Anand Sharma
-
జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు ?
జోగులాంబ గద్వాల జిల్లా: జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ పై వేటు పడే ఛాన్స్ ఉంది. అలంపూర్ నియోజకవర్గ దళిత ఎమ్మెల్యే విజయుడు ఇచ్చిన ఫిర్యాదుతో జిల్లా యంత్రాంగం కదిలింది. తన హక్కులకు భంగం కలిగించాడని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు ఆలంపూర్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. సినిమా థియేటర్కు భార్య, పిల్లలతో కలిసి ఎమ్మెల్యే వెళ్లగా ..పూజారి ఆనంద్ శర్మ తన ముఖానికి మాస్క్ ధరించి.. వీడియోలు, ఫొటోలు తీశారు. అది గమనించిన ఎంఎల్ఏ ఎవరు మీరు ? ఎందుకు ఫొటోలు తీస్తున్నారని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలోని జోగులాంబ ఆలయం ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ తన ఫోటోలు , వీడియో లు తీసిన వ్యక్తి అని గుర్తించిన ఎంఎల్ఏ అలర్ట్ అయ్యారు.పూజారి ఆనంద్ శర్మ తనపై కుట్ర చేస్తున్నాడని గుర్తించడం తో పాటు..తన కుటుంబసభ్యుల సమాచారం సైతం ఎవరికో చెరవేస్తున్నాడని స్థానికంగా ఉన్న టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీస్ లు.. విచారణ ప్రారంభించారు. కొన్నాళ్ళుఆనంద్ శర్మ పరారయ్యాడు. తన పై , తన కుటుంభసభ్యులపై జరిగిన ఈ కుట్ర పై ఎమ్మెల్యే విజయుడు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. విషయం క్షుణ్ణంగా పరిశీలించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ పూజారి ఆనంద్ శర్మ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .దళిత ప్రజాప్రతినిధి ఫ్యామిలితో ఉండగా పూజారి ఆనంద్ శర్మ ఇలా ఎందుకు చేశాడో సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ.. గద్వాల జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. స్పీకర్ ఆదేశాలతో విచారణ జరుపుతున్న జిల్లా కలెక్టర్ మరో రెండు , మూడు రోజుల్లో నివేదిక స్పీకర్ కార్యాలయానికి అందజేయనున్నట్లు సమాచారం . కలెక్టర్ నివేదిక ఆధారంగా స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. తప్పు చేసినట్లు తేలితే ఆనంద్ శర్మపై చర్యలు తీసుకోమని స్పీకర్ ఆదేశించే అవకాశం ఉంది. గతంలోనూ ఆలయంలో నిధుల దుర్వినియోగం, అమ్మవారి ఆభరణాల మాయం కేసుల్లో ఆనంద్ శర్మ పై ఆరోపణలు ఉన్నాయి. -
కులగణనపై కాంగ్రెస్ నేత అసమ్మతి వ్యాఖ్యలు
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న దేశవ్యాప్త కులగణన హామీపై ఆ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు ఆనంద్ శర్మ తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రాజకీయాలు చేయలేదని అన్నారు. అదేవిధంగా 1980 ఎన్నికల సమయంలో దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ.. ‘కులాలపై కాదు.. చేతి గుర్తుపైనే ఓటు ముద్ర’ అని నినాదం చేశారని గుర్తుచేశారు. ఆమె కూడా కుల రాజకీయాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ సైతం కులాన్ని ఎన్నికల కోణంలో చూడకూడదని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఇలా ఇద్దరు నేతలు రాజకీయాల్లో కులతత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ.. దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. అదేవిధంగా కులరాజకీయాలను వ్యతిరేకించే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఆదర్శనాలను అగౌరవపరిచినట్లు అవుతుందని ఆనంద్ శర్మ అన్నారు. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’లోని కొన్ని పార్టీలు చాలా కాలం నుంచి కుల రాజకీయాలు చేస్తున్నాయని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశంలో సామాజిక న్యాయం ప్రాతిపాధికన దేశంలో కుల అసమానతలకు తావు ఇవ్వని పార్టీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కుల గుర్తింపు రాజకీయలు చేయలేదని తెలిపారు. ప్రాంతం, మతం, కులాలు జాతులతో గొప్ప వైవిధ్యాన్ని కనబరిచే భారత సమాజంలో కులతత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి హానికరమని ఆనంద్ శర్మ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కులాని బదులు.. అసమానతలు లేకుండా పేదలకు పథకాలను అమలు చేసి, సామాజిక న్యాయం అందించడానికి కృషి చేస్తుందని తెలిపారు. ఇక గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాల ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇస్తున్న విషయం తెలిసిందే. ముంబైలో జరిగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు సభలో సైతం రాహుల్ కుల గణన హామీ ఇచ్చారు. -
International Disability Day: నిశ్శబ్ద విజయం
మాట వినకపోతే మాట పలకలేము. మాటతో నిండిన ఈ ప్రపంచంలో మాట లేకపోతే శూన్యతే. సోను ఆనంద్ శర్మ ఆ శూన్యత నుంచే బయలుదేరింది. పూర్తి బధిరత్వం వల్ల మాటకు కూడా దూరమైన సోను ఈ ప్రపంచంతో బ్యాట్తోనే మాట్లాడాలనుకుంది. బధిర బాడ్మింటన్ క్రీడాకారిణిగా సోనువి ఘన విజయాలు. ఆ తర్వాత కోచ్గా మారి దేశానికి ఎందరో క్రీడాకారులనిచ్చింది. కాని ఇదంతా సులభమా? బధిరత్వం ఉంటే ఇన్ని ఆటంకాలా? దివ్యాంగుల గెలుపు కథల్లో సోను కథ ముఖ్యమైనది. ‘పూర్తిగా వినపడకపోతే ఏమవుతుందో తెలుసా?’ అని అడుగుతుంది సోను ఆనంద్ శర్మ. పూర్తిగా వినపడని వారు దానికి పూర్తి సమాధానం చెప్పలేరు. ఎందుకంటే పూర్తిగా వినపడని వారికే ఆ బాధ తీవ్రత తెలుస్తుంది. ‘వినడం వల్లే భాష మాట్లాడతాం. వాక్యాన్ని నిర్మిస్తాం. గ్రామర్ నేర్చుకుంటాం. పూర్తి వాక్యం రాస్తాం. పూర్తిగా వినపడకపోతే మీరు మాట్లాడలేరు. రాయలేరు. గ్రామర్తో సరిగ్గా రాయలేరు’ అంటుందామె. 47 ఏళ్ల సోను ఆనంద్ శర్మ ‘డెఫ్లింపిక్స్’ (బధిరులకు జరిగే ఒలింపిక్స్)లో బాడ్మింటన్ క్రీడాకారిణిగా ఈ దేశానికి పతకాలు తెచ్చింది. ఆ తర్వాత కోచ్గా మారి శిష్యులను తయారు చేసి పతకాలను తెస్తోంది. అయినప్పటికీ ఆమె ఒక బధిరురాలిగా వివక్ష ఎదుర్కొంటూనే ఉంది. ‘ఒలింపిక్స్లో పతకాలు సాధిస్తే ప్రభుత్వం పది లక్షలు ఇస్తుంది. బధిరుల ఒలింపిక్స్లో నేను పతకాలు సాధించాను. నా మెడల్స్ కూడా అంతకు సమానమే. అయినా నాకు డబ్బు రాలేదు’ అంటుందామె. అంతే కాదు... క్రీడాకారుల పెన్షన్లు, నజరానాలు అన్నీ కూడా అన్నీ సవ్యంగా ఉన్నవారికే. దివ్యాంగులకు వివక్షే. ‘అయినా సరే నేను నా దేశం కోసం పని చేస్తూనే ఉంటాను’ అంటుంది సోను. సైన్ లాంగ్వేజ్ ఎక్కడ? సోను ఆనంద్ శర్మది న్యూఢిల్లీ. పుట్టు బధిరురాలు. క్లాసుకు వెళితే టీచర్లకు సైన్ లాంగ్వేజ్ వచ్చేది కాదు. ఈమెకు పాఠాలు వినపడేవి కావు. ‘మన దేశంలో ఆరున్నర కోట్ల మంది పూర్తి బధిరులు లేదా పాక్షిక బధిరులు. వారిలో 50 లక్షల మంది పిల్లలు. అయినా మన దేశంలో కేవలం 700 స్కూళ్లలోనే సైన్ లాంగ్వేజ్లో చదువు చెప్తారు. సైన్ లాంగ్వేజ్ను అధికారిక భాషగా ప్రకటిస్తే సమస్య చాలామటుకు తీరుతుంది. కాని ప్రకటించరు. చదువు రాకపోతే బధిరులు జీవితాంతం ఇబ్బంది పడుతూనే ఉండాలి’ అంటుందామె. ఇప్పుడు ఆమె ఢిల్లీ టూరిజంలో ఉద్యోగం చేస్తుంది. మొత్తం డిజిటల్ కమ్యూనికేషనే జరుగుతుంది. సోను కమ్యూనికేట్ చేస్తుంది కాని భాష మెరుగ్గా ఉండదు. ‘అందుకని నన్ను ఒకలా చూస్తారు కొలీగ్స్’ అంటుందామె. 10 ఏళ్ల వయసు నుంచి పాఠాలు అర్థం కాకపోవడం వల్ల సోను బాడ్మింటన్తో ఆ వెలితి పూడ్చుకోవాలని అనుకుంది. ‘కాని మాకు మంచి కోచ్లు దొరికేవారు కాదు. కోచ్లు దొరికినా వారి దృష్టి నార్మల్ ఆటగాళ్ల మీద ఉండేది. బధిరుల మీద ఫోకస్ ఉండేది కాదు. అందుకని నన్ను నేను నమ్ముకున్నాను. రోజూ ఉదయం నుంచి రాత్రి దాకా ప్రాక్టీసు చేసేదాన్ని. మాది మధ్యతరగతి కుటుంబం. స్కూటర్ కూడా లేదు. బస్లో కోర్టుకు తిరుగుతుంటే మా తల్లిదండ్రులు భయపడేవారు... ఆడపిల్లనని... మాటలు రావని. మా నాన్న ఆఫీస్ నుంచి వచ్చి నా కోసం నేను ప్రాక్టీసు చేసే చోట కాచుకుని కూచునేవాడు’ అని గుర్తు చేసుకుంది సోను. ఆ శ్రమ వృథా పోలేదు. 1997 సమ్మర్ డెఫ్లింపిక్స్ నుంచి 2009 సమ్మర్ డెఫ్లింపిక్స్ వరకూ దేశం తరఫున ఆడి పతకాల పంట పండించింది సోను ఆనంద్ శర్మ. 2014 నుంచి కోచ్ శిష్యుల ద్వారా పతకాలు తెచ్చి పెడుతోంది. బధిర బాడ్మింటన్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జెర్న్లిన్ అనిక ఈమె శిష్యురాలే. ‘దివ్యాంగులను తక్కువ అంచనా వేయొద్దు. వారి సామర్థ్యాల పై సానుభూతి వద్దు. మమ్మల్ని గ్రహాంతర వాసుల్లా చూడొద్దు. మీలాగే సాటి మనుషులుగా చూడండి’ అంటుంది సోను శర్మ. వారికి అనువుగా సమాజం మారాలి. వారి కోసం కూడా ఈ సమాజం ఉంది. వారి సమాన వాటాను ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకుందాం. -
ప్లీజ్ తప్పుకుంటున్నాను.. సోనియాకు షాకిచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత!
దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని వరుస షాక్లు తగులుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ(69).. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ట్విస్ట్ ఇచ్చారు. తాను.. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆనంద్ శర్మ.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసినట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నా ఆత్మగౌరవంతోనే తాను బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు తెలిపారు. దీంతో, సోనియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. Anand Sharma Quits Himachal Congress Post Days After Kashmir Party Revolt https://t.co/Quv6xQMTWy NDTV's Sunil Prabhu reports pic.twitter.com/cOoSGKP6VD — NDTV (@ndtv) August 21, 2022 ఇదిలా ఉండగా.. ఇటీవలే కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గట్టి షాకిచ్చారు. ఆయనను జమ్మూకశ్మీర్లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోగా.. ఆ బాధ్యత స్వీకరించేందుకు నిరాకరించారు. అలాగే.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు. అయితే, కొన్నేళ్లుగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్ నేతల జీ23 గ్రూప్లో ఆజాద్ ప్రముఖుడు. ఇటీవలే రాజ్యసభ పదవీకాలం ముగియగా పొడిగింపు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది కూడా చదవండి: బీజేపీ సంచలన నిర్ణయం.. ఉమాభారతి సన్నిహితుడికి షాక్! -
బాబోయ్.. ఇవెక్కడి పోలీస్ స్టేషన్లు!!
అంతా టెక్నాలజీమయం. వర్చువల్ ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. నేరాలు ఎంత టెక్నిక్తో జరుగుతున్నాయో.. అంతే కౌంటర్ టెక్నాలజీతో వాటిని చేధిస్తున్నారు పోలీసులు. కీలకమైన పోలీసింగ్ వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సూపర్, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ, ఆ వ్యవస్థను పటిష్టపరిచే అంశంపై మాత్రం పూర్తి దృష్టి పెట్టడం లేదన్న విషయం తెలుసా?. దేశంలో పోలీసు వ్యవస్థ దీనస్థితిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(పీఎస్సీ) నివేదిక వెల్లడించింది తాజాగా.. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ నేతృత్వంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ (PSC) ఈ నివేదిక రూపొందించింది. తాజాగా ఈ కమిటీ హోం వ్యవహారాల శాఖకు సమర్పించిన నివేదికలో.. దేశంలో 257 పోలీస్ స్టేషన్లకు ఇప్పటివరకు వాహనాలే లేవట. మరో 638 పోలీస్ స్టేషన్లకు కనీసం టెలిఫోన్ సౌకర్యం కూడా లేదు. ఇక 143 పోలీస్ స్టేషన్లకు వైర్లెస్, సెల్ఫోన్ లాంటి సౌకర్యాలు లేవని ఈ కమిటీ వెల్లడించింది. పనిలో పనిగా మోడ్రన్ పోలీసింగ్ వ్యవస్థకు బలమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అవసరమని, త్వరగతిన స్పందన కోసం వాహన వ్యవస్థ సమకూరాలని, అత్యాధునిక ఆయుధాల అవసరమూ ఉందని ఈ కమిటీ అభిప్రాయపడింది. 21వ శతాబ్దంలో అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కమ్యూనికేషన్ బలంగా లేకపోవడం మంచిది కాదు, ఆయా రాష్ట్రాలకు ఇంసెన్సిటివ్స్ జారీ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అలాగే జమ్ము కశ్మీర్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో వైర్ లెస్ సేవల కొరత మంచిది కాదని తెలిపింది. ఇక పలు రాష్ట్రాల విషయంలో హోం మంత్రిత్వ వ్యవహారాల శాఖకు కీలక సూచనలు చేసిన ఈ కమిటీ.. కేంద్ర పాలిత ప్రాంతాల విషయంలో అవసరమైన చర్యలు త్వరగతిన చేపట్టాలని కోరింది. లా అండ్ ఆర్డర్ పరిరక్షించే క్రమంలో సిబ్బందికి గాయాలు కాకుండా ఉండేందుకు రక్షణ కవచాల ఆవశ్యకతను కమిటీ గుర్తు చేసింది. అంతేకాదు ఆయా పోలీస్ స్టేషన్ల తీరుతో జనాలు.. పొరుగు ప్రాంతాల స్టేషన్లను ఆశ్రయిస్తున్నారంటూ ఆసక్తికర అంశాన్ని సైతం ప్రస్తావించింది కమిటీ. మొత్తం దేశంలోని 16, 833 పోలీస్ స్టేషన్లను పరిశీలించి.. జనవరి 1, 2020 నాటి పరిస్థితుల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది ఈ కమిటీ. అయితే ఈ పరిస్థితుల్లో ఈనాటికీ పెద్దగా మార్పు రాలేదని కమిటీ పేర్కొనడం గమనార్హం. -
టెక్ ఫాగ్ యాప్ కలకలం.. గూఢచర్యం ఆరోపణలు!
