Anna Canteens
-
అన్నా క్యాంటీన్ల భోజనంలో నాణ్యత కరువు
-
అన్న క్యాంటీన్లు నిర్మించా... నాకు అన్నం లేకుండా చేస్తున్నారు
పిఠాపురం: ‘రూ.40లక్షలు అప్పు తెచ్చి అన్న క్యాంటీన్లు నిర్మించాను. లంచం ఇవ్వలేదని అధికారులు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకుండా నిలిపివేసి నాకు అన్నం లేకుండా చేస్తున్నారు. ఐదుసార్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(గ్రీవెన్స్)లో ఫిర్యాదు చేశా. అయినా ప్రయోజనం లేదు. అలాంటప్పుడు ఈ పరిష్కార వేదికలు ఎందుకు?’ అంటూ కాకినాడ జిల్లా కలెక్టర్తోపాటు అధికారులను ఓ కాంట్రాక్టర్ నిలదీశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని అంబేడ్కర్ భవన్లో సోమవారం కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యాన నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.పిఠాపురానికి చెందిన మున్సిపల్ కాంట్రాక్టర్ సూరవరపు దివాణం తాను చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన బిల్లుల గురించి కలెక్టర్, అధికారులను గట్టిగా నిలదీయడంతో ఆయన్ను పోలీసులు బయటకు గెంటేశారు. ఈ సందర్భంగా దివాణం మాట్లాడుతూ గొల్లప్రోలు, పిఠాపురం, ఏలేశ్వరం, తుని పట్టణాల్లో తాను కాంట్రాక్టు తీసుకుని అన్న క్యాంటీన్లు నిర్మించానని తెలిపారు. అప్పులు చేసి రూ.40 లక్షల పెట్టుబడి పెట్టానని, వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికారులకు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుకు ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించిన బిల్లు ఇవ్వాలంటే కౌన్సిల్లో తీర్మానం చేయాలని, దానికి 5 శాతం కమీషన్ ఇవ్వాలంటున్నారని ఆరోపించారు. తాను 30 శాతం తక్కువకు టెండర్ వేసి పనులు చేశానని, అయినా తనకు బిల్లు ఇవ్వడానికి లంచాలు డిమాండ్ చేస్తూ ఏడిపిస్తున్నారని చెప్పారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతిపత్రం ఇస్తే న్యాయం జరుగుతుందని భావించి ఐదుసార్లు ఫిర్యాదు చేసినా... ఇక్కడ కూడా అన్యాయమే జరుగుతోందన్నారు. కాలువల్లో పూడికలు తీశానని, వాటికి కూడా బిల్లులు రావాల్సి ఉందన్నారు. తన బిల్లుల గురించి కలెక్టర్ను గట్టిగా అడిగితే ‘నీ దిక్కున్న వాడితో చెప్పుకో..’ అని అంటున్నారని దివాణం చెప్పారు. పేదలకు అన్నం పెడుతున్నారని తన భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి, అప్పులు చేసి అన్న క్యాంటీన్లు కట్టించానని, చెప్పారు. ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం చాలా మంచిదని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో డబ్బులు ఉంటేనే పనులు చేయించి బిల్లులు చెల్లించేవారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో పనులు చేయించుకుని లంచాల కోసం బిల్లులు చెల్లించకుండా ఏడిపిస్తున్నారని ఆరోపించారు. కాగా, దివాణంకు త్వరలో బిల్లులు చెల్లించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
అన్నా క్యాంటీన్లకు టీడీపీ రంగులు.. హైకోర్టు నోటీసులు
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కార్యాలయాలు, అన్నా క్యాంటీన్లపై టీడీపీ రంగులు వెయ్యటాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టు పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. గతంలో గ్రామ సచివాలయలకు బ్లూ కలర్ వేయటంపై తీర్పు ఇచ్చినట్టు పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. బ్లూ కలర్ తొలగించాలని ఆదేశాలు ఇచ్చిందని, రంగులు తొలగించటానికి సమయం పట్టగా కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలైందని పిటిషనర్ తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అన్నా క్యాంటీన్లకు ఇంతకు ముందు ఏ కలర్ వేశారని హైకోర్టు ప్రశ్నించింది. అదేవిధంగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణ ఏపీ హైకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది.చదవండి: ఏపీ ప్రజల కళ్లల్లో కూటమి ‘ఇసుక’! -
అన్న క్యాంటీన్లకు పసుపు రంగు.. సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల భవనాలకు తెలుగుదేశం పార్టీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్ వేశారు. ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ రంగులు వేస్తున్నా కానీ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.అన్ని ప్రభుత్వం కార్యాలయాలకు టీడీపీకి సంబంధించిన పసుపు రంగును వేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. రాజకీయంగా లబ్ధి పొందటానికి ప్రభుత్వ భవనాలకు పసుపు రంగు వేస్తున్నారన్నారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేస్తున్నారని.. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు ఇది విరుద్ధమని పిటిషన్లో చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు.మరోవైపు, అన్న క్యాంటీన్ల పేరుతో పెద్ద స్కామ్ జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. అన్న క్యాంటీన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దోపిడీకి తెరలేపిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్న క్యాంటీన్లను పైసా వసూల్ క్యాంటీన్లుగా చంద్రబాబు మార్చేశారు. అన్న క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ డబ్బా కొట్టిన చంద్రబాబు.. వాటికి టీడీపీ రంగులు వేసి ఆర్భాటం చేశారు. కానీ.. ఇప్పుడు ప్రజల నుంచి చందాలు సేకరణ అంటూ మాట్లాడుతున్నారు.ఇదీ చదవండి: తిరుపతి లడ్డూ ఆరోపణలతో హెరిటేజ్ లింకులు!?.. -
అన్న క్యాంటీన్లో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట
సాక్షి, అన్నమయ్య జిల్లా: రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. టీడీపీ నేతల కుమ్ములాటతో అధిపత్య పోరు బయటపడింది. పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్రాజు, ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం వర్గాల మధ్య తోపులాట జరిగింది. మేం ప్రారంభించాలంటే.. మేమంటూ ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.కత్తెరని లాక్కుని ప్రారంభోత్సవం చేసేందుకు ఇరువర్గాలు ప్రయత్నించాయి. పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్రాజు చొక్కా సుగవాసి వర్గీయులు పట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఇదీ చదవండి: ఎల్లో మీడియాకు నటి కాదంబరీ జత్వానీ ఝలక్మరో వైపు, అన్నక్యాంటీన్లను పైసా వసూల్ కేంద్రాలుగా చంద్రబాబు సర్కార్ మార్చేసింది. ప్రజల సొమ్మును దోచుకునేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. అన్నా క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ కలరింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. మాట మార్చేశారు. ఇన్నాళ్లు డబ్బాకొట్టి.. వాటికి టీడీపీ రంగులు వేసి ఆర్భాటం చేశారు. కానీ.. ఇప్పుడు ప్రజల నుంచి చందాలు సేకరణ అంటూ మాట్లాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. -
వీడియో.. బాబు, లోకేష్.. ఇదేందయ్యా ఇదీ: వైఎస్సార్సీపీ సెటైర్లు
సాక్షి, తాడేపల్లి: పబ్లిసిటీలో చంద్రబాబును మించిన వ్యక్తి మరొకరు ఉండరు. ఆయనకు పబ్లిసిటీ అంటే పిచ్చో ఇప్పటికే పలు సందర్భాల్లో చూశాం. పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఏం చేయడానికైనా వెనుకాడరు. ఇక, తాజాగా అన్న క్యాంటీన్ల ప్రారంభం సందర్భంగా పెదబాబు, చినబాబు తమలోని నటనను బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను వైఎస్సార్సీపీ ట్విట్టర్లో పోస్టు చేసింది.కాగా, వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘అన్న క్యాంటీన్లో భోజనంపై ఎంత నమ్మకమో?. అర ఇడ్లీతో సరిపెట్టిన నారా లోకేష్.. రెండు చెంచాల రైస్తో మమ అనిపించిన చంద్రబాబు. భోజనంలో నాణ్యతని గాలికొదిలేసి.. పబ్లిసిటీలో తెలుగు తమ్ముళ్లు బిజీ. ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తూ టీడీపీ నేతలు పెత్తనం’ అంటూ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. అన్న క్యాంటీన్లో భోజనంపై ఎంత నమ్మకమో?అర ఇడ్లీతో సరిపెట్టిన @naralokesh.. రెండు చెంచాల రైస్తో మమ అనిపించిన @ncbn భోజనంలో నాణ్యతని గాలికొదిలేసి.. పబ్లిసిటీలో తెలుగు తమ్ముళ్లు బిజీ ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తూ టీడీపీ నేతలు పెత్తనం pic.twitter.com/Pkvq3BAG6x— YSR Congress Party (@YSRCParty) August 16, 2024 -
సొమ్ము ఒకడిది, సోకు ఇంకొకడిది
-
దాతల భాగస్వామ్యం కావాలి
సాక్షి, మచిలీపట్నం/సాక్షి, అమరావతి: పేదోడి ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు తెచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడలోని రామబ్రహ్మం మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ప్రారంభించారు. ప్రజలతో కలిసి క్యాంటీన్లోనే భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో తాము ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఆటో కార్మికులు, హమాలీలు, పారిశుద్ధ్య కార్మికులు, చిరు వ్యాపారులు ఎంతో మంది సద్వినియోగం చేసుకున్నారని, వారి భోజన ఖర్చు చాలా మిగిలిందని అన్నారు. ఈ క్యాంటీన్ల నిర్వహణ కోసం తన సతీమణి భువనేశ్వరి రూ. కోటి ఇచ్చారని, పలువురు దాతలు కూడా విరాళాలు ఇచ్చారని, మిగతా వారు కూడా భాగస్వామ్యం కావాలని అన్నారు. పెళ్లిళ్ల ఖర్చు తగ్గించుకొని అన్న క్యాంటీన్లకు విరాళాలివ్వాలని సూచించారు. దీని కోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరిచామని, నేరుగా ఆన్లైన్ ద్వారా ఈ ఖాతాకు విరాళాలివ్వొచ్చని తెలిపారు. జనవరిలో జన్మభూమి 2.ను ప్రారంభించి, గ్రామాల అభివృద్ధిలో మళ్లీ ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. రాష్ట్రంలో జనాభా తగ్గుతోందని, పిల్లల పుట్టుక తగ్గడంతో యువత శాతం తగ్గిందని చెప్పారు. సంపద సృష్టించే యువకులు తగ్గడం ప్రమాదకరమని అన్నారు. జనాభా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా.. ఎక్కువ మంది పిల్లలున్న వారికే సంపద ఉంటుందని చెప్పారు. 2004 కంటే ముందు హైదరాబాదుతో పాటు అనేక ప్రాంతాలను అభివృద్ధి చేశానని, అయితే తనకంటే మెరుగ్గా పాలిస్తారని వేరే పారీ్టకి ఓట్లు వేయడంతో రాష్ట్ర విభజనకు దారితీసే పరిస్థితి తెచ్చారని అన్నారు. 2019లోనూ తననే గెలిపించి ఉంటే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లే వాడినని చెప్పారు. మరో 23 ఏళ్లకు 100వ స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకుంటామని, అప్పటివరకు తమ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మంచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్రాజా, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నేడు 99 చోట్ల అన్న క్యాంటీన్ల ప్రారంభంవచ్చే నెలాఖరుకి రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్ల ఏర్పాటే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసినట్టు మున్సిపల్ శాఖ తెలిపింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 99 ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నట్టు వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని మున్సిపల్ మంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. -
పైసా వసూల్ కేంద్రాలుగా అన్న క్యాంటీన్లు: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ప్రజల సొమ్మును దోచుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబుకు మరో ప్లాన్ రచించుకున్నారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను పైసా వసూల్ క్యాంటీన్లుగా మార్చాడు చంద్రబాబు. అన్న క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ కలరింగ్ ఇచ్చిన బాబు.. ఇప్పుడు మాట మార్చాడని వైఎస్సార్సీపీ తీవ్ర విమర్శలు చేసింది.కాగా, వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా.. అన్న క్యాంటీన్లను పైసా వసూల్ క్యాంటీన్లుగా మార్చేసిన చంద్రబాబు. ప్రజలు డబ్బులు ఇవ్వాలి.. కానీ క్రెడిట్ మాత్రం నాకే కావాలి. అన్న క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ ఇన్నాళ్లు డబ్బాకొట్టారు.. వాటికి టీడీపీ రంగులు వేసి ఆర్భాటం చేశారు. కానీ.. ఇప్పుడు ప్రజల నుంచి చందాలు సేకరణ అంటూ మాట్లాడుతున్నారని.. చంద్రబాబు వీడియోను షేర్ చేసింది.అన్న క్యాంటీన్లను పైసా వసూల్ క్యాంటీన్లుగా మార్చేసిన @ncbnప్రజలు డబ్బులు ఇవ్వాలి.. కానీ క్రెడిట్ మాత్రం నాకే కావాలిఅన్న క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ ఇన్నాళ్లు డబ్బాకొట్టారు.. వాటికి టీడీపీ రంగులు వేసి ఆర్భాటం కానీ.. ఇప్పుడు ప్రజల నుంచి చందాలు సేకరణ.. https://t.co/f3BLYS0Xpz— YSR Congress Party (@YSRCParty) August 15, 2024ఇక, అన్న క్యాంటీన్లపై వైఎస్సార్సీపీ నేతలు కూడా ఆరోపణలు చేశారు. అన్న క్యాంటీన్ల పేరుతో పెద్ద స్కామ్ జరుగుతోందన్నారు. క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి కానీ.. ఊరికి దూరంగా ఉండటం ఏంటని ప్రశ్నించారు. క్యాంటీన్ల పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. -
బాబుకు అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్
-
అన్న క్యాంటీన్లపై కూటమి సర్కార్ కొత్త డ్రామా: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పేదలకు అందాల్సిన పథకాలను పక్కన పెట్టి అన్న క్యాంటీన్ల పేరుతో కూటమి సర్కార్ కొత్త డ్రామాకు తెరతీసిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అన్న క్యాంటీన్లకు పచ్చ రంగు ఎందుకు వేశారని ప్రశ్నించారు. అలాగే, సూపర్ సిక్స్ హామీలను సూపర్ చీట్గా మార్చేశారని ఎద్దేవా చేశారు.కాగా, మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి సర్కార్ అన్న క్యాంటీన్ల పేరుతో కొత్త డ్రామా చేస్తున్నారు. రెండు, మూడు వందల మందికి పెట్డి, విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. ఊరికి దూరంగా అన్న క్యాంటీన్లను నిర్మించారు. జనసంచారం లేని చోట నిర్మించి ఏం ప్రయోజనం?. క్యాంటీన్ల పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారు. రూ.31 కోట్లను అప్పనంగా కొట్టేశారు. ప్రభుత్వ సొమ్ముతో అన్న క్యాంటీన్లను నిర్మించి వాటికి పార్టీ ఆఫీసుల్లాగా పచ్చరంగు వేశారు. వైఎస్సార్సీపీ రంగులు వేస్తోంది అంటూ గతంలో మాపై కోర్టుకు వెళ్లారు. మరి ఇప్పుడు అన్న క్యాంటీన్లకు పచ్చరంగు ఎందుకు వేశారు?. పేదల పథకాలను ఎత్తివేసి వారిని మరింత పేదలుగా మార్చవద్దు. పేదల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో చేశారు. పప్పుబెల్లాలు పెట్టి సంక్షేమ పథకాలు ఎత్తివేయటం కరెక్ట్ కాదు.విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలుపు ఖాయమైంది. చంద్రబాబు నైతికతతో పోటీ పెట్టలేదని టీడీపీ నేతలు డబ్బాలు కొడుతున్నారు. అనైతికతకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. అలాంటి వ్యక్తి నుండి మా జడ్పీటీసీలు, ఎంపీటీసీలను కాపాడుకున్నాం. బలం లేక చంద్రబాబు పోటీ నుండి విరమించుకున్నారు. విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో చంద్రబాబు వ్యవహరించిన అనైతికతను జనం చూశారు. దెయ్యాలు వేదాలు వల్లించనట్టుగా చంద్రబాబు నైతికత ఉంది.సూపర్ సిక్స్ హామీలను సూపర్ చీట్గా మార్చేశారు. ప్రజలను నిలువునా మోసం చేశారు. విద్య, వైద్యం, పోర్టుల మీద వైఎస్ జగన్ వేల కోట్లు ఖర్చు పెట్టారు. ప్రజల అభివృద్ధి కోసం పని చేశారు వైఎస్ జగన్. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటన్నిటినీ పక్కనపెట్టారు. తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారో తెలియకుండా పోయింది. విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. చంద్రబాబు నిర్వాకం వల్ల ఐదు మెడికల్ కాలేజీలు నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. స్కూల్స్లో ఇంగ్లీషు మీడియం, టోఫెల్ శిక్షణ వంటివన్నీ పక్కన పడేశారు అంటూ కామెంట్స్ చేశారు. -
టీడీపీ ఆఫీసులను తలపిస్తున్న అన్నా క్యాంటిన్లు
-
చంద్రబాబు అన్న క్యాంటీన్ పై మల్లాది విష్ణు షాకింగ్ కామెంట్స్
-
అభివృద్ధి, సంక్షేమం, అన్న క్యాంటీన్లు.. అన్నీ విరాళాలతోనే..
