-
జమ్మూకశ్మీర్లో సెప్టెంబర్లోగా ఎన్నికలు: అమిత్ షా
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో ప్రత్యేక సైనిక దళాల చట్టాన్ని ఉపసంహరించుకునే దిశగా కేంద్రం యోచిస్తుంది. జమ్మూలో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని వెనక్కి తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బలగాలను ఉపసంహరించుకొని శాంతిభద్రతలను జమ్మూ కశ్మీర్ పోలీసులకే అప్పగించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. గతంలో జమ్మూకశ్మీర్ పోలీసులపై నమ్మకం ఉండేది కాదని కానీ ప్రస్తుతం వారు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, అనేక ఆపరేషన్లను లీడ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జమ్మూలో అమలులో ఉన్న AFSPAను.. ఈశాన్య రాష్ట్రాల్లోని 70% ప్రాంతాల్లో తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని అనేక సంస్థలు, వివిధ వ్యక్తుల నుంచి డిమాండ్లు వస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా సెప్టెంబర్లోపు జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అమిత్షా చెప్పారు. జమ్మూకశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని, దానిని నెరవేరుస్తారని తెలిపారు. అయితే ఈ ప్రజాస్వామ్యం కేవలం మూడు కుటుంబాలకే పరిమితం కాదని.. ప్రజల ప్రజాస్వామ్యమని అన్నారు. ఇదిలా ఉండా జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో సెప్టెంబర్లోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా ఏఎఫ్ఎస్పీఏ చట్టం కేంద్ర సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలను కల్పిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల నిర్వహణలో భాగంగా కేంద్ర బలగాలకు శోధనలు చేపట్టడానికి, అరెస్టులు, అవసరమైతే కాల్పులు చేపట్టడానికి ఈ చట్టం విస్తృత అధికారాలను కల్పిస్తోంది. సాయుధ బలగాల కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఈ చట్టాన్ని రూపొందించారు. -
ఈసారి 'నారీ శక్తి'తో చారిత్రాత్మక కవాతు!
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ(శుక్రవారం) గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దేశ ప్రజలు ఈ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘కర్తవ్య పథ్’లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే రీతిలో పలు ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అయితే ఈ 'కర్తవ్య పథ్'లో దేశంలోని నారీ శక్తి ధైర్యమే కనిపించనుంది. అందులోనూ ముఖ్యంగా సాయుధ దళాలకు వైద్య సేవలందించే మహిళ డాక్టర్ల బృందం కవాతు చేయనుండటం విశేషం. అంతేగాదు దేశంలోని 'నారీ శక్తి' పరేడ్తో ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు సంచలనాత్మకంగా నిలిచిపోనున్నాయి. ఈ సారి రిపబ్లిక్డే వేడుకల్లో దేశంలోని నారీ శక్తి ధైర్యమే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా తొలిసారిగా సాయుధ దళాల వైద్య సేవలకు సంబంధించి పూర్తి మహిళా బృందం కర్తవ్పథ్లో కవాతు చేయడం విశేషం. దీనికి మేజర్ సృష్టి ఖుల్లార్ నాయకత్వం వహించనున్నారు. ఈసారి గణతంత్ర వేడుకలు మహిళా బృందంతో చారిత్రత్మక కవాతును ప్రారంభించి సంచలనం సృషిస్తోంది. ఇక వైద్యురాలు ఖుల్లార్ మహిళల బృందానికి నాయకత్వం వహించి సాయుధ దళాల మహిళా డాక్టర్గా చరిత్ర సృష్టించనున్నారు. ఈ కవాతు శౌర్యం, పరాక్రమంతో అడ్డంకులన్నింటిని బద్దలు కొట్టేలా 'నారీ శక్తి 'వేస్తున్న అసలైన అడుగు. ఈమేరకు సృష్టి ఖుల్లర్ మాట్లాడుతూ.. నేత్ర వైద్యురాలిగా, ఆపరేషన్ థియేటర్లో సర్జికల్ కత్తి పట్టుకోవడం నాకు అలవాటు. ఇప్పుడు కర్తవ్య పథ్లో కత్తి పట్టుకోవడం తనకు ఓ ఛాలెంజింగ్గా అద్భుతంగా ఉందని సంతోషంగా చెప్పింది. అందుకు తాను భారత ఆర్మీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాని అన్నారు. Met paratrooper & eye surgeon Major Srishti Khullar today. She will lead the all-women Armed Forces Medical Services marching contingent at the Republic Day parade. "From holding the surgical knife to carrying a sword at the parade, the new role is quite challenging & rewarding." pic.twitter.com/1gT5MTQIxZ — Rahul Singh (@rahulsinghx) January 23, 2024 చరిత్ర సృష్టించనున్న ఢిలీ మహిళా పోలీసులు.. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 'కర్తవ్య పథ'లో పూర్తిగా మహిళా పోలీసులే ప్రదర్శన ఇవ్వనున్నారు. పరేడ్లో ఇలా పూర్తి మహిళా పోలీసులే పాల్గొనడం తొలిసారి. ఇక ఈ మహిళా బృందంలో నగర దళానికి చెందిన మహిళ పోలీసు అధికారులు కూడా ఉన్నారు. దీనికి ఐపీఎస్ అధికారిణి శ్వేతా కే సుగతన్ నాయకత్వం వహించనున్నారు. ఆమె నేతృత్వంలో దాదాపు 194 మంది మహిళా కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు కవాతు చేయనున్నారు. మహిళా అధికారుల సారథ్యంలోనే త్రివిధ దళాల కవాతు ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా మహిళా అధికారుల సారథ్యంలో త్రివిధ దళాల కవాతు నిర్వహిస్తుండటం విశేషం. ఇక భారత ఆర్మీకి చెందిన కెప్టెన్ శరణ్య రావు తాను ఈ త్రివిధ దళాల ఆర్మీ కాంపోనెంట్కి సూపర్ న్యూమరీ అధికారిగా సారథ్యం వహిస్తున్నట్లు తెలిపారు. ఇది నిజంగా గర్వించదగ్గ క్షణం అని భావోద్వేగంగా మాట్లాడారు కెప్టెన్ శరణ్యరావు. ఈ ఏడాది నారీ శక్తి థీమ్కి తగ్గట్టుగా చాలామంది మహిళల నేతృత్వంలో త్రివిధ దళాల కవాతు జరగడం అనేది చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న అపూర్వ ఘట్టం అని కొనియాడారు. తొలిసారిగా ఓ ఆర్మీ దంపతుల కవాతు ఈ కర్తవ్య పథ్లో తొలిసారిగా ఒక జంట కలిసి కవాతు చేయనుండటం విశేషం. వివిధ రెజిమెంట్లలో భాగంగా తొలిసారి మేజర్ జెర్రీ బ్లేజ్, కెప్టెన్ సుప్రత అనే జంట కలిసి కవాతు చేయనుంది. వారిద్దరూ గతేడాది జూన్లో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వారు ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. ఇక 'కర్తవ్య పథ్' అంటే..ఏటా గణతంత్ర దినోత్సవాన దేశ సైనికశక్తి ప్రదర్శనకు వేదికగా నిలిచే ఈ మార్గం.ఒకప్పుడూ ఇది ‘రాజ్ పథ్’ అనే పేరుతో ఉండేది. (చదవండి: ఢిల్లీ పరేడ్కు అసామాన్యులు) -
హైదరాబాద్లో ‘గింబల్స్’ తయారీ పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: భారత రక్షణ దళాలకు అవసరమయ్యే ఆధునిక ‘గింబల్స్’తయారీ పరిశ్రమను హైదరాబాద్లో ఏర్పాటు చేయాల్సిందిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు. హైదరాబాద్కు చెందిన హెచ్సీ రోబోటిక్స్ ఫ్రెంచ్ కంపెనీ మేరియోతో కలిసి ఆధునిక గింబల్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ కంపెనీ మేరియోకు చెందిన అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందం సంస్థ సీఈవో రెమీప్లెనెట్ నేతృత్వంలో శుక్రవారం మంత్రిని కలిసి హైదరాబాద్లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తిని తెలియజేసింది. హైదరాబాద్లో మేరియో కార్యకలాపాలకు ప్రభుత్వపరంగా మద్దతును ఇస్తామని మంత్రి హామీనిచ్చారు. మేరియో ప్రతినిధి బృందం భారత పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ అధికారులతోపాటు ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సంస్థలతో సమావేశమైంది. శ్రీధర్బాబును కలిసిన ప్రతినిధి బృందంలో హెచ్సీ రోబోటిక్స్ సీఈవో వెంకట్ చుండి, డైరెక్టర్ డాక్టర్ రాధాకిషోర్ ఉన్నారు. -
తెలంగాణ ఎన్నికలు.. సాయుధ బలగం ఎవరివైపో?
ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరగాలంటే రాష్ట్ర పోలీసులతో పాటు సాయుధ దళాల బందోబస్తు కూడా ఎంతో ముఖ్యం. ఆ సాయుధ బలగాల ఓట్లు కూడా అంతే ముఖ్యంగా అభ్యర్థులు భావిస్తున్నారు. అందుకే సర్విస్ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో అభ్యర్థులు వారిని ఆకర్షించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. ఇక ఈ ఎన్నికలలో మెజారిటీ సర్వీస్ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపిస్తారోనన్న చర్చ కూడా సాగుతోంది. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో... రాష్ట్రవ్యాప్తంగా 15,406 మంది సర్విస్ ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 930 మంది, అత్యల్పంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 98 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. గ్రామీణ నియోజకవర్గాలలో వందల సంఖ్యలో సర్విస్ ఓటర్లు ఉండగా.. అర్బన్ నియోజకవర్గాలలో 10 కంటే తక్కువ మంది ఓటర్లు ఉండటం గమనార్హం. అత్యల్ప సర్వీస్ ఓటర్లు గ్రేటర్లోనే.. హైదరాబాద్లో 404 మంది, రంగారెడ్డి జిల్లాలో 592, మేడ్చల్ జిల్లాలో 732 మంది సర్వీస్ ఓటర్లున్నారు. రాష్ట్రంలో అత్యల్ప సర్వీస్ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్లోనే ఉన్నాయి. బహదూర్పుర, చార్మినార్, మలక్పేటలో ఒక్కో నియోజకవర్గాలలో కేవలం 9 మంది సర్విస్ ఓటర్లు ఉండగా.. సనత్నగర్, గోషామహల్ సెగ్మెంట్లలో 10 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. సర్విస్ ఓటర్లు ఎవరంటే.. భారత సాయుధ దళాలు, అస్సాం రైఫిల్స్ పారామిలటరీ దళం, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీఎఫ్, జీఆర్ఈఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉద్యోగులను సర్విస్ ఓటర్లుగా పరిగణిస్తారు. వీళ్లు పోస్టల్ బ్యాలెట్ లేదా ప్రాక్సీ ఓట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఓటు ఎలా వేస్తారంటే.. సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ఆఫీసర్ సర్విస్ ఓటరుకు పోస్టల్ బ్యాలెట్ పంపిస్తారు. ఒకవేళ సర్విస్ ఓటరు విదేశాల్లో ఉంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా పంపిస్తారు. ఆ పేపర్ మీద మీకు నచ్ఛిన అభ్యర్థి పేరుకు ఎదురుగా స్పష్టమైన గుర్తును ఉంచితే ఓటు వేసినట్టు. ఒకవేళ వీరు సూచించిన గుర్తు స్పష్టంగా కనిపించకపోయినా, బ్యాలెట్ పేపర్ మీద సంతకం లేదా ఏదైనా పదాలు రాసినా ఓటు చెల్లదు. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపరుతో పంపిన ‘ఏ’ గుర్తు ఉన్న చిన్న కవర్లో పెట్టి, సీల్ చేసి, రిటర్నింగ్అధికారికి పోస్టులో పంపించాలి. మహిళ సర్విస్ ఓటరైతే.. ఉద్యోగరీత్యా ప్రస్తుతం వేరే చోట నివాసం ఉంటున్నప్పటికీ సర్విస్ ఓటర్లు వారి స్థానిక నియోజకవర్గంలో ఓటు వేయవచ్చు. ఒకవేళ కుటుంబంతో సహా కలిసి పోస్టింగ్ చేస్తున్న ప్రాంతంలోనే నివసిస్తే గనక అక్కడే సాధారణ ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. అయితే సర్వీస్ ఓటర్లుగా నమోదు చేసుకునే కుటుంబ సభ్యుల అర్హత ప్రమాణాలలో ఆసక్తికరమైన అంశం ఒకటుంది. సాధారణంగా సర్విస్ ఓటరు భార్య, కుటుంబ సభ్యులు కూడా సంబంధిత నియోజకవర్గంలో సర్విస్ ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. అయితే ఒకవేళ సర్విస్ ఓటరు గనక మహిళ అయితే మాత్రం భర్తకు ఈ నిబంధన వర్తించదు. -
అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.. రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారతదేశం 2047 సమయానికి అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించబడాలంటే అత్యంత ఆధునిక ఆయుధాలు కలిగిన బలమైన సాయుధ బలగాల అవసరముందని అన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. రక్షణ శాఖ అకౌంట్స్ విభాగంలో పలు డిజిటల్ సేవలను ప్రారంభించిన ఆయన త్రివిధ దళాలు తమకు అందుబాటులో ఉన్న ఆర్ధిక వనరులను వినియోగించుకుంటూ చాలా అడ్వాన్స్డ్గా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ సారాంశ్(రక్షా మంత్రాలయ అకౌంట్లు, బడ్జెట్, వ్యయం), బిశ్వాస్(బిల్లులు, పని విశ్లేషణ, ఈ-రక్షా ఆవాస్) డిజిటల్ సేవలను ప్రారంభించారు. రక్షణ శాఖ అకౌంట్స్ విభాగం 276వ వార్షికోత్సవంలో పాల్గొన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ రక్షణశాఖ అకౌంట్స్ విభాగం మొత్తం శాఖకే కవచంలా వ్యవహరిస్తోందని అన్నారు. అంతర్గత నిఘా విభాగాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా ఎక్కడైనా అనుమానాస్పద వ్యవహారాలు చోటు చేసుకుంటే వెంటనే గుర్తించే వీలుంటుందన్నారు. దీనిద్వారా సమస్యను తొందరగా పరిష్కరించుకోవడమే కాదు, ప్రజల్లో రక్షణ వ్యవస్థపై నమ్మకాన్ని కూడా పెంచవచ్చన్నారు. మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దబడాలంటే భార్య సాయుధ బలగాలకు అత్యంత ఆధునిక ఆయుధాలను, సామాగ్రిని అందించాల్సిన అవసరముందని అందుకు మనవద్ద ఉన్న ఆర్ధిక వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. దీనికోసం అవసరమున్న సేవలకు అందుబాటులో ఉన్న వనరుల మధ్య బ్యాలన్స్ కుదరాలని అన్నారు. ఎప్పటికప్పుడు మార్కెట్లోని ఆయుధాలపై అధ్యయనం చేయడానికి అకౌంట్స్ శాఖలో ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఇంతకాలం డీఏడీ పారదర్శకమైన, సమర్ధవంతమైన ఆర్దిక వ్యవస్థ ద్వారా దేశ రక్షణ సామర్ధ్యాన్ని పెంచిన విధానం అద్భుతమని, ఏదైనా వ్యవస్థలో అకౌంటింగ్ అనేది చాలా కీలకమైనదని రక్షణ అకౌంట్ విభాగం న్యాయబద్ధమైన రీతిలో అవసరాన్ని బట్టి వనరులను సమకూర్చుకోవాలని అన్నారు. వీలయితే సాంకేతికంగా ముందడుగు వేసే విధంగా ఐఐఎం, ఐసీఏఐ వంటి సంస్థలతో చేతులు కలపాలని తద్వారా డీఏడీ ఆర్ధిక మేధస్సు పెరుగుతుందని అన్నారు. ఇది కూడా చదవండి: ఐఎఎఫ్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ -
మణిపూర్లో సాయుధ చట్టం... మరో ఆర్నెల్లు
ఇంఫాల్: మణిపూర్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)ను మరో ఆర్నెల్ల పాటు పొడిగించారు. ప్రస్తుత కల్లోల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఏఎఫ్ఎస్పీఏను అక్టోబర్ 1 నుంచి ఆరు నెలల పాటు పొడిగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటూ అధికారిక ప్రకటన వెలువడింది. ఇంఫాల్ లోయ, అసోం సరిహద్దు ప్రాంతాల్లోని 19 పోలీస్ స్టేషన్లను మాత్రం దీని పరిధి నుంచి మినహాయించారు. అక్కడ చట్టాన్ని అమలు చేయాలంటే సంబంధిత పోలీస్ స్టేషన్ అనుమతి తప్పనిసరి. లేదంటే సైన్యం, అస్సాం రైఫిల్స్ను అక్కడ నియోగించడానికి వీల్లేదు. దీనిపై భద్రతా దళాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని నిషేధిత ఉగ్ర గ్రూపులు లోయలో తలదాచుకుని సవకు విసురుతున్నట్టు చెబుతున్నాయి. మణిపూర్ పోలీసు ఆయధాగారం నుంచి దోచుకెళ్లిన మొత్తం 4,537 ఆయుధాలు, 6.32 లక్షల రౌండ్ల మందుగుండు వాటి చేతిలో పడ్డాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
తుపాకీ ‘గురి’ తప్పుతోంది!
ఒకవైపు ఉద్యోగంలో ఒత్తిళ్లు... మరోవైపు వ్యక్తిగత సమస్యలు, కుటుంబ కలహాలు, ఇతర సమస్యలు. ఇవన్నీ ఖాకీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాయుధ సిబ్బంది తీవ్ర మానసిక ఒత్తిడిలోకి జారిపోయి విచక్షణ కోల్పోతున్నారు. విధి నిర్వహణ కోసం ఇచ్చే ఆయుధంతో ఆ మానసిక స్థితిలో ఎదుటివారిని హతమార్చేలా విచక్షణ కోల్పోతున్నారు. లేదంటే తమను తాము కాల్చుకుని ఎంతో విలువైన జీవితాన్ని, కుటుంబాన్ని విషాదాంతం చేస్తున్నారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలు ఇలా ఎందుకు చేస్తున్నారు? సాక్షి, హైదరాబాద్ :ఇటీవల జైపూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ చేతన్ సింగ్ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన విష యం తెలిసిందే. తన మతిలేని చర్యతో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ టికారామ్తో సహా ముగ్గురు ప్రయాణికులు బలయ్యారు. వీరిలో హైదరాబాద్ బజార్ఘాట్కు చెందిన సయ్యద్ సైఫుద్దీన్ ఉన్నారు. సాయుధ అధికారిగా ప్రజలకు సేవలందించాల్సిన పోలీసులు ఇలా చేస్తుండటంపై పోలీసు వర్గాల్లో ఆందోళ వ్యక్తమవుతోంది. అసలు ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? వృత్తిపరమైన పని ఒత్తిడిని జయించేందుకు పోలీస్శాఖ అనుసరిస్తున్న వ్యూహాలు ఏంటి? తదితర అంశాలపై పోలీస్ ఉన్నతాధికారుల్లోనూ చర్చ జరుగుతోంది. 13 ఏళ్లలో 1,532 మంది.. ♦ గత 13 ఏళ్లలో కేంద్ర సాయుధ బలగాలైన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సశస్త్ర సీమాబల్, ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్, సీఐఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, ఎన్ఎస్జీలకు చెందిన 1,532 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. సాయుధ బలగాల్లో ఆత్మహత్యలపై లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇటీవల ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ ఏడాది (2023)లోనూ జనవరి నుంచి జూలై నెలాఖరు వరకు 71 మంది సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. వీటిని నివారించేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో నమోదైన పోలీసు ఆత్మహత్యలు కొన్ని... ♦ జనగాం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ గత ఏప్రిల్ 6న తన సర్విస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు ఉదయం శ్రీనివాస్ భార్య స్వరూప బాత్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇది తట్టుకోలేకే శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ♦ 2016లో ఆదిలాబాద్ జిల్లా కెరిమెరిలో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తన సర్విస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ♦ 2019లో హెడ్ కానిస్టేబుల్ డి.