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరోసారి గూఢచర్యం ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. టెక్ ఫాగ్ యాప్ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఐటీ సెల్పై విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. పౌరుల గోప్యతకు టెక్ ఫాగ్ యాప్తో ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై చర్చ జరపాలని టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్కు లేఖ రాశారు. టెక్ ఫాగ్ యాప్ వల్ల జాతీయ భద్రత, దేశ పౌరుల గోప్యతకు ముప్పు వాటిల్లనుందని తెలిపారు. చదవండి: గోవా బీజేపీకి షాక్ ఈ అంశంపై చర్చించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం భేటీ ఏర్పాటు చేయాలని కమిటీ ఛైర్మన్ ఆనందర్ శర్మను డిమాండ్ చేశారు. బీజేపీ ఐటీ సెల్తో సంబంధాలు ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ యాప్ను ఉపయోగించి ఇన్యాక్టివ్గా ఉన్న వాట్సాప్ ఖాతాల నియంత్రణ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ట్రెడింగ్లో ఉన్న విషయాలను హైజాక్ చేస్తున్నారన్న ఆరోపణలు చేస్తూ ఓ పత్రిక కథనంతో ‘టెక్ ఫాగ్’ యాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. -
‘ప్రస్తుత ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలి’
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల విశ్వాసం కోల్పోయిన ప్రస్తుత ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం సభ్యులపై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం(ఈసీ) సభ్యులు, కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక, నియామకానికి సంబంధించిన విధానాన్ని రూపొందించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నిష్పాక్షికంగా జరిపేందుకు అవసరమైన మార్గదర్శకాలను ఈ ధర్మాసనం రూపొందించాలన్నారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇటీవల అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తీరు, ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని సోమవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరపాలన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 పేర్కొన్న ఆదేశాలను ఎన్నికల కమిషన్ ఉల్లంఘించిందని ఆనంద్ శర్మ ఆరోపించారు. బెంగాల్లో ఈసీ చర్యలు పూర్తిగా ఏకపక్షంగా ఉన్నాయనీ, ఇలాంటి తీరు గర్హనీయమని తెలిపారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరించిందనేందుకు పలు ఆధారాలున్నాయన్నారు. ఇటీవలి ఎన్నికల్లో భారీ ర్యాలీలపై నియంత్రణలు విధించని ఈసీని కోవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘించినందుకు జవాబుదారీగా చేయాలన్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్ అమలు చేయకుండా, కరోనా వ్యాప్తికి, మరణాలకు కారణమైన ఈసీపై హత్యానేరం కింద కేసులు పెట్టాలని ఇటీవల మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి: జైలు నుంచి అసెంబ్లీకి.. -
ఎన్నికల వేళ కాంగ్రెస్ అధిష్టానంపై పోరు తీవ్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అసంతృప్త నేతలు అధిష్టానంపై పోరును తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుత్తున్నారు. పార్టీలో ప్రక్షాళనపేరుతో అధిష్టాన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన జీ–23 నాయకులు కీలక సమావేశాన్ని ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు. గులాం నబీ ఆజాద్ జీ–23 లో కీలక సభ్యుడు అయిన కారణంగానే ఆయన రాజ్యసభ పదవీకాలాన్ని పొడిగించకుండా, అధిష్టానం పక్కన పెట్టిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అంతేగాక రాజ్యసభా పక్ష నాయకుడిగా గులాంనబీ పదవీకాలం ముగిసిన తర్వాత సీనియర్ నేత ఆనంద్ శర్మను కాదని, అధిష్టానం రాహుల్గాంధీ విధేయుడిగా పేరున్న మల్లికార్జున ఖర్గేకు అప్పగించినప్పటి నుంచి, జీ–23 నేతలు అధిష్టానంపై అసహనాన్ని ఏదో ఒక రూపంలో వ్యక్తపరుస్తూనే ఉన్నారు. రాజ్యసభ పక్ష నాయకుడి పదవి ఆనంద్ శర్మకు రాకుండా అడ్డుకోవడంలో అధిర్ రంజన్ చౌధరి వంటి వారు కీలకపాత్ర పోషించారని జీ–23 బృందం గట్టిగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలోనే బెంగాల్ ఎన్నికల పొత్తు విషయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌధరిపై ఆనంద్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఐఎస్ఎఫ్తో పొత్తు కాంగ్రెస్ భావజాలానికి పూర్తి విరుద్ధమని, అలాంటి నిర్ణయం తీసుకునే ముందు పార్టీస్థాయిలో వివరణాత్మక చర్చ జరగాలని ఆనంద్ శర్మ తన ట్వీట్లో అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధిర్ రంజన్ చౌదరిని టార్గెట్ చేశారు. ఆనంద్ శర్మ ట్వీట్ల తరువాత, అధిర్ రంజన్ చౌదరి సైతం ఘాటుగానే జవాబిచ్చారు. వీరి మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత పోరును మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది. చదవండి: (ఎమర్జెన్సీ విధించడం తప్పే: రాహుల్ గాంధీ) ఢిల్లీ పీసీసీలోనూ.. మరోవైపు అసమ్మతి వర్గంలో కీలకంగా ఉన్న నలుగురు నేతలు ఢిల్లీకి చెందిన వారు కావడంతో, ఢిల్లీ పీసీసీలోనూ అంతర్గత పోరు మొదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరుగబోయే కీలక సమావేశంలో పార్టీ అసంతృప్త నాయకుల భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరుగనున్నాయి. కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్, ఢిల్లీ పీసీసీ మాజీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్, మాజీ ఉపాధ్యక్షుడు యోగానంద్ శాస్త్రిలు జీ –23లో ఉన్నారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఢిల్లీ పీసీసీలో ఈ అసంతృప్త నాయకుల జాబితా పెరుగుతోందని సమాచారం. గతంలో 23 మంది.. పార్టీని బలోపేతం చేసే విషయంలో అధిష్టానం తీరు మార్చుకోవాలంటూ గతేడాది సోనియాగాంధీకి 23 మంది అసంతృప్త నేతలు రాసిన లేఖ పార్టీలో పెద్ద ఎత్తున దుమారానికి కారణమైన విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం సోనియాగాంధీ నివాసంలో జీ –23 నేతలతో జరిగిన కీలక సమావేశంలో తమ అభిప్రాయాలను పలువురు పార్టీ సీనియర్లు రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీల ముందుంచారు. అయితే ఆ సమావేశం జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ అధిష్టానం జీ–23 నేతలు చేసిన సూచనలను పట్టించుకున్న దాఖలాలు లేవని, అçసంతృప్తి కారణంగా పార్టీని వీడాలనుకుంటున్న నాయకులతో ప్రత్యేకంగా చర్చించిన పరిస్థితి సైతం లేదని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే, త్వరలో జరపాలనుకుంటున్న సమావేశం ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక బలమైన సందేశాన్ని పంపించాలని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. చదవండి: (చిన్నమ్మ కొత్త వ్యూహం.. మూడో కూటమిలోకి నో ఎంట్రీ) -
జీడీపీలో 10% కాదు 1.6 శాతమే!: కాంగ్రెస్
న్యూఢిల్లీ: రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అని, జీడీపీలో 10% అని అబద్ధాలు చెబుతూ కేంద్రం ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. ఈ ప్యాకేజీ నికరంగా రూ. 3.22 లక్షల కోట్లు మాత్రమేనని, అది జీడీపీలో 1.6% మాత్రమేనని పేర్కొంది. ప్రధాని మోదీ అవాస్తవాలు చెప్పడం మాని తామేం చేయగలరో స్పష్టంగా చెప్పాలని ఆ పార్టీ ప్రతినిధి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ప్యాకేజీపై చర్చకు సిద్ధమా? అని ఆర్థికమంత్రికి ఆయన ప్రశ్నించారు. ‘కేంద్రం వైఫల్యం వల్లనే లక్షలాది వలస కూలీలు కాలి నడకన వందలాది కిలోమీటర్లు నడిచి సొంతూళ్లకు వెళ్లే విషాద పరిస్థితి నెలకొంది’అని ఆరోపించారు. నంబర్లాట: లెఫ్ట్: ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ నంబర్లతో ఆడుతున్న మోసపూరిత ఆటలా ఉందని వామపక్షాలు విమర్శించాయి. రుణ పరిమితిలో రాష్ట్రాలు 14% మాత్రమే వాడుకున్నాయంటూ రాష్ట్రాలను ఆర్థికమంత్రి నిర్మల అవహేళన చేశారని సీపీఎం నేత సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను అమ్మేసి స్వయం సమృద్ధి సాధించాలనుకుంటున్నారా? అని సీపీఐ నేత రాజా ఆర్థికమంత్రిని ప్రశ్నించారు. -
ప్యాకేజ్ ప్రకంపనలు : కేంద్రానికి కాంగ్రెస్ సవాల్
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పిస్తూ రైతులు, వలసకూలీలు, చిరువ్యాపారులు సహా పలువురిని ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్పై కాంగ్రెస్ పెదవివిరిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ 20 లక్షల కోట్లు కాకుండా కేవలం రూ 3.22 లక్షల కోట్ల ప్యాకేజ్నే ప్రభుత్వం ప్రకటించిందని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన రూ. 3.22 లక్షల కోట్ల ప్యాకేజ్ జీడీపీలో కేవలం 1.6 శాతమేనని, ప్రధాని ప్రకటించిన తరహాలో 10 శాతం కాదని అన్నారు. తాను చెప్పింది తప్పని నిరూపించాలని తాను ఆర్థిక మంత్రి, ప్రధానికి సవాల్ విసురుతున్నానని చెప్పారు. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక ప్యాకేజ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను తప్పుదారిమళ్లించిందని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై మాట్లాడాలని ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. వలస కూలీల ప్రాథమిక హక్కులను కాలరాసినందుకు ప్రభుత్వం వారికి క్షమాపణలు చెప్పాలని కోరారు. ప్రణాళిక లేకుండా లాక్డౌన్ అమలు చేయడంతో వలస కూలీలు రోడ్లపై దయనీయస్ధితిలో నడిచివెళ్లేలా చేశారని, వారి దుస్థితిపై ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని అన్నారు. ఢిల్లీలో వలస కూలీలతో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ మాట్లాడటాన్ని నిర్మలా సీతారామన్ డ్రామాగా కొట్టిపారవేయడంపై ఆయన మండిపడ్డారు. చదవండి : లాక్డౌన్ 4.0 : కేంద్రం కీలక నిర్ణయం -
దశలవారీగా లాక్డౌన్ సడలింపు
న్యూఢిల్లీ: కోవిడ్–19 కారణంగా దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని, స్థూల జాతీయోత్పత్తిలో కనీసం ఐదారు శాతం మొత్తానికి తక్కువ కాకుండా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కోరింది. కరోనా వైరస్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా కేంద్రం తన బకాయిలు మొత్తాన్ని రాష్ట్రాలకు వెంటనే చెల్లించాలని, దీంతోపాటు ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ వాణిజ్యశాఖ మంత్రి ఆనంద్ శర్మ సోమవారం డిమాండ్ చేశారు. అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్స్కు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు, పరిశ్రమల నుంచి వచ్చే విరాళాలు ఇచ్చేందుకు అనుమతించాలని, లేదంటే అది రాష్ట్రాల పట్ల వివక్ష చూపినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. పీఎం కేర్స్ ఫండ్ను నేషనల్ రిలీఫ్ ఫండ్గా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఇప్పుడు అసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాబట్టి తీసుకునే చర్యలు కూడా అలాగే ఉండాలి. అందుకే ప్రధాని ఆర్థిక ప్యాకేజీ విషయంలో ఉదారంగా వ్యవహరించాలి. లాక్డౌన్ అనంతర ఆర్థిక వ్యవస్థలోని వేర్వేరు రంగాలు మళ్లీ జీవం పుసుకునేందుకు సాయం చేయాలి’ అని వీడియో ద్వారా జరిగిన విలేకరుల సమావేశంలో ఆనంద్ శర్మ పేర్కొన్నారు. యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు తమ స్థూల జాతీయోత్పత్తిలో పదిహేన శాతం మొత్తాలను ప్యాకేజీలుగా ప్రకటించాయని, అమెరికా పది శాతం మొత్తాన్ని ఖర్చు చేయనుందని గుర్తు చేశారు. ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి అంశాల గురించి పట్టించుకోకుండా ప్రభుత్వం కనీసం 5 –6 శాతం జీడీపీ మొత్తాన్ని ఖర్చు చేయాలని అన్నారు. లాక్డౌన్ ప్రకటన ఆకస్మికంగా జరిగిందని, ఎత్తివేత సమయంలో రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలని సూచించారు. లాక్డౌన్ను దశలవారీగా సడలించి, ఆర్థిక వ్యవస్థకు ఊరట కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఫార్మా, బీమా, ఆర్థిక రంగాల్లోని కంపెనీలను విదేశీ కంపెనీలు తమ వశం చేసుకోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ దిశగా సెబీ, ఆర్బీఐలు తగిన చర్యలు తీసుకునేలా కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. చదవండి: పీఎం కేర్స్పై పిల్ కొట్టివేత -
‘మీరు స్టార్ క్యాంపెయినర్ కాదు’
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లా వ్యవహరించారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ ఆనంద్ శర్మ విమర్శించారు. అమెరికాలో భారత ప్రధాని హోదాలో పర్యటిస్తున్న మోదీ.. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ‘ఉమ్మడి స్వప్నం.. ఉజ్వల భవిత’ పేరుతో టెక్సాస్ ఇండియా ఫోరం నిర్వహించిన హౌడీ మోదీ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు 50 వేల మంది హాజరైన ఈ కార్యక్రమానికి మోదీ, ట్రంప్ కలిసి వేదిక పైకి వచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ గురించి మోదీ మాట్లాడుతూ.. భారత దేశానికి ట్రంప్ నిజమైన స్నేహితుడు అని.. మరోసారి అమెరికాలో ట్రంప్ సర్కార్ రాబోతుందని వ్యాఖ్యానించారు. అనంతరం వివిధ అంశాలపై ఇరు దేశాధినేతలు ప్రసంగించారు.(చదవండి : భారత్కు ట్రంప్ నిజమైన ఫ్రెండ్) ఈ నేపథ్యంలో మోదీ భారత దేశ విదేశాంగ విధానం, నిబంధనలను తుంగలో తొక్కారని ఆనంద్ శర్మ విమర్శించారు. ట్రంప్ తరఫున ప్రచారం చేసి సార్వభౌమ దేశాలైన భారత్, అమెరికా రూపొందించుకున్న ఒప్పందాలను ఉల్లంఘించారని మండిపడ్డారు. ఈ మేరకు... ‘ మీరు అమెరికా ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ కాదు. భారత ప్రధానిగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ విషయాన్ని మీకు గుర్తు చేయాల్సి వస్తోంది. అమెరికా రాజకీయాల్లో భారత్ ఎల్లప్పుడూ తటస్థ వైఖరినే అనుసరించింది. రిపబికన్లు, డెమొక్రాట్లతో ఒకే విధమైన మైత్రి ఉండేది. కానీ మీరు వాటిని ఉల్లంఘించి ట్రంప్ తరఫున ప్రచారం చేస్తున్నారు. రెండు సార్వభౌమ, ప్రజాస్వామ్య దేశాల విలువలు తుంగలో తొక్కారు. భారత దేశ విదేశాంగ విధానాన్ని అపహాస్యం చేశారు’ అని ట్వీట్ చేశారు. Mr Prime Minister, you have violated the time honoured principle of Indian foreign policy of not interfering in the domestic elections of another country. This is a singular disservice to the long-term strategic interests of India. — Anand Sharma (@AnandSharmaINC) September 22, 2019 -
‘మోదీకి కుటుంబం లేకనే ఎక్కడికీ వెళ్లట్లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న తరణంలో నేతల మాటలు తూటల్లా పేలుతున్నాయి. రాజకీయ విమర్శలు దాటి వ్యక్తిగత విమర్శల వరకు హద్దులు మీరుతున్నాయి. 1987లో ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకను రాజీవ్ గాంధీ దంపతులు తమ వ్యక్తిగత విహార యాత్ర కోసం ఉపయోగించుకున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలు కాంగ్రెస్ శ్రేణులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ ఘాటైన వ్యాఖ్యలతో స్పందించారు. ‘ ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కుటుంబంతో విహార యాత్రలకు వెళ్లడం సర్వసాధారణం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఆయన భార్య సోనియా గాంధీతో కలిసి వెళ్లారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి కుటుంబం (భార్య) లేదు కాబట్టి ఎక్కడికీ వెళ్లడంలేదు. కేవలం ఆయనొక్కరే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు.’’ అంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. కాగా ప్రధాని చేసన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజీవ్ గాంధీ ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేస్తున్నారు. నాడు రాజీవ్ కోసం ప్రత్యేకంగా విరాట్ను తీసుకెళ్లడంగానీ, దాని రూట్ మార్చడంగానీ చేయలేదని నావికాదళం ప్రధానాధికారిగా రిటైరైన అడ్మిరల్ రాందాస్ మీడియా ముఖంగా మోదీకి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. విరాట్ నౌక లక్ష దీవులకు వెళుతుందని తెలిసి రాజీవ్ దంపతులు నౌక ఎక్కారని, వారికి తానే అతిథ్యం ఇచ్చానని కూడా ఆయన చెప్పారు. #WATCH Anand Sharma, Congress on PM Modi's comment on INS Viraat: Any PM would do so but this PM has no family,if he had family then he would also be going there, but he goes alone because he has no connect with a family or any respect for family values. (09/05/2019) pic.twitter.com/N9sKN7iQ2D — ANI (@ANI) May 10, 2019 -
ఆ పెట్టెలో ఏముంది?