సాక్షి, అమరావతి: దాతలు, ప్రజల విరాళాలతో జన్మభూమి–2 ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అన్న క్యాంటీన్లు నిర్వహిస్తామని టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ పొలిట్బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే సీఎం హోదాలో చేసిన ఐదు సంతకాల అమలును ప్రారంభించామని చెప్పారు. పార్టీ సభ్యులకు ఇచ్చే ప్రమాద బీమాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు.కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధిలో పార్టీ అండగా ఉంటుందన్నారు. సిఫార్సులతో సంబంధం లేకుండా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను గుర్తించి దశలవారీగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్రెడ్డిని ఇంటికి పంపించడానికి ఉపాధి కోల్పోయి వలస వెళ్లిన కారి్మకులు కూడా వచ్చి ఎన్నికల్లో ఓటేశారని, ఎన్నారైలు విదేశాల నుంచి వచ్చి ఏడాది పాటు పని చేశారని చంద్రబాబు అన్నారు.వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయతి్నంచిన విధంగానే మదనపల్లెలో భూ కుంభకోణాల సాక్ష్యాలను తారుమారుకు కూడా కుట్ర చేశారన్నారు. వివేకాది గుండెపోటని చెప్పినట్లుగానే.. మదనపల్లెలో ఫైళ్ల దగ్ధాన్ని షార్ట్ సర్క్యూట్గా ప్రచారం చేశారన్నారు. పెద్దిరెడ్డి అక్రమాలపై ఒక్క రోజులోనే వేలాది బాధితులు ఫిర్యాదు చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ అంటేనే నేరస్థులు, అరాచకవాదులని అన్నారు. 13 లక్షలకు పైగా అసైన్డ్ భూములను కాజేశారని, 40 వేల ఎకరాలు రిజస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని చెప్పారు. 22ఏను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు, దందాలు చేశారని అన్నారు. అర్జీల పరిష్కారానికి యంత్రాంగం ఏర్పాటుఅనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, నదుల అనుసంధానం, 8 వెనకబడ్డ జిల్లాలకు కేంద్ర సహకారం, నరేగా, నీరు–చెట్టు బిల్లుల విడుదల, ప్రజావేదిక, ప్రజాదర్బార్లో వచి్చన అర్జీల పరిష్కారానికి యంత్రాంగం ఏర్పాటు తదితర అంశాలపై చర్చించినట్టు వివరించారు. గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం, దోపిడీపై విడుదల చేసిన ఏడు శ్వేతపత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ జిల్లా యూనిట్గా అమలు చేయాలని భావిస్తున్నట్టు చంద్రబాబు పొలిట్బ్యూరోలో వివరించినట్టు సమాచారం. -
అన్న క్యాంటీన్లకు పసుపు రంగులు దిద్దిన టీడీపీ
-
అన్నన్నా.. చంద్రన్న మార్క్ ఛీటింగ్
ఏపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన ఎన్నికల హామీలలో కీలకమైనవాటి జోలికి వెళ్లకుండా.. తేలికగా పూర్తి అయ్యే వాటిపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. అందులో భాగంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయ సంకల్పించారు. ఐదు రూపాయలకే భోజనం సమకూర్చడం దీని లక్ష్యం. ఆగస్టుపదిహేను నాటికి వంద చోట్ల ఈ క్యాంటిన్లు నెలకొల్పుతారు. ఆ తర్వాత మరో నెలలో ఇంకో 83 క్యాంటిన్లు ఏర్పాటవుతాయని టీడీపీ మీడియా కథనాన్ని ఇచ్చింది. అయితే..2014 టర్మ్లో కూడా కొన్ని క్యాంటిన్లు ఏర్పాటు చేసినా, వాటి వల్ల పెద్ద ప్రయోజనం ఒనగూరలేదన్నది ఒక అభిప్రాయం. దీనికోసం పెట్టిన ఖర్చులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నిజంగానే ఈ క్యాంటిన్లు పేదలకు ఎంతవరకు ఉపయోగపడతాయన్నది చర్చనీయాంశం. తమిళనాడులో కూడా అమ్మ క్యాంటిన్ల పేరుతో ఇలాంటి సదుపాయం కల్పించారు. తెలంగాణలో హైదరాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పలు చోట్ల ఇలాంటి క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి పాలవడంతో సహజంగానే వీటికి ప్రాధాన్యత తగ్గింది. ఏపీలో పట్టణ ప్రాంతాలలో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77 మున్సిపాల్టీలు, 17 కార్పొరేషన్ లు, 29 నగర పంచాయతీలు ఉన్నాయి. అన్నీకలిపి 123 అర్బన్ స్థానిక సంస్థలు ఉన్నాయన్నమాట. ఈ రకంగా చూస్తే పట్టణానికి ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు కావచ్చు. లేదంటే.. కొన్ని నగరాలలో అదనంగా మరో ఒకటో, రెండో నెలకొల్పుతారు. దీంతోనే పేదలందరికి ఆకలితీర్చేసినట్లే అన్నంతంగా ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. బహుశాఒక్కో క్యాంటిన్ లో వంద నుంచి రెండువందల మందికి భోజనం సరఫరా చేయవచ్చు. దీనికిగాను ప్రభుత్వానికి అయ్యే ఖర్చు బాగా తక్కువే. అయినా బాగా ప్రచారానికి ఉపయోగపడుతుందన్నది వ్యూహకర్తల భావనగా ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మంగా సూపర్ సిక్స్ లోని ముఖ్యమైన అంశాల జోలికి వెళ్లకుండా ఇలాంటి చిన్న,చిన్న హామీలతో ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా తల్లికి వందనం కింద ప్రతి విద్యార్దికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇవ్వవలసి ఉంది. దానిని విద్యాశాఖ మంత్రి లోకేష్ వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దానికి ఆయన చూపిన కారణం స్కీమ్ గురించి చర్చించాలట. గత ప్రభుత్వ టైమ్ లో 72 వేల మంది విద్యార్ధులు తగ్గారని, టీచర్ల సంఘాలతో చర్చలు జరపాలని ఆయన అన్నారు. ఇది చాలా చిత్రమైన ప్రకటన. విద్యార్దులు తగ్గితే ,దాని గురించి తల్లికి వందనం స్కీము అమలును ఆపవలసిన అవసరం ఏమి ఉంటుందో తెలియదు. టీచర్ల సంఘాలు ఈ స్కీము అమలు చేయవద్దని ఏమీ చెప్పలేదు కదా!. పోనీ ఎన్నికల ప్రచార సమయంలో ఆ సంఘాలవారితో ఏమైనా ఆ హామీ గురించి చర్చించి ఖరారు చేశారా?చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లతో పాటు నిమ్మల రామానాయుడు వంటివారు పోటీపడి తల్లికి వందనం స్కీము గురించి ప్రచారం చేశారు కదా!ఇప్పుడేమో విధి విధానాలు ఖరారు కావాలని లోకేష్ అంటున్నారు. మొదట ప్రతి కుటుంబంలో ఒక్కరికే ఈ స్కీము పరిమితం చేయాలని ఆలోచించారు.కాని ప్రజలలో వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత అసలు స్కీమునే ఏడాదిపాటు వాయిదా వేసుకున్నారు. దానికి కారణం.. ఈ పధకం అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. గతంలో జగన్ ప్రభుత్వం ఒక్క తల్లికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తేనే సుమారు ఆరేడువేల కోట్ల రూపాయల వ్యయం ఏడాదికి అయ్యేది. అలాంటిది ప్రతి విద్యార్దికి వర్తింపచేయాలంటే ఏడాదికి కనీసం పదిహేనువేల కోట్ల రూపాయల వ్యయం కావచ్చు. అందుకే ప్రభుత్వం వెనుకాడుతోంది. ఈ నేపధ్యంలోనే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అంటేనే భయం వేస్తోందని అంటున్నారు. ఏపీలో ప్రతి మహిళకు రూ.1,500 రూపాయల చొప్పున ప్రతి నెల ఇవ్వడం కూడా సూపర్ సిక్స్ లో భాగమే. ఆ రకంగా ఇవ్వడానికి ఏడాదికి ఇరవైవేల కోట్ల నుంచి పాతికవేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. నిరుద్యోగ భృతి, మూడు గ్యాస్ సిలిండర్లు మొదలైనవి కూడా అమలు చేయవలసిన అవసరం ఉంది. వాటిని ఎలాగోలా దాటవేయడానికి టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేసి సూపర్ సిక్స్ హామీని అమలు చేసేశామని ప్రచారం చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఈనాడు మీడియా ఇప్పటి నుంచే అన్నా క్యాంటిన్లపై ప్రచారం ఆరంభించింది. ప్రతి పట్టణంలోను ఎక్కడో ఒకటి,రెండు చోట్ల ఐదు రూపాయలకు భోజనం పెట్టి, మొత్తం పేదల ఆకలి తీర్చామని ప్రచారం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా టీడీపీ ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ సూపర్ సిక్స్ ను పక్కనబెట్టి ,ఇలాంటి జిమ్మిక్కులకు జనం ఓకే చెబుతారా?అన్నది సందేహమే.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
తప్పుడు ఆరోపణలు చేస్తే.. మీరే ఫూల్స్ అవుతారు: ఆర్కే రోజా
సాక్షి, గుంటూరు: అవసరం లేని విషయాలపై టీడీపీ రాజకీయాలు చేస్తోందని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. గుంటూరువారితోటలో వినాయక నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని మంత్రి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని నెలరోజులు రాజకీయం చేస్తోందన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే.. మీరే పూల్స్ అవుతారని హెచ్చరించారు. ఇప్పుడు అన్న క్యాంటీన్ల విషయంలో టీడీపీ కోడిగుడ్డు మీద ఈకలు పీకే రాజకీయం చేస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజంగా ఎన్టీఆర్పై ప్రేమ ఉంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు నాలుగు అన్న క్యాంటీన్లు ప్రారంభించి మేము పెట్టాం.. మీరు తీసేశారని ఆరోపణలు చేసి టీడీపీ నేతలు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (కుప్పంలో టీడీపీ అరాచకం.. మాజీ జడ్పీటీసీ రాజ్కుమార్ అరెస్ట్) -
అవినీతి పునాదులపై అన్న క్యాంటీన్లు
సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు) : టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ఏడాది గడువుండగా హడావుడిగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల నిర్మాణంలో ఆ పార్టీకి చెందిన నాయకులు రూ.కోట్లు దండుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదలకు పెట్టే భోజన పథకంలోనూ చేతివాటం చూసుకున్నారనే ఆవేదన సామాన్య ప్రజల్లో కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే గత టీడీపీ ప్రభుత్వం పేదలకు రూ.5కే భోజనం పెట్టేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లను నిర్మించగా జిల్లాలో 16 క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం రూ.36 లక్షలు చొప్పున, స్థానిక నగరపాలక, మున్సిపల్ సంస్థల ద్వారా రూ.6 లక్షలు చొప్పున వెరసి ఒక్కో అన్న క్యాంటీన్కు రూ.42 లక్షల నిధులు కేటాయించారు. క్యాంటీన్ల నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని ఆయా నగరపాలక సంస్థలు, మున్సిపాల్టీల నుండి ఉచితంగానే అందజేశారు. అయినా ఒక్కో చదరపు అడుగుకి స్థలంతో కలిపి రూ.2 వేల నుంచి రూ.2,500 ఖర్చవుతుండగా అన్న క్యాంటీన్లకు స్థలం ఖర్చు లేకుండానే ఒక్కో అడుగుకి రూ.5,532 చొప్పున చెల్లించడంపై అప్పట్లోనే సర్వత్రా విమర్శలు వచ్చాయి. బిల్డింగ్ నిర్మాణానికి ఒక్కో అడుగుకి రూ.1500 నుండి రూ.2 వేలు ఖర్చవుతుండగా అన్న క్యాంటీన్ల నిర్మాణంలో టీడీపీ ప్రభుత్వం తన అనుచరులకు అడుగుకి రూ.3,500 నుంచి రూ.4 వేలు అదనంగా దోచి పెట్టిందని పలువురు ఆరోపిస్తున్నారు. క్యాంటీన్ల నిర్మాణంలో అవినీతిపై జేసీకి ఫిర్యాదు ఒక్కో అన్న క్యాంటీన్ నిర్మాణంలో దాదాపుగా రూ.30 లక్షలు చొప్పున ఒక్క మన జిల్లాలోనే సుమారు రూ.4.80 కోట్ల మేర అవినీతి చోటు చేసుకున్నట్లు జిల్లాలోని పలువురు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారు ఆరోపిస్తున్నారు. జిల్లాలో నిర్మించిన ఒక్కో అన్న క్యాంటీన్లో రూ.30 లక్షల మేరకు అవినీతి చోటు చేసుకున్నట్లు ఇటీవల పాలకొల్లుకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారులు జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డికి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన అన్న క్యాంటీన్ల నిర్మాణానికి రూ.12 లక్షలకు మించి అవ్వదని, అయినా ఒక్కో దానికి రూ.42 లక్షలు ఖర్చు చూపి దోచుకున్నారనేది వీరి ప్రధాన ఆరోపణ. పైగా అన్నక్యాంటీన్లు నిర్మించిన స్థలం కూడా ఆయా స్థానిక సంస్థలకు చెందిన స్థలం కావడంతో కేవలం భవన నిర్మాణానికే ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఒక్కో అన్న క్యాంటీన్ను 756 అడుగుల విస్తీర్ణంలో నిర్మించారని గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వంలోని పెద్దలు తమ అనుయాయులకు భారీగా ముట్ట చెప్పేందేకే అన్న క్యాంటీన్లను ఆదాయ వనరులుగా వాడుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం విచారణ చేపట్టాలి అన్న క్యాంటీన్ల పేరుతో గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లను నిర్మించి రూ.62 కోట్ల మేరకు అవినీతికి పాల్పడింది. ఆఖరుకి పేదలకు భోజనం పెట్టే ఇటువంటి పథకంలోనూ గత పాలకులు తమ ధన దాహాన్ని తీర్చుకునే ప్రయత్నం చేశారు. ఒక్కో అడుగుకి రూ.5,532 ఏ లెక్కన ఇచ్చారో వారికే తెలియాలి. రాష్ట్రంలోని అన్న క్యాంటీన్ల నిర్మాణంపై ప్రభుత్వం విచారణ చేపట్టాలి. – యడ్ల తాతాజీ, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రజాధనం దుర్వినియోగం అన్న క్యాంటీన్ల పేరుతో గత టీడీపీ ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేసింది. పైకి పేదలకు రూ.5కే భోజనం అందిస్తున్నామంటూ గొప్పగా ప్రచారం నిర్వహించింది. తీరా చూస్తే వాటి నిర్మాణంలో పచ్చచొక్కాల నేతలు తమ చేతి వాటం ప్రదర్శించారు. అన్నక్యాంటీన్ల పేరుతో ఎన్నికల్లో ఆయాచిత లబ్ధి పొందాలని చూసి బోర్లాపడ్డారు. తమ నాయకుల జేబులు నింపేందుకే వీటిని సాధనాలుగా వాడుకున్నారు. – పళ్ళెం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ -
అన్న క్యాంటీన్లలో కమీషన్ల భోజనం
సాక్షి, అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ‘అన్న క్యాంటీన్ల’ పేరిట ఖజానాకు సున్నం పెట్టారు. పేదలకు నాణ్యమైన భోజనం అందిస్తామంటూ ఇష్టారాజ్యంగా కమీషన్లు భోంచేశారు. ఈ క్యాంటీన్లపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికలోని నిజాలను చూస్తే దిమ్మ తిరగడం ఖాయం. టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, ముఖ్య పట్టణాల్లో 203 అన్న క్యాంటీన్లను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నేతలు భారీ ఎత్తున దోచేశారు. 203 క్యాంటీన్ల నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం రూ.76.22 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఏకంగా రూ.53.33 కోట్లు పక్కదారి పట్టినట్లు నిపుణుల కమిటీ నిగ్గుతేల్చింది. క్యాంటీన్ల నిర్మాణంలో రూ.35.11 కోట్లు, అందులో హంగుల పేరిట రూ.18.22 కోట్లు కాజేసినట్లు గుర్తించింది. అన్న క్యాంటీన్ల నిర్మాణాల్లో ప్రతి అంగుళంలోనూ అవినీతి జరిగినట్లు నిర్ధారించింది. వ్యయం పెంచెయ్.. ముంచెయ్ నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం.. చదరపు అడుగుకు రూ.2,100 చొప్పున రూ.17.30 లక్షలతో ఒక్కో అన్న క్యాంటీన్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, టీడీపీ సర్కారు పాలనలో చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని ఏకంగా రూ.4,585కు పెంచేశారు. ఫలితంగా ఒక్కో క్యాంటీన్ నిర్మాణ వ్యయం రూ.37.55 లక్షలకు పెరిగింది. అన్ని క్యాంటీన్ల విషయంలో కేవలం నిర్మాణాల్లోనే రూ.35.11 కోట్లు అదనంగా చెల్లించారు. అలాగే షోకుల కోసం ఒక్కో క్యాంటీన్కు రూ.8.98 లక్షలు వెచ్చించారు. మొత్తం 203 క్యాంటీన్లలో హంగు, ఆర్భాటాలకు రూ.18.22 కోట్లు ఖర్చయ్యిందని లెక్కలు చూపారు. వాస్తవానికి క్యాంటీన్లలో అదనపు పనులేవీ జరగలేదని నిపుణుల కమిటీ తేల్చింది. అంటే ఈ సొమ్మంతా టీడీపీ నేతలు, అప్పటి ప్రభుత్వ పెద్దల జేబుల్లోకే వెళ్లిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రికార్డుల్లో అంతా గోల్మాల్ అన్న క్యాంటీన్ల నిర్మాణానికి ఎం30 గ్రేడ్ కాంక్రీట్ ఉపయోగించినట్లు రికార్డుల్లో చూపారు. ఫలితంగా ఒక్కో క్యాంటీన్ నిర్మాణ వ్యయం రూ.7 లక్షలు పెరిగినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఎం20 గ్రేడ్ కాంక్రీట్ మాత్రమే వినియోగించారని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. అన్న క్యాంటీన్ల ప్లాస్టరింగ్ సాధారణంగా ఒక మిల్లీమీటర్ నుంచి రెండు మిల్లీమీటర్ల మందంతో వేస్తారు. కానీ, మూడు మిల్లీమీటర్ల మందంతో వేసినట్లు చూపించి ఒక్కో క్యాంటీన్లో రూ.40 వేల చొప్పున మింగేశారు. ఫౌండేషన్, బేస్మెంట్లో ఇసుక నింపినట్లు రికార్డుల్లో చూపి, ఒక్కో క్యాంటీన్లో అదనంగా రూ.2.10 లక్షలు కొల్లగొట్టారు. మూడు కిలోమీటర్ల దూరం నుంచి మట్టి తెచ్చామంటూ ఒక్కో క్యాంటీన్లో అదనంగా రూ.20 వేలు, చదరపు అడుగుకు 5 టన్నుల సామర్థ్యంతో పునాది వేశామంటూ ఒక్కో క్యాంటీన్లో రూ.60 వేల చొప్పున తినేశారని నిపుణుల కమిటీ వెల్లడించింది. టెండర్లలో పాల్గొన్నది రెండు సంస్థలే ఒక్కో క్యాంటీన్పై అన్న క్యాంటీన్ అని పేరు రాయడానికి రూ.1.54 లక్షలు, ఒక్కో క్యాంటీన్ లోపల షోకుల కోసం రూ.3.40 లక్షలు, అన్న క్యాంటీన్ రాత్రిపూట కూడా కనిపించేలా చేయడానికి విద్యుత్ వెలుగులకు రూ.2.90 లక్షలు, క్యాంటీన్ బయట డెకరేషన్కు రూ.0.74 లక్షలు వ్యయం చేసినట్లు నిపుణుల కమిటీ తేల్చింది. అన్న క్యాంటీన్ల టెండర్లను ఎవరికి కట్టబెట్టాలో నిర్ణయించుకున్న తర్వాతే టెండర్ నిబంధనలు రూపొందించారని, ఈ టెండర్లలో పాల్గొనేందుకు అనుభవం గల స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించలేదని స్పష్టం చేసింది. రెండు దశల్లో చేపట్టిన అన్న క్యాంటీన్ల టెండర్లలో రెండు సంస్థలు మాత్రమే పాల్గొన్నాయని నిపుణుల కమిటీ పేర్కొంది. ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి చేసిన వ్యయం చాలా అధికంగా ఉందని వెల్లడించింది. వాస్తవానికి అంత ఖర్చు కాదని, ఈ వ్యవహారంలో బాధ్యులను గుర్తించి, చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. -
అన్న క్యాంటీన్ అవినీతిపై దర్యాప్తు
సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు) : గత ప్రభుత్వ హయాంలో పేదలకు భోజనం పెట్టే పేరుతో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో దోచేశారని, జిల్లాలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయాలంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి యడ్ల తాతాజీ జేసీ ఎం.వేణుగోపాలరెడ్డిని కోరారు. దీనిపై స్థానిక కలెక్టరేట్లో గురువారం ఆయన జేసీకి వినతిపత్రం అందజేశారు. టీడీపీ హయాంలో జిల్లాలో మొత్తం 16 అన్న క్యాంటీన్లను నిర్మించారన్నారు. వీటి కొరకు ప్రభుత్వం నుంచి రూ.36 లక్షలు, స్థానిక మున్సిపాలిటీల నుండి రూ.6 లక్షలు చొప్పున మొత్తం రూ.42 లక్షలు ఖర్చు చేశారన్నారు. ఎక్కడైనా ఒక బిల్డింగ్ కట్టాలంటే స్థలం కొని దాని నిర్మాణం చేస్తే స్థలం, నిర్మాణము కలిపి ఒక చదరపు అడుగుకి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకూ ఖర్చవుతుందన్నారు. అయితే అన్న క్యాంటీన్లు కట్టడానికి స్థలాలు మున్సిపాలిటీ, ప్రభుత్వ స్థలాలు కావడం వల్ల నిర్మాణానికి ఒక చదరపు అడుక్కి రూ.1,500 చొప్పున మాత్రమే ఖర్చవుతుందన్నారు. అయితే గత పాలకులు ఒక చదరపు అడుక్కి రూ.5,532 చొప్పున వసూలు చేశారన్నారు. ఒక్కో అన్న క్యాంటీన్లో రూ.30 లక్షల వరకూ అవినీతి చోటు చేసుకుందని ఆయన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ లెక్కన జిల్లాలోని 16 అన్న క్యాంటీన్లలో సుమారు రూ.4.80 కోట్లు అవినీతి చోటు చేసుకుందని తెలిపారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ నిర్వహించి ప్రజాధనాన్ని కాపాడాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చినమిల్లి గణపతిరావు, రేలంగి శ్రీనివాసరావు, కాపిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అన్నన్నా.. ఇదేమి గోల!
సాక్షి, అనంతపురం : అన్నార్థులు ఆకలి తీర్చేందుకే రూ.5కే భోజనం అందిస్తామని 2014 ఎన్నికల వేళ చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు ఆ పథకం గురించి మరిచిపోయాడు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 2018లో హడావుడిగా అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఇలా జిల్లాలో 16 క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. 60కి పైగా క్యాంటీన్ల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు 2016లో ప్రతిపాదనలు పంపితే అప్పటి టీడీపీ ప్రభుత్వం 2018లో 17 అన్న క్యాంటీన్లు మంజూరు చేసింది. జిల్లా కేంద్రంలో 7 క్యాంటీన్లకు అధికారులు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం నాలుగు మంజూరు చేసింది. దీంతో 2018 జూలై 15న బళ్లారి బైపాస్లో, 2018 డిసెంబర్ 19న గుత్తి రోడ్డులో, 2019 జనవరి 11న ఆర్ఎఫ్ రోడ్డులో అన్న క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. ఇక 11 మున్సిపాలిటీల్లో పదులు సంఖ్యలో క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళితే అందులో 17 మాత్రమే మంజూరయ్యాయి. వాటిలో ఒకటి నేటికీ ప్రారంభం(గుత్తి) కాలేదు. కేవలం గోడలు మాత్రం నిర్మించి వదిలేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన ఈ క్యాంటీన్ల వల్ల పేదల కడుపునిండటం పక్కన పెడితే ప్రజాధనం దోపిడీతో తెలుగుతమ్ముళ్ల బొజ్జలు నిండాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆది నుంచి వివాదాస్పదమే జిల్లా కేంద్రంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటు ఆది నుంచి వివాదాస్పదంగానే సాగింది. క్యాంటీన్లకు స్థలాలకు కూడా చూపించలేని అప్పటి జిల్లా మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు కాలం వెళ్లబుచ్చారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగరంలో మొదట బళ్లారి బైపాస్లో క్యాంటీన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాస్తవంగా ఆర్అండ్బీ నిబంధనల ప్రకారం ఫ్లైఓవర్ కింద భాగంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. దీనిపై అప్పట్లోనే ఆర్అండ్బీ అధికారులు అభ్యంతరం చెప్పారు. కానీ అప్పటి ఎమెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప ఆర్భాటంగా క్యాంటీన్ను ఏర్పాటు చేయించారు. అయితే వారం రోజుల్లోనే భోజనం సరిగా ఏర్పాటు చేయలేదని స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు్లవెత్తాయి. కేవలం 150 మందికి మాత్రమే(పూటకు) భోజనం ఏర్పాటు చేయడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ సంఖ్యను మరో 150 మందికి పెంచేలా అప్పటి కమిషనర్ పీవీవీఎస్ మూర్తి చర్యలు తీసుకున్నారు. ఇక మిగితా మూడు ప్రాంతాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు ఆర్ఎఫ్ రోడ్డు జూనియర్ కళాశాల ఆవరణలో, గుత్తిరోడ్డు నాగవెంకోబరావు పాఠశాల ఆవరణలో క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. కదిరి మున్సిపాలిటీలోనూ అదే పరిస్థితి. మొదట్లో జనాలు రద్దీగా ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. చివరకు వివిధ కారణాలతో వేరే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. సిబ్బందికి వేతనాలివ్వలేని దౌర్భాగ్యం వాస్తవానికి అన్న క్యాంటీన్ ఏర్పాటుకు స్థలాన్ని ఆయా మున్సిపాలిటీ, నగరపాలక సంస్థ చూపించాలి. షాపూర్జీ పూలంజీ సంస్థ ఓ భవనాన్ని ఏర్పాటు చేసి మున్సిపాలిటీలకు అందజేస్తుంది. భోజనాన్ని అక్షయపాత్ర వారు సమకూరుస్తారు. అందులో పనిచేసే సిబ్బందికి ఓ ఏజెన్సీ ద్వారా వేతనాలు చెల్లిస్తారు. కానీ సిబ్బందికి వేతనాలివ్వడంలోనూ తీవ్ర జాప్యం జరిగింది. దీంతో పలుచోట్ల వారు ఆందోళనకు దిగారు. ఐదు నెలలకు మూడు నెలల జీతం బాకీ ఈ ఏడాది జూలై 3న గుత్తిరోడ్డులోని అన్న క్యాంటీన్లోని సిబ్బంది ఆందోళనకు దిగారు. మూడు నెలలుగా వేతనాలివ్వలేదని ఏజెన్సీ నిర్వాహకులు రంగన్నతో వాగ్వాదం చేశారు. కేవలం ఐదు నెలలే క్యాంటీన్లు నిర్వహించిన టీడీపీ ప్రభుత్వం సిబ్బందికి మూడు నెలల జీతాలు ఇవ్వకపోవడం చూస్తే వాటి నిర్వహణపై ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. -
అన్నా.. ఎంత అవినీతి!
సాక్షి, ప్రొద్దుటూరు టౌన్ : అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ ప్రభుత్వం దోపిడీకి తెరలేపింది. తమకు నచ్చిన సంస్థకు కాంట్రాక్టును అప్పగించి నిర్మాణ వ్యయాన్ని ఎవ్వరూ ఊహించనంతగా పెంచి రేకుల షెడ్డుకు పైన పీఓబీ, చుట్టూ అద్దాలు, ఏర్పాటు చేసి ఒక్కో క్యాంటీన్కు రూ.40 లక్షలు ప్రజాధనాన్ని దోచి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లలో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం అమ్మా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు కడుపు నిండా భోజనం పెట్టడం టీడీపీ ప్రభుత్వంలోని నాయకులు చూసి వచ్చి నాలుగేళ్ల వరకు వాటి జోలికి వెళ్లలేదు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు పేదలు గుర్తుకొచ్చారు. తయారు చేసి తీసుకొచ్చిన అన్నం పెట్టేందుకు రూ.లక్ష ఖర్చు చేస్తే షెడ్ నిర్మాణం పూర్తవుతుంది. కానీ టీడీపీ నేత కనుసన్నుల్లో ఉన్న నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి అన్న క్యాంటీన్ల నిర్మాణాలను అప్పగించింది. ఇలా టీడీపీ ప్రభుత్వం భారీ అవినీతికి తెరలేపింది. రూ.38.65 లక్షలు ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి ఖర్చుచేసేందుకు తీర్మానం చేసింది. అది నాలుగైదు నెలల్లో ఎన్నికలు వస్తాయన్న వినికిడి నేపథ్యంలో జిల్లాలో 11 క్యాంటీన్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. అన్న క్యాంటీన్ నిర్మాణానికి వినియోగించిన ఇనుప దంతెలు, పైన పటారం, లోన లోటారంలా తయారు చేసిన అన్న క్యాంటీన్ ఇనుప దంతెలపై రేకుల షెడ్డు నిర్మాణం ఇనుప దంతెలపై రేకులు పరిచి క్యాంటీన్లు నిర్మించారు.సెంటున్నర్ర లోపు స్థలంలో చుట్టూ రంగు రంగుల రేకులతో తీర్చి దిద్దారు. చుట్టూ అద్దాలు వేసి అనవసర ఖర్చుకు పూనుకున్నారు. సిమెంట్ స్లాబ్తో భారీ భవనం నిర్మించేంత డబ్బులు కాంట్రాక్టర్ తీసుకొని రేకుల షెడ్డుకు పీఓబీ ఏర్పాటు చేసి సగానికి పైగా డబ్బు కాజేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రమైన కడప కార్పొరేషన్లో పాత మున్సిపల్ కార్యాలయం, జెడ్పీ కార్యాలయ ఆవరణం, పాత బస్టాండ్లలో, ప్రొద్దుటూరు, రాయచోటి తదితర మున్సిపాలిటీల్లో అన్న క్యాంటీన్లు పూర్తయ్యాయి. స్థలాలు లేని ప్రాంతాల్లో అద్దెకు తీసుకుని అక్కడ స్థల యజమానుల నియమాలకు తలొగ్గి నిర్మిస్తే చివరకు అవి వారికే సొంతం అయ్యేలా నిబంధనలు టీడీపీ ప్రభుత్వం రూపొందించింది. నిలుచుని భోజనం చేసేందుకు ఇంత వ్యయం ఖర్చు చేయాలా అని ప్రజలు ప్రశ్నించినా పట్టించుకోకపోవడం గమనార్హం. అన్న క్యాంటీన్లకు విద్యుత్, వసతులు కల్పించేందుకు మున్సిపాలిటీల నుంచి రూ.2లక్షలు ఖర్చు చేశారు. జిల్లాలో 11 క్యాంటీన్ల నిర్మాణానికి మొత్తం రూ.425.15 లక్షలు ఖర్చు పెట్టేందుకు అంచనాలు సిద్ధం చేశారు. అయితే ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగులో తదితర మున్సిపాలిటీల్లో వీటిని ప్రారంభించారు. ఏది ఏమైనా టీడీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. -
క్యాంటీన్లనూ వదలని చంద్రబాబు
-
అన్నా క్యాంటీన్ల మూసివేతపై మంత్రి బొత్స..
సాక్షి, విజయనగరం: అన్నా క్యాంటీన్లను తాత్కాలికంగా మాత్రమే మూసివేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. క్యాంటీన్లను నిలిపివేయడం తమకు కూడా బాధగానే ఉందని, కానీ గత ప్రభుత్వం అనవసరమయిన చోట క్యాంటీన్లను నిర్మించిందని అన్నారు. శుక్రవారం ఆయన విజయనగరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అన్నా క్యాంటీన్ల కోసం గత ప్రభుత్వం లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. త్వరలోనే ప్రభుత్వ క్యాంటీన్లు నిర్మిస్తామని, రద్దీ ప్రాంతాల్లో అవసరమయితే మొబైల్ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా పట్టణ పరిధిలోని పేదల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. గత ప్రభుత్వం అధిక ధరలకు టెండర్లను పిలిచి నిర్మాణాలను చేపట్టిందని మంత్రి విమర్శించారు. తక్కువ ధరలకు పేదలకు ఇళ్ల నిర్మాణాలను కేటాయించాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణలపై ధరలను తగ్గించుకోవాలని కాంట్రాక్టర్లను కోరినట్లు మంత్రి తెలిపారు. ఇసుక కొరతపై భవన నిర్మాణ కార్మికులు చింతించాల్సిన అవసరం లేదని, ప్రజలకు నిర్మాణాల కోసం అవసరమైన ఇసుకను కేటాయించాలని, కొత్తగా రీచ్ లను తెరిపించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి వెల్లడించారు. -
అన్న క్యాంటీన్లపై ప్రచారం అవాస్తవం
-
అన్నా.. ‘ఎలక్షన్’ క్యాంటీన్లు!
ఈ చిత్రంలో కనిపిస్తున్న టెంటుపై ‘అన్న క్యాంటిన్’ బ్యానర్ ఉందని ఆశ్చర్యపోవద్దు. ఇది నిజంగా అన్న క్యాంటీనే... అయితే నగరాల్లో, పట్టణాల్లో మాదిరిగా అధునాతన హంగులతో నిర్మించిన భవనం ఎందుకు లేదా.. అని మీకు అనుమానం రావొచ్చు. ఆగండాగండీ.. అక్కడకే వస్తున్నా. సార్వత్రిక ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకోవడానికి టెక్కలిలో ఇలా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు చేసిన ఎత్తుగడ ఇదండీ... సాక్షి, శ్రీకాకుళం: ‘ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్లలో భోజనం, ఫలహారం.. అందమైన భవనాల్లో వీటిని నడుపుతున్నాం..’ అంటూ తరచూ ఊదరగొట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు వాటిని చెట్లకింద నడిపే స్థాయికి తెచ్చారు. ఈ ఎన్నికల్లో గ్రామీణ ఓట్లను ఆకర్షించడానికి మేజర్ పంచాయతీల్లోనూ అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఎత్తుగడ వేశారు. తొలుత గతేడాది జులైలో రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో 195 చోట్ల అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ కోసం రూ. లక్షలు వెచ్చించి రంగు, హంగుల భవనాలు నిర్మించారు. వీటిలో ఉదయం ఫలహారం (ఇడ్లీ/పూరీ), మధ్యాహ్నం, రాత్రి భోజనం వడ్డిస్తున్నారు. ఈ బాధ్యతను హరేకృష్ణ మూమెంట్ ఫౌండేషన్కు అప్పగించారు. సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో సీఎం చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేశారు. గ్రామీణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకోవడానికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు అందుబాటులో ఉండేలా 152 మేజర్ పంచాయతీల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చారు. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందంటూ తొందర పెడుతూ ఫిబ్రవరిలోనే వీటిని ప్రారంభించాలన్నారు. వీటికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఆయా చోట్ల రెయిన్ ప్రూఫ్ పగోడాలు (టార్పాలిన్ టెంట్లు), మూడు వైపులా కవర్ చేసే సైడ్వాల్స్, నాలుగు డైనింగ్ టేబుళ్లు, నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు, మూడు సింక్లు, ప్లాస్టిక్ డస్ట్బిన్లు, ఒక బీరువా, అన్న క్యాంటీన్ బ్యానర్ వంటివి సమకూర్చాలని నిర్దేశించారు. వీటికి అవసరమైన నిధులు మాత్రం సమకూర్చలేదు. వీటి నిర్వహణకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చెట్ల కింద, టెంట్లు, పాడుబడిన భవనాలనే అన్న క్యాంటీన్లుగా మార్చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 152 మేజర్ పంచాయతీలకుగాను 43 చోట్ల మాత్రమే ఏర్పాటు చేశారు. ఇప్పటికే నడుస్తున్న క్యాంటీన్లు మూడు పూటలా అందుబాటులో ఉండగా, కొత్తగా గ్రామీణ ప్రాంతాల క్యాంటీన్లలో మధ్యాహ్నం మాత్రమే భోజనం పెడుతున్నారు. పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక భవనంలో వీటిని నడుపుతుండగా, పల్లెల్లో మాత్రం చెట్లు, శిథిల భవనాలే దిక్కయ్యాయి. భోజనం తప్ప ఇంకేమీ అందుబాటులో లేని దుస్థితిపై అక్కడి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమలాంటి ఓట్లు కొల్లగొట్టాలన్న ఆలోచనతోనే చంద్రబాబు మొక్కుబడి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. బిల్లుల చెల్లింపుల్లోనూ జాప్యమే.. ఇక ఆహారం సరఫరా చేసినందు కు హరేకృష్ణ మూమెంట్ ఫౌండేషన్కు నెలకు రూ.5 నుంచి రూ. 6 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటోంది. ఆరంభంలో కొన్ని నెలలు బిల్లులు చెల్లించలేదు. ఇలాగైతే తమవల్ల కాదంటూ ఒత్తిడి చేయడంతో జనవరి వరకు బకాయిలు చెల్లించారు. అప్పట్నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఓట్ల కోసమే.. ఎన్నికల ముందు పల్లెల్లో ఓట్ల కోసమే సీఎం చంద్రబాబు మేజర్ పంచాయతీల్లో హడావుడిగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఏమాత్రం సదుపాయాల్లేని టెంట్లలో మొక్కుబడిగా ఒంటిపూట భోజనం పెడుతున్నారు. కనీసం కుర్చీలూ లేవు. – డీ కుసుడు, టెక్కలి మండలం చెట్ల కింద కూర్చుని తింటున్నాం అన్న క్యాంటీన్లను పెడుతున్నామని హడావుడి చేశారు. తీరా చెట్ల కింద, శిథిల భవనాల్లో పెట్టా రు. దీంతో చెట్ల కింద భోజనం చేయాల్సి వస్తోంది. కనీస సదుపాయాలు కల్పించకుం డా ఇలా ఏర్పాటు చేయడం తగదు. – వెంపటపు కార్తీక్, పొందూరు మండలం -
ఆ ఒక్కటీ అడక్కు!
సాక్షి, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం): ‘తక్కువ ధరకే అన్న క్యాంటీన్లో భోజనాలు దొరుకుతున్నాయి. పదార్థాలు రుచిగా ఉన్నాయా తమ్ముళ్లూ...’ అంటూ పెద్దసారు అడిగే సరికి అనుంగు సోదరులకు నోరు మెదల్లేదు. ఓరే.. మనకు తెలీకుండా ఇచ్చాపురంలో క్యాంటీన్ ఎప్పడు పెట్టార్రా.. గుంపులో ఉన్న కామేశం మెల్లగా బావ వెంకటేసు చెవిలో గుసగుసలాడాడు.. ‘ఆ ఒక్కటీ అడక్కు..’ ఇంకా మెల్లగా అన్నాడు వెంకటేసు.. తమ్ముళ్లూ.. మనం చేసిన అభివృద్ధి చూసి ప్రధాన మంత్రి కూడా ఓర్వలేకపోతున్నాడు. అనుమానం ఉంటే ఆయన పనులన్నీ మానుకుని నా దగ్గరకు వచ్చి మాట్లాడమనండి.. పెద్దసారు చిన్న మైకులో చెప్పుకుంటూ వెళ్లిపోతున్నారు..పెదాన మంతిరి ఎందుకొచ్చి మాట్లాడతారు బావా.. ఆయనకిదే పనా.. బుర్ర గోక్కుంటూ అనుమానం వ్యక్తం చేశాడు. కామేశు.. ‘ఆ ఒక్కటీ అడక్కు..’ మళ్లీ అదే సమాధానం చెప్పాడు. వెంకటేసు.. ‘తుఫాన్కు ఇల్లు పడిపోయాయి. చెట్లు కూలిపోయాయి. ఉద్దానం నాశనమైపోయింది.. అయినా నా అనుభవం ముందు తుఫాన్ ఓడిపోయింది కదా తమ్ముళ్లూ.. మనం కట్టించిన ఇళ్లలో బాధితులు హాయిగా ఉన్నారు..’ అవునా కాదా తమ్మళ్లూ.. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పాలి.. అంటూ అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటుని మురిసిపోతున్నారు పెద్దసారు. పోనీ ఇదైనా సెప్పు బావా.. ఇల్లు పడిపోయినాయి నిజమే.. కొత్తిల్లు ఎక్కడ కట్టిచ్చారు.. డబ్బులు కూడా ఒకిరికి ఏసారు.. మన జెండా కాకపోతే ఎయ్యనేదు.. మరి కొత్తిల్లు అంతారేటి.. కామేశంకు ఏమీ అర్థం కావడం లేదు. ‘ఆ ఒక్కటీ అడక్కు..’ వెంకటేసు ఏ మాత్రం తడబాటు లేకుండా అదే మాట మీద నిలబడ్డాడు.. పెద్దసారు ఇంకాస్త గొంతు పెంచి స్పీచ్ దంచేస్తున్నారు.. అమరావతిని సింగపూర్ చేస్తా.. వాళ్లు ఒప్పుకోకపోతే చైనా చేస్తా.. వాళ్లు గొడవపెడితే అమెరికా చేస్తా.. వారు కూడా ఏదైనా అంటే కిమ్తో మాట్లాడి ఉత్తర కొరియా చేసేస్తా.. అక్కడ ఒలింపిక్స్ పెడతా.. ఒలింపిక్స్లో మన ఆటలే ఆడిస్తా.. ఏకధాటిగా చెప్పుకుంటూ పోతున్నారు. ఓరే.. ఆయన్ను ఆపండ్రా.. ఎలా కనిపిత్తన్నార్రా జనాలు.. ముందు పర్మినెంట్గా ఒక్క ఇటుకైనా ఎయ్యమని ఆయనకు సెప్పండి అన్నాడు కామేశం. ఆయన సెప్పింది ఇనడమే.. సెప్పడమనే ఆప్షను లేదు బావా.. మాకిది అలవాటే. అబ్బ మొదటిసారి ఇంకో మాట మాట్లాడాడు వెంకటేసు.. సోంపేటలో కిడ్నీ ఆస్పత్రి పెడతా.. తాగునీరు రప్పిస్తా.. పెన్షన్లు పెంచుతా.. హామీల వర్షం కురిపిస్తున్నారు పెద్దసారు. ఐదేళ్లు కుర్సీలో ఉండగా గుర్తురాని పనులు.. ఎలచ్చన్లు రాగానే గుర్తుకొచ్చేత్తన్నాయి.. అవునా బావా.. అప్పటికే మీటింగ్పై ఇంటరెస్టు పోయి అదోలా మారిపోయిన కామేశం నోటి నుంచి యథాలాపంగా మాటలు వచ్చేశాయి. ‘ఆ ఒక్కటీ అడక్కు’ వెంకటేసు మళ్లీ మొదటి మాటెత్తుకున్నాడు.. ఆ మాట విని కామేశంకు మండిపోయి మీటింగ్ నుంచి ఒకే పరుగు అందుకున్నాడు. బావా.. ఎల్లిపోతావేటి.. ఓటు మాత్రం మనకే ఎయ్యాల.. అంటూ వెంకటేసు గట్టిగా అరిచారు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాడు కామేశం. -
జగన్ని అన్నట్టా! జనాన్ని అన్నట్టా!
సాక్షి, అమరావతి: ఇంట్లోంచి బయటికి వచ్చేందుకు హడలిపోతున్నారు రాష్ట్ర ప్రజలు. పైన ‘చండ్ర’బాబు నిప్పులు కక్కుతున్నాడని కాదు. కింద చంద్రబాబు విషం కక్కుతున్నాడని! చంద్రబాబు జగన్ మీద కక్కుతున్నాడా.. జనం మీద కక్కుతున్నాడా జనానికి అర్థం కావడం లేదు. చంద్రబాబు కక్కీ కక్కీ కడుపు పట్టుకున్నప్పుడు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్, యామిని, బుద్ధా వెంకన్న కక్కిపెడుతున్నారు. లోకేశ్బాబు కూడా కక్కడానికి ట్రయ్ చేస్తున్నాడు కానీ పాపం మాటలు అడ్డుపడి కక్కుడు సగం గొంతులోనే ఉండిపోతోంది. పపన్ కక్కినంతసేపు కక్కగలుగుతున్నాడు. ఇక కక్కలేను బాబోయ్ అనుకున్నప్పుడు కారు డిక్కీలో కూలబడుతున్నాడు. ‘ఈ’ పేపర్, ‘ఆ’ పైపర్లకైతే.. చంద్రబాబు అండ్ టీమ్ ఎప్పుడు కక్కుతుందా, ఆ కక్కుడంతా ఎప్పుడు ఎత్తి పేపర్లో పోద్దామా అనే! కక్కుడు కన్నా పెద్దపని కక్కుడుని ఎత్తి పట్టుకోవడం. ‘ఏపీ అన్నం తింటే జగన్కి ఓటేయొద్దు’’ అన్నాడు బాబు. రాష్ట్రంలో ప్రజలంతా ‘అన్న క్యాంటీన్’లలోనే తింటున్నారనా! ‘‘జగన్కి ఓటేస్తే రౌడీయిజమే’’ అన్నాడు కళా వెంకటరావు. జగన్కి ఓటేసి బయటికి వచ్చేటప్పుడు పట్టుకుని రౌడీల చేత కొట్టిస్తామనా! ‘‘రామరాజ్యమా? రాక్షసరాజ్యమా?’’ తేల్చుకోండి అన్నాడు యనమల రామకృష్ణుడు. తేల్చుకోకపోతే, జగన్కి ఓటేసిన ఒక్కొక్కరి పనీ తేల్చేస్తాం అనా! ‘‘2004లో జగన్ నలిగిన చొక్కా వేసుకున్నాడు. 2019లో ఇస్త్రీ చొక్కా వేసుకున్నాడు. జగన్ ఆస్తి ఇన్ని కోట్లకు ఎలా చేరిందో జనానికి చెప్పాలి’’ అన్నాడు వర్ల రామయ్య. జగన్ ఇస్త్రీ చొక్కాకే ఇంత చేస్తున్నాడు. జనం రేపు కొత్త చొక్కాలు వేసుకుంటే, వర్ల రామయ్యకు సమాధానం చెప్పాలనా! ‘‘బాబుకు ఓటేస్తే పసుపు–కుంకుమ ఇస్తాడు’’ అన్నాడు రాజేంద్రప్రసాద్. చంద్రబాబుకు ఓటేయకపోతే పసుపు–కుంకుమ తుడిచేస్తాడనా!! ‘‘ఓట్లు ఎలా అడుగుతారు?’’ అన్నాడు బుద్ధా వెంకన్న. ‘ఓట్లు ఎలా వేస్తారో చూస్తాం అనా! ‘‘జగన్ ప్రతిపక్ష నేత కావడం దౌర్భాగ్యం’’ అన్నారు యామిని. జగన్కి ఓటేసిన ప్రజలంతా దౌర్భాగ్యులనా! ‘‘పడ్డాయ్ పడ్డాయ్.. దగ్గర పడ్డాయ్’’ అన్నారు జనంలో ఒకరు. ‘‘ఎన్నికలేగా’’ అన్నారు ఇంకొకరు. ‘‘అవెలాగూ పడతాయి’’ ‘‘మరింకేం దగ్గర పడ్డాయి?’’ ‘‘రోజులు దగ్గర పడ్డాయి’’ ‘‘ఎవరికి?’’ ‘‘ఇంకెవరికి! జనాన్ని బెదిరిస్తున్న వారికి. జనానికి వేలు చూపించి వార్నింగ్ ఇస్తున్నవారికి. జనాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నవారికి. జనాన్ని అవమానిస్తున్న వారికి. జనాన్ని దౌర్భాగ్యులు అన్నవారికి. జనంపై విషం కక్కుతున్నవారందరికీ.. రోజులు దగ్గరపడ్డాయి’’ – మాధవ్ -
అన్నన్నా.. కోడ్ ఉందన్నా..
సాక్షి, తెనాలిరూరల్: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా, అధికారులకు పట్టడంలేదు. అధికార పార్టీకి అనుచరులుగా అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట, మార్కెట్ కాంప్లెక్స్ ముందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ముసుగు వేయకుండా వదిలేశారు. ఇక దాని వెంబడి ఉన్న అన్న క్యాంటీన్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, మార్కెట్ యార్డు ఆవరణలో ఉన్న అన్న క్యాంటీన్ల గాడలపై ఎన్టీఆర్, చంద్రబాబు, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ చిత్రపటాలను కూడా అలాగే వదిలేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుటనే ఇలా కోడ్ ఉల్లంఘన జరుతుండడంపై ప్రజాస్వామిక వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అన్నన్నా... ఇవేం క్యాంటీన్లు
తూర్పుగోదావరి, కొత్తపల్లి (పిఠాపురం): ఉప్పాడలోని ప్రయివేటు స్ధలంలో అన్న క్యాంటీన్ నిర్మించేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నించడంతో వారం రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు నడుమ సోమవారం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ దౌర్జన్యంగా శంకుస్ధాపనకు దిగడంతో ఆ స్థల పట్టాదారులు ఎరిపల్లి రాంబాబు, ఎరిపల్లి లక్ష్మణరావు, ఎరిపల్లి తాతారావు, ఎరిపల్లి బాబురావు, ఎరిపల్లి శ్రీనులు ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డులో బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు భారీగా మోహరించి వారిని అడ్డుకోవడంతో రాంబాబు స్థానికంగా వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబుతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గంలో అరాచక పాలన సాగుతుందనడానికి ఇదో నిదర్శనమన్నారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుటంబ సభ్యులు దోచుకుంటున్నారని, ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఉప్పాడలో ప్రభుత్వ స్థలాలు ఉండగా పట్టాలున్న స్థలంలో అన్న కేంటీన్ కోసం శంకుస్థాపనను పోలీసుల పహారాలో చేయడమేమిటని ప్రశ్నించారు. పట్టాలున్న వ్యక్తులపై నకిలీ పట్టాలని అభియోగం మోపి వారిపై అక్రమంగా కేసులు బనాయించారని విమర్శించారు. దీనిపై బాధితులు కోర్టును కూడా ఆశ్రయించారని, స్టే వస్తుందని చెప్పినా లెక్క చేయకుండా సుమారు 200 మంది పోలీసు బలగాల నడుమ శంకుస్థాçపన చేయడం అవసరమా అని ప్రశ్నించారు. రౌడీ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, శంకుస్థాపన చేసినంత మాత్రాన ఏవిధంగా నిర్మాణం జరుగుతుందో చూస్తామన్నారు. నిర్మాణం జరగకుండా అడ్డకుంటామని, çస్థలం కబ్జా కాకుండా వైఎస్సార్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ నాయకుడు, విద్యావేత్త వడిశెట్టి నారాయణరెడ్డి మాట్లాడుతూ పట్టాలు ఇచ్చిన వారిపై పోలీసు బలగాలను పంపించి భయబ్రాంతులకు గురి చేయడం నిరంకుశ చర్యగా అభివర్ణించారు. మద్దతు పలికిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి దొరబాబు, పార్టీ మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్, మైనార్టీ సెల్ నాయకుడు మొహియుద్దీన్, జనసేన పార్టీ నాయకురాలు చల్లా లక్ష్మి తదితరులు ఉన్నారు. -
పోలీసులను అడ్డుపెట్టుకుని కోడెల రౌడీయిజం
సత్తెనపల్లి: పోలీసులను అడ్డుపెట్టుకుని స్పీకర్ కోడెల శివప్రసాదరావు రౌడీయిజం చలాయిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. టీడీపీ నుంచి పలువురు పార్టీలో చేరుతున్న సందర్భంగా సత్తెనపల్లిలో సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లపాటు అధికారాన్ని, పోలీసులను అడ్టుపెట్టుకుని అక్రమ కేసులు బనాయించారన్నారు. మాచర్ల రోడ్డులోని డంపింగ్ యార్డు వల్ల అనారోగ్యం బారిన పడుతున్న 26, 27, 28, 29 వార్డుల ప్రజల కోసం వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పోరాడారని చెప్పారు. డంపింగ్ యార్డు మార్చడమంటే ఒకరి చెత్త మరో ఇంటిలో వేయడం కాదన్నారు. డంపింగ్ యార్డు భీమవరం రోడ్డులోకి మార్చడం సరైంది కాదన్నారు. గొడుగుల సుబ్బారావుకు చెందిన 18 ఎకరాలు అప్పనంగా దోచుకున్నవే అందులో ఐదు ఎకరాలు కేటాయించలేవా అని అన్నారు. నాగుర్ మీరాన్కు చెందిన రిక్రియేషన్ క్లబ్పై కోడెల కన్ను పడిందని, కోర్టు ఆదేశాలను కూడా స్పీకర్ గౌరవించడం లేదని చెప్పారు. అన్న క్యాంటీన్ ద్వారా పెట్టే అన్నం మెతుకులు కూడా అమ్ముకునే స్థాయికి దిగజారిపోయాడని విమర్శించారు. అందుకే ‘క్విట్ కోడెల.. సేవ్ సత్తెనపల్లి’కి పిలుపునిచ్చామన్నారు. నిన్నటి వరకు మోదీతో అంటకాగిన టీడీపీ ఇప్పుడు ముస్లింల ఓట్ల కోసం తెగదెంపులు చేసుకుందన్నారు. గతంలో కూడా బీజేపీతో కలవబోమని చెప్పి 2014లో బీజేపీతో కలిసి పోటీ చేశారన్నారు. త్వరలో మళ్లీ బీజేపీతో కలుస్తుందని చెప్పారు. నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ నారా హమారాలో హామీలు అమలు చేయలేదని ముస్లిం సోదరులు ప్లకార్డులతో ప్రశ్నిస్తే వారిపై దేశద్రోహం కేసు పెట్టిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన మస్తాన్వలి, జిలానీ, బుజ్జిబాబు, దరియా గౌస్, రసూల్, గౌస్, మస్తాన్, సయ్యద్బాజీ, షరీఫ్, పఠాన్ సుభాని, పఠాన్ పెదమాబు, పఠాన్ ఇమాంఖాన్, పఠాన్ మొహమ్మద్ ఖాశీం, షేక్ మీరావలిలతోపాటు ఆయా కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. వారికి అంబటి రాంబాబు, శ్రీకృష్ణదేవరాయలు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్ నాగూర్మీరాన్ అధ్యక్షత వహించిన ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల నారాయణ, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ మహబూబ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు, పట్టణ పార్టీ అధికారప్రతినిధి ఎస్ఎం యూనస్ మాట్లాడారు. -
హవ్వ.. మరీ ఇంత కక్కుర్తా!
సాక్షి, గుంటూరు : ‘హవ్వ.. మరీ ఇంత కక్కుర్తా.. డబ్బు కోసం ఇంతకు దిగజారాలా.. పేదవాడి నోటి కాడ కూడును కూడా లాగేసుకుంటారా.. అన్న క్యాంటిన్లలోని భోజనం తరలించి సొమ్ము చేసుకుంటారా..’ అంటూ టీడీపీ నేతల వైఖరి చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లిలో ముఖ్య నేత తనయుడు, తనయ.. అన్న క్యాంటిన్లో భోజనాలను కూడా అమ్ముకుంటున్న దిగజారుడుతనాన్ని చూసి ఆ రెండు నియోజకవర్గాల ప్రజలు విస్తుపోతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో టీడీపీ నేతల దౌర్జన్యాలు, అరాచకాలు తార స్థాయికి చేరాయి. మరీ ముఖ్యంగా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అయితే ముఖ్య నేత కుమారుడు, కుమార్తెల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. వీరి కన్ను ఇప్పుడు అన్న క్యాంటిన్లపైనా పడింది. అన్న క్యాంటిన్లలో రూ.5కే భోజనం పెడుతున్న విషయం తెలిసిందే. అయితే వీటిని ముఖ్యనేత కుమార్తెకు చెందిన ఓ వ్యాపార సంస్థకు మధ్యాహ్నం 150, సాయంత్రం 150 చొప్పున రోజుకు 300 భోజనాలను చేరవేస్తున్నారు. అన్న క్యాంటిన్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదు. పోనీ తమ కంపెనీలో పనిచేసే కార్మికులకైనా ఉచితంగా భోజనాలు పెడుతున్నారా అంటే అదీ లేదు.. ఒక్కో భోజనానికి కార్మికుల వద్ద నుంచి రూ.25 వసూలు చేస్తున్నట్టు సమాచారం. దీన్ని బట్టి రోజుకు భోజనాల ద్వారా కార్మికుల నుంచి రూ.7,500 చొప్పున నెలకు రూ.2.25 లక్షలు.. దోచేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పేదలకు పెట్టే అన్నంలోనూ అంత కక్కుర్తి అవసరమా అంటూ ముఖ్యనేత కుటుంబ సభ్యులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కే ట్యాక్స్ కట్టాల్సిందే.. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో అపార్ట్మెంట్ల నిర్మాణం, వ్యాపార సముదాయాల విస్తరణ పూర్తిగా నిలిచిపోయిందంటే వీరు ఏ స్థాయిలో ‘కే’ (వారి ఇంటి పేరు) ట్యాక్స్ వసూలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీపై విమర్శలు చేస్తున్న అధికార పార్టీ నేతలు.. రాజ్యాంగ బద్ధమైన పదవిలో కొనసాగుతున్న ముఖ్యనేత కొడుకు, కూతురు ప్రజలపై విధిస్తున్న కే ట్యాక్స్పై నోరు మెదపలేకపోతున్నారు. ఇవేకాకుండా పేకాట, క్రికెట్ బెట్టింగ్, మట్కా, గుట్కా, ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్న వారి నుంచి కూడా మామూళ్లు వసులుచేస్తున్నారు. చివరికి వారు తమ పార్టీ వారైనా సరే వదిలిపెట్టడం లేదు. ఈ విషయమై ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో బాధితులు మిన్నకుండిపోతున్నారు. రేషన్ మాఫియా దగ్గర నుంచి భూ కబ్జాల వరకూ దేన్నీ వదలడం లేదు. చివరకు కోటప్ప కొండ పండుగను సైతం తమ ధన దాహానికి వాడుకుని త్రికోటేశ్వరుని పవిత్రతకు భంగం కలిగించారు. తమ అనుచరుల ద్వారా కోడి పందాలు, గ్యాంబ్లింగ్, కోత ముక్కాటలను నిర్వహించి జనం వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని వారి జేబులు నింపుకొన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నాలుగున్నరేళ్లలో వీరు చేసిన అవినీతి దందా వెయ్యి పేజీల పుస్తకమవుతుందని స్థానికులు వాపోతున్నారు. -
తాగుబోతుల అడ్డగా మారిన అన్నా క్యాంటీన్లు
-
‘అన్న’న్నా..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రూపాయికే కిలో బియ్యం పథకాన్ని అమలు చేసి, పేదల కడుపు నింపిన నాటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు పేరిట రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లు.. అన్నార్తుల ఆకలిని పూర్తిస్థాయిలో తీర్చలేకపోతున్నాయి. నాణ్యత లోపం, నానాటికీ పడిపోతున్న పరిమాణం, రుచి లేమి తదితర లోపాలు కనిపిస్తుండడంతో అన్న క్యాంటీన్లపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా క్యాంటీన్లలో తొలి రోజుల్లో ఉన్న నాణ్యత ఇప్పుడు ఉండటం లేదు. రుచికరమైన భోజనం పెట్టడం లేదు. పెట్టాల్సిన అన్నంలో ఒక్కొక్కరికి 70 నుంచి 80 గ్రాముల వరకూ కోత పెడుతున్నారు. దీంతో భోజనం కోసం వచ్చిన వారందరూ అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలి రోజుల్లో సన్నబియ్యం.. ఇప్పుడు కోటా బియ్యం ‘‘అన్న క్యాంటీన్లు ఆరంభించిన తొలి రోజుల్లో సన్నబియ్యంతో అన్నం పెట్టేవారు. సాంబారు, కూర కూడా రుచిగా ఉండేవి. కానీ కొన్ని రోజులుగా పరిస్థితి మారింది. సన్నబియ్యం పెట్టడం లేదు. కోటా బియ్యం మాత్రమే వండి వార్చి పెడుతున్నారు. ఇక, సాంబారు నీళ్లను తలపిస్తోంది. కూర ఏమాత్రం రుచిగా ఉండటం లేదు’’ అని అన్న క్యాంటీన్లకు నిత్యం వస్తున్నవారు విమర్శిస్తున్నారు. గతంలో మెనూ చార్ట్ ఉండేదని, ఇప్పుడా చార్ట్ కూడా తీసేశారని అంటున్నారు. ఎందుకు తీసేశారని సిబ్బందిని అడిగితే పైవాళ్లు తీసేయమన్నారంటున్నారని చెబుతున్నారు. లోపమెక్కడో! గతంలో 6 బౌల్స్ అన్నం, రెండు బౌల్స్ సాంబారు, ఒక బౌల్ పూర్తిగా కూర ఇచ్చేవారు. క్యాంటీన్లలో తింటున్నవారి సంఖ్య పెరగడంతో అన్నాన్ని ఆరు నుంచి తొమ్మిది బౌల్స్కు పెంచారు. సాంబారు యథాతథంగానే రెండు బౌల్స్ ఇస్తున్నారు. కూర సగానికి పైబడి ఉన్న రెండు బౌల్స్తో అందిస్తున్నారు. ఇప్పుడిదే సమస్యగా మారిందని సిబ్బంది చెబుతున్నారు. గతంలో పెద్ద బౌల్స్లో వచ్చేవని, ఇప్పుడా బౌల్స్ సైజు కూడా తగ్గిపోయిందని, భోజనం రుచి కూడా తగ్గిపోయిందని సాక్షాత్తూ సిబ్బందే చెబుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భోజనం సరఫరా చేస్తున్న ‘అక్షయపాత్ర’ సంస్థ నుంచే ఆవిధంగా వస్తోందని సిబ్బంది అంటున్నారు. పట్టించుకోని ప్రభుత్వం ప్రచారం కోసం అన్న క్యాంటీన్లను భారీగా ఏర్పాటు చేసినా ఆ తర్వాత ప్రభుత్వం వీటి నిర్వహణను సరిగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఒకప్పుడు సన్నబియ్యం పెడితే ఇప్పుడా బియ్యం నాసిరకంగా ఉండడానికి ప్రభుత్వమే కారణమని పలువురు చెబుతున్నారు. సాధారణంగా భోజనం పెట్టేటప్పుడు ముందుగా సంబంధిత పర్యవేక్షకులు రుచి చూసి గ్రీన్సిగ్నల్ ఇవ్వాలి. ఇక్కడా పరిస్థితి కనిపించడం లేదు. తమకొచ్చిన భోజనం రుచికరమైనదా, కాదా అనేది చూడకుండా ప్రజలకు నేరుగా పెట్టేస్తున్నారు. అది నాణ్యతగా లేకపోవడంతో తింటున్న వారందరూ గగ్గోలు పెడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఒక్కో క్యాంటీన్లో ఎనిమిది మంది చొప్పున పని చేస్తున్నారు. వారికి నాలుగు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదు. జీతాల్లేని వారు ఏ మేరకు బాధ్యతగా పని చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఏం చేసినా సిబ్బందిని ప్రశ్నించే పరిస్థితి ఉండదని పలువురు అంటున్నారు. మొదట్లో బావుండేది అన్న క్యాంటీన్ పెట్టిన మొదట్లో భోజనం బావుండేది. అన్నం నిర్దేశిత పరిమాణంలో పెట్టేవారు. ఆకలి కూడా తీరేది. భోజనం రుచికరంగా ఉండటంతో తింటే సంతృప్తిగా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయం లేక తప్పని పరిస్థితుల్లో వచ్చి భోజనం చేస్తున్నాం. లోపాలను అధికారులు చక్కదిద్దాలి– విజయ్, విద్యార్థి అన్నం బాగోలేదు గతంలో సన్నబియ్యం పెట్టేవారు. ఇప్పుడు స్టోర్ బియ్యం పెడుతున్నట్టుగా ఉంది. ఏమాత్రం బాగోవడం లేదు. సాంబారు, కూర కనీసంగా కూడా రుచిగా ఉండడం లేదు. పెట్టిన అన్నంలో కూడా 70 నుంచి 90 గ్రాముల వరకూ కోత పెడుతున్నారు. ఆకలి తీరడం లేదు. క్యాంటీన్లో కనీసం మెనూ చార్ట్ కూడా ఉంచడం లేదు. అంతా ప్రచారార్భాటంగానే ఉంది.– అల్లు సతీష్ రుచిగా లేదు అన్నమే కాదు.. సాంబారు, కూర కూడా రుచిగా ఉండడం లేదు. వారేది పెడితే అది తింటున్నాం. లోపాలపై అడిగితే పట్టించుకోవడం లేదు. సాంబారైతే నీళ్ల మాదిరిగానే ఉంటోంది. మొదట్లో అన్నం బాగుండేది. ఇప్పుడది కూడా బాగుండటం లేదు.– వీరబాబు, కాకినాడ నా దృష్టికి రాలేదు ప్రతి రోజూ పర్యవేక్షణ చేస్తున్నాను. భోజనం రుచికరంగానే ఉంటోంది. పరిమాణం తక్కువ పెడుతున్నట్టు నా దృష్టికి రాలేదు. అయినప్పటికీ ‘అక్షయపాత్ర’ దృష్టికి తీసుకెళ్తున్నా. లోపాల్లేకుండా చూసుకుంటాను. – ఉమామహేశ్వరి, నోడల్ ఆఫీసర్ -
ప్రజల్ని మభ్యపెట్టేందుకే అన్న క్యాంటీన్లు
రైల్వేకోడూరు : నాలుగేళ్ల క్రితం ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చి, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో పేద ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్రెడ్డి పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ పేద వాడికి బోజనం పెట్టే పథకంలో కూడా టీడీపీ నాయకులు కడుపు నిండా మెక్కుతున్నారని ఆరోపించారు. నాలుగేళ్లగా ప్రజలకు హామీలిస్తూ, దోచుకోవడానికి వీలుండే పనులే చేశారని, మాటల గారడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో అన్న క్యాంటీన్కు రూ.35లక్షలు వెచ్చించి, ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని తెలిపారు. అయినా అక్కడికెళ్లిన పేదలకు అన్నం పెట్టకుండా దాడులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలను భ్రష్టు పట్టిస్తున్న పాలకమండలి ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలకు ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవసప్థానాన్ని టీడీపీ ప్రభుత్వంలోని పాలకమండలి భ్రష్టు పట్టిస్తోందని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు. రోడ్లు, ఆలయం మూసివేత సంఘటనలు చరిత్రలోనే జరగలేదన్నారు. సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి అసలు ఏమి చేయాలని ఆలోచిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. వీరబ్రహ్మేం ద్రస్వామి చెప్పినట్లు తిరుమల ఆలయం మూత జరిగితే కలియుగాంతం అన్న మాటలు ప్రజలు గుర్తు చేసుకుంటూ భయభ్రాంతులకు గురవతున్నారని తెలిపారు. వెంటనే పాలకమండలి నిర్ణయాన్ని వెనక్కితీసుకుని ప్రజలకు వేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు, కార్యకర్తలు, నాయకులు గుండిమడుగు సుధాకర్ రాజు, సీహెచ్ రమేష్, మందల నాగేంద్ర, ఇనమాల మహేష్, ఆర్వీ రమణ, ఎంపీటీసీలు మందల శివయ్య, సుబ్రమణ్యం, సుదర్శన్రాజు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
అన్న క్యాంటీన్లలోనూ కమీషన్ల ఫుడ్డు
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ ప్రమాణాల పేరుతో అసెంబ్లీ, సచివాలయాల నిర్మాణాలను కళ్లుతిరిగే అంచనాలతో చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. పేదలకు తక్కువ ధరకు ఆహారం అందించే అన్న క్యాంటీన్ల నిర్మాణంలోనూ అదే రీతిలో చెలరేగిపోయింది. పొరుగున ఉన్న తెలంగాణలో మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఇదే తరహా అన్నపూర్ణ క్యాంటీన్ల కోసం అక్కడి సర్కార్ వెచ్చించిన మొత్తానికి.. ఇక్కడ చంద్రబాబు సర్కార్ చెల్లిస్తున్న దానికీ మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. స్థలం ఖర్చుతో కలిపి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ అపార్ట్మెంట్లను చదరపు అడుగును రూ.3,500–రూ.4,500లకు అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతుంటే.. ఏపీ సర్కార్ మాత్రం అన్న క్యాంటీన్లకు ఉచితంగా స్థలమిచ్చి కేవలం నిర్మాణానికే రూ.4,800 చెల్లిస్తూ ప్రజాధనాన్ని దుబారా చేస్తోంది. అక్కడ రూ.4.60లక్షలు.. ఇక్కడ రూ.36లక్షలు మూడేళ్ల క్రితం తెలంగాణలో అక్కడి సర్కార్ పేదలకు తక్కువ మొత్తానికే ఆహారం అందించాలన్న ఉద్దేశ్యంతో అన్నపూర్ణ క్యాంటీన్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం ఒక్కోదానికి రూ.4.60లక్షలను మాత్రమే వెచ్చించి అవసరమైన విస్తీర్ణంలోనే రేకుల షెడ్లను నిర్మించింది. కానీ, చంద్రబాబు సర్కార్ మాత్రం ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.4,800 చొప్పున 750 చ.అడుగులకు రూ.36లక్షలను చెల్లించి బడా రెస్టారెంట్లను తలపించేలా నిర్మింపజేసింది. అలాగే, తెలంగాణ సర్కార్ ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా వీటిని నిర్మించి ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తుంటే ఇక్కడి తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం షోకులకు పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తళుకుబెళుకులకే ప్రాధాన్యత ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 162 క్యాంటీన్లను నిర్మించేందుకు చంద్రబాబు సర్కార్ రూ.58.32కోట్లకు ఓ ప్రముఖ సంస్థతో ఒప్పందం చేసుకుంది. వీటిలో 134 క్యాంటీన్లను ఆ సంస్థ సబ్కాంట్రాక్టుకు ఇచ్చి మిగిలిన వాటిని తనే నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 11న రాష్ట్రంలోని 25 మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో మొత్తం 60 అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. రెండో దశలో మిగిలిన వాటిని నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీటి నిర్మాణంలో చోటుచేసుకున్న అవినీతి, ప్రచారానికి చేస్తున్న ఆర్భాటం.. దుబారా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉంటే.. కేఎఫ్సీ, మెక్డోనాల్డ్ వంటి అంతర్జాయ రెస్టారెంట్లు వాడిన మెటీరియల్ను అన్న క్యాంటిన్ల నిర్మాణంలో వాడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పగా చెబుతున్నప్పటికీ వాస్తవానికి వాటి ధరల్లో భారీ వ్యత్యాసం ఉందని నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. అన్న క్యాంటీన్లలో బ్రిక్వర్క్ (ఇటుక పనికి) కంటే గ్లాస్, అల్యూమినియం ప్యానెల్స్, ఫ్లోర్ టైల్స్, ఫాల్స్ సీలింగ్, ఫ్లోరింగ్కు ఎక్కువ నిధులు ఉపయోగించారు. వీటివల్ల అన్న క్యాంటీన్లు కమర్షియల్ కాంప్లెక్సుల్లోని రెస్టారెంట్లను తలపిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు.. ఈ క్యాంటీన్ల చుట్టూ ప్రహరీగోడ నిర్మాణ బాధ్యతలను ఆయా మున్సిపాల్టీలకు ప్రభుత్వం అప్పగించి నిర్మాణ సంస్థలకు వెసులుబాటును కల్పించడం గమనార్హం. -
అధ్వానమన్నా క్యాంటీన్లు !
ఆదోని: టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన అన్న క్యాంటీన్ల నిర్వహణ పట్టణంలో అబాసుపాలు అవుతోంది. పర్యవేక్షణ కొరవడి ఇష్టారాజ్యంగా మారింది. క్యాంటీన్లు ప్రారంభించిన మూడు రోజలకే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూ.5కే అల్పాహారం, భోజనం దొరుకుతోందన్న ఆశతో క్యాంటీన్లకు వస్తున్న వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. నిరుపేదలందరికీ చౌకగా అల్పాహారం, భోజనం అన్న క్యాంటీన్ల ద్వారా అందుబాటులోకి తెచ్చామని పాలకులు గోప్పలు చెప్పుకోవడం తప్పా వాస్తవ పరిస్థితి విరుద్ధంగా ఉంది. మూడు రోజుల కిందట బుధవారం పట్టణంలోని రైల్వే స్టేషను రోడ్డు, నిర్మల్ టాకీసు ఎదురుగా అన్న క్యాంటీన్లను అధికారులు, నాయకులు హంగు, ఆర్భాటాలతో ప్రారంభించిన విషయం తెలిసిందే. నాణ్యత పాటించకోవడంతో అధ్వానమన్నా భోజనం అంటున్నారు పేదలు. అరగంటనే టోకన్లు ఖాళీ... ఉదయం 7 గం. నుంచి 9 గం వరకు అల్పాహారం, మధ్యాహ్నం 1 గం. నుంచి 3 గం. వరకు, రాత్రి 7 గం. నుంచి 9 గం. వరకు భోజనం అందుబాటులో ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఉదయం 200 మందికి అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి మూడు వందల మందికి చొప్పున భోజన సదుపాయం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అయితే క్యాంటీన్లు తెరిచిన అరగంట లోపే టోకెన్లు ఖాళీ అవుతున్నాయి. టోకెన్ల జారీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం అక్షయపాత్ర అనే సంస్థకు అప్పగించింది. అయితే టీడీపీ మద్దతుదారులు హవా కొనసాగిస్తున్నారు. టోకన్ల పంపిణీలోనూ వ్యత్యాసాలు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్యాంటీన్ల పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం నిర్దిష్టంగా ఏ అధికారికి అప్పగించలేదు. దీంతో పర్యవేక్షణ కొరవడి నిర్వహణ ఆదిలోనే గాడి తప్పింది. ఎమ్మిగనూరులో వంట... క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను స్వీకరించిన అక్షయపాత్ర సంస్థ పట్టణంలోని రెండు క్యాంటీన్లకు అవసరం అయిన అల్పాహారం, భోజనం తయారీ ఎమ్మిగనూరులో చేపట్టింది. ఎమ్మగనూరు నుంచి ప్రత్యేక వాహనంలో పట్టణానికి తెస్తున్నారు. దీంతో అల్పాహరం, భోజనం టోకెన్లు తీసుకున్న వారు నిరీక్షించాల్సి వస్తోంది. వాహనం రాగానే అల్పాహారం, భోజనం కోసం ఎగబడుతుండడంతో గందరగోళం నెలకొంది. పరిమితి విధింపుతో ఇబ్బంది... అల్పాహారం, భోజనాల టోకెన్ల జారీకి పరిమితి విధించడం కూడా తీవ్ర విమర్శలకు గురవుతోంది. పట్టణంలో 2 లక్షలకు పైగా జనాభా ఉండ గా ఇందులో దుకాణాలు, మార్కెట్లు, తోపుడు బండ్లు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఇలా.. అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న కార్మికులు దాదాపు 30వేలకు పైగా ఉన్నారు. డివిజన్ కేంద్రం కావడం, అతి పెద్ద మార్కెట్ యార్డు ఉండడంతో రైతులు, ప్రభుత్వ కార్యాలాయాలలో ఇతర పను ల కోసం ప్రతిరోజూ దాదాపు 50వేలకు పైగా ప ట్టణానికి వస్తుంటారు. పట్టణంలో ఏర్పాటు చేసి న అన్న క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారం, భోజనం అందుబాటులోకి వస్తుందని అధికారులు, నాయకులు ఊదరగొట్టడంతో ఖర్చు చాలా త గ్గుతోందని పేదలు అశించారు. అయితే అల్పాహారానికి 200, భోజనాలకు 300 టోకెన్ల మాత్రమే జారీ చేస్తుండడం ఇబ్బంది నెలకొంది. నాణ్యతపై అనుమానాలే... నాణ్యతపై సీపీఎం నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వంటలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు వెళ్లగా ఇడ్లిలో పురుగున్నట్లు గుర్తించారు. వెంటనే సిబ్బంది దృష్టికి తీసుకెళ్లిగా వేరే ఇడ్డి వడ్డించినట్లు తెలిసింది. దీంతో వంటకు వినియోగించే సరుకుల నాణ్యతపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఒక్క రోజులోనే మారిన అన్న క్యాంటీన్.. గేట్లకు తాళం
-
రెండో రోజే మూత!
అన్న క్యాంటీన్లు కాస్తా అన్నమో రామచంద్ర..అన్నట్టుగా తయారయ్యాయి. ఆర్భాటంగా ప్రారంభించిన ఈ క్యాంటీన్లు తొలిరోజు మధ్యాహ్నమే మూతపడ్డాయి. ఇక రెండో రోజైనా పూర్తి స్థాయిలో తెరుచుకుంటాయన్న ఆశతో వెళ్లిన సామాన్యులు నిరాశతో వెనక్కి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. అల్పాహారం, భోజనం కోసం ప్రజలు బారులు తీరారు. తీరా క్యాంటీన్ సిబ్బంది, సెక్యుక్యూరిటీ గార్డులను లేవని చెప్పడంతో వారిని నిలదీయడం కన్పించింది. సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నాలుగేళ్ల తర్వాత అన్న క్యాంటీన్లు కొలువు దీరాయి. రూ.5కే అల్పాహారం, రూ.5 ఆహారం అంటూ గొప్పలు చెబుతూ జీవీఎంసీ పరిధిలో బుధవారం అట్టహాసంగా 13 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రారంభించారు. అయితే బుధవారం ప్రారంభించిన వాటిలో గురువారం సగానికి పైగా తెరుచుకోలేదు.మరికొన్ని చోట్ల కేవలం మధ్యాహ్నం కొద్దిసేపు భోజనం పెట్టి మూసేశారు. మరికొన్ని వాటిల్లో ఉదయం అల్పాహారంతో సరిపెట్టేశారు.తెరిచిన క్యాంటీన్లు కూడా మధ్యాహ్నం 1 గంటకే మూసేసారు. విశాఖ తూర్పు నియోజకవర్గం 3వ వార్డు పందులఫాం ఏరియాలోని క్యాంటీన్ అసలు తెరవనేలేదు. మరో చోట భోజం కోసం చేరుకున్న సామాన్యులకు అక్కడి సిబ్బంది చెప్పిన సమాధానం కాకపుట్టింది. క్యాంటిన్ టైం అయిపోయింది..300 మందికి భోజనం పెట్టేశాం అని చెప్పడంతో సామాన్యుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. సిబ్బందిని చెడామడా తిట్లదండకంతో ఉతికిఆరేశారు. దొడ్డిదారిన క్యారేజీలు పంపించి ఉంటారంటూ మండిపడ్డారు. లోనికి వెళ్లేందుకు యత్నించారు. సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడంతో అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చినవాల్తేరులోనూ అదే పరిస్థితి చిన వాల్తేరులో ప్రారంభిన క్యాంటీన్ పరిస్థితి కూడా ఇదే. ట్రయల్రన్ అంటూ బుధవారం ఉచితంగా మధ్యాహ్నం భోజనాలు అందజేసిన నిర్వాహకులు గురువారం ముఖం చాటేశారు. అదేమిటంటే క్యాంటీన్లో ఇంకా పనులు జరుగుతున్నాయని..త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభిస్తాం అంటూ చెప్పడం విస్మయానికి గురిచేసింది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు రూ.5కే అందజేస్తామని చెప్పడంతో అధికసంఖ్యలో వచ్చిన భవన నిర్మాణ కార్మికులు, తోపుడు బండి వ్యాపారులు వెనుదిరిగారు. -
అన్నక్యాంటీన్ వద్ద మున్సిపల్ కమిషనర్ దౌర్జన్యం
-
నగరానికే అన్న క్యాంటీన్లు
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటైన అన్న క్యాంటీన్లను ఎట్టకేలకు ప్రారంభించారు. జీవీఎంసీ పరిధిలో 25 క్యాంటీన్లు మంజూరు కాగా.. తొలివిడతలో 13 క్యాంటీన్లకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ జిల్లాలో ఒక్కటి ఏర్పాటు చేయలేదు. అర్బన్ ప్రాంతాల్లోనే క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించిన ప్రభుత్వం.. గ్రామీణ జిల్లాలో పలు అవసరాల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతి రోజు వేలాది మంది వచ్చే నర్సీపట్నం, యలమంచలి, పాయకరావుపేట వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉన్నప్పటికీ ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. జీవీఎంసీ పరిధిలో చిట్టివలస వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. క్యాంటీన్లోనే మంత్రి గంటా, కలెక్టర్ ప్రవీణ్కుమార్లు భోజనం చేశారు. మిగిలిన ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఈ అన్న క్యాంటీన్లను అట్టహాసంగా ప్రారంభించారు. తొలిరోజు ఉచితం.. తొలిరోజు అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన వారందరికీ ఉచితంగానే అల్పాహారం, భోజనం పెట్టారు. తొలిరోజు దాదాపు క్యాంటీన్లంటినీ 2 గంటలకే క్లోజ్ చేశారు. దీంతో 2 గంటల తర్వాత వచ్చిన వారు భోజనం లభించకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. నగర పరిధిలో విమ్స్, ఎంవీపీ, ఆర్ఈ హెచ్, నమ్మిదొడ్డి, చినగంట్యాడ, శ్రీహరిపురం, ములగాడ, మర్రిపాలెం, చిట్టివలస, అనకాపల్లి ఆస్పత్రి, టర్నర్ చౌల్ట్రీ, ఫ్రూట్ మార్కెట్, వాంబే కాలనీ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. మూడుపూటల నాణ్యమైన ఆహారం.. రూ.15కే మూడుపూటలా నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్టు మంత్రి గంటా తెలిపారు. చిట్టివలస వద్ద క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం సదుపాయం కల్పించేందుకు రోజుకు రూ.63వరకూ ఖర్చవుతుందని, ఈ మొత్తం లో ప్రభుత్వం రూ.58 రాయితీగా భరిస్తూ కేవలం రూ.15కే సామాన్యులకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తోందన్నారు. జిల్లాలో ఈ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్కు అప్పగించామని చెప్పా రు. ప్రాథమికంగా ప్రతి క్యాంటీన్లో పూటకు 350 మందికి భోజన సదుపాయాలు కల్పించామని, డిమాండ్ను బట్టి వెయ్యి మంది వరకూ కల్పిం చేందుకు చర్యలు చేపడతామన్నారు. ఆదివారం మినహా వారానికి ఆరు రోజులు ఈ క్యాంటీన్లు పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉదయం 7.30 నుం చి 10 గంటల వరకూ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకూ, రాత్రి 7.30నుంచి 9 గంటలవరకూ ఈ క్యాంటీన్లు పనిచేస్తాయన్నారు. ఫేషియల్ రికగ్నేషన్ద్వారా ప్రతివ్యక్తికి ఒక టోకెన్ మాత్రమే విక్రయిస్తారని తెలిపా రు. ప్రతి క్యాంటీన్లో ఆర్వో ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. -
దేశంలో ఏపీ నంబర్ వన్
కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాణిజ్యరంగంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని రాష్ట్ర మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖామంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను ఆయన కలెక్టర్ హరికిరణ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం క్యాంటీన్ భోజనాన్ని రుచి చూశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం 35 పట్టణాల్లో 100 క్యాంటీన్లు ప్రారంభం అవుతున్నాయన్నారు. ఫుల్ భోజనం చేయాలంటే రూ.40 నుంచి రూ.70లు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం మాత్రం రూ.5లకే టిఫిన్, భోజనం అందిస్తోందన్నారు. రూపాయికే కిలో బియ్యం, 9 రకాల పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. దేశంలోనే ఇదొక మైలురాయిఐ కలెక్టర్ కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ ఈరోజు కడప, ప్రొద్దుటూరులో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని, మరో వారంలో రాయచోటిలో ప్రారంభం అవుతుందన్నారు. పేదవాళ్లు జేబులో డబ్బుల్లేవని ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆహార భద్రతలో దేశంలోనే ఇదొక మైలురాయి అని తెలిపారు. అన్న క్యాంటీన్లకు సంబంధించి ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీకి తాను అధ్యక్షత వహించానని, తెలంగాణ, తమిళనాడులో ఇలాంటి క్యాంటీన్లు ఉన్నప్పటికీ వాటికంటే మెరుగ్గా అన్న క్యాంటీన్లను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. నాణ్యతపరమైన సమస్యలు తలెత్తకుండా ఇస్కాన్కు చెందిన అక్షయపాత్ర అనే విభాగానికి వీటిని అప్పగించామని, వారికి నాణ్యతలో అంతర్జాతీయ గుర్తింపు ఉందన్నాన్నారు. రెండు, మూడు విడతల్లో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆదివారం క్యాంటీన్కు సెలవు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమీషనర్ ఎస్. లవన్న, డిప్యూటీ మేయర్ బి. అరీఫుల్లా, ఎన్సీసీ సంస్థ ప్రతినిధి రామచంద్రరావు, టీడీపీ నాయకులు బి. హరిప్రసాద్, గోవర్థన్రెడ్డి, లక్ష్మిరెడ్డి, జిలానీబాషా, ఏ, రాంప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. -
నా స్థలంలో అన్న క్యాంటీన్ ఎలా పెడతారు?
పెద్దాపురం: ప్రైవేట్ స్థలంలో ‘అన్న క్యాంటీన్’ ఎలా ఏర్పాటు చేస్తారంటూ అధికారులను ఓ మహిళ నిలదీసింది. పట్టణంలో ఇంకెక్కడ స్థలం లేదా అని ప్రశ్నించింది. పేదల స్థలమే కావాల్సి వచ్చిందా అని బోరున విలపించింది. అయినా కూడా అధికారులు పట్టించుకోకుండా ఆమె స్థలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడంతో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఈ ఘటన ఆదివారం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగింది. పట్టణానికి చెందిన జాలా కన్య మరియ, జాలా పుష్పల తండ్రికి ప్రభుత్వం 1983లో స్థానిక మున్సిపల్ సెంటర్లో రెండున్నర సెంట్లు ఇచ్చింది. అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామంటూ మున్సిపల్ అధికారులు ఆదివారం ఆ స్థలం వద్దకు వచ్చారు. దీంతో మరియ అధికారులను అడ్డుకుంది. అయినా కూడా వారు వినకపోవడంతో పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంతలో స్థానికులు, ఆమెను అడ్డకున్నారు. విషయం తెలుసుకున్న పెద్దాపురం ఎస్ఐ కృష్ణ భగవాన్ ఘటనాస్థలికి చేరుకుని ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకోకపోతే.. ఆ స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చని అధికారులు చెప్పారు. అందుకే ఆ స్థలంలో క్యాంటీన్ ఏర్పాటు చేయాలనుకున్నామన్నారు. కాగా, రోడ్డు విస్తరణ వల్ల ఇంటి నిర్మాణం ఆలస్యమైందని బాధితురాలు చెప్పింది. విస్తరణలో పోగా మిగిలిన స్థలంలో ఇల్లు నిర్మించుకుందామనుకుంటే.. ప్రభుత్వమిలా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామనడం ఎంత వరకు సమంజసమని బాధితురాలి సోదరి కరుణ ఆవేదన వ్యక్తం చేసింది. పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, టీపీవో భాస్కరరావులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. -
అన్న క్యాంటీన్లపై రభస
సాక్షి, కడప కార్పొరేషన్ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్లకు సంబంధించి పాలకవర్గ సభ్యులకు తెలియకుండానే కార్పొరేషన్ కార్యాలయంలో స్థల కేటాయింపు జరపడంపై రభస చెలరేగింది. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో మేయర్ సురేష్బాబు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ ఈ అంశాన్ని లేవనెత్తుతూ కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి జన్మభూమి, నవనిర్మాణ దీక్షలకు ఖర్చు చేస్తున్నారని, అన్నక్యాంటీన్కు కార్పొరేషన్ స్థలాన్ని ఇస్తూ పాలకవర్గ సభ్యులకు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. దీనికి కమిషనర్ లవన్న స్పందిస్తూ ప్రభుత్వం అత్యవసరంగా చేయాలని చెప్ప డం వల్లే చేశామని, ఆ స్థలం ఎవరికీ ఇవ్వలేదని, కార్పొరేషన్ ఆధీనంలో నే ఉందని చెప్పారు. ప్రభుత్వం చేసే మంచి పనిని తప్పుబట్టడం సరికాదని టీడీపీ ఫ్లోర్ లీడర్ విశ్వనాథరెడ్డి సూచించగా, తప్పుబట్టడం లేదని సభ్యులకు సమాచారం ఇవ్వలేదనే అడిగామని పాకా సురేష్ వివరణ ఇచ్చారు. ఈ దశలో కో–ఆప్షన్ సభ్యుడు ఎంపీ సురేష్ అన్న క్యాంటీన్ల పనులన్నీ వైఎస్ఆర్సీపీ వారే చేస్తున్నారని అనడంతో ఆ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీవు కో–ఆప్షన్ సభ్యుడివి ఎలా అయ్యావు’ అనడంతో టీడీపీ సభ్యుడు విశ్వనాథరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం చెలరేగింది. మేయర్ జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. వీఎల్టీ ఫీజుల వసూలుపై ఆగ్రహం కార్పొరేషన్లో వీఎల్టీ పేరుతో 14 శాతం ఫీజు లు వసూలు చేయడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకవర్గానికి తెలియకుండా ప్రజలపై భారం వేసి చెడ్డపేరు తెస్తున్నారని బండిప్రసాద్, పాకా సురేష్, లక్ష్మయ్య మండిపడ్డారు. నగరపాలక సంస్థకు చెందిన స్థలాల వివరాలను అసెస్మెంట్ రిజిస్టర్లో పొందుపరచాలని సభ్యులు సూచించగా మేయర్ అంగీకరించారు. రోడ్ల విస్తరణ, బుగ్గవంక సుందరీకరణ, ట్రాఫిక్ అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. ఎల్ఈడీ దీపాల నిర్వహణపై ఏది నిజం ఎల్ఈడీ దీపాల కోసం ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చామని చెబుతోంది, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వమూ ఇచ్చామని చెబుతోంది, ఇందులో ఏది నిజమని పాకా సురేష్, మగ్బూల్ బాషా ప్రశ్నించారు. అన్ని నిధులు కార్పొరేషన్ జనరల్ ఫండ్లోంచి ఇవ్వాలని తీర్మాణం ప్రవేశపెట్టారు, అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్ఈడీ దీపాలకు నిధులేమీ ఇవ్వలేదా అని సూటిగా ప్రశ్నించా రు. అగ్రిమెంట్ చేసేటప్పుడు సభ్యులకు తెలపకుండా బిల్లులు చెల్లించాల్సి వచ్చేసరికి తీర్మాణం పెట్టడం సరికాదన్నారు. సంవత్సరం నుంచి అడుగుతున్నా తమ డివిజన్లో వీధిదీపాలు వేయలేదని సభ్యులు లక్ష్మయ్య, ఎంఎల్ఎన్ సురేష్ సభ దృష్టికి తెచ్చారు. దీనిపై మేయర్ స్పందిస్తూ కార్పొరేటర్ల కమిటీ దీనిపై అధ్యయనం చేసి నిధుల విడుదలపై స్పష్టత ఇస్తుందని ప్రకటించా రు. కార్పొరేషన్లో ఒక్కొక్కరి వద్ద రూ.2లక్షలు తీసుకుంటూ ఔట్ సోర్సింగ్ కార్మికులుగా నియమిస్తున్నారని, ఇలా 29 మందిని నియమించారని పాకా సురేష్ ఆరోపించారు. వీరిని ఎవరి అనుమతితో తీసుకున్నారో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. దీనిపై మేయర్ స్పందిస్తూ 4 రోజు ల్లో నివేదిక ఇవ్వాలని కమీషనర్ను ఆదేశించారు. అమృత్ పథకానికీ మొండిచెయ్యేనా! అమృత్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపిందని సభ్యుడు పాకా సురేష్ విమర్శించారు. అమృత్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 20 శాతం భరించకపోవడం దారుణమని విచారం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ బి.అరీఫుల్లా మాట్లాడుతూ మాచుపల్లె బస్టాండును చెత్తను తొలగించి ఆధునీకరించాలని కోరారు. మేయర్, ఎమ్మెల్యే కూ డా ఆ ప్రతిపాదనకు మద్దతు పలి కారు. కార్పొరేషన్ జనరల్ ఫండ్ను తమ డివిజన్లలో ఖర్చు పెట్టకుం డా అన్యాయం చేశారని ఎస్ఏ షంషీర్, జమ్మిరెడ్డి, హరూన్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో జనరల్ ఫండ్ ఏఏ డివిజన్లలో ఎంత ఖర్చు చేశారో జాబితా రూపొందించి, ఖర్చుపెట్టని డివి జన్లకు ఎక్కువ నిధులు ఇవ్వాలని కోరారు. అంతకుముందు ఇటీవల మృతి చెందిన 23వ డివిజన్ కార్పొరేటర్ జేసీబీ పీటర్స్ మృతికి సంతాపంగా సభ రెండు నిముషాలు మౌనం పాటించింది. ఎస్ఈ ఉమామహేశ్వరరావు, అదనపు కమీషనర్ నిరంజన్రెడ్డి, డిప్యూటీ కమీషనర్ సుశీలమ్మ, ఈఈ కేఎం దౌలా, ఇరిగేషన్ ఈఈ కొండారెడ్డి పాల్గొన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు– మేయర్ నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందు కు చర్యలు చేపడుతున్నట్లు మేయర్ సురేష్బాబు తెలిపారు. వేసవి కాలంలో తాగునీటి సమస్య రాకుండా గట్టెక్కామని, ఎల్ఈడీ వ్యవస్థ సక్రమంగా లేదన్నారు. ఉక్కాయపల్లె కంపోస్టు యార్డులో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న పనులను పాలకవర్గ సభ్యులతో కలిసి తనిఖీ చేస్తామని చెప్పారు. వారిపై కేసు నమోదు చేయాలి–ఎమ్మెల్యే కార్పొరేషన్కు సంబంధించిన గదిని అనధికారికంగా లీజుకు ఇచ్చి బాడుగ వసూలు చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే అంజద్బాషా డిమాండ్ చేశారు. రూ.1000లు పింఛన్ డబ్బు దుర్వినియోగం అయ్యిందని ఉద్యోగులను సస్పెండ్ చేశారని, అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు. 29వ డివిజన్లో మేస్త్రిని మార్చడంపై కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అంధకారంలో ఉన్నా, కాలువలు లేక దుర్వాసన చచ్చిపోతున్నా జనరల్ ఫండ్ లేదని చెప్పే అధికారులు అన్నక్యాంటీన్లు, నవనిర్మాణ దీక్షలకు ఎలా ఖర్చుపెడుతున్నారని ప్రశ్నించారు. -
ఎన్టీఆర్ ఇప్పుడు గుర్తుకు వచ్చాడా?
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్లు కొత్త పద్ధతిలో ప్రజలను దోచుకోవటం ప్రారంభించారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పేర్కొన్నారు. అందుకోసం అన్నా క్యాంటీన్లను తెరపైకి తెచ్చారని ఆయన మండిపడ్డారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి విధానాలను ఎండగట్టారు. ఎన్టీఆర్ ఇప్పుడు గుర్తుకు వచ్చాడా? ‘2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చి 630 హామీల్లో అన్నా క్యాంటీన్ ఒకటి. నాలుగేళ్లుగా ఏ ఒక్క హామీ నెరవేర్చని బాబు.. ఇప్పుడు హడావుడిగా అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని ప్రకటన చేశారు. ఎన్టీఆర్ పేరు వినబడకూడదనే ఇన్నాళ్లు ఆ అంశాన్ని పక్కనపెట్టారు. ఇప్పుడు ఎన్నికల వేళ అన్నా క్యాంటీన్ అంటూ డ్రామాలు మొదలుపెట్టారు. కానీ, ప్రజలు మాత్రం వాటిని ‘అల్లుడి క్యాంటీన్లు’గానే భావిస్తున్నారు’ అని ఆర్కే ఎద్దేవా చేశారు. చంద్రబాబు,ఆయన తనయుడు లోకేశ్లు అన్నా క్యాంటీన్ల ద్వారా పెద్ద ఎత్తున్న దోపిడీకి తెరలేపారని ఆర్కే వివరించారు. ‘సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలను అన్న క్యాంటీన్లకు కేటాయిస్తూ టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. 163 క్యాంటీన్లకిగానూ రూ. 59 కోట్ల రూపాయల టెండర్లు పిలిచారు. అంటే ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి రూ. 36 లక్షలు అన్నమాట. ఆ లెక్కన్న నిర్మాణం కోసం చదరపు అడుగుకి రూ. ఐదు వేలు ఖర్చు చేస్తున్నారు. చివరకు పేదవాడికి అన్నం పెట్టే విషయంలో కూడా అవినీతి చేయాలని చూస్తున్నారు అని చంద్రబాబుపై ఆర్కే మండిపడ్డారు. నారాయణ ఆ విషయాన్ని గ్రహించాలి... ‘ఈ అవినీతి ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ మీ అవినీతి ప్రభుత్వాన్ని అస్సలు వదిలి పెట్టదు. వైఎస్సార్ పాలనను ఆదర్శంగా తీసుకొని పేదలకు ఎంతో కొంత మేలు చెయ్యండి. లేకుంటే ప్రజలు శాశ్వతంగా మర్చిపోతారు’ అని చంద్రబాబుకి ఆర్కే సూచించారు. ఇక నాలుగేళ్లుగా రాజధాని ప్రాంతంలో ఒక్క క్యాంటీన్ అయిన ప్రారంభిస్తారని చూశానన్న ఆయన.. గతేడాది తానే స్వయంగా రాజన్న క్యాంటీన్ను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు-లోకేష్ కలిసి అన్న క్యాంటీన్ల పేరుతో మంత్రి నారాయణని ఇరికించాలని చూస్తున్నారని.. ఈ విషయాన్ని తెలుసుకోవాలని నారాయణకు ఆర్కే సూచించారు. చంద్రబాటు కుటుంబమే ఇంకా రాలేదు... చంద్రబాబు కుటుంబమే ఇంకా రాజధానికి రాలేదన్న విషయాన్ని ప్రస్తావించిన ఆర్కే.. రాజధానిలో బాబు ఇల్లు కట్టుకోలేదని తెలిపారు. ‘ముప్పై ఎనిమిది వేల కుటుంబాలు రాజధానికి వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు. ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. దోపిడీని కేంద్రం ప్రశ్నించడానికి సిద్ధం అయిన తరుణంలో చంద్రబాబు ప్రజల రక్షణ కోరటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్టీఆర్ నుంచి పదవి లాక్కున్నపుడు చంద్రబాబుకి గవర్నర్ వ్యవస్థ మంచిగా కనిపించిందని, చివరకు వైసీపీ ఎమ్మెల్యేలని మంత్రి చేసినప్పుడు కూడా ఆయనకు గవర్నర్ వ్యవస్థపై మంచిగానే కనిపించిందని ఎద్దేవా చేశారు. గవర్నర్ను చేస్తానంటూ తెలంగాణలో ఒక దళితుణ్ణి చంద్రబాబు మోసం చేశారని ఆర్కే తెలిపారు. -
బాబు పాలనలో ఏపీ లూటీ అయింది
-
అన్నా..క్యాంటీన్ ఎక్కడ..?
పార్వతీపురం:2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ సర్కార్ ఇచ్చిన హామీలు అన్నీ ఇన్నీ కావు. రుణమాఫీ, బాబు వస్తే జాబు, డ్వాక్రా, రైతు రుణమాఫీ, ఎన్టీఆర్ జలసిరి, నిరుద్యోగ భృతితో హామీలతో పాటు జిల్లా, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటు కూడా ఒకటి. రూ.5కే భోజనం అందించి పేదోడి ఆకలి తీరుస్తామని అప్పట్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా గద్దెనెక్కాక మరో ఏడాదిలో దిగిపోతున్నా ఇప్పటివరకు క్యాంటీన్ల ఏర్పాటు విషయాన్ని గాలికొదిలేశారు. దీనిపై ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో హడావుడి చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. ఏర్పాటు ఇలా.. అన్న క్యాంటీన్ల ఏర్పాటును ఒక ప్రయివేటు సంస్థకు అప్పగిస్తారు. వారు నిర్దేశించిన స్థలంలో రేకుల షెడ్డు లు ఏర్పాటు చేసి వెళ్లిపోతారు. నిర్వహణను మహిళా సంఘాల సభ్యులకు అప్పగిస్తారు. ఇది ప్రభుత్వ ఆలోచన. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పండలేదు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఐదు, పురపాలక సంఘాల్లో రెండేసి, మండల కేంద్రాల్లో ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కాని విజయనగరం జిల్లాలో ఎక్కడా ఏర్పాటు చేయలేదు. నిబంధనల మార్పు.. అన్న క్యాంటీన్ల ఏర్పాటులో అధికారులు విఫలం కావడంలో ప్రభుత్వం కొత్త నిబంధనలను ఏర్పాటు చేసింది. స్థల, ఆర్థిక పరమైన ఇబ్బందులు చూపి చిన్న మెలిక పెట్టి ప్రభుత్వ తప్పించుకుంది. లక్ష పైబడి జనాభా ఉన్న చోట్ల మాత్రమే క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు అర్హత కోల్పోయాయి. కేవలం జిల్లా కేంద్రానికి మాత్రమే ఆ అర్హత ఉంది. అక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. ఏర్పాటుకు కావాల్సినవి.. అన్న క్యాంటీన్ను ఏర్పాటు చేయాలంటే 1000 చదరపు అడుగుల ప్రభుత్వ లేక ప్రయివేటు స్థలాన్ని గుర్తించాలి. అనంతరం క్యాంటీన్ల నిర్మాణ బాధ్యత తీసుకున్న కాంట్రాక్టర్కు అప్పగించాలి. ఆయన వచ్చి 15 రోజుల్లో రేకుల షెడ్ల నిర్మాణం చేయాలి. తర్వాత వాటిని మహిళా సంఘాల సభ్యులకు అందిస్తారు. ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం అందించి క్యాంటీన్ల నిర్వహణ జరిగేలా చేయాలి. ఎక్కడా ఈ పనులు జరగలేదు. జిల్లా కేంద్రం విజయనగరం, పార్వతీపురం మున్సిపాలిటీలో క్యాంటీన్ల ఏర్పాటుకు స్థల పరిశీలన చేసి ఆగిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే అధికారులు స్థలాలను వెదికి పెట్టడం తలనొప్పిగా మారింది. విజయనగరం మున్సిపాలిటీలో ఆర్టీసీ కాం ప్లెక్సు, మున్సిపల్ కార్యాలయం, దాసన్న రైతు బజారు సమీపంలో ఉన్న ఖాళీ స్థలాల్లో అక్టోబర్లో స్థల పరిశీలన చేశారు. కానీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. రద్దీ ఉన్న చోట్ల ఏర్పాటు చేస్తే మంచిది.. రద్దీ ఎక్కువగా ఉండే బస్, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కానీ లక్ష జనాభా నెపంతో ప్రభుత్వం తప్పించుకుంది. – అలజంగి జోగారావు, వైఎస్సార్ సీపీ అదనపు సమన్వయకర్త, పార్వతీపురం. -
రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు
మంత్రివర్గ ఉప సంఘం భేటీలో నిర్ణయం సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా 13 నగరాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి వర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఈ క్యాంటీన్ల ఏర్పాటుపై చర్చించేందుకు వెలగపూడి సచివాలయంలో శుక్రవారం మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, సీఆర్డీఏ, పౌరసరఫరాల శాఖ అధికారులు, అక్షయ పాత్ర ఫౌండేషన్ సభ్యులు సమావేశమై దీనిపై చర్చించారు. 100 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
అన్న క్యాంటీన్ ప్రారంభించిన చంద్రబాబు
విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లోనూ త్వరలో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు వెల్లడించారు. అన్న క్యాంటీన్లను పైలెట్ ప్రాజెక్టుగా వెలగపూడిలో ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. శనివారం వెలగపూడిలో అన్న క్యాంటీన్ను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం అన్న క్యాంటీన్ లో ఆహార పదార్థాలను చంద్రబాబుతోపాటు ఆయన మంత్రి వర్గం సహచరులు, ఎమ్మెల్యేలు రుచి చూశారు. 300 చదరపు అడుగు విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన భోజనశాలను ఆయన ప్రారంభించారు. రోజుకు 300 నుంచి 400 మంది ఈ క్యాంటీన్కు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతకుముందు అన్న క్యాంటీన్ను మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పేదవారి ఆకలి తీర్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. రాయలసీమలోని అన్న క్యాంటీన్లలో రాగి సంకటి అందజేయనున్నట్లు సునీత చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో రెండు క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు పరిటాల సునీత చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. -
25న అన్న క్యాంటీన్ల ఏర్పాటు
సీఆర్డీఏ అధికారులతో శ్రీరామ్ అక్షయపాత్ర సంస్థ ప్రతినిధుల భేటీ తుళ్ళూరు : ఈనెల 25న తుళ్ళూరు మండలంలోని పలు ప్రాంతాలలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు శ్రీరామ్ అక్షయపాత్ర సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు మంగళవారం తుళ్ళూరు సీఆర్డీఏ కార్యాలయంలో జేసీ శ్రీధర్తో, పలువురు సీఆర్డీఏ అధికారులతో సమావేశమయ్యారు. ఈనెల 25న సీఎం చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీరామ్ అక్షయపాత్ర సంస్థ ప్రతినిధులు తెలిపారు. తుళ్ళూరు మండల అధికారుల సూచనల మేరకు క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. -
అన్న క్యాంటీన్లు ఎక్కడ?
ఎన్టీఆర్ క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం అందిస్తామన్న ప్రభుత్వం నేటికీ వాటి ఊసే లేని వైనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కూలీలు గుంటూరు : రాజధాని ప్రాంతంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా రూ .5కే భోజనం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా ఎంపిక చేసిన ఒకటీ, రెండు గ్రామాల్లో ప్రారంభించి..ఆ తర్వాత విస్తరించనున్నట్లు చెప్పింది. హైదరాబాద్లోని అక్షయపాత్ర సంస్థకు క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అప్పగించనున్నట్లు అధికార పార్టీకి చెందిన నాయకులు చెబుతూ వచ్చారు. కానీ ఇంత వరకు దానికి సంబంధించిన పనులుగానీ, మార్గదర్శకాలుగానీ చేపట్టలేదు. రాజధాని ప్రాంతంలో అధిక సంఖ్యలో కూలీలు రాజధాని ప్రాంతంలో భవన నిర్మాణ రంగం విస్తరిస్తుండటంతో కార్మికులు, కూలీలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వీరు భోజనానికి అధిక మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని వారంతా భావిస్తున్నారు. ప్రభుత్వం మాటలపై నమ్మకం లేదు రాజధాని ప్రకటన సందర్భంలో ప్రభుత్వం ఆ ప్రాంత ప్రజానీకానికి కొన్ని ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పింది. ఉచిత వైద్యం, పిల్లలకు విద్య అందిస్తామని ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడంతో రైతులు, రైతు కూలీలు, ఇతర వ్యవసాయ అనుబంధ వృత్తుల వారికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి మార్గాలు చూపుతామని హామీ ఇచ్చింది. వీటిలో ఏ ఒక్క హామీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. దీంతో ఎన్టీఆర్ క్యాంటీన్ల ఏర్పాటుపై ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కానందున ఇప్పుడే క్యాంటీన్ల ఏర్పాటు అవసరం లేదని అధికార పార్టీ నాయకుడొకరు చెప్పారు. రాజధాని నిర్మాణం మొదలైతేనే వాటిని ప్రభుత్వం క్యాంటీన్లు ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ప్రైవేటుగా అనేక భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కూలీలు అధిక సంఖ్యలో వస్తున్నారు. వీరందరూ ఎన్టీఆర్ క్యాంటీన్లు కావాలని కోరుతున్నారు. మరి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యేదెప్పుడో ? క్యాంటీన్లు ఏర్పాటు చేసేదెప్పుడో ? అని వారు పెదవి విరుస్తున్నారు. -
ఎక్కడ అన్నా క్యాంటీన్లు?
-
అడ్రస్లేని అన్న క్యాంటీన్లు
తిరుపతికి ఐదు క్యాంటీన్లుగా ప్రకటన స్థల పరిశీలనచేసి ఏడాదిన్నర ఇప్పటికీ ఏర్పాటుకు నోచుకోని వైనం పేదలు, చిరుద్యోగుల కడుపు నింపే విధంగా ఏర్పాటు చేయాలనుకున్న అన్నా క్యాంటీన్ల పథకం అడ్రస్లేకుండా పోయింది. తిరుపతిలో ఐదు క్యాంటీన్ల ఏర్పాటుకు స్థల పరిశీలనచేసి ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు పాలకులు, అధికారులు దీనిపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. తిరుపతి : ఏరుదాటాక తెప్ప తగలెయ్యడం అంటే ఇదేనేమో. 2014 ఎన్నికల్లో టీడీపీ అధ్యక్ష హోదాలో చంద్రబాబునాయుడు వందలాది హామీలను ప్రజలముందు గుప్పించారు. తీరా సీఎంగా గద్దెనెక్కాక ఆ హామీల మాఫీపైనే దృష్టి సారించారు. తమిళనాడు తరహాలో నగర పేదలను దృష్టిలో ఉంచుకుని రూ.5కే టిఫిన్, 7.50 పైసలకే మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొస్తామని ఊదరగొట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 2014 సెప్టెంబర్కల్లా ఎంపిక చేసిన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తమ మంత్రుల బృందం తమిళనాడు కెళ్లి అమ్మ క్యాంటీన్లను పర్యవేక్షించి అదే తరహాలో నగరాల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయన్నుట్టు తెలిపారు. ఈ మాట చెప్పి ఇప్పటికి 14 నెలలు గడుస్తున్నా వీటి ఊసెత్తడంలేదు. ఏడాది క్రితం మంత్రి నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తుడా కార్యాలయంలో జరిగిన సమీక్షలో అన్నా క్యాంటీన్లు నగరంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై చర్చించారు. గత నెల అక్టోబర్లో జిల్లా కమిటీ వచ్చి తిరుపతికి ఐదు క్యాంటీన్లు వచ్చాయని చెప్పారు. ఇలా తిరుపతికి వచ్చినవారంతా ఇదే ప్రకటనలు చేస్తున్నారే తప్ప ఏర్పాటుకు కావాల్సిన చర్యలు మాత్రం తీసుకోవడంలేదు. మూడు కాదు ఐదు గత ఏడాది సెప్టెంబర్లో తుడా కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులు నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తుడా వీసీ, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో తిరుపతి అభివృద్ధిపై చర్చించారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణపై ప్రధానంగా చర్చసాగింది. తిరుపతి నగరానికి మూడు అన్నా క్యాంటీన్లు మంజూరయ్యాయని మంత్రి నారాయణ చెప్పారు. తిరుపతిలో మూడు క్యాంటీన్లు చాలవని, వీటి సంఖ్య ఐదుకు పెంచుతున్నట్టు ప్రకటన చేశారు. స్థానిక పేదలతో పాటు తిరుమలకు వచ్చే యాత్రికులకూ వీటిని అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఐదు క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాలను ఎంపిక చేశారు. టీటీడీ సహా యం తీసుకుని వీలైతే మరిన్ని క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని చర్చించారు. అయితే ఇవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. ఇక్కడే క్యాంటీన్ల ఏర్పాటు అన్నాక్యాంటీన్ల దుస్థితి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం దారిలోనే పయనిస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఐదు ప్రాంతాలను ఎంపిక చేశారు. శ్రీనివాసం, విష్ణు నివాసం సముదాయాలు, బస్టాండ్, రుయా ఆస్పత్రి, నాలుగు కాళ్లమండపం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇవి నిర్వహణకు మాత్రం నోచుకోలేదు. మెనూ ప్రకటన అన్నా క్యాంటీన్ల ద్వారా నగరంలోని పేదలకు భోజన భరోసా కల్పించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. తమిళనాడులో విజయవంతంగా నడుస్తున్న అమ్మ క్యాంటీన్ల తరహాలో ఎన్టీఆర్కు మారు పేరైన ‘అన్నా’ పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. రూ. 5కే ఇడ్లీ, పొంగల్, ఉప్మా అందించాలని నిర్ణయించారు. అదేవిధంగా రూ.7.50 పైలకే మధ్యాహ్న భోజనంలో పులిహోరా, సాంబారురైస్, పెరుగన్నం పెట్టాలని నిర్ణయించారు. కానీ ఇవేవీ ఇంతవరకు అమలు కాలేదు. -
‘అన్న క్యాంటీన్లు’ డౌటే !
సాక్షి, హైదరాబాద్: పేదలకు ఐదు రూపాయలకే అన్నం పెట్టాలనే యోచనతో ప్రకటించిన అన్న క్యాంటీన్ల ఏర్పాటు అనుమానంగా మారింది. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత ఏడాది కిందట చెప్పారు. 2014 అక్టోబర్ నుంచి తొలివిడతగా అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లా కేంద్రాల్లో 35 సెంటర్లను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.5కే సాంబారు అన్నం, రూ.3కు పెరుగన్నం, రూపాయికే ఇడ్లీ ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఏర్పాటుపై ప్రభుత్వంలో కదలిక కనిపించడంలేదు. క్యాంటీన్లు ప్రారంభించకుండానే వాటిని ఏర్పాటు చేస్తే అందులో భోజనం చేస్తారా అనే సందేహం ప్రభుత్వం వైపునుంచి వ్యక్తమైనట్లు సమాచారం. దీంతో క్యాంటీన్ల ఏర్పాటుపై ఇప్పట్లో ఆలోచించే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ పేరిట ప్రకటించిన పథకాన్నే పట్టించుకోవడం లేదు. తమిళనాడులో ‘అమ్మ క్యాంటీన్ల’ పేరిట ఆ ప్రభుత్వం ఈ పథకాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తోంది. అంతేగాకుండా తెలంగాణలోని హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, ఇస్కాన్ సంయుక్తంగా ఇలాంటి పథకాన్నే జయప్రదంగా నిర్వహిస్తున్నాయి. అన్న క్యాంటీన్ల ఏర్పాటుకోసం పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణలతో కూడిన మంత్రుల బృందం తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లపై రెండుసార్లు అధ్యయనం చేసి వచ్చింది. తమిళనాడులో మాదిరి ఇక్కడ ఆశించిన మేరకు స్పందన కనిపించకపోతే క్యాంటీన్లు ఏర్పాటుచేసినా ప్రయోజనం ఉండదనే రీతిలో పాలకులు ఆలోచిస్తుండటంతో ఆ పథకానికి ఇక మంగళం పాడినట్లేనన్న ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందు చెప్పినట్లు అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లోనైనా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని మంత్రి సునీత ప్రస్తావించగా.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుందామని అధికారులు చెప్పినట్లు సమాచారం. అన్న క్యాంటీన్లను ఎప్పుడు ఏర్పాటు చేస్తారా అని రిక్షా కార్మికులు, చిరు వ్యాపారాలు ఆశగా చూస్తున్నారు. -
ఏపీలో రూపాయికి ఇడ్లీ.. రూ.5కి భోజనం
* ఏపీ పురపాలక మంత్రి నారాయణ * నవంబర్లో అన్న క్యాంటీన్లు ప్రారంభం * మధ్యాహ్నం సాంబార్ అన్నం/పులిహోర/పెరుగన్నం * రాత్రి భోజనంలో రెండు చపాతీలునాలుగు నగరాల్లో 35 క్యాంటీన్లు సాక్షి, హైదరాబాద్: అన్న క్యాంటీన్లను నవంబర్ నుంచి ప్రారంభించి రూపాయికే ఇడ్లీ, ఐదు రూపాయలకు రెండు చపాతీలు ప్రజలకు అందచేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూట్లా అన్న క్యాంటీన్లలో ఆహారం లభ్యమవుతుందని చెప్పారు. శనివారం మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష అనంతరం మాసబ్ట్యాంక్లోని పురపాలకశాఖ కమిషనర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్న క్యాంటీన్లను నవంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ప్రారంభిస్తామన్నారు. ఉదయం పూట ఒక ఇడ్లీ(65 గ్రాములు), సాం బార్ కలిపి ఒక రూపాయికి ఇస్తామన్నారు. మధ్యాహ్నం భోజనంలో సాంబార్ అన్నం (350 గ్రాములు) లేదా పులిహోర లేదా పెరుగన్నం రూ.5కే ఇస్తామన్నారు.రాత్రిపూట కూరతో కలిపి రెండు చపాతీలను రూ.5కే ఇస్తామన్నారు. రాగి సంకటి సరఫరా చేయూలని అనంతపురం జిల్లా ప్రజలు కోరినందున దీన్ని కూడా మెనూలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తొలి విడతలో విశాఖలో 15, గుంటూరులో 10, తిరుపతిలో 5, అనంతపురంలో 5 క్యాంటీన్లు నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత దశలవారీగా విస్తరిస్తామన్నారు. అక్టోబర్ 2నుంచి ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపా రు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో 2 యూనిట్లు ఏర్పాటు చేయడం లక్ష్యమని చెప్పారు. పౌర సేవలకు కొత్త సాఫ్ట్వేర్ మున్సిపాలిటీలలో జనన ధ్రువీకరణ పత్రాల నుంచి భవన నిర్మాణాల అనుమతుల వరకూ ఇంట్లో కూర్చునే దరఖాస్తు చేసుకునేలా సరికొత్త సాఫ్ట్వేర్ను రూపొందించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. నెల లేదా రెణ్నెల్లలో ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజల నుంచి 540 ఫిర్యాదులు అందగా 48 గంటల్లో 390 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. పురపాలకశాఖ పరిధిలోని సమస్యలపై ఫొటో తీసి ఛిఛీఝ్చ.జౌఠి.జీ వెబ్సైట్కు పంపితే స్పందిస్తామన్నారు. పన్నులు పెంచకుండానే ఆదాయాన్ని సమకూర్చుకుంటామన్నారు. అనధికారిక నీటి కనెక్షన్లను గుర్తించి క్రమబద్ధీకరించటం తదితర చర్యల ద్వారా ఆదాయూన్ని సమకూర్చుకుంటామని తెలిపారు. -
'ఎలా చేస్తారో తెలియదు.. కానీ చేస్తారు'
అనంతపురం: అన్నా క్యాంటీన్లు, పెన్షన్ల కంటే పంట రుణాల మాఫీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అన్నారు. చంద్రబాబు రుణమాఫీ ఎలా చేస్తారో తనకు తెలియదు కానీ చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థికలోటులో ఉంది. మూడు నెలల్లోనే హామీలు నెరవేర్చాలని అనడం సరికాదన్నారు. ఏపీలో కాంగ్రెస్ లో భవిష్యత్ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 80 టీఎంసీల నీళ్లు అదనంగా అందుబాటులోకి వస్తాయని జేసీ చెప్పారు. -
‘అన్న’ క్యాంటీన్లు దండగ: జేసీ
సాక్షి, అనంతపురం: బడిపిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేని ప్రస్తుత పరిస్థితుల్లో హడావుడిగా ‘అన్న’ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఏమిటో అర్థం కావడం లేదని తాడిపత్రి ఎమ్మెల్యే (టీడీపీ) జేసీ ప్రభాకర్రెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన అనంతపురంలో విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న కొన్ని పథకాలు అర్థం కావడం లేదని, అందులో ‘అన్న’ క్యాంటీన్లు ఒకటన్నారు. తమిళనాడులో నిర్వహిస్తున్న క్యాంటీన్లను ఆదర్శంగా తీసుకుంటున్నారని, అక్కడ అన్నం, సాంబారుతో ప్రజలు భోజనం చేస్తారని, ఆ పద్దతి ఇక్కడ ఎంత మాత్రం సరిపోదన్నారు. ఇస్కాన్ అందిస్తున్న భోజనాన్ని సైతం ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంటోందన్నారు. అసలు ఇస్కాన్ అందిస్తున్న భోజనం లో చాలా లోపాలు ఉన్నాయన్నారు. తాము 2007 నుంచి తాడిపత్రిలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నామని, ఒకసారి తాడిపత్రికి వచ్చి అక్కడి మధ్యాహ్న భోజనాన్ని చూస్తే ఎలా ఉంటుందో తెలుస్తుందన్నారు. -
అక్టోబర్ 2నుంచి అన్న క్యాంటిన్లు
గుంటూరు : రైతు రుణమాఫీ చేసి తీరుతామని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత మరోసారి స్పష్టం చేశారు. బుధవారం ఆమె మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ అన్న క్యాంటిన్ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. బోగస్ రేషన్ కార్డుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి జిల్లాల్లో ఎంపిక చేసిన నగరాల్లో అన్న క్యాంటిన్లు ప్రారంభం కానున్నట్లు పరిటాల సునీత వెల్లడించారు. మంత్రి గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో లెవీ విషయమై సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడే జిల్లా యంత్రాంగంతో సమీక్ష జరుపుతారు. సాయంత్రం నాలుగు గంటలకు రేపల్లె నియోజకవర్గం బేతపూడి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు -
అన్నా క్యాంటీన్లను పరిశీలించనున్న ఏపీ మంత్రులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఎన్టీయార్ క్యాంటీన్లను ఏర్పాటు చేయడం కోసం మంత్రులు చెన్నై పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 16న మంత్రులు పరిటాల సునీత, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు చెన్నై బయల్దేరుతారు. అక్కడ నిర్వహిస్తున్న అమ్మ క్యాంటీన్లను పరిశీలించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో క్యాంటీన్ల ఏర్పాటుకు రామకృష్ణ మిషన్ , ఇస్కాన్ సంస్థలు ముందుకొచ్చాయి. -
తొలివిడతలో 25 'అన్న క్యాంటీన్లు'
ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటుచేయ తలపెట్టిన అన్న క్యాంటీన్లపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ మంగళవారం జరిగింది. అనంతపురంలో ఐదు, తిరుపతిలో ఐదు, గుంటూరులో 10, విశాఖపట్నంలో 15 చొప్పున అన్న క్యాంటీన్లను తొలివిడతలో ఏర్పాటుచేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ క్యాంటీన్ల నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలంటూ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలంటూ నాలుగు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తమిళనాడులోని అమ్మ క్యాంటీన్ల తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. -
అక్కడ అమ్మ... ఇక్కడ అన్న!!
రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. తమిళనాడులో ఉన్న అమ్మ క్యాంటీన్ల తరహాలోనే వీటిని కూడా ఏర్పాటు చేస్తారని అనుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 'అమృతహస్తం' పేరుతో 5 రూపాయలకే భోజనం పథకం ఇప్పటికే అమలవుతోంది. త్వరలోనే ఒక్క రూపాయికే టిఫిన్ పథకాన్ని కూడా అమలుచేయాలని భావిస్తున్నారు. హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో ఈ పథకం ఒక్కడ కొనసాగుతోంది. ఇక తమిళనాడులో అయితే.. మునిసిపల్ కార్పొరేషన్లు, స్వయం సహాయక సంఘాల సహకారంతో ఈ పథకం అమలవుతోంది. వీటిపేరు అమ్మ క్యాంటీన్లు. చెన్నై నగరంతో పాటు రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లలో కూడా ఇవి నడుస్తున్నాయి. కోయంబత్తూరులో ఉన్న పది క్యాంటీన్లలో మూడింటికి పాక్షికంగా సౌర విద్యుత్తు వినియోగిస్తున్నారు. అమ్మ క్యాంటీన్లలో ప్రధానంగా ఇడ్లీ, సాంబారు అన్నం, పెరుగన్నం, పొంగల్, పులిహోర, కర్వేపాకు అన్నం, చపాతీలు ఉంటాయి. ఒక ఇడ్లీ ఒక రూపాయి, సాంబార్ అన్నానికి 5 రూపాయలు, పెరుగన్నానికి 3 రూపాయలు వసూలు చేస్తారు. వీటికి అయ్యే అదనపు వ్యయాన్ని ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు భరిస్తుంటాయి. అయితే, ఇలా భరించడంపై అక్కడ కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుచేసే 'అన్న క్యాంటీన్లు' ఎలా పనిచేస్తాయో ఇంకా స్పష్టత రాలేదు. ఇక్కడ కూడా 5 రూపాయలకు భోజనం పెడతామని చెబుతున్నా, ఏయే సంస్థల సహకారంతో దీన్ని అమలుచేస్తారో తెలియట్లేదు. అలాగే, వీటిలో ఏయే వర్గాలకు భోజనాలు, అల్పాహారాలు అందిస్తారో కూడా ప్రకటించలేదు. ఇలా అనేక విషయాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. -
త్వరలో అన్ని జిల్లాల్లో అన్నా క్యాంటిన్లు: నారాయణ
హైదరాబాద్: తక్కువ ధరకే ఆహార పదార్థాలను అందించేందుకు త్వరలో అన్ని జిల్లాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ఏపీ మంత్రులు పరిటాల సునీత, నారాయణ తెలిపారు. తొలివిడతగా నాలుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖలో 15, తిరుపతిలో 5, అనంతపురంలో 5, గుంటూరులో 10 క్యాంటీన్ల ఏర్పాటు చేయనున్నట్టు మంత్రులు తెలిపారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రిల వద్ద అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేస్తామని, పథకం ఎప్పుడనేది రేపటి కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని నారాయణ మీడియాకు వెల్లడించారు. ఏపీలో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు పరిటాల సునీత, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు పాల్గొన్నారు. ఏపీలో అన్నా క్యాంటిన్ల పథకం సాధ్యాసాధ్యాలపై పౌరసరఫరాల శాఖ అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు.