allam narayana
-
ఫొటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: హరీశ్రావు
గన్ఫౌండ్రీ (హైదరాబాద్): ఫొటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. గతంలో పత్రికా ఫొటోగ్రాఫర్లకు ఫొటో జర్నలిస్టుగా అక్రిడిటేషన్ ఉండేదని, కానీ నేడు ఫొటోగ్రాఫర్గా మార్పు చేయడం వలన ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ సమస్య త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో.. అవార్డులు అందుకున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లు శివప్రసాద్, యాకయ్య, వేణుగోపాల్, సతీశ్, శివకుమార్, భాస్కరాచారి, రాజే శ్రెడ్డి, ఠాకూర్ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫొటోజర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్లో గెలుపొందిన ఫొటోగ్రాఫర్లకు ఆదివారం రవీంద్రభారతిలో బహుమతులు ప్రదానం చేశారు. హరీశ్ మాట్లాడుతూ దినపత్రికల్లో వార్త పూర్తిగా చదవకపోయినప్పటికీ ఫొటోను చూసి సారాంశం గ్రహించవచ్చని చెప్పారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం రూ.100 కోట్లు జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం కేటాయించిందని, త్వరలో జర్నలిస్టు భవనం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
వయోధిక పాత్రికేయులకు అత్యవసర నిధి ఏర్పాటు
పంజగుట్ట: వయోధిక పాత్రికేయుల అత్యవసర నిధి ఏర్పాటుకు తన వంతుగా రూ. లక్ష ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో వయోధిక పాత్రికేయ ప్యాకెట్ డైరీ ఆవిష్కరణ, ఇటీవల మృతి చెందిన సీనియర్ పాత్రికేయులు వి.పాండురంగారావు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్బంగా సీనియర్ పాత్రికేయులు మధు వాకాటి వయోధిక పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లం నారాయణ మాట్లాడుతూ పాత్రికేయులు వయస్సు పెరుగుతున్నా రచనలు మానకూడదన్నారు. ఏ.బీ.కే లాంటి వారు ఇంకా రాస్తున్నారని ఇప్పటికీ వారి అక్షరాల్లో పదును తగ్గలేదని, ఆయన భావాలు మారలేదన్నారు. పాత్రికేయరంగంలో ఉన్న వారిలో కొందరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అత్యవసర పరిస్థితుల్లో వారిని ఆదుకునేందుకు వయోధిక అత్యవసర నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆ నిధికి మొదటగా తానే రూ. లక్ష ఇస్తున్నట్లు తెలిపారు. అక్రిడిటేషన్ సమస్య కూడా తమ దృష్టికి తెచ్చారని 60 సంవత్సరాలు దాటిన పాత్రికేయునికి ఎలాంటి పత్రాలు లేకున్నా, గతంలో పనిచేసిన ఆనవాళ్లు ఉంటే తప్పకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఎవరికైనా లేకపోతే తనను సంప్రదిస్తే వెంటనే వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టు హెల్త్ స్కీం ఎంతో అద్భుతమైనదని గతంలో అపోలో, యశోదా ఆసుపత్రుల్లోనూ కొనసాగేదని, కాని ప్రస్తుతం కేవలం నిమ్స్లో మాత్రమే నడుస్తుందన్నారు. వయోధిక పాత్రికేయులకు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే, అత్యవసర పరిస్థితుల్లో కార్పోరేట్ ఆసుపత్రికి వెళితే తాను మాట్లాడి హెల్త్కార్డుల ద్వారా చికిత్స అందేలా చూస్తానన్నారు. నిమ్స్లోనూ వయోధిక పాత్రికేయులకు వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని నిమ్స్ డైరెక్టర్కు చెబుతానన్నారు. మీడియా అకాడమీలో యూనియన్ కార్యాలయాలకు గదులు ఇవ్వరని కానీ వయోధిక పాత్రికేయుల కార్యాలయం ఏర్పాటుకు గదిని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు దాసు కేషవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వయోధిక పాత్రికేయ ప్యాకెట్ డైరీ రూపకర్త ఎన్.శ్రీనివాస్ రెడ్డి, సంఘం ఉపాధ్యక్షులు టి.ఉడయవరులు, సెక్రటరీ లక్ష్మణ్రావు, జాయింట్ సెక్రటరీ రాజేశ్వరరావు, రామమూర్తి, సభ్యులు ఎ.జీ.ప్రసాద్, జి.భగీరధ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
దళితుల ప్రాతినిధ్యంతోనే మీడియాలో సామాజిక మార్పు
సనత్నగర్ (హైదరాబాద్): మీడియా సంస్థల్లో దళితుల ప్రాతినిధ్యంతోనే సామాజిక మార్పు సాధ్యపడుతుందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో 1920, జనవరి 31న మూక్నాయక్ పత్రిక స్థాపించిన సందర్భంగా మంగళవారం బేగంపేటలోని హరితాప్లాజాలో మొదటి ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ డేగా నిర్వహించారు. ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ నెట్వర్క్ (ఐడీజేఎన్) కన్వీనర్ మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అల్లం నారాయణతో పాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ కృష్ణ, ఇఫ్లూ ప్రొఫెసర్ సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ, మీడియా సంస్థల్లో దళితుల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే ఉందని, పత్రికారంగంలో దళిత జర్నలిస్టులు అత్యంత వివక్షను ఎదుర్కొన్న సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ అణగారిన వర్గాల్లో సమానత్వం సాధించేందుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాత్రికేయుడిగానూ కొనసాగారన్నారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల సంఖ్య చెప్పుకోదగ్గవిధంగా లేదని, ఆ వర్గాల సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి మాట్లాడుతూ తాను టీవీ చానల్ ప్రారంభించినప్పుడు ముఖ్యమైన కేంద్రాల్లో దళితులను, ఆదివాసీ ప్రాంతాల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన వారినే 14 మందిని నియమించినట్లు వివరించారు. బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ గతంలో దళిత జర్నలిస్టులపై వివక్షత ఉండేదని, తెలంగాణ ఏర్పాటు అనంతరం ఆ పరిస్థితి మారిందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టు విశేషాల గురించి వీడియో చిత్రీకరణ ద్వారా ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు. -
మీడియా స్వేచ్ఛ హరించుకుపోతోంది
పటాన్చెరు టౌన్: దేశంలో మీడియా స్వేచ్ఛ రోజురోజుకూ హరించుకుపోతోందని.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా గొంతులు తప్ప మిగిలిన గొంతులు మూగబోయిన పరిస్థితి ఉందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులో మంగళవారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వితీయ మహాసభల ముగింపు సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఏది మాట్లాడినా అణచివేసే ధోరణి వచ్చిందని.. వర్గ శత్రువులతో ఉంటే జర్నలిస్టులను కూడా విధ్వంసకారులుగా పరిగణించే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మహాసభల ముగింపు సందర్భంగా ఐజేయూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. యూనియన్ జాతీయ అధ్యక్షుడిగా వినోద్ కోహ్లీ, ప్రధాన కార్యదర్శిగా సభా నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా సయ్యద్ ఇస్మాయిల్(తెలంగాణ), కార్యదర్శులుగా నారాయణ పంచల్( మహారాష్ట్ర), రతుల్బోరా(అసోం), రాజమౌళిచారి(తెలంగాణ), ట్రెజరర్గా నతుముల్ శర్మ (ఛత్తీస్గఢ్), ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నవీన్ శర్మ(చండీగఢ్), భాస్కర్(తెలంగాణ) సిమిజాన్ (కేరళ), బాబు థోమస్, అనిల్ బిశ్వాస్, తారక్ నాథ్రాయ్(వెస్ట్బెంగాల్), రవి (మహారాష్ట్ర), జుట్టు కలిత (అసోం)ను ఎన్నుకున్నారు. -
తెలుగు రాష్ట్రాల మీడియా అకాడమీ చైర్మన్ల భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని మీడియా అకాడమీ కార్యాలయంలో ఇరువురు సమావేశమయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అకాడమీల్లో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేస్తున్న శిక్షణ కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పరస్పరం సహకరించుకునేందుకు ఉన్న అవకాశాలపై చర్చించినట్లు తెలిసింది. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
తెలంగాణ మీడియా అకాడమీని సందర్శించిన ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు.. ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్ట్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అల్లం నారాయణ వివరంగా ఆంధ్రప్రదేశ్ అకాడమీ చైర్మన్కి తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాల నుంచి అకాడమీ నిర్వహించిన శిక్షణ తరగతులు, సెమినార్లు ఇతర కార్యక్రమాలు తెలిపి, మీడియా అకాడమీ ప్రచురణలు, ఇతర వివరాల నోట్ అందజేశారు. ఇద్దరు చైర్మన్లు ఒకరినొకరు శాలువాతో సత్కరించారు. తెలంగాణ అకాడమీ సెక్రటరీ, నాగులాపల్లి వెంకటేశ్వర రావు, ఇరు అకాడమీల సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: ('చంద్రబాబువి పచ్చి అబద్దాలు.. అవి టీడీపీ పుట్టక ముందునుంచే ఉన్నాయి') -
పెరికలకు ప్రత్యేక కన్సల్టెన్సీ
పంజగుట్ట (హైదరాబాద్): పెరిక కులస్తుల విద్య, వైద్యం, ఉపాధి కోసం ప్రత్యేక కన్సల్టెన్సీని ఏర్పాటు చేయాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు. ఆదివారం సోమాజిగూ డ ప్రెస్క్లబ్లో గ్రేటర్ హైదరాబాద్ పెరిక కుల సంఘం ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ అధ్యక్షుడు బత్తిని పరమేష్తో పాటు మిగిలిన కార్యవర్గంతో అల్లం నారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ సంఘానికి అర ఎకరం స్థలం, రూ.50 లక్షల నిధుల మంజూరు ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. -
జర్నలిస్టుల హెల్త్కార్డులు చెల్లుబాటయ్యేలా చూడండి
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు జారీ చేసిన హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రా వును మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మె ల్యే చంటి క్రాంతి కిరణ్ కోరారు. ఈ మేరకు మంత్రి హరీశ్రావును కలిసి జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. హెల్త్ కార్డుల అమలులో ఎదురౌతు న్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, మీడియా అకాడమీ చైర్మన్తో పాటు, జర్నలిస్టు ప్రతినిధులను కూడా పిలిచి త్వరలో చర్చిస్తామన్నారు. జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ సమస్య పరిష్కారానికి కృషి చేసినందుకు కూడా ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావుకు అల్లం నారాయణ, చంటి క్రాంతి కిరణ్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే నాయకులు సూరజ్ భరద్వాజ్, సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. -
దసరాలోగా మీడియా అకాడమీ భవనం
సాక్షి, హైదరాబాద్: మీడియా అకాడమీ భవనాన్ని దసరాలోగా త్వరగా పూర్తి చేసి సీఎం కేసీఆర్తో ప్రారంభిస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. మంగళవారం నాంపల్లిలోని అకాడమీ భవన నిర్మాణ పురోగతిని ఆర్అండ్బీ అధికారులు, కాంట్రాక్టర్తో అల్లం నారాయణ సమీక్షించారు. సెప్టెంబర్ చివరి వారంలోగా భవనం పూర్తిచేసి అప్పగించేందుకు ప్రయత్ని స్తామని ఆర్అండ్బీ అధికారులు హామీ ఇచ్చా రని అల్లం స్పష్టం చేశారు. భవనంలో ఒక ఆడిటోరియం, రెండు తరగతి గదులు, లైబ్రరీ, గ్రామీణ, డెస్క్ విలేకరులకు కోసం ఒక బ్రిడ్జ్ కోర్స్ రూపొందించి సర్టిఫికెట్ కోర్స్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. -
త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. అల్లం నారాయణ హామీ
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, త్వరలోనే స్థలాలను ఇచ్చేందుకు కృషి చేస్తానని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. అకాడమీ సొంత భవన నిర్మాణం పూర్తి కావస్తోందని, త్వరలోనే జర్నలిస్ట్ల కోసం ఒక బ్రిడ్జి కోర్స్ రూపొందిస్తామని స్పష్టం చేశారు. మూడోసారి అకాడమీ చైర్మన్గా నియమితులైన సందర్భంగా బుధ వారం మీడియా అకాడమీ కార్యాలయంలో జర్నలిస్టులు అల్లం నారాయణను సన్మానించారు. కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ రాజమౌళి, జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు బ్రిడ్జి కోర్సు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా, ఇతర వర్సిటీల సహకారంతో జర్నలిస్టుల కోసం ఒక బ్రిడ్జి కోర్సుకు రూపకల్పన చేస్తున్నామని, సర్టిఫికెట్ సైతం జారీ చేస్తామని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. హైదరాబాద్ జర్నలిస్టుల కోసం మీడియా అకాడమీ నిర్వహించిన రెండు రోజుల శిక్షణా శిబిరం ముగింపులో ఆయన మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఆచరణ లో పెట్టాలని జర్నలిస్టులకు సూచించారు. 9 ఉమ్మడి జిల్లాల్లో తరగతులు నిర్వహించి ఆరు వేల మంది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చామని, దళిత, మహిళా, హైదరాబాద్ జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణా తరగతుల నిర్వహణతో మరో 1,000 మంది లబ్ధి పొందారని చెప్పారు. అకాడమీ 12 పుస్తకాలు ప్రచురించి జర్నలి స్టులకు అందజేసిందని, అకాడమీ కోసం నిర్మిస్తున్న నూతన భవనంలో ఒక ఆడిటో రియం, ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఉంటాయని తెలిపారు. రెండు రోజుల శిక్షణ తరగతుల్లో పాల్గొన్న జర్నలిస్టులకు వెటరన్ జర్నలిస్ట్, ‘మహిళా విజయం’ మాస పత్రిక సంపాదకు రాలు, వాసిరెడ్డి కాశీరత్నం చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేశారు. -
6 వేల మంది జర్నలిస్టులకు శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 9 జిల్లాల్లో జర్నలిస్టులకు శిక్షణాతరగతులు నిర్వహించామని, వీటి ద్వారా 6 వేల మంది జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని మెరుగు పరచుకున్నారని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. హైదరాబాద్లో మీడియా అకాడమీ నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యానికి ఉపయోగపడే 12 పుస్తకాలు మీడియా అకాడమీ ప్రచురించి శిక్షణ తరగతుల్లో ఒక కిట్ను జర్నలిస్టులకు అందజేస్తుందని వెల్లడిం చారు. సీఎం కేసీఆర్ మీడియా అకాడమీకి రూ.100 కోట్ల నిధిని ప్రకటించి, ఇప్పటివరకు రూ.42 కోట్లు విడుదల చేశారని తెలిపారు. రూ.42 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చిన వడ్డీతో జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, ఇప్పటివరకు రూ.16 కోట్లను జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు అకాడమీ అందజేసిందని వివరించారు. -
‘పాపవినాశనం’పై ప్రముఖుల ప్రశంసలు
షార్ట్ఫిల్మ్ల ద్వారా తమ ప్రతిభ నిరూపించుకొని స్టార్ట్స్గా ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు.ఒక చక్కటి సందేశాన్ని షార్ట్ ఫిల్మ్ లో ఇమిడించి అందరిని మెప్పించడం అంటే గొప్ప విషయం. అలాంటి ఒక సందేశాత్మక లఘు చిత్రాన్ని తెరకెక్కించి ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు దొంగరి మహేందర్ వర్మ. అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఆయన రచించి దర్శకత్వం వహించిన సినిమా పాపవినాశనం. శివాని, జోష్ రవి, జబర్దస్త్ అప్పారావు, సమ్మెట గాంధీ, దంచెనాల శ్రీనివాస్, ప్రియ, శివ, సాయి రెడ్డి ప్రముఖ పాత్రల్లో నటించారు. మాస్టర్ లిఖిత్ & అక్షిత్ సమర్పణలో ఇందిర దొంగరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కి ప్రముఖ సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్రం యొక్క ప్రీమియర్ షో హైదరాబాద్ లో ప్రదర్శించారు. కాగా ఈ షో కి తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ,కోదాడ మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీ నారాయణ , కో ఆ సొసైటీ ప్రధాన కార్యదర్శి అంకతి విజయ్ కుమార్,సినీ హీరో ఉత్తేజ్ ,డా. దాచేపల్లి సుధీర్ కుమార్ ,మహేందర్ తదితరులు బంధుమిత్రులతో హాజరయ్యారు. -