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన సందర్భంగా ఆయన హెలికాప్టర్లో నలుపురంగు పెట్టెను ప్రైవేటు కారులో తరలించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆ పెట్టెలో ఏముందో ప్రధాని మోదీ వెంటనే చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ‘ఈ నెల 9న చిత్రదుర్గ సభకు మోదీ హెలికాప్టర్కు రక్షణగా మరో మూడు హెలికాప్టర్లు వచ్చాయి. ఇవి ల్యాండ్ కాగానే ఓ హెలికాప్టర్ నుంచి నలుపురంగులో ఉన్న పెట్టెను ఇన్నోవా కారులో ఎక్కించారు. ఈ కారు ఎస్పీజీ వాహనశ్రేణిలో భాగం కాదు’ అని తెలిపారు. ఈ పెట్టెలో భారీగా నగదు ఉందని ఆయన ఆరోపించారు. ఒకవేళ ఇది నిజం కాకుంటే మోదీ విచారణకు సహకరించాలన్నారు. ఈ విషయమై కర్ణాటక పీసీసీ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని ఆనంద్ శర్మ వెల్లడించారు. అంబేడ్కర్ జయంతి రోజున ప్రతిపక్షాలపై విమర్శలు మాని, గత ఐదేళ్లకాలంలో ఏం చేశారో దేశప్రజలకు చెప్పాలని మోదీకి సూచించారు. దమ్ముంటే రఫేల్ ఒప్పందంపై అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేతో జరిగిన సమావేశం మినిట్స్ను బయటపెట్టాలని మోదీని డిమాండ్ చేశారు. దీనివల్ల అన్ని ఆరోపణలకు ఒకేసారి తెరపడుతుందని వ్యాఖ్యానించారు. సాయుధ బలగాల త్యాగాలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. 1971 బంగ్లాదేశ్ యుద్ధంతో అప్పటి ప్రధాన ఇందిరాగాంధీ రాజకీయంగా లబ్ధిపొందారని కేంద్ర మంత్రి వీకే సింగ్ చెప్పడాన్ని తప్పుపట్టిన ఆనంద్ శర్మ, ఈ వ్యాఖ్యలపై సింగ్ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. -
రాజ్యసభ రబ్బర్ స్టాంప్ కాదు..
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ తాజా బిల్లుపై రాజ్యసభలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం రాజ్యసభ ముందుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రస్తుత రూపంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని పట్టుబట్టాయి. బిల్లుపై పాలక బీజేపీ, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో సభ బుధవారానికి వాయిదా పడింది. ట్రిపుల్ తలాక్తో విడాకులు ఇచ్చే ప్రక్రియను నిషేధిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రూపొందిన తాజా బిల్లును ఇటీవల లోక్సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. కాగా, రాజ్యసభలో ఈ బిల్లుపై విస్తృత చర్చ అవసరమని విపక్షాలు పేర్కొన్నాయి. చట్టబద్ధంగా పరీక్షించకుండా చట్టాలను చేయలేమని లోక్సభలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన పెద్దల సభలో ఆమోదం పొందలేదని, రాజ్యసభ రబ్బర్ స్టాంప్ కాదని కాంగ్రెస్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. బిల్లును ఎవరూ వ్యతిరేకించడలేదని, దీన్ని పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీకి పంపాలని యావత్ విపక్షం డిమాండ్ చేస్తోందని చెప్పారు. బిల్లుపై ప్రభుత్వం రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. చర్చకు సిద్ధమే.. మరోవైపు విపక్షాల దాడిని ప్రభుత్వం దీటుగా తిప్పికొట్టింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పినా ఈ విధానం కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లుపై విపక్ష ఎంపీలు నినాదాలతో హోరెత్తిస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు. -
రఫేల్పై తీర్పును రీకాల్ చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ్ద విమానాల కొనుగోలు వ్యవహారంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెనక్కు తీసుకోవాలని (రీకాల్) కాంగ్రెస్ పార్టీ ఆదివారం కోరింది. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానాన్ని తప్పుదోవపట్టించేలా వ్యవహరించడంతోపాటు పార్లమెంటు సమగ్రతను దెబ్బతీసిన కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటీసులు ఇవ్వాలంది. రఫేల్ విమానాల కొనుగోలుకు సంబంధించి కాగ్ తన నివేదికను ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ)కి సమర్పించిందని కేంద్రం సుప్రీంకోర్టుకు తప్పుగా చెప్పడం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత అనంద్ శర్మ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘అసలు విమానాల కొనుగోలుపై కాగ్ ఇంకా నివేదికే తయారు చేయకపోతే పీఏసీకి ఎప్పుడు అందజేసింది? పార్లమెంటుకు ఎప్పుడు సమర్పించింది’ అని ప్రశ్నించారు. రఫేల్ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి తీర్పునే ప్రభావితం చేసిన కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసి తీర్పును వెనక్కు తీసుకుని కేసును పునర్విచారించాలని ఆయన కోరారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తమ తప్పును అంగీకరించి, ప్రాయశ్చిత్తంగా గంగా నదిలో మునిగితేలాలని ఆనంద్ శర్మ అన్నారు. అసలు రఫేల్ విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ద్వారానే సాధ్యపడుతుందని ఆనంద్ శర్మ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పే అంతిమం: జైట్లీ రఫేల్పై జేపీసీని ఏర్పాటు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేనే లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. సుప్రీం తీర్పే ఈ విషయంలో అంతిమమనీ, ఆ కోర్టే తమ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చాక జేపీసీ ఎందుకని జైట్లీ ఫేస్బుక్లో ప్రశ్నించారు. రఫేల్పై కాగ్ నివేదిక సిద్ధమయ్యాక అది ఎలాగూ పీఏసీ ముందుకు వెళ్లక తప్పదన్నారు. రఫేల్పై పార్లమెంటులో చర్చకు ముందుకు రాకుండా సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే కాంగ్రెస్కు తెలుసనీ, వారిది విధ్వంసకర పార్టీ అని విమర్శించారు. కాగా, సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం చేరిన అంశంపై అటార్నీ జనరల్ (ఏజీ), కాగ్లకు నోటీసులిస్తామన్న పీఏసీ చైర్మన్ మల్లికార్జున ఖర్గే నిర్ణయాన్ని పీఏసీలోని మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. -
టీఆర్ఎస్, బీజేపీలు ఒకే గూటి పక్షులు
సాక్షి,హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీలు ఒకే గూటి పక్షులని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఉపనేత ఆనంద్ శర్మ అభివర్ణించారు. ఇరుపక్షాలు ఎన్నికల కోసమే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయన్నా రు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అవసరమై న ప్రతిసారీ టీఆర్ఎస్ అండగా నిలుస్తూ వచ్చిం దని దుయ్యబట్టారు. టీఆర్ఎస్, బీజేపీలు కలిసి ఉన్నాయని, భవిష్యత్తులోనూ కలిసి ఉంటాయని జోస్యం చెప్పారు. బుధవారం గాంధీభవన్లో విలేకరులతో పీసీసీ మాజీ అధ్యక్షుడు హన్మంతరావు, మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామి రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. నోట్లరద్దుకు మద్దతు ప్రకటించి వేడుకలు జరుపుకున్న కొద్దిమద్ది సీఎంలలో కేసీఆర్ ఒకరన్నారు. తెలంగాణలో ముస్లిం ఓట్లు కీలకంగా ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాకుండా లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడిచేందుకు కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపించారు. మోదీ దేశాన్ని లూటీ చేస్తుంంటే కేసీఆర్ రాష్ట్రాన్ని లూటీæ చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పుడున్న 5 సీట్లు కూడా బీజేపీకి రావని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సెమీఫైనల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్నారు. -
హిట్లర్తో ఇందిరను పోల్చడంపై..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఎమర్జెన్సీ విధించడంపై దివంగత ప్రధాని ఇందిరా గాంధీపై బీజేపీ నేతల విమర్శలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఇందిరను నియంత హిట్లర్తో బీజేపీ పోల్చడాన్ని తప్పుపట్టింది. ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా దిగ్గజ నేతగా వెలుగొందారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. ఆమెను హిట్లర్తో పోల్చడం చరిత్రను వక్రీకరించడమేనని ట్వీట్ చేశారు. ఇందిరా గాంధీని బీజేపీ నేత అరుణ్ జైట్లీ హిట్లర్తో పోల్చడం అర్థం చేసుకోదగినదేనని, జైట్లీ ఆరెస్సెస్-బీజేపీ నేపథ్యంలో నుంచి వచ్చిన నేత ఇలానే మాట్లాడతారని అన్నారు. హిట్లర్ వంటి నియంతలు, ఫాసిస్టులను వీరు అనుసరిస్తారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామికంగా కూలదోసే ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో ఎమర్జెన్సీ విధించారని, దీనికి స్వయంగా ఇందిరా గాంధీయే విచారం వ్యక్తం చేశారని ఆనంద్ శర్మ గుర్తు చేశారు. అరుణ్ జైట్లీ జ్ఞాపకశక్తి కోల్పోయారని, నియంతలు ఎన్నికలు నిర్వహించరని అయితే ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలు నిర్వహించారని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి పాలైనా హుందాగా ఓటమిని అంగీకరించారని అన్నారు. -
‘మోదీకి ప్రచార మోజు’
సాక్షి, న్యూఢిల్లీ : భారత విదేశాంగ విధానానికి మోదీ సర్కార్ తూట్లు పొడిచిందని కాంగ్రెస్ ఆరోపించింది. పార్టీ ప్లీనరీలో సీనియర్ నేత ఆనంద్ శర్మ ఎన్డీఏ విదేశాంగ విధానాన్ని దుయ్యబట్టారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం విదేశీ విధానంలో చిత్తశుద్ధి లోపించిందని, సమదృష్టి కొరివడిందని ఆరోపించారు. ప్రధాని తన ప్రచారార్భాటం కోసం పరితపిస్తున్నారని ఆరోపించారు. కీలక దేశాలతో మన సంబంధాలను సజావుగా నిర్వహించడంలో విఫలమయ్యారని విమర్శించారు. పొరుగుదేశాలతో సంబంధాల నిర్వహణ సవ్యంగా లేదని ఆనంద్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు.విదేశాంగ విధానాన్ని మోదీ వ్యక్తిగతంగా ముందుకు తీసుకువెళుతున్నారని ఇది గందరగోళంగా సరైన దిశాదశా లేకుండా సాగుతోందని వ్యాఖ్యానించారు. విదేశాంగ విధానంపై ఆనంద్ శర్మ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ మోదీ ప్రచార మోజుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ నేతల పట్ల మోదీ తీరు అభ్యంతరకరమని, ఆయన తీరు కాంగ్రెస్ పార్టీతో పాటు దేశానికి అవమానకరమని ఆక్షేపించారు. -
ఇవాంక సదస్సులో కేసీఆర్ ఉండగా.. మోదీ ఎందుకు?
న్యూఢిల్లీ: హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకావడాన్ని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్న ఈ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి హాజరవుతుండగా.. మోదీ వెళ్లాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ ప్రశ్నించారు. ‘ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్న కార్యక్రమానికి హాజరవ్వడం ద్వారా నరేంద్రమోదీ ప్రధానమంత్రి పదవిని చులకన చేశారు. ఈ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. ప్రధానికి విదేశీయులు, విదేశీ రేటింగ్ ఏజెన్సీల సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? తన పాలనపై సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా ఆయన గుజరాత్ ప్రజలను అడగాలి’ అని ఆనంద్శర్మ అన్నారు. జీఈఎస్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడాన్ని తప్పుబడుతూ ఆనంద్ శర్మ చేసిన విమర్శలపై నెటిజన్లు తప్పుబడుతున్నారు. -
ఓట్లకు, సీట్లకు.. పొంతన ఉండాలా? వద్దా?
మెజారిటీ జనామోదం లేకుండానే... ప్రజాప్రతినిధులు ఎన్నికవుతున్నారు. ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. పోలైన ఓట్లలో 50 శాతానికి మించి ఓట్లు సాధిస్తేనే జనామోదం ఉన్నట్లు పరిగణించాలనేది ఒక వాదన. ఎందుకంటే ఒకతను 50 శాతం పైచిలుకు ఓట్లు సాధించాడంటే సదరు అభ్యర్థికి అక్కడి ఓటర్లలో విస్పష్టమైన ఆదరణ ఉన్నట్లు లెక్క (మరెవరికీ 50 శాతం దాటే అవకాశాలుండవు కాబట్టి). ప్రస్తుతం మనం అనుసరిస్తున్నది ‘ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ (ఎఫ్పీటీపీ) విధానం. పరుగు పందెంలో ఎందరు పాల్గొన్నా... మొదట గీత దాటిన వాడే గెలిచినట్లుగా ప్రకటిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ అనే పేరు ఈ ఎన్నికల విధానానికి పెట్టారు. అభ్యర్థులందరిలోకి ఎవరికి ఎక్కువ ఓట్లు (ఒక్క ఓటు మెజారిటీ ఉన్నా సరే) వస్తే అతనే గెలిచినట్లు. మొత్తం పోలైన ఓట్లలో అతనికి ఎంత శాతం ఓట్లు పడ్డాయనే దానితో సంబంధం లేదు. త్రిముఖ, చతుర్ముఖ పోటీ నెలకొన్న సందర్భాల్లో 27 లేదా 28 శాతం ఓట్లు పొంది కూడా ఒక అభ్యర్థి గెలవచ్చు. అంటే మిగతా 72 శాతం అతన్ని తిరస్కరించారనే అర్థం. నియోజకవర్గంలోని మెజారిటీ ప్రజలు అతన్ని తిరస్కరించినప్పటికీ సదరు అభ్యర్థి ఆ నియోజకవర్గ ప్రజల ప్రతినిధిగా చట్టసభలోకి అడుగుపెడతాడు. మన దగ్గర లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎఫ్పీటీపీ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. రెండోది... ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ (పీర్ విధానం). ఓట్ల శాతానికి సమానంగా ప్రాతినిధ్యం. అంటే ఒక పార్టీకి ఎంత శాతం ఓట్లు పొలవుతాయో... మొత్తం సీట్లలో అంత శాతం ఆ పార్టీకి కేటాయిస్తారు. ఇందులో మళ్లీ రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో... లిస్ట్ పద్దతి. పార్టీలు మొత్తం స్థానాలకు సరిపడా అభ్యర్థుల పేర్లతో ఒక జాబితాను ఎన్నికలకు ముందే ఈసీకి అందిస్తాయి. ఇందులో అభ్యర్థుల పేర్లను ప్రాధాన్యక్రమంలో పొందుపరుస్తాయి. పార్టీకే ప్రజలు ఓటేస్తారు. వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి... అంతకు సమానశాతం సీట్లను పార్టీ పొందుతుంది. రెండో పద్దతి... సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు. ఓటర్లు బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యక్రమంలో ఓటేస్తారు. ఎవరికైనా 50 శాతానికి మించి తొలి ప్రాధాన్య ఓట్లు పడితే అతను గెలుపొందినట్లే. ఎవరికీ 50 శాతానికి మించి తొలి ప్రాధాన్య ఓట్లు రాకపోతే రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ఉంటుంది. అభ్యర్థులందరిలోకి అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని పోటీ నుంచి తప్పించి సదరు అభ్యర్థికి వచ్చి రెండో ప్రాధాన్య ఓట్లను మిగతా వారికి కేటాయిస్తారు. ఇలా బరిలో ఉన్నవారిలో ఏ ఒక్కరికైనా 50 శాతం పైచిలుకు ఓట్లు వచ్చేదాకా ఎలిమినేషన్ జరుగుతుంది. మన రాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే విధానాన్ని అనుసరిస్తాం. చర్చ ఎందుకు? ఆనంద్ శర్మ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (పర్సనల్, ప్రజా ఫిర్యాదులు, చట్ట, న్యాయ అంశాలపై) ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ఎఫ్పీటీపీ విధానం సరైనది కాదేమోననే సందేహాలు కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి– మార్చి నెలల్లో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలను పార్టీల పేర్లు తీసుకోకుండా ఉదహరించింది. 39 శాతం ఓట్లు వచ్చిన పార్టీ (బీజేపీ) 312 సీట్లు (మొత్తం యూపీ అసెంబ్లీ బలం 403) సాధించగా... 22 శాతం ఓట్లు వచ్చిన పార్టీ (సమాజ్వాది) కేవలం 47 సీట్లు. 21 శాతం ఓట్లు వచ్చిన పార్టీ (బీఎస్పీ) కేవలం 19 సీట్లు మాత్రమే పొందాయని... గుర్తుచేసింది. జనాదరణకు, వచ్చిన సీట్లకు పొంతన ఉండటం లేదు కాబట్టి... మరేదైనా ప్రత్యామ్నాయ విధానాలు, వాటి అమలులోని సాధ్యాసాధ్యాలను సూచించాలని ఎలక్షన్ కమిషన్కు, అన్ని రాజకీయపార్టీలకు లేఖలు రాసింది. పొంతన లేని అంకెలు... బీజేపీ 2014 ఎన్నికల్లో 31 శాతం ఓట్లతో 282 సీట్లు సాధించింది. మన దేశ చరిత్రలో మరే సందర్భంలోనూ ఇంత తక్కువ ఓట్ల శాతంతో సొంత మెజారిటీ ఒక పార్టీకి రాలేదు. ఓట్లశాతంలో బీజేపీ, కాంగ్రెస్ల తర్వాత దేశంలోనే మూడోస్థానంలో నిలిచిన బీఎస్పీకి (4.1 శాతం ఓట్లు) ఒక్క సీటు కూడా రాలేదు. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ 3.8 ఓట్ల శాతంలో 34 లోక్సభ స్థానాల్లో గెలిచింది. అన్నాడీఎంకే కేవలం 3.3 ఓట్ల శాతంతో ఏకంగా 37 సీట్లలో గెలిచింది. మరోవైపు 19.3 శాతం ఓట్లు సాధించి కూడా కాంగ్రెస్ 44కే పరిమితమైంది. అదే 2009లో బీజేపీకి 18.5 శాతమే ఓట్లొచ్చినా... ఏకంగా 116 సీట్లు గెలిచింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 49.1 శాతం ఓట్లతో ఏకంగా 405 స్థానాల భారీ మెజారిటీ సాధించినా... ఓట్లశాతం పరంగా చూస్తే (వచ్చిన ఓట్ల 50 శాతం దాటలేదు కాబట్టి) మెజారిటీ ప్రజల ఆమోదం ఉన్న ప్రభుత్వం కాదనే వాదనా ఉంది. కొన్ని నియోజకవర్గాలకే పరిమితమైన పార్టీలు... తక్కువ ఓట్లు వచ్చినా ఎక్కువ సీట్లు నెగ్గుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఉనికి ఉన్నప్పటికీ కొన్ని పార్టీలు తక్కువ సీట్లు గెలుస్తున్నాయి. ఉదాహరణకు సీపీఎం (3.25 శాతం)కు 2014 సాధారణ ఎన్నికల్లోఅన్నాడీఎంకేతో దాదాపు సమానంగా ఓట్ల శాతం వచ్చినప్పటికీ 9 సీట్లే నెగ్గింది. ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ విధానం అనుకూలతలు... 1. సులభమైనది. నిరక్షరాస్యులు కూడా తేలిగ్గా అర్థం చేసుకోగలరు. 2. మెజారిటీ ఓటు (50 శాతం పైచిలుకు)తో సంబంధం లేకుండా సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. 3. పార్టీల సిద్ధాంతాలతో పాటు అభ్యర్థి గుణగణాలను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయానికి వచ్చే అవకాశం ఓటరుకు ఉంటుంది. 4. అభ్యర్థికి తనకంటూ ప్రత్యేకంగా ఓ నియోజకవర్గం ఉంటుంది కాబట్టి తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అయినా అభివృద్ధి కోసం కృషి చేయాల్సి ఉంటుంది. 5. అన్ని మతాలు, సామాజికవర్గాలను మెప్పించేందుకు అభ్యర్థులు పనిచేయాల్సి ఉంటుంది. 6. ప్రజల్లో ఆదరణ ఉంటే స్వతంత్య్ర అభ్యర్థిగానూ పోటీచేసి గెలవొచ్చు. ప్రతికూలతలు... 1. దేశవ్యాప్తంగా ఉనికి ఉన్నా... నియోజకవర్గాల్లో పట్టులేని కారణంగా కొన్ని పార్టీలకు పార్లమెంటులో ప్రాతినిధ్యమే లేకుండా పోతుంది. 2014లో బీఎస్పీ విషయంలో జరిగిందిదే. ఇప్పటికీ చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని సామాజికవర్గాలున్నాయి. 2. అభ్యర్థులకు వచ్చిన ఓట్లు బదిలీ చేసే అవకాశం లేదు కాబట్టి ఓట్లు వృధా అవుతాయి. అదే ప్రాధాన్యక్రమంలో ఓటు వేసే అవకాశం ఉంటే... మనం తొలి ప్రాధాన్య ఓటు వేసిన అభ్యర్థి ఓడిపోయినా... మన రెండో ప్రాధాన్య ఓటు ఆ నియోజకవర్గంలో విజేతను తేల్చడానికి పనికి వస్తుంది. ఓటు వృధా కావడమనేది ఉండదు. 3. ఎఫ్పీటీపీ విధానంలో సుస్థిర ప్రభుత్వం వస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు. భారత్ పలు సంకీర్ణ ప్రభుత్వాలనూ చూసింది. 4. ఓట్లశాతంలో స్వల్ప తేడా... కొన్నిసార్లు ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 5. అభ్యర్థులు తమ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు కాబట్టి ఎన్నికల ఖర్చు అధికంగా ఉంటుంది. 6. కుల, మత, ప్రాంతీయ విభజనను ప్రోత్సహించేలా ఉంటుంది. ఓట్ల శాతానికి తగ్గ ప్రాతినిధ్య విధానం... అనుకూలతలు... 1. నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల ఖర్చు చాలా తక్కువ. 2. దేశవ్యాప్త ఉనికి ఉన్న చిన్నపార్టీలు, మైనారిటీ, మహిళల పార్టీలకు వారికి వచ్చిన ఓట్లను బట్టి చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కుతుంది. 3. సమస్యలపై గెలిచిన అభ్యర్థుల్లో ఎవరినైనా సంప్రదించవచ్చు. ఎవరో ఒక ఎంపీకి పరిమితం కానక్కర్లేదు. 4. ఓటర్లలో తమ ఓటు వృధాగా పోయిందనే భావన ఉండదు. నచ్చిన సిద్ధాంతానికి స్వేచ్ఛగా ఓటు వేసుకోవచ్చు. ప్రతికూలతలు... 1. గెలిచిన అభ్యర్థులు మెజారిటీ వర్గాలపైనే దృష్టి పెట్టి... మిగతా వారిని పట్టించుకోకపోవచ్చు. అభ్యర్థిని ఎంచుకొనే స్వేచ్ఛ ఓటరుకు ఉండదు. పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వారిని అంగీకరించాల్సిందే. 2. సుస్థిరత అంతగా ఉండదు. మెజారిటీ సాధించడానికి సంకీర్ణాలు తప్పవు. 3. ప్రజాప్రతినిధి– ప్రజలకు (ఓటర్లకు) మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండదు. పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తాడు కాని నియోజకవర్గ ప్రజలకు కాదు. కాబట్టి ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించే అవకాశాలుంటాయి. 4. స్వతంత్య్ర అభ్యర్థులకు అవకాశం ఉండదు. ఏదో ఒక పార్టీ పేరుపైన పోటీచేయాల్సిందే. 5. గద్దెనెక్కిన పార్టీల్లో అధికారం ఏ కొద్దిమంది చేతుల్లోనో కేంద్రీకృతమయ్యే అవకాశాలుంటాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మోదీ ఆ అంశాన్ని ఇప్పుడెందుకు ప్రస్తావించారు?
సర్జికల్ స్ట్రైక్స్ జరిగి ఏడాది అవుతోంది ఆ తర్వాత కూడా దాడులు జరిగాయి న్యూఢిల్లీ: దేశ స్వాతంత్ర్యం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏడాది కింద జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ను ప్రధాని మోదీ ఇప్పుడెందుకు ప్రస్తావించారని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ప్రశ్నించారు. పాక్లోని ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత కూడా ఉగ్రవాద దాడులు, సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయని గుర్తుచేశారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చాలా గొప్పదని ప్రధాని మోదీ చెప్తున్నారని, కానీ ఇదే బీజేపీ విపక్షంలో ఉన్నప్పుడు జీఎస్టీని ఏడేళ్లపాటు అడ్డుకున్నదని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం విపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి.. రాజ్యాంగసవరణ జరిగేలా చూశాయని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ విస్మరించారని విమర్శించారు. చాలా ఆషామాషీగా ప్రధాని మోదీ గోరఖపూర్ విషాదాన్ని ప్రకృతి వైపరీత్యాలతో పోల్చారని మండిపడ్డారు. -
పార్లమెంటులో ఆనంద్శర్మ వర్సెస్ అరుణ్జైట్లీ
-
పార్లమెంటులో ఆనంద్శర్మ వర్సెస్ అరుణ్జైట్లీ
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగంపై విమర్శలు కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్శర్మ విమర్శలు చేయడంపట్ల పార్లమెంటులో గందరగోళం నెలకొంది. ఆనంద్శర్మ వర్సెస్ ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అరుణ్ జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆనంద్ శర్మ వ్యాఖ్యలను వెంటనే రికార్డుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రామ్నాథ్ కోవింద్ దేశ నిర్మాతల్లో జవహార్ లాలూ నెహ్రూ ప్రధానమైనవారని, ఆయన పేరును ప్రస్తావించకపోవడంతో ఆయన ప్రసంగం తమను నిరుత్సాహానికి గురిచేసిందని ఆనంద్ శర్మ అన్నారు. 'జాతి నిర్మాతలను ప్రతి దేశం ప్రతి సమాజం గౌరవిస్తుంది. అదే సంస్కృతి భారత్లోనూ కొనసాగుతోంది. భారత జాతి నిర్మాతల్లో అగ్రగణ్యులు గాంధీ ఆయనను గౌరవించారు. ఆయనతోపాటు జైలుకు వెళ్లొచ్చిన జవహార్ లాల్ నెహ్రూని మాత్రం వదిలేశారు. నిన్న గాంధీని పండిట్ దీన్ దయాల్ తో పోల్చారు' అని అన్నారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ నేతలంతా అడ్డు చెప్పారు. శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బల్లలు చరుస్తూ గందరగోళం చేశారు. ఆగ్రహంతో ఒక్కసారిగా నిల్చున్న అరుణ్ జైట్లీ వెంటనే ఆనంద్ శర్మ చేసిన ప్రసంగం మొత్తాన్ని రికార్డుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మేమంతా కూడా నిన్ననే జన్మించలేదు.. మాకు ఈ విషయాలు తెలియకుండా ఉండటానికి' అని ఆయన అన్నారు. -
‘బిగ్బాస్ షో’లోని సన్నివేశాలపై అభ్యంతరం
అలంపూర్ రూరల్: ఒక టీవీ ఛానెల్లో ప్రసారం అవుతున్న బిగ్బాస్ షోలో హైందవ సంస్కృతిని కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని బ్రాహ్మణ సంఘాల బాధ్యులు డిమాండ్ చేస్తున్నారు. హోమగుండం వద్ద బ్రష్ చేసుకుంటూ చలి మంటలు కాచుకుంటున్నట్లుగా.. అందులో ఆజ్యం పోస్తుండటం వంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు సరికాదని పేర్కొన్నారు. ఆయా సన్నివేశాలను తొలగించి క్షమాపణ చెప్పాలని జోగుళాంబ గద్వాల జిల్లా బ్రాహ్మణ సేవాసమితి ప్రధాన కార్యదర్శి శ్రీకొండుమాకాంత్ శర్మ సిద్ధాంతి, బ్రాహ్మణ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్శర్మ తదితరులు డిమాండ్ చేశారు. -
'ప్రపంచంలో మాకే చెత్తగా చెల్లింపులు'
చెన్నై: తమ రాష్ట్రంలోని రైతులంతా కూడా రుణమాఫీ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని తమిళనాడు ప్రభుత్వం తమ ఎమ్మెల్యేల జీత భత్యాలను మాత్రం ఒకేసారి రూ.50 వేలు పెంచేసింది. దీంతో ఇక నుంచి వారు నెలకు రూ.1.05లక్షల జీతం అందుకోనున్నారు. ఈ పెంపు కారణంగా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు పొందుతున్న పెన్షన్ కూడా రూ.12,000 నుంచి రూ.20 వేలకు పెరిగింది. ఇక తమ నియోజక వర్గాల అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్న నిధుల మొత్తం కూడా రూ.2కోట్ల నుంచి రూ.2.6కోట్లకు పెరిగింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళని స్వామి బుధవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా, మరోపక్క, తమ జీతభత్యాలు కూడా పెంచాలంటూ ఇప్పుడు ఎంపీలు కూడా డిమాండ్ చేస్తున్నారు. సమాజ్వాది పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్, కాంగ్రెస్ ఎంపీ ఆనంద్శర్మ జీతభత్యాలు పెంచాలంటూ డిమాండ్ లేవనెత్తారు. 'ప్రపంచంలోని ఒక్క భారత పార్లమెంటే చెత్తగా ప్రతినిధులకు జీత భత్యాలు చెల్లిస్తోంది' అని ఆనంద్శర్మ వ్యాఖ్యానించారు. ఒక అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ 'జర్నలిస్టులు, న్యాయ విభాగానికి చెందినవారు మరింత మంచి జీతభత్యాలు ఆపినట్లయితే మేం కూడా ఆపేస్తాం. మాకు చెల్లింపులు పెంచితే ఎందుకు సమస్య? న్యాయమూర్తులే అడుగుతున్నప్పుడు ఎంపీలుగా మేం ఎందుకు చెల్లింపులు పెంచాలని ఎందుకు అడగకూడదు? అని ప్రశ్నించారు. తాము కూడా 7వ వేతన చెల్లింపుల కమిషన్ పరిధిలోకి వస్తామని అందుకే డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. -
ఏకాభిప్రాయాన్నే కోరుకుంటున్నాం!
రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ వ్యాఖ్య న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయానికే తమ పార్టీ మొగ్గుచూపుతోందని కాంగ్రెస్ గురువారం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అధికార పక్షం అర్థం చేసుకుంటే బాగుంటుందని పేర్కొంది. ‘ప్రతి ముఖ్యమైన అంశంలో ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని కాంగ్రెస్ మొదట్నుంచీ భావిస్తోంది. కానీ రాష్ట్రపతి ఎన్నికపై ఇంకా స్పష్టత రావటం లేదు. ఈ విషయంలో ఏకాభిప్రాయంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తే బాగుంటుంది. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తినే రాష్ట్రపతిగా ఎన్నుకోవటమే మంచిది’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. కేంద్రం ఏం ఆలోచిస్తుందో చెప్పలేమన్న శర్మ.. దేశానికి వ్యతిరేకంగానే వారు ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. ప్రణబ్ముఖర్జీని ఏకగ్రీవంగా రాష్ట్రపతిని చేద్దామనుకున్నప్పుడు.. నాడు బీజేపీ మరో అభ్యర్థిని బరిలో దింపి మానసిక దివాళాకోరుతనాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. కాగా, బీజేపీ ఏర్పాటుచేసిన త్రిసభ్య బృందం నేడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలవనుంది. అడ్వాణీ అయితేనే బెటర్! ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ పేరును ప్రతిపాదిస్తే బాగుంటుందని ఆ పార్టీ నేత శతృఘ్న సిన్హా అన్నారు. అత్యున్నత పదవికి అడ్వాణీని మించిన అర్హులు ఇంకెవరున్నారని సిన్హా ప్రశ్నించారు. అడ్వాణీ శారీరకంగా, మానసికంగా బలంగానే ఉన్నారని వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. ‘రాజ్యాంగంలోని సంక్లిష్టతలను అర్థం చేసుకుని దేశ హితం కోసం పనిచేసే సత్తా ఇంకా అడ్వాణీలో ఉంది. ఆయన ఎవరి ఒత్తిళ్లకు లొంగరు’ అని సిన్హా ట్వీట్ చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఎన్డీయేతోపాటు ఇతర విపక్షాల్లోనూ ఎవరూ వ్యతిరేకించరన్నారు. -
ఈ జీఎస్టీ అసమగ్రం
♦ 40 శాతం ఆదాయం జీఎస్టీకి బయటే ♦ రాజ్యసభలో విపక్షాల మండిపాటు ♦ ద్రవ్య బిల్లుగా తీసుకురావడంపై అభ్యంతరం ♦ నాలుగు జీఎస్టీ బిల్లులపై చర్చ ప్రారంభం న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు సంబంధించిన నాలుగు బిల్లులపై బుధవారం రాజ్యసభలో చర్చ మొదలైంది. కేంద్ర (సీజీఎస్టీ), సమీకృత (ఐజీఎస్టీ), రాష్ట్రాలకు పరిహార జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంత జీఎస్టీ లపై కాంగ్రెస్ ఉప నేత ఆనంద్ శర్మ చర్చ ప్రారంభిస్తూ జీఎస్టీ అసమగ్రంగా ఉందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిం చారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పేర్కొన్న ఆదా యంలో 40శాతం జీఎస్టీకి బయటే ఉందని, అలాంటప్పుడు అది ఎలా ఆదర్శప్రాయమ వుతుందని ప్రశ్నించారు. మద్యం, పెట్రోలు, డీజిల్, రియల్ ఎస్టేట్ తదితరాలకు ఇచ్చిన మినహాయింపులు ఆందోళనకరంగా ఉన్నా యన్నారు. అక్రమ లావాదేవీలు, నల్లధనంపై పోరాడుతున్నా మన్న ప్రభుత్వం రియల్ ఎస్టే ట్ను ఎందుకు దీని పరిధిలోకి తీసుకు రాలేదని ప్రశ్నించారు. జీఎస్టీ అమలుకు ముం దు పన్ను చెల్లింపు దారులకు అధికారుల నుంచి వేధింపులు ఎదురుకాకుండా తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచిం చారు. దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ (కాంగ్రెస్) మాట్లా డు తూ.. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు జీఎస్టీని వ్యతిరేకించా రని, ఫలితంగా ప్రభుత్వఖజనాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపించారు. తాము ఈ బిల్లు లకు మద్దతిస్తూనే కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతు న్నామన్నారు. ‘జీఎస్టీ భావన మాజీ ప్రధాని వీపీ సింగ్ 1986లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే తెరపైకి వచ్చింది. ప్రస్తుత ప్రధా నికి ఎంత ఘనత దక్కాలో పాత ప్రధానులూ అంత ఘనతకు అర్హులు’ అని రమేశ్ అన్నారు. జీఎస్టీని ద్రవ్య బిల్లుగా తీసుకురావడాన్ని ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ తప్పుబట్టారు. రాజ్యసభ శాసన నిర్మాణ అధికారాల పునరు ద్ధరణకు ఆర్థిక మంత్రి జైట్లీ కృషి చేయాలని, రాజ్యాంగ సవరణ బిల్లు తేవాలని కోరారు. ‘హనుమంతునికి తన శక్తి గురించి ఇతరులు చెప్పాకే తెలిసింది. మీరు మా హనుమాన్. ఈ సభ నాయకులు’ అని అన్నారు. కార్మిక పరిహార బిల్లుకు ఆమోదం పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల్లో గాయపడే కార్మికులకు, వృత్తి సంబంధ వ్యాధులకు గురయ్యే కార్మికులకు రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు పరిహారాన్ని అందిం చేందుకు ఉద్దేశించిన ఉద్యోగుల పరిహార (సవరణ) బిల్లు–2016ను లోక్సభ సవరణలతో ఆమోదించింది. ఈ బిల్లును లోక్సభ గత ఏడాది ఆమోదించగా, రాజ్యసభ రెండు సవరణలతో ఆమోదించింది. దీంతో మళ్లీ లోక్సభ ముందుకొచ్చింది. సవరణలు ప్రతిపాదించవద్దు: సోనియా రాజ్యసభలో జీఎస్టీ బిల్లులకు ఎలాంటి సవరణలనూ ప్రతిపాదించకూడదని బుధవారం పార్టీ చీఫ్ సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇతర విపక్షాలు తెచ్చే సవరణలకు మద్దతిచ్చే అవకాశముందని సమాచారం. దీనిపై గురువారం జరిగే సమావేశంలో పార్టీ నేతలు నిర్ణయం తీసుకోనున్నారు. ఈవీఎంలపై రాజ్యసభలో రగడ ఈవీఎంలను బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ట్యాంపర్ చేస్తున్నారని విపక్షాలు రాజ్యసభలో ఆరోపించాయి. వచ్చే ఎన్నికలను బ్యాలట్ పేపర్లతో నిర్వహించాలని డిమాండ్ చేశాయి. విపక్ష ఆరోపణలను ప్రభుత్వం గట్టిగా తోసిపుచ్చింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలతో సభ దద్దరిల్లింది. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి.. ప్రభుత్వం దగా చేస్తోందని మండిపడ్డారు. మధ్యప్రదేశ్లో ఈవీఎంలను పరీక్షిస్తున్నప్పుడు ఓట్లు ఎవరికి వేసినా బీజేపీకే పడ్డాయని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రస్తావించారు. సభాకార్యక్రమాలను నిలిపేసి ఈ అంశంపై చర్చించాలని కాంగ్రెస్, ఎస్పీ నాలుగు నోటీసులు ఇవ్వగా, అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం దగాకోరు అని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆరోపించారు. దీనిపై అధికార సభ్యులు గొడవ చేశారు. ఆమె దేశ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అవమానించారని మంత్రి నక్వీ అన్నారు. బీజేపీ ఓడిన 2004, 2009 సార్వత్రిక ఎన్నికలు, ఇటీవలి బిహార్, పంజాబ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఈవీఎంలతోనే నిర్వహించారని, అప్పుడు కాంగ్రెస్కు ఏ అభ్యంతరమూ కనిపించలే దన్నారు. మాయావతి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు. ఈ అంశాన్ని పరిశీలించాల్సింది ఈసీనే అంటూ సభను వాయిదా వేశారు. లోక్సభకు ‘ఓబీసీ’ బిల్లు వెనకబడిన వర్గాల కోసం రాజ్యాంగ బద్ధ అధికారాలతో సాధికారిక కమిషన్ను ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగ(123వ సవరణ) బిల్లును సామాజిక న్యాయ మంత్రి థావర్చంద్ గెహ్లాట్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుత వెనకబడిన వర్గాల జాతీయ కమిషన్ను రద్దు చేసేందుకు మరో బిల్లునూ సభ ముందుంచారు. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) అధీకృత మూలధనాన్ని ఆరు రెట్లు పెంచి రూ.30వేల కోట్లుకు చేర్చేందుకు ప్రతిపాదించిన నాబార్డ్ సవరణ బిల్లును–2017ను ప్రభుత్వం సభ ముందుంచింది. -
ప్రధాని మోదీని బహిష్కరిస్తాం
కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ హెచ్చరిక ► మన్మోహన్ ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యలపై ఉభయ సభల్లో రభస ► ప్రధాని క్షమాపణకు డిమాండ్ ► మోదీ మూర్ఖుడు, అహంకారి: కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ ► ప్రధాని పదవి ఔన్నత్యాన్ని మోదీ దిగజార్చారు: రాహుల్ ► కాంగ్రెస్కు క్షమాపణలు కోరే నైతిక హక్కు లేదన్న బీజేపీ ► సోనియా ‘మృత్యు బేహారీ’ విమర్శను గుర్తు చేసిన అమిత్షా న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ప్రధాని మోదీతోపాటు అధికార బీజేపీపై ఘాటైన విమర్శలు చేసింది. ప్రధాని క్షమాపణలు చెప్పని పక్షంలో బడ్జెట్ సమావేశాల్లో మోదీని బహిష్కరిస్తామని హెచ్చరించింది. మాజీ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ‘పార్లమెంటులో మేం ప్రధానిని బహిష్కరిస్తాం. ఆయన మాటలను మేం వినదలచుకోలేదు. అలాగని ప్రధానమంత్రి కార్యాలయం గౌరవమర్యాదలకు భంగం కలిగించకుండానే మా నిరసన కొనసాగిస్తాం. ఆయనో మూర్ఖుడని మాకు తెలుసు. ఓ అహంకారి ప్రధానమంత్రి సీట్లో కూర్చోవటం బాధాకరం’ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ఘాటుగా విమర్శించారు. రాజకీయ చర్చల్లో వినకూడని భాషను మోదీ వాడతారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం పరువుతీస్తున్నారని.. ఆయనపై వస్తున్న విమర్శలపై మోదీ అసహనంతో ఉన్నారన్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఆయన భాష మారటం లేదన్నారు. మన్మోహన్ సింగ్ను, మాజీ ప్రధాని ఇందిర గురించి అవమానకర రీతిలో మాట్లాడారన్నారు. పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగాన్ని మోదీ అవమానించటాన్ని సహించేది లేదని శర్మ స్పష్టం చేశారు. ఉభయసభల్లో నిరసన మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ గురువారం ఉభయ సభల్లో నిరసనను వ్యక్తం చేసింది. ప్రధాని క్షమాపణకు పట్టుబట్టడంతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. అటు లోక్సభలోనూ జైట్లీ ప్రసంగాన్ని విపక్షం పలుమార్లు అడ్డుకుంది. గురువారం ఉదయం కాంగ్రెస్ పార్టీ.. జేడీయూ, వామపక్షాలు, డీఎంకే, సమాజ్వాదీ పార్టీల నేతలతో వ్యూహాత్మక సమావేశం ఏర్పాటుచేసింది. మలిదశ బడ్జెట్ సమావేశాల్లో తమ వ్యూహాన్ని అమలుచేస్తామని ప్రకటించింది. అటు, ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ‘ప్రధాని పదవి ఔన్నత్యాన్ని మోదీ దిగజార్చారు’ అని విమర్శించారు. బీజేపీ ఎదురుదాడి: కాంగ్రెస్ హెచ్చరికలపై బీజేపీ తీవ్రంగా ప్రతిఘటించింది. మోదీ క్షమాపణలు చెప్పాలని కోరే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని, కాంగ్రెస్సే మోదీకి క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రధాని వ్యాఖ్యలు దురదృష్టకరమంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ చేసిన విమర్శలను బీజేపీ చీఫ్ అమిత్షా తిప్పికొట్టారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్నుద్దేశించి ‘మృత్యు బేహారీ’ అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు గుర్తుచేసుకోవాలని సూచించారు. ‘కాంగ్రెస్కు ఆ హక్కు లేదు’ పార్లమెంట్ కార్యకలాపాలను ప్రతిపక్షా లు అడ్డుకోవడంపై పార్లమెంటరీ వ్యవహా రాల మంత్రి ఎం. వెంకయ్య నాయుడు మండిపడ్డారు. ప్రధానిని క్షమాపణలు కోరే నైతిక హక్కు పత్రిపక్షాలనికి లేదని, గతంలో వారు ప్రధానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్కు, ప్రధానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రధానిపై ఆరోపణలు చేసి ఇప్పుడు ప్రవచనాలు చెప్పడం సరికాదని హితవు పలికారు. -
ఆర్బీఐని, బ్యాంకులను ఎలా నమ్మాలి?
కొచ్చి: ఆర్బీఐ, బ్యాంకులు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మాటల దాడి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అనే విపత్కర నిర్ణయం కారణంగా దేశ ప్రజలకు ఆర్బీఐ, బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం పోయిందని అన్నారు. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ మాట్లాడుతూ ‘కోట్లకు కోట్లు కొత్తగా ప్రింట్ చేసిన నోట్లు వెనుక డోర్ల నుంచి బయటకు వెళ్లిపోతున్నాయి. కానీ, పేద ప్రజలు కష్టపడి సంపాధించుకున్న కొద్దిపాటి మొత్తం కూడా బ్యాంకుల నుంచి డ్రా చేసుకోలేకపోతున్నారు. వాస్తవానికి భారత ప్రజలకు ఆర్ధిక సంక్షోభం సమయంలో కూడా బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం ఉంది. ఆ సమయంలో బ్యాంకులు తమ విశ్వాసాన్ని నిరూపించుకున్నాయి. కానీ, ఇప్పుడు మాత్రం ఆర్బీఐ, బ్యాంకులపై నమ్మకం పోయింది. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే ఎంతో కష్టపడి పేద ప్రజలు తాము సంపాధించుకున్న కొంతమొత్తం డబ్బును సేవింగ్ ఖాతాల్లో జమ చేసుకుంటారు. ఎందుకుంటే వారికి బ్యాంకులపై నమ్మకం. ఎప్పుడంటే అప్పుడు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తారు. కానీ, ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రజలు ఆ డబ్బును తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే బ్యాంకుల్లో డబ్బు లేదు. ఏటీఎంలలో లేదు. కానీ, కొంతమందికి మాత్రం బ్యాక్ డోర్ల ద్వారా కోట్లలో కొత్తగా ముద్రిస్తున్న నోట్లు ఏ సమస్య లేకుండా వెళ్లిపోతున్నాయి. ఇలాంటప్పుడు ప్రజలు ఎలా బ్యాంకులను, ఆర్బీఐని విశ్వసిస్తారు’ అని ఆనంద్ శర్మ అన్నారు. -
ఆనంద్ శర్మ ప్రశ్నతో రచ్చరచ్చ
న్యూఢిల్లీ: కేంద్రంలోని పెద్దల సభ మరోసారి మార్మోగింది. రెండుసార్లు వాయిదా పడిన రాజ్యసభ కాంగ్రెస్పార్టీ నేత ఆనంద్ శర్మ కేంద్ర మంత్రి కిరెన్ రిజీజుపై తలెత్తిన ఆరోపణలు లేవనెత్తడంతో గందరగోళం నెలకొంది. అరుణాచల్ ప్రదేశ్లోని హైడ్రో ప్రాజెక్టు విషయంలో రిజీజు అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని, పదవిలో నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్చేయడంతో రాజ్యసభలో అధికార విపక్షాల మధ్య దుమారం రేగింది. ఉభయ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో చివరకు రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు. -
లోక్సభలో మాట్లాడనీయట్లేదు!
అందుకే జనసభల్లో చెబుతున్నా: మోదీ - మున్ముందు మరిన్ని కఠిన నిర్ణయాలు.. - అయితే.. 50 రోజుల్లో నోట్లరద్దు కష్టాలు తగ్గుముఖం పడతాయి - నగదు రహితంతోనే చాలా సమస్యలకు పరిష్కారం - ప్రజలను ‘డిజిటల్’పై చైతన్యపరచాలని పార్టీ కార్యకర్తలకు సూచన దీసా/గాంధీనగర్ (గుజరాత్): రానున్న కాలంలో మరిన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావొచ్చని ప్రధానమంత్రి మోదీ దేశప్రజలను హెచ్చరించారు. అయితే.. నోట్ల రద్దు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు 50 రోజుల తర్వాత సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు. గుజరాత్లోని బనస్కాంత జిల్లా దీసాలో రూ. 350 కోట్ల వ్యయంతో నిర్మించిన వెన్న తయారీ కేంద్రాన్ని మోదీ శనివారం ప్రారంభించి ప్రసంగించారు. నోట్లరద్దుపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మెల్లిగా తగ్గుముఖం పడతాయన్నారు. ‘ఇదేం సాధారణమైన నిర్ణయం కాదు. దీని వల్ల సమస్యలు వస్తాయని తొలి రోజు నుంచీ చెబుతున్నాను. 50 రోజుల వరకు సమస్యలుంటాయి. రోజురోజుకీ సమస్య పెరుగుతుంది. కానీ ఆ తర్వాత (50 రోజుల తర్వాత) పరిస్థితులు సర్దుకుంటాయి. మీ కళ్లముందే అంతా జరుగుతుంది’ అని అన్నారు. నోట్లరద్దును కారణంగా చూపి పార్లమెంటు కార్యకలాపాలకు అడ్డుపడుతున్న విపక్షాలపైనా మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. విపక్షాలు వ్యవహరిస్తున్న తీరు అసంతృప్తికరంగా ఉందన్నారు. ‘నేను లోక్సభలో మాట్లాడకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయి. అందుకే జనసభలో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. కానీ మాట్లాడే అవకాశం వచ్చినపుడు లోక్సభలో 125 కోట్ల మంది ప్రజల గొంతుకను వినిపిస్తా. విపక్షాలు సభలో వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రపతి కూడా అసంతృప్తితో ఉన్నారు’ అని ప్రధాని చెప్పారు. ప్రజల కష్టాలను చూపుతూ తనను విమర్శిస్తున్నవారంతా.. ప్రజలకు మొబైల్ బ్యాంకింగ్ విషయాన్ని అర్థమయ్యేలా వివరిస్తే బాగుంటుందన్నారు. విపక్షాలు కోరుతున్నట్లుగానే నోట్లరద్దుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భారతీయులంతా నోట్ల రద్దుకు మద్దతుగానే ఉన్నారని అయితే.. అమలు సరిగా ఉండాలనే వారు కోరుకుంటున్నారని మోదీ తెలిపారు. ‘నోట్లరద్దుతో ఉగ్రవాదం, నక్సలిజాల వెన్నెముక విరిగిపోయింది. అవినీతి, నల్లధనంపై చేస్తున్న ఈ పోరాటం వల్ల నిజాయితీగా ఉన్న వారికి, పేదలు, అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుంది’అని ప్రధాని వెల్లడించారు. నోట్లరద్దు కష్టాలనుంచి బయటకు వచ్చేందుకు నగదురహిత ఆర్థిక వ్యవస్థవైపు పయనించాల్సిన అవసరముందని ప్రజలను కోరారు. నల్లధన కుబేరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కొందరు తనను కలసి నోట్లరద్దును వారం రోజులు వాయిదా వేయమని కోరారని మోదీ తెలిపారు. పార్టీలకతీతంగా డిజిటల్ లావాదేవీలవైపు ప్రజలను నడిపించేందుకు విపక్షాలు ప్రభుత్వంతో కలసిరావాలని మోదీ కోరారు. ప్రజలను చైతన్యపరచండి.. గాంధీనగర్లో బీజేపీ కార్యకర్తలనుద్దేశించి మోదీ మాట్లాడారు. డిజిటల్ లావాదేవీలపై ప్రజలను ప్రోత్సహించేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దీనివల్ల అవినీతిని పారదోలవచ్చన్నారు. కొన్నేళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ శిథిలమౌతూ వస్తోందని.. దీన్ని బలోపేతం చేసేందుకు నగదు రహిత లావాదేవీలను ప్రజలకు అర్థం చేయించాలన్నారు. కేంద్ర పథకాలను చివరి లబ్ధిదారుడి వరకు చేరేలా కృషిచేయాలన్నారు. మోదీ అభివృద్ధి ఎజెండాపై ఫీచర్ ఫిల్మ్ ముంబై: మోదీ అభివృద్ధి ఎజెండా, దేశంలో మార్పునకు సంబంధించి ఆయన దృక్పథంపై పూర్తి స్థాయి ఫీచర్ ఫిల్మ్ నిర్మిస్తున్నట్ల బిహార్కు చెందిన సినీ నిర్మాత వెల్లడించారు. ‘మోదీ కా గావ్’ పేరుతో 2 గంటల 15 నిమిషాల నిడివి గల ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో వుంది. తల్లిని కలిసిన మోదీ గుజరాత్ పర్యటనలో మోదీ తన తల్లి హీరాబెన్ను కలిశారు. బీజేపీ కార్యకర్తలతో భేటీకి ముందు గాంధీనగర్ శివార్లలోని రైజాన్లో సోదరుడు పంకజ్ మోదీ ఇంటికెళ్లిన ప్రధాని.. అక్కడ తల్లితో కాసేపు మాట్లాడి ఆశీస్సులు తీసుకున్నారు. 20 నిమిషాల సేపు మోదీ తల్లితో గడిపారు. సెప్టెంబర్ 17న తన పుట్టినరోజు (గుజరాత్ పర్యటనలో ఉన్నారు) సందర్భంగా కూడా మోదీ తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. అడ్డుకోవటం లేదు: కాంగ్రెస్ తనను పార్లమెంటులో మాట్లాడకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయన్న మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. నోట్లరద్దుపై ప్రజలకు మోదీ అవాస్తవాలు చెబుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ విమర్శించారు. అబద్ధాలు చెప్పటం అలవాటుగా మార్చుకున్న మోదీని పార్లమెంటులో మాట్లాడకుండా ఎవరూ అడ్డుకోవటం లేదన్నారు. మోదీ మాట్లాడాలని డిమాండ్ చేస్తున్న విషయాన్ని గుర్తుచేసిన శర్మ.. తమ ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాల్సి ఉంటుందని డిమాండ్ చేశారు. నోట్లరద్దును పార్లమెంటులో మోదీ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. -
నోట్ల కష్టాలతో 70 మంది మృతి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారు అనాలోచితంగా పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు కష్టాలు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. దేశవ్యాప్తంగా నోట్ల కష్టాలతో 13 రోజుల్లో 70 మంది ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివాలా తెలిపారు. బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల ముందు క్యూలో నిలబడి సామాన్యులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తిరోగమనంలోకి తీసుకెళుతోందా, ముందుకు తీసుకెళుతోందా అని ప్రశ్నించారు. కేంద్రం పలాయనవాదం అవలంభిస్తోందని మండిపడ్డారు. తప్పించుకునే ధోరణి సరికాదని అన్నారు. దేశంలో 86 శాతం నగదు నల్లధనం రూపంలో ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్టు వార్తలు వస్తున్నాయని, నిజంగా మోదీ ఈ మాట అనుంటే అంతకన్నా అవమానకర ప్రకటన మరోటి ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ అన్నారు. చట్టబద్దంగా దాచుకున్న నగదుపై నియంత్రణలు విధించడం సమంజసం కాదన్నారు. నోట్ల కష్టాలతో సామాన్యులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆ డబ్బంతా నల్లధనమేనా?
-
ఆ డబ్బంతా నల్లధనమేనా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే ఒక్క ప్రకటనతో పెద్దనోట్లను రద్దు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యసభలో పెద్ద నోట్ల రద్దుపై చర్చ సందర్భంగా ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. చలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతం రూ.500, 1000 నోట్లేనని ఆనంద్ శర్మ గుర్తు చేశారు. ఈ డబ్బంతా నల్లధనమేనా అంటూ ఆయన సూటిగా ప్రశించారు. నల్లధనం పేరుతో దేశంలో అలజడి సృష్టించారని ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. నల్లధనం వెలికితీయడానికి మేం వ్యతిరేకం కాదు బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ లైన్ పెరుగుతున్న కొద్ది నగదు విత్ డ్రాను కేంద్రం పెంచుతోంది నగదు రహిత దేశమన్న నేతలు సామాన్యుల కడుపులు నింపే దాబాల్లో కార్డులు చెల్లవని మర్చిపోయారు ఎలాంటి సమయం ఇవ్వకుండా, హెచ్చరిక చేయకుండా పెద్దనోట్లు రద్దు చేశారు రైతుల వద్ద క్రెడిట్ కార్డులు ఉన్నాయా? దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతన్నలు నల్లధనాన్ని ఇంటికి తీసుకువెళుతున్నారా? సామాన్యుల వద్ద ఉన్న రూ.500, 1000నోట్లు నల్లధనమా ప్రతి విషయాన్ని సర్జికల్ స్ట్రైక్ అంటున్నారు. ఏమీ చదువుకోకుండానే మీరంతా డాక్టర్లు అయ్యారు నోట్ల రద్దుతో మీరు ఎంపిక చేసుకున్న 15-20మంది పారిశ్రామిక వేత్తలకు సాయం చేశారు రెండున్నరేళ్లలో అప్పు మాఫీ చేసింది ఎవరికీ, రైతులకా? పారిశ్రామికవేత్తలకా? మీకు నచ్చినవాళ్లను నెత్తిన పెట్టుకుంటున్నారు తప్పు చేశారని ప్రశ్నిస్తే నిందిస్తున్నారు ప్రధాని మోదీ మరో గ్రహంలో ఉన్నారా అని ఆలోచన కలుగుతోంది ప్రధాని మోదీ మరో గ్రహంలో ఉన్నారా అని ఆలోచన కలుగుతోంది రంగుపోయే రూ.2వేల నోటును ఎవరూ నమ్మడం లేదు నల్లధనం సూట్కేసుల్లోనూ, కప్ బోర్డులోనూ లేదు వేలకోట్ల నల్లధనవంతులతో మోదీ విమానాల్లో తిరుగుతున్నారు స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నవారి పేర్లు బయటపెట్టాలి ఆస్తులు, పెట్టుబడుల రూపంలో నోట్ల రద్దు వల్ల శుభకార్యాలు నిలిచిపోయాయి దహన సంస్కారాలపై కూడా రద్దు ప్రభావం పడింది సామాన్యులకు ప్రధాని క్షమపణ చెప్పాలి 1946లో తొలిసారి, 1978లో రెండోసారి నోట్ల రద్దు జరిగింది అప్పుడు ఇలాంటి గందరగోళం ఏర్పడలేదు నోట్ల రద్దు పక్షపాతంతో తీసుకున్న నిర్ణయం దేశం మొత్తాన్ని మీరు క్యూలో నిలబెట్టారు బ్యాంకుల ముందు ఎవరైనా ధనికులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారా? -
'మేం కాదు.. నాడు మీరే వద్దన్నారు'
న్యూఢిల్లీ: తాము రాజకీయ పరంగా జీఎస్టీ బిల్లుకు వ్యతిరేకంకాదని కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ అన్నారు. అయితే, ఈ బిల్లు విషయంలో తమ ఆందోళనలను, లేవనెత్తే అంశాలను ప్రభుత్వం పట్టించుకోవాలని ఆయన చెప్పారు. బుధవారం రాజ్యసభలో జీఎస్టీ బిల్లుపై ఆయన ప్రసంగిస్తూ పదేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లు ప్రస్తావన తెచ్చినప్పుడు అది రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడేస్తుందని అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఆరోపించిందని గుర్తు చేశారు. అసలు ఆ బిల్లే రాజ్యాంగానికి వ్యతిరేకం అని వ్యాఖ్యానించిందని చెప్పారు. కానీ, ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక ఈ బిల్లుపై ఆలోచనలు మారాయని చెప్పారు. అయితే, పదేళ్ల కిందట కాంగ్రెస్ తీసుకున్న చారిత్రాత్మక అడుగు ఈ జీఎస్టీ బిల్లేనని చెప్పారు. ఇది అత్యంత ముఖ్యమైనదని అన్నారు. దేశ ప్రయోజనాలకోసం కాంగ్రెస్ పార్టీ ఏవైతే అంశాలను ఈ బిల్లు విషయంలో చెబుతుందో వాటని కేంద్రం పట్టించుకుంటే చాలా బాగుంటుందని అన్నారు. ప్రజలపై అదనపు పన్నుల భారం పడటం తమకు ఏమాత్రం ఇష్టం లేదని, పరోక్ష పన్నులు తగ్గు ముఖం పట్టాల్సిన అవసరం ఉందన్నారు. -
రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. జేఎన్యూ వివాదానికి సంబంధించి రాజద్రోహం ఆరోపణలతో సైబారాబాద్ పరిధిలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ తోపాటు కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ, కేసీ త్యాగి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జేఎన్ యూ విద్యార్థి నేతలు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, వామపక్ష నేతలు డీ రాజా, సీతారం ఏచూరిపై కూడా కేసు నమోదు చేశారు. వీరిపై ఐపీసీ సెక్షన్లు 124(ఏ) 156 (3) కింద ఆరోపణలు నమోదు చేశారు. -
కేసు పెట్టిన ఆనంద్ శర్మ
ఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్ యూ)లో తనపై దాడి జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ కేసు పెట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని వసంత్ విహార్ పోలీసుస్టేషన్ లో ఆదివారం ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 'దేశద్రోహం' కేసులో విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ జవహర్లాల్ నెహ్రూ వర్సిటీలో విపక్షాలు శనివారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో రాహుల్గాంధీతో పాటు, ఢిల్లీ పీసీసీ చీఫ్ అజయ్మాకెన్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా నిర్ధారితుడైన అఫ్జల్గురుకు ఉరిశిక్షను అమలు చేయటాన్ని నిరసిస్తూ.. జేఎన్యూ ఆవరణలో గత మంగళవారం నాడు నిరసన కార్యక్రమం నిర్వహించటంపై వసంత్గంజ్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 124 ఎ (దేశద్రోహం), 120 బి (నేరపూరిత కుట్ర) సెక్షన్ల కింద కేసు నమోదు చేయటం.. ఈ కేసులో జేఎన్యూఎస్యూ అధ్యక్షుడు, ఏఐఎస్ఎఫ్ నేత కన్హయ్యకుమార్ను శుక్రవారం అరెస్ట్ చేయటం తెలిసిందే. -
'బీజేపీ నేతల ప్రకటనలు అవమానకరం'
న్యూఢిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోదీ విఫలమయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించడంలో ఆయన వైఫల్యం కొట్టిచ్చినట్టు కనబడుతోందని అన్నారు. విద్యార్థుల ఆందోళనలతో యూనివర్సిటీలు దద్దరిల్లుతున్నా ప్రధాని పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేములపై బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు అభ్యంతరకరం, అవమానకరం, చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. కాగా, జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తాము ప్రయత్నించడం లేదని ఆయన తెలిపారు. బీజేపీ, పీడీపీ సంకీర్ణం ఏం చేస్తుందోనని ఎదురు చూస్తున్నామని చెప్పారు. -
ఆ టూర్ ముందు అనుకున్నదే
-
ఆ టూర్ ముందు అనుకున్నదే: ఆనంద్ శర్మ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంచి రాజనీతిజ్ఞుడని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కితాబు ఇవ్వడాన్ని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ తప్పుబట్టారు. పాక్ పర్యటన ప్రధానమంత్రి ముందు నుంచి అనుకున్నదే తప్ప.. అప్పటికప్పుడు అనుకుని చేసినది కాదని ఆయన వ్యాఖ్యానించారు. భారత జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రం మోదీ ఈ పని చేయలేదని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాకముందు పాక్ పేరెత్తితేనే ఒంటికాలి మీద లేచేదని, అప్పట్లో అర్ధవంతమైన చర్చలు జరగకుండా అడ్డుకుందని ఆనంద్ శర్మ ఆరోపించారు. పాకిస్థాన్లో ప్రభుత్వంతో సత్సంబంధాలున్న ఓ వ్యాపారవేత్త కూడా నవాజ్ షరీఫ్ వెంట ఉన్నారని, అలాంటప్పుడు ప్రధాని పర్యటన అప్పటికప్పుడు అనుకున్నదని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. -
త్రిమూర్తులు దిగివచ్చినా అది సాధ్యం కాదు!
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)బిల్లును నిర్దేశిత గడువు ఏప్రిల్ 1లోపు అమల్లోకి తేవడం.. బ్రహ్మ, హరిహరాది త్రిమూర్తులు దిగివచ్చినా సాధ్యం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్శర్మ పేర్కొన్నారు. 'ప్రధానమంత్రి ముందుకొచ్చి ప్రతిపక్ష నేతతో ఓ యుగళగీతాన్ని పాడినా, మేమంతా కలిసి అధిక సమయం పనిచేసినా గడువు అయినా ఏప్రిల్ 1 (2016)ను అందుకోలేం' అని ఆయన పరిశ్రమల సంస్థ ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొన్నారు. 'మన పురాణాలలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించి మనం మాట్లాడుకుంటాం. వాళ్లు ముగ్గురు ఒకచోటకు వచ్చినా 50శాతం రాష్ట్రాల సమ్మతి, మూడు చట్టాలు (కేంద్ర జీఎస్టీ, రాష్ట్రాల జీఎస్టీ, ఐజీఎస్టీ) ఆమోదం సాధ్యపడదు' అని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుతం రాజ్యసభలో ఆగిపోయింది. పెద్దలసభలో అధికార ఎన్డీయేకు మెజారిటీ లేకపోవడంతో ఆమోదం కోసం ఎదురుచూపులు చూస్తున్నది. స్వాతంత్ర్యానంతరం పరోక్ష పన్నుల విధానంలో సమగ్ర సంస్కరణలతో తీసుకొస్తున్న బిల్లుగా జీఎస్టీ పేరొందింది. -
'మాకు రాజకీయ ఉద్దేశాలు లేవు.. జాతికోసమే'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తో తమ పార్టీ నేతలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అయిన భేటీ నిర్మాణాత్మకమైనదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. ఈ భేటీ వెనుక వ్యక్తిగత రాజకీయ ఉద్దేశాలు లేవని చెప్పారు. జీఎస్టీ బిల్లుపై ఉన్న తమ డిమాండ్లు రాజకీయాలకు అతీతమైనవని, జాతీయ ప్రయోజనాలు ఆశించే తాము ఆ డిమాండ్లు చేస్తున్నామని చెప్పారు. మోదీతో అయిన భేటీలో కాంగ్రెస్ పార్టీ తన డిమాండ్లను చెప్పిందని, కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని సీరియస్ గానే విన్నదని, దానికి అనుకూలంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని తాము భావిస్తున్నామని అన్నారు. ఏదేమైనా మరోసారి తాము పార్టీ అంతర్గతంగా చర్చించుకుంటామని, విస్తృత ఆలోచనలు జరుపుతామని ఆనంద్ శర్మ తెలిపారు. -
ప్రధాని నుంచి ప్రతిపాదన వస్తేనే...
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెర దించాల్సిన బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. సమస్య పరిష్కారానికి ప్రధాని నుంచి ప్రత్యక్ష ప్రతిపాదన వస్తే అఖిలపక్ష సమావేశానికి వస్తామని కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ తెలిపారు. వార్తల్లో నిలవవాలన్న ఆకాంక్ష తమకు లేదన్నారు. తమ డిమాండ్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లలిత్ గేట్, వ్యాపం కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మ స్వరాజ్, వసుంధర రాజె, శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. కాగా, పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. -
రాజ్యసభలో రచ్చరచ్చ
న్యూఢిల్లీ: రాజ్యసభలో గందరగోళం నెలకొంది. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని పట్టుబట్టడంతో అధికార విపక్షాల మధ్య వాదవివాదాలు నెలకొన్నాయి. దీంతో సభ ప్రారంభమైన కొద్ది సేపటికే ఇదే అంశంపై మూడు సార్లు వాయిదా పడింది. మంగళవారం సభ ప్రారంభకాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ మాట్లాడుతూ 'మోదీ విదేశాల్లో ఉన్నప్పుడు కొన్ని మాటలు అన్నారు. వాటికి వివరణ ఇవ్వాలి. దేశం తరుపున విదేశీ పర్యటనలకు ప్రధానిగా వెళ్తున్న ప్రధానులంతా ఓ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. విదేశాల్లో ప్రధాని ఉన్నప్పుడు ప్రతిపక్షం కూడా అదే పద్ధతిని అనుసరిస్తోంది. కెనడా వెళ్లినప్పుడు స్కామ్ ఇండియా అన్నారు. ఇండియా మొత్తం కుంభకోణాల దేశమా.. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది తప్ప భారత్ కుంభకోణాల దేశం కాదు.అంతేకాకుండా 60 ఏళ్ల నుంచి మురికి పేరుకుపోయిందని, దానిని తాను శుభ్రం చేస్తున్నానని అన్నారు. దీంతో ఆయన తన హోదాను స్వయంగా తగ్గించుకున్నారు. మాజీ ప్రధానులందరినీ అవమానించారు' దీనిపై చర్చించాల్సిందే అంటూ స్పీకర్కు నోటీసు ఇచ్చారు. మోదీ దేశానికి ప్రధానిగా విదేశాలకు వెళ్లారు తప్ప బీజేపీ నేతగా వెళ్లలేదని చెప్పారు. దీనిపై బీజేపీ నేతలు అడ్డు చెప్పడంతో సభలో గందరగోళం తోడైంది. ఆనంద్ శర్మకు మద్దతుగా జేడీయూ, సమాజ్ వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐఎం తోడయ్యాయి. విదేశాలకు వెళ్లినప్పుడు ప్రధాని మోదీ భాష ఏమాత్రం బాగాలేదని, దేశాన్ని దేశ ప్రముఖ వ్యక్తులను విదేశాల్లో అవమాన పరిచేలా ఉందని అభ్యంతరం చెప్పారు. కాగా, ప్రధాని మాటలను కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ సమర్థించారు. ఆ విషయం చర్చించాలంటే 60 ఏళ్లలో జరిగిన కుంభకోణాలన్నింటిపై చర్చజరగాల్సిందేనని అన్నారు. దీంతో సభ రెండుగంటలవరకు వాయిదా పడింది. -
‘గూఢచర్యం’పై దద్దరిల్లిన సభలు
ఎస్పీజీ భద్రత ఉన్న రాహుల్ వివరాలను ఎందుకు సేకరించారు?: ఆజాద్ విపక్ష నేతలు, జడ్జీల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది: ఆనంద్శర్మ ప్రభుత్వ వివరణతో తృప్తి చెందని విపక్షాలు, రాజ్యసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీపై ప్రభుత్వం గూఢచర్యం చేస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు సోమవారం పార్లమెంటులో తీవ్రస్థాయిలో నిరసనలకు దిగాయి. అయితే.. చిన్నపాటి పుట్ట కూడా కాని దానిని పెద్ద పర్వతంలా చూపేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ ప్రభుత్వం వాటి ఆరోపణను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది. రాజ్యసభలో 267వ నిబంధన కింద సభా కార్యక్రమాలను రద్దు చేసి ఈ అంశంపై చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్ ఇచ్చిన నోటీసును డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ తిరస్కరించారు. దీనికి విపక్ష సభ్యులు నిలుచుని నిరసనలు వ్యక్తంచేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. రాహుల్ తండ్రి రాజీవ్గాంధీ ప్రధాని అయినప్పటి నుంచీ రాహుల్ ఎస్పీజీ భద్రతలో ఉన్నారని పేర్కొన్నారు. కానీ పోలీసులు ఇప్పుడు మాత్రమే రాహుల్ వాడే బూట్ల సైజు, జుట్టు రంగు, అలవాట్లు, ఆయన సహచరులు, స్నేహితులు, సహాయకుల గురించిన సమాచారాన్ని సేకరించటం ఎందుకో అంతుచిక్కని విషయమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్శర్మ మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ఇతరుల టెలిఫోన్లను ప్రభుత్వం దిగుమతి చేసుకున్న పరికరాల ద్వారా ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ఈ గూఢచర్యం అంశంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులపై గూఢచర్యానికి, నిఘాకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ సత్యవ్రత్ చతుర్వేది, ఎస్పీ నేతలు నరేశ్ అగర్వాల్, రామ్గోపాల్యాదవ్, జేడీయూ నేత కేసీ త్యాగి తదితరులు కూడా ఆరోపణలు చేశారు. లోక్సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. రాజకీయ ప్రత్యర్థులపై గూఢచర్యానికి పాల్పడటం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం గుజరాత్ నమూనా పాలనను అమలుచేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఇలా ఎన్నడూ జరగలేదన్నారు. విపక్షాల ఆరోపణలకు రాజ్యసభ నాయకుడు, ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ఉభయసభల్లోనూ సమాధానం ఇచ్చారు. ఢిల్లీలో నివసిస్తున్న వీఐపీలకు పారదర్శక భద్రత కోసం వారి వ్యక్తిగత వివరాలను ఢిల్లీ పోలీసులు 1987 నుంచీ ఒక నమూనా రూపంలో సేకరిస్తున్నారన్నారు. ఆ ప్రొఫార్మాలో ఏముంటుంది? వేసుకునే దుస్తులు, తొడుక్కునే బూట్లు, సహచరులు, ఏదైనా అవకరం,ప్రత్యేక లక్షణం, ప్రత్యేక గుర్తింపు గుర్తులు, మారు పేర్లు.. ఇవి రాహుల్ వ్యక్తిగత వివరాలకు సంబంధించి పోలీసులు సేకరించాలనుకున్న వివరాల్లో కొన్ని. ఈ ప్రశ్నలతో 2 పేజీల నమూనా పత్రం ఉంటుంది. దీన్ని సబ్-ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి పూరిస్తారు. మాజీ ప్రధాని వాజ్పేయి, మాజీ ఉప ప్రధాని అద్వానీ, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకు సంబంధించి ఈ పత్రాలనే పూరించారు. వాజపేయికి సంబంధించిన ప్రొఫార్మాలో.. ఆయన హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం మాట్లాడతారని. పెళ్లి చేసుకోలేదని ఉంది. అద్వానీకి మీసాలు ఉంటాయని, సుష్మాస్వరాజ్ చీర, శాండల్స్ ధరిస్తారని, బొట్టు పెట్టుకుంటారని ఉంది. -
ఆ విషయంలో మేం మారం.. అందుకు ఒప్పుకోం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు మద్దతిస్తాం కానీ భూసేకరణ సంబంధించిన ఆర్డినెన్స్ విషయంలో తమ వైఖరి మార్చుకోబోమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ మాత్రం మెతకగా వ్యవహరించలేమని తెలిపింది. సమావేశాల నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఆదివారం ఉదయం కలిశారు. సమావేశాలు సజావుగా సాగేందుకు తాము సహకరిస్తామని సోనియా చెప్పినట్లు తెలిపారు. అయితే, కాంగ్రెస్కే చెందిన ఆనంద్ శర్మ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ భూసేకరణ ఆర్డినెన్స్పై రాజీపడబోమన్నారు. బొగ్గు ఆర్డినెన్స్ విషయంలో కూడా వెనక్కి తగ్గబోమని చెప్పారు. చట్టసభల్లో అందరి ఆమోదంతో చేయాల్సిన చట్టాలను బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి వేరే మార్గం ద్వారా ఆమోదింప చేసుకోవాలని చూస్తోందని విమర్శించారు. భూసేకరణ ఆర్డినెన్స్ ముమ్మాటికీ రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నదేనని, దానికి తాము అంగీకరించబోమని చెప్పారు. -
నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై అసత్య ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాబర్ట్ వాద్రాపై అసత్య చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ, రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ల మధ్య కుదిరిన భూ లావాదేవీకి సంబంధించిన ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధం చేసిందని మోదీ ఆరోపించారు. ఈ వ్యవహారంలో హర్యానా ప్రభుత్వం కోడ్ ఉల్లంఘించలేదని ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రధాని పదవిని మోదీ అవమానించారని అన్నారు. ఇకకైన మోదీ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. -
'ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలి'
ముంబై: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో మోదీ విఫలమయ్యారని ఆయన విమర్శించారు. వంద రోజుల పాలన పూర్తిచేసుకున్న మోదీ.. ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు. అరచేతిలో స్వర్గం చూపించి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారని దుయ్యబట్టారు. మంచి రోజులు వస్తాయని ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. మోదీకి, ఆయన ప్రభుత్వానికి మాత్రమే మంచి రోజులు వచ్చాయని చెప్పారు. ప్రజల స్థితిగతులు ఏమీ మారలేదని ఆనంద్ శర్మ అన్నారు. -
‘ఇది శుష్కవాగ్దానాల నిరర్థక ప్రభుత్వం’
న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ గత వందరోజుల్లో దుష్పరిపాలనకు పాల్పడిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఢిల్లీలో ఒక పుస్తకాన్ని వెలువరించింది. మోదీ ప్రభుత్వం-వందరోజుల దుష్పరిపాలన అన్న శీర్షికతో రూపొందించిన పుస్తకాన్ని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ విడుదల చేశారు. లోక్సభ ఎన్నికల అనంతరం జరిగిన ఉపఎన్నికల ఫలితాలు, నిరర్థక ప్రభుత్వ శుష్క వాగ్దానాలపై ప్రజాగ్రహాన్ని ప్రతిఫలిస్తున్నాయని కాంగ్రెస్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ కలల భేహారి పాత్ర మాత్రమే పోషించారని వందరోజుల పాలన రుజువు చేసిందని పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించినా, ఉపఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి ముప్పుగా పరిణమించాయని, బీజేపీ ముసుగు క్రమంగా తొలగిపోయే సూచనలున్నాయని పుస్తకం పేర్కొంది. -
అమిత్షా కేసులో అనుకూల తీర్పుకు ప్రతిఫలమా?
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివంను కేరళ గవర్నర్గా నియమించాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. అమిత్షా కేసులో సదాశివం ఇచ్చిన తీర్పునకు ఇది ప్రతిఫలమా? అని ప్రశ్నించింది. ‘తమకు అనుకూలంగా ఆయన చేసిన వ్యాఖ్యానించారు. కాగా, సదాశివంను కేరళ గవర్నర్గా నియమించవద్దని రాష్ట్రపతిని అభ్యర్థిస్తూ కేరళ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. షీలా దీక్షిత్ రాజీనామా చేయడంతో కేరళ గవర్నర్ పదవి ఖాళీ అయింది. -
తప్పులో కాలేసిన ఆనంద శర్మ
న్యూఢిల్లీ: రాజ్యసభలో కాంగ్రెస్ డిప్యూటీ నాయకుడు ఆనంద్ శర్మ తప్పులో కాలేయడంతో నవ్వులు విరిసాయి. సభలో కేంద్ర మంత్రులు లేరనే అంశాన్ని జీరో అవర్ లో ఆయన లేవనెత్తారు. అయితే కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి థావర్చాంద్ గెహ్లాట్ సభలో ఉండడం ఆయన గమనించలేదు. తాను సభలో ఉన్నానంటూ గెహ్లాట్ చెప్పడంతో శర్మ గతుక్కుమన్నారు. చాలా సేపటి నుంచి సభలో తాను ఉన్నా కేంద్రమంత్రులెవరూ లేరనడం న్యాయమా అని శర్మను గెహ్లాట్ ప్రశ్నించారు. దీంతో శర్మతో సహా సభలోని వారందరూ చిరునవ్వులు నవ్వారు. డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ కూడా శర్మను ఈ విషయంపై అడగ్గా.. గెహ్లాట్ గురించి అంతగా ఎవరికీ తెలియదంటూ సమాధానమిచ్చారు. -
10 వేల కోట్ల ఖర్చుపై దర్యాప్తునకు రెడీ
నరేంద్ర మోడీ సవాల్ దర్యాప్తుపై ఈసీకి నేనే లేఖ రాస్తా న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారానికి తాను రూ.10 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు, అందులో 90 శాతం నల్లధనమేనని కాంగ్రెస్ నేతలు ఆనంద్ శర్మ తదితరులు చేసిన ఆరోపణలపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ స్పందించారు. వీటిపై ఏ ప్రభుత్వ సంస్థతో దర్యాప్తుకైనా తాను సిద్ధమేనని సవాల్ విసిరారు. దీనిపై తానే స్వయంగా ఎన్నికల సంఘానికి(ఈసీ) లేఖ రాస్తానని ‘ఇండియా టీవీ’ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘యూపీఏ ప్రభుత్వానికి ఇంకా 30, 40 రోజులు మిగిలి ఉన్నాయి. దర్యాప్తు కోసం అది అన్ని శక్తులను వాడుకోవాలి. దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలి. పదివేల కోట్లు చాలా పెద్ద మొత్తం. ఆ డబ్బెవరిదో, ఎక్కణ్నుంచి వచ్చిందో, ఎక్కడ ఖర్చు చేశారో వాళ్లు అడగాలి. నిజమేంటో దేశానికి చెబితే సంతోషిస్తా. ఆరోపణలకు ఆధారం లభిస్తే ఈసీ కూడా దర్యాప్తు జరపాలని శర్మ దానికి లేఖ రాయాలి. ఎన్నికల కోడ్ వల్ల దర్యాప్తునకు ఆదేశించలేకపోతే, దర్యాప్తుపై నాకు ఏ అభ్యంతరమూ లేదని నేనే ఈసీకి లేఖ రాస్తా’ అని అన్నారు. తాను గుజరాత్ రైతుల భూములను కారుచవగ్గా పారిశ్రామిక సంస్థలకు కట్టాబెట్టానంటున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపణలు అబద్ధాలని, వాటి వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయన్నారు. రాహుల్ టాటాల నానో కార్ల ప్రాజెక్టును ఉద్దేశించి ఆరోపణలు చేశారని, అయితే ఒక్క అంగుళం భూమిని కూడా ఉచితంగా ఇవ్వలేదన్నారు. గుజరాత్ అభివృద్ధిపై తన మాటలు అబద్ధమైతే రాష్ట్ర ప్రజలు తనను తిరిగి ఎన్నుకుని ఉండేవారు కారన్నారు. భారీ పోలింగ్ నా బాధ్యత పెంచింది: మోడీ బాలసోర్(ఒడిశా)/ధంతారి(ఛత్తీస్గఢ్): లోక్సభ ఎన్నికల్లో భారీ పోలింగ్ ప్రజల పట్ల తన బాధ్యత పెంచిందని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన శుక్రవారం ఒడిశాలోని బాలాసోర్, కియోంజర్, తాల్చేర్, ఛత్తీస్గఢ్లోని ధంతారిల్లో ఎన్నికల సభల్లో మాట్లాడారు. ‘ఒడిశాలో గురువారం జరిగిన ఎన్నికలు, ప్రజల ఆప్యాయతను చూస్తే మీ పట్ల నా బాధ్యతలు పెరిగినట్లు అనిపిస్తోంది. నాపై మీ ప్రేమకు ప్రతిఫలం అందిస్తా’ అని ఒడిశా సభల్లో అన్నారు. దేశప్రజలంతా ప్రభుత్వం మారాలనుకుంటున్నారని, వారు ఢిల్లీ గద్దెపై ఉన్న వారికి బుద్ధి చెబుతారని అన్నారు. రాహుల్ గాంధీకి పేదరికం పర్యాటకం లాంటిందని ధంతారి సభలో మండిపడ్డారు. విభజించు, పాలించు అనే కాంగ్రెస్ రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ విభజన అద్దం పడుతోందని, అది సమాజాన్ని ముక్కలు చేసే పార్టీ అని విమర్శించారు. దేశానికి ఏం చేశారో చెప్పని కాంగ్రెస్ తనపై బురదజల్లుడు ప్రచారానికి దిగుతోందని మోడీ విమర్శించారు. త్రీడీ హాలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ టెక్నాలజీ ద్వారా అహ్మదాబాద్ నుంచి దేశంలోని వంద ప్రాంతాల్లో నిర్వహించిన సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. ఈ టెక్నాలజీ ద్వారా నిర్వహించే సభల్లో వక్త ప్రత్యక్షంగా మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. ఇదిలా ఉండగా, మోడీ ప్రధాని అయితే భారత భవిష్యత్తుకు కీడు జరుగుతుందని సల్మాన్ రష్దీ, దీపామెహతా తదితర రచయితలు, కళాకారులు లండన్లో విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. -
చర్చకు సై
గుజరాత్ అభివృద్ధిపై మోడీకి కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ సవాల్ పలు రంగాల్లో ఆ రాష్ర్టం వెనుకబడింది మోడీ అబద్ధాలకోరు అందరినీ ప్రశ్నించడమే ఆయనకు తెలుసు ఏనాడూ ఆయన ప్రెస్మీట్ నిర్వహించలేదు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : గుజరాత్ను ఆదర్శ రాష్ట్రంగా చెప్పుకునే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, విద్య సహా పలు రంగాల్లో ఆ రాష్ర్ట వెనుకబాటు తనాన్ని వెల్లడించడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ ఆరోపించారు. దీనిపై చర్చకు వస్తే తాము నిరూపిస్తామని సవాల్ విసిరారు. కేపీసీసీ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ ఎన్నికల ప్రచార డీవీడీని విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మోడీ అబద్ధాలకోరని, అసత్యాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. గుజరాత్ విద్యా రంగంలో దేశంలో 17వ స్థానంలో ఉందని, పౌష్టికాహార లోపంతో లక్షల మంది పిల్లలు బాధ పడుతున్నారని వివరించారు. పాఠశాలలకు పోకుండా నిలిచిపోతున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. విద్యుత్ ఉత్పాదనలో గుజరాత్ 10వ స్థానంలో ఉందన్నారు. ఆ రాష్ట్ర ప్రజలపై రూ.లక్షా 76 వేల కోట్ల రుణ భారం ఉందని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే... గుజరాత్ను ఆదర్శ రాష్ట్రమని మోడీ ఎలా అనగలుగుతున్నారని నిలదీశారు. ఆయనో అపాయకారి అని, అందరినీ ఆయన ప్రశ్నిస్తుంటారని, ఆయననెవరూ ప్రశ్నించకూడదని అన్నారు. బహిరంగ సభలు పెట్టి ఉపన్యాసాలు దంచడం మినహా, ఏనాడైనా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, వారడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారా అని నిలదీశారు. గుజరాత్ శాసన సభలో గవర్నర్ ప్రసంగంపై ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానంపై కూడా చర్చ జరగలేదని తెలిపారు. -
'యుపిఏ అధికారంలోకి వస్తే రాహులే ప్రధాని'
న్యూఢిల్లీ: యుపిఏ మళ్లీ అధికారంలోకి వస్తే ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే ప్రధాని అని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ చెప్పారు. తాను వారణాసి నుంచి లోక్సభకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వారణాసి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బిజెపి సిట్టింగ్ ఎంపి మురళీమనోహర్ జోషి మోడీ కోసం ఈ స్థానాన్ని వదులుకున్నారు. ఆయన ప్రస్తుతం కాన్పూరు నుంచి పోటీ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఆనంద్ శర్మ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. మతపరంగా హిందువులకు ఎంతో ముఖ్యమైన ఈ స్థానం నుంచి బ్రాహ్మణ నేత అయిన ఆనంద్ శర్మను నిలిపితే గట్టి పోటీ ఇవ్వగలరని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా వారణాసి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ------------------------------------------------------- -
సార్క్ వీసా నిబంధనల సరళీకరణ!
న్యూఢిల్లీ: సార్క్ కూటమి దేశాల్లో వ్యాపారవేత్తల వీసా నిబంధనల సరళీకరణకు భారత్ తెరతీసింది. సార్క్ దేశాల్లో వాణిజ్యం, పెట్టుబడుల పెంపు కోసం ఈ ప్రయత్నం చేస్తున్నామని వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ చెప్పారు. ఇక్కడ జరిగిన సార్క్ (దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య)బిజినెస్ లీడర్స్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడారు. సార్క్ దేశాల్లో వృత్తిగత నిపుణులు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు విశ్వాసపూరితమైన వాతావరణం నెలకొనేలా చూడాల్సిన అవసరముందని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలకు తోడ్పడేందుకు ప్రతీ సార్క్ దేశం మిగిలిన అన్ని సార్క్ దేశాల్లో బ్యాంక్ బ్రాంచీలను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని వివరించారు. ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల వాణిజ్య, ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. పేదరికం, నిరుద్యోగం, పౌష్టికాహార లోపం వంటి సమస్యలపై కలసికట్టుగా పోరాడాల్సిన అవసరముందని ఈ మంత్రులు అభిప్రాయపడ్డారు. భారత్, పాక్ల్లో బ్యాంక్ బ్రాంచీలు పాకిస్తాన్లో కార్యకలాపాలు నిర్వహించడానికి ఎస్బీఐ, బీఓఐలకు అనుమతి లభించగా, భారత్లో కార్యకలాపాలు నిర్వహించడానికి నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకి స్థాన్, యునెటైడ్ బ్యాంక్లకు అనుమతి లభించింది. -
పులకరించిన జనవాడ
సాక్షి, రంగారెడ్డి జిల్లా, శంకర్పల్లి: హాలీవుడ్ నటులు.. బాలీవుడ్ తారలు.. రాజకీయ ప్రముఖులు.. అమెరికా అత్యున్నత అధికారులు.. వీరంతా ఒకేసారి తరలిరావడంతో శంకర్పల్లి మండలంలోని జనవాడ గ్రామం పులకరించింది. గ్రామంలో వాటర్ హెల్త్ ఇంటర్నేషనల్(డబ్ల్యూహెచ్ఐ), జలధార సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ వాటర్ సిస్టంను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రి ఆనంద్శర్మ, భారత్లోని అమెరికా రాయబారి నాన్సీ పావెల్, బాలీవుడ్ తారలు దియామిర్జా, జాకీష్రాష్, గుల్షన్గ్రోవర్, హాలీవుడ్ నటులు లీసా జోయ్నర్, ప్లేరైట్ గ్రెచెన్ క్రైయర్తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రముఖుల బృందం జనవాడకు చేరుకుంది. స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, స్థానిక సర్పంచ్ వసంతలక్ష్మి తదితరులు మంగళ వాయిద్యాలతో వారికి స్వాగతం పలికారు. వారి నుదుటున కుంకుమ తిలకం దిద్ది పూలమాలలతో సత్కరిం చారు. వారిని చూసేందుకు గ్రామంలోని ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. తారలకు షేక్హ్యాండ్ ఇచ్చేందుకు పోటీపడ్డారు. కొందరు ఆటోగ్రాఫ్ కోసం మినీ పుస్తకాలతో వారిముందు వాలిపోయారు. ఫొటోలకు ఫోజు లిస్తూ గ్రామస్తులు వారితో మమేకమయ్యారు. తారలంతా స్థానికులతో మాటామాటా కలపడంతో వారి ఆనందానికి హద్దుల్లేవు. కేరింతలు, చప్పట్లతో గ్రామం హోరెత్తింది. ఆసక్తిగా.. వాటర్ ప్లాంట్ సమీపంలో జరిగిన సభా ప్రాంగణంలో భారతీయ సంస్కృతి ప్రతిబింబిచేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ విదేశీ బృందాన్ని కట్టిపడేశాయి. కుండలు తయారుచేసే విధానాన్ని వారు ఆసక్తిగా చూశారు. గాజుల దుకాణంలో మట్టి గాజులు కొని ధరించారు. సభ ముగిసిన తర్వాత పాఠశాల విద్యార్థులతోనూ వారు కలివిడిగా మెలిగారు. బాగా చదువుకోవాలని హితవు పలికారు. -
నేడు జనవాడకు కేంద్ర మంత్రి ఆనంద్శర్మ
శంకర్పల్లి, న్యూస్లైన్: మం డలంలోని జనవాడలో వాటర్ హెల్త్ ఇండియా, జలధార ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను శుక్రవా రం మధ్యాహ్నం కేంద్ర వా ణిజ్య పన్నుల శాఖ మంత్రి ఆనంద్ శర్మ ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాం తాల్లోని ప్రజలకు పరిశుద్ధమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో వాటర్హెల్త్ ఇండి యా ఆధ్వర్యంలో ఈ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. దీనిని ప్రారంభించడానికి కేంద్ర మంత్రి ఆనంద్ శర్మతోపాటు భారత్లోని అమెరికా రాయబారి నాన్సీ పా వెల్, హాలీవుడ్ దర్శకులు, బాలీవుడ్ నటులు, దేశంలోని పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజ రు కానున్నారు. ప్రముఖులు రానుండటంతో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే పోలీసులు ఈ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. -
ఉల్లి ఎగుమతులపై నిషేధం!
న్యూఢిల్లీ: చుక్కలను తాకుతున్న ఉల్లి ధరలను తగ్గించేందుకు.. భారీగా ఉల్లిని దిగుమతి చేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దాంతోపాటు విదేశాలకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించే అంశాన్నీ పరిశీలిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో ఉల్లి ధరలు కిలో రూ.90 వరకు పెరిగిన నేపథ్యంలో మంగళవారం కేంద్ర వాణిజ్య పరిశ్రమలశాఖ మంత్రి ఆనంద్ శర్మ విలేకరులతో మాట్లాడారు. ఉల్లి ధరల పెరుగుదలకు అక్రమ నిల్వదారులే కారణమన్నారు. దేశంలో సరిపోయినంత స్థాయిలో ఉల్లి అందుబాటులో ఉందని, కానీ అక్రమ నిల్వల వల్లే కృత్రిమంగా ధరలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని, కృత్రిమ కొరత సృష్టిస్తున్నవారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆనంద్శర్మ కోరారు. ధరలను నియంత్రించేందుకు ఉల్లి దిగుమతుల కోసం వచ్చే ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. డిసెంబర్ చివరినాటికి కొత్త ఉల్లి దిగుబడి వస్తుందని, దాంతో ధరలు దిగివస్తాయని పేర్కొన్నారు. కాగా.. ధరలను నియంత్రించేందుకు ఉల్లి ఎగుమతి ధరను కేంద్రం ఇటీవల పెంచిన విషయం తెలిసిందే. కానీ, దానివల్ల ప్రయోజనం కనిపించడం లేదని, అందువల్ల ఎగుమతులపై పూర్తిగా నిషేధం విధించే యోచన ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. అయితే, అకాల వర్షాల కారణంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ఖరీఫ్ ఉల్లిపంట దెబ్బతిన్నదని, అదే ధరల పెరుగుదలకు కారణమని ఎన్హెచ్ఆర్డీఎఫ్ డెరైక్టర్ ఆర్పీ గుప్తా పేర్కొన్నారు. -
ఐఎంఎఫ్ వృద్ధి లెక్కలు పట్టించుకోం: భారత్
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.75 శాతంగానే ఉంటుందంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇచ్చిన అంచనాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ తోసిపుచ్చారు. తయారీ రంగం, దేశీయంగా డిమాండ్, ఎగుమతులు అన్నీ మెరుగుపడుతున్న నేపథ్యంలో వృద్ధి రేటు కచ్చితంగా 5 శాతం మించగలదని ఒక ప్రకటనలో ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రణాళిక శాఖ మంత్రి రాజీవ్ శుక్లా కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే భారత్ సహా పలు వర్ధమాన దేశాలు మళ్లీ 8 శాతం పైగా వృద్ధి సాధించలేకపోవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యుటీ చీఫ్ రూప దత్తగుప్తా తెలిపారు. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ ద్రవ్య లోటు స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 8.5 శాతానికి ఎగియవచ్చని కూడా ఐఎంఎఫ్ తాజాగా అంచనా వేసింది. -
కరెన్సీ స్వాప్ ఒప్పందాలపై త్వరలో టాస్క్ఫోర్స్
న్యూఢిల్లీ: రూపాయి విలువ ఘోరంగా పడిపోతున్న నేపథ్యంలో దీన్ని స్థిరీకరించేందుకు ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టిపెడుతోంది. ముఖ్యంగా భారత్తో కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలతో కరెన్సీ స్వాప్(మార్పిడి) ఒప్పందాలకు గల అవకాశాలను అన్వేషిస్తున్నామని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ మంగళవారం ఇక్కడ చెప్పారు. 7-8 మంది సభ్యులతో దీనికోసం ఒక టాస్క్ఫోర్స్/కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ వారాంతలోగా టాస్క్ఫోర్స్ను ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు. వాణిజ్య శాఖ కార్యదర్శి నేతృత్వంలోని ఈ బృందం నాలుగు వారాల్లో తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుందని శర్మ తెలిపారు. ఇప్పటికే జపాన్(15 బిలియన్ డాలర్లు)తో ఇటువంటి ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకున్న విషయాన్ని గుర్తుచేశారు. భూటాన్తో సైతం(10 కోట్ల డాలర్లు) ఒప్పందం ఉంది. ఒక కరెన్సీతో మరో కరెన్సీని మార్పిడి చేసుకునేందుకు స్వాప్ ఒప్పందాలు దోహదం చేస్తాయి.