ప్రకాశ్ రెడ్డి తన పైఅధికారి సర్విస్ రివాల్వర్తో కాల్చుకుని బలవనర్మణం పొందారు. ♦ 2020లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సీఆర్పీఎఫ్ కానిస్టే బుల్ రూపేషానంద్ కుటుంబ సమ స్యల ఒత్తిడికి లోనై తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ♦ 2020 నవంబర్లో సికింద్రాబాద్లో ఓ బ్యాంక్ వద్ద గార్డ్ డ్యూటీలో ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మధు తుపాకీతో కాల్చు కుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ♦ 2017 జూన్లో సిద్ధిపేట జిల్లా కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ప్రభాకర్రెడ్డి తన సర్విస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అధికారుల వేధింపులే ఇందుకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేంద్ర టాస్క్ఫోర్స్ నివేదికలో ఏముంది? ♦ సాయుధ బలగాలు ఆత్మహత్యలు చేసుకోవడం లేదా తోటి సిబ్బందిపై కాల్పులు జరపడానికి కార ణాలు విశ్లేíÙంచేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన టాస్్కఫోర్స్ కమిటీ గత జనవరిలో ఓ సమగ్ర నివేదికను సమర్పించింది. అందులో పేర్కొన్న ప్రధా న అంశాలు సర్వీ స్–వ ర్కింగ్ కండిషన్స్, వ్యక్తిగత, కుటుంబ కారణాలు సాయుధ పోలీసుల ఆత్మహత్యలకు, తోటి సిబ్బంది, ఇతరులపై కాల్పులు జరపడానికి కారణమవు తున్నాయని తెలిపింది. శిక్షణ నుంచే అలవాటు చేయాలి.. పోలీస్ ఉద్యోగం అంటేనే 24 గంటలూ విధుల్లో ఉండాలి. ఇప్పటితో పోలిస్తే గతంలోనే విపరీతమైన పని ఒత్తిడి ఉండేది. అప్పట్లో ఒకవైపు శాంతిభద్రతల సమస్యలు.. మరోవైపు నక్సల్ సమస్యలు ఉండేవి. ఇలా అనేక రకాల మేం ఉద్యోగానికి వచ్చిన తొలిరోజుల్లో పనిచేశాం. కానీ కాలంతోపాటు ఆ పరిస్థితులు మారాయి. ఇప్పుడు కూడా పోలీస్ ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదే. అయితే ఆ పని ఒత్తిడి ఇటీవలే పెరిగింది కాదు. అయితే, పరిస్థితులను తట్టుకునేంతగా ఇప్పటి సిబ్బంది మానసికంగా ధృడంగా ఉండట్లేదన్నది నా అభిప్రాయం. శారీరక, మానసిక ధృడత్వాన్ని పెంచేలా ప్రత్యేక శిక్షణ అవసరం. మానసిక ఒత్తిడిని తట్టుకునేలా మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలన్నది ఉద్యోగంలో చేరిన మొదటి నుంచే అలవడేలా యువ అధికారులు, సిబ్బందిని తీర్చి దిద్దాలి. అప్పుడే ఆత్మహత్యలు జరగకుండా నివారించగల్గుతాం అని నా అభిప్రాయం. – నారాయణ, రిటైర్డ్ ఎస్పీ కేంద్ర టాస్క్ఫోర్స్ నివేదికలో ఏముందంటే... ♦ సాయుధ బలగాలు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు... పనిగంటలు పెరగడం, సరైన విశ్రాంతి లేకపోవడం, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వారితో పోలిస్తే విధుల్లో సంతృప్తి లేకపోవడం, అన్నింటికి మించి సాంఘికంగా తమను దూరం పెడుతున్నారన్న భావన పెరగడం, కుటుంబ మద్దతు లేకపోవడం, సిబ్బంది ఇచ్చే ఫిర్యాదులను పరిష్కరించే సరైన యంత్రాంగం లేకవపోవడం. పోలీస్ సెన్సిటివిటీ ట్రైనింగ్ సైతం అవసరం ♦ తీరిక లేని ఉద్యోగంతో పని ఒత్తిడి పెరుగుతోంది. రోజువారీ విధుల్లోనూ అనేక రకాల పరిస్థితులను వారు చక్కబెట్టాల్సి ఉంటుంది. కాబట్టి పోలీసు అధికారులకు, సిబ్బందికి పోలీస్ సెన్సిటివిటీ ట్రైనింగ్ ఇవ్వడం ఎంతో ముఖ్యం. నేను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న వారికి కొన్ని తరగతులు తీసుకున్నాను. శిక్షణ సమయంలో నేర్చుకున్న విషయాలను వారు ఉద్యోగంలోకి వచ్చాక ఆచరిస్తే మానసిక ఒత్తిడిని జయించవచ్చు. మానసికంగానూ దృఢంగా ఉంటే వృత్తిగత జీవితంతోపాటు వ్యక్తిగతంగానూ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. – డా.ప్రజ్ఞ రష్మీ, సైకాలజిస్ట్ -
‘వ్యభిచారానికి పాల్పడితే సైనికాధికారులపై చర్యలు’
న్యూఢిల్లీ: నీతి తప్పిన సైనికులు ఉంటే సైన్యంలో క్రమశిక్షణ దెబ్బతింటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పై అధికారులు వ్యభిచారానికి పాల్పడితే చర్యలు తీసుకొనే అధికారం సైనిక దళాలకు ఉందని తేల్చిచెప్పింది. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. వ్యభిచారం నేరం కాదంటూ చెబుతూ ఐపీసీ సెక్షన్ 497ను కొట్టివేస్తూ 2018లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ తప్పుడు పనిచేసిన అధికారులపై చర్యలు తీసుకోకుండా ఈ తీర్పు అడ్డుకోలేదని జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం వెల్లడించింది. -
కోర్టుల్లో 5 కోట్ల పెండింగ్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్య 5 కోట్లకు చేరువలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఒక న్యాయమూర్తి 50 కేసుల్ని పరిష్కరిస్తే, కొత్తగా మరో 100 కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. వివాదాల పరిష్కారానికి న్యాయస్థానాలను ఆశ్రయించాలన్న అవగాహన ప్రజల్లో బాగా పెరిగిందని అందుకే కొత్త కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సమక్షంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రబ్యునల్ పనితీరుపై శనివారం జరిగిన సెమినార్కు కిరణ్ హాజరయ్యారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందన్నారు. కింద కోర్టుల్లో 4 కోట్లకు పైగా, సుప్రీం కోర్టులో 72 వేల కేసులకు పైగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే భారం తగ్గుతుందన్నారు. కేంద్రం ప్రతిపాదనలో ఉన్న మధ్యవర్తిత్వంపై చట్టాన్ని త్వరగా తీసుకువస్తే కోర్టులకి కొంత ఊరట లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ మరో కార్యక్రమంలో మాట్లాడుతూ కోర్టులో పెరిగిపోతున్న పెండింగ్ కేసులు మోయలేని భారంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వ వ్యవస్థే కేసుల భారాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. -
అగ్నిపథ్ వల్ల ఆర్మీ బలహీన పడుతుంది
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్ వల్ల ఆర్మీ బలహీనపడుతుందని, 16 ఏళ్లు పనిచేసే ఆర్మీలో నాలుగేళ్ల విధానమేంటని ఏఐసీసీ అధికార ప్రతినిధి నాజర్ హుస్సేన్ ప్రశ్నించారు. గాంధీభవన్లో ఆదివారం ఆయన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీతో కలిసి మీడియాతో మాట్లాడారు. అగ్నిపథ్పై యువత నిరసనలు చేపడుతున్నా, ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ విధానం ద్వారా 14 లక్షల ఆర్మీ బలాన్ని 6 లక్షలకు కుదిస్తున్నారని తెలిపారు. పదవీ విరమణ పొందిన 5.70 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 15 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. రేవంత్ మాట్లాడుతూ మోదీ చదువుకోకపోవడం వల్ల ఆర్మీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, ఆర్మీకి, బీఎస్ఎఫ్కు తేడా ఏంటో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. -
రిక్రూటైన ఐదేళ్లకే రిటైర్మెంట్?
న్యూఢిల్లీ: కరోనాతో సైన్యంలో రెండేళ్లుగా నిలిచిన నియామకాలను మొదలు పెట్టాలని కేంద్రం భావిస్తోంది. పెన్షన్ల భారం తగ్గించుకొనేందుకు ఆర్మీలో నియామకాలను మూడు రకాలుగా చేస్తారని సమాచారం. 25 శాతం మంది మూడేళ్లు, 25 శాతం ఐదేళ్లు పనిచేసి రిటైరవుతారు. మిగతా 50 శాతం రిటైరయ్యేదాకా సేవలనందిస్తారు. చదవండి: (అమిత్ షాతో ఏం చర్చించానో బయటకు చెప్పలేను: గవర్నర్ తమిళిసై) -
యువత జీవితాలతో క్రూర పరిహాసం
ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉన్న రష్యా ఇప్పుడు ఉక్రెయిన్పై యుద్ధంలో తలమునకలై ఉంది. అత్యాధునిక ఆయుధాలు, అజేయమైన సైనిక బలంలో ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారిన రష్యా ప్రస్తుతం బాలలు, యువకులను బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 1989లో ఏర్పాటైన ‘సైనికుల తల్లుల కమిటీ’ ఈ విషయాన్ని గురువారం బహిర్గతం చేసింది. కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే బాలలను, యువకులను ఉక్రెయిన్ సరిహద్దులకు తరలిస్తున్నారని, అక్కడ మారణాయుధాలు ఇచ్చి, సైనిక శిక్షణ పేరిట చిత్రహింసలు పెడుతున్నారని ఈ కమిటీ ఒక ప్రకటనలో ఆరోపించింది. వారిలో చాలామందిని ఉక్రెయిన్లో యుద్ధభూమికి తరలించారని వెల్లడించింది. చదవండి: (ఉక్రెయిన్ అణ్వాయుధాలు ఏమయ్యాయి?) కఠినమైన శిక్షణ తట్టుకోలేక పారిపోయేందుకు ప్రయత్నిస్తే చావబాదుతున్నారని, దారుణంగా హింసిస్తున్నారని పేర్కొంది. రష్యావ్యాప్తంగా ఎంతోమంది తల్లుల నుంచి తమకు చాలా ఫోన్కాల్స్ వచ్చాయని కమిటీ తెలియజేసింది. బిడ్డల బాగోగులు తెలియక తల్లులు ఆందోళనకు గురవుతున్నారని, కనీసం బతికి ఉన్నారో లేదో కూడా వారికి తెలియడం లేదని కమిటీ డిప్యూటీ చైర్మన్ ఆండ్రీ కురోచ్కిన్ ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డలకు దూరమైన తల్లుల రోదనలను ఆపలేకపోతున్నామని చెప్పారు. ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నాం, కేవలం శిక్షణ మాత్రమే ఇస్తాం అంటూ మాయమాటలతో మభ్యపెడుతూ సరిహద్దులకు తరలించి, అక్కడి నుంచి నేరుగా రణరంగంలోకి దించుతున్నారని ఆరోపించారు. చదవండి: (కమెడియన్ నుంచి అధ్యక్షుడిగా.. జెలెన్స్కీ ప్రస్థానం) కాంట్రాక్టు జవాన్లుగా మారేందుకు నిరాకరిస్తే ఉన్నతాధికారులు రాక్షసంగా వ్యవహరిస్తున్నారని, భౌతిక దాడులకు దిగుతున్నారని తెలిపారు. ఫోన్లు సైతం లాగేసుకుంటుండడంతో సదరు యువకుల పరిస్థితి ఏమిటి, ఎక్కడున్నారు అనేది తెలియడం లేదని పేర్కొన్నారు. యుద్ధరంగంలోకి సుశిక్షితులైన జవాన్లను పంపాలి గానీ ఏమాత్రం అవగాహన లేని బాలలను, యువతను పంపించి, వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఏమిటని నిలదీశారు. ఇదొక పెద్ద విపత్తు అని అభివర్ణించారు. బందీలుగా బాలలు: ఉక్రెయిన్ సైన్యం చేతిలో బందీలుగా ఉన్న కొందరు రష్యా సైనికుల్లో బాలలు, యువత కనిపించారు. రష్యా సైనిక దుస్తుల్లో ఉన్న వీరి దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ముక్కుపచ్చలారని బాలలు బందీలుగా మారిపోవడం గమనార్హం. రష్యా సైనికాధికారుల అకృత్యాలపై చీఫ్ మిలటరీ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు ‘సైనికుల తల్లుల కమిటీ’ సన్నద్ధమవుతోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత జీవితాలతో చెలగాటం ఆడొద్దని కమిటీ హితవు పలికింది. -
Vladimir Putin: రష్యాకి ఎక్కడిదీ బరి తెగింపు!.. వాటిని చూసుకొనేనా..?
