YSRCP Samajika Sadhikara Bus Yatra
-
‘మంగళగిరిలో లోకేష్ను మడత పెట్టేస్తాం’
గుంటూరు: మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సీటులో నారా లోకేష్ పోటీ చేయటం దారుణమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. జోగి రమేష్ బుధవారం మంగళగిరి వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ లోకేష్ను మడత పెట్టేస్తుందని అన్నారు. వైఎస్సాఆర్సీపీ దెబ్బకు లోకేష్ పారిపోతాడని అన్నారు. మంగళగిరి అని పలకటమే చేతకాని లోకేష్ మంగళగిరిలో పోటీ చేయటమా? అని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయి రకరకాల వేషాలలో దొంగలు వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలునిచ్చారు. సీఎం జగన్కు అండగా ఉండాలి.. అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాల పైకి తీసుకురావాలని ఎంతోమంది మేధావులు ఆలోచన చేశారని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే మేధావుల ఆలోచనలనకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాల పైకి తీసుకొచ్చారు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని.. ఆయనకు అందరూ అండగా ఉండాలని అన్నారు. బీసీలను అణగదొక్కి లోకేష్ పోటీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు పేదలకు దేవుడని వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లోనే సామాజిక న్యాయం అమలవుతుందని తెలిపారు. మంగళగిరిలో బీసీలను అణగదొక్కి లోకేష్ పోటీ చేస్తున్నాడని మండిపడ్డారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అగ్రవర్ణాల సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కనపెట్టి మంగళగిరి సీటును బీసీలు కేటాయించారని అన్నారు. వైఎస్సార్సీపీ మరోసారి గెలిపించుకోకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతారని ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. దొంగల ముఠా.. పచ్చ మీడియా చెప్పే విషయాలను రాసే కథనాలను ప్రజలు నమ్మవద్దని తెలిపారు. -
చిలకలూరిపేటలో YSRCP సామాజిక సాధికార యాత్ర దృశ్యాలు
-
YSRCP Bus Yatra: చిలకలూరిపేటలో ప్రజలు బ్రహ్మరథం
వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిలకలూరిపేటలో నిర్వహించిన సాధికార బస్సు యాత్రలో ప్రజాప్రతినిధులకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. బస్సుయాత్రలో భాగంగా నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులతోనూ ముచ్చటించారు. అనంతరం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీతో చిలకలూరిపేటలో బహిరంగ సభా వేదిక వద్దకు బస్సు యాత్ర చేరుకుంది. వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడానికే వెళ్తున్నా: మంత్రి విడుదల రజిని ఈ భారీ బహిరంగ సభలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజిని మాట్లాడుతూ, వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజికంగా, ఆర్థికంగా చేసిన అభివృద్ధిని చాటి చెప్పేందుకే సామాజిక సాధికార యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. చిలకలూరిపేట నుంచే వై.ఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టారని, ఇక్కడ నుంచే బీసీ మహిళను అసెంబ్లీకి పంపించడమే కాకుండా మంత్రి పదవి కూడా ఇచ్చి చరిత్రలో ఎన్నడూలేని విధంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారని గుర్తు చేసారు. చిలకలూరిపేటలో మున్సిపల్ చైర్మన్ పదవి ముస్లీంలకు, మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్సీలకు పదవులు కట్టెబెట్టారన్నారు. రూ.2వేల కోట్లతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రూ.900 కోట్లతో బైపాస్ పనులు జరుగుతున్నాయని, అతి తర్వలోనే సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామని, రూ.150 కోట్లతో అమృత్ పథకాన్ని కేంద్రం సహకారంతో చేపట్టి మంచినీటి సమస్యను తీర్చబోతున్నారని వెల్లడించారు. కాపు, ఎస్సీ, బీసీ భవన్లు కూడా పెద్ద మనసుతో వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేసారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కోటి రూపాయలతో తాను సొంత నిధులతో ముస్లీంలకు స్థలాన్ని ఇవ్వగా, మరో మూడు ఎకరాలు కూడా సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేయడానికి సుముఖుత వ్యక్తం చేసారన్నారు. ముఖ్యమంత్రి అండదండలతో అనేక కీలక ప్రాజెక్టులను చిలకలూరిపేటలో కనీవిని ఎరుగని రీతిలో చేపట్టడమే కాకుండా, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోని నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని, నాడు - నేడు స్కీమ్ ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసామన్నారు. రూ.1100 కోట్ల రూపాయల సంక్షేమాన్ని వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చిలకలూరిపేట నియోజకవర్గానికి అందించారంటే ఈ ప్రాంత ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, అప్యాయతను అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గుంటూరు పశ్చిమలో పార్టీ రెండుసార్లు ఓడిపోయిందని, ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి నన్ను అక్కడకు పంపుతున్నారని, తాను ఎక్కడ ఉన్నా సరే చిలకలూరిపేట ప్రజలు తన మనసులో ఉంటారని ఉద్ఘాటించారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించండి: ఎమ్మెల్సీ ఏసు రత్నం ఎమ్మెల్సీ ఏసురత్నం మాట్లాడుతూ, కల్లబొల్లి మాటలు చెబుతూ, మరోసారి ప్రజలను మోసం చేయడానికి తహతహలాడుతూ ముందుకు వస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించాలని. 600 హామీలిచ్చి ప్రజలను గత ఎన్నికల్లో మోసం చేసిన అంశాన్ని ప్రజలు మరిచిపోలేదని హెచ్చరించారు. 31 లక్షల ఇళ్లను బడుగు, బలహీన వర్గాల కోసం ఇళ్లు కట్టించి ఇవ్వడానికి సన్నహాలు చేస్తుంటే, చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఆరోగ్య సాధికారత: ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మరో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, విద్యా సాధికారతను సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధికి రూ.60,500 కోట్లు, బీసీ కులాల కోసం రూ.70,750 ఎస్టీ సంక్షేమానికి రూ.23,430 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.23 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి దేశ, రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. అణగారిన బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేయడంతో పాటుగా ఉన్నత విద్యావంతులను చేయాలని సీఎం లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. 37 వేల స్కూల్స్ కోసం రూ.12 వేల కోట్లతో అభివృద్ధి చేసి కార్పోరేట్కు ధీటుగా తీర్చిదిద్దారన్నారు. జగన్ను మరోసారి సీఎం చేస్తాం: నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేశ్ చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేశ్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతీ సామాజిక వర్గానికి సంక్షేమం, రాజ్యాధికారం కల్పనలో పెద్ద పీట వేసి ఇచ్చిన మాటను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ఉద్ఘాటించారు. కులం, మతం చూడకుండా అందరికీ సంక్షేమం అందిస్తూ స్వర్గీయ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డికి తగ్గ తనయుడుగా నిలిచారన్నారు. చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసి రాష్ట్రానికి మరోసారి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. -
బడుగుల ‘విజయ గీతిక’
సాక్షి ప్రతినిధి, గుంటూరు/చిలకలూరిపేట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన చేయూతతో తాము సాధించిన అభివృద్ధిని, సాధికారతను బడుగు, బలహీన వర్గాల ప్రజలు వేనోళ్ల వినిపించారు. సోమవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో విజయగీతిక వినిపించారు. ఈ యాత్రకు నియోజకవర్గం నలుమూలల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వేలాదిగా తరలివచ్చారు. తాము సాధించిన అభివృద్ధిని వివరించారు. జై జగన్ అంటూ వారు చేసిన నినాదాలతో పట్టణం మార్మోగింది. వారికి పట్టణ ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు. నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు నేతృత్వంలో నూతన వ్యవసాయ మార్కెట్ నుంచి కళామందిర్ సెంటర్ వరకు ఈ యాత్ర జరిగింది. పట్టణంతోపాటు గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులతో కళా మందిర్ సెంటర్లో జరిగిన బహిరంగ సభ జనసంద్రాన్ని తలపించింది. ఈ భారీ బహిరంగ సభలో ప్రసంగించిన పలువురు నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆరి్థకంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతున్న వైనాన్ని వివరించారు. ఆ సమయంలో సభకు హాజరైన ప్రజలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. సామాజిక న్యాయ సారథి సీఎం వైఎస్ జగన్ : మంత్రి విడదల రజిని ముఖ్యమంత్రి వైఎస్ జనగ్మోహన్ రెడ్డి సామాజిక న్యాయ సారథిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాలుగా అగ్రస్థానంలో నిలబెడుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలను ఈ వర్గాలకు అందిస్తూ సాధికారత దిశగా నడిపిస్తున్నారని తెలిపారు. రాజకీయ, నామినేటెడ్ పదవుల్లో ఈ వర్గాలకే పెద్దపీట వేస్తున్నారన్నారు. చిలకలూరిపేటలో తొలిసారి బీసీ మహిళని నిలబెట్టి ఏ రాజకీయపార్టీ ఎన్నడూ చేయని సాహసాన్ని జగనన్న చేశారన్నారు. ఈ స్థానాన్ని గెలుపొందడంతోపాటు బీసీ మహిళకు వైద్య, ఆరోగ్య శాఖను అప్పగించారని గుర్తు చేశారు. మున్సిపాలిటీ ఓసీకి రిజర్వు అయితే మైనారిటీకి చైర్మన్ ఇచ్చామని, మార్కెట్ యార్డును ఎస్సీలకు రెండుసార్లు కేటాయించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని తెలిపారు. అన్ని వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని, దీనికి చిలకలూరిపేటే నిదర్శనమన్నారు. రూ. 2 వేల కోట్లతో చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రూ.900 కోట్లతో నిరి్మస్తున్న బైపాస్ త్వరలో పూర్తవుతుందన్నారు. పట్టణానికి మంచినీరందించేందుకు రూ.150 కోట్లతో అమృత్ పథకాన్ని తెచ్చామన్నారు. ఎస్సీ భవన్, బీసీ భవన్, కాపు కమ్యూనిటీ హాల్కు త్వరలో శంకుస్థాపన చేస్తున్నట్లు చెప్పారు. కోటి రూపాయలు సొంత నిధులతో షాదీఖానా కట్టించామన్నారు. కార్పొరేట్ స్థాయిలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంగ్లిష్ మీడియంతో బడుగుల ఉన్నతి: ఎమ్మెల్సీ కుంభా రవిబాబు సమాజంలో అణచివేతకు గురైన వర్గాలను సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రాథమిక విద్యలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టి బడుగుల ఉన్నతికి బాటలు వేశారని చెప్పారు. సీఎం జగన్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల ఈ సమాజంలో అణచివేతకు గురైన వారందరూ చదువుకుని పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదుగుతారని వివరించారు. అన్ని పదవుల్లో పెద్దపీట వేస్తున్నారు: ఎమ్మెల్యే ముస్తఫా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి పాటుపడిన ముఖ్యమంత్రి స్వతంత్ర భారత చరిత్రలో సీఎం జగన్ ఒక్కరేనని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా చెప్పారు. ఈ వర్గాలను ఇంతలా అభివృద్ధి చేసిన సీఎంలు ఎవరూ లేరన్నారు. అన్ని పదవుల్లోనూ ఈ వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్దేనని అన్నారు. బాబు కల్లపోల్లి మాటలు నమ్మొద్దు: ఎమ్మెల్సీ ఏసురత్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం తెలిపారు. ఈ రాష్ట్రానికి ఏ మేలూ చేయని చంద్రబాబునాయుడు కల్లపోల్లి మాటలు చెబుతూ మరోసారి ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారని, ఆయన మాటలు నమ్మొద్దని చెప్పారు. 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటి అమలు చేయలేదన్నారు. బాబు 14 ఏళ్ల పాలనలో కేంద్రం 14 లక్షల గృహాలు మంజూరు చేస్తే, పది వందలు కూడా పేదలకు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు జగన్ 31 లక్షల మందికి గృహ వసతి కల్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
‘జగనన్న సామాజిక న్యాయం మొదలైంది ఇక్కడి నుంచే’
సాక్షి, పల్నాడు: ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని సొంత నియోజకవర్గంలో భావోద్వేగంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నారని ప్రసంగించారామె. సోమవారం చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ జరిగింది. ఆపై నిర్వహించిన సభలో మంత్రి విడుదల పాల్గొని మాట్లాడారు. ఒక బీసీ మహిళలైన తనకు చిలకలూరిపేట సీటు ఇచ్చి గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రిగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. గతంలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి తమ ప్రభుత్వంలో చిలకలూరిపేటలో జరిగిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో గెలిపించాలి మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆమె సభకు హాజరైన ప్రజలకు పిలుపు ఇచ్చారామె. కానుక అందిద్దాం.. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పథకాలు మరే ఇతర ముఖ్యమంత్రి అమలు చేయలేదని చిలకలూరిపేట వైఎస్సార్సీపీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చిలకలూరిపేట అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీని గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరోసారి కానుక అందిద్దామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. దేశంలోనే 30 లక్షల మందికిపైగా నిరుపేదలకు ఇల్లపట్టాలు పంపిణీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. చదవండి: వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు చుక్కెదురు -
చిలకలూరిపేటలో YSRCP సామాజిక సాధికార బస్సు యాత్ర
-
చిలకలూరిపేటలో YSRCP సామాజిక సాధికార బస్సు యాత్ర
-
కిక్కిరిసిన ‘కోట’
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కోట మండల కేంద్రంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర జనంతో హోరెత్తింది. అశేషజనం తరలిరావడంతో పట్టణంలోని పురవీధులు జనసంద్రంగా మారాయి. మహిళలు, యువత భారీ సంఖ్యలో పాల్గొని ‘జై జగన్’ నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను.. వాటి ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిగిన లబ్ధిని వివరించారు. చంద్రబాబు ఏనాడూ బీసీలను పట్టించుకోలేదని మండిపడ్డారు. కుటుంబాలను చీల్చడమే ఆ పార్టీల పని అని విమర్శించారు. చిల్లకూరు: తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండల కేంద్రంలో జరిగిన సామాజిక సాధికారత బస్సు యాత్ర జనంతో హోరెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేకూరిన సామాజిక సాధికారతను వివరించే క్రమంలో ఆదివారం నిర్వహించిన ఈ యాత్రకు అశేషజనం తరలిరావడంతో పట్టణంలోని పురవీధులు జనసంద్రంగా మారాయి. వైఎస్సార్షీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో గూడూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేరిగ మురళీధర్తో పాటు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పట్టణంలోని గోపాల్రెడ్డి విగ్రహం నుంచి సభాస్థలి వరకు ఆదివారం బస్సుయాత్ర సాగింది. 500 మీటర్ల ఈ యాత్ర చేయడానికి గంటకు పైగా సమయం పట్టింది. సభా వేదికపై ముందుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావ్ ఫూలే, అల్లూరి సీతారామరాజు, వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభను ఆరంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి మాట్లాడుతూ.. సోనియా, చంద్రబాబులు అన్యాయంగా జగన్ను జైలుకు పంపారన్నారు. అయితే, ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్రెడ్డి సీఎంగా ఐదేళ్లపాటు అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను గుర్తించి వారికి అండగా నిలిచారన్నారు. పేద ప్రజల గుండెల్లో సీఎం జగన్ కొలువుదీరారన్నారు. గతంలో కోవర్టులుగా పనిచేసిన వారు మోసంచేసి పార్టీలు మారారని మండిపడ్డారు. బాబుకు మళ్లీ ప్రతిపక్షమే.. అనంతరం, మాజీమంత్రి అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్సార్ పేరును చార్జ్షీట్లో పెట్టిన పార్టీలు వస్తున్నాయని, వీరు కుటుంబాలను చీల్చడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఎంతమంది దత్తపుత్రులతో కలిసి వచ్చినా చంద్రబాబుకు మళ్లీ ప్రతిపక్షమే మిగులుతుందని ఎద్దేవా చేశారు. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు మాట్లాడుతూ.. 30 ఏళ్లపాటు టీడీపీకి ఊడిగం చేసినా ఏనాడూ బీసీలకు చంద్రబాబు ప్రాముఖ్యత ఇవ్వలేదన్నారు. కనీసం రాజ్యసభకు బీసీలను పంపిన దాఖలాలూ లేవన్నారు. 56 నెలల సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో ఐదుగురు బీసీలను రాజ్యసభకు పంపిన ఘనత వైఎస్సార్సీపీదేనన్నారు. ఇక ఆరువందల బూటకపు వాగ్దానాలను ఇస్తే ప్రజలు నమ్మి గెలిపించారని, వాటిలో పది కూడా అమలుచేయలేని దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు నిలిచిపోయారని పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర అ«ధ్యక్షులు ఖాదర్బాషా విమర్శించారు. ఆ తర్వాత.. నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి మాట్లాడుతూ.. గిరిజన మహిళనైన తనను సీఎం జగనన్న ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారని, ఇంతకన్నా సామాజిక సాధికారత ఎక్కడ ఉందన్నారు. సీఎం నమ్మకాన్ని వమ్ము చేయను: మేరిగ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి సీఎం వైఎస్ జగన్ తనపై నమ్మకం ఉంచి పార్టీ, నామినేటెడ్ పదవులతో పాటు ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్గా అవకాశాలు కల్పించారని, తనపై ఉన్న నమ్మకాన్ని ఏనాడూ వమ్ముచేయనని అన్నారు. గతంలో గూడూరు ఎమ్మెల్యేగా నమ్మకంతో ఒకరిని ఎంపిక చేస్తే పార్టీలో గెలిచి రొమ్ముగుద్ది చంద్రబాబు పంచన చేరారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రాంకుమార్రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణచక్రవర్తి, ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. -
అనిల్ కుమార్ యాదవ్ పవర్ ఫుల్ స్పీచ్
-
‘ప్రభంజన’పేట
