yamuna river
-
మహా కుంభమేళాలో అంబానీ ఫ్యామిలీ (ఫోటోలు)
-
ఢిల్లీ పోలింగ్.. కేజ్రీవాల్కు షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు షాక్ తగిలింది. యమునా నదిలో విషం కలిపారని చేసిన వ్యాఖ్యలకుగానూ ఆయనపై మంగళవారం హర్యానాలో ఓ కేసు నమోదైంది.ఢిల్లీకి వచ్చే యమునా నది నీటిలో హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విషం కలిపిందని అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆరోపించిన సంగతి తెలిసిందే. దమ్ముంటే తన ఆరోపణలు తప్పని నిరూపించాలంటూ రాజకీయ ప్రత్యర్థులకు ఆయన సవాల్ కూడా విసిరారు. దీంతో హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ.. యమునా నీటిని తాగి మరీ కేజ్రీవాల్ విమర్శలను తిప్పికొట్టారు. అదే సమయంలో.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని మోదీ(PM Modi), కేజ్రీవాల్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు ఈ అంశం కేంద్ర ఎన్నికల సంఘం దాకా కూడా చేరింది. అయితే.. అయితే.. ఈ అంశంపై తాజాగా షాబాద్(Shahbad)కు చెందిన జగ్మోహన్ మంచందా అనే లాయర్, కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రకటనలతో కేజ్రీవాల్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో జగ్మోహన్ పేర్కొన్నారు. దీంతో బీఎన్ఎస్ 192, 196(1),197(1),248(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన కురుక్షేత్ర పోలీసులు విచారణ చేపట్టారు. -
కాంగ్రెస్ ఆఖరి పోరాటం..!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా తలపడుతున్న కాంగ్రెస్..తన అస్థిత్వాన్ని నిలుపుకునేందుకు ఆఖరి పోరాటం చేస్తోంది. పూర్వ వైభవాన్ని చాటుకునే పరిస్థితులు లేకున్నా, కనీస 10 స్థానాలనైనా గెలుచుకునేలా చివరి దశ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాం«దీ, మల్లికార్జున ఖర్గేలు ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. సోమవారం సైతం వీరు తమ ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. నిజానికి 1998 నుంచి 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్, ప్రస్తుత ఎన్నికల్లో కనీస ఖాతా తెరవాలని గట్టి పట్టుదలతో ఉంది. 2008లో 48శాతం ఓట్లతో 43 సీట్లు సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ 2013లో 24.70 శాతం సీట్లతో 7 సీట్లకు పరిమితమయింది. తర్వాత 2015 ఎన్నికల్లో కాంగ్రెస్కు 9.7 శాతం, 2020లో 4.3 శాతం ఓట్లు రాగా ఒక్క సీటును గెలువలేదు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 18శాతం ఓట్ల మేర సాధించింది. ఈసారి దాన్ని కాస్త పెంచుకున్నా 5 నుంచి 10 స్థానాలు గెలువచ్చనే అంచనాల్లో ఉంది. అయితే ఆప్తో పొత్తు లేకపోవడం, ప్రధాన పోటీ మొత్తంగా బీజేపీ, ఆప్ల మధ్యే కొనసాగుతుండటంతో కాంగ్రెస్ను పట్టించుకునే వారే కరువయ్యారు. ఢిల్లీని పట్టి పీడిస్తున్న యమునా నది కాలుష్య అంశాన్ని రాజకీయ అస్త్రంగా మాలుచుకునేందుకు రాహుల్గాంధీ స్వయంగా కాలుష్య నురగలు కక్కుతున్న యమునాలో బోటులో పర్యటించగా, అది ఏమేరకు ప్రభావితం చేస్తుందన్నది ప్రశ్నగానే ఉంది. ఇక ఢిల్లీని ప్రధాని మోదీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మొత్తంగా నాశనం చేశారని, లిక్కర్ మాఫియాలో ప్రభుత్వ పెద్దలంతా కూరుకుపోయిరని, శీష్ మహల్లో విలాసవంతమైన జీవితాన్ని కేజ్రీవాల్ గడిపారంటూ ఎక్కుపెట్టిన అ్రస్తాలు ఎంతవరకు ఓటర్లను తాకాయన్నది తేలాలి. మేనిఫెస్టో హామీలనే ప్రధానాస్త్రాలుగా ప్రజల్లోకి తీసుకెళుతూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా పింఛను రూ.2,500 నుంచి రూ.5,000లకు పెంపు, సోమవారం ప్రచారానికి చివరి రోజు కావడంతో తెలంగాణ, పంజాబ్, హరియాణా నేతలనూ ప్రచారంలోకి దించింది. -
‘యమున’పై ఈసీకి కేజ్రీవాల్ వివరణ
న్యూఢిల్లీ: ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఎన్నికల కమిషన్ (ఈసీ) కార్యాలయానికి వచ్చారు. యుమునా నదీ జలాల్లో విషం కలిసిందంటూ చేసిన వ్యాఖ్యలపై అధికారులు జారీ చేసిన నోటీసుకు ఆయన సమాధానం ఇచ్చారు. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి సరఫరా చేసే యమునా జలాల్లో అమోనియాను కలిపి విషపూరితం చేసిందని ఈ నెల 27న కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే, ఢిల్లీ జల్ బోర్డు ఇంజనీర్లు ఆ విషయం తెలిసి, వెంటనే ఢిల్లీకి ఆ నీరు రాకుండా ఆపేశారు. ఆ నీరే తాగు నీటిలో కలిసినట్లయితే ఎంతో పెద్ద విపత్తు జరిగి ఉండేది’అని అన్నారు. దీనిపై ఈసీ కేజ్రీవాల్కు రెండుసార్లు నోటీసులు పంపించింది. దీనిపై శుక్రవారం కేజ్రీవాల్ ఈసీ అధికారుల ఎదుట తన వాదనను వివరించారు. జనవరి 15న 3.2 పీపీఎం ఉన్న అమోనియా స్థాయిలు జనవరి 27వ తేదీ నాటికి 7 పీపీఎంకు పెరిగినట్లు తెలిపే నివేదికను అందజేశారు. ఆయన వెంట సీఎం ఆతిశీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఉన్నారు. ఈసీని కలిసేందుకు ఆయన ముందుగా ఎలాంటి అపాయింట్మెంట్ తీసుకోలేదని ఈసీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తుది గడువు సమీపిస్తున్నందున కేజ్రీవాల్తో సమావేశమై ఆయన వాదనను సావధానంగా విన్నట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ వాసులకు విష జలాలను సరఫరా చేసేందుకు బీజేపీ పన్నిన కుట్రను కేజ్రీవాల్ ఈసీ అధికారులకు వివరించారని అనంతరం ఆప్ తెలిపింది. అమోనియా కలుషితాలున్న విషయం తెలిపేందుకు మూడు బాటిళ్లలో యమునా నీటిని కూడా తీసుకెళ్లినట్లు వెల్లడించింది. దీనిపై తాము దర్యాప్తు చేపట్టనున్నట్లు ఈసీ తెలిపిందని పేర్కొంది. -
యమునలో స్నానమెప్పుడు చేస్తారు
న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీ రాజకీయాలు యమునా నది కాలుష్యం చుట్టూ తిరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గురువారం యమునా నదిలో విహరిస్తున్న వీడియోను విడుదల చేసి.. ఈ మురికి కాసారంలో ఎప్పుడు స్నానం చేస్తారని అరవింద్ కేజ్రీవాల్కు సవాల్ విసిరారు. యమునా కాలుష్యం ప్రధాని నరేంద్ర మోదీ, కేజ్రీవాల్ల నిర్లక్ష్యం, అవినీతి ఫలితమేనని రాహుల్ ఆరోపించారు. రాహుల్ బుధవారం యమునా నదిలో విహరించి.. నది దుస్థితిని వీడియో తీశారు. ‘నాలాగా మీరు ఢిల్లీ వాసులైనట్లయితే యమునా నది పరిస్థితిని చూసి తీవ్రంగా విచారిస్తూ ఉంటారు. బుధవారం ఉదయం నేను యమునా నదికి వెళ్లాను. స్థానికులు, పడవలు నడిపేవాళ్లు, ఉద్యమకారులతో మాట్లాడాను. యమునా నదిలో ఎటు చూసినా చెత్తే. మురికినీళ్లే. దుర్వాసన వెదజల్లుతోంది. నీటి శుద్ధి తర్వాత వ్యర్థాలను తిరిగి యమునలోనే వదిలేస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. యమునా నదిలో స్నానమాచరించడానికి గతంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేవాళ్లు. ఇప్పుడు అతికొద్ది మంది మాత్రమే వస్తున్నారు. అదీ తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి’అని రాహుల్ అన్నారు. ‘ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యమునను శుద్ధి చేస్తామని కేజ్రీవాల్ శుష్క వాగ్దానాలు చేస్తున్నారు. నేను యమునా నదిలో మునక వేస్తాను లేదంటే మాకు ఓటు వేయకండి అంటూ సుదీర్ఘ ఉపన్యాసాలిస్తున్నారు. ఇప్పుడు యమునా నీటిని ఒక సీసాలో తీసుకొని ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. ఇది యమునా నదిని అవమానించడమే కాదు.. ఢిల్లీ ప్రజలను అపహస్యం చేయడమే’అని రాహుల్ విమర్శించారు. ‘కేజ్రీవాల్ జీ 2025 వచ్చింది. మీరెప్పుడు యమునా నదిలో మునక వేస్తారు. ఢిల్లీ ఎదురుచూస్తోంది’అని రాహుల్ ప్రశ్నించారు. యమున శుద్ధి పేరిట డబ్బులు మూటగట్టుకున్నారని ఆరోపించారు. -
యమునా నది వివాదం.. ఎప్పుడేం జరిగింది?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యమునా నదిపై రాజకీయ వివాదం చెలరేగింది. ఢిల్లీ జీవనాడిగా భావించే యమునా నదిపై రాజకీయ పార్టీలు వాదోపవాదాలకు దిగాయి. యమునా నది (Yamuna River) కాలుష్యానికి మీరు కారణమంటే.. మీరు కారణమని అధికార, విపక్షాలు వాదులాడుకుంటున్నాయి. యమునా నది కాలుష్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం (Political Heat) రేగింది. న్యాయపరంగానూ ఆయనకు చిక్కులు ఎదురయ్యాయి.యమునా నదిని హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం విషతుల్యం చేస్తోందని బుధవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతో రచ్చ మొదలైంది. కేజ్రీవాల్ ఆరోపణలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తిప్పికొట్టారు. మరోవైపు కేజ్రీవాల్కు హరియాణా కోర్టు, ఎన్నికల సంఘం తాఖీదులు పంపాయి. యమునా నది కాలుష్యంపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని ఆదేశించాయి. కేజ్రీవాల్ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా దీటుగా స్పందించడంతో వివాదం మరింత ముదిరింది.హస్తిన జీవనాడిదేశరాజధాని ఢిల్లీకి యమునా నది జీవనాడి వంటిది. హస్తిన జనాభాలో 70 శాతం మందికి నీటిని అందించే ఈ నది ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగివుంది. అయితే దేశంలోని ఇతర ప్రధాన నదుల మాదిరిగానే యమున కూడా కాలుష్యకాసారంగా మారిపోయింది. పట్టణీకరణ బాగా పెరగడం.. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలను నిరంతరం నదిలోకి వదులుతుండడంతో యమున కాలుష్యం బారిన పడింది. యమున నదిపై ఢిల్లీ, హరియాణా రాష్ట్రాల మధ్య ఎన్నో ఎళ్లుగా తగాదాలు నడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది.యమునా నది జలాల పంపిణీ వివాదం ఇలా...1993లో ఢిల్లీ శాసనసభ ఏర్పడింది. యమునా నదీ జలాల పంపిణీపై 1994, మే నెలలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీనిపై ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేశారు. అయితే ఈ వ్యవహారం 1995, మార్చి 31న సుప్రీంకోర్టుకు చేరింది. ఢిల్లీలో తాగునీటి కొరతను తగ్గించేందుకు యమునా నదిలో నీటి ప్రవాహాన్ని సక్రమంగా నిర్వహించేలా హరియాణాకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర తీర్పు వెలువరించింది. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ఢిల్లీకి వెంటనే నీరు విడుదల చేయాలని ఆదేశించింది. 5 రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని సూచించింది. 1996, ఫిబ్రవరిలోనూ మరోసారి ఇలాంటి ఆదేశాలిచ్చింది. వజీరాబాద్, హైదర్పూర్లోని రెండు నీటి రిజర్వాయర్లు, ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి ఢిల్లీకి నీరు ఇవ్వాలని పేర్కొంది.2018, ఏప్రిల్ నెలలో వజీరాబాద్ రిజర్వాయర్లో నీటిమట్టం పడిపోవడంతో అప్పటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపుతట్టింది. సమస్యను పరిష్కరించాలని ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ వివాదానికి సంబంధించి కోర్టులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో ఉన్న అన్ని కేసులను ఉపసంహరించుకుంటేనే నీటిని విడుదల హరియాణాలోని అప్పటి మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తామని హామీ ఇచ్చింది.2021, మార్చిలో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. హరియాణాకు వ్యతిరేకంగా ఢిల్లీ జల్ బోర్డు(DJB) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. యమునా నీటి పంపిణీపై 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హరియాణా ప్రభుత్వం ధిక్కరించిందని కోర్టుకు తెలిపింది. దీనిపై హరియాణా ప్రభుత్వం సర్కారు స్పందిస్తూ.. తమ తప్పు ఏమీలేదని, హస్తిన సర్కారు అసమర్థత కారణంగానే నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నమైందని వాదించింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వ పిటిషన్ను 2021, జూలైలో సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.చదవండి: హరియాణాలో ఉన్నది మనుషులు కాదా?2023, జూలైలో దేశ రాజధానికి వరదలు పోలెత్తాయి. ఈ సమయంలో యమునానగర్ జిల్లాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి ఉద్దేశపూర్వకంగా హరియాణా నీటిని విడుదల చేసిందని ఆప్ ప్రభుత్వం ఆరోపించింది. కాగా, యమునా జలాల్లో తన వాటాను విడుదల చేయకుండా ఢిల్లీకి వ్యతిరేకంగా హరియాణా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ 2024, జూన్ నెలలో అప్పటి ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి, ప్రస్తుత సీఎం అతిషి నిరాహార దీక్ష చేశారు. తాజాగా కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలతో యమున నదీ వివాదం ఢిల్లీ ఎన్నికల్లో తెరమీదకు వచ్చింది. -
యమునా నీటి వివాదంపై ప్రధాని మోదీ ఫైర్
-
యమున నీటిని తాగే దమ్ముందా?
న్యూఢిల్లీ: యమునా నది నీరు విషపూరితంగా మారుతున్న సంగతి నిజమేనని, ఈ నీటిలో అమ్మోనియం స్థాయి ఇటీవల విపరీతంగా పెరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలోని నీటి శుద్ధి కేంద్రాలు సక్రమంగా పనిచేయకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నది నీటిలో అమ్మోనియా స్థాయి 7 పీపీఎం ఉందన్నారు. ఇది కచ్చితంగా విషంతో సమానమేనని అన్నారు. కేజ్రీవాల్ బుధవారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు యమునా నది నీటిని ప్రజల సమక్షంలో బహిరంగంగా తాగే దమ్ముందా? అని సవాలు విసిరారు. ఎగువ రాష్ట్రంలో హరియాణాలో ఈ నదిలో విషపదార్థాలు కలుస్తున్నాయని మరోసారి ఆరోపించారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం నదిని విషతుల్యం చేస్తోందన్నారు. కేజ్రీవాల్కు హరియాణా కోర్టు సమన్లుయమున నదిలో విషం కలుపుతున్నారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై హరియాణా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హరియాణా ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణలను తప్పుపట్టింది. ఫిబ్రవరి 17వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ బుధవారం కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. యమునా నదిని హరియాణా ప్రభుత్వం విషతుల్యం చేస్తున్నట్లు ఆధారమేంటో చెప్పాలని, నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. -
‘ఆప్’ను ప్రజలు క్షమించరు
న్యూఢిల్లీ: యమున నదిలో విషం కలుపుతున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)చేసిన ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) ఓటమి తప్పదని తేలడంతో ఆప్ నాయకులు మతితప్పి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలోని కర్తార్ నగర్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆప్ నాయకులకు, చార్లెస్ శోభారాజ్కు మధ్య పెద్ద తేడా లేదని అన్నారు. పైకి అమాయకంగా కనిపిస్తూ ప్రజల సొమ్మును దోచుకోవడంలో వారు ఆరితేరిపోయారని దుయ్యబట్టారు. ‘‘వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినవారు, అద్దాల మేడల్లో నివసిస్తున్నవారు పేదల సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. ఓటమి భయంతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో యుమున నదిని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు దగాకోరు మాటలు చెబుతోంది. యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇస్తే ఓట్లు రావని అంటోంది. ఇది నిజంగా సిగ్గుచేటు. ప్రజలకు పరిశుభ్రమైన నీరు దొరకడం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇష్టంలేదు. ఢిల్లీలోని పూర్వాంచల్ ప్రజలు మురికికూపంలోనే ఛాత్ పూజలు చేసుకోవాలని కోరుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ దేశ చరిత్రలో అతిపెద్ద పాపం చేసింది. ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. మాజీ ముఖ్యమంత్రి(అరవింద్ కేజ్రీవాల్) హరియాణా ప్రజలపై నిందలు వేశారు.యమునా నదిలో విషం కలిపారని అన్నారు. హరియాణాలో ఉన్నది మనుషులు కాదా? వారికి ఢిల్లీలో కుటుంబ సభ్యులు, బంధువులు లేరా? సొంత మనుషులు చావాలని నదిలో విషం కలుపుతారా? యమున నదిలో హరియాణా నుంచి వస్తున్న నీటినే నాతోపాటు ఢిల్లీ ప్రజలు, దౌత్యవేత్తలు, న్యాయమూర్తులు కూడా తాగుతున్నారు. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం నదిలో విషం కలిపి నాకు హాని కలిగిస్తుందని ఎవరైనా అనుకుంటారా? ఆప్ నాయకులు అసలేం మాట్లాడుతున్నారు? తప్పులను క్షమించే గుణం మన భారతీయుల్లో ఉంది. కానీ, ఉద్దేశపూర్వకంగా పాపాలు చేస్తే ఎవరూ క్షమించరు. ఆప్ పాపాత్ములను మన్నించే ప్రసక్తే లేదు’’అని మోదీ అన్నారు. -
అరవింద్ కేజ్రీవాల్కు బిగ్ షాక్!