మహిళా జర్నలిస్టులకోసం రూ. 5 లక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల వర్క్షాప్ శనివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఏప్రిల్ 23, 24(శని, ఆది) రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాలను తెలంగాణా ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. హైదరాబాద్ బేగంపేట, ప్లాజా హోటల్లో ప్రారంభమైన శిక్షణా శిబిరంలో తొలి రోజు మొదటి సెషన్కు జర్నలిసులు స్వేచ్ఛ, సుమబాల అధ్యక్షత వహించారు. రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా రెడ్డి హాజరైనారు. తెలంగాణా ఏర్పడిన తరువాత తొలిసారి మహిళా జర్నలిస్టుల కోసం ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ఇది సంతోషదాయక మని అల్లం నారాయణ వెల్లడించారు. మహిళా జర్నలిస్టుల అస్థిత్వం కోసం, వారికి ఒక స్పేస్ను కల్పించడమే దీని ఉద్దేశమన్నారు. వివిధ అంశాలపై సీనియర్ పాత్రికేయుల ప్రసంగాలతోపాటు, మహిళలుగా మీడియాలో ఎదురవుతున్న కష్టనష్టాలను పంచుకునే కలబోత కార్యక్రమం కూడా ఉందని అల్లం నారాయణ వెల్లడించారు. ఈ చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని, అలాగే ఆయా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారంకోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మహిళా జర్నలిస్టులకోసం రూ. 5 లక్షలు రాష్ట్ర మహొళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జర్నలిస్టులనుద్దేశించి ప్రసంగించారు. మహిళా జర్నలిస్టుల సంక్షేమం కోసం మంత్రిత్వ శాఖ తరపున 5 లక్షల రూపాయలను ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నారు. అనేక సమస్యలను ఎదుర్కొంటూ జర్నలిస్టులుగా రాణిస్తున్నవారికి, ఉన్నత స్థాయిలో తమ ప్రతిభను చాటుకుంటున్న వారిందరికీ మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహిళా మీడియా సెంటర్ ఏర్పాటుకు కృషి ఈ సందర్బంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఇంతమంది మహిళా జర్నలిస్టులను చూడటం సంతోషంగా ఉందన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు ఉన్నత స్థాయికి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని ముఖ్యంగా మీడియా, పోలీసు రంగంలో మరింత శ్రమించాల్సి ఉంటుందన్నారు. తన దృష్టికి వచ్చిన పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. మీడియా సెంటర్ ఏర్పాటు కోసం కూడా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమ కాలంలోనూ, ఇపుడు పునర్నిర్మాణంలో కూడా జర్నలిస్టుల పాత్ర అమోఘమని ఆమె కొనియాడారు. ముఖ్యంగా మీడియాలో పురుషులతో సమానంగా ఎదగడం అంటే.. ఎంతో ఒత్తిడి ఉంటుంది, అయినా నిబద్ధతతో రాణిస్తున్నవారిని తాను చాలామందిని చూశానని, ఇది నిజంగా అభినందనీయమని సబితారెడ్డి ప్రశంసించారు. తెలంగాణ తొలి మహిళా కమిషన్ చైర్పర్సన్గా సునీతా లక్ష్మారెడ్డి సాక్షి.కామ్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ మహిళా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం తమ ప్రభుత్వం తరపున చేయాల్సిందంతా చేస్తామని హామీ ఇచ్చారు . జర్నలిజం అంటే ఒక వినూత్నమైన రంగం. మీడియా రంగాన్ని కేవలం పురుషులకే పరిమితం కాకుండా అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ కూడా తాము ముందుండాలనే లక్ష్యంతో సాగుతున్న మహిళా పాత్రికేయులందరికీ హ్యాట్సాఫ్ అన్నారు. -
మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: బేగంపేటలోని టూరిజం ప్లాజాలో 'మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్' కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ వర్క్ షాప్ ప్రారంభ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఛైర్మన్లు, శాసనమండలి, శాసనసభ సభ్యులు పాల్గొన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ శని, ఆదివారం రెండు రోజులు నిర్వహించనున్నారు. దాదాపు 400 మంది మహిళా జర్నలిస్టులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టుల కొరకు ఒక ప్రత్యేక మీడియా సెంటర్, మీడియా కిట్ సాధించుకోవడంతో పాటు, మహిళా జర్నలిస్టుల సమస్యలు వాటి పరిష్కారాల కొరకు ప్రత్యేక చర్చ ఉంటుందని అల్లం నారాయణ తెలిపారు. ఏప్రిల్ 24వ తేదీన జరిగే ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత, వాణి దేవి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పాల్గొంటారు. ఈ సెషన్ లో జాతీయ స్థాయి మహిళా జర్నలిస్టులు ధన్యా రాజేంద్రన్, మాలిని సుబ్రహ్మణ్యం, 'మీడియా ధోరణులు, జాతీయ పరిస్థితులు' అనే అంశంపై ప్రసంగించనున్నారు. -
మహిళా జర్నలిస్టులకు రెండ్రోజుల శిక్షణా తరగతులు
సాక్షి, హైదరాబాద్: మహిళా జర్నలిస్టుల కు ఈనెలలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. హైదరాబాద్లో రెండు రోజులపాటు జరిగే ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొనాలనుకునే వారు మీడియా అకాడమీ మేనేజర్ వనజ (7702526489)కు ఫోన్ చేసి, పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాల వారు ఆయా జిల్లాల పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొదటిరోజు ‘మహిళా జర్నలిస్టులు– ప్రధాన స్రవంతి మీడియా– మహిళల పాత్ర’, ‘పాత్రికేయ రంగంలో మహిళలు– ప్రత్యేక సమస్యలు’అనే అంశంపై తరగతులు ఉంటాయని తెలిపారు. రెండో రోజు ‘మహిళా అస్తిత్వం–జెండర్ సెన్సిటైజేషన్’, ‘ఫీచర్ జర్నలిజం– మెళకువలు’అనే అంశాలపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో నిష్టాతులైన వారి ప్రసంగాలు ఉంటాయని పేర్కొన్నారు. -
అల్లం నారాయణకు సతీ వియోగం
హైదరాబాద్(లక్డీకాపూల్): రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి పద్మ(54) కన్నుమూశారు. కొంతకాలంగా అరుదైన లూపస్, కిడ్ని సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెకు ఇటీవల కోవిడ్ సోకింది. దీంతో ఆమె 22 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం బుధవారం ఉదయం ఎర్రగడ్డ జేక్ కాలనీలోని ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ వద్ద ఉంచుతారు. జూబ్లీహిల్స్లోని మహా ప్రస్థానంలో మధ్యాహ్నం 12 గం.కు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలో నిమ్స్లోని ఆమె భౌతిక కాయాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించడంతో పాటు మహిళా జేఏసీలో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మెస్లు మూసివేయడంతో ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చడమేగాక.. అమ్మల సంఘం అధ్యక్షురాలిగా పని చేస్తూ వచ్చారు. సీఎం కేసీఆర్ సంతాపం..: అల్లం పద్మ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. నారాయణను ఫోన్లో పరామర్శించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పద్మ మరణం పట్ల శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్యాదవ్, నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్రెడ్డి సంతాపం ప్రకటించారు. కాగా, ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్రెడ్డి, హైదరాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు ఎస్.విజయ్కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.రాజమౌళిచారి, టీయూడబ్లు్యజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ తదితరులు పద్మ మృతి పట్ల సంతాపం తెలిపారు. -
కరోనాతో మరణించిన జర్నలిస్టులకు రూ. 2 లక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనాతో మరణించిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ తరఫున రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని ఈనెల 15న ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. 63 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఈ సాయం అందిస్తామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిధులు సమకూర్చిన సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మార్చి నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ఇతర కారణాలతో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అదేరోజు రూ.లక్ష చెక్కుల పంపిణీ చేస్తారని వెల్లడించారు. -
కోవిడ్తో మరణించిన జర్నలిస్టులకు రూ.2 లక్షలు
నాంపల్లి (హైదరాబాద్): సీనియర్ జర్నలిస్టులతో సహా దాదాపు 70 మంది జర్నలిస్టులు కోవిడ్తో మృతి చెందారని, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని మీడియా అకాడమీ నిర్ణయించిందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. బాధిత కుటుంబాలకు ఐదేళ్ల పాటు నెలకు రూ.3 వేల రూపాయల పింఛన్ లభిస్తుందని పేర్కొన్నారు. మరణించిన జర్నలిస్టు కుటుంబంలో పదవ తరగతి లోపు చదువుకుంటున్న వారిలో గరిష్టంగా ఇద్దరికి వెయ్యి రూపాయల చొప్పున ఉపకార వేతనం అందుతుందని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.5.15 కోట్లు ఆర్థిక సహాయం చేసి ఆదుకుందని వివరించారు. మీడియా అకాడమీ ఆర్థిక సహాయం పొందేందుకు దరఖాస్తులను కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి,ఇంటి నం.10–2–1, సమాచార భవన్, రెండవ అంతస్తు, ఏసీగార్డ్స్, మాసబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్కు పంపాలని కోరారు -
దుబ్బాకలో 500 ఓట్లతో గెలిచి విర్రవీగుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ఏడాదిలోగా రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల సమస్య తీరుస్తానని, ఇది తన హామీ అని మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఆదివారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే (హెచ్–143)) ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని జలవిహార్లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో జర్నలిస్టులకు రూ.54 కోట్ల కార్పస్ ఫండ్ కేటాయించిన ఘనత కేసీఆర్ సర్కారుదేనన్నారు. త్వరలోనే దీన్ని రూ.100 కోట్లకు చేర్చేలా కృషి చేస్తామన్నారు. ఉద్యమ సమయంలో మా వెంట నిలిచిన విద్యార్థులు, లాయర్లు, జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామన్నారు. ఇప్పటికే మీడియా అకాడమీకి రూ.15 కోట్ల వ్యయంతో ఐదంతస్తుల భవనం కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. విధి నిర్వహణలో మరణించిన 260 మంది విలేకరుల కుటుంబానికి రూ.లక్ష చొప్పున, అనారోగ్యంతో పనిచేయలేని విలేకరుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున అందజేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. మరణించిన విలేకరుల పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యనందిస్తామని హామీ ఇచ్చారు. కరోనా సమయంలో 1,950 మందికి రూ.20 వేల చొప్పున ఇచ్చి ఆదుకున్నామని మంత్రి గుర్తుచేశారు. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాల్లోనూ అక్రెడిటేషన్లు 3,000 దాటలేదని, కేవలం తెలంగాణలోనే 19,150 మందికి ప్రభుత్వం అక్రెడిటేషన్, వైద్య సదుపాయాలు కల్పించి గుర్తించిందన్నారు. త్వరలోనే మీ అందరికీ యూనియన్ కార్యాలయం కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం... ఏడేళ్లలో తాము అన్ని ఎన్నికలు గెలిచామని, ఒక్క దుబ్బాకలో 500 ఓట్లతో గెలిచి కొందరు విర్రవీగుతున్నారని బీజేపీని ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని ఉద్దేశించి అన్నారు. తాము కూడా మోదీ, అమిత్షాలను విమర్శించగలమని.. కానీ, పదవులకు గౌరవమిస్తున్నామని పేర్కొన్నారు. తమ మౌనం గోడకు వేలాడే తుపాకీ అని, అది కాల్పులతో గర్జించడం మొదలుపెడితే ప్రత్యర్థులు తట్టుకోలేరన్నారు. తాను, ఈటల రాజేందర్, హరీశ్రావు ఎంతో మాట్లాడగలమని హెచ్చరించారు. ఉద్యమ సమయంలోని కేసీఆర్ వాగ్ధాటి మళ్లీ బయటికి వస్తే ఆయన్ను ఎదుర్కోవడం ఎవరితరం కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా వివిధ శాఖల్లో ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలిచ్చామని, త్వరలోనే 55 వేల కొలువులకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మోదీ ఒక్కో జన్ధన్ ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు, ఏడాదికి ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలెక్కడ అని నిలదీశారు. కేంద్రం తెలంగాణకు అన్ని విషయాల్లో అన్యాయమే చేస్తోందన్నారు. ప్రశ్నించే గొంతులని చెప్పుకునే రాష్ట్ర బీజేపీ నేతలు దీనిపై నోరుమెదపడం లేదని విమర్శించారు. తెలంగాణ వచ్చాక అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ప్రభుత్వాన్ని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో మరణించిన విలేకరుల కుటుంబాలకు కేటీఆర్ చెక్కులను అందజేశారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ అకాడమీ, ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వివరించారు. -
సాక్షి సంపాదకుడు వర్ధెల్లి మురళికి విశిష్ట పురస్కారం
సాక్షి, హైదరాబాద్: సామాజిక ధృక్పథం కలిగిన జర్నలిస్టులు ప్రస్తుతం అరుదైపోతున్నారని పలువురు సీనియర్ పాత్రికేయులు ఆవేదన వ్యక్తం చేశారు. అరుణ్సాగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అరుణ్ సాగర్ విశిష్ట పురస్కారాల ప్రదాన కార్యక్రమం శనివారం హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో జరిగింది. ఈ సందర్భంగా సాక్షి దినపత్రిక సంపాదకుడు వర్ధెల్లి మురళిని విశిష్ట పాత్రికేయ పురస్కారంతో సన్మానించారు. వారసత్వంగా అందిపుచ్చుకున్న వామపక్ష భావజాలంతో సామాజిక ధృక్పథం ఉన్న పాత్రికేయుడిగా ఆయన కొనసాగుతున్నారని పలువురు పాత్రికేయులు ఆయన్ను కొనియాడారు. అనంతరం మురళి మాట్లాడుతూ.. దివంగత పాత్రికేయుడు అరుణ్సా గర్ది, తనది కుటుంబ, రాజకీయ నేపథ్యాలు ఒకటేనన్నారు. ప్రత్యేకమైన ఆలోచనలు, రచనాశైలితో అరుణ్సాగర్ ఒక తరం ముందే పుట్టా రని కొనియాడారు. అటువంటి మిత్రుడి పేరుతో నెలకొల్పిన అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇక విశిష్ట సాహితీ పురస్కారం అందుకున్న కవి, అధ్యాపకుడు ఎండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ.. అరుణ్సాగర్ ఆదివాసీల జీవన వైవిధ్యానికి అద్దం పట్టారని ప్రశంసించారు. ఈ సందర్భంగా అరుణ్సాగర్ రాసిన కొన్ని కవితలను ఆయన చదివి వినిపించారు. తెలంగాణ ప్రెస్అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి, కవి, సరస్వతీ సమ్మాళ్ పురస్కార గ్రహీత కె.శివారెడ్డి, ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడు కె.శ్రీనివాస్, తెలంగాణ సమాచార కమిషనర్ కట్టా శేఖర్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సినీ దర్శకుడు శంకర్, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు అరుణ్సాగర్తో తమకున్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా–ఫేక్ న్యూస్ అంశంపై న్యాయ నిపుణుడు, రిటైర్డ్ సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులు మాట్లాడుతూ.. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్న ఫేక్న్యూస్ అత్యంత ప్రమాదకర పరిణామమని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధాన మీడియాలో పెయిడ్ న్యూస్ వంటి అవాంచిత ధోరణులు ఉంటుండగా.. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ దాన్ని మించిన ప్రమాదకారిగా తయారైందని పేర్కొన్నారు. -
కరోనా బాధిత జర్నలిస్టులకు రూ.3 కోట్ల సాయం
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడిన 1,603 మంది జర్నలిస్టులకు రూ.3.12 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు మీడియా అకాడమీ రాష్ట్ర చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో మీడియా అకాడమీ చరిత్రలో ఇంత పెద్దఎత్తున సాయం అందించడం ఒక మైలు రాయిగా పేర్కొన్నారు. హైదరాబాద్లోని సమాచార భవన్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వైద్య, మున్సిపల్ సిబ్బంది, పోలీసులతో పాటు జర్నలిస్టులు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారని తెలిపారు. కరోనా సోకిన జర్నలిస్టులు తమ అక్రెడిటేషన్, గుర్తింపు కార్డు, పాజిటివ్ వచ్చిన ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలను పంపడంతో వారికి ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు. ఇంకా కరోనా బారిన పడిన జర్నలిస్టులు ఉంటే తమ వివరాలను పంపాలని, వివరాలకు 80966 77444, 96766 47807లను సంప్రదించవచ్చని సూచించారు. సమావేశంలో అకాడమీ కార్యదర్శి డీఎస్ జగన్, మేనేజర్ లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఇప్పటి వరకు 442 మంది పాత్రికేయులకు రూ.80 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. కరోనా బారిన పడిన జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధృవీకరించిన మెడికల్ రిపోర్టులు మీడియా అకాడమీ కార్యాలయానికి పంపించాలని సూచించారు. వివరాలకు తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్ వాట్సప్ నెంబర్ 8096677444 లేదా మీడియా అకాడమీ మేనేజర్ లక్ష్మణ్కుమార్ సెల్ నెంబర్ 9676647807ని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
ఆ ఇద్దరి అరెస్ట్ దారుణం..
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబే, జర్నలిస్ట్ గౌతమ్ నవ్లఖలను అక్రమంగా అరెస్ట్ చేశారని ఫోరమ్ ఫర్ సోషల్ ఛేంజ్(ఎఫ్ఎస్సీ) పేర్కొంది. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ వీరిని నిర్బంధించారని ఆరోపించింది. మానవ హక్కుల పరిరక్షణ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న ఆ ఇద్దరినీ ఉపా చట్టం కింద అరెస్ట్ చేయడం దారుణమని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వారిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఎఫ్ఎస్సీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కన్వీనర్ అల్లం నారాయణ, రమణి, భూమన్, సాంబమూర్తి, ఆర్.వెంకట్రెడ్డి, ప్రభాకర్, ఆశాలత, జిట్టా బాల్రెడ్డిలతో పాటు మరో 30 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీమా కోరేగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే, ప్రకాశ్ అంబేద్కర్, పౌరహక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖ మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ) ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. మావోయిస్టులతో సంబంధాలున్నాయని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నారని ఆరోపిస్తూ తెల్తుంబ్డే, నవలఖతో పాటు పలువురు పౌర కార్యకర్తల ఉపా చట్టం కింద మహారాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు బాంబే హైకోర్టు నిరాకరించడంతో వారిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మార్చి 17న సుప్రీంకోర్టు కూడా వారి అభ్యర్థనలను తిరస్కరించి మూడు వారాలలోగా లొంగిపోవాలని ఆదేశించింది. వారు లొంగిపోవడానికి ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు మరో వారం గడువు పొడిగించింది. -
నిరంతర శ్రమతోనే గొప్ప లక్ష్యాలు సాధ్యం
సాక్షి, మెదక్: నిరంతర శ్రమతోనే గొప్పలక్ష్యాలు సాధ్యమవుతాయని తెలంగాణ ప్రెస్ అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఆదివారం మెదక్ రామాయంపేటలో స్నేహ కళాశాల విద్యార్థులకు ఆయన మార్గదర్శనం చేశారు. విద్యార్థులు లక్ష్యాలను సాధించి.. దేశం పేరును ఖండాంతరాలకు చాటాలని పిలుపునిచ్చారు. పత్రికలను ఆసక్తిగా చదివితే కొత్త పదాలు, భాషాభివృద్ధితో పాటు సామాజిక పోకడలు అవగతమవుతాయని విద్యార్థులకు సూచించారు. విద్యార్థి దశలో చెడు వ్యసనాలు అలవాటు చేసుకుంటే..భవిష్యత్తు ఉండదన్నారు. నూతన ఆవిష్కరణలు,కంప్యూటర్ల వినియోగంపై నైపుణ్యం సాధించాలన్నారు. విద్యార్థులు బట్టి విధానంలో కాకుండా..అర్థం చేసుకుంటూ చదవాలని సూచించారు. ప్రశ్నించే గుణం అలవర్చుకోవాలన్నారు. -
జర్నలిస్టులు నిష్పాక్షికంగా వ్యవహరించాలి
సాక్షి, శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్) : జర్నలిస్టులు నిష్పాక్షికత, సత్యసంధత, నైతికత అనే మూడు విలువలు పాటించాలని, యధార్థంగా సమాజంలోని మంచి చెడులపై వార్తలు రాయాలని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. కరీంనగర్లోని ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామకృష్ణ అధ్యక్షతన ‘జర్నలిజం–సామాజిక బాధ్యత’ అనే అంశంపై శుక్రవారం ఒకరోజు రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా అల్లం నారాయణ హాజరై మాట్లాడారు. మీడియా రంగంలో రోజురోజుకు పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయని, వాటిని అనుగుణంగా జర్నలిస్టులు, జర్నలిజం విద్యార్థులు అనుసరించాలన్నారు. సమాజంలో ఉన్న మంచి, చెడులపై జాగ్రత్తగా వ్యవహరిస్తూ వార్తలు రాయాలన్నారు. డిజిటల్ మీడియా ద్వారా అనర్థాలు పెరిగిపోతున్నాయని, జర్నలిజం అనేది కత్తిమీద సాములాంటిదన్నారు. ఉత్తమ జర్నలిస్టులుగా ఎదగాలంటే సత్యసంధత, నిష్పాక్షికత, నైతికత ఉంటేనే సాధ్యపడుతుందన్నారు. కావాల్సిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వార్తలు రాయాలని, రాసిన వార్తలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని గుర్తు చేశారు. జర్నలిజం విద్యార్థులు ముందుగా భాష, పదజాలంపై పట్టుండాలని, దీని కోసం పత్రికలు, పుస్తకాలు చదివి పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. మరో అతిథి, ప్రముఖ జర్నలిస్టు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం వార్తపత్రికలతో పాటు ఫేస్బుక్, వాట్సాఫ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు సమాచారం అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని, కానీ సోషల్మీడియాలో వచ్చిన వార్తలన్నీ సత్యాలు కావని గుర్తించాలని వాటిని నిర్ధారణ చేసుకోవాలన్నారు. మనకు వచ్చిన సమాచారం సహాయంతో జరిగిన సంఘటనతోపాటు జరగబోయే అంశాలపై విశ్లేషణ చేసి వార్తలు రాయాలన్నారు. సమాజంలోని ప్రజల ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసే శక్తి పత్రికలకు, మీడియాకు ఉంటుందని, రాజకీయ, సామాజిక ఏ పత్రిక ఎంతబలంగా ప్రజల్లోకి తీసుకెళ్తే ఆ పత్రికలను పాఠకులను ఆకర్షిస్తాయన్నారు. టెలివిజన్, సోషల్మీడియా జర్నలిజంలో నూతన మార్పులు వచ్చాయన్నారు. ఉన్నది ఉన్నట్లు రాయడం కాకుండా విశ్లేషించి వార్తలు రాయాలని, ఆలోచన శక్తిని పదునుపెడితే జర్నలిజం వృత్తిలో రాణిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం కరీంగనర్ జేసీ శ్యాంప్రసాద్లాల్, టీయూడబ్యూజే(ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, జర్నలిస్టులు ప్రకాశ్రావు, పీఎస్.రవీంద్ర, కవి అన్నవరం దేవేందర్ విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. జర్నలిజం కోర్సు కోఆర్డినేటర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి, ఎన్సీసీ అధికారి పర్లపల్లి రాజు, ఎన్ఎస్ఎస్ అధికారి బి.సురేష్కుమార్, అద్యాపకులు, విద్యార్థులు, వివిధ ప్రాంతాలకు చెందిన పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు. -
ఏడాదిలోపు మీడియా భవనం
సాక్షి, హైదరాబాద్: ఏడాదిలోపు తెలంగాణ మీడియా అకాడమీ భవనం అందుబాటులోకి వస్తుందని అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. సోమవారం సమాచార భవన్లో నిర్వహించిన అకాడమి పాలకమండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత భవనాన్ని కూల్చేసి కొత్త భవన నిర్మాణం కోసం ఆర్అండ్బీ ఆధ్వర్యంలో టెండర్లు కూడా ఖరారయ్యాయని చెప్పారు. నూతన భవన శంకుస్థాపన త్వరలో సీఎం కేసీఆర్ చేతులు మీదుగా ప్రారంభమవుతుందన్నారు. అకాడమీకి రూ.15 కోట్లు మంజూ రు చేశారని తెలిపారు. నూతన అకాడమీ భవనం పూర్తైతే రూ.100 కోట్ల జర్నలిస్టుల సంక్షేమనిధి నుంచి శాశ్వతతరగతి గదులను నిర్మించి జర్నలిజం కోర్సు కూడా ప్రవేశపెడతామని వెల్లడించారు. 150 కుటుంబాలకు ఆర్థిక చేయూత గతంలో ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి వంద కోట్లు ప్రకటించి, రూ.34.50 కోట్లను విడుదల చేసిందని అల్లం నారాయణ వివరించారు. మరణించిన 150 మంది జర్నలిస్టుల కుటుంబాలకు వాటి నుంచి రూ.లక్ష చొప్పున రూ.కోటి యాభై లక్షలు, తీవ్ర అనారోగ్యం బారిన పడిన జర్నలిస్టులకు రూ.50 వేల చొప్పున 26 లక్షల ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రతి నెలా రూ.3,000 చొప్పున 5 ఏళ్ల వరకు ఆర్థికసాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన 104 మంది పిల్లలకు 1 నుంచి 10వ తరగతి వరకు రూ.1,000 చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లిస్తున్నామన్నారు. సమావేశంలో వివిధ పత్రికల ఎడిటర్లు, సీనియర్ పాత్రికేయులు, తెలుగు వర్సిటీ జర్నలిజం శాఖాధిపతి సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘జర్నలిస్టుల సంక్షేమ నిధి’ దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి మంజూరు చేసే ఆర్థిక సహాయం పొందడానికి ఆగస్టు 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2014, జూన్ 2 తర్వాత మరణించిన జర్నలిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, జర్నలిస్టు వృత్తిలో ఉంటూ అనారోగ్యం బారిన పడి పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి లబ్ధి పొందిన వారు, ఇప్పటికే మీడియా అకాడమీకి దరఖాస్తులు పంపినవారు మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత పౌర సంబంధాల అధికారులైన ఉప సంచాలకులు, సహాయ సంచాలకులు, డీపీఆర్వోల ద్వారా ధ్రువీకరించిన దరఖాస్తులను మీడియా అకాడమీ కార్యాలయానికి పంపించాలన్నారు. దరఖాస్తుల్ని కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, హైదరాబాద్ చిరునామా: ఇంటి నెం.5–9–166, చాపెల్ రోడ్డు, నాంపల్లి, హైదరాబాదు–500001కు పంపవలసిందిగా ఆయన తెలియజేశారు. ఇతర వివరాలకు కార్యాలయ ఫోన్ నంబర్ 040–23298672, 23298674లను సంప్రదించాలన్నారు. దరఖాస్తులను http://ipr.tg.nic.in/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. -
‘ప్రత్యేక రాష్ట్రంలో 17 వేల అక్రిడేషన్లు’
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో 12 వేల అక్రిడేషన్లు ఉండేవని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 17 వేల అక్రిడేషన్లు ఇచ్చామని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. నాలుగు అంతస్తుల్లో 15 కోట్లతో మీడియా అకాడమీ నిర్మిస్తున్నామన్నారు. పైసా కట్టకుండా జర్నలిస్టులకు హెల్త్కార్డులు ఇచ్చామని.. అక్రిడేషన్ లేని వాళ్లకు కూడా కమిటీ వేసి హెల్త్ కార్డులు అందేలా చేశామని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలు ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని హర్షం వ్యక్తం చేశారు. అందులో 34 కోట్ల రూపాయలను మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అందజేసినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు మరణించిన 150 మంది జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సహాయం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన 100 కోట్ల నిధులను జర్నలిస్టుల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. హెల్త్ కార్డులు చెల్లడం లేదని చెప్పాడాన్నిఆయన ఖండించారు. హెల్త్ కార్డులు తీసుకోకపోవడం ప్రభుత్వ బాధ్యత కాదన్నారు. అసత్యపు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం ఆలోచనలో ఉందని.. ఆటంకాల కారణంగా ఆలస్యం జరుగుతోందని తెలిపారు. సీఎం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తారనే నమ్మకం ఉందన్నారు. జర్నలిస్టులకు పెన్షన్పై కూడా ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. -
ఎన్నికలలోపు జర్నలిస్టులకు తీపి కబురు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇప్పించి తీరుతామని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (హెచ్–143) రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హామీ ఇచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలోపే జర్నలిస్టులకు తీపికబురు అందుతుందని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కూడా సానుకూలంగా ఉన్నారన్నారు. ఆదివారం ఇక్కడ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ క్రాంతికిరణ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడ్డాక జర్నలిస్టులకు ఏమీ ఒనగూరలేదని ఇతర యూనియన్లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేద న్నారు. రాష్ట్రంలో అక్రిడిటేషన్లు ఉన్న 17 వేల మందికిపైగా జర్నలిస్టులకు హెల్త్కార్డులు, రూ.40 కోట్ల వరకు సంక్షేమ నిధి సాధించామని చెప్పారు. హెల్త్కార్డుల ద్వారా వచ్చే మొత్తం సరిపోకపోతే సీఎం వెల్ఫేర్ ఫండ్ నుంచి జర్నలిస్టుల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నామన్నారు. మహిళా, డెస్క్ జర్నలిస్టులు, చిన్నపత్రికల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి పలు తీర్మానాలను సభ ఆమోదించింది. ఈ సందర్భంగా తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల యూనియన్ (టెమ్జూ) రాష్ట్ర అధ్యక్షుడిగా సయ్యద్ ఇస్మాయిల్ను ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎం.రమణకుమార్, డిప్యూటీ ప్రధానకార్యదర్శిగా టి.యుగంధర్ను నియమించారు. సభలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్తోపాటు అన్ని జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై టీయూడబ్ల్యూజే హర్షం
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు నెలరోజుల వ్యవధిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం చేసిన ప్రకటనపై తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు అల్లం నారాయణ, ఉపాధ్యక్షుడు పల్లె రవి, ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్ చంటి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతోపాటు జర్నలిస్టుల నిధి మొత్తాన్ని కూడా పెంచుతామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీపై ఆనందం వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు దక్కుతాయన్న సీఎం ప్రకటన జర్నలిస్టులకు మరోసారి గట్టిగా హామీఇచ్చినట్టు అయిందని వారు ఆ ప్రకటనలో సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
వృత్తిపట్ల నిబద్ధతున్న వ్యక్తి.. జెస్సీ
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్: పనిలో నిబద్ధత, అంకిత భావం ఉన్న వ్యక్తి స్పోర్ట్స్ జర్నలిస్ట్ జె.శ్రీనివాసులు (జెస్సీ) అని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ప్రెస్ అకాడమీ తరఫున లక్ష నగదు, ఐదేళ్ల పాటు నెలకు రూ.3 వేల పింఛన్ అతి త్వరలో కల్పిస్తామని, అంతే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చా రు. ఆదివారం ప్రెస్క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందిన సాక్షి స్పోర్ట్స్ జర్నలిస్టు జెస్సీకి ఆత్మీయ నివాళి కార్యక్రమం జరిగింది. జెస్సీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సీనియర్ పాత్రికేయులు పాల్గొని జెస్సీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లం నారాయణ మాట్లాడుతూ.. జర్నలిజంలో జెస్సీ లాంటి వారు చాలా అరుదుగా ఉంటారని తాను అనుకున్నది కథనంలో చూపేవారని అన్నారు. జెస్సీ పేరుతో గేమ్ ఈవెంట్స్ నిర్వహించేందుకు కృషి చేద్దామన్నారు. స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ఆప్తుడిని కోల్పోయానని కన్నీటిపర్యంతమయ్యారు. ‘సాక్షి’ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ.. జెస్సీ మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ అని కొనియాడారు. సాక్షి యాజమాన్యం, ఉద్యోగులు అందరూ ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి చూస్తున్నామని అన్నారు. జెస్సీ స్నేహితుడు మైహోం ఇండస్ట్రీస్ సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్.వి.మహేశ్బాబు జెస్సీ కుటుంబానికి రూ.50 వేలు సాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రాజమౌళి చారి, ప్రధాన కార్యదర్శి విజయ్కుమార్ రెడ్డి, జెస్సీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
ఇక అన్ని మిడియాల్లో ప్రమాణిక భాష
సుల్తాన్బజార్: అన్ని జిల్లాల మాండలిక పదాలతో ఒక ప్రామాణిక భాషను రూపొందించి పత్రికలు, ప్రసార మాధ్యమాలలో ప్రయోగించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అభిప్రాయపడ్డారు. బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో శనివారం ‘తెలుగు పత్రికలు–ప్రసార మాధ్యమాల భాషా స్వరూపం’ అనే అంశంపై సదస్సు జరిగింది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పరిషత్ అధ్యక్షులు డాక్టర్ సి.నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అల్లం నారాయణ సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలుగు పత్రికల్లో ప్రామాణిక భాష పేరుతో రెండున్నర జిల్లాల భాషను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి ఇతర ప్రాంతాల భాషలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పత్రికల భాషలనే అలవర్చుకున్నారని తెలిపారు. సినిమా భాష ప్రజల శిరస్సుపై తాండవం చేసిందన్నారు. పత్రికా భాషను సరళీకృతం చేసేందుకు నండూరి రామ్మోహన్, నాగుల వెంకటేశ్వరరావులు ముఖ్యపాత్ర పోషించారన్నారు. తెలంగాణ భాషలో పత్రిక రచన కష్టమని, ఇన్నాళ్లుగా ఉన్న భాషా స్వరూపం మార్పు చెందాలంటే మాండలికాలు ఏకరూపం చేయాలని అభిప్రాయపడ్డారు. వాల్పోస్టర్ను గోడపత్రిక అని రాస్తున్నారని, వాల్ అంటే గోడ అని, పోస్టర్ అంటే పత్రిక కాదన్నారు. ప్రస్తుత ‘సాక్షి’ దినపత్రిక ఈడీ రామచంద్రమూర్తి గతంలో ప్రసార భాషలో కొన్ని మార్పులు తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య, సాహితీ ప్రియులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. -
‘అల్లం’ లక్ష్యంగానే ధర్నాలు
టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు పరశురాం సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమంలో జాడలేని కొంతమంది జర్నలిస్టు సంఘాల నాయకులు.. ఇప్పుడు ప్రెస్అకాడమీ చైర్మన్ లక్ష్యంగా «చేసుకుని ధర్నాలకు దిగటం సరికాదని టీయుడబ్ల్యూజే(హెచ్-143) రాష్ట్ర నాయకుడు పరశురాం అన్నారు. గురువారం సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను లక్ష్యంగా చేసుకుని ధర్నాలకు దిగటాన్ని తప్పుబట్టారు. గతంలోని అకాడమీ చైర్మన్లు జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. కానీ, అల్లం నారాయణ జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. గతంలో అందజేసిన హెల్డ్కార్డులకు లక్ష రూపాయల వరకు మాత్రమే పరిమితి ఉండేదని, ప్రస్తుతం పరిమితి లేదని చెప్పారు. ఇళ్ల స్థలాలతో పాటు డబుల్బెడ్రూమ్లు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సముఖత వ్యక్తం చేశారని, అది ప్రెస్ అకాడమీ చైర్మన్ నారాయణ ఘనత అని అన్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ప్రెస్ అకాడమీకి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. పాత్రికేయుల పిల్లల విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఇలాంటి విషయాలు గమనించకుండా ప్రెస్ అకాడమీని నిర్వీర్యం చేసేలా ఐజీయూ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నాలు చేస్తామనటం సరికాదన్నారు. సమావేశంలో సంఘం నాయకులు సునీల్, మోహన్, సత్తార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆందోళన వద్దు.. అందరికీ అక్రిడిటేషన్లు
ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ న్యూశాయంపేట : ప్రభుత్వం ఇంకా కుదట పడలేదని, అధికారుల లేమితోనే జర్నలిస్టుల అక్రిడిటేషన్లు, ఆరోగ్యకార్డులు ఆలస్యమవుతున్నాయని, త్వరలో అందరికీ అందుతాయని రాష్ట్ర ప్రెస్ అకాడమి చైర్మెన్ అల్లం నారాయణ అన్నారు. ప్రెస్ అకాడమి చైర్మెన్గా రెండోసారి నియమితులైన సందర్భంగా ఆదివారం హన్మకొండ ప్రెసక్లబ్లో టీయూడబ్ల్యూజే(హెచ్–143) ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పోరాటాల ఫలితంగానే అక్రిడిటేషన్ల కోసం ప్రభుత్వం జీవో జారీ చేసిందని, డెస్క్ జర్నలిస్టులకు కూడా ఇచ్చేలా జీవో జారీ అయిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 20 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందని, ఇది తమ సంఘ పోరాట ఫలితమేనని చెప్పారు. రూ.100 కోట్ల నిధిని సాధించి, ప్రతి జర్నలిస్టుకు రూ.10 వేల పెన్షన్ వచ్చేలా పోరాడుతానని అన్నారు. తన హయాంలో ప్రతిక్షణం జర్నలిస్టుల సంక్షేమానికే వెచ్చిస్తానన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్యకార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరుకు కృషి చేస్తాన ని హామీ ఇచ్చారు. తెలంగాణ సిలబస్ ప్రవేశపెట్టి అకాడమి ద్వారా జర్నలిస్టులకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. అంతకు ముందు ప్రెస్క్లబ్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు క్రాంతి, పి.రవి, లెనిన్, కొండల్రావు, పి.శివకుమార్, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, జిల్లా అద్యక్షుడు జి.వెంకట్ పాల్గొన్నారు. -
జర్నలిస్టులకు టీ.సర్కార్ తీపి కబురు
హైదరాబాద్ : జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ వినియోగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గత రెండేళ్లుగా వివిధ కారణాలవల్ల ఆకస్మిక మరణంపొందిన జర్నలిస్ట్ కుటుంబాలకు అర్థిక లబ్ధి లభించనుంది. దీంతో పాటు ప్రమాదాల్లో గాయాలపాలై పని చేయలేని స్థితిలో ఉన్నజర్నలిస్టులకు కూడా ఆర్థిక సహాయం అందనుంది. ప్రతి నెల కూడా కొంత మొత్తన్ని ఆ కుటుంబాలకు అందించనున్నారు. వీటితో పాటు ప్రఖ్యాత యూనివర్సిటీలలో జర్నలిజం చదివే జర్నలిస్ట్ పిల్లలకు సైతం రెండు లక్షల రూపాయల ప్రోత్సాహాన్ని అందించనున్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజె రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ ఈ జీవో విడుదలకు చొరవ చూపారు. -
పాత్రికేయుల కోసం ట్రిపుల్ బెడ్రూం కాలనీలు
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చిట్యాల: పాత్రికేయుల కోసం ట్రిపుల్ బెడ్రూమ్ కాలనీలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. ఆదివారం నల్లగొండ జిల్లా చిట్యాలలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మొదటి విడతలో హైదరాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లో ట్రిపుల్ బెడ్రూం కాలనీలు నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు, హెల్త్కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. హెల్త్ కార్డుల కోసం రెండు వేల మందికి మాత్రమే ఆమోదం జరిగిందని, మిగిలిన 24 వేల మంది జర్నలిస్టులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అల్లం పేర్కొన్నారు. -
'హెల్త్కార్డులకు ఆన్లైన్లోనే దరఖాస్తు'
చిట్యాల: జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ప్రెస్ ఆకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా చిట్యాలలో విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు, హెల్త్కార్డులు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. అందులో భాగంగా మొదటి విడతలో హైదరాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లో త్రిబుల్ బెడ్రూం కాలనీలు నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. హెల్త్ కార్డుల కోసం రెండు వేల మందికి మాత్రమే ఆమోదం లభించిందని, మిగిలిన 24 వేల మంది జర్నలిస్టులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే డీపీఆర్వోలను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర నాయకులు పల్లె రవికుమార్, క్రాంతి, యూసూఫ్బాబులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల కోసం ఆమరణ దీక్ష చేస్తా: అల్లం
నాగారం(నిజామాబాద్): వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్కార్డులు, డబుల్బెడ్రూం ఇళ్లు తదితర సౌకర్యాల కల్పనపై త్వరలోనే పరిష్కారం లభిస్తుందని, ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకపోతే ఆమరణ దీక్ష చేపడతానన్నారు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం జర్నలిస్టు సంఘాలు ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడిన అల్లం.. కొన్ని కారణాల వల్ల అక్రిడిటేషన్ల జారీలో ఆలస్యమవుతున్నదని పేర్కొన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డుల కోసం తెలంగాణలోని 10 జిల్లాల నుంచి 24 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపిన ఆయన.. చిన్నతరహా మాస పత్రికలు కూడా తమ సంస్థల్లో 100 మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారని చూపడంపై విస్మయం వ్యక్తంచేశారు. నిజమైన జర్నలిస్టులకు కచ్చితంగా హెల్త్కార్డులు రావాల్సిందేనని, అందుకే పరిశీలన జరుగుతున్నదని చెప్పారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు రమణ, ప్రధాన కార్యదర్శి ఇస్మాయిల్, రాష్ట్ర ప్రతినిధులు జమాల్పూర్ గణేష్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలార్జున్గౌడ్, కొట్టూరు శ్రీనివాస్, నర్సింహాచారి, శ్రీకాంత్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు. -
పాత్రికేయులందరికీ హెల్త్ కార్డులు: అల్లం నారాయణ
గోదావరిఖని : తెలంగాణ రాష్ట్రంలో అక్రిడిటేషన్ కార్డులతో సంబంధం లేకుండా గ్రామీణ, పట్టణ ప్రాంత జర్నలిస్టులందరికీ హెల్త్కార్డులు ఇచ్చేందుకు కషి చేస్తున్నామని ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన తెలంగాణ ఉత్తేజ సభకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రస్తుతం హెల్త్కార్డులకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఉందని, పది రోజుల్లోగా ఈ ఫైల్ క్లియరయ్యే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జూలై 15వ తేదీ వరకు అక్రిడిటేషన్ కార్డు ఉన్న జర్నలిస్ట్లందరికి బస్పాస్ రెన్యూవల్ చేయనున్నారని ఆయన చెప్పారు. -
గవర్నర్కు జర్నలిస్టు సంఘాల ఫిర్యాదు
-
బాబు తప్పులు పరాకాష్టకి చేరాయి
-
తెలంగాణ 'సినిమా'పై సమావేశం
హైదరాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ సినిమా "నిన్న నేడు రేపు" అనే సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ పాల్గొన్నారు. పలువురు మేధావులు, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ సినిమా తీరుతెన్నులపై చర్చించారు. -
చెరువును దత్తత తీసుకున్న టీయూడబ్ల్యుజే
మెదక్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, అధికారులు పాలు పంచుకుంటున్నారు. తాజాగా గురువారం మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలోని కవలంపేట చెరువును టీయూడబ్ల్యుజే (తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) దత్తత తీసుకుంది. ఈ చెరువులో పూడికతీత పనులను గురువారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చింతా ప్రభాకర్, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్బొజ్జలు పాల్గొన్నారు. -
వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు
తెలంగాణ చైతన్యాన్ని కొనసాగించడం, జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా టీయూడబ్ల్యుజే ఏర్పడిందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. మంగళవారం వనస్థలిపురంలోని వనితా కళాశాలలో జరిగిన టీయూడబ్ల్యుజే ఎల్బీనగర్ నియోజకవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యుజే నియోజకవర్గ డైరీనీ ఆవిష్కరించి, యూనియన్ సభ్యులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 10 కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని, ముందు ముందు రూ.100 కోట్ల నిధిని ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. అక్రిడేషన్తో సంబంధం లేకుండా ఇచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడామని, త్వరలోనే హెల్త్ కార్డుల సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. అలాగే అర్హులైన అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇప్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. టీయూడబ్ల్యుజే రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్ మాట్లాడుతు ప్రజాస్వామ్య స్పూర్తి, విలువల నుంచి వచ్చిందే టీయూడబ్ల్యుజే అని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదని అన్నారు. హయత్నగర్ సమీపంలోని మునగనూరులో జర్నలిస్టుల ప్లాట్ల సమస్య పరిష్కారానికి యూనియన్ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. -
‘ఆంక్షల’ పంచాయితీ ప్రెస్ అకాడమీకి...
* నేడు ప్రెస్ అకాడమీ * పాలక మండలి సమావేశం * పాల్గొననున్న సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయుల ప్రవేశంపై ఆంక్షల విధింపు వ్యవహారంపై పాత్రికేయులు, రాజకీయవర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో సీఎం కె.చంద్రశేఖర్రావు శనివారం సీనియర్ జర్నలిస్టులతో సమావేశం కానున్నారు. పత్రికల సంపాదకులు, పాత్రికేయ సంఘాలతో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ అకాడమీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కేసీఆర్ హాజరై పాత్రికేయులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పాత్రికేయులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల పంపిణీ, అక్రెడిటేషన్ కార్డుల జారీ తదితర అంశాలతోపాటు సచివాలయంలో పాత్రికేయుల ప్రవేశంపై ఆంక్షల అంశంపైనా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. సచివాలయంలో పాత్రికేయుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలా? గుర్తింపు కార్డులు జారీ చేసి పరిమిత సంఖ్యలో, నిర్దేశిత వేళల్లోనే అనుమతించాలా? అనే అంశాలపై ఈ భేటీలో నిర్ణయించే అవకాశముంది. నేడే వెలువడనున్న ఉత్తర్వులు! రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయుల ప్రవేశంపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ప్రెస్ అకాడమీ పాలక మండలి భేటీ ముగిసిన వెంటనే సర్కారు ఉత్తర్వులు జారీ చేయనుందని సమాచారం. మీడియాపై ప్రభుత్వ ఆంక్షల యోచన అంశంపై శుక్రవారం పత్రికల్లో వచ్చిన కథనాలపై పాత్రికేయ వర్గాల్లో తీవ్ర అలజడి రేగినా, రాజకీయ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించినా..రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మౌనాన్ని పాటించి తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని సంకేతాలు పంపింది. ఈ అంశంపై శనివారం సాయంత్రంలోగా ప్రభుత్వ నిర్ణయం అధికారికంగా వెల్లడి కానుందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. సచివాలయంలో మీడియా ప్రతినిధుల ప్రవేశంపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ద్వారా ఓ సర్క్యులర్ జారీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ శుక్రవారం మధ్యహ్నాం సచివాలయంలో పోలీసు శాఖ డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డితో సమావేశం కావడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూర్చింది. సచివాలయంలో జర్నలిస్టుల నిరసన.. సచివాలయంలో జర్నలిస్టుల ప్రవేశంపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం యోచిస్తోందనే వార్తలపై సచివాలయంలో రోజువారి విధులు నిర్వహించే జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు శుక్రవారం ఆందోళనబాట పట్టారు. వీడియో కెమెరాలు, స్టాండ్లను నేలపై పెట్టి సీఎం కార్యాలయం ఉన్న సమత బ్లాక్ ఎదుట కొన్ని నిమిషాలపాటు మౌనం పాటిస్తూ నిరసన తెలిపారు. పలువురు జర్నలిస్టులు చొక్కాలకు నల్ల రిబ్బన్లను ధరించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం సచివాలయంలో పాత్రికేయులు నిరసన తెలపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అనంతరం ఈ అంశంపై పాత్రికేయులు రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాలశాఖ కమిషనర్ చంద్రవదన్ ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజువారి ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారని జర్నలిస్టులపై నిందలు మోపడం తగదన్నారు. పాత్రికేయులపై నిషేధం విధించాలనేది ప్రభుత్వ నిర్ణయమైతే నేరుగా ప్రకటించాలని.. ఇలాంటి సాకులు చూపి పాత్రికేయులను అవమానించవద్దని కోరారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, శనివారం సాయంత్రం వరకు వేచి చూడాలని చంద్రవదన్ పాత్రికేయులకు బదులిచ్చారు. మీడియాపై ఆంక్షలు వద్దు: కొండా సచివాలయంలోకి మీడియాను అనుమతించకూడదనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ తప్పుపట్టింది. ప్రభుత్వానిది దుర్మార్గమైన ఆలోచనని, దానిని వెంటనే విరమించుకోవాలని ఆ పార్టీ అధికారప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పారదర్శక పాలనను అందిస్తామన్న కేసీఆర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. తెలంగాణ విద్యార్థులు కులూ-మనాలిలో చిక్కుకుపోతే వారిని ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని విమర్శించారు. మీడియాను నియంత్రిస్తే పోరు: టీడీపీ సచివాలయంలోకి మీడియాను అనుమతించకూడదని తీసుకునే నిర్ణయం పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామ్య హక్కును హరించడమేనని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహు లు అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే.. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చినవారి పట్ల కేసీఆర్ ప్రేమ కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తీరుకు వ్యతిరేకంగా 28న దీక్ష చేస్తానన్నారు. -
'జర్నలిస్టుల జీవితాలు ఇంకా చీకట్లోనే'
- ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ జర్నలిస్టుల జీవితాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయని, వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి పట్టణంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో మంగళవారం జరిగిన కాకతీయ ప్రెస్క్లబ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అల్లం నారాయణ, శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించిన అనంతరం నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టులకు కనీస వేతనాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక నేటికీ దుర్భర జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ నియోజకవర్గంలోని వారందరికీ నివేశన స్థలాలు అందించాలని వారం రోజుల క్రితమే ములుగు ఆర్డీఓ మహేందర్జీకి ఆదేశాలు జారీ చేశానన్నారు. అనంతరం కాకతీయ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, స్పీకర్ మధుసూదనాచారిని ఘనంగా సన్మానించారు. అలాగే డైరీ ఆవిష్కరణకు సహకరించిన టీబీజీకెఎస్ నాయకుడు మంగళగిరి అప్పయ్యదాస్, 9వ వార్డు కౌన్సిలర్ శిరుప అనిల్కుమార్ను సన్మానించారు. టీయూడబ్ల్యూజే డిప్యూటీ జనరల్ సెక్రెటరీ రమణ, నాయకులు బీఆర్ లెనిన్, ఇస్మాయిల్, జిల్లా అధ్యక్షుడు కక్కెర్ల అనిల్కుమార్, నాయకులు సుధాకర్, నవాబ్, భూపాలపల్లి ప్రెస్క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, చంద్రు శ్రీధర్ పాల్గొన్నారు. -
మండే అక్షరం..
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం అంతరంగం అక్షరాన్ని నమ్ముకున్న ఆ వ్యక్తి... దానినే ప్రేమించాడు. దానితో పాటే నడిచాడు. అక్షరమనే మొక్కల గాలి పీల్చాడు. ‘ఇంతింతై’ అన్నట్టు... ఆ చెట్టు నీడలోనే ఎదిగాడు. అక్షరాలను ఆయుధంగా చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో ముందు వరుసలో నిలిచాడు. కలం వీరులు తోడు రాగా...‘కథ’ం తొక్కాడు. పోరాట పటిమ... అనుభవం అంద రిలో ప్రత్యేకత తెచ్చిపెట్టాయి. అవే ‘ప్రెస్ అకాడమీ చైర్మన్’ పదవి వరించడంలోనూ...‘అల్లం’త ఎత్తున ఆయనను కూర్చోబెట్టడంలోనూ కీలక పాత్ర పోషించాయి. ఆ కలం యోధుడే అల్లం నారాయణ. ఈ అక్షర సేనానితో ‘సాక్షి...మార్నింగ్ వాక్’. పేరు : అల్లం నారాయణ పుట్టిన తేదీ : 13 డిసెంబర్ 1959 తల్లిదండ్రులు : నర్సయ్య, బుచ్చమ్మ భార్య : పద్మ పిల్లలు : రవళి, భావన, రాహుల్ స్వస్థలం : గాజుల పల్లె, మంథని మండలం, కరీంనగర్ జీవితంలో గొప్ప సంతృప్తి: తెలంగాణ రాష్ర్ట ఆవిర్బావం బాగా ఇష్టమైన అంశం: పాత్రికేయుడిగా సుదీర్ఘపయనం. అభిరుచి : నిరంతరం పుస్తకాలు చదవడం నచ్చిన లెజెండ్స్ : చైనా విప్లవోద్యమ నిర్మాత మావో, గద్దర్, గోరటి వెంకన్నల పాటలు, శివసాగర్ కవిత్వం. నచ్చిన సినిమాలు : రష్యన్ దర్శకుడు తార్కోవిస్కీ తాత్విక సినిమాలు నచ్చిన వంటలు : మొక్కజొన్న పేలాలు, బెండకాయ కూర, సర్వపిండి సాక్షి, సిటీబ్యూరో: సుమారు ఐదు దశాబ్దాలు పైబడిన ప్రవాహ గానం. మట్టిని... మనిషిని... మానవ సంబంధాన్ని పట్టి నిలిపిన అక్షర అనుబంధం. కథ, నవల, పాట, పత్రికా రచనలను ప్రాణప్రదంగా భావించే పయనం అల్లం సోదరుల సొంతం. వీరికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రెక్కాడితేగానీ డొక్కాడని అల్లం నర్సయ్య, బుచ్చమ్మల ముగ్గురు కుమారులు వారు. సాహిత్యంలో నిప్పుల ఉప్పెనలు కురిపించిన అన్న అల్లం రాజయ్య... ఆ బాటనే నడిచిన అల్లం వీరయ్య, అల్లం నారాయణ లు. విప్లవకారుడిగా.. కవిగా... రచయితగా... సంపాదకుడిగా... తెలంగాణ ఉద్యమకారుడిగా అందరికీ సుపరిచితులైన అల్లం నారాయణ... తెలంగాణ రాష్ర్ట ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఎనిమిది నెలలు కావస్తోంది. ఈ నేపథ్యంలో తన అనుభవాలు.. భవిష్యత్తు ప్రణాళికలు ‘అల్లం’ మాటల్లోనే... ఉద్యమ జీవితం ఎమర్జెన్సీ చీకటి రోజులు. పారా మిలిటరీ పద ఘట్టనల కింద అన్ని తెలంగాణ పల్లెల్లాగే మా గాజుల పల్లె కూడా నలిగిపోతున్న సందర్భమది. కరీంనగర్ జిల్లా మంథనికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా పల్లె. అమ్మా, నాయనలకువ్యవ సాయమే ఆధార ం. ఇక చదువంటే అన్న రాజయ్యతోనే మొదలైంది. ఆయన బాటలోనే రెండో అన్న వీరయ్య, నేను నడిచినం. మా ముగ్గురి తోబుట్టువు సోదరి లక్ష్మి. మూడో తరగతి వరకే ఊళ్లో చదువుకున్న. ఆ తరువాత వెన్నంపల్లిలో ఐదు వరకు చదివిన. మంథనిలో పదో తరగతి పాసై ఇంటర్లో చేరే నాటికి చీకటి రోజులు వచ్చిపడ్డాయి. 1975లో ఇంటర్ మొదటి సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు. విప్లవోద్యమం వైపు వెళ్లాను. అప్పటి పరిస్థితులు అలాంటివి. కొంతకాలం పనిచేసిన తరువాత గంభీరావు పేటలో ఒక సంఘటనలో అరెస్టయ్యాను. 2 నెలల పాటు నిర్బంధం. ఆ తరువాత మరోసారి అరెస్టయి... ఎమర్జెన్సీ ఎత్తి వేయడంతో బయటకు వచ్చిన. తిరిగి అజ్ఞాతంలోకే వెళ్లిపోయిన. 1982లో బయటకు వచ్చిన తరువాత ఉస్మానియాలో ఎమ్మేలో చేరిన. 1984లో చదువు పూర్తయింది. ఉస్మానియాలో చదువుకొనే రోజుల్లోనే పద్మ, నేను స్టేజీ మ్యారేజ్ చేసుకున్నాం. కరీంనగర్ టౌన్లో ఆ రోజుల్లో మా పెళ్లి చర్చనీయాంశం. పైగా నా పెళ్లిలో నేనే వక్తను కావడం విశేషం. పత్రికా రంగంలోకి... ఉపాధి కోసం కొంత కాలం వ్యవసాయం చేసిన. కానీ గిట్టుబాటు కాలేదు. అదే సమయంలో కరీంనగర్ కేంద్రంగా విజయ్ కుమార్ సంపాదకత్వంలో వెలువడిన ‘జీవగడ్డ’ పత్రిక నాతో పాటు, మరికొంత మంది మిత్రులకు ఒక చక్కటి అవకాశం. నేను, చారి, ఘంటా చక్రపాణి అట్లా పరిచయమైన వాళ్లమే. ‘జీవగడ్డ’లో పని చేసే రోజుల్లోనే ‘వెన్నెల కోనల్లో’ శీర్షికతో కథనాలు రాసిన. ఆ తరువాత 1986లో బెంగళూరు, విజయవాడల్లో కొంతకాలం పత్రికా రంగంలో వివిధ బాధ్యతలు నిర్వర్తించా. 1989 నుంచి విధి నిర్వహణ హైదరాబాద్కు మారింది. ఇదంతా ఒకవైపు అయితే... ఉద్విగ్నభరితమైన తెలంగాణ ఉద్యమం మరోవైపు. ఈ ఉద్యమంలో ‘తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్’ (టీజేఎఫ్) చారిత్రక బాధ్యతను నిర్వర్తించింది. రాజకీయ వర్గాల్లో స్తబ్దత నెలకొన్నప్పుడు... కేంద్రం వైఖరిలో మార్పులు కనిపించినప్పుడు... నిరాశా నిస్పృహలతో విద్యార్థులు, యువత బలిదానాలకు పాల్పడుతున్నప్పుడు... ఆ వర్గాలను ముందుకు నడిపించడంలో టీజేఎఫ్ క్రియాశీల కర్తవ్యం నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గొప్ప సంతృప్తి అయితే... ఆ ఉద్యమంలో టీజేఎఫ్ పాత్ర అంతే ఉత్తేజకరమైన అనుభవం. ప్రెస్ అకాడమీ లక్ష్యాలు సుదీర్ఘ కాలం సాగిన తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది. కొంతమంది బలిదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అందరితో పాటు తమ బతుకులు బాగుపడతాయని విలేకరులూ ఆశలు పెట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాలు.. జిల్లా కేంద్రాలు... రాష్ట్ర రాజధానిలో వివిధ బాధ్యతల్లో పని చేసే వారికి ఎన్నో ఆశలు...ఆకాంక్షలు ఉన్నాయి. ఏ ఒక్కరి ఆశలను వమ్ము చేయబోం. ముఖ్యంగా హెల్త్కార్డులకు అప్పటి ఉమ్మడి ప్రభుత్వంలో కొంత కృషి జరిగింది. జర్నలిస్టులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్కార్డులు అందజేయాలనే ప్రతిపాదన ఉంది. సబ్ఎడిటర్లకూ అక్రిడిటేషన్లు అందించాలి.ప్రభుత్వం నుంచి లభించే ఈ గుర్తింపు ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా దక్కవలసిందే. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలోనూ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అ న్ని అంశాలపైనా ప్రత్యేక కార్యాచరణతో అకాడమీ ముందుకు వెళుతోంది. ముఖ్యమంత్రి వివిధ పనుల్లో తీరిక లేకుండా ఉండడం వల్ల అకాడమీ సమావేశం జరుగలేదు. త్వరలో సీఎంతో సమావేశమవుతాం. అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటాం. కొత్త రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి బాటలు పడతాయి. ‘ఆర్ట్ ఆఫ్ అకాడమీ’గా... తెలంగాణ ఆవిర్భావం వరకు వచ్చిన మొత్తం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కథనాలన్నింటినీ ఒక రిసోర్స్గా భద్రపర్చాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు, సాంస్కృతిక అణచివేతకు గురైన తెలంగాణ భాష, యాస, మాండలికాలకు కొత్త రాష్ట్రంలో ప్రాచుర్యం లభించవలసి ఉంది. ప్రత్యేకంగా తెలంగాణ పదకోశాన్ని రూపొందిస్తాం. భాషపై విస్తృతంగా సదస్సులు, వర్క్షాపులు ఏర్పాటు చే స్తాం. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ స్థాయిల్లో పని చేసే వారికి అవగాహన, నైపుణ్యం పెరిగేలా అత్యుత్తమ శిక్షణనిచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మొత్తంగా ప్రెస్ అకాడమీని ఒక ‘ఆర్ట్ ఆఫ్ అకాడమీ’గా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ప్రభుత్వంఉంది. -
అల్లం నారాయణతో మార్నింగ్ వాక్
-
అక్షర క్షిపణి
మనసొప్పు మాటలు.. చార్మినార్ హైదరాబాద్ ప్రతీక. నాలుగు బాహువులు చాచిన ఆ కట్టడం హైదరాబాద్ను కాపాడుతున్న ఒక చిహ్నం లాంటిది. ‘మత కల్లోలాలెన్ని చెలరేగినా మధ్యన చలించక నిలిచే/యోధానుయోధుడే/చార్మినార్’ అంటాడు అలిశెట్టి. హైదరాబాద్ ఎగ్జిబిషన్ మీద కూడా ఆయన ఒక సిటీలైఫ్ రాశాడు. ‘ఏముందీ ఎగ్జిబిషన్లో/ రేట్లూ ఎక్కువ/ గేట్లూ ఎక్కువ’ అంతేకదా! అట్లాగే సిటీ పోకడలు, ఇక్కడి ఫ్యాషన్లు, సినిమా స్టైళ్లు..వాటిని ఎకసెక్కం చేసే ‘ఎంతటి బాబ్డ్ హెయిరయినా/ మళ్లీ కొప్పు/ మనసొప్పు’ అని ఒక వ్యాఖ్యానంలా ఆయన కవిత్వం ఉండేది. ‘ఎవరీ హైహీల్స్/ బంజారాహిల్స్’ రెండే పదాలు. బంజారాహిల్స్లాంటి సంపన్నులు నివసించే ప్రాంతం మీద ఇంత చిట్టి కవిత్వం. ఇంత సారం ఉన్న కవిత్వం మరొకటి ఉండదేమో. అక్షరాలతో అగ్గిని పుట్టించిన కవుల నేపథ్యం కష్టాలే. సామాన్యుడి జీవనదారులను పెట్టుబడిదారులు కబ్జా చేస్తే.. ఆయుధమై మండే ఆకలికి ఆజ్యం పోసేది ఈ అక్షరాలే. ఈ కవితా కవనంలో క్షిపణులు పూయించిన యోధుడు అలిశెట్టి ప్రభాకర్. జగిత్యాలలో కవ్వించిన ఈ కవిత.. పట్నం వీధుల్లో స్వైరవిహారం చేసింది. రెండు దశాబ్దాలకుపైగా సిటీలైఫ్తో ముడిపడిన జీవితం నిర్ద్వంద్వంగా, నిర్భయంగా సాగింది. చిక్కడపల్లిలో 21 ఏళ్ల కిందటి దాకా అలిశెట్టి ప్రభాకర్ జీవించి ఉండేవాడు. పతంజలి ఒక గుడ్డివాడి పిల్లనగ్రోవి కథకు మూలమైన మూసీ వంతెన దాటాక, కుడివైపు సందరయ్య విజ్ఞాన కేంద్రానికి వెళ్లే దారిలో, ఇరువైపులా కంకబొంగుల ఆర్చీల మధ్యన ఒకానొక చిన్న ఇంట్లో మేడ మీద రెండు గదుల్లో ఆయన నివాసం. ప్రభాకర్ కూడా అంతే. నిలువెత్తు శరీరంలో ఛటాక్ మాంసం కూడా లేని కట్టెబద్దలా ఊగులాడుతూ తిరుగాడేవాడు. భాగ్య, ఇద్దరు పిల్లలు, దినాం ఇరవై నాలుగు గంటలూ ప్రవహించే దుమ్ము, గుమ్మం నుంచే పరుచుకుని ఉండే ఆయన చిత్రకళా సౌరభాలు, కవిత ్వం, పాత పుస్తకాలు, చెల్లాచెదురుగా పడి ఉండే బ్రష్షులూ, ఇంకులూ జీవితాంతం ఆయనను అంటిపెట్టుకుని ఉన్న దుమ్ము, ధూళి, దగ్గు, దమ్ము.. చివరి రోజుల్లో ప్రభాకర్ మరీ శిథిలమైన కాలమొకటి ఉండేది. అప్పుడు అక్కడికి కూతవేటు దూరంలో ఉండే (సూర్యానగర్, చిక్కడపల్లి) జయధీర్ తిరుమలరావు, యూనివర్సిటీలో ఉండే ఘంటా చక్రపాణి, శ్రీనగర్ కాలనీలో ఉండే నేనూ.. చివరి రోజుల్లో ఆయనను బతిమాలి బామాలి నిజాం వెంకటే శం నుంచి వరవరరావు దాకా అన్ని ప్రయత్నాలు చేసి ప్రభాకర్ టీబీ మీద యుద్ధం ప్రకటించినా.. ఆయన ఆ జబ్బుకు వెరవలేదు. కవిత్వం మీద తప్ప అన్నింటా నిర్లక్ష్యం, జీవన వైఫల్యం, లోపలి సంక్షోభం, జగిత్యాల వయా కరీంనగర్ హైదరాబాద్ వచ్చి చిక్కుల్లో పడ్డాననే అపరాధ భావన ఆయనను దేనికీ లొంగకుండా చేసింది. మందులు వాడినా, ఆ మందులు పని చేయని కాలంలో కూడా ప్రభాకర్ మొండిగా ఉండేవాడు. అందరూ చేతులు వేలాడేసినపుడు జయధీర్, ఘంటా, నేనూ ఆయన కోసం మళ్లీ ఒక కొత్త ప్రయత్నం చేసి ఓడిపోయాం. ఆ తర్వాత అతనొక చరిత్ర మాత్రమే. కానీ ఇదే నగరాన్ని, దాన్ని ప్లాస్టిక్ మొహాన్ని, దాని కుహనా విలువలనీ ఎండగడ్తూ పత్రికలో రోజూ కవిత్వం రాసి, ఒకదశలో అదే ఆయన జీవితం గడిచే సాధనం కావడం కూడా ఒక చరిత్రే. రోజూ ఈ సిటీ జిలుగువెలుగుల నర్మగర్భాన్ని చిత్రించిన ఆయన కవిత్వమే ‘సిటీలైఫ్’. అందరి అడ్డా.. పుట్టిన గడ్డనుంచి ఇక్కడికి రావడం పొరపాటైందని ప్రభాకర్ స్వీయ ప్రకటనలో రాసుకున్నారు. జగిత్యాలలో బతుకుదెరువు కోసం పెట్టుకున్న పూర్ణిమ ఫొటో స్టూడియో, కరీంనగర్లో ‘శిల్పి’ ఆయింది. జగిత్యాల కల్లోల పరిస్థితులు, కరీంనగర్లో కల్లోలాలతో కరచాలనం, సహవాసం ఆయన ను పుట్టిన గడ్డ మీద నిలువనీయలేదు. అనివార్యంగా హైదరాబాద్కు వచ్చి విద్యానగర్లో ‘చంద్రలేఖ’ అయ్యాడు ప్రభాకర్. యూనివర్సిటీకి వెళ్లే దారిలో, ఆంధ్ర మహిళాసభకు కొంత ముందు ఎదురుగా ప్రభాకర్ స్టూడియో ఉండేది. జిల్లాల నుంచీ, యూనివర్సిటీ నుంచీ వచ్చే పిల్లలకు అది అడ్డా. చాయ్లు, సమోసాలు, అన్నాలు. ప్రభాకర్ది గుంపు స్వభావం. మందిలో బతికాడు. ఇదే ఫొటో స్టూడియోతో అనుబంధం ఉన్న ‘వీరన్న’ ఆ తర్వాత ప్రభాకర్ని మించి క్రాస్రోడ్స్ దగ్గర ఒకానొక ఎదురుకాల్పులకు బలైపోయినవాడు. ప్రభాకర్ చుట్టూ మనుషులు వీళ్లు. నిప్పు కణికలు ‘సిటీలైఫ్’ కోసం ప్రభాకర్ బంజారాహిల్స్కు వచ్చేవాడు. అక్కడ ఆంధ్రజ్యోతి. సన్నగా, గాలిలా ఊగులాడుతూ గంపెడు జుట్టు, హిప్పీ కటింగ్, వంపు తిరిగిన మీసం, ఆయన రాకకోసం ప్రేమగా ఎదురుచూసే వర్ధెల్లి మురళి, వి.శ్రీనివాస్, రాంమోహన్ నాయుడు, సురేంద్రరాజు, కె.శ్రీనివాస్, అల్లం నారాయణ లాంటి పాత్రికేయులు. జన సంబంధాల్లో ఈ పాత్రికేయులే ప్రభాకర్కు చివరి అండ. ఈనాడు వెంకన్న, ఒక పాత్రికేయ సమూహం ఆయన ‘సిటీలైఫ్’ను మోసుకుని తిరిగేది. ఇదీ ప్రభాకర్ ఆవరణ. ఇదీ ప్రభాకర్ జీవితం. చురకలు, మంటలు, జెండాలు, సిటీలైఫ్.. అసహ్యకరమైన,, బురదమయమైన, జీవితాల నగ్న చిత్రణే సిటీలైఫ్. ఈ జీవితంలో ఉండే కాపట్యం, విలువల పతనం, ధ్వంసమైపోతున్న సమస్త మానవ విలువలు, హింసా రాజకీయాలు, నెత్తురూ, కన్నీరూ కలిపి ప్రవహించే అతి సామాన్యుడి జీవితం, ఎంతకూ వెలగని నిప్పు కణికల గురించిన స్పృహ ఆయన చిట్టి చిట్టి పద్యాల నిండా ఉండేవి. ఏదో ఒక సందర్భమో, ఆ రోజుకి ఆయనను కలచి వేసిన దృశ్యమో, పరిణామమో, మూడు వందల అరవైఐదు రోజులూ క్రమం తప్పకుండా ఆయనతో కవిత్వం రాయించింది. అల్ప పదాల్లో అనంతసారం ‘ఏ దేశం శిరసు మీద/ మోపిన/ పాదాలైనా/ హోదాలైనా/ సామ్రాజ్యవాదాలే’ అంతే కవిత్వం అయిపోయింది. ఇక మీరు ఏమి ఆలోచించాలో ఆలోచించండి. సామ్రాజ్యవాదాన్ని ఇంత సులభంగా కవిత్వంలోకి తేవడం సాధ్యమేనా? ఈ సిటీలైఫ్ ఎప్పటిది? కనీసం రెండున్నర దశాబ్దాల కిందటిది. సామ్రాజ్యవాదం సారాన్ని ఈ నాలుగు మాటలు చెప్పినంత శక్తిమంతంగా మరెవరన్నా చెప్పగలిగారా? అదే అలిశెట్టి ప్రభాకర్ కవిత్వ సారం. కావ్య లక్షణాలూ, ప్రమాణ పాండిత్యాలు, రూపశైలీ విన్యాసాలు జానేదేవ్. ఇంత సులభంగా అల్ప పదాల్లో అనంత సారం. పాట మీద నిర్బంధం సమయంలో ప్రభాకర్ ‘గొంతు కోస్తే/ పాట ఆగిపోదు/ అది ముక్తకంఠం/ గొలుసులేస్తే/ పోరు నిలిచిపోదు/ అది ప్రజాయుద్ధం’ అంటాడు. సామాన్యుడి కవి.. హైదరాబాద్ ఇరవై ఏళ్ల కింద ఇప్పటిలా ఉండేది కాదు. ఇప్పుడు ప్రాభవంతో, మాల్స్తో, మైమరిపించే గాజు అద్దాల ఊదారంగు ఆఫీసుల్తో, నిత్య నరకంలా ఉండే కిక్కిరిసిన రోడ్లతో, కాంక్రీట్ జనారణ్యంలా అప్పటికింకా మారలేదు. కోఠి, సుల్తాన్బజార్, అబిడ్స్ మాత్రమే అప్పుడు పెద్ద వ్యాపార కేంద్రాలు. మంది తిరిగే ప్రాంతాలు. ‘సాయంత్రం/సుల్తాన్బజార్/ స్త్రీల సెలయేరు/ ఆ రంగురంగుల మెరిసే గులకరాళ్లే/ కలవారు’ అని సుల్తాన్ బజార్ను వర్ణిస్తాడు అలిశెట్టి. ‘ఎందుకురా కవీ/ గజిబిజి ఇమేజీ/ అస్పష్ట కవిత్వం కన్నా/ ఆల్జీబ్రా ఈజీ’ అని కవిత్వం సులభంగా, అర్థమయ్యేట్లుగా ఉండాలనే సామాన్యుడి కవి ప్రభాకర్. పదునైన మాట.. పసందైన గీత.. కవిత్వం రాయడమే కాదు. ఆ కవిత్వాన్ని సామాన్యుల చెంతకు, యూనివర్సిటీలకు మోసుకువెళ్లి ప్రజల పరం చేయడానికి ఒంటిచేత్తో సాహసం చేసి గెలిచినవాడు కూడా ప్రభాకర్. అలిశెట్టి చిత్రకారుడు కూడా. తన చిట్టిపొట్టి కవితలకు తనే బొమ్మలేసుకుని, వాటిని ఫొటోస్టాట్ కాపీలు చేసి ఒక తాడుకు కట్టి ఆర్ట్స్ కాలేజీలో వేలాడదీసి కవితా, కళా ప్రదర్శన పెట్టేవాడు. యూనివర్సిటీలు ఆయన కవితానామస్మరణ చేసేవి. ఆర్ట్స్ కాలేజీలో ఒక ప్రదర్శన. అప్పుడు వాతావరణం కూడా అనుకూలమైన ఉద్యమ వాతావరణం. ఏ రాజకీయాలకు సంబంధం లేనివాళ్లు, ఏ అవగాహనలూ, ప్రాపంచిక దృక్పథాలు లేనివాళ్లు కూడా ప్రభాకర్ కవిత్వసారాన్ని మనసున పట్టించుకునే వాళ్లు. కవిత్వమంటేనే జోకులేసే కాలంలో ఆయన కవిత్వాన్ని మౌఖిక సాహిత్యం వలే ఊరూరా తిరిగి ప్రచారం చేయగలిగారు. ‘పేదవాడికి అందనివి/ చెందనివి/ మచ్చుకు రెండు/ జూబ్లీహిల్స్ రాయి/ కృష్ణా ఒబెరాయి’.. శ్రీమంతం కుప్పబోసి, కేంద్రీకృతమైన జూబ్లీహిల్స్, అప్పుడప్పుడే వెలుస్తున్న ఫైవ్స్టార్ సంస్కృతి మీద ఇది ఆయన పదునైన కవిత. సోవియట్ రష్యా పతనం అవుతున్న క్రమంలో గోర్బచెవ్ తెచ్చిన ‘బాహాటత’ మీద ప్రభాకర్ సిటీలైఫ్ ఇది.. ‘ఇప్పుడిప్పుడే సోవియట్ అందాలు/ విరజిమ్ముతోంది/ గ్లాసు కోస్తు/ గోర్బచ్చేవా’అని రాశాడు ఆయన. సమకాలిక స్పృహ, సహజ స్వభావంగా వచ్చిన నగర కృత్రిమతల వ్యతిరేకత, ప్రాపంచిక దృక్పథం వీడని భావజాల ప్రపంచం, సిటీ మర్మాల మీద ఆయన ఝళిపించిన కొరడాయే ఆయన కవిత్వం. మోడర్న్ ఆర్ట్ గ్యాలరీలో కనిపిస్తే ఒక ఖాళీ (ఫ్రేమ్) చిత్రమేముంది మిత్రమా ఊహించుకో అది గాలి (టైటిల్) అని వెక్కిరిస్తాడు. కోట్ల విలువ.. అలిశెట్టి ప్రభాకర్ జీవితమే కవిత్వంగా బతికినవాడు. సిద్ధార్థుడు వదిలివెళ్లిన ఈ రాజ్యం మీద నెత్తుటిధారలు కడిగేందుకు కవిత్వం ఆయనకు అవసరమైన ఆయుధమైంది. సిటీలైఫ్ ప్రభాకర్ సమగ్ర కవితా స్వరూపానికి కొలబద్ద కాదుగానీ, ఆయనను ఆదుకొని అన్నం పెట్టిన కవితారూపమైంది. ఫొటో స్టూడియోలు, చిత్రకళ ఆయనను బతికించలేదు. కవిత్వమే ఊపిరిగా బతికిన అలిశెట్టి ‘కోట్’ లేకుండా వార్తలు లేవు. వ్యాసాలు లేవు. ‘తాను శవమై/ తనువు వశమై/ తాను పుండై/ అందరికీ పండై’ అన్న కవితను ఎందరు ఎన్నిసార్లు వాడుకున్నారో లెక్కలేదు. గోడ మీద ఆయన కవిత్వ నినాదమయ్యాడు. ఒక ప్రవాసిలాగా తప్పిపోయిన పిల్లవానిలాగా ఈ సిటీ వెలుగుల వెనుక చీకట్ల సారాన్ని ఒడిసిపట్టిన ‘సిటీలైఫ్’ కవి పుట్టినరోజు, వ ర్ధంతి రోజు ఇవ్వాళ. జనవరి 12. ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత కూడా ఆయన ప్రాసంగికుడే. ఒక నమూనాయే. తెలంగాణ జీవన నేపథ్యం, కల్లోలాల నుంచి ఎదిగివచ్చిన ప్రభాకర్ చివరిరోజు అదే చిక్కడపల్లి ఇంట్లో తెల్లారింది. ఒకానొక రాత్రిపూట చాపమీద భారంగా పడుకుని ఉన్న ఆయన పార్ధివదేహం ముందు భాగ్య, పద్మ, వి.శ్రీనివాస్, నేనూ నిశ్శబ్దంగా ఆ రాత్రి గడిపిన విషాదక్షణాల యాది. తెల్లవారి ప్రభాకర్ కోసం ఒక జన సమూహం వచ్చింది. ఎర్రజెండా కప్పి చిక్కడపల్లి నుంచి అంబర్పేట దాకా పెద్ద ఊరేగింపు. గుండె ఉండాల్సిన చోట ఉంచుకొని బతికిన ప్రభాకర్ను తలుచుకున్నప్పుడల్లా గుండె తొలగుతున్న వర్తమానంలా మనాది. -
గ్రామీణ జర్నలిస్టులకూ హెల్త్కార్డులు
గజ్వేల్/నర్సాపూర్ రూరల్ : తెలంగాణలోని గ్రామీణ జర్నలిస్టులకు త్వరలోనే ప్రభుత్వం హెల్త్కార్డులు అందించనున్నదని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ వేగంగా జరుగుతోందని ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం నారాయణ వెల్లడించారు. సోమవారం ఆయన గజ్వేల్, నర్సాపూర్లలో ఆయన పర్యటించారు. గజ్వేల్లోని శ్రీలక్ష్మీ గార్డెన్స్లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే గజ్వేల్ నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో టీజేఎఫ్ (తెలంగాణ జర్నలిస్టుల ఫోరం)గా 13 ఏళ్ల పాటు కీలకపాత్రను పోషించిన ఘనత ప్రస్తుత టీయూడబ్ల్యూజేదని చెప్పారు. తమ సంఘం ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి ఫలితంగా నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత కార్పొరేట్ విద్య అందుతుందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ పథకం అన్ని జిల్లాలకు వర్తిస్తుందని చెప్పారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్ మాట్లాడుతూ టీజేఎఫ్పై ఎన్నో రకాల కుట్రలు కొనసాగినా అధిగమించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేసినట్లు వెల్లడించారు. సమావేశంలో గజ్వేల్ ఏరియా డెవలెప్మెంట్ అథారిటీ ఓఎస్డీ హనుమంతరావు, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ అరుణ, టీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా విభాగం అధ్యక్షులు రమణ, మెదక్ జిల్లా శాఖ అధ్యక్షులు విష్ణువర్దన్రెడ్డి, గౌరవాధ్యక్షులు జానకీరాం, ప్రధాన కార్యదర్శి యాదగిరి, కోశాధికారి మారుతీప్రసాద్, గజ్వేల్ నియోజకవర్గ బాధ్యులు ఉస్మాన్పఠాన్, నవీన్, మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమన్వయంతోనే సమస్యలు పరిష్కారం జర్నలిస్టులంతా ఐక్యంగా ఉంటూ సమన్వయంతో సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. సోమవారం నర్సాపూర్ నియోజకవర్గ టీయూడబ్ల్యూజే సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నర్సాపూర్లో ప్రెస్క్లబ్ ఏర్పాటును అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. టీయూడబ్ల్యూజే 2001 నుంచి 2014 తెలంగాణ వచ్చే వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొందన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న జర్నలిస్టులను ప్రభుత్వం మరిచిపోదన్నారు. అంతకు ముందు నర్సాపూర్ ప్రెస్క్లబ్ను అల్లం నారాయణ ప్రారంభించారు. నర్సాపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అల్లం నారాయణతో పాటు జెడ్పీ చైర్పర్సన్ రాజమణి , ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఇతర టీయుడబ్ల్యూజే రాష్ట్ర, జిల్లా నాయకులను మెమోంటో, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాం తికిరణ్, రమణ, వీ వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదగిరి, యోగానందరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మురళీయాదవ్, తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, టీయుడబ్ల్యూజే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జీ భిక్షపతి, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
వారం రోజుల్లో జర్నలిస్టులకు హెల్త్కార్డులు
సూర్యాపేటరూరల్ : జర్నలిస్టులకు హెల్త్కార్డుల జారీ ప్రక్రియ వారం రోజు ల్లో ప్రారంభం కానుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలి పారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తూ సూర్యాపేట మండలం రాయినిగూడెం సమీపంలోని సెవెన్ఆర్ హోటల్ వద్ద ఆగారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టులతో పాటు వారి తల్లిదండ్రులకు సైతం ప్రయోజనం చేకూరేలా హెల్త్కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. ఈ సందర్బంగా టీయూజేఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి వజ్జే వీరయ్య ఆధ్వర్యంలో అల్లం నారాయణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, మల్లిఖార్జున్, చారి, చెంచల లక్ష్మణ్, పాష, సయ్యద్ మోహినుద్దీన్, భూపతి నారాయణ, ఎడ్వర్డ్, పెరిక సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
కలల బాటసారి విజ్జన్న యాది...
జర్నలిస్టుల గురువుకి నివాళి కరీంనగర్ చరిత్ర పొడవునా ఏ కొత్త కల కంటే ఆ కల వెంట నడిచిన బాటసారి విజ్జన్న గురించి మాట్లాడటమంటే విద్యార్థుల, బుద్ధిజీవుల కలల ప్రపంచం గురించి మాట్లాడటమే. తెలంగాణలో మామూలు మనుషులు మహా మనుషులైన, ఒక చరిత్ర క్రమం గురించి మాట్లాడటమే. ముందరి లాకప్ గది లో చేతులు పైకి కట్టేసి, లాకప్ పదమూడు సలాకలకు వేలాడదీసిన ఒక మనిషి. ఆ మనిషి నిద్రపోకుండా ఉండేందుకు లాకప్ ముందర నీళ్ల బకెట్. ఆ మనిషి కనురెప్పలు మూతబడితే ముఖం మీద చిమ్మే నీళ్లు. అదొక చిత్ర హింస రూపం. అత్యయిక స్థితి. దేశమే జైలయిన కాలం. ఈ కాలాన్ని కంటి రెప్పల కింద పొదువుకొని కాపాడుకున్న వాడే భాగ్యనగరి విజయకుమార్. ఆరోపణ నక్సల్బరీ. కొట్టీ కొట్టీ విసిగిపోయి లాక ప్కు వేలాడదీసి చిత్రహింసలు పెట్టారు. కానీ తను చెప్పేందుకేమీ లేదు. ఎదురుగా లాకప్లో వెన్ను మీద పోలీసులు కాల్చిన నెత్తుటి గాయంతో చిన్న (నారదాసు) లక్ష్మణ్రావు, పోరెడ్డి వెంకటరెడ్డి, మల్లా రాజిరెడ్డి, పున్నయ్య, జి. నారాయణరెడ్డి, శని గరం వెంకటేశ్వరు, అల్లం నారాయణ. విజయ్కు మార్ కరీంనగర్ చిన్నాపెద్దలకు విజ్జన్న. జిల్లా రాజ కీయాల కేంద్ర బిందువు. అది 1976 నాటి మాట. కాలం మారింది. తొమ్మిదేళ్ల తర్వాత కరీంనగర్ శాస్త్రి రోడ్డు చివర పాత బజారు చౌరస్తాలో ఓ మూ లన ఒక గూనకప్పటిల్లు. లోపల నాలుగు టేబుళ్లు, న్యూస్ప్రింట్ రఫ్ ప్యాడ్లు. సాయంత్రానికల్లా ఆ ఇల్లు కలకలలాడేది. అప్పుడదొక కరీంనగర్ సాం స్కృతిక కేంద్రం. రాజకీయాల అడ్డా. అంతర్జాలా లేవీ లేకుండానే అంగుటిలో అంతర్జాతీయ భావజా లాల నుంచి భావి భారతాల దాకా చర్చలు. ఛాయ్ లు. అది విజ్జన్న స్థాపించిన జీవగడ్డ దినపత్రిక కార్యాలయం. ఆ ఆఫీసు ఇప్పటికీ అట్లాగే ఉన్నది. కరీంనగర్ విస్తరించింది. కానీ దాని పాతదనం అట్లాగే ఉన్నది. ఇప్పుడా మనిషి కరీంనగర్ కొత్త కలల నిర్మాత. ప్రత్యేక తెలంగాణ నుంచి ఎగసి వచ్చిన చైతన్యాన్ని నక్సల్బరీలో కొనసాగించి విప్ల వాల కలలుగన్న క్రాంతిదర్శి, జిల్లాలో ఇప్పటి పేరు గాంచిన జర్నలిస్టుల గురువు. పెన్నుపట్టి రాయిం చిన పెద్ద మనిషి. కరీంనగర్ చరిత్ర పొడవునా ఏ కొత్త కల కంటే ఆ కల వెంట నడిచిన బాటసారి మొ న్న కూలిపోయాడు. ఆరేళ్లుగా పార్కిన్సన్తో మాట లు దాటి రాక, పెదాల మధ్య శబ్దాలు వెలికిరాక, నిశ్శబ్దంగా బతికిన ఆ అమ్మ చెట్టు కూలిపోయింది. విజ్జన్న మహా నిశ్శబ్దంలోకి వెళ్లిపోయాడు. వర్తమానం. ప్రెస్ భవన్. కలెక్టర్ భవనం ముందరి ఆ ప్రెస్ భవన్కు ఆయన పునాదులేశాడు. తన రెండురెక్కల కష్టాన్ని కూడా చేర్చి పూర్తి చేశాడు. ఎన్నో తలపోతలకు, కలెబోతలకు, తండ్లాటలకు తెలంగాణ మలి ఉద్యమ మహాగర్జనలకు వేదికగా నిలిచిన ప్రెస్ భవన్ హాలులో స్టేజి మీద ఒంటరిగా పరుండి ఉన్నాడు విజ్జన్న. మొఖం నిర్మలంగా ఉన్న ది. సబితా టీచర్ ఏడుస్తున్నది. ఇల్లులేని తనం. చివరకు తాను కట్టిచ్చిన ప్రెస్భవనే విజ్జన్న ఆఖరి మజిలీ వేదికైంది. చాలదా దుక్కానికి. జర్నలిస్టు ప్రపంచాని ఓనమాలు దిద్దించిన వాడు. జర్నలిస్టు ఉద్యమానికి దారులు వేసినవాడు. గతంలో ఇల్లు, ప్రింటింగ్ ప్రెస్ కలిగి ఉన్నవాడు. చివరికిలా ఒక నిర్వాసితుని మాదిరి, ఇల్లు కూడా లేని ఒక అతి సామాన్యుని మాదిరి. అదే విజయ్కుమార్ జీవితం. అదే ఆయన పాటించిన విలువ. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదటిసారి విఫ లమైన తర్వాత నక్సల్బరీ రాజకీయాలను కరీం నగర్కు తెచ్చిన వాడు విజయ్కుమార్. విద్యుల్లత విజ్జన్న నడిపిన మొదటి పత్రిక. అది సృజనకన్నా పాపులర్ అయిన కాలం ఒకటుండేది. వరవరరావు అప్పటి నుంచీ ఆయన గురువే. గోపు లింగారెడ్డి, వెంకట్రెడ్డి, నల్ల మల్లారెడ్డి, ముప్పాళ్ల నర్సింహా రావు మొట్టమొదటి కథల సంకలనం ‘బద్లా’ గానం చేశారు. తిరుగుబాటు కథల చరిత్ర అక్కడే ప్రారంభమైంది. అప్పుడు నిషేధించిన ‘మార్స్’ కవి తా సంకలనం, సాహసంతో అచ్చువేసిన వాడు విజ య్కుమార్. ఏంజెలో కాట్రొచ్చీచ్చీ ‘ది బిగినింగ్ ఆఫ్ ఎండ్’ను శ్రీశ్రీ ‘రెక్కవిప్పిన రెవల్యూషన్’గా అను వదిస్తే అచ్చువేసిన వాడూ ఆయనే. ఆ రకంగా విప్ల వోద్యమ సాహిత్యం, విరసం ఏర్పడిన తర్వాత సృజనతోపాటు విద్యుల్లతయైన తొలినాళ్ల సాహిత్యో ద్యమ సారథి విజయ్కుమార్. అందుకాయన చిత్ర హింసలు అనుభవించాడు. ఉన్న ప్రింటింగ్ ప్రెస్ నూ అమ్ముకున్నాడు. ఎమర్జెన్సీ చీకటి రోజులనూ అనుభవించాడు. ఆ తర్వాత బహిరంగ జీవితంలో ఉంటూనే తన పరిమితుల్లో ప్రగతిశీల గామిగా, ప్రజాస్వామ్య వాదిగా, స్నాప్నికునిగా జర్నలిస్టు ఉద్యమ నిర్మాతగా బహుముఖంగా విస్తరించిన విజ్జన్న అందరికీ కావలసిన వాడు. తొలి తెలంగాణ నుంచి మలి తెలంగాణ దాకా ఉద్యమ కేతనం అయిందీ ఆయనే. నిజంగానే కరీంనగర్ చరిత్రతో, అది నడిచిన అన్ని దారులతో, అది ఎదిగిన అన్ని రకాల ప్రభావాలతోనూ జీవగడ్డ విజయ్కుమార్ సజీవంగా ఉంటాడు. కరీంనగర్ జీవగడ్డ విజ్జన్న యాది చిరకాలం ఉంటుంది. కమాన్ మీద పేరై నిలుస్తుంది. నిజమే. విజ్జన్న మరి లేడు. ఆయన జ్ఞాపకం ఉంది. ఉండాలి. నిలబడాలి. ఈ నాలుగక్ష రాల భిక్ష పెట్టిన విజ్జన్నకు కన్నీటి నివాళి. వ్యాసకర్త రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్) -అల్లం నారాయణ -
బాధ్యతాయుతంగా పనిచేయాలి
గోదావరిఖని : జర్నలిస్టులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. శనివారం గోదావరిఖని ప్రెస్క్లబ్ సర్వసభ్య సమావేశం అనంతరం ‘తెలంగాణలో మీడియా- సవాళ్లు’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు, అక్రిడిటేషన్కార్డులు, హెల్త్కార్డుల జారీ, ఇతర సమస్యలు పరిష్కరించేందుకు చొరవచూపాలని, లేకపోతే వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర అనిర్వచనీయమైందని, రాష్ట్రం ఏర్పడినందున పునర్నిర్మాణం కోసం అదే స్ఫూర్తితో పాటుపడాలని, తెలంగాణలో నిలిపివేసిన రెండు చానెళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని ఎంఎస్వోలను కోరారు. తెలంగాణ సమాజాన్ని అస్థిర పరిచేందుకు ఆంధ్రా మీడియా కుట్రపన్నుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం ముందుకురాని సమయంలో బతుకమ్మ పండుగ అంటే ఏమిటో మీడియా చానెళ్లకు తెలియదని, గతేడాదితో ప్రపంచానికి బతుకమ్మ పండుగ విశిష్టత తెలిసిందన్నారు. అనంతరం ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో అల్లం నారాయణను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి సన్మానపత్రాన్ని, జ్ఞాపికను అందజేశారు. ప్రెస్క్లబ్ అధ్యక్షుడు మాదాసు రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు పల్లె రవికుమార్, పిట్టల శ్రీశైలం, ఇస్మాయిల్, కొరివి వెంకటస్వామి, జిల్లా అధ్యక్షులు విజయసింహారావు, అడెపు లక్ష్మీనారాయణ, సీనియర్ జర్నలిస్టులు ఎస్.కుమార్, భాగ్యనగర్ భాస్కర్కుమార్, సంజీవ్రెడ్డి, కార్పొరేటర్ బొమ్మక శైలజ- రాజేశ్, క్లబ్ ప్రధాన కార్యదర్శి నాగపురి సత్యం, అల్లంకి లచ్చయ్య, పి.శ్యాంసుందర్, ఎ.రవీందర్రెడ్డి, జక్కం సత్యనారాయణ, దయానంద్గాంధీ, రాంశంకర్, పూదరి కుమార్, తగరపు శంకర్, విజయ్కుమార్, రమణ, కె.ఎస్.వాసు, ముచ్చకుర్తి కుమార్, కె.మధుకర్, చంద్రశేఖర్రెడ్డి, కోడం రాజు, న్యాతరి అంజయ్య, మధుబాబు, దబ్బెట శంకర్, జి.శ్యాంసుందర్ పాల్గొన్నారు. అంతకుముందు గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుంచి ప్రెస్క్లబ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించగా స్థానిక కార్పొరేటర్ బొమ్మక శైలజ ఆధ్వర్యంలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం క్లబ్ ఆవరణలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే నాయకులు మొక్కలు నాటారు. -
చిన్న పత్రికలకు అండగా నిలుస్తాం
ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా పత్రికలకు అండగా నిలుస్తామని ప్రెస్ అకాడమీ చైర్మన్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (టీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు అల్లం నారాయణ హామీ ఇచ్చారు. శనివారం ప్రెస్ అకాడమీలో జరిగిన తెలంగాణ చిన్న, మధ్య తరహా దినపత్రికల సమస్యల చర్చా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 13న చిన్నపత్రికల సమస్యలపై సీఎంతో చర్చలు జరిపే అవకాశం ఉంద ని, ఈలోపు పత్రికాసంఘాలన్నీ ఒకేగొడుకు కిందికి రావాలని అల్లం సూచించారు. -
తెలంగాణలో జర్నలిస్టుల సంఘం ఒక్కటే..
టీయూడబ్ల్యూజే మినహా మరొకటి రిజిస్టర్ కాలేదు జిల్లా మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హన్మకొండ సిటీ : తెలంగాణ రాష్ట్రంలో ‘తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే)’ మాత్రమే ఉందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్పష్టం చేశారు. రాష్ర్టంలో ఇది తప్ప మరే సంఘం రిజిష్టర్ కాలేదని ఆయన పేర్కొన్నారు. హన్మకొండలోని నందన గార్డెన్స్లో టీయూడబ్ల్యూజే జిల్లా ప్రథ మ మహాసభ ఆదివారం జరిగింది. ఈ సభలో నారాయణ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజేది, ఆ యూనియన్ నాయకులది గతించిన కాలమన్నారు. జర్నలి స్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. అలాగే, జర్నలిస్టులందరికీ హెల్త్కార్డులు, ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు అందించేలా చూస్తామని, ప్రభుత్వం ఇవ్వకపోతే పోరాడైనా సాధించుకుంటామని తెలిపారు. కాగా, ఎంఎస్ఓలు నిలుపుదల చేసిన రెండు చానళ్ల పునః ప్రసారానికి ప్రభుత్వం చర్య లు తీసుకోవాలని ఆయన కోరారు. ముల్లు కర్రలా పని చేయాలి జర్నలిజం, జర్నలిస్టులు ముల్లు కర్రలా పని చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య సూచించా రు. ప్రజాప్రతినిధులు, అధికారులను మే ల్కొలిపేలా కథనాలు రాయాలని, వ్యక్తిగత విమర్శలకు తావివ్వొద్దని కోరారు. ఉద్యమానికి అండదండ తెలంగాణ ఉద్యమానికి జర్నలిస్టులు అం డదందండలు అందించారని స్పీకర్ సిరి కొండ మధుసూదనాచారి కొనియాడా రు. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులు రాష్ర్ట అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు. ఎం పీలు అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ తెలంగాణకు టీడీపీ పక్కలో బల్లెంలా తయారైందని దుయ్యబట్టారు. మరో ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడు తూ గ్రామీణ విలేకరులకు కనీస వేతనం అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యేలు శంకర్నాయక్, అరూరి రమేష్ మాట్లాడుతూ తమ ని యోజకవర్గంలోని విలేకరులకు ఇళ్ల స్థలా లు అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా 26 తీర్మానాలతో కూడిన వరంగల్ డిక్లరేషన్ను విడుదల చేశారు. ఈ మహాసభలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్తో పాటు రమణ, పల్లె రవి, రమేష్, పి.శ్రీశైలం, శైలేష్రెడ్డి, ఇస్మాయిల్, కొండల్రావు, దొంతు రమేష్, నూర శ్రీనివాస్, లెనిన్, శంకర్రావు, పెరుమాండ్ల వెం కటేశ్వర్లు, బి.శ్రీనివాస్, జయప్రకాష్ నారాయణ్, యోగి, అనిల్కుమార్, సాయిప్రదీప్, శ్యాం, రాఘవేందర్ పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గం ఎన్నిక టీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కె.అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా నవాబ్ ఎన్నికయ్యారు. మిగతా కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. -
సినీ పరిశ్రమను శాసిస్తోంది ఆ నాలుగు కుటుంబాలే
ఇప్పటికైనా బయటపడితే మంచిది సాంస్కృతిక ఆధిపత్యం సినిమాతోనే మొదలైంది ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ బంజారాహిల్స్: సినిమా ప్రభావశీల మాధ్యమమని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. తెలంగాణపై సాంస్కృతిక ఆధిపత్యం సినిమా ద్వారానే మొదలైందని తెలి పారు. ఈ పరిశ్రమను శాసిస్తోన్న నాలుగు కుటుంబాల కబంధ హస్తాల నుంచి బయట పడినప్పుడే తెలంగాణ సినిమా మనగలుగుతుందని చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని ఫిలిమ్ చాంబర్ కార్యాలయంలో తెలంగాణ ఫిలిమ్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్లం నారాయణను సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిమ్ జర్నలిస్టు అసోసియేషన్ లోగోను అల్లం, వెబ్సైట్ను సుప్రసిద్ధ దర్శకుడు బి.నర్సింగరావు ఆవిష్కరించారు. అల్లం నారాయణ మాట్లాడుతూ సినిమాకు మన భాష, యాస, ప్రవర్తనలను మార్చగలిగే శక్తి ఉందన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని చాటుతూ సినిమాలు రూపొందించడానికి దర్శక నిర్మాతలు ముందుకు రావాలని సూచించారు. మాభూమి వంటి సినిమాలను చూస్తే తెలంగాణ ఆత్మను అర్థం చేసుకోవచ్చన్నారు. తెలుగు సినీ రంగంలో విషనాగులు ఉన్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో సినీ నటులు, దర్శకులు ఆర్.నారాయణమూర్తి, టీఈఎంజేయూ అధ్యక్షుడు రమణ, టి దర్శకుల సంఘం అధ్యక్షులు శ్రీధర్, టి ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
ప్రెస్ అకాడమీ చైర్మన్గా అల్లం నారాయణ బాధ్యతల స్వీకారం
సీమాంధ్ర మీడియా చిన్నచూపు చూడకుండా కృషిచేస్తానని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జర్నలిస్టులపై సీమాంధ్ర మీడియా చిన్నచూపు చూడకుండా ఆయా సంస్థలతో చర్చించేందుకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్, సీనియర్ సంపాదకుడు అల్లం నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కొన్ని సీమాంధ్ర మీడియా గ్రూప్లు తెలంగాణ ప్రజల యాస, భాషపై వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. సోమవారం నాంపల్లి చాపెల్ రోడ్డులోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో ఆయన తెలంగాణ ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులకు సరైన ప్రోత్సాహం, గౌరవం లభించే విధంగా సీమాంధ్ర మీడియా యజమానులతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చలు జరుపుతానని తెలిపారు. మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టుల తరఫున ఉద్యమ నాయకుడిగా ఎనలేని కృషి చేసిన అల్లం నారాయణకు సీఎం కేసీఆర్ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. -
ప్రెస్ అకాడమీ చైర్మన్గా నేడు అల్లం నారాయణ బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ప్రముఖ పాత్రికేయుడు అల్లం నారాయణ ఈనెల 14న బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ చాపెల్రోడ్డులోని అకాడమీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రముఖులు పాల్గొంటారు. బాధ్యతలు స్వీకరించే ముందు అల్లం నారాయణ తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందున్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద ఆయన నివాళులు అర్పించనున్నారు. -
ఉద్యమంలో జర్నలిస్టులది కీలక పాత్ర
తెలంగాణ పునర్నిర్మాణంలో పాల్గొనండి హోంమంత్రి నాయిని పిలుపు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కొనియాడారు. సమాజాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రూ. 10 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. ఆదివారం పీర్జాదిగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా ప్రథమ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన పాత్రికేయులు తెలంగాణ పునర్నిర్మాణంలోనూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. 1969 నాటి ఉద్యమంలో తాను 30 సార్లు జైలుకెళ్లానని, అప్పుడు 369 మంది విద్యార్థులు అమరులయ్యారని తెలిపారు. చంద్రబాబు సీమాంధ్రలో సీఎం అయినందుకే వర్షాలు పడడం లేదని, ఆ గాలి తెలంగాణకు కూడా సోకి ఇక్కడా అదే పరిస్థితి తలెత్తిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టుల కోసం ఓ భవనం నిర్మించి ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు తెలంగాణపై విషపు వార్తలు రాస్తున్నాయని ఆరోపించారు. ప్రతి జర్నలిస్టుకు 250 గజాల స్థలం కేటాయించాలని, డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అలాగే అర్థాంతరంగా మృత్యువాత పడిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.10 లక్షలు చెల్లించాలని, ఉద్యోగ విరమణ తరువాత జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి, ఘట్కేసర్ జడ్పీటీసీ సభ్యుడు మంద సంజీవ్రెడ్డి, జర్నలిస్టుల నాయకులు పల్లె రవి, క్రాంతి కిరణ్, ఎం.వి. రమణ , బాలసాగర్, శైలేష్రెడ్డి, శేఖర్సాగర్, వెల్లంకి జయపాల్రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పోరాటాల ఫలితమే తెలంగాణ
జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం తెలంగాణ ఉద్యమంలో ఓరుగల్లుది కీలకపాత్ర టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ హన్మకొండ సిటీ, న్యూస్లైన్ : ఉద్యమకారులు, ప్రజల నిరవధిక పోరాటాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ర్ట కన్వీనర్ అల్లం నారాయణ అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు అందించిన సేవలు ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. పార్లమెం ట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడాన్ని పురస్కరించుకుని టీజేఎఫ్ ఆధ్వర్యంలో శనివారం జర్నలిస్టులు నగరంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ, ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు. అనంత రం జర్నలిస్టులు తెలంగాణ ఆటపాటలతో ర్యాలీ నిర్వహిం చి, కాళోజీ విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు, తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిం దన్నారు. అలాగే బీజేపీ ముందు నుంచి చెప్పిన మాట పై నిలబడిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీతో పాటు అన్ని జేఏసీలు, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలు కలిసి వచ్చాయన్నారు. ఎంఎల్ పార్టీలు, మావోయిస్టు పార్టీ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేశాయని, న్యాయవాదులు కూడా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారని తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఓరుగల్లు జిల్లా ప్రజలు కీలకపాత్ర పోషించారని, స్వరాష్ట్ర సాధన కోసం రాజకీయాలకతీతంగా ఇక్కడి వారంతా ఐక్యంగా ఉద్యమించారన్నారు. ప్రధానంగా జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజలను చైతన్యం చేశారని, రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న సీమాంధ్ర పక్షపాతి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి జిల్లాలోని రాయినిగూడెంలో ముచ్చెమటలు పట్టించారని చెప్పారు. ఉద్యమానికి అండగా నిలిచారు : పరిటాల మలిదశ తెలంగాణ ఉద్యమానికి జర్నలిస్టులు అండగా నిలి చారని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు అన్నారు. ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన జర్నలి స్టులు చిరకాలం గుర్తుంటారని పేర్కొన్నారు. తెలం గాణ పునర్నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావా ల న్నారు. ర్యాలీలో టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్కుమార్, నగర అధ్యక్షుడు రాంకిషన్, ప్రధాన కార్యదర్శి సోమయ్య, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జగన్మోహన్రావు, కళాకారుల జేఏసీ జిల్లా కన్వీనర్ దారా దేవేందర్, కళాకారుడు గద్దర్ సాంబయ్య, తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కోశాధికారి రమణ, జిల్లా కన్వీనర్ కూన మహేందర్, నాయకులు గటిక విజయ్కుమార్, బీఆర్ లెనిన్, పీవీ.కొండల్రావు, దొంతు రమేష్, నూర శ్రీనివాస్, సుధాకర్, ప్రెస్క్ల బ్ ప్రధాన కార్యదర్శి దుంపల పవన్కుమార్, డెస్క్ జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షుడు శంకేసి శంకర్రావు, ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల వెంకట్, నాయకులు కెంచ కుమారస్వామి, నుగునూతుల యాకయ్య పాల్గొన్నారు. -
డెస్క్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
టీజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం నారాయణ హన్మకొండ, న్యూస్లైన్: డెస్క్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని టీజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం నారాయణ హామీ ఇచ్చారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) నేతృత్వంలో ఈ మేరకు పోరాటం చేస్తామన్నారు. వరంగల్ డెస్క్ జర్నలిస్టుల ఫోరం (డీజేఎఫ్) ఆధ్వర్యంలో హన్మకొండలో గురువారం తెలంగాణ డెస్క్ జర్నలిస్టు ప్రతినిధుల సమావేశం జరిగింది. ముందుగా డెస్క్ జర్నలిస్టులు తమ సమస్యలను ప్రస్తావించారు. అనంతరం అల్లం నారాయణ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో పెరిగిన పత్రికల వల్ల డెస్క్ సిబ్బంది పెరిగారని, వారికి ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వాలనే డిమాండ్ను టీయూడబ్ల్యూజే మొదటి అంశంగా తీసుకుని పోరాడతామని హామీ ఇచ్చారు. ఇదేకాకుండా...హెల్త్కార్డులను విలేకరులతోపాటు డెస్క్ జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు వర్తింపజేయడం...ఇళ్ల స్థలాలు అందించడం వంటి డిమాండ్లను టీయూడబ్ల్యూజే నేతృత్వంలో నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. హైదరాబాద్లో డెస్క్ జర్నలిస్టుల మహా గర్జన నిర్వహిస్తే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ మీడియా డెస్క్లలో పనిచేసే వారిని కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. -
తెలంగాణకు తూట్లు పొడిస్తే ఉపేక్షించం: కోదండరాం
హైదరాబాద్, న్యూస్లైన్: ఏపీఎన్జీవోలు నిజంగా ఉద్యోగుల హక్కుకోసం పోరాడితే వారికి మా పూర్తి మద్దతు ఇస్తామని, కానీ దాని ముసుగులో తెలంగాణకు తూట్లు పొడవాలని చూస్తే ఉపేక్షించేది లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. ‘సీమాంధ్ర పాలకుల కుట్రలను ఎదిరిద్దాం- తెలంగాణ సాధిద్దాం’అనే నినాదంతో హైదరాబాద్లో ఈనెల 17న శాంతి ప్రదర్శన నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. సీమాంధ్రకు చెందిన టీడీపీ నాయకుడు విద్యుత్సౌధకు వచ్చి ఆ ప్రాంత ఉద్యోగులను రెచ్చగొడుతుంటే తెలంగాణకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులు నోరు మెదకపోవడం విడ్డూరమన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షతన ‘తెలంగాణ అనివార్యం- మాకు శాంతి కావాలి’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.కోదండరాం మాట్లాడుతూ ‘మన డిమాండ్లపై మనం పోరాడాలని, సీమాంధ్రులు ఏవో చేస్తున్నారని మన కార్యాచరణ మార్చకూడదు’ అని తెలిపారు. పదిరోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇచ్చిన ప్రకటనను ఎక్కడ వెనక్కి తీసుకుంటారో అనే సందేహం కలుగుతోందని, తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇచ్చేవరకు జేఏసీ ఆధ్వర్యంలో శాంతిర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఉద్యోగ సంఘం నాయకులు దేవీప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేసే వరకు పోరాటాన్ని ఆపేది లేదని అన్నారు. ఇక్కడ మంత్రుల ఇళ్ల వద్ద డప్పులు కొడితేనే జైళ్లలో వేశారని, కానీ అక్కడ వారి ఇళ్లపై రాళ్లతో దాడిచేసినా ఒక్కకేసూ పెట్టలేదని అన్నారు. హైదరాబాద్లో తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొడితే జరిగే అనర్థాలకు ఎపీఎన్జీవోలదే బాధ్యత అన్నారు. గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. సచివాలయంలో 144 సెక్షన్, ఎస్మా ఉన్నా సీమాంధ్రులపై ఎందుకు ప్రయోగించడం లేదని, అవి తెలంగాణ వారిపై ఉపయోగించడానికే ఉన్నాయా అని ప్రశ్నించారు. తెలంగాణకు తాము అనుకూలమని ఒకవైపు చెబుతుంటే ఆ పార్టీ ఎంపీలు సమైక్యాంధ్ర అంటూ పార్లమెంట్ ఉభయసభలను స్తంభింపజేయడం ఎంతవరకు సబబు అన్నారు.