సాక్షి తిరుపతి: నాయుడుపేట జనసంద్రమైంది. సూళ్లూరుపేట నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలతో పట్టణం కిక్కిరిసిపోయింది. సామాజిక సాధికార యాత్రకు జన నీరాజనం లభించింది. వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన ఆదివారం జరిగిన సామాజిక సాధికార బస్సుయాత్ర ప్రభంజనంలా సాగింది. స్థానికులతో పాటు ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, అంజాద్ బాషా, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్సీలు మేరిగ మురళి, జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పట్టణంలో తొలుత పాదయాత్ర జరిగింది. బైక్ ర్యాలీతో పాటు సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభమై ంది. అనంతరం అంబేడ్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాయకులు ప్రసంగించారు. అంతకు ముందు డాక్టర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్కుమార్యాదవ్ కాంగ్రెస్తో షర్మిల ప్రయాణాన్ని తప్పు పట్టారు. ఎవరి లబ్ధికోసం ఈ ప్రయత్నమని వారు నిలదీశారు. వైఎస్ కుటుంబానికి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ను వెనకేసుకు రావడంపై వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ మరణించాక ఆ మహానేత పేరును ఛార్జిషిట్లో చేర్చిన పార్టీకి కొమ్ముకాయడమేంటని ప్రశ్నిచారు. ఇంకా ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే సంజీవయ్య, నెల్లూరు మేయర్ స్రవంతి మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న పాలనలో సామాజిక సాధికారత కోసం చేసిన విప్లవాత్మక మార్పులను వివరించారు. కుటుంబాల్ని చీల్చగల సమర్థుడు చంద్రబాబు తాను గద్దెనెక్కడానికి ఎంతటి దారుణానికైనా ఒడిగట్టగల నాయకుడు చంద్రబాబని... కుటుంబాల్ని సైతం ఆయన విడగొట్టి సొంత అన్నపై చెల్లెల్ని ఉసిగొల్పే నీచసంస్కృతి ఆయనదని వారు పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం నిరంతరం తపిస్తున్న జగన్మోహన్రెడ్డిని గద్దె దింపడానికి కాంగ్రెస్, చంద్రబాబు కలిసి కుట్రలు చేస్తున్నారనీ... అందులో భాగస్వామి కావడం సరికాదని షర్మిలకు వారు హితవుపలికారు. అభినవ అంబేడ్కర్ వైఎస్ జగన్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిరోడ్డున సీఎం జగన్ నెలకొల్పారని, అదే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కేవలం హడావుడి చేసి మోసగించారని విమర్శించారు. స్వాతం్రత్యానంతరం ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారని, వారెవ్వరి హయాంలో అమలు కాని సామాజిక సాధికారత జగన్ మాత్రమే చేసి చూపించారన్నారు. పేదలకు విద్య, వైద్యం అందించేందుకు రూ. 45 వేల కోట్లు, వివిధ పథకాల రూపంలో పేదల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 2.34 లక్షల కోట్లు జమచేశారని తెలిపారు. ఎమ్మెల్యే భావోద్వేగం నాడు ఆలయాల్లోకి ప్రవేశం లేని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనను సీఎం వైఎస్ జగన్ ఏకంగా టీటీడీ బోర్డు సభ్యునిగా చేశారని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు బీసీల తోకలు కత్తిరిస్తానంటే.. సీఎం జగన్ బీసీలు బ్యాక్ బోన్ క్లాస్ అని అన్నింటా ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు ఎక్కడ? ప్రతి దాంట్లో బీసీలకు సింహభాగం ఉండాలని 50శాతం హక్కులు కల్పించిన సీఎం జగన్ ఎక్కడ అని ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ అన్నారు. ఈ తరానికి సీఎం వైఎస్ జగనే మహనీయుడుని, ఎంతమంది ఏకమైనా వైఎస్ జగన్ కాలిగోటిని కూడా కదపలేరని హెచ్చరించారు. ఐక్యంగా పనిచేయండి సూళ్లూరుపేటకు కిలివేటి సంజీవయ్యే అభ్యర్థి వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి సాక్షి, తిరుపతి: పార్టీ అభ్యర్థుల విజయానికి అందరూ కలిసి మెలసి పనిచేయాలని వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. నాయుడుపేటలో ఆదివారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సుయాత్రకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ సూళ్లూరుపేట అభ్యర్థి విషయంలో రకరకాలుగా ప్రచారం సాగుతోందని, ప్రస్తుత ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యే ఇక్కడి అభ్యర్థనీ ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తనకు చెప్పారన్నారు. క్రమశిక్షణరాహిత్యంతో ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సూళ్లూరుపేటకు చెందిన కట్టా సుధాకర్రెడ్డి, శ్రీమంతురెడ్డి, రామ్మోహన్రెడ్డి, జనార్దన్రెడ్డి, శేఖర్రెడ్డి, రిఫీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. వారిచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదన్నారు. మార్పులున్న స్థానాలకే అభ్యర్థులను ప్రకటిస్తారని, అన్ని స్థానాల్లో మార్పులు ఉండవని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. -
‘ఏపీకి ఎవరొచ్చినా సీఎం జగన్ను ఏమీ చేయలేరు’
నెల్లూరు: గత ప్రభుత్వాలు బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోలేదని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట సామాజిక సాధికార బస్సుయాత్రలో నారాయణస్వామి మాట్లాడుతూ.. ‘ ఏపీకి ఎవరొచ్చినా సీఎం జగన్ను ఏమీ చేయలేరు. మేలు జరిగి ఉంటేనే ఓటు వేయమని ధైర్యంగా జగన్ అడుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ రాజకీయ పదవులు ఇచ్చారు. ఎస్సీలుగా ఎవరైనా పుడతారా అని చంద్రబాబు హేళన చేసి మాట్లాడారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే దానిని కూడా తట్టుకోలేకపోతున్నారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చింది. వైఎస్ చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చారు. వైఎస్ కుటుంబం అంటే నాకు ఎంతో గౌరవం.. దళిత ప్రజా ప్రతినిధులు అందరూ వైఎస్ జగన్తోనే ఉంటారు. కాంగ్రెస్లో చేరి జగనన్నపై యుద్ధం చేస్తామని షర్మిల అంటున్నారు. తప్పు చేయని వైఎస్ జగన్ను కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టింది. ఇవన్నీ గుర్తులేవా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ గతంలో ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. ఎంతో కొంత చేశారు. కానీ ఎస్పీ, ఎస్టీ, బీసీ మహిళలకు యాభై శాతం పదవులు ఇచ్చిన ఘనత మాత్రం జగన్కే దక్కుతుంది. చంద్రబాబు ఎక్కడో మూలన, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. నగరం నడిబొడ్డున ఉండాలని జగన్ నిర్ణయించి.. స్వరాజ్ మైదాన్లో పెట్టించారు. జగన్నే లక్ష్యం చేసుకునే కుట్రలు చేస్తున్నారు. ఇందుకోసం కుటుంబాల్లో కూడా చిచ్చుపెడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల కూడా వారి కుట్రలో భాగస్వామ్యమయ్యారు. వైఎస్సార్సీపీ చీల్చి.. చంద్రబాబుకు ప్రయోజనం కలిగించాలని చూస్తున్నారు. షర్మిల మాట్లాడిన ప్రతిమాటను వైఎస్సార్ అభిమానులను బాధిస్తోంది. వైఎస్సార్ను దేవుడిగా భావించే ప్రతి కుటుంబం కూడా బాధపడుతోంది. షర్మిల మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి’ అని తెలిపారు. -
గుంతకల్లులో బడుగు, బలహీనవర్గాల విజయ యాత్ర
అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లులో బడుగు, బలహీన వర్గాల ప్రజలు విజయ యాత్ర చేశారు. వైఎస్సార్సీపీ మంగళవారం ఇక్కడ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండదండలతో తాము సాధించిన సాధికారతను ప్రదర్శించారు. గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ యాత్ర పట్టణంలో పండగ వాతావరణాన్ని నింపింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజల సాధికార నినాదంతో గుంతకల్లు హోరెత్తింది. పట్టణ ప్రధాన వీధులన్నీ జనంతో నిండిపోయాయి. యువత కేరింతలతో ఉత్సాహంగా యాత్రలో పాల్గొన్నారు. పట్టణ ప్రజలు యాత్రకు పూల వర్షంతో స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభ వేలాది ప్రజలతో జనసంద్రంలా కనిపించింది. సభ ఆద్యంతం ‘జై జగన్.. జైజై జగన్’, ‘గిరగరా తిరగాలి ఫ్యాన్’ అంటూ నేతలతో కలిసి నినాదాలు చేశారు. అణగారినవర్గాల కోసం పాటుపడుతున్న సీఎం జగన్ : ఎంపీ సురేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం అణగారిన వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నారని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సాధికారత సాధించి, తలెత్తుకొని తిరుగుతున్నారంటే అది సీఎం జగన్ చేసిన మేలు వల్లేనని అన్నారు. సంక్షేమంలో, అన్ని పదవుల్లో అగ్రస్థానం ఈ వర్గాలకే కేటాయించారని తెలిపారు. అణగారిన వర్గాలను అభివృద్ధి చేసి, సామాజిక న్యాయాన్ని సాధించిన సీఎం జగన్ ఆదర్శనీయుడని, ఈరోజు దేశమంతా మన రాష్ట్రం వైపు చూస్తోందని తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ఏనాడూ పేదల గురించి ఆలోచించలేదని అన్నారు. చంద్రబాబుకు అవకాశం ఇస్తే మరోమారు నట్టేట ముంచుతారని, ఆయన్ని నమ్మవద్దని చెప్పారు. రాష్ట్రానికి దిక్సూచిలా ఉన్న సీఎం వైఎస్ జగన్ను వచ్చే ఎన్నికల్లోనూ ఆశీర్వదించి, మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇది విజయ యాత్ర: ఎల్రక్టానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు రాష్ట్రంలో విజయయాత్ర చేస్తున్నారని, ఇదంతా సీఎం వైఎస్ జగన్ చలవేనని ప్రభుత్వ ఎల్రక్టానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ చెప్పారు. మనల్ని ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చి న సీఎం వైఎస్ జగన్కు మనం ఇచ్చే గిఫ్ట్ ‘వై నాట్ 175’ అని అన్నారు. గత ఎన్నికల్లో గుంతకల్లు ప్రజలు 50 వేల మెజార్టీతో వెంకటరామిరెడ్డిని గెలిపించారని, ఈసారి లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ వెంటే నడుద్దాం: మాజీ మంత్రి ఎం. శంకరనారాయణ 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా సామాజిక న్యాయం సాధించిన సీఎం వైఎస్ జగన్ ఒక్కరేనని మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే ఎం. శంకరనారాయణ చెప్పారు. మనందరినీ అభివృద్ధిలోకి తెచ్చి , సమాజంలో గౌరవ స్థానం కల్పిస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే నడుద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబు బడుగు, బలహీన వర్గాలను కేవలం ఓటుబ్యాంకుగా ఉపయోగించుకున్నారని చెప్పారు. అదే వర్గాలను సీఎం జగన్ ఉన్నత స్థితికి తీసుకువెళ్తున్నారని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు గౌరవం పెరిగింది: ఎంపీ తలారి రంగయ్య వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చి న ప్రాధాన్యతతో రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు గౌరవం పెరిగిందని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అత్యున్నత స్థానాల్లో కూర్చోబెట్టారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ రూ. 1,500 కోట్ల అభివృద్ధి జరిగిందని అన్నారు. ఇంతటి మేలు చేసిన వైఎస్ జగన్ను వచ్చే ఎన్నికల్లోనూ ఆశీర్వదించాలని కోరారు. -
బద్వేల్లో బడుగుల సాధికార పండుగ
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా బద్వేల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలు సాధికార ఉత్సవం నిర్వహించాయి. సీఎం వైఎస్ జగన్ అందించిన చేయూతతో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధించిన అభివృద్ధిని తెలియజేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు వైఎస్సార్సీపీ సోమవారం ఇక్కడ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాదిగా పాల్గొన్నారు. యువత కేరింతలు, బాణసంచా, వాయిద్యాలు, జానపద నృత్యాలతో యాత్ర పండుగలా సాగింది. ఆర్థికంగా చేయూతనిచ్చి, రాజకీయ, సామాజిక ప్రాధాన్యతనిచ్చి, ఉద్యోగావకాశాలు కల్పించిన సీఎం వైఎస్ జగన్కు అండగా ఉంటామని బడుగు, బలహీన వర్గాలు నినదించాయి. ర్యాలీకి స్థానిక ప్రజలు అడుగడుగునా హారతులు పట్టారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభకు ర్యాలీలో పాల్గొన్న వారితో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సభలో నాయకులు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, ఇతర వర్గాలకు చేస్తున్న మేలును వివరించారు. ప్రజలు పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో హర్షధ్వానాలు చేశారు. ‘జగనే రావాలి.. మళ్లీ జగనే కావాలి’ అంటూ సభ ఆద్యంతం నినాదాలు చేస్తూనే ఉన్నారు. బద్వేల్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎం వైఎస్ జగన్తోనే నడుస్తామని నేతలు, ప్రజలు మూకుమ్మడిగా ప్రకటించారు. పేదలకు మరింత సంక్షేమం : డిప్యూటీ సీఎం నారాయణస్వామి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థాయిని పెంచిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. సీఎం జగన్ చేసిన మేలుతో మన కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చాలా చులకనగా చూశారని, హేళన చేసే వారని అన్నారు. కూలివాడి కొడుకు కూలీగానే ఉండాలని ఆలోచించేవాడు చంద్రబాబు అయితే, కూలివాడి కొడుకు కలెక్టర్ కావాలని ఆలోచించి, అందుకు ఏమి చేయాలో అదంతా చేసే వ్యక్తి సీఎం జగన్ అని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీసీ సీఎంలు కూడా సాహసించలేదు: కడప మేయర్ సురేష్ బాబు దేశంలో ఎంతో మంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ, ఎవరూ పాటించని సామాజిక న్యాయాన్ని సీఎం వైఎస్ జగన్ మాత్రమే చేతల్లో చూపించారని కడప మేయర్ సురేష్ బాబు అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. జగన్ సీఎం అయ్యాక బ్రహ్మంసాగర్కు రూ.600 కోట్లు మంజూరు చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని 17 టీఎంసీలకు పెంచారని తెలిపారు. కలసపాడు, పోరుమామిళ్ల, బి.మఠం మండలాల్లో వేలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారన్నారు. ఆడపడుచులకు దేవుడిచ్చిన అన్నయ్య సీఎం జగన్ : మాజీ ఎంపీ బుట్టా రేణుక సీఎం వైఎస్ జగన్ పేదింటి ఆడపడుచులకు దేవుడిచ్చిన అన్నయ్య అని మాజీ ఎంపీ బుట్టా రేణుక చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో వివిధ పథకాల ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు నగదును జమ చేస్తున్నారని తెలిపారు. బద్వేలులో రూ.1268.72 కోట్లు : ఎమ్మెల్సీ గోవిందరెడ్డి బద్వేలు నియోజకవర్గంలో సంక్షేమ పథకాల ద్వారా సీఎం జగన్ 1,38,763 మందికి రూ.1268.73 కోట్లు నగదు బదిలీ చేశారని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చెప్పారు. ఇందులో 88,214 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లకు రూ.782.72 కోట్లు ఇచ్చారన్నారు. ఈ సంక్షేమం కొనసాగాలంటే జగన్ను మరోసారి సీఎంను చేయాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ గోపవరం వద్ద రూ.1000 కోట్లతో సెంచురీ ప్లైబోర్డ్స్ పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపా«ధి కలి్పస్తున్నారని ఎమ్మెల్యే సుధ చెప్పారు. ఎమ్మెల్సీలు ఇషాక్, రమేష్ యాదవ్, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, జెడ్పీ చైర్మన్ అమర్నాథరెడ్డి పాల్గొన్నారు. -
‘ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పనిచేసేది సీఎం జగన్ ఒక్కడే’
సాక్షి, బద్వేల్: ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, బీసీల కోసం పని చేసే ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కడేనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో సోమవారం జరిగిన వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికర బస్సుయాత్రలో నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సీఎం జగన్ కోసం పనిచేసే కూలీ అని అన్నారు. ‘టీడీపీ పెట్టినపుడు ఎన్టీఆర్కు చంద్రబాబు వ్యతిరేకంగా పోటీ చేశారు. ఓడిపోవడంతో లక్ష్మీ పార్వతి కాళ్ళు పట్టుకొని టీడీపీలో చేరారు. దేశంలో ఎంఎల్ఏలను కొనే సంప్రదాయానికి తెరలేపిందే చంద్రబాబే. ఎన్టీఆర్ను సీఎం సీట్లో నుంచి దించి ఆయన మరణానికి బాబు కారణం అయ్యాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రక్తం టీడీపీ రక్తమే. రేవంత్రెడ్డి ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు కోసం ఆలోచిస్తాడు. బాబు తన కోవర్టులు సీఎం రమేష్ను బీజేపీకి, రేవంత్రెడ్డిని కాంగ్రెస్ పంపాడు. పవన్ కళ్యాణ్ ప్యాకేజి కోసం పార్టీ పెట్టాడు. ఆయన కేవలం జగన్పై విమర్శల కోసమే పని చేస్తాడు’ అని నారాయణస్వామి విమర్శించారు. ఇదీచదవండి..పతనావస్థ దిశగా ప్యాకేజీ స్టార్ పరుగులు -
సాధికార యాత్రకు జననీరాజనం
-
ఉరవకొండలో ఉరిమిన ఉత్సాహం
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కల్పించిన సముచిత స్థానాన్ని తెలియజేసేందుకు చేపట్టిన ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’ జైత్రయాత్రలా సాగుతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్రకు బడుగు, బలహీన వర్గాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. సభా వేదిక ఏర్పాటుచేసిన పాత బస్టాండ్ ప్రాంతమంతా జన సంద్రమైంది. నియోజకవర్గ నలుమూలల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు తరలివచ్చి బస్సుయాత్రకు బ్రహ్మరథం పట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం వస్తుందని వక్తలు పేర్కొనడంతో పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. ఆత్మగౌరవం నిలబెట్టిన వైఎస్సార్సీపీకి అండగా ఉందాం: హఫీజ్ఖాన్ ఓట్ల కోసం రాజకీయాలు చేసే వాళ్లు వద్దని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆత్మగౌరవం నిలబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందామని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ పిలుపునిచ్చారు. 2014 ఎన్నికలకు ముందు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పేద వర్గాలను వంచించారన్నారు. ఆయన హయాంలో కనీసం ఆరు హామీలు కచ్చితంగా అమలు జరిగాయని ఎవరైనా నిరూపిస్తే లక్ష రూపాయలు బహుమానం ఇస్తానన్నారు. పేద వర్గాలను ఎప్పుడూ బానిసలుగా చూసిన చంద్రబాబుకు, ఆ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న జగనన్నకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. జగనన్న అవసరం మనకు ఉందని, ఆయన్ను ఎప్పటికీ మరచిపోవద్దని హఫీజ్ఖాన్ చెప్పారు. మోసగాళ్ల వైపు చూడొద్దు: తలారి రంగయ్య రా.. కదలిరా అంటూ తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తోందని, అయితే.. ఇప్పటికే వచ్చి తాము (బడుగు, బలహీనవర్గాలు) ఇక్కడ కూర్చున్నామని, ఇంకెవరు వస్తారు.. ఎక్కడికి కదులుతారు అని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ఎద్దేవా చేశారు. మోసగాళ్ల వైపు చూడొద్దని, సింహం లాంటి జగన్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాజ్యసభ మొదలుకుని స్థానిక సంస్థల వరకు జగనన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశారని ఆయన గుర్తుచేశారు. కలలో కూడా ఎవరూ ఊహించని విధంగా ఆయా వర్గాల అభివృద్ధికి బాటలు వేసిన జగనన్నను ఎలా మరచిపోగలమన్నారు. బలమైన వర్గాలుగా మార్చిన ఘనత జగన్దే : మాజీమంత్రి శంకరనారాయణ రాష్ట్రంలో బలహీన వర్గాలను బలమైన వర్గాలుగా మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని మాజీమంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఏ ముఖ్యమంత్రీ సామాజిక సాధికారతకు కృషిచేయలేదన్నారు. 70 శాతం బలహీన వర్గాల వారే పదవుల్లో ఉన్నారన్నారు. చంద్రబాబు బలహీన వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని విమర్శించారు. సాధికారత కోసం జగన్ తపన : వై.విశ్వేశ్వరరెడ్డి అట్టడుగు వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదల సాధికారత కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరితపించారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆయా వర్గాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. పెత్తందారుల వద్ద చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి నుంచి ఆత్మగౌరవంగా నిలబడే స్థాయికి తెచ్చారని ఆయన కొనియాడారు. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో పేదలు, పెత్తందారుల మధ్య పోటీ ఉంటుందని, పేద వర్గాలే గెలుస్తాయని విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఈనాడు ఫొటోగ్రాఫర్కు జనం మందలింపు.. ఇక ఉరవకొండలో ఆదివారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర సభ ముగిసిన తర్వాత ఖాళీ కుర్చీల ఫొటోలు తీస్తున్న ఈనాడు ఫొటోగ్రాఫర్ను జనం మందలించారు. ఈ సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు. సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అయితే.. సభ ముగిసి జనం వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఖాళీగా కన్పించిన కుర్చీలను ఈనాడు ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీస్తుండగా అక్కడున్న కొందరు దీనిని గమనించారు. సభ ముగిసిపోయిన తర్వాత ఎందుకు ఫొటోలు తీస్తున్నావంటూ ప్రశ్నించారు. ఇందుకు అతను దురుసుగా ప్రవర్తించడంతో జనం మందలించారు. దుష్ప్రచారం చేసేందుకు ఇలాంటి కుయుక్తులు మంచివి కాదని హితవు పలికారు. దీంతో ఫొటోగ్రాఫర్ అక్కడి నుంచి జారుకున్నాడు. -
బూరుగుపూడిలో ‘సామాజిక’ ప్రభంజనం
సాక్షి, రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం బూరుగుపూడిలో సామాజిక నినాదం మార్మోగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు అశేష సంఖ్యలో హాజరైన జనం బస్సుయాత్రకు బ్రహ్మరథం పట్టారు. ‘జై జగన్.. జైజై జగన్’ నినాదాలతో రహదారి దద్దరిల్లింది. రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో దోసకాయలపల్లి నుంచి బూరుగుపూడి వద్ద సభా ప్రాంగణం వరకూ పెద్దఎత్తున బైక్, కార్ల ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా మేళతాళాలు, పూలజల్లులు, జేజేలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చేకూరిన లబ్ధిని గుర్తుచేసేలా మంత్రులు, నేతలు సాగించిన ప్రసంగాలు వింటూ.. రాబోయే ఎన్నికల్లో సీఎంగా మళ్లీ జగన్కే పట్టం కడతామని నినదించారు. ఈ సభలో హోంమంత్రి తానేటి వనిత, జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, కవురు శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సామాజిక విప్లవం: మంత్రి మేరుగు నాగార్జున సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వెల్లివెరిసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. పిల్లల చదువులకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తోంది. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి పేదల సొంతింటి కలను నిజంచేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. రాష్ట్రంలో 12 శాతంగా ఉన్న పేదరికం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఆరు శాతానికి తగ్గింది. సామాన్యుల నేత : ఎంపీ సురేష్ సీఎం జగన్ బడుగు, బలహీన వర్గాల నాయకుడు. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, వ్యవసాయం పండుగ కావాలన్నా మళ్లీ జగనే సీఎం కావాలి. ఆయన పాలనలో బడుగు, బలహీన వర్గాలకు అన్నింటా అగ్రస్థానం లభిస్తోంది. సంక్షేమం, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసి సామాన్యుల నేతగా ఖ్యాతి గడించారు. పేదలు మరింత బాగుండాలంటే రానున్న ఎన్నికల్లో మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలి. అన్ని వర్గాలూ ప్రభుత్వంలో భాగస్వాములే : మంత్రి జోగి రమేష్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులు అందరూ భాగస్వాములే. రాష్ట్రంలో నేడు 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులిచ్చి గౌరవించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో నాలుగు స్థానాలు బీసీలకే ఇచ్చి గౌరవించారు. ఎమ్మెల్సీ, చైర్మన్ స్థానాలిచ్చారు. సామాజిక న్యాయ నిర్ణేత జగన్ : పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ హామీలన్నీ అమలుచేసిన ఘనత సీఎం జగన్ దక్కుతుంది. జగన్ హయాంలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమైంది. అలాంటి నేతను తిరిగి అధికారంలోకి వచ్చేలా ఆశీర్వదించాలి. 175 ఎందుకు ఇవ్వకూడదు? : అలీ మంచి చేసే నేతను ప్రజలు అభిమానిస్తారు. అందుకు నిదర్శనమే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో జగన్కు ఘన విజయం చేకూర్చడం. ‘వై నాట్ 175’ అని సీఎం ప్రతి సమావేశంలో చెబుతుంటారు. ప్రజలకు మంచి చేస్తున్న ఆయన అడిగిన సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గ అభివృద్ధి : జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే, రాజానగరం రాజానగరం అభివృద్ధి, సంక్షేమానికి రూ.కోట్లు వెచ్చిస్తున్నాం. నియోజకవర్గంలో అభివృద్ధికి రూ.1,152 కోట్లు, సంక్షేమ పథకాలకు రూ.1,145 కోట్లు వెచ్చించాం. 20 వేల మంది నిరుపేదలకు ఇంటి పట్టాలు అందజేశాం. రూ.104 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టాం. రూ.217 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు నాంది పలికాం. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలు ముంపునకు గురికాకుండా కాపాడేందుకు రూ.91 కోట్లతో తొర్రిగెడ్డ కాలువపై రివర్స్ పంపింగ్ స్కీమ్ ప్రాజెక్టు నిర్మించనున్నాం. -
East Godavari: జైత్రయాత్రలా సామాజిక బస్సు యాత్ర
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. 42వ రోజు బస్సు యాత్రకు జనం ఉప్పెనలా తరలివచ్చారు. రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరిగింది. మధ్యాహ్నం రెండు గంటలకు కోరుకొండ మండలం దోసకాయపల్లిలో వైఎస్సార్సీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం కోరుకొండ వరకూ బస్సుయాత్ర సాగింది. మధ్యాహ్నం మూడు గంటలకు కోరుకొండ బూరుగపూడి గేట్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు హాజరయ్యారు. ఊసరవెల్లి చంద్రబాబు: మంత్రి మేరుగ నాగార్జున ఊసరవెల్లి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు వాడుకుని వదిలేశారు. రాజ్యాంగబద్ధమైన అవకాశాలు రాకుండా చేశారు. చంద్రబాబు హయాంలో బీసీ ఎస్సీలపై అనేక దాడులు పాల్పడ్డారు. కులం, మతం, వర్గం, పార్టీ తారతమ్యం లేకుండా అందరికీ సీఎం జగన్ న్యాయం చేస్తున్నారు. పేదల పిల్లలకు కార్పొరేట్ విద్య చదివించేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ఇది. ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి 25 లక్షల రూపాయలు ఖర్చు చేసే ఏకైక ప్రభుత్వమిది. పేదలకు 31 లక్షలు ఇళ్ల పట్టాలిచ్చిన నాయకుడు సీఎం జగన్ మాత్రమే ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ జగన్కే జనం పట్టం: మంత్రి తానేటి వనిత బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సీఎం జగన్ హయాంలో సామాజిక న్యాయం జరిగింది. అంబేద్కర్ ఆశయాలు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరుగుతుంది. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించి పేదరికాన్ని దూరం చేశారు. సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు బురద జల్లుతున్నారు. పిల్లలకు అందించే ట్యాబులపై కూడా బురద జల్లుతున్నారు. జగనన్న అందిస్తున్న పాలనలో కంటెంట్ ఉంది.. అందుకే ఆయన కటౌట్తో సాధికార బస్సు యాత్రలు చేయగలుగుతున్నాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ జగన్కే జనం పట్టం కడతారు ఇది ప్రజలు గ్రహించాలి: ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్న చంద్రబాబు కావాలా.. ప్రేమను పంచుతున్న జగన్ కావాలా అన్న విషయాన్ని జనం తెలుసుకోవాలి. మరో ఐదేళ్లు జగనన్నకు అవకాశం ఇస్తే విద్య, వైద్యం మౌలిక సదుపాయాలు అద్భుతంగా రూపొందుతాయి. -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్రకు జన నీరాజనం (ఫొటోలు)
-
నేడు రాజనగరం, ఉరవకొండలో సామాజిక సాధికార యాత్ర
-
నేటి సామాజిక సాధికార యాత్ర షెడ్యూల్
తాడేపల్లి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. నిన్నటితో(శనివారం) 41 రోజులు పూర్తి చేసుకున్న సామాజిక సాధికార యాత్రం నేడు 42వ రోజులోకి అడుగుపెట్టింది. ఆదివారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంతో పాటు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జరుగనుంది. ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. దీనిలో భాగంగా మధ్యాహ్నం రెండు గంటలకు వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం, మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు అంబేద్కర్ సర్కిల్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ సభకు మంత్రులు గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు హాజరుకానున్నారు ఇక రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కోరుకొండ మండలం దోసకాయపల్లిలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం కోరుకొండ వరకూ బస్సుయాత్ర ఉంటుంది. మధ్యాహ్నం మూడు గంటలకు కోరుకొండ బూరుగపూడి గేట్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సినీ నటులు అలీ తదితరులు పాల్గొనున్నారు. -
పెద్దాపురంలో మార్మోగిన సాధికార నినాదం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా పెద్దాపురంలో బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీ ప్రజల సాధికార నినాదం మార్మోగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేసిన మేలును ప్రతిబింబిస్తూ శనివారం పెద్దాపురంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర జన ప్రభంజనమే అయ్యింది. పెద్దాపురం నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ‘జై జగన్’ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర సెంటర్ వరకూ సాగింది. బస్సు యాత్ర ముందు భారీ బైక్ ర్యాలీలో యువత కేరింతలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరెత్తిన ప్రతిసారీ కరతాళ ధ్వనులతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసిన సీఎం జగన్: మండలి చైర్మన్ మోషేన్ రాజు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. దళితుడినైన తానే జగనన్న ప్రభుత్వంలో రాజకీయ సమానత్వనికి చిహ్నమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 17 మందిని మంత్రులుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్దేనని అన్నారు. రాజకీయ, సామాజిక, ధన ప్రభావాలు చూడకుండా బడుగులకు పెద్ద పదవులు ఇచ్చిన నేత జగన్ ఒక్కరేనని చెప్పారు. సీఎం జగన్ పాలనలో అన్నింటా బడుగులకు అగ్రస్థానం: ఎంపీ సురేష్ సీఎం వైఎస్ జగన్ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు అన్నింటా అగ్రస్థానం లభిస్తోందని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. సంక్షేమ పథకాల్లో, రాజకీయ, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. పేదలు మరింతగా బాగు పడాలంటే జగనే మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలని, అందు కోసం ఆయనకు అందరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ప్రేమ, దయ కలిస్తే జగనన్న: జూపూడి ప్రేమ, దయ కలిస్తే సీఎం వైఎస్ జగనన్న అని, ఆయన సమానత్వం చూపించే వ్యక్తి అని వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. అందుకే నేడు సామాజిక సాధికార యాత్ర చేయగలుగుతున్నామని చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి సీఎం వైఎస్ జగన్ పరిపాలనే కారణమని చెప్పారు. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్రాజు చెప్పారు. అమ్మ ఒడి, రైతు భరోసా, రుణమాఫీ, పింఛన్లు వంటి కార్యక్రమాలతో సంక్షేమాన్ని ప్రతి గుమ్మం వద్దకు చేర్చారని తెలిపారు. ప్రజలందరూ బాగుండాలనే తపనతో పని చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ప్రజల ఆరోగ్యం బాగుండాలని, పిల్లలు బాగా చదువుకోవాలని తపిస్తూ విద్య, వైద్య రంగాలను అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. పేదవారిని గౌరవించి, పథకాలను వారి ఇంటి వద్దకే పంపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు, అయ్యరక కార్పొరేషన్ చైర్పర్సన్ ఆవాల రాజేశ్వరి, పెద్దాపురం మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. -
ముత్తుకూరులో సామాజిక ప్రభంజనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులో శనివారం సామాజిక సాధికారత నినాదం మార్మోగింది. వైఎస్సార్సీపీ నిర్వహించిన సామాజిక సాధికారత బస్సు యాత్రకు అశేష జనవాహిని జేజేలు పలికింది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ముత్తుకూరులోని పాత వాణి థియేటర్ నుంచి జంక్షన్ వరకు మేళతాళాలు, కేరళ డ్రమ్స్, గిరిజన సంప్రదాయ నృత్యాల నడుమ ఓ పండుగలా ర్యాలీ జరిగింది. దారి పొడవునా బడుగు, బలహీన వర్గాలకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు జరిగిన మేలును తలచుకుంటూ జై జగన్.. జైజై జగన్ అనే నినాదాలతో హోరెత్తించారు. అనంతరం జరిగిన సామాజిక సాధికార సభ జనసంద్రాన్ని తలపించింది. కిలోమీటర్ల పొడవున జనం నిల్చుని నేతల ప్రసంగాలు వింటూ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. జగన్తోనే సామాజిక విప్లవం: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అంబేడ్కర్ కలలు కన్న సామాజిక న్యాయం సీఎం జగన్తోనే సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చెప్పారు. నవరత్నాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు ఓసీలు సైతం లబ్ధి పొందారని తెలిపారు. సీఎం జగన్ కార్యక్రమాలతో ఈ వర్గాలు సామాజిక సాధికారత సాధించి, నేడు తలెత్తుకొని తిరగగలుగుతున్నాయని చెప్పారు. సీఎం వైఎస్ జగన్పై దుష్ప్రచారం చేసేందుకు రాక్షస మూకలు మళ్లీ బయల్దేరాయని, వారిని మరోసారి చిత్తుగా ఓడించాలని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ని బతికిస్తే.., చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ బొమ్మ పెట్టుకొనే అర్హత లేదన్నారు. మరోసారి రాష్ట్రంలో సీఎం జగన్కు పట్టం కట్టి, మరింత అభివృద్ధికి బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. తండ్రిని మించిన తనయుడు జగన్: ఎంపీ బీదా మస్తాన్రావు సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసి, వారిని అభివృద్ధి దిశగా నడిపించారని రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు చెప్పారు. రాజ్యసభలో 9 మంది వైఎస్సార్సీపీ ఎంపీలు ఉంటే వీరిలో ఐదుగురు బీసీలకు అవకాశం కల్పించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. పేదలకు అత్యంత ఆవశ్యకమైని విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు అవమానాలకు గురిచేస్తే, వైఎస్ జగన్ అన్నిరంగాల్లోనూ పెద్దపీట వేశారని తెలిపారు. బడుగు వర్గాలకు బంగారు బాట: తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు బంగారు బాటలు వేసిన ఘనత సీఎం వైఎస్ జగనకే దక్కుతుందని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి అన్నారు. గత పాలకులు బడుగు వర్గాలను ఓటు బ్యాంకుగా చేశారని, కానీ, వారి అభ్యున్నతికి కృషి చేసిన సీఎం జగన్ అభినవ అంబేడ్కర్ అని కొనియాడారు. మైనారిటీలకు రూ.26 వేల కోట్లు : రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాదర్బాషా సీఎం వైఎస్ జగన్ ఈ నాలుగున్నరేళ్లలో మైనారిటీల సంక్షేమానికి రూ.26 వేల కోట్లు ఖర్చు చేశారని, గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇంతస్థాయిలో ఖర్చు పెట్టలేదని రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాదర్బాషా అన్నారు. తెలుగు, లెక్కలు రాని లోకేశ్ సీఎం కావాలని తాపత్రయపడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెండు చోట్ల గ్లాసులు పగలగొట్టుకొన్న పవన్ కళ్యాణ్ సీఎం జగన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. రూ.979 కోట్ల మేరకు సంక్షేమ ఫలాలు : మంత్రి కాకాణి సీఎం జగన్ పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలు సంక్షేమ పథకాల ద్వారా రూ.979 కోట్ల మేర లబ్ధి పొందారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. రూ.442 కోట్ల మేరకు అభివృద్ధి పనులు జరిగాయన్నారు. సుమారు 1.10 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని తెలిపారు. మేలు జరిగితేనే ఓటు వేయమన్నారు : నెల్లూరు మేయర్ స్రవంతి మీ కుటుంబంలో మేలు జరిగితేనే ఓటు వేయండంటూ అడిగే ధైర్యం ఈ రాష్ట్రంలో సీఎం జగనన్నకు మాత్రమే ఉందని నెల్లూరు మేయర్ పొట్లూరు స్రవంతి అన్నారు. గిరిజన మహిళనైన తనను మేయర్ సీట్లో కూర్చొబెట్టడమే కాకుండా ఒక ఎస్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది కూడా జగనన్నే అని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను అభివృద్ధి పరుస్తూ సామాజిక న్యాయాన్ని సాధించిన సీఎం జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని వైఎస్సార్సీపీ సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత పిలుపునిచ్చారు. -
విశాఖలో బడుగుల విజయవిహారం
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన చేయూతతో సాధికారత సాధించిన బడుగు, బలహీన వర్గాల ప్రజలు శనివారం విశాఖ తీరంలో విజయ విహారం చేశారు. వేలాదిగా తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం జగన్ అందించిన పథకాలతో తాము సాధించిన విజయాలను, సామాజిక న్యాయాన్ని వివరిస్తూ ముందుకు సాగారు. నెడ్క్యాప్ చైర్మన్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు ఆధ్వర్యంలో మాధవధార నుంచి కైలాసపురంలో ఇనార్బిట్ మాల్ వరకూ వందలాది బైకులు, కార్ల ర్యాలీతో యాత్ర సాగింది. జై జగన్.. జై జై జగన్ అంటూ వారికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. కైలాసపురం వద్ద జరిగిన బహిరంగ సభకు తరలివచ్చిన ప్రజలతో ఆ ప్రాంతం జనసంద్రమే అయింది. సభ ఆద్యంతం ‘జగనే కావాలి.. మళ్లీ జగనే రావాలి’ అంటూ ప్రజలు నినాదాలతో హోరెత్తించారు. పేదల అభ్యున్నతి జగన్తోనే సాధ్యం: డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు పేద ప్రజల అభ్యున్నతి సీఎం వైఎస్ జగన్తోనే సాధ్యమని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకుని, వారిని సాధికారత దిశగా నడిపించిన సీఎం జగన్ ఒక్కరేనని తెలిపారు. ఈ వర్గాలను చంద్రబాబు ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే భావించారని, అధికారంలోకి వచ్చాక అవహేళన చేశారని అన్నారు. ఎన్నికలు సమీపించడంతో చంద్రబాబు మరో మారు మాయల పకీరులా మోసం చేయడానికి వస్తున్నాడన్నారు. రుణ మాఫీ పేరుతో రైతులను, మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అదే రైతులు, అక్కచెల్లెమ్మలను సీఎం వైఎస్ జగన్ ఆదుకొని, వారి కుటుంబాలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వృద్ధాప్య పింఛన్లు 3 వేలకు పెంచారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మంది పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి దేశ చరిత్రలో రికార్డు నెలకొల్పారన్నారు. అసమానతలు రూపుమాపుతున్నసీఎం జగన్ : మంత్రి మేరుగు సీఎం వైఎస్ జగన్ సమాజంలో అసమానతలను రూపుమాపుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. అందరూ సమానంగా ఉండాలనేది సీఎం జగన్ ఆలోచనైతే.. దళితులపై దాడులు, బీసీలను తోకలు కత్తిరిస్తానని బెదిరించిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఆర్ధి కంగా బలోపేతమయ్యాడని చెప్పారు. చంద్రబాబు పాలనలో 12 శాతం ఉన్న పేదరికం సీఎం జగన్ పాలనలో 6 శాతానికి తగ్గిందన్నారు. అంబేడ్కర్ కలలు నిజమవుతున్నాయి: మేయర్ హరి వెంకట కుమారి పేదలు అభ్యున్నతి చెందాలన్న అంబేడ్కర్, జ్యోతిరావు పూలే వంటి మహానుభావులు కన్న కలలను సీఎం వైఎస్ జగన్ నిజం చేస్తున్నారని గ్రేటర్ విశాఖ మేయర్ హరి వెంకటకుమారి చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు అభివృద్ధి చెందిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ వర్గాలకు చట్టసభల్లో, నామినేటెడ్ పదవుల్లో రాజకీయంగా సముచిత స్థానం కల్పించారన్నారు. నియోజకవర్గంలో రూ.3467.76 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి: కె.కె.రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రూ.3,467.76 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి జరిగిందని నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు తెలిపారు. విశాఖను పారిశ్రామిక, పర్యాటక, విద్యా, వైద్య రంగాల్లో దేశంలోనే అగ్ర నగరాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. 17 ఎకరాల్లో రూ.500 కోట్లతో ఇనార్బిట్మాల్, ఐటీ టవర్, మెగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఇది పూర్తయితే 2 వేల మందికి ఉద్యోగావకాశాలు, కంచరపాలెం ఇండస్ట్రీయల్ ఎస్టేట్ ప్రాంతంలో ఎఎస్ఎన్ మెఘా మాల్ ద్వారా 1500 మందికి పైగా ఉపాధి పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్కుమార్, కంబాల జోగులు, తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు, పెట్ల ఉమాశంకర గణేష్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు, కుంభా రవిబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎ. రెహా్మన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభంజనంలా సాధికార యాత్ర.. అడుగడుగునా అపూర్వ స్పందన
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 41వ రోజు వైఎస్సార్ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం ఉప్పెనలా తరలివచ్చారు. అడగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతూ నీరాజనం పలికారు. బస్సు యాత్రలో భాగంగా గ్రేటర్ విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 26వ వార్డులోని ఎన్జీజీఓస్ కాలనీలో స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన జీవీఎంసీ స్కూల్ను వైఎసార్సీపీ ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. అనంతరం మాధవధార నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీని చేపట్టారు. వేలాది బైక్ లతో సామాజిక సాధికార బస్సుయాత్ర కైలాసపురం వద్ద ఇన్ ఆర్పిట్ మాల్ స్థలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రి మేరుగ నాగార్జున, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జగ్గుపల్లి సుభద్ర, గ్రేటర్ విశాఖ మేయర్ హరి వెంకట కుమారి, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు హాజరయ్యారు. సీఎం జగన్ సాహసోపేత నిర్ణయాలు: డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ, డ్వాక్రా మహిళలకు రుణాలు, రైతుల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేస్తే, జగన్ ఇచ్చిన హామీ మేరకు దఫదఫాలుగా మాఫీ చేస్తున్నారన్నారు. పేదల పిల్లల ఉన్నతస్థాయిలో చదవుకోవాలని నాడు - నేడు ద్వారా అభివృద్ధి పనలు చేస్తున్నారని, అవ్వా , తాతలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ రూ. 3 వేలకు పెంచి అందిస్తున్న ఘనత జగన్ దేనని ఉద్ఘాటించారు. ఆరోగ్య శ్రీ కేవలం రూ. 2 లక్షల పరిమితితో ఆనాడు స్వర్గీయ వైఎస్ ప్రారంభిస్తే, సీఎం జగన్ రూ. 25 లక్షల మేరకు పెంచి ప్రతీ కుటుంబ ఆరోగ్యం పట్ల తన చిత్తశుద్ధిని చాటి సాహసోపేత నిర్ణయాలను తీసుకుంటున్నారన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో శాశ్వతంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం కొనసాగి సామాజిక సాధికారత ఫరిడవిల్లుతుందన్నారు. విశాఖ నార్త్ లో వైసీపీ అభ్యర్థి కే కే రాజును వచ్చే ఎన్నికల్లో గెలిపించడంతో ద్వారా జగన్ ను సీఎంగా చేసుకోవాలని ముత్యాల నాయుుడు పిలుపునిచ్చారు. జగన్ పాలనలో సామాజిక సాధికార విప్లవం: మంత్రి మేరుగ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ, దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ సామాజిక సాధికారత సాధ్యం కాకపోగా, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జగన్ పాలనలో సామాజిక సాధికార విప్లవం సాధ్యమైందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అసమానతలు, అవినీతి, అశ్రిత పక్షపాతంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవమానించి రాజ్యాంగ బద్ద హక్కులను కాలరాసారని మండిపడ్డారు. పేదల కడుపులో ఆకలి తీర్చడానికి, చిరునవ్వు కోసం లక్షల కోట్ల రూపాయల వెచ్చిస్తున్న ముఖమంత్రి జగన్ అని ప్రశంసించారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు సీఎం జగన్ ఇస్తే, రాజధాని ప్రాంతంలో వెనుకబడి వర్గాలకు ఇళ్లు కేటాయించాలని సీఎం జగన్ తలపిస్తే కోర్టులకెళ్లి అడ్డుకున్న చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలకు అవసరమా, అతని అంతు చూడాల్సిన బాధ్యత మనపై ఉందని పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలనలో 12.5 శాతం పేదరికం రాష్ట్రంలో ఉంటే, జగన్ హయాంలో 6 శాతానికి తగ్గిందని దీనికి వైసీపీ ప్రభుత్వ పాలన కాదా అని ప్రశ్నించారు. చంద్రగిరిలో పుట్టి కుప్పంలో పోటీ చేసే చంద్రబాబు, హైదరాబాద్ లో పుట్టిన లోకేశ్ మంగళగిరిలో పోటీ చేస్తున్న బ్రతుకు టీడీపీదైతే, జగన్ వచ్చే ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల నేతల సీట్లు మార్చుతున్నారని విమర్శిస్తుండటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో అణగారిన వర్గాల నేతలు ఎక్కడ పోటీ చేసినా సరే గెలవ గల సత్తాను సీఎం జగన్ ఇచ్చారని మేరుగ నాగార్జున పేర్కొన్నారు. పాదయాత్ర పేరుతో సగం దూరం నడిచి పారిపోయిన లోకేశ్, ప్రజల కష్టాలు తీర్చుతానని చెప్పకుండా ఎర్ర బుక్ పేరుతో వైసీపీ నేతలకు బెదిరింపులు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. సీఎం జగన్ పాలనలో వెనుకబడివ వర్గాలకు గౌరవం: ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాలకు చేయూతనివ్వాలని సంకల్పించారని, రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల ఖర్చు చేసిన ముఖ్యమంత్రి జగన్ తప్పితే మరెవరూ లేరని వ్యాఖ్యానించారు. 133 కులాలు ఉంటే వాటిని క్రోడీకరించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంక్షేమం అందిస్తున్నారన్నారు. వెనుకబడివ వర్గాలకు సమాజంలో గౌరవం కల్పించాలని జగన్ పరితపించారన్నారు. అధికారం పెద్దలదు కాదని, పేదలదని జగన్ నిరూపించారని, జగన్ పాలనలో పాలకులు ప్రజలకు సేవకులు మాత్రమేనని వివరించారు. జగన్ సాధించిన సాధికారతకు ఇదే నిదర్శనం: గ్రేటర్ విశాఖ మేయర్ హరికుమారి గ్రేటర్ విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ, గతంలో ఎన్నో ప్రభుత్వాలు పాలన చేసినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓటు బ్యాంక్ లుగా మాత్రమే పరిగణించారని, సీఎం జగన్ సముచిత స్థానం కల్పించి కేబినెట్ లో చోటుతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ ల పదవులు కట్టెబెట్టి ఆత్మగౌరవం పెంచారని కొనియాడారు. వెనుకబడిన వర్గానికి చెందిన గృహిణిని అయిన తనను విశాఖ వంటి మహా నగారానికి మేయర్ ను చేసారంటే సీఎం జగన్ ఏ స్థాయిలో సామాజిక విప్లవం తీసుకువచ్చారో అర్థం చేసుకోవచ్చునన్నారు. నాడు - నేడుతో విద్యా రంగంలోనూ, ఆరోగ్య శ్రీ,, జగనన్న సురక్ష వంటి పథకాలతో ఆరోగ్య రంగంలోనూ పెద్ద ఎత్తున మార్పులు తీసుకువచ్చి దేశంలోనే ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిపారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసి గెలిపించాలని హరి కుమారి కోరారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కే కే రాజు మాట్లాడుతూ, సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిక్షణం ప్రజాహితం కోసం పరితపిస్తుండటాన్ని చంద్రబాబు, ఆయన తోక పార్టీల అధ్యక్షులు ఓర్వలేక కోర్టుల కేసుల పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు సీఎం జగన్ చేసిన సామాజిక సాధికారతను చెప్పేందుకు బస్సు యాత్ర ద్వారా అన్ని వర్గాల నేతలు ప్రతిపక్షాలకు ధీటుగా వివరిస్తున్నారన్నారు. ఉత్తర నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ. 3427కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనలుు చేపట్టామని, 7 హాస్పిటల్స్, 14 స్కూల్స్ నిర్మాణం చేపట్టామని కే కే రాజు వివరించారు. ఆగస్టు 1న సీఎం జగన్ శంకుస్థాపన చేసిన ఇన్ ఆర్బిటల్ మాల్ నిర్మా్ణం పూర్తియితే స్థానికంగా ఉన్న యువత 15 వేల మందికి, ఎఎంసీ మాల్ ద్వారా 3 వేల మందికి ఉపాధి లభించబోతోందని, విశాఖ నార్త్ నియోజకవర్గంలోనే దాదాపుగా 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా తాను ఎమ్మెల్యేగా గెలవకపోయినా సరే ఎటువంటి వివక్ష లేకుండా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జగ్గుపల్లి సుభద్ర మాట్లాడుతూ, దేశంలో గాంధీ, అంబేద్కర్ , ఫూలే కలలు గన్న సమాజాన్ని సాకారం చేసిన నేత జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని గుర్తు చేసారు. టీడీపీ హయాంలో గిరిజన శాఖకు మంత్రి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, జీసీసీ చైర్మన్ వంటి పదవులకు గిరిజనులను నియమించకుండా తీవ్రంగా అవమానించితే, జగన్ సీఎం కాగానే ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ, రాజ్యాంగ పదవుల్లో స్థానం కల్పించి గౌరవమిచ్చారని కొనియాడారు. వైసీపీ మైనార్టీ నాయకుడు ఎస్ ఏ రెహ్మన్ మాట్లాడుతూ, చంద్రబాబు కేబినెట్ విస్తరణ చేసినపుడు లోకేష్ను మంత్రిని చేసుకున్నాడని, ఎస్టీలు, ముస్లింలు కనిపించలేదని మండిపడ్డారు. -
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో బస్సుయాత్ర
-
విశాఖ నార్త్ సమన్వయకర్త కేకే రాజు అధ్వర్యంలో బస్సుయాత్ర
-
వెంకటగిరి నియోజక వర్గం రాపూరులో సామాజిక సాధికార బస్ యాత్రకు బ్రహ్మరథం
-
నేటి సామాజిక సాధికార యాత్ర షెడ్యూల్
తాడేపల్లి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర భాగంగా నేడు(శనివారం) విశాఖ నార్త్ నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లా పెద్దాపురం, నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గాల్లో జరుగనుంది. విశాఖ నార్గ్ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు వైఎస్సార్సీపీ ప్రతినిధుల మీడియా సమావేశం ఉండగా, పన్నెండు గంటలకు అక్కయ్యపాలెం ఎన్జీవోస్ కాలనీలో స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మాధవధార లాస్ట్ బస్ స్టాప్ నుండి బైక్ ర్యాలీ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు పోర్ట్ హాస్పిటల్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ రీజనల్ ఇన్ఛార్జి వైవీ సుబ్బా రెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, కారుమురి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్, తదితరులు హాజరుకానున్నారు. మరొకవైపు కాకినాడ జిల్లా పెద్దాపురంలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు పెద్దాపురం వైఎస్సార్సీపీ కార్యాలయం నుండి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు పెద్దాపురం మున్సిపల్ సెంటర్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే అదీప్రాజ్, ఎమ్మెల్సీ కొయ్యే మోషెన్రాజు తదితరులు హాజరుకానున్నారు. ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు. మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. దీనిలో భాగంగా సాయంత్రం మూడు గంటలకు ముత్తుకూరులోని వాణి మహల్సెంటర్ నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ముత్తుకూరు బస్టాండ్లో బహిరంగ సభ జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీలు గురుమూర్తి, బీద మస్తాన్ రావు, మైనార్టీ సెల్ రాష్ట్ర నేత ఖాదర్ బాషా, నెల్లూరు నగర మేయర్ స్రవంతి, తదితరులు పాల్గొనున్నారు. -
వైఎస్ఆర్ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు విశేష ప్రజాదరణ
-
వెంకటగిరి.. జన కెరటం
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లా వెంకటగిరిలో సామాజిక న్యాయం నినదించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు సీఎం జగన్ పాలనలో తాము సాధించిన అభివృద్ధిని ఎలుగెత్తి చాటారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా వ చ్చిన ప్రజలు శుక్రవారం వైఎస్సార్సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్ర ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. వెంకటగిరిలో ప్రారంభమైన ర్యాలీ పోలేరమ్మ ఆశీర్వాదం అందుకుని డక్కిలి మీదుగా రాపూరుకు చేరుకుంది. యాత్ర వెళ్లిన ప్రతి వీధిలో స్థానిక ప్రజలు నీరాజనాలు పలికారు. దళితుల కోసం రూ. 86 వేల కోట్లు ఖర్చు : ఎంపీ గురుమూర్తి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఉన్నతికి సీఎం వైఎస్ జగన్ చేసినంత కృషి దేశంలో మరే ముఖ్యమంత్రీ ఇప్పటివరకు చేయలేదని ఎంపీ గురుమూర్తి చెప్పారు. ఒక్క దళితుల కోసమే సీఎం జగన్ రూ. 86 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. దళితుల పిల్లల చదువుల కోసం ఈ నాలుగున్నరేళ్లలో రూ. 10 వేల కోట్లు, ఈ వర్గాల మహిళల కోసం మరో రూ. 10వేల కోట్లు ఇచ్చారన్నారు. మళ్లీ జగనన్న వస్తేనే సంక్షేమం కొనసాగి, మన జీవితాల్లో మరింతగా వెలుగులు నిండుతాయని చెప్పారు. సీఎం జగన్ అంటేనే ఓ విప్లవం: ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలో అన్ని వర్గాల పేదలను ఆదుకుంటున్న సీఎం వైఎస్ జగన్ అంటేనే ఓ విప్లవమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ అన్నారు. చదువుతోనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని జగనన్న నమ్మి ప్రభుత్వ విద్యా రంగాన్ని అత్యున్నతంగా తీర్చి దిద్దుతున్నారని తెలిపారు. మన పిల్లలు ఈరోజు బెంచీల మీద కూర్చుని, దర్జాగా యూనిఫాం, షూస్ వేసుకుని, టైలు కట్టుకుని.. ఇంగ్లిష్ మీడియం చదువులు చదువుతున్నారన్నారు. ధనవంతుల పిల్లలకు, పేదల పిల్లలకు తేడా లేకుండా చేసిన జగనన్నకు మనం ఎంతగా రుణ పడిపోయామో అర్థం చేసుకోవాలని కోరారు. పేదలకు ఎలాంటి జబ్బులు చేసినా, ఎంత పెద్దవైనా రూ. 25 లక్షల మేర వైద్య సాయం అందిస్తున్నారని అన్నారు. సీఎం జగన్ కులం, మతం చూడరు.. కేవలం ప్రేమను చూపిస్తాడు: అలీ సీఎం జగన్ కులం, మతం చూడరని, కేవలం ప్రేమనే చూపిస్తారని ఎల్రక్టానిక్ మీడియా సలహాదారు అలీ అన్నారు. ఎప్పుడూ పేదలకు ఇంకా ఎంతో మంచి చేయాలని తపిస్తున్నారన్నారు. ఎన్నడూ చిరునవ్వు చెదరనివ్వని జగనన్న ప్రజల జీవితాల్లోనూ అదే సంతోషాన్ని చూడాలని సుపరిపాలన చేస్తున్నారని కొనియాడారు. మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడం మనకు చాలా అవసరమని చెప్పారు. జగన్ బటన్ నొక్కితే.. బాబు గొంతు నొక్కుతాడు: నాగార్జున యాదవ్ సీఎం జగన్.. బటన్ నొక్కి నేరుగా పేదలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని ఏపీఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగార్జున యాదవ్ చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం జనం గొంతు నొక్కే కార్యక్రమాలే చేశారని ధ్వజమెత్తారు. 14 ఏళ్లలో ఒక్కసారి కూడా బటన్ ఎందుకు నొక్కలేదని ప్రశి్నంచారు. ఎమ్మెల్సీలు పోతుల సునీత, మేరిగ మురళీధర్, సిపాయి సుబ్రమణ్యం తదితరులు మాట్లాడారు. -
వెల్లివిరిసిన సామాజిక చైతన్యం
సాక్షి, అమలాపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో సామాజిక సాధికార నినాదం మార్మోగింది. శుక్రవారం మలికిపురం ప్రధాన రహదారి నుంచి వైఎస్సార్సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరితో ప్రధాన రహదారి నిండిపోయింది. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువకులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తమకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ‘జై జగన్.. జై వైఎస్సార్సీపీ’ నినాదాలతో హోరెత్తించారు. వీరికి స్థానిక ప్రజలు జేజేలు పలికారు. అనంతరం జరిగిన సామాజిక సాధికార సంభ జన సంద్రాన్ని తలపించింది. హోదా పెంచారు: మోపిదేవి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో పెద్ద పీట వేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గౌరవం ఇచ్చారని, సమాజంలో హోదాను పెంచారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ తెలిపారు. తనతో పాటు బీదా మస్తాన్రావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్.కృష్ణయ్యలను రాజ్యసభకు పంపించారంటే బీసీల పట్ల జగన్కు ఉన్న ప్రేమను అర్థం చేసుకోవాలన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ. మైనార్టీలకు అధికారంలో సముచిత స్థానం ఇచ్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. అంబేడ్కర్, పూలే కన్న కలలను సీఎం జగన్ నిజం చేశారన్నారు. సామాజిక విప్లవం: మంత్రి విశ్వరూప్ సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా బడుగు, బలహీన వర్గాలు ఆర్థి కంగా ఉన్నత స్థితికి ఎదిగేందుకు తోడ్పడ్డారన్నారు. సమాజంలో బడుగు, బలహీన వర్గాలు ఉన్నత స్థితికి రావాలంటే చదువుతోనే సాధ్యమని జగన్ సంపూర్ణంగా విశ్వసించారని, అందుకే నాడు–నేడులో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే నేరుగా నగదు జమ చేస్తున్నారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛన్ కానుకను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచారని చెప్పారు. పేదల పక్షాన : మంత్రి చెల్లుబోయిన వేణు రాష్ట్రంలో పేద వర్గాల పక్షాన నిలబడింది సీఎం జగన్ ఒక్కరేనని, ప్రతి సంక్షేమ పథకం లబ్ధిని పేదలు, మధ్యతరగతి వర్గాలకు అందజేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను బానిసలుగా చూసిన చంద్రబాబుకు, ఈ వర్గాల వారిని అందలం ఎక్కించిన జగన్కు మధ్య పాలనను బేరీజు వేసుకుని, వచ్చి ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మేలును చూసి చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు ఓర్చుకోలేక, నిత్యం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే ఒక్క పిలుపు.. రాపాక స్పీచ్ కి దద్దరిల్లిన రాజోలు
-
Konaseema: ‘ఏపీలో సామాజిక విప్లవం.. సీఎం జగన్ చేతల్లో చూపించారు’
సాక్షి, కోనసీమ జిల్లా: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర 40వ రోజుకు చేరుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో మల్కిపురంలో బస్సు యాత్ర సాగింది. మలికిపురంలోని కేఎస్ఎన్రాజు నివాసంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం రెండు గంటలకు శివకోడు లాకుల నుండి బస్సుయాత్ర ప్రారంభమైంది. మలికిపురం ప్రధాన సెంటర్లో నిర్వహించిన బహిరంగలో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, విశ్వరూప్, ఎంపీలు అనురాధ, మోపిదేవి తదితరులు హాజరయ్యారు. మలికిపురంలో సామాజిక సాధికార సభ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం జగన్: మంత్రి విశ్వరూప్ సభలో మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధి సీఎం జగన్ హయాంలోనే జరిగిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం నెరవేర్చారన్నారు. సామాజిక సాధికారతను సీఎం జగన్ చేతల్లో అమలు చేసి చూపించారని, రాష్ట్రంలో సామాజిక విప్లవం నడుస్తోందని మంత్రి అన్నారు. 2024లో జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఉంది. అంబేద్కర్ స్ఫూర్తితో నడుస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్. అభివృద్ధి చదువు ద్వారానే సాధ్యమవుతుందన్న అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టిన నాయకుడు. బీసీ, ఎస్సీ ఎస్టీల మైనార్టీల ఆత్మ గౌరవాన్ని గుర్తించిన వ్యక్తి జగన్’’ అని మంత్రి కొనియాడారు. చంద్రబాబు బీసీలను బానిసలుగా చూసేవాడు: మంత్రి వేణు మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, రాజోలు నియోజకవర్గం నాకు పుట్టిల్లు. ఇక్కడ నేతలు కృష్ణంరాజు, జక్కంపూడిల సహకారంతో ఎదిగాను. వైఎస్సార్, సీఎం జగన్ నాకు రాజకీయంగా గుర్తింపునిచ్చారు. చంద్రబాబు బీసీలను బానిసలుగా చూసేవాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల ఆత్మగౌరవం గుర్తించిన వ్యక్తి సీఎం జగన్ మాత్రమే. అబద్ధం 14 ఏళ్ల పాటు పాలించింది.. జగన్ అనే నిజం వెలుగులోకి వచ్చి ప్రజల సమస్యలు తీర్చింది’’ అని మంత్రి వేణు పేర్కొన్నారు. వారు తలెత్తుకుని జీవించగలుగుతున్నారు: మోపిదేవి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ, పేదల సమస్యల గురించి మాట్లాడే నాయకులను మాత్రమే గతంలో చూశాం.. సమస్యలను పరిష్కరించి, చేతల్లో అభివృద్ధిని చూపిన నాయకుడు సీఎం జగన్ మాత్రమే. అంబేద్కర్ ఆలోచన విధానాలను అక్షరాల అమలు చేసిన నాయకుడు సీఎం జగన్. చిన్న వర్గాలకు చెందిన బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు చెందిన అనేక మందికి సీఎం జగన్ మార్కెట్ చైర్మన్లుగా, దేవాలయాలు చైర్మన్లుగా పదవులిచ్చి సమాజంలో గౌరవం కల్పించారు’’ అని ఎంపీ చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు తలెత్తుకుని జీవించగలుగుతున్నారంటే అది వైఎస్ జగన్ వల్లే సాధ్యమైంది. ఈ వర్గాలకు నిజమైన సాధికారత చేకూరింది. ఎవరి దగ్గర చేయి చాచకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు వాళ్ల కాళ్లపై వాళ్లు జీవించగలిగే పరిస్థితిని జగన్ కల్పించారు. దేశంలోని అత్యున్నతమైన రాజ్యసభ పదవులు నలుగురు బీసీలకు జగన్ కట్టబెట్టారు. చంద్రబాబు తన పార్టీలో డబ్బున్న వారికి రాజ్యసభ స్థానాలు అమ్ముకుంటాడు. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు బీసీలకు చిన్నపాటి రాజకీయ హోదా కూడా చంద్రబాబు ఇవ్వలేకపోయాడు. 2024లో కూడా సీఎంగా జగనే రావాలి’’ అని మోపిదేవి పేర్కొన్నారు. ఇదీ చదవండి: Volunteer Jobs: ఏపీ బాటలో తెలంగాణ! -
నేటి సామాజిక సాధికార యాత్ర షెడ్యూల్
తాడేపల్లి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర 40వ రోజుకు చేరుకుంది. ఈ బస్సుయాత్రలో భాగంగా నేడు(శుక్రవారం) తిరుపతి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాగనుంది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్సార్సీపీ ఇంచార్జ్ నేదురమల్లి రామ్ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నేదురమల్లి బంగ్లా నుండి ప్రారంభమయ్యే ర్యాలీ ఉక్కిలి మీదుగా రాపూరు వరకు జరుగనుంది. అనంతరం మూడు గంటలకు రాపూరు మెయిన్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు హాజరుకానున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో మల్కిపురంలో జరిగే బస్సుయాత్రలో భాగంగా మధ్యాహ్నం గం. 1.30కి మల్కిపురంలోని కేఎస్ఎన్రాజు నివాసంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం రెండు గంటలకు శివకోడు లాకుల నుండి బస్సుయాత్ర ప్రారంభం అవుతుంది. మూడు గంటలకు మల్కిపురం ప్రధాన సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, విశ్వరూప్, ఎంపీలు అనురాధ, మోపిదేవి తదితరులు హాజరుకానున్నారు. -
14 ఏళ్ళు చంద్రబాబు చేసింది దగా దోపిడీ కుట్రలు..
-
పాణ్యంలో సాధికార పండుగ
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు సాధికార పండుగ చేసుకొన్నారు. గురువారం వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాదిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ తమకు చేసిన మేలును వేనోళ్ల కీర్తిస్తూ వీధివీధిలో కలియదిరిగారు. డాక్టర్లు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, ఆటో డ్రైవర్లు ఇలా అన్ని వృత్తుల వారు స్వచ్ఛందంగా తరలివచ్చారు. మధాహ్నం అన్ని వర్గాల ప్రతినిధులతో కేఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో సమావేశం అనంతరం యాత్ర ప్రారంభమైంది. చెన్నమ్మ సర్కిల్ వరకు ర్యాలీ ఘనంగా జరిగింది. 500 బైక్లతో యువత ర్యాలీలో పాల్గొన్నారు. కళాకారుల నృత్యాలు, సంగీత కార్యక్రమాలతో పండుగ వాతావరణం కన్పించింది. మహిళలు, ప్రజాప్రతినిధులు కూడా నృత్యం చేసి సందడి చేశారు. సాయంత్రం జరిగిన సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. సభ ఆద్యంతం ‘జగనే కావాలి.. మళ్లీ జగనే రావాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బడుగుల గురించి ఆలోచించిన సీఎం ఒక్క జగన్ మాత్రమే: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సభలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. పేదల పిల్లలు కూడా సంపన్నుల పిల్లల మాదిరిగా అత్యున్నతస్థాయికి ఎదిగేలా అత్యాధునిక చదువులు చెప్పిస్తున్న దేవుడు సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. ఒకే వేదికపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కూర్చోబెట్టి ఆ వర్గాలకు న్యాయం చేశామని ధైర్యంగా ప్రజలకు చెబుతున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. 75 ఏళ్లలో ఎవ్వరూ ఆలోచించని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి గురించి సీఎం జగన్ ఆలోచిస్తున్నారని తెలిపారు. ఈ వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థితికి చేర్చారని చెప్పారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమాన్ని అడ్డుకోవడానికి రామోజీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు చాలామంది ప్రయత్నిస్తున్నారని, అయినా, వెనుకాడేది లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని, బీసీలకు ఒక్క రాజ్యసభ సీటు కూడా ఇవ్వలేదని చెప్పారు. సీఎం జగన్ అన్ని స్థానాలు, పదవుల్లో ఈ వర్గాలకే అగ్రతాంబూలం ఇచ్చారన్నారు. పురందేశ్వరి, ఈనాడు, ఏబీఎన్, టీవీ5కు చంద్రబాబు కావాలని, ప్రజలకు మాత్రం సీఎం జగన్మోహన్రెడ్డే కావాలని అన్నారు. స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు: ఎంపీ గోరంట్ల రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని సంక్షేమ పథకాల్లో, అన్ని పదవుల్లో కనీసం 70 శాతం ఇచ్చి సామాజిక న్యాయం చేసింది సీఎం జగన్ మాత్రమేనని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలను సీఎం జగన్ నాయకులుగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. ఎలాంటి స్వార్ధం లేకుండా ప్రజా సంక్షేమమే పరమావధిగా సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఆయన స్వార్ధం కోసం రాష్ట్రానికి, ప్రజలకు తీరని అన్యాయం చేశారని, ప్రత్యేక హోదాను మోదీకి అమ్మి ప్రత్యేక ప్యాకేజికి ఒప్పుకున్న దుర్మార్గుడని చెప్పారు. బాబు ప్రజలకు అందించిన స్కీములేవీ లేవని, స్కాములు మాత్రం లెక్కలేనన్ని చేశారని అన్నారు. ఆయన చేసిన తప్పులకు జీవితకాలం జైలులో ఉండాలన్నారు. సీఎం జగన్ గొప్ప దార్శనికుడు: ఎంపీ గురుమూర్తి సీఎం వైఎస్ జగన్ గొప్ప దార్శనికుడని తిరుపతి ఎంపీ గురుమూర్తి చెప్పారు. పేదల అభ్యున్నతి కోసం విద్య, వైద్య రంగాలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారని, సంక్షేమ పథకాలతో ప్రజల స్థితిగతులను ఉన్నతంగా మారుస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నారాయణ, చైతన్య లాంటి ప్రైవేటు విద్యా సంస్థల అభ్యున్నతి కోసం పని చేస్తే.. వాటికి దీటుగా సీఎం జగన్ ప్రభుత్వ బడులను ఆధునీకరించి మంచి చదువు చెప్పిస్తున్నారని కొనియాడారు. అభివృద్ధి లేదు అనే వారు పాణ్యానికి వచ్చి చూడాలి: ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి పాణ్యంలో ఈ నాలుగున్నరేళ్లలో 1.60 లక్షల మందికి రూ.170 కోట్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్దేనని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి చెప్పారు. పిన్నాపురంలో ప్రపంచంలోనే అతి పెద్ద గ్రీన్కో రెన్యువబుల్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారని, త్వరలోనే దీనిని ప్రారంభిస్తామన్నారు. గుట్టపాడు దగ్గర రూ.600 కోట్లతో ఏర్పాటు చేస్తున్న జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంటు కూడా పూర్తయిందన్నారు కర్నూలు సిటీలో అభివృద్ధి పనులకు రూ.800 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంజీవ్కుమార్, ఎమ్మెల్యేలు హఫీజ్ఖాన్, సుధాకర్, మేయర్ బీవై రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ అన్ని వర్గాలకు న్యాయం చేశారు
-
నేటి సామాజిక సాధికార యాత్ర షెడ్యూల్
నంద్యాల: అప్రతిహతంగా సాగుతున్న వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సుయాత్రలో భాగంగా 39వ రోజు(గురువారం) నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంవలోని కల్లూరులో జరుగనుంది. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బస్సుయాత్రలో మధ్యాహ్నం 12 గంటలకు కేఎస్సార్ కన్వషన్ హాలులో వైఎస్సార్సీపీ నేతలు సమావేశం నిర్వహించనున్నారు. రెండు గంటలకు అదే ఫంక్షన్ హాలులో మీడియా సమావేశం ఉంటుంది. మూడు గంటలకు కేఎస్సార్ కన్వషన్ హాలు నుంచి చెన్నమ్మ సర్కిల్ వరకూ బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు చెన్నమ్మ సర్కిల్లో బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు డిప్యూటీ సీఎం నారాయణ స్వాయి, ఎంపీలు గోరంట్ల మాధవ్, గురుమూర్తి, సంజీవ్ కుమార్ తదితరులు హాజరుకానున్నారు. -
ఇదే మనం జగనన్నకు ఇచ్చే గిఫ్ట్: ఆలీ
-
సామాజిక సాధికార యాత్రకు పోటెత్తిన జనం
-
చంద్రబాబు ప్రజలను మోసం చేస్తాడన్న నేతలు
-
తాడి‘కొండంత’ సంబరం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రతో గుంటూరు జిల్లా తాడికొండలో శనివారం సంబరం నెలకొంది. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారీ్టలు భారీ ఎత్తున హాజరై జైకొట్టారు. బీసీలను సీఎం జగన్ బ్యాక్బోన్ కులాలుగా మార్చారని నేతలు కొనియాడారు. సామాజిక సాధికారతను ప్రభుత్వ విధానంగా అమలు చేశారని ప్రశంసించారు. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికార పదవులు కట్టబెట్టి వారి ఉన్నతికి కృషి చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి వైఎస్సార్సీపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం అమలు చేసిన సీఎం జగన్ ఒక్కరే.. సామాజిక సాధికారతకు సీఎం వైఎస్ జగన్ కేరాఫ్ అడ్రస్గా నిలిచారని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ కొనియాడారు. వైఎస్ కుటుంబం కోసం తన ఎమ్మెల్యే పదవిని సైతం త్యాగం చేసిన మేకతోటి సుచరితను తాడికొండలో గెలిపించాలని ప్రజలను కోరారు. భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయాన్ని అమలు చేసిన ఏకైక సీఎం జగన్ మాత్రమేనన్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? బీసీల తోకలు కట్ చేస్తానని చంద్రబాబు అవమానించారని గుర్తు చేశారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ గతంలో సామాజిక న్యాయం అనేది నినాదంగా ఉండేదని.. దాన్ని ప్రభుత్వ విధానంగా మార్చివేసిన ఘనత జగనన్నకు దక్కిందన్నారు. బడుగులకు మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులుగా అవకాశం కలి్పంచారని కొనియాడారు. బీసీలు, ఎస్సీల్లో చిచ్చుపెడుతున్న చంద్రబాబు మాయలో పడొద్దని ప్రజలను కోరారు. దళిత మహిళకు హోం మంత్రి పదవిని ఇచ్చారు.. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ దళిత మహిళగా హోం మంత్రి పదవిని ఊహించుకోలేదని, దాన్ని నిజం చేసి చూపించిన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. జగనన్న రాత్రికి రాత్రే తనను ఒక స్టార్ను చేశారన్నారు. రాష్ట్రంలో తొలి దళిత హోం మంత్రి ఎవరంటే తనపేరే ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. తాడికొండ మాజీ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో సమ సమానత్వం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నామని తెలిపారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెందాలి.. పేదరికం ఉండకూడదనుకుంటే సీఎం వైఎస్ జగన్ను గెలిపించుకోవాలన్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ మాట్లాడుతూ సీఎం జగన్ ప్రతి పేదవాడి సంక్షేమం కోసమే కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మంచి జరిగిందంటే అది ఆయన పుణ్యమేనన్నారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ తాడికొండను గెలిపించి జగన్కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తోంది జగన్ మాత్రమేనన్నారు. 50 వేల మంది పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుపడ్డారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు కిలారు రోశయ్య, అన్నాబత్తుని శివకుమార్, నంబూరు శంకరరావు, తాడికొండ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహా్మనందరెడ్డి పాల్గొన్నారు. -
వెల్లివిరిసిన సామాజిక చైతన్యం
సాక్షి, నంద్యాల: సామాజిక సాధికారత ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోనే సాధ్యమని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగే వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా పేదల పక్షపాతి అయిన వైఎస్ జగన్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. నవనందుల సాక్షిగా శనివారం నంద్యాల పట్టణంలో సామాజిక సాధికార చైతన్యం వెల్లివెరిసింది. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు భారీ ఎత్తున బడుగు, బలహీనవర్గాల ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ ఆకట్టుకుంది. మైనారిటీల పక్షపాతి సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు మైనార్టీల ద్రోహి అని డిప్యూటీ సీఎం అంజాద్బాషా మండిపడ్డారు. చంద్రబాబు మైనారిటీలపై దేశద్రోహం కేసులు పెడితే, సీఎం వైఎస్ జగన్ వచ్చాక ఆ కేసులను తొలగించారని గుర్తు చేశారు. అంతేకాకుండా మైనారిటీ వ్యక్తిని డిప్యూటీ సీఎం పదవిలో కూర్చోబెట్టి సీఎం జగన్ గౌరవించారని కొనియాడారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి సామాజిక సాధికారిత నినాదంగానే ఉందని, ఒక్క సీఎం జగన్ మాత్రమే దీన్ని విధానంగా మార్చారని ప్రశంసించారు. మనల్ని చేయిపట్టుకుని ముందుకు నడిపిస్తున్న జగన్ వెంటే మనమంతా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 14 ఏళ్లలో ఏం చేశావో చెప్పే ధైర్యముందా బాబూ? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు విస్మరిస్తే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన చరిత్ర సీఎం జగన్దని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఏం చేశారో చెప్పగలరా అని నిలదీశారు. ఎస్సీలను తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుని చంద్రబాబు వదిలేశారని మండిపడ్డారు. సీఎం జగన్ ఎస్సీలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. ఆయన అమలు చేస్తున్న ప్రతి పథకం పేదవాడిని ఉన్నతస్థాయికి తీసుకెళ్తోందన్నారు. పేదల పక్షాన నిలుస్తున్న సీఎంకు మనమంతా అండగా నిలవాలని కోరారు. బడుగు, బలహీనవర్గాలంటే చంద్రబాబుకు చిన్నచూపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంటే చంద్రబాబుకు ఇప్పటికీ చిన్నచూపేనని మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ విమర్శించారు. బడుగు, బలహీనవర్గాల నాయకులను సున్నాలతో పోలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ పాలనలోనే బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి సాధ్యమని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే బీసీలను కరివేపాకులా వాడుకుని వదిలేస్తారన్నారు. తండ్రి అరెస్టయి జైలులో ఉంటే ఢిల్లీకి పారిపోయిన పిరికి పంద లోకేశ్.. సీఎంను పట్టుకుని సైకో అంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పక్క పార్టీ నాయకుడిని సీఎంగా చూడాలనుకున్న వ్యక్తి ఈ దేశంలో ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఈ సభలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి, ముస్లిం మైనారిటీ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా తదితరులు పాల్గొన్నారు. -
ఏజెన్సీ ముఖద్వారంలో ‘సామాజిక’ జైత్రయాత్ర
సాక్షి, అనకాపల్లి: ఏజెన్సీ ముఖద్వారమైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శనివారం ‘జై జగన్..జైజై జగన్’ నినాదాలతో దద్దరిల్లింది. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఆద్యంతం ఉత్సాహం, ఉత్తేజంతో సాగింది. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు భారీ ఎత్తున పోటెత్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికార పదవులు లభించాయని కొనియాడారు. ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. దళితులకు అడుగడుగునా మేలు.. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న సంక్షేమం కొనసాగాలంటే మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. చంద్రబాబు ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని మండిపడ్డారు. సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని కొనియాడారు. జనవరి 1 నుంచి వితంతు, వృద్ధాప్య పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతున్నారని చెప్పారు. రెండు వేళ్లు చూపించే టీడీపీ నేతలకు.. ఇక వృద్ధులు, వితంతువులు మూడు వేళ్లు చూపాలని కోరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దళితులకు అడుగడుగునా మేలు జరుగుతోందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. ఈసారి తనను రాజ్యసభకు పంపుతున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్రజల సంక్షేమం కోసం రూ.2.40 లక్షల కోట్లు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కరేనని ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రశంసించారు. వైద్య విప్లవం తీసుకొచ్చారు.. సీఎం జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి వైద్య విప్లవాన్ని తీసుకొచ్చారని అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి కొనియాడారు. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారని ప్రశంసించారు. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ మాట్లాడుతూ.. సీఎం సహకారంతో రూ.2,700 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. అయ్యన్నపాత్రుడు సైకోలా తయారై బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. దేశంలో సామాజిక సాధికారతకు సీఎం జగన్ నిజమైన అర్థం చెప్పారని కొనియాడారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడైనా ఎస్సీ, ఎస్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారా..? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్రాజ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, నవరత్న పథకాల అమలు వైస్ చైర్మన్ ఎ.నారాయణమూర్తి, పార్టీ నేత చింతకాయల సన్యాసిపాత్రుడు, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష పాల్గొన్నారు. -
నేడు 37వ రోజు సామాజిక సాధికార యాత్ర
-
నంద్యాలలో వైఎస్ఆర్ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర
-
జగన్నినాదాలతో హోరెత్తిన అరకు లోయ
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): జగన్నినాదాలతో అరకు లోయ నియోజకవర్గం శుక్రవారం హోరెత్తిపోయింది. హుకుంపేట మండల కేంద్రంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు పోటెత్తారు. గిరిజనం ప్రభంజనంలా తరలివచ్చారు. దీంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. జై జగన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. పాడేరు–హుకుంపేట రోడ్డులోని బర్మన్గుడ జంక్షన్ నుంచి సభావేదిక వరకు సుమారు వెయ్యి బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుని ఆయన రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన సంక్షేమ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగిందన్నారు. గడప గడపకు సంక్షేమ పథకాలు చంద్రబాబు ప్రభుత్వం అరకులోయ నియోజకవర్గ అభివృద్ధిని తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ విమర్శించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఎంతో అభివృద్ధి సాధ్యమైందని కొనియాడారు. గడప గడపకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. నవరత్న ప«థకాల ద్వారా నియోజకవర్గంలోని 2.41 లక్షల మందికి రూ.2 వేల కోట్ల వరకు లబ్ధి చేకూరిందని తెలిపారు. అలాగే మారుమూల గ్రామాలతో పాటు అన్ని ప్రధాన గ్రామాలకు రోడ్లు, గెడ్డలపై వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలకు మరో రూ.2 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చుపెడుతోందన్నారు. సెల్ టవర్ల నిర్మాణాలు, తాగునీటి పథకాలు, నాడు–నేడుతో పాఠశాలలు, ఆస్పత్రుల అభివృద్ధికి రూ.వందలాది కోట్లు వ్యయం చేసిందన్నారు. జగన్ పాలనలోనే సామాజిక న్యాయం సీఎం జగన్ పాలనలోనే గిరిజనుల సమగ్రాభివృద్ధి సాధ్యమైందని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలలక్ష్మి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కొనియాడారు. పాడేరు, పార్వతీపురంల్లో వైద్య కళాశాలలు, సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం, కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణాల ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. చంద్రబాబు గిరిజనులను చిన్నచూపు చూశారని, రాజ్యాంగ పదవులకు దూరం చేశారని మండిపడ్డారు. గిరిజన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేకపోయారన్నారు. సామాజిక న్యాయం జగన్ పాలనలోనే సాధ్యమైందన్నారు. గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి తనతో సమానంగా చూశారని కొనియాడారు. తన పాలనలో 3.46 లక్షల ఎకరాల అటవీ భూములను గిరిజనులకు పంపిణీ చేశారన్నారు. ఆదివాసీలకు సామాజిక న్యాయం ఆదివాసీలకు సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర కొనియాడారు. ఇదే గిరిజన జాతికి చెందిన తనకు జెడ్పీ చైర్పర్సన్గా అవకాశం కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు. అరకు నియోజకవర్గాన్ని రూ.ఆరు వేల కోట్లతో ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి చేశారని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. అరకు నియోజకవర్గంలో గిరిజనుల సాగులో ఉన్న 49 వేల ఎకరాల అటవీ భూములకు పట్టాలిచ్చి ఎంతో మేలు చేశారని తెలిపారు. చంద్రబాబు గిరిజనులను వాడుకుని వదిలేశారని మండిపడ్డారు. అల్లూరి సీతారామరాజు మాదిరిగా గిరిజనులంతా టీడీపీపై బాణాలు ఎక్కుపెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, అరకు లోయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజా రమేశ్, ఎస్టీ కమిషన్ సభ్యులు కొర్రా రామలలక్ష్మి, జంపరంగి లిల్లీ, పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మత్స్యరాస వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
‘అనంత’ ప్రభంజనం
అనంతపురం: 76 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో కేవలం నినాదంగా మాత్రమే ఉన్న ‘సామాజిక సాధికారత’ను వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆచరణలో పెట్టి చూపించారని వైఎస్సార్సీపీ నేతలు కొనియాడారు. సామాజిక సాధికారత తమ నినాదం కాదు విధానమని నిరూపించారని ప్రశంసించారు. రాజ్యాధికార పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పెద్దపీట వేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. మరోసారి వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు అనంతపురం నగరంలో శుక్రవారం వైఎస్సార్సీపీ చేపట్టిన ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. దీంతో సభాప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు చంద్రబాబుకు అధికారంలో ఉంటే అగ్రకులాలు, అధికారంలో లేకపోతే వెనుకబడిన కులాలు గుర్తుకొస్తాయని విమర్శించారు. సామాజిక విప్లవ సృష్టికర్త జగనన్న దేశ చరిత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాజిక విప్లవాన్ని సృష్టించారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. సామాజిక న్యాయం అనేది ప్రభుత్వ విధానమని నిరూపించారన్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులుంటే నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలవారేనని గుర్తు చేశారు. గతంలో ఇంతటి గౌరవం ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన సీఎం జగన్ను గుండెల్లో పెట్టుకుందామని పిలుపునిచ్చారు. బలహీనవర్గాలకే సింహభాగం పథకాలు సీఎం వైఎస్ జగన్ పాలనలో సింహభాగం సంక్షేమ పథకాలు బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాలకే అందుతున్నాయని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ తెలిపారు. కలగా మారిన సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిన అభినవ అంబేడ్కర్, అభినవ పూలే.. వైఎస్ జగన్ అని కొనియాడారు. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటే మనల్ని మనం గౌరవించుకున్నట్లేనన్నారు. ఆయా వర్గాల్లో చర్చ జరగాలి గతంలో కంటే వైఎస్ జగన్ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎంత మేలు జరిగిందనే విషయంపై ఆయా వర్గాల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. బీసీలే తమ పార్టీకి వెన్నెముక అంటూ ఊదరగొట్టే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ వర్గాలకు ఏమీ చేయలేదన్నారు. చంద్రబాబు తన ప్రభుత్వం కమ్మలకు 8, రెడ్లకు 6, కాపులకు 4, బీసీలకు 3, ఎస్సీలకు 2 మంత్రి పదవులు ఇచ్చారని, మైనార్టీ, గిరిజనులకు అసలే ఇవ్వలేదని విమర్శించారు. వైఎస్ జగన్ కేబినెట్లోని 25 మంది మంత్రుల్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలేనని గుర్తు చేశారు. బాబును జీవితంలో నమ్మకూడదు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసిన మోసాలకు ఆయనను జీవితంలో నమ్మకూడదని సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకరరావు అన్నారు. పవన్ కళ్యాణ్ నిలకడ లేని వ్యక్తి అని తెలిపారు. మాటతప్పని, మడమ తిప్పని కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ జగన్ అన్ని వర్గాలకు అండగా నిలిచారన్నారు. పేదల ఖాతాల్లో నేరుగా రూ.2.45 లక్షల కోట్లు జమ చేశారన్నారు. అందులో సింహభాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే అందిందని జూపూడి అన్నారు. సామాజిక న్యాయానికి అర్థం చెప్పారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆకాంక్షించిన సామాజిక న్యాయాన్ని సీఎం వైఎస్ జగన్ నిజం చేశారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక సాధికారతను కల్పించారన్నారు. రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి పేదల ఆర్థిక స్థితిగతులను మార్చేశారని కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందన్నారు. సీఎం వైఎస్ జగన్ చొరవతో అనంతపురం నియోజకవర్గంలో రూ.800 కోట్లతో రోడ్లు, కాలువలు తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. -
సామాజిక సాధికార యాత్ర: పోటెత్తిన ‘అనంత’
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఈరోజు(శుక్రవారం) అనంతపురం నియోజకవర్గంలో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతపురంలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర అంబేద్కర్ విగ్రహం నుంచి పాతవూరు గాంధీ విగ్రహం వరకూ సాగింది. అనంతరం చెన్నకేశవస్వామి ఆలయం ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ మంత్రి పేర్ని నాని, జూపూడి ప్రభాకర్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు హాజరయ్యారు. పేర్ని నాని మాట్లాడుతూ.. ‘ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీలను మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు.వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు ప్రాధాన్యత లేదు. చంద్రబాబు హయాంలో మైనారిటీ, ఎస్టీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించలేదు. ఓడిపోయిన నారా లోకేష్కు మంత్రి పదవి ఇచ్చారు. 17 మంది ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్దే. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సంక్షేమం ఎందుకు పట్టించుకోలేదు?, రుణమాఫీ పేరుతో రైతులు డ్వాక్రా రుణాలను మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. మీకు మంచి జరిగుంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయండి’అని విజ్ఞప్తి చేశారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినవ అంబేద్కర్ వంటి వారు. ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మళ్ళీ వైఎస్ జగన్ను ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది’ అని తెలిపారు. ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ సీఎంగా ఉన్నంతకాలం సంక్షేమ పథకాలు ఉంటాయి. అభివృద్ధి విషయంలో వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే, సీఎం జగన్ రెండు అడుగులు వేస్తున్నారు’ అని పేర్కొన్నారు. -
అరకులో సామాజిక సాధికార బస్సు యాత్ర
-
నేడు అనంతపురం, అరకులో సామాజిక బస్సు యాత్ర షెడ్యూల్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. నేడు అనంతపురం, అరకు నియోజకవర్గాలలో జరగనుంది. అనంతపురంలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగునుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు అనంతపురం ఆర్అండ్బీ అతిథి గృహంలో వైఎస్సార్సీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అంబేద్కర్ విగ్రహం నుంచి పాతవూరు గాంధీ విగ్రహం వరకు బస్సు యాత్ర సాగనుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు చెన్నకేశవస్వామి ఆలయం ఎదురుగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ మంత్రి పేర్ని నాని, జూపూడి ప్రభాకర్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు హాజరుకానున్నారు. అల్లూరి జిల్లా.. అల్లూరి జిల్లా అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గొన ఆధ్వర్యంలో హుకుంపేటలో బస్సుయాత్ర జరగనుంది. ఉదయం 11 గంటలకు బర్మన్ గూడలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం బర్మన్ గూడా నుంచి హుకుంపేట వరకు భారీ బైక్ ర్యాలీ సాగనుంది. అనంతరం హుకుంపేట కస్తూరిబా పాఠశాలలో నాడు- నేడు పనులను మంత్రులు పరిశీలించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హుకుంపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు రాజన్న దొర, మేరుగు నాగార్జున, ఇంచార్జ్ మంత్రి గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, సీదిరి అప్పలరాజు తదితరులు హాజరుకానున్నారు. ఇదీ చదవండి: అందుకేనట బాబు రహస్య మంతనాలు! -
చంద్రబాబుకు ఓపెన్ ఛాలెంజ్
-
కంకిపాడు జన కెరటం
కంకిపాడు: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార నినాదం గురువారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో మార్మోగింది. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా బహిరంగ సభకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలు పెద్ద ఎత్తున కదం తొక్కారు. సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్కు అక్కచెల్లెమ్మలు, యువత, అవ్వాతాతలు జేజేలు పలికారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి జగనన్నను సీఎంను చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. బాబు, పవన్ను తరిమికొట్టండి దొంగలకు, చంద్రబాబు, పవన్లకు తేడా లేదని మంత్రి జోగి రమేష్ చెప్పారు. వీరిద్దరూ పిక్పాకెటర్స్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి జేబు దొంగలను ప్రజలు మూకుమ్మడిగా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు సామాజిక న్యాయం చేశానని చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో అసమానతలు జగనన్న పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు తలెత్తుకు బతుకుతున్నాయని మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ మోపిదేవి వెంకటరమణ చెప్పారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో సామాజిక న్యాయం లేకపోగా, అన్నీ అసమానతలు, అవమానాలు, వెలివేతలే మిగిలాయన్నారు. టీడీపీలో ముస్లింలకు స్థానమేది? ముస్లిం వర్గాలకు టీడీపీలో స్థానం లేదని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ చెప్పారు. వారికి కనీస గుర్తింపు కూడా మృగ్యమేనన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క ముస్లింకు అయినా మంత్రి పదవి ఇచ్చారా.. అని ప్రశ్నించారు. సీఎం జగన్ ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనేక నామినేటెడ్ పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. పాలన అంతా చంద్రబాబు దోపిడీని సాగిస్తే.. జగనన్న సామాజిక న్యాయంతో అణగారిన వర్గాల ఉన్నతికి అహర్నిశలు పాటుపడుతున్నారని ప్రశంసించారు. విప్లవాత్మక సంస్కరణలతో అన్ని వర్గాల ప్రగతి.. సామాజిక న్యాయంతో అణగారిన వర్గాలకు జగన్ రాజ్యాధికారం చేరువ చేశారని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం పాటుపడిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అణగారిన వర్గాలకు ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా.. అని సవాల్ విసిరారు. సామాజిక న్యాయంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకి ఎక్కడిదని, సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలతో అన్ని వర్గాల ప్రగతికి కృషి చేస్తున్నారని కొనియాడారు. రోడ్లు, ప్రాజెక్టులు, విదేశీ పెట్టుబడులే కాదని, అణగారిన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కూడా ముఖ్యమే అని చాటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యేలు కొక్కిలిగడ్డ రక్షణనిధి, సామినేని ఉదయభాను, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, కేడీసీసీ చైర్పర్సన్ తాతినేని పద్మావతి, డీసీఎంఎస్ చైర్పర్సన్ పడమట స్నిగ్ధ, నియోజకవర్గ పరిశీలకులు బొప్పన భవకుమార్, మంగళగిరి పార్టీ ఇన్చార్జి గంజి చిరంజీవి, కమ్మ, కాపు కార్పొరేషన్ చైర్మన్లు తుమ్మల చంద్రశేఖర్, అడపా శేషు, తదితరులు పాల్గొన్నారు. -
రణన్నినాదం
సాక్షి, రాయచోటి: ఇన్నాళ్లూ సామాజిక సాధికారత అంటే ఒక నినాదంగానే వింటూ వచ్చామని, కానీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే దాన్ని ఒక విధానంలా అమలు చేశారని బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీ నేతలు కొనియాడారు. సామాజిక విప్లవమే జగనన్న విధానం అని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. రింగ్రోడ్డు సర్కిల్ నుంచి శివాలయం వరకు మెయిన్రోడ్డు మీదుగా వేలాది మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మైనార్టీలకు ఎంతో మేలు మైనార్టీలకు సీఎం జగన్ చేసిన మేలు అంతా ఇంతా కాదని డిప్యూటీ సీఎం అంజాద్బాషా, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియాఖాన్ చెప్పారు. ఆయన చేసిన మేలును ముస్లిం మైనార్టీ వర్గాలు ఎప్పటికీ మరిచిపోవన్నారు. దేశ చరిత్రలో ముస్లింలకు న్యాయం చేస్తున్న ఏకైక సీఎం జగనేనని వారు కొనియాడారు. పేదల బతుకుల్లో వెలుగులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల బతుకుల్లో జగనన్న వెలుగులు నింపారని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కోసం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి దొరకడం మన అదృష్టమన్నారు. జగనన్నలా ఏ ఒక్కరూ చేయలేదు..: రాజ్యాంగ పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్దేనని మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. ఎవరూ ఊహించని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో పెద్దపీట వేశారని కొనియాడారు. ఎంతోమందిని ఎమ్మెల్యేలుగా, మేయర్లుగా, మునిసిపల్ చైర్మన్లుగా చేశారన్నారు. డీబీటీ రూపంలో దాదాపు రూ.2.4 లక్షల కోట్లు వారి ఖాతాల్లో వేశారని చెప్పారు. సంక్షేమ సారథి.. జగనన్న రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందిస్తూ సీఎం జగన్ పేదల గుండెల్లో సంక్షేమ సారథిగా నిలిచిపోయారని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి చెప్పారు. అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. అన్నమయ్య జిల్లా అంటే రాయచోటి అని గుర్తు వచ్చేలా చేసిన ముఖ్యమంత్రి జగన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాయచోటి నియోజకవర్గానికే ఈ నాలుగున్నరేళ్లలో రూ.1,289 కోట్ల ప్రయోజనం కల్పించారని వెల్లడించారు. -
సామాజిక జైత్రయాత్ర.. దేశంలోనే ఆదర్శవంతమైన పాలన
సాక్షి, కృష్ణా జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చేకూరిన సంక్షేమాన్ని వివరిస్తూ వారిని చైతన్య పరిచే లక్ష్యంతో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర పెనమలూరు నియోజకవర్గంలో గురువారం సాగింది. కంకిపాడు ప్రధాన సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ప్రజలకు సంక్షేమ పాలనను ప్రజాప్రతినిధులు, నాయకులు వివరించారు. తాడిగడప వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మధ్యాహ్నం.. మంత్రులు, ఎమ్మెల్యేల మీడియా సమావేశం అనంతరం మోటర్ బైక్ ర్యాలీ కంకిపాడు వరకూ సాగింది. చంద్రబాబుకు ఇదే నా సవాల్: మంత్రి జోగి రమేష్ దేశంలో సామాజిక న్యాయాన్ని పాటించిన ఒకే ఒక్క సీఎం జగన్. 14 ఏళ్లలో సామాజిక న్యాయం చేశానని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా?. రాజ్యసభ స్థానాలను చంద్రబాబు వందల కోట్లకు అమ్ముకున్నాడు. నలుగురు బీసీలను సీఎం జగన్ రాజ్యసభకు పంపించారు. అచ్చెన్నాయుడు, చంద్రబాబుకు ఇదే నా సవాల్. మీ మేనిఫెస్టోతో రండి.. మా మేనిఫెస్టోతో వస్తాం. చర్చించే దమ్ముందా?. చంద్రబాబుకే గ్యారంటీ లేదు. ఇక మనకేం గ్యారంటీ ఇస్తాడు జగన్ పాలనలోనే సామాజిక న్యాయం: మంత్రి మేరుగ నాగార్జున సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది. దళితులను గుండెల్లో పెట్టుకున్న నాయకుడు సీఎం జగన్.చంద్రబాబు ఏరోజూ వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు.చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు.వెనుకబడిన వర్గాలను గత ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే చూసింది ప్రజలు గుర్తించాలి: ఎంపీ మోపిదేవి వెంకటరమణ అణగారిన వర్గాలను గతంలో ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. సంక్షేమాన్ని అందిస్తూ సీఎం జగన్ దేశంలోనే గొప్ప నాయకుడిగా నిలిచారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు మరోమారు పొత్తులతో చంద్రబాబు, పవన్ వస్తున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం ఎలాంటి సంక్షేమాన్ని అందించిందో ప్రజలు గుర్తించాలి. మళ్లీ ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్ని సీఎంగా చేసుకోవాలి. సీఎం జగన్ ఉంటేనే మన భవిష్యత్తు మారుతుంది. -
రాయచోటి: సామాజిక జైత్రయాత్ర.. ఇదీ సీఎం జగన్ పాలన ఘనత
సాక్షి, అన్నమయ్య జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర విజయవంతంగా సాగుతోంది. రాయచోటిలో గురువారం మధ్యాహ్నం సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ బస్సు యాత్రలో పలువురు మంత్రులతో పాటు ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు హాజరయ్యారు. మధ్యాహ్నం రింగ్రోడ్డు నుంచి బంగ్లా వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రజాప్రతినిధులు, నేతలు మాట్లాడారు. బీసీల పేరు చెప్పుకుని చంద్రబాబు మోసం: అంజాద్ బాషా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లతో గెలిచి అన్యాయం చేశారని మండిపడ్డారు. 14 ఏళ్లు పని చేసిన చంద్రబాబు టీడీపీ బీసీల పార్టీ అంటాడు.. బీసీల పేరు చెప్పుకుని మోసం చేశాడు. మన ఓట్లతో గెలిచి మనల్ని మోసం చేశారు. మోసం చేసిన చంద్రబాబు లాంటి వ్యక్తి కావాలా? సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ కావాలా? అని ప్రశ్నించారు. మైనార్టీని మంత్రి చేయని వ్యక్తి చంద్రబాబు. అదే సీఎం జగన్ నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేను చేసి డిప్యూటీ సీఎంను చేశాడు. రాయచోటికి చెందిన జకియా ఖానమ్ను శాసన మండలి డిప్యూటి ఛైర్మన్ను చేశారు. చరిత్ర రాయాలంటే వైఎస్ కుటుంబానికే సాధ్యమౌవుతుంది. అందరిని నా వాళ్లు అని పిలిచే ఏకైక వ్యక్తి వైఎస్ జగన్. రాయచోటి ఈ ఐదేళ్లలో ఎంతో అభివృద్ది చెందింది. రాయచోటి అభివృద్దిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కృషి ఎంతో ఉంది’’ అని అంజాద్ బాష ప్రశంసించారు. రానున్న ఎన్నికల్లో నక్కలు, కుక్కలు, పందులు ఏకమవుతున్నాయి. అయినా భయపడేది లేదు .. సింహం వైఎస్ జగన్ సింగిల్గా వస్తారు. 175 స్దానాల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుంది. 175 స్దానాల్లో టీడీపీకి అభ్యర్దులు లేరు. మేము ఏరిపారేస్తే వారికి టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారు’’ అని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. ఇదీ సీఎం జగన్ పాలన ఘనత: ఎంపీ సురేష్ వైఎస్సార్ ఫ్యామీలిని నమ్మి మోసపోయిన వారు ఎవరు లేరని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ తేడా చూసి వైఎస్సార్సీపీని గెలిపించండి. సీఎం వైఎస్ జగన్ కోసం పోరాడే సైనికుడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఇప్పుడు మన పిల్లలు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతున్నారంటే ఇది సీఎం జగన్ పాలన ఘనత. కార్యాలయాల చుట్టూ తిరగకుండా పథకాలు అందిస్తున్న వ్యక్తి జగన్’’ అని ఎంపీ సురేష్ పేర్కొన్నారు. -
నేడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో సామాజిక సాధికార యాత్ర
-
ఇవాళ కృష్ణా జిల్లా పెనమలూరులో సామజిక సాధికార యాత్ర
-
AP: బడుగుల ‘సాధికార’ ప్రదర్శన
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నలుమూలల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలన్నీ నార్తురాజుపాళేనికి కదలి వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన చేయూతతో తాము సాధించిన సాధికారతను ప్రదర్శించాయి. మంగళవారం వైఎస్సార్సీపీ రాజుపాళెంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేశాయి. వారికి రాజుపాళెంలో వీధివీధినా ఘనస్వాగతం లభించింది. జై జగన్ నినాదాలతో రాజుపాళెం హోరెత్తింది. యాత్ర అనంతరం జరిగిన బహిరంగ సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. పలువురు నేతలు రాష్ట్రానికి సీఎం వైఎస్ జగన్ చేస్తున్న మేలును, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అగ్రపథంలో నిలుపుతున్న తీరును వివరించారు. నేతలు సీఎం జగన్ పేరు పలికిన ప్రతిసారీ ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అగ్రస్థానంలో నిలిపిన సీఎం జగన్: డిప్యూటీ సీఎం రాజన్నదొర రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని అందిస్తున్నారని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర చెప్పారు. లంచాలు, రికమెండేషన్లు లేకుండా నేరుగా మన ఖాతాల్లోకి పథకాల డబ్బు జమ చేస్తున్నారని, ఇంతటి పారదర్శకమైన ప్రభుత్వం దేశంలో మరొకటి లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అగ్రస్థానంలో నిలుపుతూ ఆ వర్గాలు సాధికారత సాధించేందుకు దోహదపడిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో గిరిజనులకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదని, సీఎం జగన్ ఇద్దరికి మంత్రి పదవులే కాదు, ఉప ముఖ్యమంత్రి పదవీ ఇచ్చారన్నారు. సీఎం జగన్ 2 లక్షల మంది గిరిజనులకు 3 లక్షల ఎకరాలకుపైగా భూమి ఇచ్చారని వివరించారు. పోడు భూములకు రైతు భరోసా అమలు చేసి 3.45 లక్షల మంది రైతులకు అందిస్తున్నారన్నారు. జగనన్నతోనే సామాజిక విప్లవం: మంత్రి మేరుగు నాగార్జున సామాజిక విప్లవం దేశంలో ఒక్క సీఎం వైఎస్ జగన్తోనే సాధ్యమైందని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కుటుంబాలు బాగుండాలని, మిగిలిన వారితో సమానంగా బతకాలనే ఉద్దేశంతో సీఎం జగన్ అనేక పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. పేద పిల్లలు ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఇంగ్లిష్ మీడియం తెచ్చారన్నారు. పేదవాళ్ల పిల్లలు బాగు పడటం ఇష్టం లేని చంద్రబాబు కోర్టుకెళ్లాడన్నారు. రామోజీరావు మనవళ్లు, రాధాకృష్ణ చుట్టాలు ఇంగ్లీష్ మీడియం చదవొచ్చు కానీ, ఎస్సీ, ఎస్టీల పిల్లలు చదవొద్దన్నది వారి భావమన్నారు. సీఎం జగన్ 31 లక్షలమంది పేదలకు ఇంటి పట్టాలిచ్చి, ఇళ్లు కట్టిస్తున్నారని తెలిపారు. 4 లక్షల మందికి ఉద్యోగాలిచ్చారని, వారిలో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలేనని అన్నారు. జగనన్న పేదోడి కడుపు చూస్తారు: సినీ నటుడు అలీ సీఎం జగన్ ప్యాలెస్లో ఉన్నా పేదవాడి కడుపు చూస్తారని సినీ నటుడు అలీ చెప్పారు. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం అనేక పథకాలు తీసుకొచ్చారని అన్నారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో డబ్బున్న వ్యక్తి ఒక బెడ్డుపై పడుకుంటే పక్క బెడ్డుపై పడుకొని పేదవాడు కూడా ఆపరేషన్ చేయించుకుంటున్నాడని, ఇది సీఎం జగన్ వల్లే సాధ్యపడిందని చెప్పారు. 2024లో జగనన్న వన్స్మోర్ అంటూ మనమంతా వైఎస్సార్సీపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం పెంచారు: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను గుండెల్లో పెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ అని ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ అన్నారు. సీఎం జగన్ బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం పెంచారని తెలిపారు. జగన్ సీఎం అయ్యాక నేరుగా వలంటీర్లనే ఇంటికి పంపి మనకు కావల్సినవన్నీ అందిస్తున్నారని తెలిపారు. టీడీపీ వస్తే వలంటీర్లను పీకేస్తామని లోకేశ్, చంద్రబాబు చెబుతున్నారని, ఇలాంటి వారు మనకు అవసరంలేదని చెప్పారు. కోవూరు అభివృద్ధికి సీఎం జగన్ కృషి : ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కోవూరు నియోజకవర్గం అభివృద్ధికి సీఎం జగన్ ఎంతగానో కృషి చేశారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పారు. 1.28 లక్షల కుటుంబాలకు రూ.981 కోట్లు నేరుగా ఖాతాల్లో వేశారన్నారు. నాన్ డీబీటీ ద్వారా రూ.394 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఇంతటి సంక్షేమం ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రీ అందించలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక జైత్రయాత్ర: ఏపీలో అంబేద్కర్ మెచ్చిన పాలన
సాక్షి, నెల్లూరు జిల్లా: గడిచిన నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం జగన్.. బడుగు, బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసి భరోసా కల్పించారు. చేసిన మేలును వివరించేందుకు మంగళవారం కోవూరు నియోజకవర్గంలోని నార్తురాజుపాళెంలో సామాజిక సాధికార బస్సు యాత్రను నిర్వహించారు. సామాజిక సాధికార యాత్ర మధ్యాహ్నం టపాతోపు వద్ద నుంచి ప్రారంభమైంది. అక్కడ నుంచి రాజుపాళెం సెంటర్కు చేరుకుంది. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. రీజినల్ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, ఉపముఖ్యమంత్రి పీ రాజన్నదొర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, నెల్లూరు నగర ఎమ్మెల్యే పీ అనిల్కుమార్యాదవ్, ప్రముఖ సినీనటుడు అలీ, ఇతర నేతలు పాల్గొన్నారు. ఏపీలో అంబేద్కర్ మెచ్చిన పాలన: రాజన్న దొర ఏపీలో అంబేద్కర్ మెచ్చిన పాలన జరుగుతుందని డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. గత ప్రభుత్వంలో మాదిరి లంచాలు, అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గిరిజనులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. సామాజిక న్యాయం సీఎం జగన్ తోనే సాధ్యం. టీడీపీ హయాంలో గిరిజనులకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు.. వైసీపీ హయాంలో గిరిజనులకు సమ న్యాయం జరుగుతుంది. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో గిరిజనులకు 40 వేల ఎకరాలు ఇస్తే.. సీఎం జగన్ నాలుగన్నర ఏళ్లలో గిరిజనులకు ఇచ్చిన భూమి మూడు లక్షల ఎకరాలు. దళిత, గిరిజన పిల్లలు ఇంగ్లిష్ విద్యను అభ్యసించడం చంద్రబాబుకి ఇష్టం లేదు. టీడీపీ హయాంలో గిరిజనులకు జరిగిన అన్యాయంపై విజయవాడ, విజయనగరంలో ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం. మాఫీ పేరుతో అక్క చెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేసిన విషయాన్నీ ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. దగుల్బాజీ, దగాకోరు, మోసగాళ్లు అందరూ టీడీపీ, జనసేనలోనే ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో సామాజిక సాధికార యాత్ర నిలిచిపోతుంది: మంత్రి మేరుగ నాగార్జున ఎస్టీ,ఎస్టీ,బీసీల సామాజిక స్థితిగతులు పెరగాలని సీఎం జగన్ నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా అందరికి సంక్షేమ పథకాలు అందించడమే సీఎం జగన్కి తెలిసిన సామాజిక సాధికారత. దళితులపై దాడులు, దౌర్జన్యాలు టీడీపీ హయాంలో ఎక్కువగా జరిగిన విషయాలను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదు. చంద్రబాబుకి వయస్సు పైబడి.. మతిస్థిమితం కోల్పోయారు. భావితరాల భవిష్యత్తును ఇచ్చే ముఖ్యమంత్రి ఏపీకి దొరికారు. ఆయన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. రాజ్యాంగబద్ధంగా దళితులకీ వచ్చిన హక్కులను చంద్రబాబు కాలరాశారు టీడీపీ కళ్లకు కనిపించడం లేదా?: ఎమ్మెల్సీ పోతుల సునీత లక్షల ఉద్యోగాలు సీఎం జగన్ ఇస్తే.. ఉద్యోగాలు ఇవ్వలేదని యువగళం సభలో లోకేష్ మాట్లాడటం సిగ్గు చేటు. అభివృద్ధి జరగలేదని ఎల్లో మీడియతో ప్రచారం చేయిస్తున్నారు. పరిశ్రమల స్థాపన.. ఫిషింగ్ హార్భర్లు ఏర్పాటు.. టీడీపీకి కళ్లకి కనిపించడం లేదు. 2019లో వచ్చిన ఫలితాలే.. 2024లో కూడా రిపీట్ అవుతాయి. పవన్, చంద్రబాబు, లోకేష్లు టూరిస్ట్ రాజకీయాలు చేసే నాయకులు సీఎం జగన్ ఆలోచన గొప్పది: అలీ పేదల కష్టాలను సీఎం జగన్ దగ్గర నుంచి చూశారు. వారి కడుపు నింపేందుకు సంక్షేమ పథకాలకు రూప కల్పన చేశారు. తండ్రి వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ వంటి పథకాలను సీఎం జగన్ కొనసాగిస్తున్నారు. ప్రతి నిరుపేదకి సొంత ఇళ్లు ఉండాలనే సీఎం జగన్ చేసిన ఆలోచన గొప్పది. అదే జరిగితే సంక్షేమ పథకాలు అందవు: మాజీ మంత్రి అనిల్ ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని పథకాలు అందిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్. వలంటీర్లను తీసేస్తామని టీడీపీ చెబుతుంది. అదే జరిగితే సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందవు. జగన్ గురించి ఎవరెన్ని చెప్పినా నమ్మొద్దు.. గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే వ్యక్తి జగన్. పవన్, చంద్రబాబు కట్ట కట్టుకుని వచ్చినా సీఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరు. -
మండపేటలో మార్మోగిన సాధికార నినాదం
సాక్షి, అమలాపురం: మండపేట నియోజకవర్గంలో సామాజిక సాధికార నినాదం మార్మోగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో బడుగు, బలహీన వర్గాలు సాధించిన సాధికారతను శుక్రవారం నియోజకవర్గంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రతిబింబించింది. మండపేటతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా ఈ యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దీంతో మండపేట వీధులన్నీ జనసంద్రాలే అయ్యాయి. రెండు వేల ద్విచక్ర వాహనాలతో యువత ర్యాలీ చేశారు. తాపేశ్వరంలో ప్రారంభమైన యాత్ర మండపేటలోని కలువపువ్వు సెంటర్లోని సభా ప్రాంగణం వరకు దిగ్విజయంగా సాగింది. యాత్ర పొడవునా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వారికి సీఎం జగన్ చేసిన మేలును వివరిస్తూ సాగారు. ప్రజలు వారికి పూలు, హారతులతో స్వాగతం పలికారు. వేలాదిగా ప్రజలు పాల్గొన్న సభలో నేతలు సీఎం జగన్ అందిస్తున్న పథకాలు, ప్రజలకు చేస్తున్న మేలును వివరించారు. సీఎం జగన్ పేరు వచ్చిన ప్రతిసారీ సభలోని ప్రజలు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. సామాజిక న్యాయం సీఎం జగన్తోనే సాధ్యమైంది: మంత్రి జోగి రమేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోనే రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధ్యమైందని మంత్రి జోగి రమేష్ అన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రీ ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ చేసినంత మేలు చేయలేదని తెలిపారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తలెత్తుకొని తిరగగలుగుతున్నారంటే, అది సీఎం జగన్ అందించిన చేయూత ఫలితమేనని చెప్పారు. వెనుకబడిన వర్గాలకు నిజమైన రాజ్యాధికారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే అందించారు. 25 మంది మంత్రులు ఉంటే వారిలో 15 మంది బీసీలేనని, 9 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీలకే ఇచ్చారని వివరించారు. చరిత్ర సృష్టించిన జగన్: ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్రంలో 30.65 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి చరిత్ర సృష్టించారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో యూపీలో పేదలకు, బడుగు, బలహీన, దళిత వర్గాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ ప్రారంభించారని, ఇప్పటివరకు ఇచ్చింది 20 లక్షల మందికి మాత్రమేనని తెలిపారు. అణగారిన వర్గాలకు గౌరవం అనేది విద్యతో వస్తుందని గుర్తించిన సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారని అన్నారు. పేదలకు అత్యంత ఆధునిక వైద్యాన్ని అందిస్తున్నారన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని మనందరం మరోసారి సీఎంను చేసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పేదల ఆత్మబంధువు సీఎం జగన్: జూపూడి ప్రభాకరరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల ఆత్మబంధువు అని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు చెప్పారు. పేదలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటూ, బడుగుల కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకొనేలా పథకాలను అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అంటే భూస్వామి కాదు.. పెట్టుబడిదారు కాదు.. ప్రభుత్వం అంటే ప్రజలదే అని నిరూపించిన ఏకైక నాయకుడు సీఎం జగన్ అని అన్నారు. రాష్ట్రంలో 72 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, 52 శాతం మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదవులు ఇచ్చారని తెలిపారు. ఓటు వేయనివారికి సైతం పథకాలు అందించిన ఘనత జగన్కు దక్కుతోందన్నారు. మహిళా సాధికారిత జగన్తోనే: ఎంపీ చింతా అనూరాధ సీఎం వైఎస్ జగన్తోనే రాష్ట్రంలో మహిళా సాధికారత సాధ్యమైందని ఎంపీ చింతా అనూరాధ చెప్పారు. చట్ట సభలలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్రం తెచ్చిందని, సీఎం జగన్ స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతానికి మించి మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అధికంగా లబ్ధిపొందారని తెలిపారు. -
చేనేత పురిలో చైతన్య భేరి
కర్నూలు (రాజ్విహార్): చేనేత వస్త్రాలకు మారుపేరైన ఎమ్మిగనూరులో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న వైనాన్ని వివరిస్తూ వైఎస్సార్సీపీ శుక్రవారం పట్టణంలో ఘనంగా సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించింది. నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ఈ యాత్రలో పాల్గొని, సాధికారతను ప్రదర్శించారు. మండల పరిషత్ కార్యాలయంనుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్సు యాత్ర సాగిన పురవీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. అనంతరం బస్టాండు వద్ద వేలాది ప్రజలతో భారీ బహిరంగ సభ జరిగింది. యాత్ర మొదలుకొని సభ ముగిసేవరకు పట్టణం జై జగన్ నినాదాలతో మార్మోగింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సీఎం వైఎస్ జగన్ సాధికారత దిశగా నడిపించిన తీరును నేతలు వివరిస్తున్నప్పుడు సభా ప్రాంగణం నినాదాలు, ఈలలు, కేరింతలతో హోరెత్తింది. మళ్లీ జగనే కావాలి అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇది జగనన్న పెంచిన ఆత్మగౌరవం : మంత్రి మేరుగు నాగార్జున ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు తలెత్తుకొని తిరుగుతున్నారంటే అది సీఎం వైఎస్ జగన్ పెంచిన ఆత్మగౌరవమే కారణమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. ఎందరో మహానుభావులు కలలుగన్న సామాజిక న్యాయం, సామాజిక సాధికారతను సీఎం జగన్ నిజం చేసి చూపించారని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా దళితులు, బలహీనవర్గాలను ఎన్ని అవమానాలకు గురిచేశారో ఎవరూ మరువలేరని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ వర్గాలనే అణిచివేశారని వివరించారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకొని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధిలోకి తెచ్చారని చెప్పారు. సీఎం జగన్ వల్లే నేడు మన బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ చదువులు చదువుతున్నారని తెలిపారు. చంద్రబాబు మాటలు నమ్మవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కుల మతాలు చూడని నాయకుడు : ఎంపీ గురుమూర్తి పేదలకు మేలు చయడంలో సీఎం జగన్ను మించిన నేత లేరని ఎంపీ గురుమూర్తి చెప్పారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ అని తెలిపారు. నాలుగున్నరేళ్లలో రూ. 2.50 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేశారన్నారు. అవినీతి రహిత పాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని, పథకాలను ఇంటివద్దకే అందిస్తున్నారని వివరించారు. ఒకప్పుడు నాయకులు చుట్టూ మనం తిరిగే వాళ్లమని, కానీ ప్రభుత్వ సిబ్బంది మన సేవ కోసం ఇంటి వద్దకే వస్తున్నారని తెలిపారు. అట్టడుగు వర్గాలకు మేలు: ఎంపీ గోరంట్ల మాధవ్ రాష్ట్రంలో సీఎం జగన్ నేతృత్వంలో అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతోందని, వారంతా అభివృద్ధి చెందుతున్నారని ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. చంద్రబాబు బడుగు బలహీన వర్గాలను పావులా వాడుకుని, అధికారంలోకి వచ్చాక అణచివేశారని తెలిపారు. చంద్రబాబుకు ఈ సారి డిపాజిట్లు కూడా రావన్నారు. కనీసం బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పవన్ రాష్ట్రంలో ఏం చేయగలరని ప్రశ్నించారు. బడుగులకు గుర్తింపు తెచ్చిన సీఎం జగన్: ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో బడుగులకు గుర్తింపు తెచ్చారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి నుంచి కేబినెట్, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేసి, ఆ వర్గాలను తలెత్తుకునేలా చేశారని అన్నారు. చంద్రబాబు పాలనలో ఈ వర్గాలన్నీ అవహేళనకు, అణచివేతకు గురయ్యాయని చెప్పారు. టీడీపీ చేస్తున్న సామాజిక కుట్రకు ఓటుతో సమాధానమివ్వాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పేదల పక్షాన ఉన్న సీఎం జగన్ను గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య తదితరులు ప్రసంగించారు. -
మండపేటలో ‘సామాజిక’ హోరు
మండపేట: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. ఈరోజు(శుక్రవారం) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సుయాత్ర బహిరంగ సభకు జనసంద్రం పోటెత్తింది. మండపేట కలువ పువ్వు సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభకు అశేష జనవాహిని హాజరై సామాజిక సాధికార యాత్రకు సంఘీభావం తెలిపింది. మండపేటలో ఎమ్మెల్సీ తీట త్రిమూర్తులు ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. ‘2019లో మండపేట నియోజకవర్గం ప్రజలు చేసిన తప్పు మళ్ళీ చేయరు. జగనన్న పాలను చూసి 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలో వైఎస్సార్సీపీని గెలిపించారు. చంద్రబాబు ఇచ్చే భరోసా ఆయన తనయుడికి మాత్రమే.. ప్రజలకు కాదు. మరోసారి చంద్రబాబు ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం జగన్ చేసింది పాదయాత్ర.. లోకేష్ చేసింది జాగింగ్ మాత్రమే. రాష్ట్రంలో మరోసారి వైఎస్ జగన్ పాలన రావాలి’ అని పేర్కొన్నారు. ఎంపీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ఏడాదికి 16 వేల కోట్ల లోటు ఆదాయం ఉన్న రాష్ట్రం మనది. ముఖ్యమంత్రి మారే సమయంలో తక్షణం తీర్చాల్సిన అప్పులు నాలుగు ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటాయి. మన రాష్ట్రంలో టిడిపి తక్షణం తీర్చాల్సిన 80 వేల కోట్ల రూపాయలు అప్పు మిగిల్చింది.కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రజలను ఆదుకున్నది సీఎం జగన్ కాదా?, రాష్ట్రంలో నూటికి 78 మంది పేదవాళ్లే ....వాళ్లని ఆదుకునే ప్రయత్నమే సీఎం జగన్ చేస్తున్నారు. సరైన న్యాయం మీరే చెప్పండి.ఒకే కులం అనేక సంవత్సరాలు పాటు మండపేటను పాలిస్తోంది. గతంలో ఒకసారి మార్చమని అడిగాం... ప్రజలు మార్చారు.22 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లో ఇప్పటివరకు 20 లక్షల మందికి ఇళ్ళ పటాలిస్తే... ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్లో నాలుగేళ్లలో 31 లక్షల ఇళ్ల పట్టాల సీఎం జగన్ ఇవ్వటం దేశ చరిత్రలోనే ఒక రికార్డు. ఇచ్చిన ప్రతి హామీ నూటికి నూరు శాతం అమలు చేసిన పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వారిని జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా అనేక రాజ్యాంగబద్ధ పదవుల్లో నిలిపిన ఘనత వైఎస్ఆర్ సీపీదే’ అని స్పష్టం చేశారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ‘ఇది పేదలకు పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధం.జగనన్న కటౌట్ చూసే జనం వస్తున్నారు. చంద్రబాబుకు లోకేష్కి కూడా పనిలేదు.చంద్రబాబు , లోకేష్, పవన్ కళ్యాణ్ ,రాధాకృష్ణ, హైదరాబాదులో ఉండి ఆంధ్రాలో విషం చిమ్ముతారు.అధికారంలోకి వస్తే చంద్రబాబు మొత్తం ప్రభుత్వ పథకాలను తీసేస్తారంట.బాబుకి గ్యారెంటీ ఉందా?, లోకేష్ పాదయాత్ర చేశాడా.... ఎవరైనా చూశారా...?, పాదయాత్ర అంటే వైఎస్ఆర్ చేయాలి... లేదంటే వైఎస్ జగన్ చేయాలి. యువగళం సభలో చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థిని లోకేష్ చెప్పినా.... పవన్ కళ్యాణ్ సిగ్గులేకుండా స్టేజ్పైన కూర్చున్నాడు.నేను వంగవీటి మోహనరంగా అభిమానిని.టిడిపికి ఓటు వేస్తే వంగవీటికి ద్రోహం చేసినట్టే.25 మంది మంత్రులుంటే 17మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రులు ఉన్నారు ఇదీ సామాజిక సాధికారత. సామాజిక సాధికారత పాటించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. మండపేటలో జరిగే యుద్ధం పేదలకు పెత్తందార్లకు మధ్య జరిగుతుంది.చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి అక్కచెల్లెలను మోసం చేశారు.. రైతులు మోసం చేశారు’ అని ప్రజలకు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ..‘ప్రభుత్వం అంటే భూస్వామి కాదు... పెట్టుబడిదారుడు కాదు... ప్రభుత్వం అంటే ప్రజలదే... అని నిరూపించిన ఏకైక నాయకుడు సీఎం జగన్. రాష్ట్రంలో 72% బీసీలకు, 52 శాతం మహిళలకు సీఎం జగన్ పదవులు ఇచ్చారు. ప్రతిపక్ష నేతలు నేలను గెలవగలరేమో తప్ప ప్రజలను జయించలేరు.పేదపిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందించడానికి ప్రయత్నించిన సీఎం జగన్ను ఆపేందుకు ప్రతిపక్షాలు ఎంతో ప్రయత్నించాయి.నేర్పితే తెలుగు చచ్చిపోతుందని రామోజీరావు అన్నాడు. సీఎం జగన్ ధైర్యం, సాహసం ముందు ప్రతిపక్షాలు నిలబడలేవు. తన రాజకీయ చరిత్రలో చంద్రబాబు తన కులాన్ని మాత్రమే ప్రోత్సహించాడు.ఆయన ప్రోత్సహించిన ఈనాడు ఎన్టీఆర్ను ఎత్తేసి మళ్లీ నేలపై పడేసింది. పేదవాడికి జగన్ అన్నం పెట్టారు... అక్కచెల్లెమ్మలను ఆదుకున్నారు. దేశంలో ఈ స్థాయిలో పేదలను ఆదుకుంటున్న ప్రభుత్వం మరొకటి లేదు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అప్పు 176 లక్షల కోట్లు. దమ్మున్న జగనన్నను చూసి పర్వతంలాంటి కాంగ్రెస్ పార్టీ కూడా గజగజ వణికింది.పవన్ కళ్యాణ్.... ఈ రాష్ట్రం ప్రయోగశాల కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న కోటి మంది దళితులు వారి వెనకాల వచ్చే బిసిలు మళ్ళీ జగనన్ననే నాయకుడిగా ఎన్నుకుంటారు’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ.. ‘రానున్న కాలంలో కాపు, బీసీ సామాజిక వర్గాలు కలిసి జగనన్న విజయానికి తోడ్పడాలి. 70 ఏళ్లుగా పార్లమెంటు ఆమోదించని మహిళా బిల్లును తనకున్న ఎంపీలతో ఒంటి చేత్తో గెలిపించిన వ్యక్తి సీఎం జగన్.రాష్ట్రంలో ఓ బీసీ రిజర్వేషన్ ఉండాలని కోరుకున్న వ్యక్తి సీఎం జగన్.ప్రజలతో మమేకమైన తోట త్రిమూర్తులను మండపేటలో కచ్చితంగా గెలిపించాలి’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ.. ‘ ప్రజలందరూ సామాజికంగా ఆర్థికంగా బలపడాలన్నదే సీఎం జగన్ ఆలోచన. పార్లమెంట్లో మహిళల కోసం 33 శాతం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారు కానీ సీఎం జగన్ 50 శాతం పదవులు మహిళలకు ఇచ్చారు’ అని పేర్కొన్నారు. -
నేడు ఎమ్మిగనూరు, మండపేటలో సామాజిక సాధికార యాత్ర
సాక్షి, తాడేపల్లి: ఏపీ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని ఆత్మీయంగా పలకరించేందుకు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు చేపట్టిన యాత్ర నేడు ఎమ్మిగనూరు, మండపేటలో సాగనుంది. కర్నూలు జిల్లా: ఎమ్మినూరులో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగనుంది. మండల పరిషత్ కార్యాలయంలో 3.30 గంటలకు ముఖ్య నేతలతో ముఖాముఖి అనంతరం.. 4.30కుఎద్దుల మార్కెట్ నుండి సోమప్ప సర్కిల్ మీదుగా వైఎస్సార్ సర్కిల్కు వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు బస్టాండ్ ఎదుట బహిరంగ సభ జరగనుంది. మంత్రులు అంజాద్ భాష, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, మా జీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ , ఎంపీ. సంజీవ్ కుమార్, తదితరులు హాజరుకానున్నారు. కోనసీమ జిల్లా మండపేటలో ఎమ్మెల్సీ తీట త్రిమూర్తులు ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు తాపేశ్వరంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం మండపేటలోని పూలే విగ్రహం నుంచి కలువ పువ్వు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కలువు పువ్వు సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రి జోగి రమేష్, ఎంపీలు పిల్లి సుభాస్ చంద్రబోస్, మార్గాని భరత్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ, తదితరులు హాజరుకానున్నారు. ఇదీ చదవండి: ఏపీ ఎన్నికలకు కసరత్తు.. నేడు, రేపు ఈసీ సమీక్ష -
సీఎం జగన్ గురించి అనిల్ కుమార్ యాదవ్ గూస్ బంప్స్ స్పీచ్
-
కర్నూలులో ప్రతిధ్వనించిన సాధికార నినాదం
కర్నూలు (రాజ్విహార్): రాష్ట్ర తొలి రాజధాని కర్నూలు సామాజిక సాధికార నినాదంతో పులకించింది. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ఆదివారం ఘనంగా జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వేలాది ప్రజలు వెంట నడుస్తుండగా, యువత బైక్ ర్యాలీతో పాతబస్తీలో సాధికార వైభవాన్ని చాటింది. కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు ర్యాలీగా వన్టౌన్ పోలీసు స్టేషన్ వద్ద ఉన్న సభా స్థలికి చేరుకున్నారు. దారి పొడవునా కేరింతలు, జై జగన్ నినాదాల హోరుతో యాత్ర సాగింది. ‘మళ్లీ జగనే కావాలి’ అంటూ అశేష జనవాహిని చేస్తున్న నినాదాల మధ్య సభ విజయవంతంగా జరిగింది. సీఎం వైఎస్ జగన్ అణగారిన, బడుగు, బలహీన వర్గాలకు చేసిన మేలును నేతలు చెబుతుంటే ప్రజలు నిజమే అంటూ సమాధానం ఇచ్చారు. సామాజిక న్యాయం నెలకొల్పిన ఏకైక సీఎం జగన్ : మంత్రి ఆదిమూలపు నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలతో అణగారిన వర్గాల బతుకుల్లో ఎంతో మార్పు వచ్చిందని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. మన బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఐక్య రాజ్య సమితిలో ఇంగ్లిష్లో మాట్లాడుతున్నారన్నారు. పెత్తందారులకే పరిమితమైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతోందన్నారు. మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇలా ఎన్నో పదవులను అణగారిన వర్గాలు పొందుతున్నారని తెలిపారు. ఇలా అన్ని రంగాల్లో సామాజిక న్యాయం నెలకొల్పిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. టీడీపీ, జనసేన పార్టీల నేతలు తోడేళ్లు, దొంగల ముఠాల్లా వస్తున్నారని, వారి వలలో పడవద్దని ప్రజలను కోరారు. బడుగుల అభివృద్ధి జగన్తోనే సాధ్యం: కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి ఒక్క సీఎం వైఎస్ జగన్తోనే సాధ్యమైందని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. సీఎం జగన్ ఈ నాలుగున్నరేళ్లలో రూ. 2.50 లక్షల కోట్లు ప్రజల కోసం ఖర్చు చేశారని, ఇందులో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికే వెచ్చించారని తెలిపారు. ఇది 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు. ఆ డబ్బు ఎక్కడికి మళ్లించారో చంద్రబాబు సమాధానం ఇవ్వాలన్నారు. ముగ్గురు భార్యలకు గ్యారంటీ ఇవ్వని పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అండగా నిలుస్తారా అని వ్యాఖ్యానించారు. ఒక్క ఓటు వేస్తేనే రెండున్నర లక్షలు ఖర్చుచేసిన సీఎం జగన్ మరోసారి ఓటు వేస్తే ఎంత మేలు చేస్తారో అలోచించాలని ప్రజలను కోరారు. దేశంలో ఇంత మేలు ఎన్నడూ జరగలేదు : మాజీ మంత్రి అనిల్కుమార్ దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అట్టడుగు వర్గాలకు సీఎం జగన్ చేసినంత మేలు ఎన్నడూ జరగలేదని మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ చెప్పారు. ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, ప్రతి మైనార్టీకీ సీఎం జగన్ సంక్షేమాన్ని అందించారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అనేక హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబు ఎప్పటికీ మేలు చేయరని చెప్పారు. సామాజిక కుట్రకు టీడీపీ శ్రీకారం: ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ అండగా ఉన్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ అన్నారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులిచ్చి సమాజంలో గుర్తింపు తెచ్చారన్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు అన్నింటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేశారని తెలిపారు. బలహీనులు ఎదగకూడదన్న దురుద్దేశంతో టీడీపీ సామాజిక కుట్రకు తెర లేపిందని, అందరూ దానిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కర్నూలుకు రూ.2 వేల కోట్లు ఇచ్చిన సీఎం జగన్: ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ సీఎం జగన్కు కర్నూలుపై ప్రత్యేక అభిమానం ఉందని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ చెప్పారు. నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధికి ఈ నాలుగున్నరేళ్లలో రూ.2 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం జగన్ మరోసారి అధికారంలోకి రావాలని, అందుకు అందరం ఆయనకు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, వక్ఫ్బోర్డు చైర్మన్ అబ్దుల్ ఖాదర్ పాల్గొన్నారు. -
నందిగామలో సామాజిక సాధికార బస్సు యాత్ర
-
కర్నూలులో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర
-
సాధికారతకు జయహో
-
నేడు 32వ రోజు సామాజిక సాధికార బస్సు యాత్ర
-
సామాజిక జైత్రయాత్ర: వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించిన మంత్రులు
-
నేడు చిత్తూరు జిల్లా పలమనేరులో సాధికార బస్సు యాత్ర
-
మనం కలిసికట్టుగా మళ్ళీ సీఎం జగన్నే గెలిపించుకుందాం
-
అన్ని కులాల వారిని గౌరవించే గొప్ప నాయకుడు సీఎం జగన్
-
‘ఏపీ ప్రజల ఆకాంక్షలు సీఎం జగన్ నెరవేర్చారు’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: సీఎం జగన్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నిలిపిన వైనాన్ని వివరిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సాగింది. పాతపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో వైస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, వి.కళావతి, గొర్లె కిరణ్, కంబాల జోగులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ, చంద్రబాబుకు అధికారం ఇస్తే దుర్వినియోగం చేశారని, దోచుకున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ప్రజల ఆకాంక్షలు తీర్చారు. వంశధార నిర్వాసితులకు 216 కోట్లు అదనపు పరిహారం ఇచ్చారు. హిర మండలం వద్ద 176 కోట్ల తో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాం. పాడు పడిన పాఠశాలలు బాగు చేసి మంచి బడులు గా తీర్చి దిద్దారు. కొత్తూరు లో 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాం. గత ప్రభుత్వం కిడ్నీ రోగులకు నెఫ్రాలజిస్టులను కనీసం నియమించ లేకపోయింది. జగనన్న ఏకంగా కిడ్నీ రీసెర్చ్ స్టేషన్ నిర్మించారు’’ అని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా చూడండి.. జన్మభూమి కమిటీల ద్వారా గత ప్రభుత్వం ప్రజల సొమ్ము దోపిడీ చేసిది. అవినీతి లేకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2లక్షల 45 వేల కోట్ల రూపాయిలు ప్రజల ఖాతా ల్లో జమ చేసింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడండి. సంక్షేమ పథకాలు గౌరవంగా ఇస్తున్న విషయం గమనించండి. చంద్ర బాబు అభివృద్ధి లేదంటున్నాడు. ప్రతి గ్రామంలో సచివాలయం, ఆరోగ్య కేంద్రం నిర్మించడం అభివృద్ధి కాదా?. ప్రజల అవసరాలు వైద్యం, విద్య, ఉపాధి కల్పించకుండా రోడ్డులు వేస్తే అభివృద్ధి జరిగినట్టా?. సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు అని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు ఎన్నికల ముందు అవే ఇస్తానంటున్నాడు. మూడు సార్లు చంద్రబాబుకి అధికారం ఇచ్చారు. ఏమి చేశారు?. వైస్సార్సీపీ ప్రభుత్వం పాలనలో సంస్కరణలు తెచ్చింది. సచివాలయాలు ఏర్పాటు చేసింది. అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తే పేదలు కోటీశ్వర్లు అయ్యారు. పేదల జీవన ప్రమాణాలు పెంచే పనులు చేసింది ఈ ప్రభుత్వం -మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రజల సొమ్మును చంద్రబాబు దోచుకున్నారు.. సీఎం జగన్ నాలుగున్నరేళ్లు పాలనలో ఎంతో మార్పు తెచ్చారు. సచివాలయాల ద్వారా అవినీతి లేకుండా పథకాలు ఇస్తున్నాం. ప్రతి గ్రామంలో ఏమి చేశామో సచివాలయం వద్ద దాపరికం లేకుండా ధైర్యంగా బోర్డు పెట్టాం. ఈ బోర్డుల్లో ఎక్కడైనా అబద్ధం ఉంటే నిలదీయండి. ప్రజలకు డబ్బులు పంపిణీ చేయడం తప్పు అని చంద్రబాబు అంటున్నాడు. అప్పట్లో చంద్రబాబు అలీబాబా 40 దొంగల్లా దోచుకొని ప్రజల సొమ్ము తిన్నారు. పేద పిల్లాడికి మంచి యూనిఫార్మ్, స్కూల్ బ్యాగ్, బూట్లు కొని ఇస్తే తప్పా. తమ బిడ్డ నీట్గా తయారై స్కూల్కి వెళ్తుంటే తల్లి కళ్లల్లో సంతోషం చూడటం అభివృద్ధి కాదా? -స్పీకర్ తమ్మినేని సీతారాం -
నేడు శ్రీకాకుళం జిల్లాలో సామాజిక సాధికార యాత్ర
-
ఏపీలో దిగ్విజయంగా కొనసాగుతున్న సామాజిక సాధికార యాత్ర
-
సీఎం జగన్ గురించి బుట్టా రేణుక అదిరిపోయే స్పీచ్
-
మళ్లీ జగనే కావాలి... మళ్లీ జగనే రావాలని