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, ఆప్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో యమనా నది నీటి విషయంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. యమునా నీటిలో విషం కలిపారని వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ.. యమునా నీటిని తాగారు. అనంతరం, నీటిని నెత్తిన జల్లుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ యుమునా నది నీటిలో విషం కలిపారని హర్యానా బీజేపీ ప్రభుత్వం మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపించారు. యుమునా నదిలోకి కావాలనే పారిశ్రామిక వ్యర్థాలను వదులుతోందన్నారు. ఉద్దేశపూర్వకంగానే పారిశ్రామిక వ్యర్థాలను డంప్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదే అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ (Atishi) విలేకరులతో మాట్లాడుతూ.. యమునను కలుషితం చేయడం ‘జల ఉగ్రవాదం’ అని అభివర్ణించారు. హర్యానా నుంచి ఢిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదిలో అమ్మోనియం స్థాయిలు ఆరు రెట్లు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీ సమీపంలోని పల్లా గ్రామం వద్ధ యమునా నీటిని హర్యానా సీఎం సేవించారు. దీంతో, కేజ్రీవాల్ ఆరోపణలకు ఆయన చెక్ పెట్టారు.बेहिचक और बेझिझक पवित्र यमुना के जल का आचमन किया हरियाणा की सीमा पर।आतिशी जी तो आईं नहीं।कोई नया झूठ रच रही होंगी।झूठ के पांव नहीं होते।इसलिए आप-दा का झूठ चल नहीं पा रहा।दिल्ली की देवतुल्य जनता इन फ़रेबियों को पहचान चुकी है।5 फ़रवरी को आप-दा के फरेब काल का अंत निश्चित है।… pic.twitter.com/EAG4pXjCFr— Nayab Saini (@NayabSainiBJP) January 29, 2025ఇదిలా ఉండగా.. యమునా నదిపై ఆరోపణలను హర్యానా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కేజ్రీవాల్పై హర్యానా ప్రభుత్వం కేసు నమోదు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి విపుల్ గోయల్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘కేజ్రీవాల్ మా ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ఆరోపణల వల్ల హర్యానా, ఢిల్లీలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కేజ్రీవాల్ నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకునేది లేదు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటాం. కేజ్రీవాల్ మాటలు అవాస్తవమని నిరూపిస్తాం’ అని అన్నారు.మరోవైపు.. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేడు ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రధాని తాగే నీళ్లలో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతుందా అటూ ప్రజలను సూటిగా ప్రశ్నించారు. హర్యానా ప్రజల బంధువులు ఢిల్లీలో కూడా ఉన్నారని.. తమ సొంత ప్రజలు తాగే నీటిలో ఎవరైనా విషం కలుపుతారా?. ఆ నీటిని తాగే వారిలో ప్రధాని కూడా ఉన్నారన్న సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎన్నికల్లో ఓడిపోతారనే కారణంగానే ఆప్ నేతలు ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. -
రాత్రి 8 కల్లా ఆధారాలు చూపండి
న్యూఢిల్లీ: హరియాణాలోని అధికార భాజపా యమునా నదిలోకి విషయం కలిపేందుకు ప్రయత్నించిందన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ ఆరోపణలపై ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. ‘‘తప్పుడు ఆరోపణలు చేస్తే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. విషం కలిపడానికి ప్రయత్నించారు మీరు చేసిన ఆరోపణలకు బలం చేకూర్చే అన్ని ఆధారాలను జనవరి 29వ తేదీ రాత్రి 8 గంటలలోపు మాకు సమరి్పంచండి. విషం కలుపుతుంటే అడ్డుకున్న ఢిల్లీ జల్ బోర్డ్ ఇంజనీర్ల వివరాలూ ఇవ్వండి’’ అని కేజ్రీవాల్కు ఈసీ మంగళవారం ఒక లేఖ రాసింది. హరియాణా నుంచి దిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదీ ప్రవాహంలో అమ్మోనియా స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్లు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఆరోపించడం తెల్సిందే. పొరుగు రాష్ట్రాలకు తాకిన కాలుష్య కాటుయమునా కాలుష్య అంశం ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. కాలుష్యానికి హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాన కారణమని, పారిశ్రామిక వ్యర్ధాలను యమునా కలిపి ఢిల్లీలోకి విషాన్ని పంపుతున్నారంటూ కేజ్రీవాల్ రెండ్రోజుల కిందట తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదో రకంగా జీవజల యుద్ధం, వాటర్ టెర్రరిజం అంటూ హరియాణా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం ఆతిశీ సైతం హరియాణా నుంచి ఢిల్లీకి ప్రవహిస్తున్న నదీ జలాల్లో వ్యర్థాలు, అమ్మోనియా స్థాయిలో చాలా ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. దీనిపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలిసి ఆమె బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఫిర్యాదుచేశారు. హరియాణా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీ ప్రజలకు నీటి సరఫరా ప్రమాదంలో పడిందని ఆరోపించారు. మునాక్ కాలువ నుంచి అదనపు జలాలను విడుదలచేయాలని మాన్ డిమాండ్చేశారు. దీనిపై హరియాణా సీఎం నయాబ్ సింగ్ షైనీ సైతం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఎగువ రాష్ట్రాలతో సత్సంబంధాలు క్షీణించేలా, ఢిల్లీ ప్రజలను అనవసరంగా భయపెట్టేలా కేజ్రీవాల్ ఆరోపణ చేశారు. వీటిపై లెఫ్టినెంట్ గవర్నర్ చర్యలు తీసుకోవాలి’’అని ఆయన డిమాండ్చేశారు. ఓటమి భయం కేజ్రీవాల్ను నిస్సహాయంగా మార్చిందని, ఢిల్లీ ప్రజలను భయపెట్టి ఓట్ల లబ్ధి పొందేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఆరోపించారు. బీజేపీ, ఆప్ పారీ్టలు తాము అధికారంలోకి వస్తే యమునా కాలుష్యాన్ని అరికట్టి పునరుజ్జీవం చేస్తామని తమతమ మేనిఫెస్టోల్లో ప్రకటించడంతో ఈ అంశం ఇప్పుడు ఎన్నికల హామీల్లో ప్రధానమైనదిగా మారుతోంది. -
యమునా నీళ్లు.. ఢిల్లీ-హర్యానా మధ్య మాటల యుద్ధం
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ యమునా నదిపై ఢిల్లీ, హర్యానా ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఢిల్లీ ప్రజలు తాగునీటికి ఉపయోగించే యమునా నదీ జలాల్లో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతోందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలకు దిగారు. అయితే ఈ అంశం పెను దుమారానికి దారి తీసింది. యమునా నదీ జలాల్లో విషం కలుపుతున్నారని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై హర్యానా ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యాఖ్యలకుగాను కేజ్రీవాల్పై పరువునష్టం కేసు పెడతామని హెచ్చరించింది. అయితే.. హర్యానా ప్రభుత్వం కేసు పెడతామని వార్నింగ్ ఇవ్వడంపై కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ‘నన్ను కేసులతో భయపెట్టలేరు. నా మీద కేసు పెట్టండి. నన్ను చంపండి. ఉరి తీయండి.ఢిల్లీ ప్రజలు తాగే నీళ్లను మాత్రం విషపూరితం చేయకండి. ఢిల్లీ ప్రజలను చంపకండి’అని కేజ్రీవాల్ బీజేపీని కోరారు. ఢిల్లీ ప్రజలు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని శపిస్తారు’’ అని కేజ్రీవాల్ అన్నారు.కాగా,ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.‘యమునా నదిలో ఏదో కలుస్తోందని వాటర్బోర్డు అనుమానం వ్యక్తం చేసింది. పక్కనున్న హర్యానా ప్రభుత్వం ఢిల్లీ ప్రజలు తాగే నీటిలో విషం కలిపింది. దీంతో కొందరు ఢిల్లీ వాసులు మరణిస్తే అది నాపై నెట్టవచ్చనుకుంటున్నారు’అని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇదే విషయంపై ఢిల్లీ సీఎం అతిషి కూడా స్పందించారు. యమునా నది జలాల్లో అమ్మోనియా స్థాయి అధికంగా ఉందని, వాటిని శుద్ధి చేసి తాగునీటిగా మార్చడం అసాధ్యమన్నారు. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారామె. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 8వ తేదీ ఫలితాలు వెల్లడవనున్నాయి. -
మన్మోహన్ చితాభస్మం నిమజ్జనం
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చితాభస్మాన్ని కుటుంబసభ్యులు సిక్కు ఆచారాల ప్రకారం ఆదివారం మజ్జు కా తిలా గురుద్వారా సమీపంలోని యమునా నదిలో కలిపారు. ఆదివారం ఉదయం నిగమ్బోధ్ ఘాట్లో చితాభస్మాన్ని కుటుంబసభ్యులు సేకరించారు. మనోహ్మన్ భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు ఉపీందర్ సింగ్, దమన్ సింగ్, అమృత్ సింగ్ తమ బంధువులతో కలిసి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. సిక్కు మతాచారాలను అనుసరించి జనవరి ఒకటో తేదీన మన్మోహన్ అధికార నివాసం మోతీలాల్ నెహ్రూ మార్గ్లోని మూడో నంబర్ భవనంలో ‘అఖండ్ పథ్’జరపనున్నారు. దీంతోపాటు, జనవరి 3న భోగ్, అంతిమ్ అర్దాస్, కీర్తన్ కార్యక్రమాలను పార్లమెంట్ కాంప్లెక్స్ సమీపంలోని రకాబ్ గంజ్ గురుద్వారా నిర్వహించనున్నారు. కాగా, ఆదివారం జరిగిన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలెవరూ పాల్గొనకపోవడాన్ని బీజేపీ తప్పుపట్టింది. అత్యంత గౌరవనీయుడైన సింగ్ జీ పట్ల కాంగ్రెస్ తీరు విచారకరమని పేర్కొంది. -
కాలుష్యంతో నురగలు కక్కుతున్న యమున
-
యమునలో మునకేసిన ఢిల్లీ బీజేపీ చీఫ్.. ఆస్పత్రిలో చికిత్స
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపేందుకు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ పెద్ద సాహసమే చేశారు. కాలుష్య కాసారంగా మారి విషపు నురగలు కక్కుతున్న యమునా నదిలో సచ్దేవ మునిగారు. నదిలో మునిగిన మూడు రోజుల తర్వాత సచ్దేవపై యమున కాలుష్యం ఎఫెక్ట్ పడింది.చర్మంపై దురదలు రావడంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సచ్దేవను శనివారం(అక్టోబర్ 26) ఆస్పత్రిలో చేర్చి చికిత్సనందిస్తున్నట్లు బీజేపీ పార్టీ సోషల్మీడియా వెల్లడించింది. యమునలో కాలుష్యం ఇంతగా పెరగడానికి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాలే కారణమని బీజేపీ విమర్శించింది. కాగా, ఢిల్లీలో కాలుష్య నివారణకు కేటాయించాల్సిన నిధులను ఆప్ ప్రభుత్వం దారి మళ్లించిందని నిరసన తెలపడంలో భాగంగా సచ్దేవ గురువారం యమునలో మునిగారు. అయితే సచ్దేవ యమునలో మునగడంపై ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్రాయ్ విమర్శలు గుప్పించారు. అదంతా ఒక పెద్ద డ్రామా అని కొట్టిపారేశారు.ఇదీ చదవండి: అక్కడ కనిపించని దీపావళి వేడుకలు.. కారణమిదే -
హస్తినలో యమునా తీరం... కాలుష్య కాసారం!
చూసేందుకు పాల నురగలా తళతళా మెరిసిపోతూ కని్పస్తోంది కదూ! కానీ ఇదంతా దేశ రాజధానిలో యమునా నదిని నిలువెల్లా కబళించిన కాలుష్యం తాలూకు నురగ! ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ నురగలో అమోనియా, పాస్పేట్ వంటివి ప్రమాదకర పాళ్లలో ఉన్నట్టు నిపుణులు తేల్చారు. ఇది శ్వాసతో పాటు పలురకాలైన చర్మ సమస్యలకు దారి తీస్తుందని వివరించారు. యమునలో కాలుష్యం కొంతకాలంగా ప్రమాదకర స్థాయికి పెరిగిపోతున్నా వర్షాకాలంలో ఈ స్థాయి నురగను ఎప్పుడూ చూడలేదంటూ స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఢిల్లీ పొడవునా యమునలో కాలుష్యానికి ప్రధాన కారకాలుగా నిలుస్తున్న 13 హాట్స్పాట్లను గుర్తించినట్టు రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. దుమ్ము, ధూళితో పాటు నురగను నియంత్రించేందుకు 80 చోట్ల యాంటీ స్మాగ్ గన్స్ మోహరిస్తామన్నారు. కానీ మాటలే తప్ప యమునలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆప్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. -
కాలుష్య కోరల్లో యమునా నది
-
ఢిల్లీలో దాహం.. దాహం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీవ్ర జల సంక్షోభం నెలకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి నీటి సరఫరా తగ్గడంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి దారుణంగా పెరిగింది. యమునా నదీ జలాల సరఫరా విషయంలో ఢిల్లీ, హరియాణా, హిమాచల్ప్రదేశ్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరడంతో నీటి కష్టాలు తీవ్రమయ్యే ప్రమాదకర పరిస్థితి దాపురించింది. మండుతున్న ఎండలకు తోడు నీటి కొరతతో ప్రజలు అల్లాడుతుంటే ట్యాంకర్ మాఫియా, రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ఈ సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. ఆగిన సరఫరా.. తగ్గిన నిల్వలుఢిల్లీ తాగునీటి అవసరాల్లో 90 శాతం యమునా నదీ మునాక్ కాలువ ద్వారా తీరుతోంది. మరికొంత ఉత్తర్ప్రదేశ్లోని ఎగువ గంగ కాల్వల ద్వారా వచ్చే నీటితో ఢిల్లీ నీటి కష్టాలు తీరుతున్నాయి. యమునా నదిపై ఉన్న చంద్రవాల్, వజీరాబాద్, ఓక్లా నీటి శుద్ధి కర్మాగారాలుసహా మరో నాలుగు ప్లాంట్ల ద్వారా ఢిల్లీకి అవసరమైన నీటి సరఫరా జరుగుతోంది. ఢిల్లీకి ప్రతి రోజూ 1,200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉండగా ఢిల్లీ జల్ బోర్డు 950 మిలియన్ గ్యాలన్ల నీటినే సరఫరా చేస్తోంది. హరియాణా ప్రభుత్వం మునాక్ ఉప కాల్వల ద్వారా 683 క్యూసెక్కులు, ఢిల్లీ చిన్న కాల్వల ద్వారా మరో 330 క్యూసెక్కుల నీటిని వజీరాబాద్ నీటి శుద్ధి రిజర్వాయర్కు సరఫరా చేయాల్సి ఉంది. మొత్తంగా రోజుకి 1,013 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉన్నా హరియాణా ప్రభుత్వం కేవలం 840 క్యూసెక్కుల నీటినే విడుదల చేస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. హరియాణా నీటి సరఫరాను తగ్గించడంతో ఉత్తర, పశ్చిమ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ రిజర్వాయర్లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. రిజర్వాయర్లో సగటు నీటి మట్టం 674.5 అడుగులు కాగా ప్రస్తుతం 669 అడుగులకు పడిపోయింది. దీంతో రిజర్వాయర్ నుంచి రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే విడుదల అవుతోందని ఢిల్లీ జల వనరుల మంత్రి అతిశి ఆరోపించారు. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గి ట్యాంకర్లపై జనం ఆధారపడుతున్నారు. ఇదే అదునుగా ట్యాంకర్ మాఫియా రెచ్చిపోయింది. ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తోంది. నీటి ఎద్దడి అంశంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హరియాణా ముఖ్యమంత్రి నయాబ్సింగ్ షైనీతో మాట్లాడి, నీటి సరఫరా పెంచే విషయమై చర్చలు జరుపుతున్నారు. మునాక్ కాలువ, ఇతర కాల్వల నుంచి ట్యాంకర్ మాఫియా నీటి దోపిడీపై ప్రత్యేక దర్యాప్తు బృందంచే విచారణ చేపట్టాలని బుధవారం బీజేపీ రాష్ట్ర శాఖ డీజీపీకి విజ్ఞప్తి చేసింది. నీటి ఎద్దడికి రాజధానిలా మారుతున్న ఢిల్లీలో చాలా కాలనీల్లో ఎటు చూసినా మహిళలు, చిన్నారులు బిందెలు, బకెట్లు పట్టుకుని పెద్దపెద్ద క్యూ లైన్లలో నిల్చున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. మాట మార్చిన హిమాచల్ప్రదేశ్ఇన్నాళ్లూ నీటిని సరఫరా చేసిన హిమాచల్ ప్రదేశ్ మాట మార్చింది. తమ వద్ద 135 క్యుసెక్కుల మిగులు జలాలు లేవని, కావాలంటే యమునా బోర్డును ఆశ్రయించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హిమాచల్ నుంచి హరియాణాకు వచ్చిన మిగులు జలాలను ఢిల్లీ కోసం విడుదల చేయాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసిన నేపథ్యంలో ప్రతిగా హిమాచల్ సర్కార్ కోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఈ కేసును గురువారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి.వరాలేల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ‘‘ నీటి నిర్వహణలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైంది. కాల్వల ద్వారా నీటి పంపిణీ నష్టాలను తగ్గించడంలో, నీటి చౌర్యాన్ని నియంత్రించడం, తలసరి నీటి వినియోగాన్ని నియంత్రించడంలో ఢిల్లీ వైఫల్యం చెందింది. అభివృధ్ధి చెందుతున్న దేశాల్లో పంపిణీ నష్టాలు 10శాతం ఉంటే ఢిల్లీలో ఏకంగా 52.35 శాతం నష్టాలు ఉన్నాయి. కేంద్ర పట్టణాభివృధ్ధి శాఖ నిర్దేశకాల ప్రకారం పట్టణ నీటి తలసరి సరఫరా 135 లీటర్లుగా ఉంటే ఢిల్లీలో అతిగా 172 లీటర్లు సరఫరాచేస్తున్నారు. హిమాచల్ వద్ద వాస్తవానికి మిగులు జలాలు లేవు. ఉన్నాయంటూ గతంలో ఇచ్చిన ప్రకటనను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వండి’ అని హిమాచల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ ఇదెంత తీవ్రమైన అంశమో మీకు తెలియట్లేదు. మీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలో వద్దో తర్వాత తేలుస్తాం’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో గత ప్రకటన ఉపసంహరణకు పద్దతి ప్రకారం అఫిడవిట్ సమర్పిస్తానని అడ్వకేట్ జనరల్ చెప్పారు.మాకంత నైపుణ్యం లేదుహిమాచల్ వాదనలు విన్నాక మానవతా దృక్పథంతో నీటిని సరఫరా చేయాలని సాయంత్రంకల్లా ఎగువ యమునా జలబోర్డ్ వద్ద దరఖాస్తు పెట్టుకోవాలని ఢిల్లీ సర్కార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘ యమునా నదీ జలాల పంపకం అనేది సంక్లిష్టమైన వ్యవహారం. ఇప్పటికిప్పుడు మధ్యేమార్గంగా నదీజలాల పంపకం సమస్యను తీర్చేంత స్థాయిలో మాకు సాంకేతిక నైపుణ్యం లేదు. 1994 అవగాహనా ఒప్పందం ద్వారా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న యమునా బోర్డే ఈ సమస్యకు పరిష్కారం చూపగలదు. అదనంగా 150 క్యూసెక్కుల కోసం ఢిల్లీ గతంలోనే దరఖాస్తు చేసుకుంది. దానిపై జలబోర్డ్ త్వరగా నిర్ణయం వెలువర్చాలి. లేదంటే శుక్రవారం నుంచి రోజువారీగా బోర్డ్ సమావేశమై సమస్యను పరిష్కరించాలి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.ఢిల్లీ ప్రభుత్వ వాదనేంటి?నీటి ట్యాంకర్ల మాఫియాపై ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం తలంటిన నేపథ్యంలో గురువారం కేజ్రీవాల్ సర్కార్ అఫిడవిట్ సమర్పించింది. ‘‘ ట్యాంకర్ల మాఫియా హరియాణా వైపు ఉన్న యమునా నది వెంట రెచ్చిపోతోంది. ఆ ప్రాంతం ఢిల్లీ జలబోర్డ్ పరిధిలోకి రాదు. అసలు అక్కడ చర్యలు తీసుకునే అధికారం ఎవరికి ఉందో తేల్చాలని ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్కు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. స్పందన శూన్యం. హరియాణా నుంచి ఢిల్లీకి నీటి సరఫరా వృథాను 30 శాతం ఉంచి ఐదు శాతానికి తగ్గించాం’’ అని అఫిడవిట్లో పేర్కొంది. గురువారం ఢిల్లీ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదించారు. ‘‘ జలబోర్డులు ప్రభుత్వ అనుకూల అధికారులతో నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కమిటీ వేసి సుప్రీంకోర్టే సమస్యను పరిష్కరించాలి’ అని అన్నారు. ఈ వాదనతో హరియాణా విభేధించింది. ‘‘ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ బ్యారేజీలో కనీస నీట నిల్వలు ఉండాల్సిందే. అతి సరఫరా కుదరదు. ఈ అంశాన్ని యమునా బోర్డ్కు వదిలేస్తే మంచిది’ అని హరియాణా తరఫున లాయర్ శ్యామ్ దివాన్ వాదించారు. ఈ అంశాన్ని ఇకపై జలబోర్డే చూసుకుంటుందని అదననపు సొలిసిటర్ జనరల్ విక్రమ్జీత్ బెనర్జీ చెప్పారు. దీంతో జలబోర్డులో తేల్చుకోండంటూ ఢిల్లీ సర్కార్ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. మరోవైపు రోజుకు 5 కోట్ల గ్యాలెన్ల నీటి సరఫరా తగ్గడంతో నీటిని వృథా చేయకండని ఢిల్లీవాసులకు ప్రభుత్వం సూచనలు చేసింది. -
విషపూరిత నురుగులు కక్కుతున్న యమునమ్మ, ఎవరూ పట్టించుకోరే?
దేశంలో ఒక పక్క సార్వత్రిక ఎన్నికలు, లోక్సభ ఎన్నికల వేడి రాజుకుంటోంది. మరో పక్క రోజు రోజుకి కాలుష్య కాసారంగా మారిపోతున్న పవిత్ర యమునా నదీ తీరం మరోసారి కాలుష్య సెగలు కక్కుతోంది. టన్నుల కొద్దీ మురుగునీరు, పారిశ్రామిక, గృహ వ్యర్ధాలతో విషపూరిత నురుగుతో నిండిపోయింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో అనూహ్యంగా పెరిగిపోతున్న కాలుష్యానికి సాక్షీభూతంగా నిలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. యమున ఉపరితలంపై విషపూరిత నురుగు తేలుతున్న వీడియోలు గతంలో చాలా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి .అలాగే కోవిడ్ లాక్డౌన్ కాలంలో యమునకు కాలుష్యం స్థాయి చాలావరకు తగ్గి ప్రశాంతంగా కనిపించడం గమనార్హం. తీవ్రమైన కాలుష్యంతో యమునా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీని దుష్ప్రభావాలు, పొంచివున్న ముప్పుపై వాతావరణ నిపుణులు, శాస్త్రజ్ఞులు ఎంత మొత్తుకుంటున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. తక్షణమే కనీస జాగ్రత్తలు చేపట్టాలని కోరుతున్నారు. Kalindi Kunj ... Yamuna Delhi . Beautiful poisonous pink water froth with chemicals ,, @ArvindKejriwal promised clean Yamuna in 2017 ,,nothing happened@SwatiJaiHind @AtishiAAP ... IIT quota admission , is useless pic.twitter.com/svcQ3wdYGw — No Conversion (@noconversion) May 19, 2023 నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఢిల్లీ, హర్యానా ,ఉత్తరప్రదేశ్ నుండి శుద్ధి చేయని మురుగునీటిలో ఫాస్ఫేట్లు, సర్ఫ్యాక్టెంట్లు (రసాయన సమ్మేళనాలు) యమునలో కలిసిపోతున్నాయి. ఇదే విషపూరిత నురుగుకు కారణం. ఈ రెండింటిలోనూ 99 శాతం గాలి, నీటిలో కలిసి పోతుంది.ఫలితంగా అనేక బాధలు తప్పవు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలు లాంటి సమస్యలొస్తాయి. ఈ రసాయనాలతో జీర్ణకోశ సమస్యలు ,టైఫాయిడ్ వంటి వ్యాధులు రావచ్చు. దీర్ఘకాలం పాటు ఈ పారిశ్రామిక కాలుష్య కారకాలకు ఎక్స్పోజ్ అయితే నరాల సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడతాయి. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం కూడా కావచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
మోకాలు లోతు నురగ నీటిలో ఛఠ్ పూజలు
ఢిల్లీ: యమునా నదిలో కలుషిత నీటిలోనే భక్తులు నేడు ఛఠ్ పూజలు నిర్వహించారు. కాళింది కుంజ్ వద్ద మోకాలు లోతు నురగ నీటిలో మహిళలు సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. యమునా నది కలుషిత నీటిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Delhi: Devotees stand in knee-deep toxic foam in Yamuna for Chhath Puja Read @ANI Story | https://t.co/M97YK6qIOn#Yamuna #ChhathPooja #Delhi #ToxicFoam pic.twitter.com/dPrvex1Esh — ANI Digital (@ani_digital) November 20, 2023 నాలుగు రోజుల పాటు సాగిన ఛఠ్ పూజా వేడుకల ముగింపు సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు సోమవారం ఉదయం సూర్యునికి అర్ఘ్యం సమర్పించారు. యమునా నదిలో నురగలు వస్తున్నప్పటికీ తప్పనిస్థితిలో భక్తులు పూజా కార్యక్రమాలు చేశారు. అయితే.. యమునా నది నీటిలో అధిక పాస్పేట్ స్థాయిల కారణంగా నురగ నీరు ప్రవహిస్తోంది. యూపీ, హర్యానా సహా చుట్టుపక్కల రాష్ట్రాల పరిశ్రమల నుంచి కలుషిత నీరు ప్రవహిస్తోంది. ఈ కారణంగా నది నీటిలో పాస్పేట్ స్థాయిలు అధికంగా ఉన్నాయి. ఛఠ్ పూజా కార్యక్రమాలు ప్రతి ఏడాది దేశ రాజధాని ఢిల్లీతో పాటు బిహార్, యూపీ, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతాయి. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. నాలుగు రోజులపాటు జరుగుతున్న ఛఠ్ పండుగ శుక్రవారం ప్రారంభమైంది. స్వచ్ఛత, సద్భావన, విశ్వాసాలకు నిలయంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇదీ చదవండి: Delhi Schools: ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు -
Yamuna River Floods: యమునా నది ఉగ్రరూపం
న్యూఢిల్లీ: ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్న వర్షాల ప్రభావానికి యమునా నది మరోసారి పోటెత్తింది. కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అటు ఉత్తరాఖండ్ ఇటు హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాలలో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. మరో 24 గంటలపాటు భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ శాఖ తెలపడంతో అధికారులు ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. గత నెలలో దేశ రాజధానిలో కురిసిన భారీ వర్షాలకు రహదారులన్నీ నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. యమునా నది ప్రవాహమైతే జులై 13న అత్యధికంగా 208.66 మీ. రికార్డు స్థాయికి చేరుకోగా తాజాగా మరోసారి అలాంటి పరిస్థితే నెలకొంది. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో యమునా నది ప్రవాహం పాత రైల్వే బ్రిడ్జి వద్ద 205.39 మీటర్లకు చేరినట్లు సెంట్రల్ వాటర్ కమీషన్(CWC) తెలిపింది. హర్యానాలోని యమునానగర్ హాత్నికుండ్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి నీటి ప్రవాహం ఉధృతి 30,153 క్యూసెక్కులకు చేరినట్లు చెబుతోంది సెంట్రల్ వాటర్ కమీషన్. హిణాచల్ ప్రదేశ్ లోనూ, ఉత్తరాఖండ్ లోనూ మరో 24 గంటలపాటు భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు ఐఎండీ శాఖ తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు కొండతట్టు ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొండ చరియలు జారి పడటం, వరదలు, మేఘ విస్ఫోటనాలు సంభవించడంతో ప్రాణ నష్టం కూడా పెరుగుతూ వచ్చింది. ఒక్క హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే ఇప్పటివరకు 55 మంది మృతి చెందారు. #WATCH | Water level of River Yamuna rises in Delhi again. Drone visuals from this morning show the current situation around Old Yamuna Bridge (Loha Pul) pic.twitter.com/PATydIBQXZ — ANI (@ANI) August 16, 2023 యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు మొదలుపెట్టామని రహదారులపై చిక్కుకున్న వారిని విడిపించేందుకు విపత్తు నిర్వహణ బృందాలు కృషి చేస్తున్నాయని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు. కల్క -షిమ్లా, కీరత్ పుర్-మనాలి, పఠాన్ కోట్ - మండి, ధర్మశాల - షిమ్లా రహదారులన్నీ మూసివేసినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఎర్రకోట వేడుకకు హాజరుకాని మల్లికార్జున ఖర్గే.. నెట్టింట వైరల్గా ఖాళీ కుర్చి -
చినుకుతో వణుకు
యమునా నది ఢిల్లీ పరిధిలో 48 కి.మీ. మేరకు ప్రవహిస్తుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించింది. జూలై 10న సంభవించిన వరదల కారణంగా రాజధాని నగరానికి రూ.10 వేల కోట్లకు పైగా ఆర్థిక నష్టం సంభవించినట్లు అంచనా. ఢిల్లీలో చిత్తడి నేలలు, బావులు, సరస్సులు వంటి జల వనరులు 1,040కి పైగా ఉన్నాయి. వీటికి అధికారిక గుర్తింపు లేదు. ప్రభుత్వం నోటిఫై చేయకపోవడంతో అవి సులభంగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఫలితంగా ఢిల్లీని వరద కష్టాలు వెంటాడుతున్నాయి. నిజానికి దేశంలోని అన్ని చిన్నా పెద్దా నగరాలదీ ఇదే సమస్య... ♦ ఢిల్లీలో మురుగునీటి పారుదల వ్యవస్థ 1970ల నాటిది. నాటితో పోలిస్తే నగర జనాభా కనీవినీ ఎరగనంతగా పెరిగిపోయింది. ♦ దాంతో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. ఇక అడ్డగోలు నిర్మాణాలతో డ్రైనేజీ వ్యవస్థ కుదించుకుపోయి సమస్య మరీ పెద్దదవుతోంది. ♦ ఢిల్లీలో యమున వరద నీరు చేరే ప్రాంతం దాదాపుగా 97 చదరపు కిలోమీటర్లుంటుంది. నగర భూభాగంలో ఇది 7%. ఇందులో అత్యధిక భూభాగాన్ని ఆక్రమణలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు కట్టడానికి కేటాయించడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ♦ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక ప్రకారం ఢిల్లీలో యమున వరద నీరు చేరే ప్రాంతాలు 600కు పైగా ఉన్నాయి. వీటిలో 60% వరకు నీరు లేక ఎండిపోయాయి. ఒక్క రోజులోనే అతి భారీ వర్షం కురవడంతో అవన్నీ ఇప్పుడు నీట మునిగాయి. ♦ పైగా వీటిలో చాలా ప్రాంతాలు ఆక్రమణలకు లోనయ్యాయి. వాటిని వ్యవసాయ క్షేత్రాలుగా మార్చుకొని లక్షలాది మంది బతుకుతున్నారు. మరెన్నో భూముల్ని అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయించారు. 2010లో కామన్వెల్త్ క్రీడల కోసం నిర్మించిన గ్రామం, అక్షరధామ్ ఆలయం వంటివెన్నో వరద ప్రాంతాల్లోని ఆక్రమిత భూములపై నిర్మించినవే. ♦ చిత్తడి నేలలు సహజసిద్ధంగా నీటిని పీల్చుకొని భూగర్భ జలాలను పెంపొందిస్తాయి. కానీ ఢిల్లీలోని చిత్తడి నేలల్లో 200కు పైగా ఎండిపోయి ఆక్రమణలకు గురయ్యాయి. హతినికుండ్ వివాదం హరియాణాలో 1996లో కట్టిన ఈ ఆనకట్ట ద్వారా నీళ్లు యమున నది తూర్పు, పశ్చిమ కాలువల్లోకి ప్రవహిస్తాయి. హరియాణా ప్రభుత్వం ఈ బ్యారేజ్ గేట్లు ఎత్తేయడంతో నేరుగా యమున నదిలోకి వరద నీరు చేరి ప్రమాదకరంగా మారుతోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే తాము నిబంధనలకనుగుణంగానే వ్యవహరిస్తూ లక్ష క్యూసెక్కులు దాటితేనే నీటిని వదులుతున్నామని హరియాణా ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నెల 10వ తేదీన హతినికుండ్ ప్రాజెక్టు నుంచి ఏకంగా 3.59 లక్షల క్యూసెక్కుల నీరు యమునలోకి వచ్చింది. అందుకే ఢిల్లీ నీట మునిగిందన్న వాదనలు కూడా ఉన్నాయి. అయితే 2010 వర్షాకాలంలో 7 లక్షల క్యూసెక్కుల నీరు హతినికుండ్ నుంచి విడదల చేసినప్పటికీ అప్పట్లో నగరానికి పెద్దగా ముప్పు రాలేదు. ఇప్పుడు మూడు లక్షల క్యూసెక్కులకే ముప్పు రావడానికి ఆక్రమణలు, అడ్డగోలు నిర్మాణాలే కారణమని సౌత్ ఆసియా నెట్వర్క్ ఆన్ డామ్స్, రివర్స్, పీపుల్ కోఆర్డినేటర్ హిమాంశు ఠక్కర్ అభిప్రాయపడ్డారు. చిత్తడి నేలల పునరుద్ధరణ.. వరద ప్రభావాన్ని తగ్గించాలంటే ఆక్రమణలను తొలగించి నదీ తీర ప్రాంతాలను పునరుద్ధరించాల్సిన అవసరం చాలా ఉంది. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన మెరుగుందుకు ప్రభుత్వం కృషి చేయాలి. యమునా నది పొంగి పొర్లకుండా ఢిల్లీకి రక్షణ కవచంలా ఉండే చిత్తడి నేలలు, సరస్సులు, చెరువుల వంటివి తగ్గిపోతున్నాయి. అవి లేకుండా యమున ప్రవాహం సవ్యంగా సాగదన్న అభిప్రాయాలున్నాయి. ఈ సరస్సులు, చెరువులు, బావుల వంటివి నీటిని స్టోరేజ్ చేయడం వల్ల డ్రైనేజీలోకి వెళ్లే నీటి ప్రవాహం తగ్గుతుంది. ‘‘నదుల వరదను శాపంగా చూడకూడదు. పరివాహక ప్రాంతంలో గడ్డివాములు, చెట్లు పెంచడం వంటివి చేస్తే వరద ముప్పు నుంచి తప్పించుకోవచ్చు’’ అని సీనియర్ సైంటిస్ట్ ఫయాద్ ఖుద్సర్ చెప్పారు. ఢిల్లీ రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటోంది. నిర్మాణాలు పెరిగి కాంక్రీట్ జంగిల్గా మారింది. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సన్నద్ధత లేదు. అందుకే నగరం ఇలా వరద ముప్పుకు లోనవుతోంది. – రితేశ్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ వెట్ల్యాండ్స్ ఇంటర్నేషనల్, సౌత్ ఏషియా – సాక్షి , నేషనల్ డెస్క్ -
మరోసారి యమునా నది ఉగ్రరూపం.. కేజ్రీవాల్ సర్కార్ అలర్ట్
ఢిల్లీ: ఉత్తరాదిన వానలు దండికొడుతున్నాయి. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో యమునా నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నది. ఈనేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమ్తమైంది. వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హర్యానాలోని హత్నికుండ్ బరాజ్నుంచి ప్రభుత్వం 2 లక్షలకుపైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసింది. దీంతో, దిగువన ఉన్న ఢిల్లీకి వరద పోటెత్తింది. ఈ క్రమంలో యమునా నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. మరోసారి రికార్డు స్థాయిలో ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది ప్రవాహం 205.75 మీటర్లకు చేరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ◆दिल्ली में यमुना नदी का जलस्तर फिर बढ़ा ◆205.75 मीटर दर्ज किया गया जलस्तर #yamunariver #Delhi #abcnewsmedia pic.twitter.com/KXfKGtmbnI — Abcnews.media (@abcnewsmedia) July 23, 2023 ఈ సందర్బంగా యమునా నది ముంపు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించింది ప్రభుత్వం. ఇదే సమయంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్ సర్కార్ స్పష్టం చేసింది. అయితే గత కొన్నిరోజులుగా ఢిల్లీలో యమునా నది 205.33 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం నదీ ప్రవాహం ప్రమాద స్థాయికి తగ్గినప్పటికీ.. మళ్లీ పెరగడంతో అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల 13న యమునా నది 208.66 మీటర్లు ప్రవహించింది. అనంతరం క్రమంగా తగ్గుతూ వస్తోంది. Visuals of Yamuna river from Delhi's Loha Pul. A surge in discharge from the Hathnikund Barrage into the Yamuna following heavy rain in parts of Uttarakhand and Himachal Pradesh is expected to increase the water level of the river in Delhi. pic.twitter.com/rU8yC6jXFn — Press Trust of India (@PTI_News) July 23, 2023 ❗️#YamunaRiver Crosses Danger Mark – Delhi on #HighAlert! Following #HeavyRains in Himachal & Pradesh and Uttarakhand - the Hathnikund dam has been discharged into the river. Water levels are now almost even with the Old Railway Bridge. The #CentralWaterCommission (CWC) data… pic.twitter.com/bRUbTlSEp8 — RT_India (@RT_India_news) July 23, 2023 ఇది కూడా చదవండి: వీడియో: బ్రిడ్జిని ఆనుకుని ప్రవహిస్తున్న పెన్గంగ.. 20కిమీ మేర ట్రాఫిక్ జామ్ -
డేంజర్ యమున.. తాజ్ మహల్ను తాకిన వరద
ఢిల్లీ: దేశ రాజధానిని ఇంకా వరద ముప్పు వీడలేదు. ఆగ్రాలో కురుస్తున్న భారీ వర్షంతో.. యమునా నది మళ్లీ ఉప్పొంగి డేంజర్ మార్క్ను చేరుకుంది. నది నీటి మట్టం 495.8 అడుగులకు చేరింది. దీంతో.. ప్రపంచ వింత ‘తాజ్మహల్’ ను యమునా వరద తాకగా.. ఓ గార్డెన్ నీట మునిగింది కూడా. సరిగ్గా 45 కిందట.. ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. 1978లో తాజ్మహల్ను యమునా వరద ముంచెత్తింది. అయితే ప్రస్తుత వరదతో ఈ చారిత్రక స్మారకానికి వచ్చిన నష్టమేమీ లేదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చెబుతోంది. ఇక ఈ దృశ్యాన్ని చూసేందుకు సాహసం చేయొద్దని స్థానికులను అధికారులు హెచ్చరిస్తున్నారు. #WATCH | Uttar Pradesh: The water level of the Yamuna River continues to increase in Agra. pic.twitter.com/pRRFoUirUU — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 19, 2023 వరద వల్ల తాజ్ కు ప్రమాదం లేకపోయినప్పటికీ... చుట్టు పక్కల ప్రాంతాలు మాత్రం ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆగ్రాలోని తనిష్క్, లోహియా నగర్, దయాల్బాగ్, రాజశ్రీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆగ్రాలోని కైలాస మహాదేవ్ ఆలయ గర్భగుడిలోకి కూడా నీరు చేరింది. మరోవైపు యమున ఉగ్రరూపం దాల్చడంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాలు నీట మునిగాయి. -
కాస్తంత తగ్గిన యమున నీటి మట్టం.. కోలుకుంటున్న ఢిల్లీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో కుంభవృష్టి వర్షాలు లేకున్నా ఎగువప్రాంతాల నుంచి యమునా నది మోసుకొచి్చన వరదనీటితో అల్లాడిపోయిన దేశ రాజధాని నెమ్మదిగా తెరిపినపడుతోంది. గురువారం రాత్రి అత్యంత ప్రమాదకరంగా 208.66 మీటర్లుగా ఉన్న నది నీటిమట్టం శనివారం ఉదయం పదిగంటలకు 207.43 మీటర్లకు తగ్గడమే ఇందుకు కారణం. వరదముంపు ప్రాంతాల్లో పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడుతున్నాయని డివిజనల్ కమిషనర్ అశ్వనీ కుమార్ చెప్పారు. ‘అవిశ్రాంతంగా శ్రమిస్తున్న అధికారులపై ఎన్నికైన ‘ప్రభుత్వం’ విమర్శలు చేయడం తగదు. ఇది అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది’ అని ఆప్ సర్కార్నుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. హరియాణాలోని హాతీ్నకుండ్ బ్యారేజీ నుంచి వరదనీటి ఔట్ఫ్లో తగ్గడంతో ఢిల్లీ పరిసరప్రాంతాల్లో వరదప్రభావం గంట గంటకు తగ్గుతోంది. అయితే భారతవాతావరణ శాఖ మాత్రం ఢిల్లీలో వచ్చే రెండ్రోజులు వర్షాలు పడతాయని సూచించింది. భీకరవర్షాల బారిన పడిన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో మరో ఐదు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలుపడే అవకాశం ఉందని అంచనావేసింది. దీంతో యమునా నీటిమట్టం మళ్లీ పెరుగుతుందనే భయాలు ఢిల్లీవాసుల్లో వ్యక్తమయ్యాయి. ఆక్రమణలే ముంచాయి ఢిల్లీలో వరదకు కారణం నదీ పరివాహక ప్రాంతాల ఆక్రమణ అని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) సీనియర్ అధికారి ఒకరు విశ్లేíÙంచారు. ‘గతంలో వరదనీరు విస్తారమైన ప్రాంతం గుండా ప్రవహించేది. ఇప్పుడు ఆ ప్రాంతమంతా ఆక్రమణలతో ఇరుకైపోయింది. దీంతో ఇరుకుదారుల్లో ఎత్తుగా ప్రవహించి సుదూర ప్రాంతాలను వరదముంచెత్తింది. గతంతో పోలిస్తే ఈఏడాది హత్నీకుండ్ బ్యారేజీ నుంచి నీరు ఢిల్లీకి చాలా తక్కువ సమయంలో, ఎక్కువ పరిమాణంలో చేరుకుంది’ అని అధికారి విశ్లేíÙంచారు. ‘ యమున ఎగువ ప్రాంతం మొత్తంలో ఒకేసారి భారీవర్షాలు పడటం ఈసారి పెద్ద వరదకు మరో కారణం’ అని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్(ఐయూసీఎన్) భారత ప్రతినిధి యశ్వీర్ భట్నాగర్ చెప్పారు. -
Pritam Bull:కోటి రూపాయల ఎద్దును కాపాడారోచ్!
నోయిడా: యమునా ఉధృతితో వరద నీరు నోయిడాను ముంచెత్తింది. ఈ నీటిలో మనుషులే కాదు.. మూగ జీవాలు అరిగోస పడుతున్నాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్(నేషనల్ డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్) సైతం రంగంలోకి దిగి వాటినీ రక్షిస్తున్నాయి. నోయిడా తీరం వెంట ఎనిమిది గ్రామాలకు చెందిన ఐదు వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించింది ఎన్డీఆర్ఎఫ్. అలాగే.. గురువారం నుంచి ఇప్పటిదాకా పశువులు, కుక్కలు, కుందేళ్లు, గినియా పందులు.. ఇలా 6వేల దాకా మూగజీవాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారట. ఈ రెస్క్యూలో దేశంలోకెల్లా నెంబర్ వన్ ఎద్దును సైతం కాపాడరంట. ఈ విషయాన్ని స్వయంగా 8వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ట్విటర్ ద్వారా స్వయంగా ప్రకటించింది. ప్రీతమ్ అనే గిర్ జాతి ఎద్దును నోయిడా కమలా నగర్లో వరద నుంచి రక్షించింది ఎన్డీఆర్ఎఫ్ బృందం. దీని ధర కోటి రూపాయలకు పైగా పలుకుతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. దీని వయసు ఏడేళ్లు?!. నడిచే బంగారంగా గిర్ పశువులకు దేశంలోనే ఓ పేరుంది. పాలకే కాదు.. ఎద్దులకూ మాంచి గిరాకీ. ఇక ప్రీతమ్ వంశ వృక్షంలో ముందుతరాల పశువులకూ అడ్డగోలు రేటు దక్కింది. దేశంలో ఇలాంటి కాస్ట్లీ పశువులు ఉన్నా.. ప్రీతమ్ మాత్రం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. 2019లో తొలిసారి ది నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. సంకరణంతో పాటు దీని వీర్యాన్ని కూడా ప్రత్యేకంగా అమ్ముతుంటారు. అయితే ఇది కూడా కాస్ట్లీ వ్యవహారమే!. భారత్లో బీఎండబ్ల్యూ ఎక్స్5 కారు ధర.. గరిష్టంగా 98లక్షల రూపాయలుగా ఉండడం గమనార్హం. అంటే ప్రీతమ్గాడి వెల అంతకన్నా ఎక్కువేనన్న మాట!!. #आपदासेवासदैवसर्वत्र Team @8NdrfGhaziabad has rescued 3 cattles including India's No.1 Bull "PRITAM" costing 1 Cr. from Noida. NDRF teams are working hard to save lives in flood affected areas.#animalrescue @ndmaindia @NDRFHQ @noida_authority @HMOIndia @PIBHomeAffairs pic.twitter.com/MdMRikYFVz — 8th BN NDRF (@8NdrfGhaziabad) July 15, 2023 #आपदासेवासदैवसर्वत्र#animalrescue Team @8NdrfGhaziabad conducting flood rescue and evacuation.This is our country's philosophy:-No one should be left behind in times of need.NdRF rescue people as well as animals at Noida@noida_authority@HMOIndia@NDRFHQ@ndmaindia@ANI pic.twitter.com/e7j8sTEixz — 8th BN NDRF (@8NdrfGhaziabad) July 15, 2023 -
Delhi Floods: ఇంకా జల దిగ్బంధంలోనే ఢిల్లీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన యమునా నది శుక్రవారం కొంత శాంతించింది. నదిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయినప్పటికీ పలు కీలక ప్రాంతాలు ఇంకా వరద ముట్టడిలోనే ఉన్నాయి. నది నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సుప్రీంకోర్టు, రాజ్ఘాట్ దాకా వరద నీరు చేరింది. యమునా నదిలో నీటమట్టం గురువారం 208.66 మీటర్లకు చేరుకోగా, శుక్రవారం సాయంత్రం 6 గంటలకల్లా 208.17 మీటర్లకు తగ్గిపోయింది. వరద ప్రవాహం ధాటికి దెబ్బతిన్న ఇంద్రప్రస్థ వాటర్ రెగ్యులేటర్ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్కుమార్ సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిశీలించారు. త్వరగా మరమ్మతులు పూర్తి చేస్తామని కేజ్రీవాల్ చెప్పారు. ఈ రెగ్యులేటర్ దెబ్బతినడం వల్లే నదిలోని వరద ఇతర ప్రాంతాలకు వేగంగా విస్తరించింది. ఇసుక బస్తాలు, కంకరతో వరద ప్రవాహాన్ని ఆపేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, సైనిక జవాన్లు, ఢిల్లీ అధికారులు శ్రమిస్తున్నారు. నగరంలోని రోడ్లపై వరద నీరు ఇంకా తగ్గలేదు. రహదారులు చిన్నపాటి నదులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లలను ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. వాహనాలను అనుమతించడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం కొనసాగుతున్నాయి. వరదలో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శ్మశానాలు సైతం జలమయం కావడంతో అంత్యక్రియలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. వరద తీవ్రత దృష్ట్యా పలు శ్మశాన వాటికలను మూసివేసినట్లు నగర మేయర్ షెల్లీ ఒబెరాయ్ చెప్పారు. వరదలపై ఆరా తీసిన ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా కేంద్ర మోంశాఖ మంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. ఢిల్లీలో వరద పరిస్థితిపై ఆరా తీశారు. మరో 24 గంటల్లో యమునా నదిలో ప్రవాహం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, అతి త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని మోదీకి అమిత్ షా వివరించారు. -
సుప్రీంకోర్టుకు చేరిన వరద నీరు.. సైన్యం సహకారాన్ని కోరిన కేజ్రీవాల్..
ఢిల్లీ: యమునా నది ఉప్పొంగడంతో దేశ రాజధాని తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఢిల్లీలో ప్రధాన ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. డ్రెయిన్ రెగ్యులేటర్ పాడవడంతో ఐటీఓ క్రాసింగ్ ఏరియా, నిత్య రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి యమునా నది వరద నీరు పారుతోంది. దీంతో అప్రమత్తమైన సీఎం కేజ్రీవాల్.. ఆర్మీ సహాయం కోరాలని అధికారులకు ఆదేశించారు. విపత్తు నిర్వహణ శాఖ సహాయం తీసుకుని రెగ్యులేటర్ను సరిచేయాలని కోరారు. ఇందుకోసం ఇంజినీరు బృందాలు రాత్రంతా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. ఇంద్రప్రస్తా బస్ డిపో నుంచి డబ్ల్యూహెచ్ఓ బిల్డింగ్ మధ్య ఉండే డ్రెయిన్ రెగ్యులేటర్ పాడయిపోయిన కారణంగా వరద ఉద్దృతి ఈ ప్రాంతానికి చేరినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కాగా.. ఐటీఓ క్రాసింగ్ ఏరియాలో ఎలక్ట్రిక్ పోల్స్కు షాక్ వచ్చిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ ప్రాంతంలో కరెంట్ సరఫరాను నిలిపివేశారు. This breach is causing flooding of ITO and surroundings. Engineers have been working whole nite. I have directed the Chief Secretary to seek help of Army/NDRF but this shud be fixed urgently https://t.co/O8R1lLAWXX — Arvind Kejriwal (@ArvindKejriwal) July 14, 2023 సుప్రీంకోర్టుకు వరద నీరు.. ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో ఉప్పొంగిన యమునా నది ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. నిన్న యమునా నది 208.46 మీటర్ల మేర ప్రవహించింది. కానీ ఈ రోజు మధ్యాహ్నానానికి 208.30కు తగ్గుతుందని కేంద్ర వాటర్ కమిషన్ అంచనా వేసింది. అయితే.. ఇప్పటికే వరద నీరు ఏకంగా ఢిల్లీ నడిబొడ్డున ఉన్న తిలక్ మార్గ్లోని సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఢిల్లీలో వరద నేపథ్యంలో ఫ్రాన్స్లో పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. పరిస్థితి తీవ్రతను సమీక్షించారు. దేశ రాజధాని ఢిల్లీలో రహదారులు నదులయ్యాయి. ఇళ్లు నీట మునిగిపోయాయి. శ్మశాన వాటికలు సైతం జలమయంగా మారాయి. రోడ్లపైకి వచ్చే వీలు లేకుండాపోయింది. మొత్తంగా ఢిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో యమునా నదిలో నీటమట్టం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏకంగా 208.62 మీటర్లకు చేరుకుంది. దీంతో నగరంలో మరిన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో పాఠశాలలకు, ఆఫీసులకు సెలువులు ప్రకటించారు. ఇదీ చదవండి: Delhi Rainfall Floods: యమున విశ్వరూపం.. ముంపులో ఢిల్లీ.. జల దిగ్బంధంలో జనజీవనం -
యమున విశ్వరూపం.. ముంపులో ఢిల్లీ.. జల దిగ్బంధంలో జనజీవనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రహదారులు నదులయ్యాయి. ఇళ్లు నీట మునిగిపోయాయి. శ్మశాన వాటికలు సైతం జలమయంగా మారాయి. రోడ్లపైకి వచ్చే వీలు లేకుండాపోయింది. మొత్తంగా ఢిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో యమునా నదిలో నీటమట్టం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏకంగా 208.62 మీటర్లకు చేరుకుంది. దీంతో నగరంలో మరిన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉధృత స్థిరంగా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల కారణంగా వజీరాబాద్, చంద్రావాల్, ఓక్లాలోని నీటి శుద్ధి ప్లాంట్లను ప్రభుత్వం మూసివేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనగానే వీటిని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. సహాయక చర్యల కోసం 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు వరద తీవ్రత దృష్ట్యా నగరంలో విద్యా సంస్థలు, అత్యవసర కార్యకలాపాలు లేని ప్రభుత్వ కార్యాలయాలకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురువారం సెలవు ప్రకటించింది. ఆదివారం దాకా సెలవు అమల్లో ఉంటుందని పేర్కొంది. నగరంలోకి భారీ వాహనాల ప్రవేశంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. అత్యవసర సరుకులు రవాణా చేసే వాహనాలు మినహా ఇతర వాహనాలు రాకూడదని స్పష్టం చేసింది. రోడ్లపై నీరు పొంగిపొర్లుతుండడంతో తూర్పు ఢిల్లీలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రహదారులను అధికారులు పూర్తిగా మూసివేశారు. మరికొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వరదల ప్రభావం మెట్రోరైలు వ్యవస్థపైనా పడింది. ముందు జాగ్రత్త చర్యగా యమునా నదిపై ఉన్న పట్టాలపై మెట్రోరైలు వేగాన్ని గంటకు 30 కిలోమీటర్లకు పరిమితం చేశారు. యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్లోకి ప్రయాణికులను అనుమతించడంలేదు. పంజాబ్, హరియాణాల్లోనూ... చండీగఢ్: పంజాబ్, హరియాణాలనూ వర్షాలు, వరద ఇంకా వదల్లేదు. జనజీవనం సాధారణ స్థితికి చేరుకోలేదు. విద్యా సంస్థలకు సెలవులను పంజాబ్ ప్రభుత్వం ఈ నెల 16 దాకా పొడిగించింది. ఢిల్లీలో యమునా నది వరదకు కారణమైన హరియాణాలోని హత్రికుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గించారు. వర్షాల వల్ల రెండు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 21 మంది మృతిచెందారు. హిమాచల్లో సురక్షిత ప్రాంతాలకు పర్యాటకులు సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో వరదలు, కొండ చరియలు విరిగిపడడం వల్ల ఉన్నచోటే చిక్కుకుపోయిన పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం చందర్తాల్ నుంచి 256 మందిని తరలించారు. గత నాలుగు రోజుల్లో 60 వేల మంది పర్యాటకులను తరలించినట్లు అధికారులు చెప్పారు. కాసోల్, ఖీర్గంగలో 10 వేల మంది చిక్కుకుపోయారు. వారు తమ కార్లను వదిలేసి బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. హిమాచల్లో వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 91కు చేరుకుంది. 14 మంది గల్లంతయ్యారు. కేజ్రివాల్ ఇంటి వద్దకు వరద నీరు ఢిల్లీలోని కీలక ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. సెక్రెటేరియట్ ఏరియాలో ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రుల నివాసాలు ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం జలమయంగా మారింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నివాసం వద్దకు వరద నీరు చేరింది. కాశ్మీరీ గేట్ బస్ టెరి్మనల్ నీట మునగడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను నిలిపివేశారు. ప్రఖ్యాత ఎర్రకోట గోడల వరకూ యమునా నది నీరు చేరుకుంది. ఇక్కడ మోకాళ్ల లోతు నీటిలో జనం నడిచి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. రాజ్ఘాట్, పురానా ఖిలా సైతం జలమయమయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సుశ్రుత ట్రామా కేర్ సెంటర్ మునిగిపోవడంతో 40 మంది రోగులను మరో ఆసుపత్రికి తరలించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ తదితర రాష్ట్రాల్లో మరికొన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. -
యమునా ఉగ్ర రూపం.. వరద గుప్పిట్లో సీఎం కేజ్రీవాల్ నివాసం
ఢిల్లీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు లేకపోయినా యమునా నది ఉప్పొగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే హర్యానాలోని హత్నికుండా బ్యారేజీ నుంచి నీటిని విడుదల కొనసాగుతుండటంతో యమున నది గరిష్ట నీటి మట్టంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. 45 ఏళ్ల రికార్డును తుడిచిపెడుతూ 208.66 మీటర్ల గరిష్ట నీటి మట్టంతో ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్లు ఎగువన ప్రవహిస్తోంది. అయితే గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చదవండి: Video: ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన వరద బాధితురాలు Rivers keeps reminding us that how powerful they are as Yamuna Ji flowing at its Record Levels#Delhi - #Noida pic.twitter.com/lzxw0JJBY9 — Weatherman Shubham (@shubhamtorres09) July 13, 2023 వరద గుప్పిట్లో కేజ్రీవాల్ నివాసం యమునా నది మహోగ్ర రూపంతో సెంట్రల్ ఢిల్లీ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. సీఎం కేజ్రీవాల్ నివాసం, ఢిల్లీ అసెంబ్లీని వరద నీరు చుట్టుముట్టింది. సివిల్ లైన్స్ ప్రాంతంలోని రింగ్ రోడ్ వరదలు చేరాయి. దీంతో మజ్ను కా తిలాను కశ్మీరీ గేట్ ఐఎస్బీటీతో కలిపే మార్గంపై రాకపోకలు నిలిపివేశారు అధికారులు. #WATCH | Civil Lines area of Delhi flooded, latest visuals from the area. Several areas of the city are reeling under flood and water-logging as the water level of river Yamuna continues to rise following heavy rainfall and the release of water from Hathnikund Barrage. pic.twitter.com/UecZsfIBwb — ANI (@ANI) July 13, 2023 ఇళ్లు జలమయం, పాఠశాలలకు సెలవులు యమునా నది ప్రళయంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో స్థానిక ప్రజలను ఖాళీ చేశారు. వారిని సహాయక శిబిరాలకు తరలించారు. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. వరదల ప్రభావంతో మరో రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నది ఒడ్డున ఉన్న ప్రాంతాలు యమునా బజార్, ప్రసిద్ధ టిబెటన్ మొనాస్టరీ మార్కెట్, నిగంబోధ్ ఘాట్లో దహన సంస్కారాలను నిలిపివేశారు. చదవండి: Delhi Floods: దేశ రాజధానికి ఈ దుస్థితి దేనికి? Flood has caused massive devastation in northern India, now has reached Delhi - Modi left for Paris! pic.twitter.com/I8eTMulhmo — Ashok Swain (@ashoswai) July 13, 2023 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల మూసివేత 'యమునా నది నీటిమట్టం పెరగడంతో వజీరాబాద్, చంద్రవాల్, ఓఖ్లాలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను మూసివేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. దీని వల్ల ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తుతుంది. నది నీటిమట్టం తగ్గిన వెంంటనే ఈ ప్లాంట్లను మళ్లీ రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. అదే విధంగా ఈ క్రమంలో హత్నికుండా బ్యారేజ్ నుంచి నీటి విడుదల నిలిపివేయాలని కేంద్రాన్ని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. అయితే పూర్తిస్థాయి నీటి మట్టం దాటేయడంతో, అదనపు నీటిని విడుదల చేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. #WATCH | Delhi CM Arvind Kejriwal says, "We are at the Wazirabad Water Treatment Plant. For the first time in Delhi, Yamuna has touched this level. Three Water Treatment Plants have been shut down due to this as the water has entered pumps & machines...25% of the water supply in… pic.twitter.com/SAAhguqo45 — ANI (@ANI) July 13, 2023 -
ఆల్ టైం రికార్డుకు చేరిన యమునా నది వరద ప్రవాహం
-
Delhi Floods: దేశ రాజధానికి ఈ దుస్థితి దేనికి?
దేశ రాజధాని నీట మునిగింది. మూడురోజుల ఎడతెరిపి ఇవ్వని వర్షంతో.. ఢిల్లీకి ఈ దుస్థితి ఏర్పడింది. 205 మీటర్ల డేంజర్ మార్క్ను ఇప్పటికే దాటేసి మరీ యమునా నది మహోగ్ర రూపంతో ఉప్పొంగుతోంది. నీటి స్థాయి ఇంకా పెరుగుతూ పోవడంతో ఎప్పుడు.. ఏం జరుగుతుందో ఆందోళన నెలకొంది. అందుకే యమునా నది తీరం వెంట 144 సెక్షన్ విధించారు!. అయితే వర్షాలే రాజధాని ప్రాంతం నీట మునగడానికి కారణం కాదా? ఢిల్లీ.. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం, దీనికి తోడు హర్యానా హర్యానాలోని హథ్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్లే రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం వరద పరిస్థితి నెలకొంది. మోకాళ్ల లోతు నీటిపైనే నీరు నిలిచి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే.. నిపుణులు మాత్రమే ఇవి మాత్రమే కారణాలు కాదని చెబుతున్నారు. ఢిల్లీ వరద పరిస్థితులపై సెంట్రల్ వాటర్ కమిషన్(CWC)కి చెందిన ఓ సీనియర్ అధికారి స్పందించారు. హర్యానా యమునానగర్లోని హథ్నీకుండ్ బ్యారేజ్ నుంచి ఎన్నో ఏళ్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుంటారు. 180 కిలోమీటర్ల ప్రయాణం.. అదీ రెండు, మూడు రోజుల తర్వాత అది ఢిల్లీకి చేరుకునేది. అయితే.. ఈసారి తక్కువ టైంలో వరద నీరు ఢిల్లీ వైపునకు చేరింది. అదే సమయంలో భారీ వర్షాలు కురవడంతో.. ఆ నీరు ఈ నీరు కలిసి ఢిల్లీని వరదలా ముంచెత్తాయి. అయితే.. దీనికి ప్రధాన కారణం ఆక్రమణలు, నేల కోత(కట్టడాలతో పాటు కాలుష్యమూ దీనికి కారణంగా చెబుతున్నారు). ఇంతకుముందు, నీరు ప్రవహించడానికి ఎక్కువ స్థలం ఉండేది. ఇప్పుడు నేల కోత, అక్రమ కట్టడాల కారణంగా అది కుంచించుకుపోయిందని చెబుతున్నారాయన. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH)లోని నేచురల్ హెరిటేజ్ డివిజన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ మను భట్నాగర్.. యమునా నది ఇంతలా ఉప్పొంగడానికి విపరీతమైన వర్షపాతం కారణమని అభిప్రాయపడ్డారు. యమునా నదికి ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఎక్కువ కాలం పడే వర్షాల వల్ల వరద ప్రభావం కనిపించేది కాదు. కానీ, ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. అందువల్లే దిగువన ఈ పరిస్థితి నెలకొందని మను భట్నాగర్ అంటున్నారు. నదీ డ్యామ్లపై అధ్యయనం చేసిన అనుభవం ఉన్న నిపుణుడు భీమ్ సింగ్ రావత్ యమునా నది నదీ కోత వల్ల.. నదీగర్భం ఎత్తు పెరిగిపోవడమేనని అభిప్రాయపడ్డారు. ‘‘వజీరాబాద్ నుంచి ఓక్లా వరకు 22 కిలోమీటర్ల నది విస్తీర్ణంలో.. 20 కంటే ఎక్కువ వంతెనలు ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. తద్వారా నదీ కోతకు గురై.. ఇసుక మేటలు ఏర్పడ్డాయి. అదే సమయంలో కాలుష్య కారకాలూ కూడా నీటి ప్రవాహానికి అడ్డుతగులుతున్నాయి’’ అని ఆయన చెప్పారు. ఢిల్లీలో యమునా నదీ చుట్టుపక్కల ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. పరిస్థితి ఇవాళ్టికి మరింత దిగజారే అవకాశం ఉండడంతో.. నదీ చుట్టుపక్కలకు వెళ్లకూడదని నిషేధాజ్ఞాలు జారీ అయ్యాయి. ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో.. 208.46 మీటర్ల లెవల్కు నీటి స్థాయి చేరుకుంది. 1978లో ఇది 207.49 మీటర్లు దాటింది. జాతీయ విపత్తు స్పందన బలగాల(NDRF) నుంచి 12 బృందాలు ఇప్పటికే మోహరించాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఢిల్లీలో జల ప్రళయం.. యమునా ఉధృతరూపం.. ఆల్టైమ్ రికార్డు
న్యూఢిల్లీ: ఢిల్లీలో జల ప్రళయం కొనసాగుతూనే ఉంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో యమునా నది మరింత ఉధృతరూపం దాల్చింది. నదిలో నీటిమట్టం గురువారం ఉదయం నాటికి 208.46 మీటర్లకు చేరింది. ఢిల్లీ చరిత్రలో ఇదే ఆల్టైమ్ రికార్డు. 1978లో 207.49 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఉదయం 10 గంటల తర్వాత యమునా నీటి ప్రవాహం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, దీనిని ‘తీవ్ర పరిస్థితి’గా కేంద్ర జల సంఘం పేర్కొంది. ఇక నది నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ విభాగం సూచించింది. బుధవారం నది సమీపంలోని ప్రాంతాలు నీటమునిగాయి. ప్రభుత్వ అధికారులు వేలాది మందిని సురక్షిత ప్రాతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c — ANI (@ANI) July 13, 2023 అమిత్ షాకు కేజ్రివాల్ లేఖ ఢిల్లీలో వరద ఉధృతి పెరుగుతోందని, యమునలో నీటిమట్టం మరింత పెరగకుండా చర్యలు తీసుకొనే విషయంలో సహకారం అందించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ రాజధానిలో భీకర వరదలు రావడం ప్రపంచానికి మంచి సందేశం కాదని చెప్పారు. జి–20 సదస్సుకు త్వరలో ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వబోతోందని గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర హోంశామంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. హరియాణాలోని హత్రీకుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గిస్తే ఢిల్లీలో వరదలు తగ్గుముఖం పడతాయని సూచించారు. ఢిల్లీ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. యుమునా నదిలో నీటిమట్టం 207.72 మీటర్లకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అంచనా వేసిందని తెలిపారు. అదే జరిగితే భారీ నష్టం వాటిల్లుతుందని కేజ్రివాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న జల ప్రవాహమే ఇందుకు కారణమని ఆయన ట్వీట్ చేశారు. #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c — ANI (@ANI) July 13, 2023 హిమాచల్లో 88 మంది మృతి హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నంకల్లా రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల మృతి చెందినవారి సంఖ్య 88కి చేరింది. మరో 16 మంది గల్లంతయ్యారు. 100 మంది క్షతగాత్రులయ్యారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. పశువుల కొట్టాలు కూలిపోయాయి. #WATCH | Traffic affected after GT Karnal road in Delhi gets flooded after rise in water level of Yamuna River pic.twitter.com/hoaKTR2ZCr — ANI (@ANI) July 13, 2023 మరోవైపు పంజాబ్, హరియాణాలో మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి. రెండు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య 18కు చేరుకుంది. హరియాణాలో చాలా ప్రాంతాలు జలమయంగా మారాయి. పంజాబ్లో 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో వర్షాల కారణంగా గత 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) హిమాచల్లోని మండీలో పూర్తిగా ధ్వంసమైన వంతెన -
యమునా నది ఉగ్రరూపం.. ఢిల్లీ హై అలర్ట్..
ఎడతెరిపి లేకుండా కురుస్తన్న వర్షాలు ఉత్తరాదినా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. గతకొన్నిరోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వానలతో ప్రజలు అల్లాడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లో వర్ష బీభత్సం నెలకొంది. నదులు, వాగులు కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మౌలిక సదుపాయలకు, సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. యమునా నది మహోగ్రం. ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువన ఉన్న హర్యానా నుంచి వరద పోటెత్తడంతో నది నీటిమట్టం పెరిగింది. ఓల్డ్ ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటి మట్టం 207.18 మీటర్ల ప్రమాదకర స్థాయికి చేరింది. అత్యధికంగా 207.49 మీటర్లతో పాత రైల్వే బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తోంది. #WATCH | Water level of river Yamuna continues to rise in Delhi. Visuals from Old Railway Bridge. Today at 8 am, water level of the river was recorded at 207.25 metres at the Bridge, inching closer to the highest flood level - 207.49 metres. The river is flowing above the… pic.twitter.com/e46LLHdeVe — ANI (@ANI) July 12, 2023 దీంతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కార్ యమునా నది పరివాహక ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి కోసం శిబిరాలు ఏర్పాటు చేసి, ఆహారం, తాగునీరు అందించింది. యమునా నదిలో నీటి మట్టం పెరగడంతో ఐటీవో ఛత్ ఘాట్ మునిగిపోయింది. కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బెంచీలు కూడా నీట మునిగాయి. ప్రస్తుతం యమునా నది నీటిమట్టం 207.25 మీటర్లుగా ఉంది. Mathura, Uttarakhand | The water level of the Yamuna River is increasing due to rain. All the police stations along the banks of the river have been instructed to increase vigilance in the area. Coordination is also being established with other agencies so that if there is… pic.twitter.com/lHHAVVTn6f — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 11, 2023 ప్రమాదకర స్థాయిని అధిగమించి సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) వరద పర్యవేక్షణ పోర్టల్ ప్రకారం.. యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయికి చేరుకుంది. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద మంగళవారం నీటి మట్టం రాత్రి 8 గంటలకు 206.76 మీటర్గలు ఉండగా బుధవారం ఉదయం 7 గంటలకు 207.18 మీటర్లకు పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతితో పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. #WATCH | Aftermath of the flood that ravaged Manali in Himachal Pradesh due to incessant heavy rainfall in the region. pic.twitter.com/z7dDd5qVSB — ANI (@ANI) July 12, 2023 పదేళ్లలో ఇదే తొలిసారి యమున నది ఇంత ప్రమాదకర స్థాయిలో ప్రవహించడం గత పదేళ్లలో ఇదే అత్యధికమని అధికారులు వెల్లడించారు. చివరగా 2013లో నది 207.32 మీటర్ల స్థాయికి చేరిందని తెలిపారు. ఎగువ పరీవాహక ప్రాంతాలలో నిరంతర వర్షపాతం, వారాంతానికి ఢిల్లీ, సమీప ప్రాంతాలలో భారీ వర్షపాతం కారణంగా నీటి మట్టం గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు. గతేడాది సెప్టెంబరులోనూ యమునా నది రెండుసార్లు ప్రమాద స్థాయిని అధిగమించి నీటిమట్టం 206.38 మీటర్లకు చేరుకుంది. మరోవైపు పాత రైల్వే వంతెనపై అన్నీ రాకపోకలను ఇప్పటికే నిలిపివేశారు. Delhi on high alert. Yamuna flowing above the danger mark. (@AnmolBali9/ @AkshayDongare_ )#Delhi #YamunaRiver #ITVideo pic.twitter.com/CZduuY2avD — IndiaToday (@IndiaToday) July 11, 2023 హిమాచల్లో జల విలయం మరోవైపు ఉత్తరాదిన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు, నివాసాలు వరద నీటిలో మునిగిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇంటి మందు పార్క్ చేసిన బైక్లు, కార్లు కొట్టుకుపోయాయి. కాలనీల్లోకి వరద నీరు చేరడంతో చెరువులలను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదల కారణంగా ఉత్తరాదిన మరణించిన వారి సంఖ్య సెంచరీ దాటింది. మూడు రోజుల్లో 31 మంది ఒక్క హిమాచల్ ప్రదేశ్లోనే గత మూడురోజుల్లో వరద ఉద్ధృతికి, కొండ చరియలు విరగిపడిన ఘటనలో 31 మంది మరణించగా.. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి 80 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో 1,300 రోడ్లు, 40 ప్రధాన బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 1,284 రూట్లలో బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. వరదలకు, కొండచరియలు విరిగిపడటం, రోడ్లు దెబ్బతినడంతో కారణంగా చండీగఢ్-మనాలి, సిమ్లా-కల్కా జాతీయ రహదారులు మూసివేయడంతో సిమ్లా మనాలితో సహా అనేక ప్రాంతాలలో నిత్యావసర వస్తువుల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిమ్లా, సిర్మౌర్, కిన్నౌర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్లో చిక్కుకొన్న 300 మంది ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా సరిహద్దులోని జుమ్మాగఢ్ నదిపై ఉండే ఓ వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రతికూల వాతావరణం కారణంగా చందేత్రల్ ప్రాంతంలో 300 మందికి పైగా చిక్కుకుపోయారు. వారిలో అత్యధికులు పర్యాటకులే ఉన్నారు. ఈ రాత్రికి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలున్నాయి. పలు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో సహాయ చర్యలు ముమ్మరం చేశారు. హర్యానాలోని అంబాలాలో ఓ గురుకుల పాఠశాల హాస్టల్లోకి వరద నీరు ప్రవేశించడంతో 730 విద్యార్థినులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వరద బాధితులతో కలిసి సీఎం భోజనం కసోల్, మణికరణ్, ఖీర్ గంగా, పుల్గా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఏరియల్ సర్వే నిర్వహించారు. కులులోని సైన్జ్ ప్రాంతంలోనే దాదాపు 40 దుకాణాలు, 30 ఇళ్లు కొట్టుకుపోయాయి. కులులో చిక్కుకుపోయిన పర్యాటకులతో ముఖ్యమంత్రి సంభాషించి, వారితో కలిసి భోజనం చేశారు. 15 వరకు స్కూల్స్ బంద్ న్ని ప్రభుత్వ పాఠశాలలను జూలై 15 వరకు మూసివేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాంపిటీటివ్ (ప్రిలిమినరీ) పరీక్షను ఆగస్టు 20కి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీషెడ్యూల్ చేసింది. రాష్ట్రంలో సంభవించిన విపత్తుల నేపథ్యంలో బాధిత కుటుంబాలందరికీ ముఖ్యమంత్రి రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. -
మహోగ్ర యమున
న్యూఢిల్లీ: ఎగువ హరియాణా ప్రాంతాల నుంచి ప్రవహిస్తున్న వరదనీటితో ఢిల్లీలో యమునా నది మహోగ్రంగా మారింది. దీంతో నది ప్రవాహంలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ముంపు ప్రాంతాల్లోని వేలాది మంది ప్రజలను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. సోమవారం రాత్రి నుంచే ఈ తరలింపు ప్రక్రియ మొదలుపెట్టారు. సంబంధిత వివరాలను ఢిల్లీ రాష్ట్ర జలశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ పత్రికా సమావేశంలో వెల్లడించారు. ‘ ముంపు ప్రాంతాల స్థానికుల కోసం వేలాది టెంట్లను ఈస్ట్, నార్త్, నార్త్ఈస్ట్, సౌత్ఈస్ట్, సెంట్రల్, షాదారా జిల్లాల్లో ఏర్పాటుచేశాం. హరియాణాలోని హాత్నీ కుండ్ బ్యారేజ్ నుంచి వరదనీటిని దిగువకు వదలడం వల్లే ఢిల్లీలో ఈ అప్రమత్త పరిస్థితి దాపురించింది. అయితే ఢిల్లీకి వరదలు మాత్రం రాబోవు. నదీ పరివాహక ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వరదనీరు చేరదు. శిబిరాల్లో ఇప్పటికే ఆహారం, తాగునీరు, ఇతర వసతులు సిద్ధంచేశాం’ అని ఆయన చెప్పారు. -
ఉత్తరాదిలో వరద-బురద.. మన పాపమే... ఈ ప్రకృతి శాపం!
కనీసం నలభై, యాభై ఏళ్ళుగా ఎన్నడూ చూడనంతటి వర్షం. ఎడతెరిపి లేకుండా నాలుగు రోజులుగా వర్షాలతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్మూ – కశ్మీర్లలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు. ఉత్తర భారతావనిలో అనేక చోట్ల ఎత్తైన ఆలయ శిఖరాలను సైతం ముంచేస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు. పేరుకుపోయిన బురదలో కూరుకుపోయిన ఆవాసాలు. ఆకస్మిక వరదలతో సిమ్లాలో కుప్పకూలిన భవనాలు. చమోలీలో కొట్టుకుపోయిన బ్రిడ్జీలు. విరిగిపడ్డ కొండచరియలు, కోతపడ్డ రహదారులు. ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న యమునా నదితో దేశ రాజధాని ఢిల్లీకి సైతం వరద ముప్పు. హిమాచల్లో 70 మందికి పైగా దుర్మరణం. ఒక్క ఉత్తరాఖండ్లోనే రూ.4 వేల కోట్లకు పైగా నష్టం. వరదలో చిక్కుకున్న వందలాది గ్రామాలు, వేలాది జనం. ప్రకృతి కోపిస్తే, మనిషి పిపీలకమేనని ఇవన్నీ మరోసారి ఋజువు చేస్తున్నాయి. వాతావరణ మార్పుతో పాటు అభివృద్ధి పేరిట మనం చేస్తున్న పర్యావరణ విధ్వంసమూ ఈ బీభత్సానికి కారణమని వెక్కిరిస్తున్నాయి. పట్టణాభివృద్ధి ప్రణాళికలో మన డొల్లతనాన్ని నగ్నంగా నిలబెడుతున్నాయి. హిమాలయ సానువుల్లోని పర్యాటక ప్రాంతాల్లో విద్యుత్కేంద్రాలే మునిగిపోయి, మట్టి పేరుకుపోవడంతో కరెంట్ లేదు. సాయం చేసే మనిషి లేడు. అనుకోకుండా వచ్చి ఇరుక్కుపోయిన వేల మంది పర్యటకులు ఎలాగోలా బయటపడదామంటే బస్సులు లేవు. విమాన సర్వీసులు లేవు. దోవ, ధైర్యం చెప్పే నాథుడు లేడు. కాసింత రోడ్డు దాటడానికి సైతం వేలకు వేలు దోపిడీ చేస్తున్న కొందరు దళారుల నడుమ ప్రభుత్వ యంత్రాంగం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.కుల్లూ, మనాలీ లాంటి ప్రాంతాల్లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బియాస్ నది ధాటికి ఆపి ఉంచిన వాహనాలు సైతం లక్కపిడతల్లా కొట్టుకుపోయాయి. ఇరుకైన జనావాసాల మధ్య నుంచి భారీ వృక్షాలు, కొయ్య దుంగలు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. పదేళ్ళ క్రితం 2013 జూన్ మధ్యలో ఉత్తరాఖండ్ను వణికించిన ‘హిమాలయన్ సునామీ’ లాంటి ప్రళయ భీకర దృశ్యాలనే తాజా సన్నివేశాలూ తలపిస్తున్నాయి. దృశ్యాలే కాదు... ఈ భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు కారణాలూ దాదాపు అప్పటి లాంటివేనని శాస్త్రవేత్తలు అనడం గమనార్హం. అప్పుడైనా, ఇప్పుడైనా ఒక పక్కన ఋతుపవనాలు, మరోపక్కన మధ్యధరా సముద్రంలో తలెత్తి, ఉత్తర భారతావనికి ఆకస్మిక వర్షాలు తెచ్చే తుపాను – రెండూ ఏకకాలంలో కలగలసి ఈ ముప్పు తెచ్చాయి. జూన్ చివరి వరకు వర్షపాతం 10 శాతం కొరవ పడితే, వారం రోజుల్లో ఈ వాతావరణ ఉత్పాతంతో 2 శాతం అధిక వర్షపాతం స్థాయికి చేరుకున్నామన్న లెక్క నివ్వెరపరుస్తోంది. అంతకన్నా కలవరమేమిటంటే, భూతాపం రోజురోజుకూ పెరుగుతున్నవేళ ఇలా ఉమ్మడిగా ముప్పు మీదపడడం పోనుపోనూ ఎక్కువవుతుందట! అలాగే, పర్యావరణ రీత్యా అతి సున్నిత హిమాలయ రాష్ట్రాలైన హిమాచల్, ఉత్తరాఖండ్లలో ప్రాజెక్టుల పేరిట సాగిస్తున్న విధ్వంసకర అభివృద్ధి నమూనాను ఇకనైనా మార్చుకోకుంటే వినాశనం తప్పదనడానికి తాజా ఘటన మరో హెచ్చరిక. తాజా ఘటనలు ఋతుపవనాలపై వాతావరణ మార్పుల ప్రభావానికీ అద్దం పడుతున్నాయి. వర్షం పడదు. పడితే కాసేపే భారీ వర్షం, ఆ వెంటే వరద. ఆకస్మిక వాన, వరదల్ని ముందుగా అంచనా వేయడం కష్టమే. వాతావరణ మార్పులను నిశితంగా గమనిస్తూ, ఆకస్మిక వరదలొచ్చే ప్రదేశాలను గుర్తించి హెచ్చరించాల్సి ఉంటుంది. ఈ ప్రమాదభరిత వాతావరణ ఘటనల్ని పసిగట్టా లంటే రాడార్ల వినియోగమే శరణ్యమని వాతావరణ శాస్త్రవేత్తల మాట. దానివల్ల 3 గంటల ముందే ముప్పును పసిగట్టవచ్చు. అయితే, ఇకపై హిమాలయాలు, పడమటి కనుమల లాంటి పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలు, భూపతనాలు పెరుగుతాయన్న హెచ్చరికను చెవికెక్కించుకోవాలి. నిరుడు జనవరి మొదటి నుంచి సెప్టెంబర్ 30 మధ్య మొత్తం 273 రోజుల్లో ఏకంగా 242 రోజుల్లో ఏదో ఒక ప్రకృతి విలయం తప్పలేదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కథనం. అంటే, తరచూ ఎదురయ్యే ముప్పు రీత్యా దీర్ఘకాలిక ప్రణాళికలే ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం. ఇక, దేశ రాజధాని ఢిల్లీ సైతం మొన్నటి దాకా ఎర్రటి ఎండతో, ఆపైన ముంచెత్తిన వానతో చిగురుటాకులా వణికిపోయింది. వీవీఐపీలు తిరిగే ఇండియా గేట్, జనక్పురి సహా మూడు ప్రధానమైన చోట్ల గత వారంలో రహదారులు కుంగిపోయాయి. కొన్నిచోట్ల 8 అడుగుల లోతు గుంటలుపడ్డాయి. ఇవన్నీ మన పట్టణ ప్లానింగ్ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో అద్దం పడుతున్నాయి. ఇప్పటికే ముంబయ్, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సహా అనేక నగరాల్లో పదే పదే ఇలాంటి పరిస్థితులే చూస్తున్నాం. చెట్ల నరికివేత, చెరువులు – నదీతీరాల్ని ఆక్రమించేలా విచ్చలవిడి నిర్మాణాలకు అనుమతి వీటికి కారణం. కాసింత వానకే మురుగునీటి పారుదల వ్యవస్థ కుప్పకూలుతోంది. ఇవన్నీ మన పాపాల ఫలితమే. ఇకనైనా, పాలకులు ఉష్ట్రపక్షి స్వభావాన్ని విడనాడాలి. విచ్చలవిడి అభివృద్ధితో వినాశనమే అని గ్రహించాలి. అంతకంతకూ పట్టణాలకు వలసలు పెరుగుతున్నందున పెరిగే అవసరాలకు తగ్గట్టు సరైన రీతిలో పట్టణాభివృద్ధి ప్రణాళిక చేయాలి. చెరువులు, కాలువలను మొత్తం పట్టణ స్వరూపంలో భాగమని గుర్తించాలి. వాటిని సవ్యంగా కాపాడి, నిర్వహిస్తేనే అర్బన్ ఫ్లడ్స్ను నివారించవచ్చు. అలాగే, ఇప్పటికే భారీ అప్పుల్లో పీకల లోతు కూరుకుపోయిన హిమాచల్ లాంటి రాష్ట్రాలు ఈ జలవిలయ నష్టాల నుంచి బయటపడాలంటే కష్టమైనా కొన్ని కఠిననిర్ణయాలు తీసుకోక తప్పదు. ప్రకృతిని మనం కాపాడితేనే అది మనల్ని కాపాడుతుంది. -
ఉత్తరాది అతలాకుతలం.. ప్రమాదస్థాయికి చేరుకున్న యమున
న్యూఢిల్లీ/సిమ్లా/జైపూర్: ఉత్తరభారతంలో మూడో రోజూ వర్ష బీభత్సం కొనసాగింది. ఆకస్మిక వరదల్లో వాహనాలు, రహదారులు కొట్టుకుపోయాయి. పంటపొలాలు, నివాసప్రాంతాలు నీటమునిగాయి. వానల ప్రభావం హిమాచల్ ప్రదేశ్పైనే ఎక్కువగా పడింది. ఇళ్లు కూలి, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటి వరకు 18 మంది, పంజాబ్, హరియాణాల్లో 9 మంది, రాజస్తాన్లో ఏడుగురు, యూపీలో ముగ్గురు చనిపోయారు. దీంతో ఉత్తరాదిన వరదల్లో ఇప్పటిదాకా 37 మంది చనిపోయారు. హిమాచల్లోని వివిధ ప్రాంతాల్లో 200 మంది పర్యాటకులు చిక్కుబడిపోయారు. ఢిల్లీలో యమునా నది ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. ఆదివారం రికార్డు స్థాయిలో కురిసిన వర్షంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. ప్రధాని మోదీ సోమవారం సీనియర్ మంత్రులు, అధికారులతో కలిసి ఉత్తరాదిన భారీ వర్షాలతో ఉత్పన్నమైన పరిస్థితులపై చర్చించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు స్థానిక యంత్రాంగాలతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయక కార్యక్రమాలను చేపట్టాలని ప్రధాని కోరారని పీఎంవో తెలిపింది. ప్రధాని మోదీ హిమాచల్, ఉత్తరాఖండ్ సీఎంలతో మాట్లాడి, అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపింది. హిమాచల్ప్రదేశ్లో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో సోమవారం మరో నలుగురు చనిపోయారు. సిమ్లా–కాల్కా హైవేలో కొంతభాగం కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సిమ్లా–కాల్కా మార్గంలో పట్టాలపై కొండచరియలు విరిగిపడటంతో మంగళవారం వరకు రైళ్ల రాకపోకలను ఆపేశారు. రాష్ట్రంలో విద్యాసంస్థలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. వాతావరణ శాఖ రాగల 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా 120 రోడ్లపై రాకపోకలు బందయ్యాయని, 484 నీటి సరఫరా పథకాలపై ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. జూలై 1–9 తేదీల మధ్య సాధారణ వర్షపాతం 160.6 మిల్లీమీటర్లకు మించి 69 శాతం ఎక్కువగా 271.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజ్పుర విద్యుత్ప్లాంట్లోకి చేరిన నీరు ఎగువనున్న హరియాణాలోని హత్నికుండ్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో ఢిల్లీలో యమునా నదిలో వరద పెరుగుతోంది. సోమవారం మధ్యాహా్ననికి ప్రమాద స్థాయి దాటి 205.33 మీటర్లకు చేరింది. మంగళవారం మధ్యాహా్ననికి 206.65 మీటర్లకు చేరి, క్రమేపీ తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. నదిలో నీరు 206 మీటర్ల మార్కును దాటితే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. యమునా నదికి అత్యంత సమీపంలో సుమారు 41 వేల మంది నివసిస్తున్నట్లు అంచనా. గత ఏడాది సెపె్టంబర్లో రెండుసార్లు యమునా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహించింది. పంజాబ్, హరియాణాల్లో వానల తీవ్రత సోమవారమూ కొనసాగింది. పంజాబ్ రాష్ట్రం పటియాలా జిల్లాలోని రాజ్పుర విద్యుత్ ప్లాంట్లోకి వరద చేరడంతో 700 మెగావాట్ల యూనిట్ను అధికారులు మూసివేశారు. సట్లెజ్ యయునా లింక్ కెనాల్ పొంగిపొర్లి రాజ్పురలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలోకి నీరు చేరింది. ఆస్పత్రుల్లోకి చేరిన వరద రాజస్తాన్లోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అజ్మీర్ రైల్వేస్టేషన్లో పట్టాలపైకి, జేఎల్ఎన్ ఆస్పత్రి వార్డుల్లోకి వరద నీరు ప్రవేశించింది. టోంక్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్లోని హాపూర్, బదౌన్ జిల్లాల్లో ఇళ్లు కూలిన ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. షహరాన్పూర్లో 15 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాదిన మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. -
యూపీలో ఘోర పడవ ప్రమాదం.. 20 మంది మృతి!
లక్నో: ఉత్తర్ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. బాందా జిల్లాలోని యమునా నదిలో గురువారం ఓ పడవ మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బోటులో 50 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. మార్కా గ్రామంలోనే మార్కా ఘాట్ నుంచి ఫతేపూర్కు పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్లే ప్రమాదానికి గురైనట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు.. పడవలోని మహిళా ప్రయాణికులు రక్షాబంధన్ కోసం వెళ్తున్నట్లుగా స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పలువురి ఆచూకీ గల్లంతైనట్లు చెప్పారు. ‘మార్కా గ్రామం నుంచి ఫతేపూర్ వెళ్తుండగా యమునా నదిలో పడవ బోల్తా పడింది. బోటులో ఎంతమంది, ఎవరెవరు ఉన్నారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.’ అని బాందా పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: అన్నమయ్య జిల్లా: కోడలి తల నరికిన అత్త.. వివాహేతర సంబంధమే కారణం? -
ఏడాది చివరకు కాలుష్యరహిత యమున
న్యూఢిల్లీ: రాబోయే డిసెంబర్ చివరకు యమునా నదిలోకి ఎలాంటి మురికి నీరు చేరదని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ చెప్పారు. నదిలోకి దారితీసే అన్ని మురుగుకాల్వలను అప్పటికల్లా మూసివేస్తారన్నారు. 1,300కిలోమీటర్ల పొడవున ప్రవహించే యమునా నది దేశంలోని అత్యంత కలుషిత నదుల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ నది నుంచి దేశరాజధానికి మంచినీటి సరఫరా జరుగుతోంది. ఢిల్లీలో నది 22 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. కానీ నదిలోని 98 శాతం కలుషితమంతా ఇక్కడనుంచే వస్తోంది. నదిలోకి మురుగునీరు వదిలే 18 డ్రెయిన్స్ ఉన్నాయని, వీటిని మూసివేసి, మురుగునీటిని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు మళ్లించే పనులు చేపడతామని అశోక్ చెప్పారు. ప్లాంట్లలో శుద్ధి చేసిన నీటిని నదిలోకి వదులుతారని, దీంతో నదిలో పరిశుభ్రమైన నీరు మాత్రమే ప్రవహిస్తుందని వివరించారు. యమునా నదిని శుభ్రపరిచేందుకు ఎన్జీయోధా(నమామి గంగే యమునా ఆఫ్ ఢిల్లీ ఏరియా)ను ప్రారంభిస్తామన్నారు. -
ఇదేం వింత.. పడవ గాల్లో ఎగరడం ఏంటి..!?
Meghalaya Cleanest Umngot River Images: ఇక్కడ ఉన్న ఫోటో చూడగానే ఏమనిపిస్తుంది.. పడవ ఏంటి గాల్లో ఎగురుతుంది.. ఇదేలా సాధ్యం అని ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కసారి బాహుబలి చిత్రం గుర్తుకు వస్తుంది. కాసేపు పరీక్షగా చూస్తే.. ఆశ్చర్యంతో మన కళ్లు పెద్దవి అవుతాయి. అబ్బ నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో కదా.. ఎక్కడబ్బా.. ఇంత పరిశుభ్రమైన.. స్వచ్ఛమైన నది.. ఓ సారి వెళ్లి చూసి వస్తే బాగుండు అనిపిస్తుంది. నది అడుగు భాగంలో ఉన్న ప్రతి అంశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత స్వచ్ఛంగా ఉందంటే.. పడవ ఏదో అద్దం మీద ఉన్నట్లుంది. ఇంత స్వచ్ఛమైన నది ఏ దేశంలో ఉందో కదా అని ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంత అందమైన, పరిశుభ్రమైన, స్వచ్ఛమైన నది మన దేశంలోనే ఉంది. ఈ ఫోటోని కేంద్ర జలశక్తి వనరుల శాఖ ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: లారీ ఎక్కిన పడవ.. ఆశ్చర్యంగా ఉందే!) కేంద్ర జలశక్తి శాఖ మంగళవారం తన ట్విటర్లో ఈ నది ఫోటో షేర్ చేసింది. ‘‘ప్రపంచలోని అత్యంత స్వచ్ఛమైన నదుల్లో ఇది ఒకటి. భారతదేశంలోనే ఉంది. మేఘాలయ రాష్ట్రం, షిల్లాంగ్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది ఉంగోట్ నది. నదిలో పడవ మీద వెళ్తున్న ఫోటో చూస్తే.. అది గాల్లో తేలుతుందేమో అనిపిస్తుంది. ఈ నదిలో నీరు చాలా స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉంటాయి. దేశంలోని నదులన్ని ఇలా ఉండాలని ఆశిస్తున్నాను. హ్యాట్సాఫ్ మేఘలయ ప్రజలు’’ అంటూ ట్వీట్ చేసిన ఈ ఫోటో గంటల వ్యవధిలోనే వైరలయ్యింది. (చదవండి: దుర్గం చెరువు: విదేశాల్లో ఉన్నామా అనే ఫీలింగ్!) ఇది చూసిన నెటిజనులు.. ‘‘భారత దేశంలో ఇంత స్వచ్ఛమైన నది ఉందంటే నమ్మబుద్ది కావడం లేదు.. యమునా నది ఎప్పుడు ఇంత సుందరంగా మారుతుంది... గంగా నది మాట ఏంటి.. ఏది ఏమైనా నదిని పదిలంగా కాపాడుకుంటున్న మేఘలాయ ప్రజలకు ధన్యవాదాలు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఇప్పటి వరకు ఈ ఫోటోకి 19 వేలకు పైగా లైక్లు, 3 వేల రీట్వీట్లు వచ్చాయి. One of the cleanest rivers in the world. It is in India. River Umngot, 100 Kms from Shillong, in Meghalaya state. It seems as if the boat is in air; water is so clean and transparent. Wish all our rivers were as clean. Hats off to the people of Meghalaya. pic.twitter.com/pvVsSdrGQE — Ministry of Jal Shakti 🇮🇳 #AmritMahotsav (@MoJSDoWRRDGR) November 16, 2021 చదవండి: సినిమా సెట్టింగో.. స్పెషల్ ఎఫెక్టో అనుకుంటున్నారా..! -
నదిలో నీళ్లు చల్లుతున్నారు.. కొత్త టెక్నిక్ కాదు.. మరేంటి!
న్యూఢిల్లీ: యమునా నదిలో కాలుష్యంపై నెటిజనులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాలుష్యం పెరిగిపోవడంతో యమునా నది విషపూరిత నురుగులతో నిండిపోయింది. ఇందులో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నీటిపై తేలియాడుతూ తెరతెరలుగా తరలివస్తున్న విషపూరిత నురుగును తొలగించడానికి ఢిల్లీ వాటర్ బోర్డు అధికారులు చేపట్టిన తాత్కాలిక చర్యలు అపహాస్యానికి గురయ్యారు. కాళింది కుంజ్ వద్ద నురగను అడ్డుకోవడానికి 15 పడవలను రంగంలోకి దించారు. వెదురు తడికలు అడ్డుకట్టి నురగను ఆపడానికి ప్రయత్నించారు. నదిలో పేరుకుపోయిన విషపు నురగను తొలగించడానికి పైపు ద్వారా నీటిని వెదచల్లారు. (చదవండి: సినిమా సెట్టింగో.. స్పెషల్ ఎఫెక్టో అనుకుంటున్నారా..!) ఈ చర్యలపై ట్విటర్లో నెటిజనులు తమదైన శైలిలో స్పందించారు. ‘ఇదేదో కొత్త టెక్నిక్లా ఉందే.. మాకూ చెబితే ఊరి చెరువులను శుభ్రం చేసుకుంటామంటూ’ సెటైర్లు పేల్చారు. ‘వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి భారతీయుడు తమ టేబుల్ ఫ్యాన్లను తెరిచిన కిటికీల వైపు చూపించాలని ప్రభుత్వం ఆదేశించింది’ అంటూ మరొకరు చురక అంటించారు. ‘RIP Science’ అంటూ ఇంకొరు సానుభూతి ప్రకటించారు. యమునా నదిలో కాలుష్య నివారణకు శాశ్వత చర్యలు చేపట్టకుండా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న పాలకులు, అధికారులపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కాలుష్యాన్ని తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని హస్తిన వాసులు డిమాండ్ చేస్తున్నారు. -
కాలుష్య కోరల్లో యమునా నది
-
సినిమా సెట్టింగో.. స్పెషల్ ఎఫెక్టో అనుకుంటున్నారా..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంది. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వీటికి తోడు జల కాలుష్యం కూడా తీవ్ర స్థాయికి చేరింది. పరిశ్రమల నుంచి విడుదలయిన వ్యర్థాలు యమునా నదిలో కలిసి.. దాన్ని గరళంగా మార్చేశాయి. నది పైన తెల్లని నురగ ఏర్పడింది. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో జనాలు నదీ స్నానాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో పలువురు ఢిల్లీ మహిళలు కాలుష్య కాసారంగా మారిన యమునా నదిలో స్నానాలు ఆచరించారు. రసాయనాలతో కలుషితమై నురగలు కక్కుతున్నప్పటికి జనాలు.. దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా స్నానాలు చేశారు. సడెన్గా చూస్తే.. ఇదేదో సినిమా సెట్టింగో లేక స్పెషల్ ఎఫెక్ట్లానే అనిపిస్తుంది. (చదవండి: ప్రమాదకర స్థాయికి ఢిల్లీలో వాయు కాలుష్యం) ఇక ప్రతి ఏటా శీతాకాలంలో ఢిల్లీలో వాతావరణం చాలా దారుణంగా ఉంటుంది. పొగ ఆవరించి.. ఎదురుగా వచ్చే వారిని గుర్తించడం కష్టం అవుతుంది. దానికి తోడు వాయు కాలుష్యం కూడా చేరి.. పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ఇక గత మూడు రోజులుగా ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతోందని అధికారులు తెలిపారు. తీవ్రమైన వాయు కాలుష్యంగా కారణంగా జనాలు గొంతులో మంట, కళ్ల నుంచి నీరు కారడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. చదవండి: ఊపిరి.. ఉక్కిరిబిక్కిరి.. -
25 ఏళ్లుగా సాధ్యం కానిది.. కరోనాతో
న్యూఢిల్లీ: లాక్డౌన్కు ముందు దేశంలోని ప్రధాన నదులన్ని కాలుష్యకాసారాలుగా ఉండేవి. మురుగు నీరు, రసాయన వ్యర్థాలు, మానవ కళేబరాలతో కాలుష్యానికి కేంద్ర బిందువులుగా నిలిచేవి. అయితే కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఈ నదులకు మహర్దశ పట్టిందని చెప్పవచ్చు. దాదాపు రెండు నెలలుగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, పరిశ్రమలు మూతపడటంతో నదులన్ని తిరిగి స్వచ్ఛతను సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే యమునా నది గతంలో లేనంత స్వచ్ఛంగా మారింది. యమునా నది శుభ్రత కోసం గత 25 ఏళ్లుగా ప్రభుత్వాలు రూ.5000 కోట్లు ఖర్చు పెట్టాయి. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఈ క్రమంలో ఏళ్లుగా.. కోట్లు ఖర్చు చేసినా రాని ఫలితాన్ని రెండు నెలల లాక్డౌన్ సాధించింది. కాలుష్యం తగ్గడంతో పక్షులు యమునకు వలస కట్టాయి. చేపల్ని, ఇతర నీటి ప్రాణుల్ని వేటాడుతూ.. ప్రకృతి ధర్మాన్ని నిర్వహిస్తున్నాయి. యమునా నది దాదాపు 1,400 కిలోమీటర్ల పొడవునా ఏడు రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో నది ఒడ్డున ఉన్న పారిశ్రామిక యూనిట్లు వాటి మలినాలను యమునలోకి విడుదల చేస్తాయి. హర్యానా పానిపట్ నుంచి ఢిల్లీ మధ్య దాదాపు 300 యూనిట్లకు పైగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడే పారిశ్రామిక ఉత్సర్గాలు యమునలో కలుస్తాయి. ఢిల్లీ, ఆగ్రా, మధుర వద్దే 80 శాతం కాలుష్య కారకాలు నదిలో కలుస్తాయి. ఫలితంగా ఇది దేశంలోనే అత్యంత కలుషితమైన నదిగా మారింది. (పరిశ్రమ మళ్లీ తెరుస్తున్నారా? జర భద్రం!) అయితే లాక్డౌన్ వల్ల ఢిల్లీలో యమునా నది 33 శాతం స్వచ్ఛంగా మారినట్లు ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. మధుర దిశగా సాగే యమున మరింత శుభ్రంగా ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా యమునా యాక్షన్ ప్లాన్ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ‘గత 30 ఏళ్లలో యమునా నదిని ఇంత శుభ్రంగా ఎప్పుడు చూడలేదు. సాధారణంగానే నదులకు తమను తాము శుభ్రపర్చుకునే లక్షణం ఉంటుంది. గత 2 నెలలుగా కాలుష్యకారకాలు యమునలో కలవకపోవడంతో స్వచ్ఛంగా మారింది. ఇది ఇలాగే కొనసాగాలంటే.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ఆయన కోరారు. -
‘యమున’ సాక్షిగా పస్తులు
సాక్షి, న్యూఢిల్లీ : లాక్డౌన్ నేపథ్యంలో ఢిల్లీ నగరంలోని యమునా నదీ తీరాన వందల మంది వలస కార్మికులు తిండీ తిప్పలు లేక పస్తులతో అలమటిస్తున్నారు. కనీసం తలదాచుకునేందుకు షెల్టర్ లేక అల్లాడి పోతున్నారు. దాదాపు 114 మందికి ఆశ్రయం కల్పించిన తాత్కాలిక రేకుల షెడ్డును ఆకలితో అల్లాడిపోతున్న యువకులు ఆక్రోశంతో శనివారం ఆ షెడ్డును కాస్త తగులబెట్టడంతో అందరు రోడ్డున పడ్డారు. అప్పటి వరకు అరకొరగా వారికి అన్న పానీయాలు అందించిన ఢిల్లీ అధికారులు రేకుల షెడ్డును తగులబెట్టిన ఘటనతో వారికి ఆది, సోమ వారాల్లో ఆహారాన్ని అందించలేదట. (అది నకిలీ లింక్.. క్లిక్ చేస్తే అంతే!) మంగళవారం వారికి స్థానిక గురుద్వారా వారందరికీ ఒక్క పూట భోజనాన్ని ఏర్పాటు చేసిందట. మళ్లీ ఈ రోజు బుధవారం ఉదయం ఢిల్లీ అధికారులు ఒక్క పూట భోజనాన్ని ఏర్పాటు చేశారట. అదీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆదేశాల మేరకు. జనతా కర్ఫ్యూ అనంతరం మార్చి 24వ తేదీన మొదటిసారి లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఢిల్లీలోని వలస కార్మికులంతా అప్పటి వరకు తాము దాచుకున్న అతి స్వల్ప సొమ్ముతో ఏప్రిల్ మొదటి వారం వరకు నెట్టుకొచ్చారట. అప్పటి నుంచి వారికి తలదాచుకునేందుకు ఇంత నీడతోపాటు ఆకలి దప్పులు తీర్చుకునేందుకు ఆస్కారం లేకుండా పోయింది. ఒకటి, రెండు రోజులు అక్కడిక్కడ అడుక్కొని అర్ధాకలితో బతికిన వారికి శనివారంతో ఏమీ లేకుండా పోయింది. ఢిల్లీ అధికారులు కూడా వారికి ఆహారాన్ని అందించలేక పోయారు. దాంతో ఆక్రోశంతో కొంత మంది యువకులు రేకుల షెడ్డును తగులబెట్టారు. (లాక్డౌన్: ఉండలేం.. ఊరెళ్లిపోతాం!) ఈ సందర్భంగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన లాఠీఛార్జీకి పక్కనున్న నదిలో దూకి ఓ యువకుడు మరణించారని వలస కార్మికులు ఆరోపిస్తుండగా, అది నిజం కాదని, నదిలో చనిపోయిన వ్యక్తి వివరాలు కూడా తెలియడం లేదని పోలీసులు చెబుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసానికి పట్టుమని పది కిలోమీటర్ల దూరంలో కూడాలేని ఆ వలస కార్మికులకు పట్టుమని పిడికెడు అన్నం పెట్టేవారు కూడా లేకుండా పోయారట. యమునా నది మీదుగా వెళుతున్న ఓ మంచినీళ్ల పైపు లీకేజీ నీళ్లను పట్టుకొని వారు గొంతు తడుపుకుంటున్నారు. ఒకటి, రెండు రోజులైతే తాము పస్తులు ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని, అంతకుమించి ఉండలేమని వలస కార్మికులు వాపోతున్నారు. (లాక్డౌన్పై నిరసన.. రోడ్లపైకి వేలాది జనం!) -
కలకలం.. డ్రైనేజీలో మరో రెండు శవాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని యమున నది కాల్వలో గుర్తుతెలియని రెండు మృతదేహాలు బయటపడం కలకలం రేపింది. గోకుల్పూరిలోని యమున తూర్పు కాల్వ డ్రైనేజీలో ఆదివారం.. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రెండు శవాలను ఢిల్లీ పోలీసులు కనుగొన్నారు. మృతదేహాలు ఎవరివి అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఈ శవాలు గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోవడంతో వాటిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. ప్రమాదశాత్తు కాల్వలో పడి మరణించారా..? లేక ఢిల్లీ అల్లర్లలో భాగంగానే వీరు కూడా మృతి చెందారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. డెడ్బాడీలను పోస్ట్మార్టం నిమిత్తం జీటీబీ ఆస్పత్రికి తరలించారు. కాగా ఘర్షణలు చోటుచుకున్న ప్రాంతంలోనే ఈ మృతదేహాలు లభ్యం కావడం గమనార్హం. (ఢిల్లీ అల్లర్లు: డ్రైనేజీలో ఆఫీసర్ మృతదేహం) పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల్లో గుర్తు తెలియని దుండగులు ఇంటలిజెన్స్ బ్యూరో కానిస్టేబుల్ అంకిత్ శర్మను దారుణంగా హతమార్చి.. మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసిన విషయం విదితమే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో డ్రైనేజీలో మరో రెండు మృతదేహాలు లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీ అల్లర్లో భాగంగానే వీరిని హత్యచేసి.. కెనాల్లో పడేశారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు తుది నివేదికను ఇవ్వాల్సి ఉంది. కాగా ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల కారణంగా ఇప్పటి వరకు 42 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
కేజ్రీవాల్.. చొక్కా విప్పి రా
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ముఖ్యంగా బీజేపీ, ఆప్ల మధ్య మాటల దాడి తారా స్థాయికి చేరుతోంది. బుధవారం ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సవాలు విసిరారు. యమునా నది కాలుష్యం గురించి మాట్లాడిన షా.. కేజ్రీవాల్కు ధైర్యం ఉంటే చొక్కా విప్పి.. ఒక్కసారి అందులో మునిగి చూడాలని అన్నారు. అలాగైతే యమునా నదిలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో ఆయనకు తెలుస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఆప్ నేతలు యమునా నదిని శుభ్రపరుస్తామని చెప్పారు. అయితే కేజ్రీవాల్కు నేను మీకు ఈ రోజు సవాలు విసురుతున్నాను. మీరు మీ చొక్కా విప్పి.. యమునా నదిలో ఒక్కసారి మునిగి చూడండి. అప్పుడు ఆ నదిలో నీరు ఎంత కలుషితమైందో మీకే తెలుస్తుంద’ని అమిత్ షా అన్నారు. కొద్ది రోజుల క్రితం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే యమునా నది శుభ్రపరుస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో ప్రజలు కాలుష్యం లేని యమునా నదిలో దిగి స్నానం చేసేలా చేస్తామని అన్నారు. అలాగే సామాన్య ప్రజలతో కలిసి తాను కూడా యమునా నదిలో స్నానం చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా కేజ్రీవాల్కు సవాలు విసిరినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం కోసం నిధులు కేటాయించాల్సిందిగా కేంద్రానికి కేజ్రీవాల్ లేఖ రాశారు. -
పోటెత్తిన వరద : వంతెన మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ప్రమాదస్ధాయిని మించి ప్రవహిస్తుండటంతో లోహ పులిగా పేరొందిన పాత ఇనుప బ్రిడ్జిపై వాహన రాకపోకలను సోమవారం మధ్యాహ్నం నుంచి నిలిపివేశారు. యమున నదిలో ప్రమాదస్ధాయి 205.33 మీటర్లు కాగా నది ప్రవాహం 205.20 మీటర్లకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. యమున నది ప్రవాహం మరింత పెరుగుతుందనే అంచనాలతో పురాతన ఇనుప వంతెనను మూసివేయాలని జిల్లా మేజిస్ర్టేట్ ఉత్తర్వులు జారీ చేశారని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్ నుంచి వరద నీటిని విడుదల చేసిన తర్వాత యమునా నదికి వరద ప్రవాహం పోటెత్తింది. మరోవైపు వరద తీవ్రతతో ఢిల్లీలో చేపట్టాల్సిన చర్యలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. -
యమునాలో పెరుగుతున్న ఉధృతి..
న్యూఢిల్లీ : యమునా నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటం ఢిల్లీ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. యమునా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. హర్యానాలోని హతిని కుంద్ బ్యారేజీ నుంచి 4.30 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో హర్యానా యుమునా నగర్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు. పరివాహక ప్రాంతంలో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు దిగువన వరద ఉధృతి పెరుగుతుండటంతో ఢిల్లీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షిస్తూ.. జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. -
ఢిల్లీలో సిగ్నేచర్ బ్రిడ్జి
న్యూఢిల్లీ: ఎంతోకాలంగా ఢిల్లీ ప్రజలు ఎదురుచూస్తున్న యమునా నదిపై నిర్మించిన సిగ్నేచర్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేడు ప్రారంభించనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ వంతెన ఉత్తర, ఈశాన్య ఢిల్లీల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. దీంతోపాటు వజీరాబాద్ పాతవంతెనపై రద్దీ కూడా గణనీయంగా తగ్గనుంది. ఈ నెల 5వ తేదీ నుంచి వంతెనపై రాకపోకలను అనుమతిస్తామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. సిగ్నేచర్ బ్రిడ్జికి ఉన్న ప్రత్యేకతల కారణంగా పర్యాటక ప్రాంతంగా మారనుందని చెప్పారు. ఎలివేటర్ల ద్వారా వంతెనపై 154 మీటర్ల ఎత్తైన ప్రాంతం నుంచి ఢిల్లీ నగరాన్ని చూడటం ఒక ప్రత్యేకత కానుందని చెప్పారు. మొత్తం 50 మందిని తీసుకెళ్లే సామర్థ్యమున్న గాజు ఎలివేటర్లు నాలుగింటిని వచ్చే రెండు నెలల్లో ఏర్పాటు చేయనున్నామన్నారు. కేబుళ్లతో వేలాడే ఈ వంతెన పొడవు 675 మీటర్లు, ఎత్తు 165 మీటర్లు కాగా వెడల్పు 35 మీటర్లు. మొట్టమొదటిసారిగా 1997లో అప్పటి ప్రభుత్వం రూ.464 కోట్లతో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రతిపాదించింది. 2004లో ఈ బ్రిడ్జిని నిర్మించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. 2007లో ఢిల్లీ మంత్రివర్గం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 2010లో కామన్వెల్త్ గేమ్స్ నాటికి నిర్మాణం పూర్తి చేసేందుకు సవరించిన అంచనా రూ.1,131 కోట్లతో ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. 2011 నుంచి వంతెన నిర్మాణంలో పలు అవాంతరాలు ఎదురయ్యాయి. 2015 నాటికి వంతెన నిర్మాణ అంచనా వ్యయం రూ.1,594 కోట్లకు పెరిగిపోయింది. 2018 నవంబర్ 4వ తేదీకి ఎట్టకేలకు ‘సిగ్నేచర్’ కల నిజమయింది. -
బెదిరించిన మాజీ ప్రియున్ని నమ్మించి..
సాక్షి, న్యూఢిల్లీ : తన నగ్న ఫొటోలు ఇంటర్నెట్లో పెడతానని బెదిరింపులకు దిగిన మాజీ ప్రియుడిని ఓ యువతి కిరాతకంగా హతమార్చింది. కూల్డ్రింక్లో నిద్రమాత్రలు కలిపి ప్రాణాలు తీసింది. అనంతరం మరో యువకుడి సాయంతో మృతదేహాన్ని యమునా నదిలో విసిరేసింది. ఈ ఘటనలో యువతికి సహాయం చేసింది ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్లోని మథురలో ఈ ఘటన మూడు వారాల క్రితం జరిగింది. వివరాలు.. సుశీల్ కుమార్ (23), డాలీ చౌదరీ (20) కొంతకాలం కలిసి ఉండి విడిపోయారు. అనంతరం తనకు నొయిడాలో ఉద్యోగం ఇప్పించిన మోహిత్ మావితో డాలీ స్నేహం చేసింది. ఈ విషయం తెలుసుకున్న సుశీల్ డాలీపై బెదిరింపులకు దిగాడు. మళ్లీ తనతో కలిసి ఉండాలనీ, లేదంటే తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు దిగిన ప్రయివేటు ఫొటోలను ఇంటర్నెట్లో పెట్టి పరువు తీస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. మాజీ ప్రియుడి వ్యవహారంతో ఆందోళనకు గురైన డాలీ అతన్ని అంతమొందించాలని భావించింది. తను పెళ్లిచేసుకోబోతున్న మనీష్ చౌదరీతో పథకం రచించింది. ఓ హోటల్లో ఆగస్టు 11న డాలీ సుశీల్ కలుసుకున్నారు. అక్కడ ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించిన డాలీ సుశీల్ను నమ్మించింది. నిద్రమాత్రలు కలిపిన కూల్డ్రింక్ని అతడి చేత తాగించింది. మనీష్ ప్రాణాలు విడిచిన అనంతరం మృతదేహాన్ని కాబోయే భర్త మనీష్తో కలిసి యమునా నదిలో పడేసింది. బయటపడిందిలా..! తన కొడుకు కనిపించడం లేదని సుశీల్ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సుశీల్ తన ప్రేయసి చేతిలో హత్యకు గురయ్యాడని కనుగొన్నారు. కాగా, నిందితులు డాలీ, మనీష్లను అరెస్టు చేశామని మథుర డీసీపీ మనుదీప్సింగ్ రంధ్వా తెలిపారు. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి..! -
దేశ రాజధానిని ముంచెత్తిన వరద
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో ఢిల్లీని వరద ముంచెత్తింది. యమునా నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. పురాతన యమునా బ్రిడ్జిపై రాకపోకలను నిలువరించారు. వరద పరిస్థితిని ఉన్నతస్ధాయి సమావేశంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అధికారులతో సమీక్షించారు. రెండు రోజులుగా కుండపోత వర్షాలతో ఢిల్లీ తడిసిముద్దయింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల ఉన్నతాధికారులతో ఇప్పటికే అత్యవసర సమావేశం నిర్వహించారు. హర్యానాలోని హతింకుండ్ బ్యారేజ్ నుంచి నగరానికి 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో తలెత్తే పరిస్థితిపైనా ఆయన అధికారులతో సమీక్షించారు. యమునా నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతాల్లో వందలాదిమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పదివేల మందికి పైగా ప్రజలు వరద ముప్పును ఎదుర్కొంటున్నారని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని ప్రీత్ విహార్ నోడల్ అధికారి అరుణ్ గుప్తా చెప్పారు. ప్రజలకు విద్యుత్ సరఫరాలో అవాంతరాలు లేకుండా, ఆహారం, తాగునీరు అందుబాటులో ఉంచాలని, నిర్వాశితుల శిబిరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం కేజ్రీవాల్ అధికారులను ఆదేశించారు. రైళ్ల రద్దు, దారిమళ్లింపు.. ఢిల్లీలో వరద ముప్పు కారణంగా పురాతన యమునా బ్రిడ్జిని మూసివేయడంతో 27 పాసింజర్ రైళ్లను అధికారులు రద్దు చేశారు. పలు రైళ్లను దారిమళ్లించారు. వరదల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం పరిస్థితిని సమీక్షించేందుకు ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ను నెలకొల్పింది. యమునా నది ప్రమాదస్థాయిని చేరుకోవడంతో నదిపై ఢిల్లీ-హౌరా లైన్లో నిర్మించిన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిని మూసివేయాలని అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. 150 ఏళ్ల కిందట నిర్మించిన ఈ బ్రిడ్జి ఢిల్లీని పొరుగు రాష్ట్రాలతో కలిపేందుకు ప్రధాన వారధిగా పనిచేస్తోంది. -
భారీ వరదలు.. ఉధృతంగా ప్రవహిస్తున్న యమున నది
-
భారీ వరదలు.. వణుకుతున్న ఢిల్లీ
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అవుతోంది. పైన కురుస్తున్న వర్షలతో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత మూడేళ్లుగా ఎన్నడూ లేని రీతిలో ఢిల్లీలో నీటి మట్టం 205 మీటర్లకి చేరింది. హర్యానాలోని హిరాకుడ్ డ్యాం నుంచి శనివారం ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో నది ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం సహయక చర్యలను ముమ్మరం చేసింది. ముంపు ప్రాంతాల్లో నివశిస్తున్న 1500 మందిని పునరావాస ప్రాంతాలకు తరలించినట్లు అధికారాలు తెలిపారు. పునరావాస కేంద్రాలుగా ఇప్పటి వరకు 550 టెంట్లు, 10 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తూర్పు ఢిల్లీ జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారాలు అప్రమత్తంగా ఉండాలని అదేశించారు. అవసరమైతే పాఠశాలలు, ప్రభుత్వ భవనాలలో ప్రజలకు పునరావాసం కల్పించాలని సీఎం అధికారులుకు సూచించారు. నది ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, లోతట్టులో ఉన్న 10,000 మంది ప్రజలపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని నోడల్ అధికారి అరుణ్ గుప్తా తెలిపారు. ప్రజలకు విద్యుత్, ఆహారం, ఇతర సదుపాలయాలను కల్పించాలని సీఎం ఆదేశించారు. సహాయ చర్యలను ముమ్మరం చేయడానికి ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. -
ఉత్తరప్రదేశ్లో విషాదం
► యమునా నదిలో పడవ మునిగి 19 మంది మృతి ► బాగ్పట్ జిల్లాలో ప్రమాద ఘటన బాగ్పట్: యమునా నదిలో పడవ మునిగి 19 మంది మరణించిన విషాద ఘటన గురువారం ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. సామర్థ్యానికి మించి ప్రయాణికు లతో వెళ్తున్న పడవ బాగ్పట్ జిల్లా కేంద్రానికి 20 కి.మీ. దూరంలోని కాఠా గ్రామ సమీపంలో మునిగిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బోటులో 60 మంది వరకూ ప్రయాణిస్తున్నారని జిల్లా కలెక్టర్ భవానీ సింగ్ చెప్పారు. పడవ మునిగిన కాఠా గ్రామ సమీపంలో వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 20 మంది ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా.. 15 మందిని రక్షించారు. మొత్తం 22 మంది మరణించారని తొలుత ప్రకటించినా.. అనంతరం ఆ సంఖ్యను అధికారులు 19కి తగ్గించారు. ‘ మొదట 22 మంది మరణించారని భావించాం. అయితే మృతదేహాల మేరకు 19 మంది మరణించారని నిర్ధారించాం’ అని కలెక్టర్ సింగ్ చెప్పారు. ఈ సంఘటన అనంతరం స్థానికులు కోపంతో రెండు వాహనాలకు నిప్పుపెట్టారని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. -
ఉత్తరప్రదేశ్లో తీవ్ర విషాదం
-
నదీ ప్రమాదాలు.. 21 మంది మృతి
సాక్షి, యూపీ: గురువారం ఉదయం ఉత్తర భారతదేశంలో సంభవించిన రెండు వేర్వేరు నదీ ప్రమాదాల్లో 21 మంది మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్ బఘ్ పట్ వద్ద యమునా నదిలో పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో పడవలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో మొత్తం 15 మృతి చెందగా, సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం సహాయ చర్యలను ప్రారంభించారు. 12 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఇక బిహార్లోని మరంచి వద్ద గంగానదిలో కొట్టుకుపోయి ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. -
విషాద యమున
కాలుష్యం యమున... జమున... పేరు ఏదైనా అది భారతీయులకు పవిత్రమైనది. వసుదేవుడు శ్రీకృష్ణుని తల మీద పెట్టుకుని యమునా నదిని దాటే యశోద వద్దకు చేర్చాడు. షాజహాన్ ఈ యమునా నది ఒడ్డునే తాజ్ మహల్ కట్టించాడు. భారతీయులలో ఉండే సనాతన సౌభ్రాతృత్వాన్ని ‘గంగా–జమునా తెహజీబ్’ అంటారు. యమున సూర్యుని పుత్రిక. యముడి సోదరి. కనుక యమునలో స్నానమాచరిస్తే అకాల మృత్యుదోషం హరించుకుపోతుందని ఒక నమ్మకం. కాని ఢిల్లీలో ఉన్న యమునా నదిలో స్నానమాచరిస్తే మృత్యువు ఖాయం అని అక్కడ ఉన్న కలుషిత యమున హెచ్చరిస్తోంది. యమునా నది హిమాలయ పర్వతాలలో ‘యమునోత్రి’లో జన్మించి ఉత్తరాఖండ్, హిమాచల ప్రదేశ్, హర్యాన, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీల గుండా ప్రవహిస్తుంది. ఇది నేరుగా సముద్రంలో కలువకుండా త్రివేణి సంగమంతలో తిరిగి గంగా నదితో సంలీనం చెందుతుంది. యమునా పరీవాహక ప్రాంతాలలో యమునా నగర్, ఢిల్లీ, మధుర, ఆగ్రా, ఇటావా, అలాహాబాద్ నగరాలు ఉన్నాయి. ఈ నగరాల కాలుష్యం యమునను భారతదేశంలో అత్యంత కలుషితమైన నదిగా మారుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో 22 కిలోమీటర్ల మేర ప్రవహించే యమునా నది ఢిల్లీ వాసుల మల మూత్రాలతో పరిశ్రమల కాలుష్యంతో నిండి ఉంది. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఢిల్లీలో ప్రవేశించే యమునా నది ప్రవాహాన్ని వజీరాబాద్ బ్యారేజీ వద్ద ఆపేసి నీటిని నిల్వ చేస్తారు. అక్కడి నుంచి యమున చుక్క నీరు కూడా రాదు. అంటే ఢిల్లీలో ప్రవహించే యమున అంతా ఢిల్లీ వాసుల మురుగు నీరే. అందులోనే భక్తులు పుణ్యస్నానాలు, క్రతువులు ఆచరిస్తూ ఉంటారు. యమునను శుద్ధి చేయాలని పర్యావరణ ప్రేమికులు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. తాజాగా వచ్చిన బిజెపి ప్రభుత్వం యమునను శుభ్రం చేస్తానని ఆర్భాటం చేసింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ పార్టీ యమున బాగోగులు మూడేళ్లలో తేలుస్తామని అంటోంది. కాని యమున నది మాత్రం ఢిల్లీలో రోజు రోజుకీ మురికి కూపంగా మారి ప్రజలకు విషం సరఫరా చేస్తోంది. దీని చుట్టుపక్కల పండే ఆకుకూరలు, కూరగాయలు కేన్సర్ కారకాలని పరీక్షలు నిర్థారణ చేస్తున్నాయి. యమున విషకాసారం కావడం వల్ల చుట్టుపక్కల పల్లెల్లోని భూగర్భ జలాలు విషతుల్యమై కీళ్ల నొప్పులు, వాతం, ఇతర అనారోగ్యాలు కలిగిస్తున్నాయి. అయినప్పటికీ ఢిల్లీ పేదసాదలు యమునపై భక్తితో ఈ మురికి యమునలోనే మునకలు వేస్తుంటారు. సంధ్య వారుస్తుంటారు. పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. ఈ విషాదం నుంచి యమున ఎప్పటికి విముక్తమవుతుందో! మానవ పాపాల నుంచి ఎప్పటికి బయట పడుతుందో!! -
ఇంతపెద్ద దేశంలో వారిని పట్టించుకోరా..?
బటేశ్వర్: రెండు చెక్క పడవలు ఆ రెండు గ్రామాలను ప్రపంచంతో కలుపుతున్నాయి. వాటి ద్వారానే వారి రాకపోకలు, అవసరాలు తీర్చుకోవడాలు. అది తప్ప వేరే మార్గం లేదు వారికి. నేతలకు కూడా వారి సమస్యలు అంతగా పట్టవు. ఓట్ల సమయంలో మాత్రం కాస్తంత హడావుడి చేస్తుంటారు. ఇదేదో వేరే ఏ దేశంలోని సమస్య కాదు.. మన భారత దేశంలోనిదే.. ఈ గ్రామాలు ఉంది కూడా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సొంతూరుకు సమీపంలోనే.. ఆగ్రాకు 72 కిలో మీటర్ల దూరంలో ఉంటాయివి. వివరాల్లోకి వెళితే.. భర్తర్, కల్యాణ్పూర్ అనే రెండు గ్రామాలు బటేశ్వర్లోని ప్రముఖ శివాలయాలకు ఎదురుగా ఉంటాయి. కానీ, స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు అవుతున్నా.. అభివృద్ధి మంత్రం జపిస్తున్నా కూడా ఈ గ్రామాన్ని ప్రపంచానికి కలుపుతున్నది మాత్రం రెండు చెక్క బోట్లే. అక్కడ అభివృద్ధి కానరాదు. ఈ గ్రామం చుట్టూ యమునా నది ఉంటుంది. దీంతో వారికి ఇక వేరే గ్రామాలతో సంబంధాలు, ఆధునీకత, సాంకేతిక పరిజ్ఞానం అందుకునే అవకాశం లేదు. ఈ కారణంతోనే వారు గతంలో రెండు సార్లు ఎన్నికలు బహిష్కరించారు కూడా. అయినప్పటికీ వారి జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ గ్రామంలో 15 నుంచి 75 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లంతా బోటు నడపడం నేర్చుకున్న వాళ్లే. ఎందుకంటే వారిని నది దాటించే నైపుణ్యం ఉన్న పడవ నడిపే వాళ్లు లేరు. ఇక అత్యవసర పరిస్థితుల్లో అయితే మాత్రం వారిని ఆదుకునే నాథుడే ఉండడు. అక్కడ రెండు ప్రాథమిక పాఠశాలు ఉన్నాయిగానీ ఆరోగ్య కేంద్రాలు లేవు. ఈ రెండు గ్రామాల మొత్తం విస్తీర్ణం 750 హెక్కార్లు ఉంటుంది. ఇక్కడ మొత్తం జనాభా 2,400కాగా 1,600 మంది ఓట్లర్లుగా నమోదయ్యారు. ప్రతిసారి వచ్చి ప్రతిజ్ఞ చేసే నాయకులెవ్వరూ కూడా తమకోసం ఎలాంటి పనులు చేయలేదని వారు వాపోతున్నారు. తమ గ్రామం వద్ద దాదాపు 200 మీటర్లు ఉండే ఈ నదిపై ఒక వంతెన నిర్మించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకో ఆశ్చర్యం ఏమిటంటే వారు విద్యుత్ వెలుగులను ఈ మధ్య కాలంలోనే చూశారంట. -
అందరూ చూస్తుండగా వెరైటీ స్నానం
ఆగ్రా: యమునా నది పరిరక్షణతోపాటు ఆ పరిసరి ప్రాంతాల్లో నెలకొన్న నీటి సంక్షోభ తీవ్రతను కళ్లకు కట్టినట్లు చెప్పేందుకు కొంతమంది ఉద్యమకారులు, సామాజిక వేత్తలు వినూత్నంగా నిరసన చేపట్టారు. నది ఒడ్డున కూర్చుని ఇసుకతో స్నానం చేసి చుట్టుపక్కల వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఒక్కొక్కరి ముందు కుప్పలుగా ఇసుక పెట్టుకొని మీద గుమ్మరించుకున్నారు. యమునాలో ఇక మిగిలిందేం లేదు ఇదే అని అర్థం వచ్చేలా వారు ఈ నిరసన తలపెట్టారు. ఇటీవల యమునా నది నిర్వహణ సరిగా లేని కారణంగా అందులో నీరు పూర్తిగా తగ్గిపోతోందని, ఉన్న నీరు కూడా ఉపయోగించుకునేందుకు వీలు లేకుండా తయారైందని, దాని పరిరక్షణ కోసం ఎన్నిసార్లు విన్నపాలు పెట్టుకున్నా అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేవారు తప్ప ఏం చేసిన వారు లేరని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఎవరో ఒకరు యమునా నది అంశాన్ని ప్రధాన అజెండా తీసుకొని ప్రచారానికి దిగడం అవి పూర్తవగానే ఆ అంశాన్ని మరుగున పడేయడం పరిపాటిగా మారిందని చెప్పారు. నాయకుల, అధికారుల నిర్లక్ష్యం కారణంగా యమునా నదిలో నీరు అడుగంటి పోతుందని, ఇక్కడికి వచ్చే వారికి పెద్దగా మిగిలేందేమీ లేదు ఇసుక మాత్రం తప్ప అని చెప్పేందుకు ఇసుకతో స్నానం చేశామని ఉద్యమకారుల్లో ఒకరైన బ్రజ్ ఖండేల్ వాల్ తెలిపాడు. -
'జైలుకైనా వెళ్తా కానీ.. ఫైన్ మాత్రం కట్టను'
న్యూఢిల్లీ: యమునా నది ఒడ్డున శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న 'ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం' నిర్వహణ విషయంలో ఇంకా వివాదాలు సద్దుమణగడం లేదు. రూ. 5 కోట్లు ప్రాథమిక జరిమానా కట్టి.. షరతులతో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. అయితే ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో జరిమానా కట్టబోమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' ఫౌండేషన్ స్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ స్పష్టం చేశారు. 'మేము ఏ తప్పూ చేయలేదు. మేం జైలుకైనా వెళ్తాంగానీ ఒక్కపైసా కట్టబోం' అని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు అధికారులు ఈ విషయాన్ని హరిత ట్రిబ్యునల్కు తెలిపారు. ఇప్పటివరకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ జరిమానా కట్టలేదని వెల్లడించారు. భారీ నిర్మాణాలతో అట్టహాసంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్ వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తవచ్చునని, యమునా నది పర్యావరణపరంగా దెబ్బతినవచ్చునని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడుతూ 'ఇది సాంస్కృతిక ఒలింపిక్స్ లాంటిందని, దీనిని ప్రతిఒక్కరూ స్వాగతించాలని కోరారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం కోసం వెయ్యి ఎకరాల్లో తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపడుతున్నామని, వాటిని తొందరగా తొలగించే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పారు. శుక్రవారం ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యే అవకాశముంది. కానీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ కార్యక్రమానికి రావొద్దని నిర్ణయించుకున్నారు. -
మద్యం ఆపకుంటే యమునా నదిలో దూకుతా
ఆగ్రా: గాంధీ జయంతినాటికి మద్యం అమ్మకం నిషేధించకుంటే తాను యమునా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని ఓ 96 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోథుడు అల్టిమేటం జారీ చేశాడు. ఎవరైనా తన బెదిరింపును ఖాతరు చేయకుంటే మద్యం అమ్మే షాపులను తగులబెట్టేందుకైనా వెనుకాడనని హెచ్చరించారు. ఆదివారం ఆగ్రా వీధుల్లో మద్యం నిషేధం కోసం డిమాండ్ చేస్తూ కొందరు మహిళలు, యువకులు ర్యాలీలు తీయగా వాటిలో చిమ్మాన్ లాల్ జైన్ (96) అనే స్వాతంత్ర్య సమర యోధుడు పాల్గొన్నాడు. మద్యం ఎన్నో కుటుంబాలను కూల్చి వేస్తుందని, వారి జీవిత విధానాన్ని ధ్వంసం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 'దేశాన్ని కాపాడండి. సిగ్గు తెచ్చుకోండి. ఆడ కూతుర్లను రక్షించండి' అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. 68 ఏళ్ల కిందట స్వాతంత్రం పొందిన రోజు ఆగ్రాలో కేవలం 11 లిక్కర్ షాపులు ఉండేవని, ప్రస్తుతం మాత్రం 1,100కు చేరుకున్నాయని తెలిపారు. మద్యానికి చేసే ఖర్చును ఒక్కసారి ఆపేసి ఆలోచిస్తే సామాన్య కుటుంబాలకు జీవనాధారమవుతుందని మరువరాదని అన్నారు. -
నిషేధించకపోతే...దూకేస్తా
ఆగ్రా: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయ వాది చిమన్ లాల్ జైన్ గాంధీ జయంతి రోజు యమునా నదిలో దూకి ప్రాణ త్యాగం చేస్తానని హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్ లోని తాజ్ సిటీ ఆగ్రాలో మద్యాన్ని నిషేధించకపోతే వచ్చే అక్టోబర్ 2న ఆత్మహత్య చేసుకుంటానన్నారు. మద్యానికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ఆయన, మంగళవారం ఉదయం ఈ ప్రకటన చేశారు. దాదాపు 600 మంది మహిళలు, పురుషులతో కలిసి ఖతీక్ పారా బస్తీలో మద్యపాన వ్యతిరేక శిబిరాన్ని నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. తాజ్ సిటీలో మద్యాన్ని నిషేధించేవరకూ తన పోరాటం ఆగదని చిమన్లాల్ స్పష్టం చేశారు. మద్య వ్యతిరేక ప్రచారానికి సంబంధించి చిమన్ లాల్ రూపొందించిన ఒక కార్యక్రమం ఆకాశవాణిలో మంగళవారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుందని సామాజిక వేత్త రాజీవ్ సక్సేనా ప్రకటించారు. తాజ్ మున్సిపల్ మ్యూజియానికి తన చరఖాను బహుమతిగా ఇచ్చారని ఆయన తెలిపారు. -
యమునా నదిని పరిరక్షించుకుందాం
న్యూఢిల్లీ: యుమునా పరివాహక ప్రాంతాన్ని పరిరక్షించడానికి వాలంటీర్లు నడుంబిగించారు. సుమారు 1,000 మంది వాలంటీర్లు, వివిధ కాలేజీల విద్యార్థులు ఆదివారం నదీ పరిసరాలను పరిరక్షించాలని కోరుతూ నగరంలో సైకిల్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు 500 సైక్లిస్టులు 18 కిలోమీటర్ల దూరం ర్యాలీ చేపట్టారు. ఉత్తర ఢిల్లీలోని కశ్మీరీగేట్ నుంచి కుడిసియా ఘాట్ వరకు ర్యాలీ సాగింది. అక్కడికి వెళ్లగానే వీరితోపాటు మరికొందరు వాలంటీర్లు కలిసి నదీ పరిసరాలను పరిశుభ్రం చేశారు. స్వచ్ఛ్భారత్’ను ముందుకు తీసుకొని పోవాలని నిర్వాహకులు యువతను కోరారు. యువజన, క్రీడల మంత్రిత్వశాఖ, యూఎన్డీపీ, పౌర సంఘాలు ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. ప్రధాని ప్రవేశపెట్టిన స్వచ్ఛ్భారత్ అభియాన్పై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలని యువజన క్రీడల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్ గుప్తా తెలిపారు. దేశంలో అత్యధిక కలుషితమైన నదుల్లో యమునా ఒకటి అని పలు సర్వేలు వెల్లడించాయి. ఢిల్లీ పరిసరాల్లో మరింత ప్రమాదకరంగా మారింది. నదీ పరిరక్షణకు యువత నడుం బిగించాల్సిన అవసరం ఉన్నదన్నారు. -
ఛత్ పూజలో విషాదం
సూర్యభగవానుడికి మొక్కులు చెల్లించుకోవడానికి అందిరితో కలిసి యుమునా నదికి చేరుకొన్న ఓ యువతితోపాటు చిన్నారిని నది బలిగొన్నది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.ఘజియాబాద్: ఛత్ పూజలో విషాదం చోటు చేసుకొంది. ఇరువై ఏళ్ల యువతి గురువారం యమునా నదిలో ఛత్పూజలో భాగంగా పుణ్యస్నానమాచరిస్తూ వృత్యువాత పడింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్పార్కు కాలనీకి చెందిన దిలీప్ అతడి భార్య నీతు, జ్యోతి ఆమె తండ్రి జస్వంత్ కలిసి యమునా నది ఒడ్డున ఛత్ పూజల కోసం ఏర్పాటు చేసిన ఇలాచీపూర్ ఘాట్ నంబర్-33కి చేరుకొన్నారు. ఉదయం 6.00 గంటలకు నదిలోకి పుణ్యస్నానమాచరించేందుకు వెళ్లిన నీతు, జ్యోతి అదుపుతప్పి కొట్టుకొనిపోయారు. ఈ సమయంలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. ఇద్దరు గజ ఈతగాళ్లు రెండు గంటలపాటు శ్రమించి వృతదేహాలను వెలికి తీశారు. జ్యోతి 6వ తరగతి చదువుతోందని పోలీసులు తెలిపారు. ఉత్తర ఢిల్లీ పరిధిలోని బురారి పోలీసులు వృతదేహాలను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు -
యమునపై భారీ వారధి
నోయిడా: ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాద్ మధ్య రాకపోకలు సాగించేవారి కష్టాలు ఇక తీరనున్నాయి. యమునానదిపై నిర్మించనున్న ఆరులేన్ల వారధి నిర్మాణ పనులు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న ఓఖ్లా బ్యారేజీకి సమాంతరంగా ఈ వంతెనను నిర్మిస్తారు. 574 మీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ వంతెన నిర్మాణ పనులు పూర్తయితే కాళిందీకుంజ్ వంతెనపై ట్రాఫిక్ భారీగా తగ్గే అవకాశముంటుంది. ఢిల్లీ నుంచి నోయిడా, ఫరీదాబాద్ల మధ్య రాకపోకలు సాగించేవారికి ప్రస్తుతం కాళిందీకుంజ్ వంతెన మాత్రమే మార్గం. నూతనంగా నిర్మిస్తున్న వంతెన అందుబాటులోకి వస్తే మరో ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వచ్చినట్లే. కాళిందీకుంజ్ వంతెనపై ప్రస్తుతం రోజుకు 1.5 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కొత్తవంతెనతో వాహనాల సంఖ్య సగానికిపైగా తగ్గే అవకాశముంటుందని చెబుతున్నారు. నోయిడా అథారిటీ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం... ఈ నూతన వంతెన నిర్మాణానికి రూ. 139 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మొదట ఈ వంతెన నిర్మాణ పనులను ఫిబ్రవరిలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే అనేక కారణాలవల్ల నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో జాప్యం జరిగింది. ఎట్టకేలకు వారం రోజుల్లో పనులు పూర్తిచేసి, రెండేళ్లలో వంతెనను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 17.3 మీటర్ల వెడల్పు, 574 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ వంతెన కోసం 15 పిల్లర్లను ఏర్పాటు చేస్తారు. ప్రతి పిల్లర్ మధ్య 41 మీటర్ల దూరం ఉండేలా చూస్తారు. ఈ వంతెనపై ఆరులేన్ల రహదారిని ఏర్పాటు చేసుకోవచ్చు. పాదచారుల కోసం కూడా ప్రత్యేక ఫుట్పాత్ నిర్మించుకునే అవకాశం కూడా ఉంటుంది. మెట్రో ట్రాక్కు 40 మీటర్ల దూరంలోనే ఈ వంతెన ఉంటుంది. ప్రస్తుతం మెట్రో వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. బొటానికల్ గార్డెన్, కాళిందీకుంజ్ మధ్య ఈ మెట్రో వంతెన నిర్మిస్తున్నారు. నిజానికి ఈ వంతెన నిర్మాణం కోసం రెండేళ్ల కిందటే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నోయిడా అథారిటీకి, నోయిడా టోల్ బ్రిడ్జి కంపెనీ లిమిటెడ్కు మధ్య ఒప్పందాలు కూడా కుదిరాయి. నిర్మాణం, నిర్వహణ పద్ధతిలో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. -
దుర్గామాత విగ్రహాల నిమజ్జనం యమునా నది పరిసరాలు అపరిశుభ్రం
న్యూఢిల్లీ: విరిగిపోయిన కుండలు... కుళ్లిపోయిన పూలు... చిరిగిపోయిన గుడ్డముక్కలు..తడిసిపోయిన రంగులు... ఇదీ యుమునా నది ఒడ్డున ఆది వారం కనిపించిన దృశ్యం. శరన్నవరాత్రులు ముగి సిననేపథ్యంలో శనివారం నగరంలోని పలు ప్రాం తాలకు చెందిన మండపాల యజమానులు దుర్గామాత ప్రతిమలను యుమునా నదిలో నిమజ్జనం చేసిన సంగతి విదితమే. ఇప్పటికే కాలుష్యపు కోరల్లో చిక్కుకుపోయిన యమునా నది ఒడిలోకి వందలాది దుర్గామాత విగ్రహాలు చేరిపోయాయి. క్లీన్ ఇండియా పేరిట ప్రధానమంత్రి నరేంద్రమోడీ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల రెండో తేదీన దేశవ్యాప్తంగా స్వచ్ఛ్ భారత్ అభియాన్ను ప్రారంభించిన సంగతి విదితమే. వచ్చే ఐదేళ్లలోగా భారత్నుపరిశుభ్రతకు మారుపేరుగా నిలపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మోడీ చేపట్టారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ శరన్నవరాత్రులు పూర్తయి దుర్గామాత విగ్రహాల నిమజ్జనం అనంతరం ఆదివారం యుమనా నది పరిసరాలకు వచ్చినవారికి బోలెడంత చెత్త కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రధాని విన్నపాన్ని నగరవాసులెవరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ నది ఒడ్డున ఎంతకాలమైనా భూమిలో కలిసిపోయే గుణమేలేని చెక్కలు, ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ నీటి సీసాలు, ఖాళీ చిప్ ప్యాకెట్లు, బిస్కట్ ప్యాకెట్లతోపాటు విషలక్షణాలు కలిగిన అనేక వస్తువులు చిందరవందరగా పడేసి ఉన్నాయి. సగం తిని వదిలేసిన ఆహార పదార్థాలకోసం కుక్కలు గాలిస్తూ కనిపిం చాయి. ఈ విషయమై కాళిందీకుంజ్ ఘాట్లో పడవ నడిపే 17 ఏళ్ల జమ్నాసింగ్ మాట్లాడుతూ ఇక్కడ మొత్తం ఆరు ప్రాంతాల్లో దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు సంబంధిత అధికారులు అనుమతించారని అన్నారు. ఈ చెత్త కొద్దిరోజులపాటు ఇక్కడ ఇలాగే పడిఉంటుందన్నారు. సింగ్ స్నేహితుడు దేవేంద్ర మాట్లాడుతూ ఈ కథ ప్రతి ఏడాదీ సర్వసాధారణమేనని, నిమజ్జనానికి వచ్చిన భక్తులు ప్లాస్టిక్ తదిరత వ్యర్థపదార్థాలను ఇష్టమొచ్చినట్టుగా పడేస్తుంటారని అన్నాడు. అధికారిక గణాంకాల ప్రకారం కాళిందీకుంజ్ ఘాట్ వద్ద దాదాపు 200 దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. కాగా యుమునా నదిలోని జలాలు 70 శాతం మంది నగరవాసుల తాగునీటి అవసరాలను తీరుస్తోంది. కాగా యుమునా నది కాలుష్యానికి అసంఘటిత పూజా కమిటీలే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. తాము పర్యావరణ అనుకూల సామగ్రినే దుర్గామాత విగ్రహాల తయారీకి వినియోగిస్తామని సామ్రాట్ బెనర్జీ అనే ఓ సంఘటిత పూజా కమిటీ సభ్యుడు ఆరోపించారు. అయితే అసంఘటిత పూజా కమిటీలు ఇష్టమొచ్చిన సామగ్రిని వినియోగిస్తున్నాయంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపించారు. -
‘యమున’ను మరిచారు..!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణజైట్లీ గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో యమునా నదిని శుద్ధి చేయడానికి నిధులు కేటాయించకపోవడంపై స్థానిక పర్యావరణవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గం గానది కోసం బడ్జెట్లో సుమారు రూ.2 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం యమునా నదిని మాత్రం మరచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యమునా నదిని శుద్ధి చేయడానికి రూ. 1,000 కోట్లు కేటాయించాలని గతంలో కేంద్రాన్ని ఢిల్లీ సర్కారు కోరింది. కానీ బడ్జెట్లో నదీతీరాన్ని అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లు కేటాయించిన కేంద్రం నదీ జలాల శుద్ధి గురించి మాటమాత్రంగా కూడా ప్రస్తావించకపోవడంపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి యమునా నదికి కూడా మంచి రోజులు వస్తాయన్న అభిప్రాయం స్థానికుల్లో కలిగింది. నరేంద్ర మోడీ సలహా మేరకు యమునా నదీ తీరాన్ని కూడా గుజరాత్లోని సబర్మతీ నది తరహాలో అభివృద్ధి చేయడానికి ఢిల్లీ ప్రభుత్వాధికారుల ఉన్నత స్థాయి బందం ఒకటి ఇటీవల అహ్మదాబాద్ ఇటీవల వెళ్లి అధ్యయనం కూడా చేసి వచ్చింది. అంతేకాక యమునా నదిని శుద్ధి చేయడానికి కూడా ఓ ప్రాజెక్టును రూపొందించారు. కానీ బడ్జెట్లో యమునాన దీ తీరాన్ని అభివృద్ధి చేయడానికి మాత్ర మే నిధులు కేటాయించి, నదీజలాల శుద్ధిని వదిలేశారు. దీంతో ఇప్పటివరకు ఢిల్లీ ప్రభుత్వం యమునానది శుద్ధీకరణకు చేపట్టిన కార్యక్రమాలన్నీ అటకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘నదీతీరాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే దాని అర్థం నదిని శుద్ధి చేయడం కాదు కదా.. ’యమునా జియే అభియాన్కు చెందిన పర్యావరణవేత్త మనోజ్మిశ్రా అన్నారు. యమునా నది ప్రస్తుతం మురికి కాలు వ మాదిరిగా ఉంది. జలచరాలు, బ్యాక్టీరియా కూడా ఈ నీటిలో బతకలేని పరిస్థితులు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నదిలో ప్రతిరోజూ 5 మిలియన్ గ్యాలన్ల పారిశ్రామిక కాలుష్యాలు, 1,25,000 గ్యాలన్ల డీడీటీ నీరు కలుస్తోందని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా, గత పాతికేళ్లలో కేంద్ర ప్రభుత్వాలు దేశంలోని నదులను శుద్ధి చేయడానికి సుమారు రూ. 2,000 కోట్లకు పైగా ఖర్చుపెట్టా యి. అయినప్పటికీ గంగా, యమునా నదీజలాలు ఏమాత్రం శుభ్రపడిన దాఖలాలు కనిపించడంలేదు. ఈ నదులను శుద్ధి చేసేదాని కంటే కొన్ని రెట్లు ఎక్కువగా మలినాలు ప్రతిరోజూ వాటిలో చేరుతుండటంతో ఆయా ప్రభుత్వాల చర్యలు ఏమాత్రం ఫలితం ఇవ్వలేదు. ఈ రెండు నదులను శుభ్రంగా ఉంచడానికిసీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పారిశుధ్య సదుపాయాలను ఏర్పాటుచేసినప్పటికీ మొత్తం మీద పరిస్థితిలో పెద్ద మార్పు రాలేదు. ఢిల్లీ చేరేవరకు పరిశుభ్రంగా ఉండే యమునా జలాలు ఢిల్లీలోనే కాలుష్య కాసారంగా మారుతున్నాయి. ఢిల్లీలో యమున 48 కిమీల పొడవునా ప్రవహిస్తుంది. ప్రతిరోజూ నదిలో పారిశ్రామిక కాలుష్యా లు, విషపదార్థాలతో పాటు 225 మిలియన్ గ్యాలన్ల శుద్ధి చేయని సీవేజ్ కలుస్తుంది. ఆ తర్వాత ఫరీదాబాద్, బల్లభ్ఘడ్, పల్వల్, మధురలోని పరిశ్రమ లు యమునా నదీజలాలను మరింత కాలుష్యమ యం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో యమునానది జలాలను శుద్ధి చేసేందుకు తగినన్ని నిధులను కేంద్రం కేటాయించాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. -
హిందూస్తానీ సంగీతమయ ప్రపంచం...
తెలుసుకోదగ్గ పుస్తకం/ స్వరలయలు: కృష్ణుడు యమునా నది ఆవలి తీరాన బృందావనంలో వేణువు ఊదుతున్నాడు. అది గోపికను రమ్మని సంకేతం. కాని ప్రకృతి ప్రతికూలించింది. ఆకాశం నిండా నల్లని మబ్బులు, భయంకరమైన ఉరుములు, మెరుపులు, కుండపోత వర్షం. యమునా నది ఉప్పొంగి పారుతోంది. ఎట్లాగూ వెళ్లలేదు ఆమె. కాబట్టి ఏడుస్తున్నది. రసియా మోహె బులాయె నయనా నీర్ బహాయే... ఖమాజ్ రాగంలో ఈ ఠుమ్రీని పాడుతున్నప్పుడు పర్వీన్ సుల్తానా ఈ లోకంలో లేదు. కళ్లు అశ్రుసిక్తాలయినాయి. కాటుక కరిగి చెంపల మీద చారికలు కట్టింది. శ్రోతలంతా గమనిస్తున్నారు. కాని ఆమెకా స్పృహ లేదు. అంతటి తాదాత్మ్యం ఆ గాయనిది. హేమంత్ రాగంలో ఉస్తాద్ బడే గులామ్ అలీఖాన్ తన మధుర మంజుల గాత్రంతో యాద్ పియాకి ఆయే ఏ దుఃఖ్ సహాన జాయే అని విరహ వేదన వ్యక్తం చేస్తున్నాడు. అతని కంఠం ఎంత మధురమైనదంటే అంతటి భారీకాయం, బొద్దు మీసాలు, పెద్దపులి తల గల ఉస్తాదుకు బదులు పదునారేళ్ల ప్రాయంగల సుకుమార సుందరి విరహ వ్యథను అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది శ్రోతలకు. ఈ ముచ్చట్లు డా. సామల సదాశివ ‘స్వరలయలు’ పుస్తకం లోనివి. 2011-12 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన ఈ పుస్తకాన్ని చెలిమి ఫౌండేషన్ వాళ్లు ప్రచురించారు. దేశమంతా వ్యాపించిన హిందుస్తానీ సంగీతాన్ని సజీవంగా సుసంపన్నంగా రకరకాల మార్పులనీ చేర్పులనీ చేసుకుంటూ కులమత భేదాలు లేకుండా తమ భుజాలకెత్తుకుని మోసిన మోస్తున్న అనేకమంది విద్వాంసుల గురించిన విశేషాల సమాహారమే ఈ పుస్తకం. నిజం చెప్పాలంటే హిందూస్తానీ సంగీతానికి సంబంధించి ఒక సాధికారమైన చరిత్రని, వివిధ ఘరానాలు, వాటి పుట్టుపూర్వోత్తరాలు, వాటి విస్తరణతో సహా చందమామ కథల్లా చాలా చక్కని ‘యమన్’ ఆలాపనలా మన ముందు సాక్షాత్కరింప చేశారు రచయిత. సంగీత సామ్రాట్ తాన్సేన్, అక్బర్ చక్రవర్తి మారువేషాలలో వెళ్లి పూలపొదల చాటున నక్కి తాన్సేన్ గురువు స్వామి హరిదాసు గానాన్ని విన్న ముచ్చట మొదలుకొని, తొంభై ఏళ్ల వయసులో తెల్లవారుజామున బొంబాయిలోని విక్రమాదిత్య హోటలులో అన్ని ఘరానాల ఉస్తాదుల ముందు తన సంగీతంతో ఉర్రూతలూగించిన ఉస్తాద్ అల్లాదియా ఖాన్, ఒక్కొక్క వేదిక మీద ఒక్కొక్క రకంగా గానాన్ని ప్రదర్శించే కేసరీబాయి కేర్కర్, రోషనారా బేగమ్లాంటి విద్వాంసుల్ని నివ్వెర పరచిన హీరాబాయి బరోదేకర్, ఉస్తాద్ కరీంఖాన్, గంగూబాయి హంగల్, ప్రభా ఆత్రే... ఒక్కరని ఏంటి అనేకానేక ముచ్చట్లు పూల సుగంధాలు పరిమళించినట్లు. దేని సువాసన దానిదే. జాతీయోద్యమాలు, గణపతి మండళ్లు, సామూహిక కార్యక్రమాలు... ఇవన్నీ హిందూస్తానీ సంగీతాన్ని ఒక్క పండితులకే కాక పామరులను కూడా దానిలో భాగం చేసి సుసంపన్నం చేశాయి. ఈ సంగీతం శాఖోపశాఖలై శాస్త్రీయ, ఉపశాస్త్రీయ, లోక్ సంగీత్లు, రంగ మంచ్లు, భక్తి సంగీతం, సినిమా సంగీతాలుగా విస్తరించి మన జీవితంలో ఒక ముఖ్య భాగం అయింది. ఈ చరిత్రనంతటిని ఈ పుస్తకం మన కళ్లముందుంచుతుంది. - కృష్ణమోహన్బాబు -
యుమునలో భక్తుల పుణ్య స్నానాలు
పవిత్ర యుమునా నది పుష్కరాలు గురువారం వేకువజాము నుంచి ప్రారంభం అయ్యాయి. భక్తులు యమునలో పవిత్ర స్నానాలు ఆచరించి తరిస్తున్నారు. గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి పుష్కరాలు వస్తాయి. యమునా నది హిమాలయ పర్వతాలలొని కాళింది పర్వత శ్రేణులలో యమునోత్రి వద్ద జన్మించి ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుండి ప్రవహించి అలహాబాద్ వద్ద గంగ మరియు సరస్వతి నదులతో కలిసి ప్రయాగలో త్రివేణి సంగమం ఏర్పడుతుంది. అయిదు రాష్ట్రాల ద్వారా ప్రవహించే యమునా పుష్కరాలకు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తుల హాజరు అవుతారు. పుష్కరాలు మొదలైన 19వ తేదీన రాజమండ్రి, విజయనగరం, భీమడోలు, విజయవాడ నుంచి తరలి వచ్చిన సుమారు 1880 మంది భక్తులు విజిరాబాద్ ఘాట్లో పుణ్యస్నానాలు చేశారు. ఢిల్లీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజిరాబాబాద్ ఘాట్ను బీజేపీ సీనియర్ నేత ఎల్కె అద్వానీ 2001లో ప్రారంభించారు. కాగా యమునా పుష్కరాల కోసం వచ్చే తెలుగు ప్రజల కోసం రాజమండ్రికి చెందిన నరసింహరావు, ఎన్వీ సత్యనారాయణ ఆధ్వర్యంలో అల్పాహారంతో పాటు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. విజిరాబాద్తో పాటు మధుర పుష్కర ఘాట్ వద్ద ఈ కార్యక్రమం కొనసాగుతోంది. భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. -
హస్తినకు వరద గండం..
న్యూఢిల్లీ: యమునానదిలో వరద మైదానాలు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఢిల్లీ నగరానికి భారీ వరద గండం పొంచి ఉందని పలువురు పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాగా, ఇటీవల యూఎన్ ప్యానెల్ నివేదికలో సైతం ప్రపంచంలోనే అధిక వరద ముప్పు ఉన్న మూడు నగరాల్లో ఢిల్లీ కూడా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. టోక్యో, షాంఘైలకు కూడా ఇటువంటి ప్రమాదమే పొంచి ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. గత సోమవారం విడుదలైన ‘వాతావరణ మార్పుల నివేదిక-2014, ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు’లో పర్యావరణ నిపుణులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వరద ముప్పు నుంచి తప్పించుకోవాలంటే డ్యాంలు, కాలువలు ఏర్పాటుచేసే బదులు వరద మైదానాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. 2070 కల్లా ఆసియా ఖండంలోని ఢాకా, గౌంగ్ఝూ, హో ఛి మిన్హ్ సిటీ, షాంఘై, బ్యాంకాక్, రంగూన్, హాయ్పాంగ్ నగరాలతో పాటు ముంబై, కోల్కతాలకు సైతం తీర ప్రాంత వరద ముంపు ప్రమాదం పొంచి ఉందని అందులో పేర్కొన్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఢిల్లీ కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని నివేదికలో వెల్లడించారు. యూఎన్ ఐపీసీసీ నివేదికలో ఢిల్లీ పర్యావరణ సమస్యలపై ప్రస్తావించడం ఇదే మొదటిసారి. నగరంలో వరదలు వచ్చే అవకాశంపైనే ప్రధానంగా ఈ నివేదికలో చర్చించారు. నగరంలో యము నా వరద మైదానాల అక్రమ వినియోగం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అందులో పేర్కొన్నారు. ఢిల్లీ నగరంలోకి ప్రవేశించేం దుకు ముందే యమునానది నీటిని వ్యవసాయం, తాగునీటి అవసరాల నిమిత్తం మళ్లిస్తున్నారు. ‘ మా అంచనాల ప్రకారం.. పల్లా నుంచి జైత్పూర్ వరకు ఉన్న వరద మైదానాల్లో 30 శాతం ఇప్పటికే వేరే అవసరాలకు కేటాయించేశారు. ఇక్కడ నిర్మించిన అక్షరధామం, బాట్లా హౌస్, మెట్రో స్టేషన్లు, ఇతర శాశ్వత నిర్మాణాలను ఇక్కడి నుంచి తరలించడం సాధ్యం కాదు. ఒక్క టీడీసీ మిల్లేనియం బస్డిపో నిర్మాణ ప్రతిపాదనను మాత్రం ఆపేయవచ్చు. వజీరాబాద్ నుంచి ఓఖ్లా వరకు గల పలు వరద మైదానాల్లో చాలావరకు ఇప్పటికే ఆక్రమణకు గురయినట్లు మా సర్వేలో తేలింది..’ అని యమునా జియే అభియాన్కు చెంది న మనోజ్ మిశ్రా వివరించారు. ఇదిలా ఉండగా నగరంలో వాతావరణ మార్పులపై కూడా ఐపీసీసీ దృష్టి పెట్టింది. నగరంలో 1970 నుంచి ఇప్పటివరకు పాలెం వాతావరణ కేంద్రంలో ప్రతి యేటా నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలపై ఢిల్లీ ఐఐటీ సర్వే చేసింది. సఫ్దర్జంగ్ వాతావరణ కేంద్రంలో ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పోల్చి చూసింది. ‘1968లో సఫ్దర్ జంగ్తో పోలిస్తే పాలెం ఎడారిలా ఉండేది. ఈ రెండింటి మధ్య ప్రతి ఏడాది వాతావరణంలో వస్తున్న మార్పులను గమనించి నగరీకరణ వల్ల ఉష్ణోగ్రతల్లో ఎలా మార్పులు సంభవిస్తాయో క్రోడీకరించాం. 1980 వరకు ఈ రెండు ప్రాంతాల సరాసరి కనిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు లేవు. అయితే 2000 సంవత్సరం వచ్చేసరికి పాలెంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం మొదలయ్యాయి. నగరీకరణ వల్లే ఈ మార్పు సంభవించిందని మా అధ్యయనంలో తేలింది..’ అని ఐపీసీసీ రిపోర్ట్ తయారుచేసిన వారిలో ఒకరైన ఐఐటీ ప్రొఫెసర్ మంజు మోహన్ వివరించారు. ఆమె అధ్యయనం ప్రకారం పాలెంలో కనిష్ట ఉష్ణోగ్రతల్లో అప్పటికంటే ఇప్పుడు ఒక డిగ్రీ ఎక్కువగా నమోదవుతోంది. కాగా, ఈ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వల్ల నగరాల్లో వేడిమి సంబంధిత సమస్యలు పెరుగుతాయని సదరు నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. -
నీటి కష్టాలకు ముగింపెన్నడు?
తమ ప్రభుత్వం ఎన్నో ఘన విజయాలు సాధించిందంటూ సీఎం షీలా దీక్షిత్ ఎన్నో ప్రకటనలు చేస్తున్నా.. కనీస అవసరమైన నీటి సరఫరా సమస్యను పరిష్కరించడంలో మాత్రం ఆమె ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. న్యూఢిల్లీ: షీలా దీక్షిత్ గత 15 ఏళ్ల పాలన ఎలా ఉన్నా.. నీటి సరఫరా విషయంలో మాత్రం ఆమె ప్రభుత్వం విఫలమైందని చెప్పకతప్పదు. నగర మంతటా నీరు సరఫరా చేసే ఢిల్లీ జలబోర్డు (డీజేబీ)కి ఆమె చైర్పర్సన్గానూ వ్యవహరిస్తున్నారు కాబట్టి నీటి ఎద్దడిని పరిష్కరించాల్సిన బాధ్యత ఆమె చేతుల్లోనే ఉంటుంది. ఈ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో ఇదీ ఒకటి. యమునానదిని శుద్ధీకరించడంలోనూ ఆమె చెప్పుకోగదగ్గ విజయాలను సాధించలేకపోయారు. ఢిల్లీకి ప్రతినిత్యం 835 ఎంజీడీల (మిలియన్ గ్యాలన్స్ పర్ డే) నీరు సరఫరా అవుతోంది. మరో 300 ఎంజీడీల నీరు సరఫరా చేయగలిగితేనే ఎద్దడి నివారించడం సాధ్యపడుతుంది. ఒప్పందం ప్రకారం మునాక్ కాలువ నుంచి హర్యానా ప్రభుత్వం 80 ఎంజీడీల నీటిని విడుదల చేయించడంలోనూ షీలా ప్రభుత్వం విఫలమయిం ది. దీంతో నీటిశుద్ధి కోసం నిర్మించిన మూడు ప్లాంట్లు వృథాగా పడున్నాయి. ప్రస్తుతం మెజారిటీ దిల్లీవాలాలకు ప్రతిరోజూ నీళ్లు అందడం లేదు. కొన్నిచోట్ల రోజుకోసారి సరఫరా చేస్తున్నారు. నీటి సరఫరా వ్యవస్థను కూడా ప్రభుత్వం ప్రైవేటీకరించడం వివాదాస్పదంగా మారింది. పైప్లైన్లు పగలడం, వృథా కారణంగా ఎద్దడి పెరగడంతో ప్రైవే టు కంపెనీలకు సరఫరా బాధ్యత అప్పగించారు. అయితే ఉమ్మడి ప్రైవేటు సంస్థల అధీనంలోని ప్రాంతాల్లో 24 గంటలపాటూ నీటి సరఫరా ఉంటోందని డీజేబీ చెబుతోంది. ‘ఢిల్లీ నీటి సరఫరా వ్యవస్థ చాలా పాతది. నగరం వేగంగా విస్తరిస్తోం ది. నీళ్ల కోసం రాజధాని ప్రభుత్వం పక్క రాష్ట్రాలపై ఆధారపడుతున్నందున డిమాండ్ను అందుకోవడం అసాధ్యం. కాబట్టి సరఫరా నష్టాలు, వృథా తగ్గించాలంటే ప్రైవేటు కంపెనీల సాయం తీసుకోవడం తప్పనిసరి’ అని డీజేబీ అధికారి ఒకరు అన్నారు. తప్పుడు బిల్లుల సమస్య పరిష్కారం కోసం ఇటీవల ఆన్లైన విధానాన్ని ప్రవేశపెట్టినా పరిస్థితి మారలేదు. ఎప్పటిలాగే నీటి బిల్లులు భారీగా వస్తున్నాయని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. నీళ్ల వంటి కనీస సదుపాయాల కల్పన బాధ్యతను ప్రైవేటుసంస్థలకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం తన అసమర్థతను బయటపెట్టుకుందని విమర్శకులు అంటున్నారు. నీళ్ల ట్యాంకర్ మాఫి యా కూడా యథావిధిగా కొనసాగుతూనే ఉంది. నీటి లభ్యతను పెంచడానికి డీజేబీ ప్రతినిత్యం 45 ఎంజీడీల నీటిని ప్లాంట్లలో శుద్ధిచేస్తోంది. యమునానది నీళ్లను, మురికినీళ్లతో కలిసి శుద్ధి చేసి తాగునీటికి వినియోగించుకునేలా చేసే ప్లాంటు నిర్మాణం కోసం సింగపూర్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. యమున బాగుపడేదెప్పుడో! యమునా నదిలో కాలుష్యస్థాయిని తగ్గించడానికి డీజేబీ భారీ ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. కలుషిత జలాలకు అడ్డుకట్టవేయడానికి ‘ఇంటర్సెప్టర్ సీవేజ్ సిస్టమ్’ను అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానంలో మురుగుకాల్వ నీటిని ప్లాంట్లో శుద్ధి చేసిన తరువాతే నదిలోకి పంపిస్తారు. దీని పనితీరుపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పథకాల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా ఫలితా లు కనిపించడం లేదని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ‘నదిలోకి మురుగునీరు చేరకుండా అడ్డుకోవాలనే కోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో నీరు నదిలోనే కలుస్తోంది. శుద్ధి చేసే ప్లాంట్లకు తగిన పరిమాణంలో నీరు సరఫరా కావడం లేదు’ అని తపస్ ఎన్జీవో డెరైక్టర్ వినోద్ జైన్ అన్నారు. ఇక భూగర్భ జలాల పరిరక్షణ బిల్లును కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే భూగర్భ జలాల వినియోగానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే భూగర్భజలాలు అడుగంటకుండా నిరోధించడానికి ప్రస్తుతం సామాజిక బావుల నిర్మాణానికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు.