్టేడియం (ముంబై) జట్లు తదితర వివరాలు.. 1. అదానీ స్పోర్ట్స్లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (అహ్మదాబాద్, 1289 కోట్లు) 2. ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ముంబై, 912.99 కోట్లు) 3. రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బెంగళూరు, 901 కోట్లు) 4. జేఎస్డబ్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఢిల్లీ, 810 కోట్లు) 5. క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (లక్నో, 757 కోట్లు) చదవండి: BGT 2023: గెలుపెవరిది.. రికార్డులు ఏం చెబుతున్నాయి..? -
మహిళల ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?
మహిళల ఐపీఎల్ (WPL)కు సంబంధించిన తొట్టతొలి వేలానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ముందు అనుకున్న విధంగా వేలం ప్రక్రియను ఫిబ్రవరి తొలి వారంలో కాకుండా ఫిబ్రవరి 11, 13 తేదీల్లో నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. మెజార్టీ శాతం WPL ఫ్రాంచైజీలను (ఐదులో నాలుగింటిని) దక్కించున్న యాజమాన్యాలు దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో (ILT20) బిజీగా ఉండనుండటం వేలం తేదీల్లో మార్పులకు కారణంగా తెలుస్తోంది. అందుకే ILT20 ఫైనల్ ముగిసాక ఈ తంతుని నిర్వహించాలని ఆయా ఫ్రాంచైజీల యాజమాన్యాలు బీసీసీఐని కోరాయట. ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. మరోవైపు వేలం ప్రక్రియను ఢిల్లీ లేదా ముంబై నగరాల్లో నిర్వహించే అవకాశం ఉంది. మహిళల టీ20 వరల్డ్కప్ ముగిశాక మార్చి 4 - 24 మధ్యలో WPLను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. WPLకు సంబంధించిన వివరాలు.. లీగ్లో మొత్తం జట్లు: 5 మ్యాచ్ల సంఖ్య (అంచనా): 22 వేదికలు (అంచనా): బ్రబౌర్న్ స్టేడియం (ముంబై), డీవై పాటిల్ స్టేడియం (ముంబై) జట్లు తదితర వివరాలు.. 1. అదానీ స్పోర్ట్స్లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (అహ్మదాబాద్, 1289 కోట్లు) 2. ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ముంబై, 912.99 కోట్లు) 3. రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బెంగళూరు, 901 కోట్లు) 4. జేఎస్డబ్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఢిల్లీ, 810 కోట్లు) 5. క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (లక్నో, 757 కోట్లు) -
అతివల క్రికెట్కు అందలం...
మహిళల క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం. మన దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన లీగ్ పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు తొలి అంకం పూర్తయింది. అదీ అలాంటి ఇలాంటి తరహాలో కాదు. బీసీసీఐకి కాసుల వర్షం కురిపించేలా, అతివల ఆటను అందలం ఎక్కించేలా లీగ్ దూసుకొచ్చింది. అనూహ్య రీతిలో ఐదు జట్లను ఏకంగా రూ. 4669.99 కోట్లకు అమ్మిన బోర్డు తమ ఖజానాను మరింత పటిష్టం చేసుకోగా... ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా క్రికెటర్లు బంగారు భవిష్యత్తును ఆశించేలా ఉన్న లీగ్ విలువ కొత్త ఆశలు రేపింది. పురుషుల లీగ్తో పోలిస్తే ‘ఇండియన్’ లేకుండా ‘ఉమెన్ ప్రీమియర్ లీగ్’ అనే కొత్త పేరుతో లీగ్ జరగనుంది. ఇక మిగిలింది వేలం ద్వారా ప్లేయర్ల ఎంపిక... ఆపై తొలి టోర్నీ సమరానికి సర్వం సిద్ధం! ముంబై: దాదాపు ఐదున్నరేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్లో ఫైనల్ చేరిన నాటినుంచి అంతకంతకూ తమ స్థాయిని పెంచుకుంటూ వచ్చిన భారత మహిళల క్రికెట్లో ఇదే మేలిమలుపు... పురుషుల ఐపీఎల్ తరహాలోనే తమకంటూ ఒక లీగ్ ఉండాలంటూ కోరుకుంటూ వచ్చిన మహిళల స్వప్నం భారీ స్థాయిలో సాకారం కానుంది. ఐపీఎల్ తరహాలో నిర్వహించే తొలి లీగ్ కోసం జట్లను సొంతం చేసుకునేందుకు బీసీసీఐ నిర్వహించిన వేలం అద్భుతం చేసింది. మొత్తం రూ. 4666.99 కోట్లకు ఐదు టీమ్లను వేర్వేరు సంస్థలు సొంతం చేసుకున్నాయి. లీగ్కు ‘హోం గ్రౌండ్’లుగా నిలిచే ఐదు నగరాలుగా అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో ఖరారయ్యాయి. ఇందులో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం అదానీ సంస్థ అత్యధికంగా రూ. 1289 కోట్లు వెచ్చించింది. మూడు పురుషుల ఐపీఎల్ టీమ్ యాజమాన్యాలు ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఇక్కడా భారీ మొత్తాలను మహిళల టీమ్లను సొంతం చేసుకోగా... ఐదో జట్టును క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ గెలుచుకుంది. భారీ డిమాండ్తో... మహిళల లీగ్ జట్లను సొంతం చేసుకునేందుకు 17 సంస్థలు బిడ్లను కొనుగోలు చేసి పోటీ పడ్డాయి. 2008లో తొలిసారి పురుషుల ఐపీఎల్ ప్రకటించినప్పుడు జట్ల కొనుగోలుకు సంబంధించి బీసీసీఐ కనీస విలువను నిర్ణయించింది. ఈసారి అలాంటిది లేకుండా ఆసక్తి ఉన్నవారు తాము అనుకున్న మొత్తానికి బిడ్లు వేశారు. ఇటీవలే మహిళల లీగ్ ప్రసార హక్కులను రూ. 951 కోట్లకు వయాకామ్ 18 గ్రూప్ సొంతం చేసుకోవడం మహిళల మ్యాచ్లకూ పెరిగిన ఆదరణను చూపించింది. దాంతో ఫ్రాంచైజీలపై కూడా ఆసక్తి నెలకొంది. నిబంధనల ప్రకారం లీగ్ ప్రసార హక్కుల్లో 80 శాతం మొత్తాన్ని ఐదేళ్ల పాటు ఐదు ఫ్రాంచైజీలకు పంచుతారు. అందువల్ల కూడా ఎలా చూసినా నష్టం లేదని భావన బిడ్లర్లలో కనిపించింది. పురుషుల లీగ్లో టీమ్ను దక్కించుకోవడంలో విఫలమైన అదానీ గ్రూప్ ఈసారి మహిళల క్రికెట్లో అడుగు పెట్టగా, గుజరాత్ టైటాన్స్ స్పాన్సర్లలో ఒకటైన క్యాప్రి గ్రూప్ కూడా టీమ్ను సొంతం చేసుకుంది. 2008లో తొలిసారి పురుషుల ఐపీఎల్లో ఎనిమిది జట్లకు కలిపి రూ. 28,943.6 కోట్లు (అప్పటి డాలర్ విలువ ప్రకారం) బోర్డు ఖాతాలో చేరాయి. ఇప్పుడు మారిన విలువ ప్రకారం చూసినా మహిళల లీగ్లో వచ్చిన మొత్తం చాలా ఎక్కువని, నాటి రికార్డు బద్దలైందని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. మార్చిలో టోర్నీ... డబ్ల్యూపీఎల్ నిర్వహణకు సంబంధించిన తేదీల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఫిబ్రవరి 26న దక్షిణాఫ్రికాలో మహిళల టి20 వరల్డ్కప్ ముగిసిన వెంటనే సాధ్యమైంత తొందరగా మ్యాచ్లు జరిపే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో దీనికి సంబంధించి వేలం నిర్వహిస్తారు. ఒక్కో జట్టుకు ప్లేయర్ల కోసం గరిష్టంగా రూ. 12 కోట్లు ఖర్చు చేయవచ్చు. కనీసం 15 మందిని, గరిష్టంగా 18 మందిని టీమ్లోకి తీసుకోవచ్చు. ఇందులో ఐదుగురు విదేశీ ప్లేయర్లు ఉంటారు. తొలి సీజన్లో మొత్తం 22 మ్యాచ్లు జరుగుతాయి. మహిళల క్రికెట్లో ఈ రోజునుంచి కొత్త ప్రయాణం మొదలైందంటూ వ్యాఖ్యానించిన బోర్డు కార్యదర్శి జై షా కొత్త లీగ్కు ‘మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. ‘ఉమెన్ బిగ్బాష్ లీగ్’ తరహాలో ‘ఉమెన్ ఐపీఎల్’ అంటూ ఇప్పటి వరకు ప్రచారంలో ఉండగా... డబ్ల్యూఐపీఎల్ అని కాకుండా కాస్త భిన్నంగానే పేరును ‘డబ్ల్యూపీఎల్’కే బోర్డు పరిమితం చేసింది. FIVE TEAMS FIVE VENUES 🏟️ Welcome to the Women's Premier League 🙌🙌#WPL pic.twitter.com/29MNGEDDXe — BCCI (@BCCI) January 25, 2023 వివరాలు ఇలా ఉన్నాయి.. 1. అదానీ స్పోర్ట్స్లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (అహ్మదాబాద్, 1289 కోట్లు) 2. ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ముంబై, 912.99 కోట్లు) 3. రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బెంగళూరు, 901 కోట్లు) 4. జేఎస్డబ్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఢిల్లీ, 810 కోట్లు) 5. క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (లక్నో, 757 కోట్లు) 𝐁𝐂𝐂𝐈 𝐚𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐬 𝐭𝐡𝐞 𝐬𝐮𝐜𝐜𝐞𝐬𝐬𝐟𝐮𝐥 𝐛𝐢𝐝𝐝𝐞𝐫𝐬 𝐟𝐨𝐫 𝐖𝐨𝐦𝐞𝐧’𝐬 𝐏𝐫𝐞𝐦𝐢𝐞𝐫 𝐋𝐞𝐚𝐠𝐮𝐞. The combined bid valuation is INR 4669.99 Cr A look at the Five franchises with ownership rights for #WPL pic.twitter.com/ryF7W1BvHH — BCCI (@BCCI) January 25, 2023