అగ్రరాజ్యం అమెరికా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నా, దీటుగా ప్రతిదాడి ఉంటుందని నాటో స్పష్టం చేసినా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లక్ష్య పెట్టకుండా ఉక్రెయిన్పై పంజా విసిరారు. సైనిక చర్యకు దిగారు. పాశ్చాత్యదేశాల నుంచి ఎంతగా ఒత్తిడి వచ్చినా.. పెడచెవిన పెడుతూ తాను అనుకున్నది చేసేసే మొండి ధైర్యం, పట్టుదల... రష్యా అధ్యక్షుడికి ఎక్కడి నుంచి వచ్చాయి. ఆయన లెక్కలు, సమీకరణాలు ఎలా ఉన్నాయి. ఎవరి అండ ఉందనే భరోసాతో పుతిన్ ఈ సాహసానికి ఒడిగట్టారో చూద్దాం.. ‘రిస్క్’తో కూడిన నిర్ణయం తూర్పు ఉక్రెయిన్లో నివసిస్తున్న సాధారణ పౌరులు, రష్యన్లను రక్షించడానికి సైనిక చర్య తప్పలేదని పుతిన్ దాడికి దిగేముందు పేర్కొన్నారు. ఎవరైనా ఈ యుద్ధంలో జోక్యం చేసుకంటే ఇదివరకెన్నడూ చూడనంతటి తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని గట్టి హెచ్చరికలు జారీచేశారు. అమెరికా, బ్రిటన్లు బ్యాంకుల లావాదేవీలపై నిషేధం విధించడం, రష్యా చమురు దిగ్గజాలుగా పేరొందిన వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం తదితర ఆర్థికపరమైన ఆంక్షలకు దిగాయి. ఆర్థిక నిల్వలు వేగంగా ఆవిరి నాలుగైదు నెలలుగా యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉండటం ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూసింది. రాజధాని కీవ్లో వివిధ దేశాల రాయబార కార్యాలయాలు ఒక్కొక్కటిగా మూతపడుతూ పోయాయి. కొద్ది వారాల వ్యవధిలో వందలాది మిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనక్కుమళ్లాయి. ఆర్థిక వ్యవస్థను అష్టదిగ్బంధన చేయడం ఉక్రెయిన్ను దారికి తేవాలనేది క్రెమ్లిన్ ఎత్తుగడ. దీన్నే ఉక్రెయిన్ ‘హైబ్రిడ్ యుద్ధ తంత్రం’గా అభివర్ణించింది. చెదలు పట్టినట్లుగా దేశ ఆర్థిక వ్యవస్థను లోపలి నుంచి తినేయడమే పుతిన్ లక్ష్యమని విమర్శించింది. చదవండి: (Russia vs Ukraine: బాహుబలితో తలపడగలదా?) పుతిన్ ముఖ్యంగా మూడు అంశాలను బలంగా నమ్ముకున్నారు. అవి.. 1. శరవేగంగా పతనమవుతున్న ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి. 2. రష్యా వద్ద ఉన్న భారీ ఆయుధ సంపత్తి. 3. చైనా అండగా నిలవడం. ఆర్థికంగా దెబ్బతీయాలనే లక్ష్యంతో ఉక్రెయిన్ మీదుగా వెళుతున్న చమురు నౌకలను (ఎగుమతులను) నిలిపివేయడం, పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరాను ఆపేయడంతో ట్రాన్సిట్ చార్జీలుగా వసూలయ్యే వందలాది బిలియన్ల డాలర్లు రాలేదు. ఫలితంగా గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా ఉక్రెయిన్ కరెన్సీ విలువపడిపోయింది. ఒకవైపు యుద్ధానికి కాలుదువ్వుతూనే.. మరోవైపు ఉక్రెయిన్ ఆర్థికరంగాన్ని పిండివేసే ప్రయత్నం చేసింది రష్యా. ఉక్రెయిన్ గ్యాస్ సరఫరా కూడా ఎన్నడూ లేనంతగా పడిపోయింది. ఉక్రెయిన్కు అండగా నిలబడి ప్రత్యక్ష యుద్ధాన్ని అమెరికా లేదా నాటో దేశాలు కోరుకోవనే గట్టి నమ్మకంతో పుతిన్ పావులు కదుపుతున్నారు. చదవండి: (Russia Ukraine War Effect: ప్రపంచం చెరి సగం.. భారత్ ఎందుకు తటస్థం?) సమృద్ధిగా విదేశీ మారకద్రవ్య నిలువలు సాధారణంగా ఆర్థిక ఆంక్షలు పెడితే.. ఆయా దేశాల్లోకి వచ్చే డాలర్లు, ఇతర విదేశీ మారకద్రవ్యం నిలిచిపోతుంది. రిజర్వు నిధుల్లోనుంచి వాడి తాత్కాలికంగా నెట్టుకొచ్చినా.. దీర్ఘకాలంగా ఆంక్షల చట్రంలో ఉంటే దిగుమతులకు డబ్బులు చెల్లించలేక అవస్థపడాల్సి వస్తుంది. రష్యా విదేశీ మారకద్రవ్య నిల్వలు గత ఏడాది డిసెంబర్ నాటికి రికార్డు స్థాయిలో 6.3 లక్షల మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కాబట్టి ఆర్థికంగా దిగ్బంధించినా రష్యాకు తక్షణం వచ్చే ముప్పేమీ లేదు. మరోవైపు రష్యా– చైనాల మధ్య ఇటీవలి కాలంలో మరింత సన్నిహితమవుతున్నాయి. ప్రపంచ శక్తుల పునరేకీకరణ జరుగుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా, యూఎస్, యూకేల మధ్య ఇటీవల ఆకస్ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ప్రాంతీయంగా బలాలను సరిచేయాలనే ఉద్దేశంతో చైనా.. రష్యాకు దగ్గరవుతోంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఐఎస్ అధినేత హతం
అత్మే (సిరియా): అమెరికా ప్రత్యేక దళాలు బుధవారం రాత్రి సిరియాలో జరిపిన మెరుపుదాడిలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐఎస్) చీఫ్ అబూ ఇబ్రహీం అల్ హషిమీ అల్ ఖురేషీ హతమయ్యాడు. రెబెల్స్ అధీనంలోని వాయవ్య ఇద్లిబ్ ప్రావిన్సులో ఖురేషీ దాగున్న రెండంతస్తుల ఇంటిపై ప్రత్యేక దళాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఐఎస్ సాయుధులకు, వారికి రెండు గంటల పాటు హోరాహోరీ కాల్పులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. చివరికి ఇంటిని సైన్యం చుట్టుముట్టడంతో ఖురేషీ బాంబు పేల్చుకుని కుటుంబంతో సహా చనిపోయినట్టు యూఎస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆరుగురు పిల్లలు, నలుగురు మహిళలతో పాటు కనీసం 13 మంది మరణించినట్టు సమాచారం. మృతదేహాలు తునాతునకలయ్యాయని, బాంబు దాడుల్లో ఇల్లు నేలమట్టమైందని చెబుతున్నారు. విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసి తమ సైనికులంతా క్షేమంగా తిరిగొచ్చినట్టు యూఎస్ అధ్యక్షుడు బైడెన్ గురువారం ప్రకటించారు. అచ్చం బగ్దాదీ మాదిరిగానే... 2019 అక్టోబర్లో ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ కూడా ఇదే ఇద్లిబ్ ప్రాంతంలో యూ ఎస్ దళాలు చుట్టుముట్టడంతో ఇలాగే బాం బు పేల్చు కుని చనిపోయాడు. తర్వాత అక్టోబర్ 31న ఖురేషీ ఐఎస్ చీఫ్ అయ్యాడు. అప్పటినుంచీ వీలైనంత వరకూ జనాల్లోకి రాకుండాలో ప్రొఫైల్లో ఉండేవాడు. మళ్లీ కూడదీసుకునే ప్రయత్నం చేస్తున్న ఐఎస్కు అతని మరణం పెద్ద దెబ్బేనంటున్నారు. పాక్లో 13 మంది ఉగ్రవాదులు హతం కరాచీ: పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో రెండు సైనిక శిబిరాలపై సాయుధ ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన జవాన్లు వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించారు. పాంజ్గుర్, నోష్కి జిల్లాలో బుధవారం జరిగిన ఈ రెండు ఘటనల్లో కనీసం 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 7గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలు గురవారం తెలిపాయి. సైనికులపై కాల్పులు జరిపిం ది తామేనని నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ప్రకటించింది. నోష్కీలో 9 మంది ఉగ్రవాదులు, 4గురు జవాన్లు, పాంజ్గుర్లో 4గురు ముష్కరులు, ముగ్గురు సైనికులు మృతి చెందారని పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ ప్రకటించారు. దాడిని విజయవంతంగా తిప్పికొట్టిన పాక్ సైన్యాన్ని ప్రధాని ఇమ్రాన్ అభినందించారు. Last night at my direction, U.S. military forces successfully undertook a counterterrorism operation. Thanks to the bravery of our Armed Forces, we have removed from the battlefield Abu Ibrahim al-Hashimi al-Qurayshi — the leader of ISIS. https://t.co/lsYQHE9lR9 — President Biden (@POTUS) February 3, 2022 -
తగ్గేదేలే.. గడ్డకట్టే చలిలో.. చెక్కుచెదరని విశ్వాసంతో..
కశ్మీర్: బీఎస్ఎఫ్ జవాన్ల బృందం బిహు పండుగను పురష్కరించుకుని ఓ జానపద పాటకు నృత్యం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను 'బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కశ్మీర్' ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో జవాన్లు డ్యాన్స్ చేస్తున్న తీరు వారి అచంచలమైన స్ఫూర్తిని, కఠినమైన వాతావరణ పరిస్థితులలో కూడా చెక్కుచెదరని విశ్వాసాన్ని గుర్తుచేస్తుంది. ఈ వీడియోలో జనవరి, ఫిబ్రవరిలో.. అస్సాం, ఈశాన్య భారతదేశంలో జరుపుకునే పంట పండుగ అయిన బిహును పురష్కరించుకుని సైనికదళాలు నృత్యం చేయడం మన గమనించవచ్చు. కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో కెరాన్ సెక్టార్లో చిత్రీకరించిన ఈ వీడియోలో.. ఆర్మీ జవాన్లు మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ గడ్డకట్టే ఉష్ణోగ్రత వద్ద ఉత్సాహంగా నృత్యం చేయడం చూడవచ్చు. చదవండి: (తాతా నీళ్లు తాగు.. గంగిరెద్దు ఇదిగో అరటిపండు! సల్లగుండు బిడ్డా) 'పర్వతాలు, మంచు, మంచు తుఫానులు, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, 24 గంటలపాటు తీవ్ర ఒత్తిడి, ఎల్ఓసీ, ఇళ్లకు దూరంగా ఉండటం ఇవి ఏవీ కూడా వారిని నిరుత్సాహానికి గురిచేయలేదు.. పండుగ జరుపుకోవడాన్ని అడ్డుకోలేదు' అంటూ క్యాప్షన్ ఇస్తూ 'బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కశ్మీర్' వీడియో పోస్ట్ చేసింది. Mountains and mountains of snow, blinding blizzards, freezing temperatures, stress of 24 hours vigil #LoC , away from homes; this all didn’t deter BSF troops to dance few steps & celebrate #Bihu at FDL in #Keran Sector #ForwardArea .@PMOIndia @HMOIndia @BSF_India pic.twitter.com/65c1viqskU — BSF Kashmir (@BSF_Kashmir) January 16, 2022 -
పాక్ యుద్ధంలో అమరుడైన సైనికుడికి కేటాయించిన భూమి కోసం దశాబ్ధాలుగా పోరాటం!
తెనాలి: రాజధాని ఏరియాలో దళితులకు ఇళ్ల స్థలాలనిస్తే, సమతౌల్యత దెబ్బతింటుందని కోర్టును ఆశ్రయించి అడ్డుకున్న టీడీపీ, అధికారంలో ఉండగా దివంగత సైనికుడికి ఇవ్వాల్సిన భూమికి సైతం రాజధాని పేరుతో మొండిచెయ్యి చూపింది. పాకిస్తాన్తో యుద్ధంతో వీరమరణం పొందిన సైనికుడికి ప్రభుత్వం కేటాయించిన భూమి కోసం అతడి మాతృమూర్తి, దశాబ్దాలుగా చేసిన పోరాటానికి ఫలితం దక్కలేదు. టీడీపీ ప్రభుత్వ వైఖరితో తనకు జరిగిన అన్యాయానికి మనస్తాపంతో ఆమె అనారోగ్యానికి గురైంది. తాను తనువు చాలించేలోగానైనా న్యాయం జరగాలని 92 ఏళ్ల ఆ వీరమాత వేడుతోంది. ఆ తల్లి పేరు తోట వెంకాయమ్మ. భర్త 35 ఏళ్ల క్రితమే కాలం చేశాడు. స్థానిక గంగానమ్మపేటలో ఇల్లు మినహా మరేం లేదు. ఆమె నలుగురు కుమారుల్లో ఒకరైన తోట వీరనాగప్రసాద్ యుక్తవయసులోనే సైన్యంలో చేరాడు. చేరిన కొద్దికాలానికే 1965లో వచ్చిన ఇండియా – పాకిస్తాన్ యుద్ధంలో అమరుడయ్యాడు. అతని తాగ్యానికి నివాళిగా 1966లో ప్రభుత్వం అప్పట్లో గుంటూరు జిల్లా పరిధిలోని చినగంజాంలో 2.5 ఎకరాల వర్షాధారమైన భూమిని (సర్వే నెం.701/1) కేటాయించింది. వీరనాగప్రసాద్ అవివాహితుడు కావటంతో ఆ భూమిని తల్లి వెంకాయమ్మకు ఇచ్చారు. పేరుకైతే భూమిని ఇచ్చారుగానీ, అధికారుల అర్థంకాని నిర్ణయాలు, అంతులేని అలసత్వంతో ఆ భూమి ఇప్పటికీ తనకు దక్కనేలేదు. అసంబద్ధ నిర్ణయాలతో కోర్టుల చుట్టూ.. 1965లో ఇచ్చిన భూమిని మరో మూడేళ్లకు ప్రభుత్వ అవసరాల కోసమంటూ మరొకరికి కేటాయించారు. అక్కడే సర్వే నంబరు 704/2లో అంతే విస్తీర్ణంలో భూమిని వెంకాయమ్మకు ఇచ్చారు. 1982లో దానినీ స్వాధీనం చేసుకుంది. 396/4, 396/5 సర్వే నంబర్లలోని 2.85 ఎకరాల చెరువు భూమిని ఇచ్చారు. ఒండ్రు మట్టితో గల ఆ భూమి సుభిక్షమైందని నమ్మబలికారు. అదైనా తీసుకుందామని వెళ్లిన వెంకాయమ్మ కుటుంబసభ్యులను పంచాయతీవారు అడ్డుకున్నారు. చెరువు భూమి పంచాయతీదేనని, రెవెన్యూకు సంబంధం లేదని నిరోధించారు. పైగా న్యాయస్థానాన్నీ ఆశ్రయించారు. తమ ప్రమేయం లేని వ్యవహారంలో వెంకాయమ్మ కోర్టు వాయిదాలకు తిరగాల్సి వచ్చింది. కోర్టులో పంచాయతీకి అనుకూలంగా తీర్పు రావటంతో ప్రభుత్వమిచ్చిన భూమినీ కోల్పోయింది. ‘ప్రకాశం’కు చేరిన పొలం వ్యవహారం.. ఈలోగా జిల్లాల విభజన జరగటంతో చినగంజాం ప్రకాశం జిల్లాలోకి వెళ్లింది. జరిగిన విషయాన్ని వెల్లడిస్తూ ప్రకాశం జిల్లా కలెక్టరుకు వెంకాయమ్మ దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ కె.దేవానంద్ స్పందించారు. వెంకాయమ్మ కుటుంబం తెనాలిలోనే ఉంటున్నందున వారికి గుంటూరు జిల్లాలోనే వ్యవసాయ భూమిని కేటాయించాలంటూ 2009 ఏప్రిల్ 13న లేఖ రాశారు. బ్యూరోక్రసీ జాప్యంతో ఆ లేఖ 2016 ఫిబ్రవరి 15న తగుచర్యల నిమిత్తం జిల్లా కలెక్టరేట్ నుంచి తెనాలి ఆర్డీవో కార్యాలయానికి చేరింది. అనువైన భూమి కోసం అప్పటి ఆర్డీవో జి.నరసింహులు డివిజనులోని తహసీల్దార్లను నివేదిక కోరారు. నివేదికతో సహా అప్పటి ప్రభుత్వానికి పంపారు. రాజధాని పేరుతో మొండిచెయ్యి.. దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం ‘కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి కల్పన కోసం పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించటం, వివిధ పరిపాలన విభాగాలను స్థాపించటం వంటి భవిష్యత్ అవసరాల దృష్ట్యా గుంటూరు జిల్లా ప్రభుత్వ ఖాళీస్థలం చాలా అవసరమైనందున దరఖాస్తుదారు అభ్యర్థన ఆచరణీయం కాదు’ అంటూ తిరస్కరించింది. దీనితో మనస్తాపం చెందిన ఆ మాతృమూర్తికి అనారోగ్యం ప్రాప్తించింది. తన గోడునంతా వివరిస్తూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి దరఖాస్తును పంపారు. న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు. చదవండి: Inspirational Story: నా కొడుకుకు కళ్లులేకపోతేనేం.. నా కళ్లతో లోకాన్ని పరిచయం చేస్తా! -
తప్పు చేసినా శిక్షకు అతీతులా?
ఈశాన్య భారత రాష్ట్రమైన నాగాలాండ్లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ను పరిశీలించడానికి ఒక కమిటీని నియమించిన కేంద్రం కమిటీ నివేదిక ఇవ్వక ముందే ఆ రాష్ట్రంలో మరో ఆరు నెలలు చట్టాన్ని పొడిగిస్తున్నట్లు చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. డిసెంబర్ 4న నాగాలాండ్లో 13 మంది అమాయక పౌరులను తీవ్రవాదులుగా భావించి సాయుధ దళాలు కాల్చి చంపిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం ఇది పొరపాటున జరిగిన సంఘటన అని క్షమాపణలు చెప్పింది. నిజానికి ఇటువంటి సంఘటనలు ఈ చట్టం అమలులో ఉన్న ఈశాన్య భారతంలో సాధారణమే. తమను ఎవరూ శిక్షించలేరనీ, తాము శిక్షాతీతులమనీ భావిస్తున్న సైనిక దళాలు ఎన్నో అమానవీయ దురంతాలకు పాల్పడ్డాయి. ఒకప్పుడు రామ్వా గ్రామం వద్ద ఉన్న అస్సాం రైఫిల్స్ జవాన్లను ఆ గ్రామస్థులు క్రిస్మస్ వేడుకలకు ఆహ్వానించేవారు. అందుకే జవాన్లు ఈ ఏడాది కూడా రెండు కొత్త వాలీబాళ్లు, ఒక నెట్ బహుమతులుగా తీసుకొని రామ్వాకు వెళ్ళారు. కానీ గ్రామస్థులు ఆ బహుమతులను స్వీకరించడానికి నిరాకరించడంతో వారు విస్మయం చెందారు. తమతో ఫొటో దిగటానికి సైతం అక్కడి ఫుట్బాల్ క్రీడాకారులు నిరాకరిం చడం వారిని మరింత ఆశ్చర్యచకితులను చేసింది. గ్రామీణుల ఈ ప్రవర్తనకు అత్యంత ముఖ్యమైన కారణమే ఉంది. రామ్వా, మణిపూర్లోని ఉఖ్రుల్–ఇంఫాల్ రహదారిలో ఉన్న ఒక చిన్న గ్రామం. నాగాలాండ్లోని మోన్ జిల్లాలో డిసెంబర్ 4న భారత భద్రతా దళాలు జరిపిన కాల్పులకు నిరసనగా అస్సాం రైఫిల్స్ సిబ్బంది రాకను గ్రామస్థులు హర్షించలేకపోయారు. నాటి కాల్పుల్లో ఏడుగురు బొగ్గు గని కార్మికులతో సహా 13 మంది పౌరులు మరణిం చారు. మణిపూర్ నాగాలకు, నాగాలాండ్ నాగాలకు మధ్య కనిపిస్తున్న ఈ సంఘీభావం వారిలో సైనిక దళాల పట్ల పెరిగిపోతున్న క్రోధానికి, పరాయీకరణ భావానికి ప్రతిబింబం అనవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం సంఘటనను ‘పొరపాటు’ పేరుతో దాటవేయడానికి ప్రయ త్నించింది. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో క్షమాపణ కూడా చెప్పారు. కానీ నాగాలు మోన్ కాల్పులను, అంతకు ముందు జరిగిన దురం తాల నుంచి వేరుగా చూడటం లేదు. శిక్ష పడుతుందనే భయం ఏ కోశానా లేని సైనిక దళాల సంస్కృతిలో ఒక భాగంగానే దీన్నీ చూస్తున్నారు. సీనియర్ కార్యకర్తగా, శాంతి ప్రక్రియలో దీర్ఘకాలం పాల్గొంటూ వచ్చిన డాక్టర్ అకుమ్ లాంగ్చారి... ‘‘భారత సైన్యంలోని 21వ పారా స్పెషల్ ఫోర్స్పై టిజిత్ పోలీస్ స్టేషన్ సుమోటో ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. అందులో ‘ఎలాంటి రెచ్చగొట్టే చర్యలూ ఎదురుకాక పోయినా వాహనంపై భద్రతా దళాలు గుడ్డిగా కాల్పులు జరిపాయి, ఫలితంగా అనేక మంది ఒటింగ్ గ్రామస్థుల హత్యలు జరిగాయి. అలాగే చాలా మంది తీవ్రంగా గాయాలపాలయ్యార’’ని పేర్కొన్నారు. అందువల్ల భద్రతా దళాల ఉద్దేశం పౌరులను హత్యచేయడం, గాయ పరచడమేనని స్పష్టమవుతోందని ఆ ఎఫ్ఐఆర్ పేర్కొందని అన్నారు. గత 63 సంవత్సరాలుగా సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) విపరిణామాలను పరిశీలిస్తే... తాము ఏం చేసినా తమకు వచ్చే ముప్పేమీ లేదనే ధైర్యంతో సైనిక దళాలు అనేక అకృత్యాలకు పాల్పడ్డాయని అర్థమవుతుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన 1958 నుండి 1979 వరకు, సాయుధ దళాలు ఈశాన్య ప్రాంతంలోని నాగాలు నివసించే ప్రాంతాల్లో తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించాయి. ఈ సమయంలో గ్రామాలు కాలి పోయాయి; కుటుంబాలు అడవుల్లో ఆకులు, అలములు తింటూ నివసించాయి; పురుషులు దారుణ హింసకు గురై మరణించారు. మహిళలు అత్యాచారానికి గుర య్యారు. ఇంత భారీ ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు కాకతా ళీయం కాదు. సైనిక శక్తిని ఉప యోగించి తిరుగు బాటును అణచివేసే విధానంలో భాగంగానే ఇన్ని దురంతాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత 1978–79లో నాగాలు మానవ హక్కుల కోసం నాగా పీపుల్స్ మూవ్మెంట్ను ఏర్పాటు చేసి, తమ బాధలన్నింటినీ డాక్యు మెంట్ చేయడం ప్రారంభించారు. దీంతో దేశమంతటికీ మొదటి సారిగా సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం గురించి తెలి సొచ్చింది. 1982 ఆగస్టులో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ అనే కొత్త తిరుగుబాటు సంస్థ సైనిక దళాలపై మొదటి మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో కొందరు సైనికులతో పాటు 21వ సిక్కు రెజి మెంట్ ఆఫీసర్ ఒకరు మరణించారు. మణిపూర్లోని ఉఖ్రుల్కు ఒక మహిళా నిజనిర్ధారణ బృందం వెళ్ళింది. సోషలిస్టు పార్లమెంటు సభ్యు రాలు ప్రమీలా దాదావతే నేతృత్వంలోని బృందంలో నేను కూడా సభ్యు రాలినే. మేము తిరిగి వచ్చి నివేదిక ఇస్తే ప్రచురణకు నోచుకోలేదు. 1983లో నాగా పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఏఎఫ్ఎస్పీఏను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసినప్పుడు, నేను కూడా పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ ప్రతినిధిగా సపోర్టింగ్ పిటిషన్ దాఖలు చేశాను. ఇంతకు ముందు మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్కు పంపారు. కానీ 14 ఏళ్లపాటు అవి విచారణకు నోచుకోలేదు. చివరికి 1997లో సుప్రీంకోర్టు పిటిషన్లను విచారించి సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం చెల్లుబాటును సమ ర్థించింది. తద్వారా ఆ చట్టం ప్రకారం పనిచేస్తున్న సాయుధ దళాలు తప్పు చేయలేదని చెప్పింది. ఇంతలో, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ 1987 జూలైలో మణిపూర్ సేనాపతి జిల్లా ఓనామ్ గ్రామంలో అస్సాం రైఫిల్స్ పోస్ట్పై మరో మెరుపుదాడి చేసింది. తమ నుంచి తిరుగుబాటు దారులు దోచుకువెళ్లిన ఆయుధాలను తిరిగి పొందడానికి అస్సాం రైఫిల్స్ ‘ఆపరేషన్ బ్లూబర్డ్’ అనే కోడ్ నేమ్తో తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్ను ప్రారంభించింది. ఇది మూడు నెలలకు పైగా కొన సాగింది. ఈ కాలంలో అస్సాం రైఫిల్స్ చేసిన దురాగతాలకు అంతే లేదు. ఇద్దరు గర్భిణీ స్త్రీలు సైనికుల ముందే బహిరంగంగా ప్రస వించవలసి వచ్చింది. ఆపరేషన్ బ్లూబర్డ్ బాధితుల తరఫున నేను కొందరు న్యాయవాదులతో కలసి 1988 నుంచి 1991 వరకు ఈ కేసుపై పోరాడాను. కేసు ముగిసే సమయానికి మానవ హక్కుల ఉల్లంఘనపై దాదాపు పది సంపుటాల సాక్ష్యాలు ఉన్నాయి. అయినా 25 ఏళ్లకు 2019లో హైకోర్టు ఫైళ్లు కనిపించకుండా పోయినందున తీర్పు ఇవ్వలేక పోతున్నట్లు తెలిపింది. మణిపూర్ మహిళల నుంచి ఏఎఫ్ఎస్పీఏకు కొన్ని ముఖ్యమైన సవాళ్లు ఎదురయ్యాయి. మొదటిది 2000 నవంబరులో ఇరోమ్ చాను షర్మిల నిరాహార దీక్ష రూపంలో ఎదురైంది. ఈ దీక్ష 16 ఏళ్లు సాగింది. అయినా ప్రభుత్వం చట్టాన్ని రద్దు చేయలేదు. తంగ్జాం మనోరమ అనే మహిళ కూడా ప్రభుత్వానికి సవాల్గా నిలవడంతో అస్సాం రైఫిల్స్... 32 ఏళ్ల మనోరమను అరెస్టు చేసి, హింసించి, ఆమె దేహాన్ని బుల్లెట్ లతో నింపి రోడ్డుపై పడవేసింది. ఆమె మరణంపై ఇచ్చిన న్యాయ మూర్తి నివేదిక ఎన్నడూ వెలుగు చూడలేదు. దీంతో సాయుధ దళ జవాన్లు తమను తాము శిక్షాతీతులుగా భావించుకుంటూ... ఆడ, మగ అనే తేడా లేకుండా అందరినీ నిర్భయంగా హత్య చేయడం, హింసిం చడం, అవమానించడం వంటి అమానవీయ చర్యలను కొనసాగించ డానికి వీలు కలుగుతున్నది. ఇలా ఈశాన్య భారతంలో సైనిక దళాల అకృత్యాలకు శిక్ష పడే అవకాశం లేకపోవడంతో అనేక విపరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో మొదటిది, ఈ చట్టం అమలులో ఉన్న ‘కల్లోలిత‘ ప్రాంతా లలో నివసిస్తున్న బాధితుల బాధలకు పరిష్కార వేదిక లేకుండా పోయింది. న్యాయానికి దూరమైన ప్రజలు కోపంతో ప్రభుత్వానికి దూరమవుతున్నారు. రెండవది, ఈ చట్టం రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను కూడా దెబ్బతీసింది. మూడవది, 63 సంవత్స రాలుగా అంతర్గత భద్రత కోసం సాయుధ దళాలను ఉపయోగిం చడం వాటిని భ్రష్టు పట్టించడానికి దారితీసింది. 2021 డిసెంబర్లో 13 మంది పౌరుల హత్యల తరువాత, ఏఎఫ్ఎస్పీఏను నాగాలాండ్ నుండి ఉపసంహరించుకోవాలా వద్దా అని పరిశీలించడానికి హోంమంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఇవ్వక ముందే నాగాలాండ్లో ఈ చట్టాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం డిసెంబర్ 30న ప్రకటించింది. ఈ చట్టం కింద తలెత్తుతున్న సమస్యలు కేవలం ఈశాన్య రాష్ట్రాలకు చెందినవి మాత్రమే అనుకోకుండా ఇదొక జాతీయ సమస్యగా దేశ మంతా చర్చ జరగాలి. సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని రద్దు చేయాలి. – నందితా హక్సర్ మానవ హక్కుల న్యాయవాది, రచయిత -
సాయుధ దళాల సేవలు అనిర్వచనీయం
సాక్షి, అమరావతి: శత్రుమూకల నుంచి దేశాన్ని నిరంతరం రక్షిస్తూ ప్రజలు సుఖశాంతులతో జీవించేందుకు సాయుధ దళాలు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత కొనియాడారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సాయుధ దళాల పతాక దినోత్సవం–2021 నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. సైనికులు, మాజీ సైనికులకు, వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయుధ దళాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. గతంలో వీర మరణం చెందిన సైనిక కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తే, తమ ప్రభుత్వం రూ.50 లక్షలు అందజేస్తోందన్నారు. ఇళ్ల పట్టాలతో పాటు కారుణ్య నియామకాల కింద కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సైనికుల ఇళ్ల స్థలాల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు. ఇప్పటివరకు 140 మందికి 300 చదరపు గజాల చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలను అందజేసినట్టు చెప్పారు. ఆర్థిక సాయం అందజేత దేశ రక్షణలో భాగంగా సరిహద్దుల్లో అసువులు బాసిన ప్రకాశం జిల్లాకు చెందిన అమర జవాను హవల్దార్ గుర్రాల చంద్రశేఖర్ సతీమణి మేరీ మంజుల, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపాల కృష్ణసురపతి భార్య దీపా, విజయనగరం జిల్లాకు చెందిన వీర సైనికుడు నాయక్ పాండ్రంకి చంద్రరావు సతీమణి సుధారాణి, కర్నూలు జిల్లాకు చెందిన సైనికుడు పొలుకనటి శివగంగాధర్ భార్య రాధిక, గుంటూరు జిల్లాకు చెందిన సైనికుడు ఎం.జస్వంత్ కుమార్రెడ్డి భార్య వెంకటేశ్వరమ్మకు సైనిక సంక్షేమ ప్రత్యేక నిధి నుంచి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని హోం మంత్రి అందజేశారు. 164 సార్లు రక్తదానం చేసిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ సైనికుడు సార్జెంట్ బొడ్డేపల్లి రామకృష్ణారావును సత్కరించారు. గత ఏడాది పతాక దినోత్సవం సందర్భంగా పెద్దఎత్తున విరాళాలను సేకరించిన తూర్పు గోదావరి జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కెప్టెన్ డాక్టర్ పి.సత్యప్రసాద్ (రిటైర్డ్), కర్నూలు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి పి.రాచయ్య, పశ్చిమ గోదావరి జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కేవీఎస్ ప్రసాదరావుకు మంత్రి ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సైనిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు వీవీ రాజారావు పాల్గొన్నారు. -
సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం జగన్ విరాళం
సాక్షి, అమరావతి: సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విరాళం ఇచ్చారు. ఏపీ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి, విఎస్ఎమ్ (రిటైర్డ్), సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి సీఎం జగన్కి జ్ఞాపిక అందజేశారు. (చదవండి: ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి: సీఎం జగన్) ఈ కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సైనిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి.వెంకట రాజారావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ భక్తవత్సల రెడ్డి, సూపరింటెండెంట్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఓటీఎస్ వరం... స్పాట్లో రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ -
యుద్ధ క్షేత్రాల్లో ఆర్మీకి కొత్త యూనిఫాం
న్యూఢిల్లీ: యుద్ధక్షేత్రాల్లో సైనిక బలగాలకు మరింత తేలికైన, మన్నికైన యూనిఫాం సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి భారత ఆర్మీకి ఈ కొత్త యూనిఫామ్ను అందజేయనున్నట్లు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. వేసవి, చలికాలాల్లో మరింత సౌకర్యవంతంగా ఉండేలా దీనిని తయారుచేశారు. మంచు, అటవీ ప్రాంతాల పరిసరాల రంగుల్లో కలిసిపోయేలా ఉండే రంగులను యూనిఫామ్ కోసం ఎంపికచేశారు. బలగాలను కాస్త దూరం నుంచి చూస్తే పసిగట్టకుండా ఉండేందుకు ఆయా రంగుల్లో డిజైన్ను ఎంపికచేశారు. ఆలివ్, మృణ్మయ రంగుల కలబోతగా ‘డిజిటల్ డిస్ట్రర్బ్’ డిజైన్లో ఈ యూనిఫామ్ను రూపొందించారు. వచ్చే ఏడాది జనవరి 15న జరిగే ఆర్మీ డే పరేడ్లో తొలిసారిగా అధికారికంగా దీనిని ప్రదర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సైనికులకు యుద్ధక్షేత్రాల్లో వినియోగిస్తున్న వేర్వేరు డిజైన్ల ఆర్మీ యూనిఫామ్లను పరిశీలించి, పలు చర్చల అనంతరం ఈ యూనిఫామ్కు తుదిరూపునిచ్చారు. -
ట్రిబ్యునళ్లలో ఖాళీల భర్తీ
సాక్షి, న్యూఢిల్లీ: ట్రిబ్యునళ్లలో నియామకాల ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ), అర్మ్డ్ పోర్సెస్ ట్రిబ్యునల్ (ఏఎఫ్టీ)ల్లో ఖాళీలు భర్తీ చేస్తూ నోటిఫికేషన్లు జారీ చేసింది. నియామకాలు చేపట్టకుండా ట్రిబ్యునళ్లను నిర్వీర్యం చేస్తున్నారని, తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని సుప్రీంకోర్టు ఈనెల 6న కేంద్రం వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈనెల 13లోగా కొన్ని నియామకాలైన చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఖాళీల భర్తీని కేంద్రం చేపట్టింది. వివిధ ట్రిబ్యునళ్లలో దాదాపు 250 దాకా ఖాళీలు ఉన్నాయి. ఎన్సీఎల్టీ: ఎనిమిది మంది జ్యుడీషియల్, 10 మంది సాంకేతిక సభ్యుల్ని నియమించింది. ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్ నరహరి దేశ్ముఖ్, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రామతిలగం, పంజాబ్ హరియాణా హైకోర్టు విశ్రాంత రిజి్రస్టార్ జనరల్ హర్నామ్ సింగ్ ఠాకూర్, పి.మోహన్రాజ్, రోహిత్ కపూర్, జస్టిస్ దీప్ చంద్ర జోషి ఎన్సీఎల్టీలో జ్యుడీíÙయల్ సభ్యులు. వీరంతా ఐదేళ్ల పదవీకాలం, 65 ఏళ్ల వయసు.. ఏది ముందు ముగిస్తే అప్పటి వరకూ కొనసాగుతారు. ఐటీఏటీ: జ్యుడీíÙయల్ సభ్యులుగా అన్రిజర్వు కేటగిరీలో అడ్వొకేట్ సంజయ్ శర్మ, అడ్వొకేట్ ఎస్.సీతాలక్ష్మి , అదనపు జిల్లా, సెషన్ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.గోయెల్, జస్టిస్ అనుభవ్ శర్మ. ఓబీసీ కేటగిరీలో అడ్వొకేట్ టీఆర్ సెంథిల్కుమార్, ఎస్సీ కేటగిరీలో ఎస్బీఐ లా ఆఫీసర్ మన్మోహన్ దాస్లను నియమించారు. వీరి పదవీకాలం నాలుగేళ్లు, లేదా 67 ఏళ్లు.. ఏది ముందుగా ముగిస్తే అప్పటి వరకూ ఉంటుంది. ఏఎఫ్టీ: ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్లో ఆరుగురు జ్యుడీíÙయల్ సభ్యుల్ని కేంద్రం నియమించింది. జస్టిస్ బాలకృష్ణ నారాయణ, జస్టిస్ శశికాంత్ గుప్తా, జస్టిస్ రాజీవ్ నారాయణ్ రైనా, జస్టిస్ కె.హరిలాల్, జస్టిస్ ధరమ్చంద్ర చౌదరి, జస్టిస్ అంజనా మిశ్రాలను నియమించింది. వీరి పదవీ కాలం నాలుగు సంవత్సరాలు, 67 ఏళ్లు ఏది ముందుగా ముగిస్తే అప్పటి వరకూ ఉంటుంది. ఢిల్లీ, చండీగఢ్, లక్నోల్లో ఏఎఫ్టీ నాలుగు బెంచ్లు ఉన్నాయి. ఆయా ట్రిబ్యునళ్లలో 19 వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. రిటైర్డ్ జస్టిస్ రజని -
మయన్మార్లో నిరసనకారులపై తూటా
-
మయన్మార్లో నిరసనకారులపై తూటా
యాంగాన్: మయన్మార్లో మిలటరీ ఒకవైపు సాయుధ బలగాల దినోత్సవాన్ని జరుపుకుంటూనే నిరసనకారులపై తన క్రూరత్వాన్ని ప్రదర్శించింది. మిలటరీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న వారిపై తుపాకీగుళ్ల వర్షం కురిపించింది. ఈ కాల్పుల్లో శనివారం మధ్యాహ్నానికి 93 మందిపైగా మిలటరీ తూటాలకు బలైనట్టుగా మయన్మార్లో స్వతంత్ర అధ్యయన సంస్థ వెల్లడించింది. ఫిబ్రవరి 1న మయన్మార్లో ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న మిలటరీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి సైనికులు యాంగాన్, మాండాలే సహా 12 పట్టణాల్లో నిరసనకారులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. మండాలేలో జరిగిన కాల్పుల్లో అయిదేళ్ల బాలుడు మరణించడంతో విషాదం నెలకొంది. మయన్మార్ సైనికులు తమని అణగదొక్కాలని చూస్తున్నప్పటికీ వారు గద్దె దిగేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని నిరసనకారులు ఎలుగెత్తి చాటారు. ‘‘మమ్మల్ని పిట్టల్లా కాల్చేస్తున్నారు. మా ఇళ్లల్లోకి కూడా సైనికులు చొరబడుతున్నారు’’ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిలటరీ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఈ స్థాయిలో కాల్పులు జరగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు మొత్తంగా 400 మంది అమాయకులు బలయ్యారు. సిగ్గుతో తలదించుకోవాలి ఒకే రోజు ఈ స్థాయిలో అమాయకులు బలైపోవడంతో అంతర్జాతీయంగా మయన్మార్ మిలటరీపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘సాయుధ బలగాలు ఇవాళ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు’’ అని మిలటరీకి వ్యతిరేకంగా అధికారాన్ని కోల్పోయిన ప్రజాప్రతినిధుల కూటమి అధికార ప్రతినిధి డాక్టర్ శస అన్నారు. సాయుధబలగాల దినోత్సవం బీభత్సంగా జరిగింది. ఇలాంటి చర్యలు ఎంత మాత్రం సమర్థనీయం కాదు అని మయన్మార్లో యూరోపియన్ యూనియన్ ప్రతినిధుల బృందం విమర్శించింది. మరోవైపు మిలటరీ చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హాలింగ్ ప్రజల పరిరక్షణ కోసమే తామున్నామని అన్నారు. త్వరలోనే స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగిస్తామని చెప్పారు. -
మహిళల భద్రతకు సాయుధ దళాలు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత, మహిళల రక్షణ కోసం ‘మిషన్ శక్తి’ పేరుతో కొత్తగా మూడు మహిళా సాయుధ దళాలను ఏర్పాటు చేయబోతోంది. ఆ దళాలకు 1857 నాటి తొలి భారత స్వాతంత్య్ర సంగ్రామ మహిళా యోధుల పేర్లు పెట్టినట్లు ప్రకటించింది. ఆ ముగ్గురు వీరాంగనల శౌర్యసాహసాల విశేషాలు క్లుప్తంగా.. ఉత్తరప్రదేశ్లోని బుదాన్, లక్నో, గోరఖ్పూర్లలో కొత్తగా మూడు మహిళా దళాలు ఏర్పాటవబోతున్నాయి. ‘ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కాన్స్టేబ్యూలరీ’ ఉమెన్ బెటాలియన్లు అవి. ‘పి.ఎ.సి.’లు. ప్రాదేశిక సాయుధ మహిళా రక్షణ దళాలు. మొన్న మార్చి 20 న లక్నోలో జరిగిన రాణి అవంతీబాయి లోధీ వర్ధంతి సందర్భంగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో యు.పి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఈ విషయాన్ని ప్రకటించారు. మహిళలు, బాలికల భద్రతకు, రక్షణకు ఈ మహిళా పి.ఎ.సి.లు పనిచేస్తాయి. ఒక్కోదళానికి ఒక్కో పేరుగా.. రాణి అవంతీబాయి లోధీ, ఉదాదేవి, ఝల్కారీబాయి పేర్లను పెట్టారు. ఈ ముగ్గురూ తొలి స్వాతంత్య్ర సంగ్రామంలోని వీరాంగనలు. 1857–1858 మధ్య బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడి అమరులైనవారు. నాడు పరదేశీయుల నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడిన మహిళా యోధుల పేర్లను నేటి స్వతంత్ర భారతదేశంలో మహిళల్ని అఘాయిత్యాల నుంచి, అత్యాచారాల నుంచి, అకృత్యాల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన మహిళా దళాలకు పెట్టడం.. ‘చరిత్రను మరవొద్దు, మనవాళ్లు ఎలాంటి అఘాయిత్యాలకు గురయ్యారో, మహిళలపై మనం అలాంటి హేయమైన పనులకు పాల్పడొద్దు’ అని చెప్పడమే. రాణీ అవంతీబాయి, ఉదాదేవి, ఝల్కారీబాయి.. బ్రిటిష్వాళ్ల గుండెలు గుభేల్మనిపించిన మహిళలు. ఖడ్గాన్ని ఎత్తిపట్టి గుర్రపు స్వారీ చేసుకుంటూ వచ్చి సమరశంఖం వంటి ఒక గర్జన చేస్తే.. అదీ మహిళలు చేస్తే.. బ్రిటిష్ అధికారులు వెనకడుగు వేస్తారా? అయితే స్వాతంత్య్రం కోసం వీరు కనబరిచిన నిబద్ధత, నిబ్బరం తెల్లవాళ్లని తెల్లబోయేలా చేసింది! నిబ్బరం సరే, ప్రతి స్వాతంత్య్ర సమరశీలికీ ఉండేదే. నిబద్ధత ఏమిటి? ఏమిటంటే.. ఆనాడు బ్రిటిష్ వాళ్లపై తిరుగుబాటు చేసిన అనేకమంది స్వదేశీ రాజ్యపాలకులకు లేనిది! అవును. అందరం కలిసి పోరాడదాం అనుకున్నాక కూడా మనవాళ్లు కొందరు జారిపోయారు. కొందరు రహస్యంగా బ్రిటిష్వాళ్లతో కలిసిపోయారు. ఆ సమయంలో మహిళా యోధులు గట్టిగా నిలబడ్డారు. ఒత్తిళ్లకు, బెదరింపులకు లొంగిపోకుండా ఖడ్గాన్ని ఝళిపించారు. తుపాకీ ఎక్కుపెట్టారు. తమ చివరి శ్వాస వరకు భరతమాత దాస్య శృంఖలాలను తెగ్గొట్టేందుకు పోరాడుతూనే ఉన్నారు. వారి స్ఫూర్తితో, వారి పేర్లతో ఇప్పుడు ఏర్పాటైన మూడు పి.ఎ.సి.లకు కలిపి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘మిషన్ శక్తి’ అని పేరు పెట్టింది. అంటే.. త్రిదళమహాశక్తి అని. ఆ ముగ్గురు మహిళలు అవంతి, ఉదా, ఝల్కరి గురించి క్లుప్తంగానైనా తెలుసుకోవడం.. మనసును శక్తితో, ధైర్యంతో, ధీమాతో నింపుకోవడం అవుతుంది. అవంతీబాయి లోధీ లోధీలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలోని వ్యవసాయ కుటుంబాల వాళ్లు. వాళ్లింటి అమ్మాయి అవంతి. తర్వాత ఆమె రామ్ఘర్ రాణి అయింది. ఇప్పుడా రామ్ఘర్ మధ్యప్రదేశ్లోని డిండోరి. సంస్థానాధీశులు ఎందరు మెత్తబడినా రాణీ అవంతీబాయి మాత్రం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారిపై ఎత్తిన ఖడ్గాన్ని దించలేదు. వారితో పోరాడుతూనే 1858 మార్చి 20 న అమరనారి అయ్యారు. 1857 మే 10 నుంచి 1858 నవంబరు 1 వరకు ఏడాదిన్నరపాటు సాగిన మొదటి భారత స్వాతంత్య్ర యుద్ధంలో రాణి అవంతి నాలుగువేల మంది సైన్యంతో శత్రువులతో తలపడ్డారు. మంద్లా దగ్గరి ఖేరి గ్రామంలో ఆమె, ఆమె సైన్యం బ్రిటిష్ సేనల్ని పరుగులెత్తించారు. అవమానభారంతో అప్పటికి వెళ్లిపోయిన పరాజిత మూకలు తిరిగి రామ్ఘర్ మీద ప్రతీకార దాడులు జరిపాయి. రామ్ఘర్కు నిప్పుపెట్టాయి. రాణి అవంతిక గెరిల్లా యుద్ధ వ్యూహంతో వారిని ఎదుర్కొన్నారు. బలం క్షీణించిన క్షణంలో శత్రువుకు సజీవంగా చిక్కరాదని తన సైనికుడి దగ్గర ఉన్న ఖడ్గాన్ని లాక్కుని ప్రాణత్యాగం చేసుకున్నారు. ఉదాదేవి ఉదాదేవి భారత ప్రథమ స్వాతంత్య్ర సమర దళిత యోధురాలు. ఆమెతో కలిసి బ్రిటిష్ వాళ్లపై నాడు పోరాడిన దళిత మహిళలంతా చరిత్రలో ‘దళిత వీరాంగన’లుగా గుర్తింపు, గౌరవం పొందారు. బ్రిటిష్ వాళ్లపై భారత ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను గమనించిన ఉదా దేవి ముందుగా తనే బేగమ్ హజ్రత్ మహల్ (అవథ్) ను కలిసి యుద్ధానికి ‘నేను సైతం’ అని నినదించారు. బేగమ్ హజ్రత్ ఉప్పొంగిపోయారు. అప్పటికప్పుడు మహిళలతో ఒక యుద్ధ దళాన్ని ఏర్పాటు చేసి ఉదాదేవికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆమె చేతికి తుపాకీ అందించారు. బ్రిటిష్ వాళ్లు అవ«ద్ను ఆక్రమించినప్పుడు ముందు వరుసలో ఉండి వారిని నిలువరించింది ఉదాదేవి మహిళా దళమే! 1857 నవంబరులో సికందర్బాగ్లో జరిగిన ముఖాముఖి పోరులో తన దళాలకు సూచనలు ఇచ్చాక, ఉదాదేవి ఒక రావి చెట్టు ఎక్కి అక్కడి నుంచి బ్రటిష్ సైనికులపై కాల్పులు జరుపుతూ వారు ముందుకు రాకుండా చేయగలిగారు. ఆకులు కొమ్మల మాటు నుంచి తూటాలు కురిపిస్తున్న వారెవరో కనిపెట్టలేక బ్రటిష్ అధికారి ఒకరు చెట్టుపైకి కాల్పులు జరపమని తన సైనికులకు ఆదేశాలు ఇవ్వడంతో ఆ మూకుమ్మడి తూటాలకు ఉదాదేవి నేలకు ఒరిగారు. అప్పటికే ఆమె తుపాకీ పన్నెండు మందికిపైగా బ్రిటిష్ సైనికుల్ని హతమార్చింది. ఉత్తరప్రదేశ్లో నేటికీ ఏటా నవంబర్ 16 న ఉదాదేవి స్మారక కార్యక్రమాలు గౌరవ శ్రద్ధలతో జరుగుతుంటాయి. ఝల్కారీబాయి ఝల్కారీ బాయి.. ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో సిపాయి. ప్రథమ భారత సంగ్రామంలో వీరనారిగా చిరస్మరణీయురాలైన దళిత యోధురాలు. యుద్ధ వ్యూహాలు పన్నగల యువతి. ఆ నేర్పు కారణంగానే క్రమేణా ఆమె లక్ష్మీబాయి ఆంతరంగిక సలహాదారులలో ఒకరు అయ్యారు. బ్రిటిష్ సేనలు ఝాన్సీని చుట్టుముట్టినప్పుడు లక్ష్మీబాయిని తప్పించడానికి ఆమెలా వేషం మార్చుకుని శత్రుమూకలపైకి లంఘించారు. ఆ ధైర్యసాహసాలే ఝల్కారీ బాయిని బుందేల్ఖండ్ ఆధునిక జానపద కథలో నాయికను చేశాయి. బ్రిటిష్వారితో పోరాడుతూనే 1858 ఏప్రిల్ 4న ఆమె అమరనారి అయ్యారు. ఝల్కారీ సాహసకృత్యం ఒకటి ప్రాచుర్యంలో ఉంది. బాల్యంలోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలో గుర్రపుస్వారీ, కత్తిసాము నేర్చుకుని ఉన్న ఝల్కారీ ఓ రోజు పశువులను మేపుతున్నప్పుడు ఆమెపై ఒక పులి దాడి చేయబోయింది. అప్పుడు ఝల్కారీ తన చేతిలోని కర్రతోనే లాఘవంగా పులిపై లంఘించి పులిని హతమార్చిందని ఇప్పటికీ ఆమె పుట్టిన భోజ్లా గ్రామంలో (ఝాన్సీ) కథలు కథలుగా చెప్పుకుంటారు. భారత ప్రభుత్వం అవంతీబాయి లోధీ జ్ఞాపకార్థం విడుదల చేసినట్లే ఝల్కారీ స్మారక చిహ్నంగా కూడా ఒక తపాలా బిళ్లను విడుదల చేసింది. -
ఊహించని పరిణామం: వెనక్కి తగ్గిన చైనా
న్యూఢిల్లీ: సరిహద్దు దేశం చైనా కవ్వింపు చర్యలతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. సరిహద్దులో గుంటనక్కలా వేచి చూస్తున్న చైనా చివరకు ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. సరిహద్దు వివాదంపై చైనా రక్షణ శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. భారత్లోని తూర్పు లద్దాఖ్లో పాంగాంగ్ సరస్సు నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకున్నట్లు చైనా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన జారీ అయ్యింది. భారత బలగాలు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయని చైనా తెలిపింది. కమాండర్ల స్థాయి చర్చలు ఫలించాయి. ఆ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా వెల్లడించింది. తూర్పు లద్దాఖ్లో ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. గాల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ మొదలు.. ఇప్పటి వరకు సరిహద్దుల వెంట తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించడంతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి రోజురోజుకు తీవ్రంగా మారడం.. ఎప్పుడైనా యుద్ధం జరుగుతుందేమో అనే దాక పరిస్థితి వచ్చింది. చివరకు అకస్మాత్తుగా చైనా వెనక్కి తగ్గింది. గాల్వాన్ ఘటన నుంచి ఇరు దేశాల సైనికాధికారులు చేస్తున్న చర్చలు ఇప్పటికీ ఫలించాయి. కమాండర్ల స్థాయి చర్చల తర్వాత ఇరు దేశాలు తమ సైన్యాన్ని సరిహద్దుల్లోంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement