Ballot papers
-
బ్యాలెట్ పేపర్లు.. మీ పరిధి కాదు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ పేపర్లను ప్రవేశపెట్టాలన్న అంశం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిధిలోకి రాదని కేంద్ర న్యాయ శాఖ తేల్చిచెప్పింది. జమిలి ఎన్నికల బిల్లుపై ఏర్పాటైన జేపీసీకి ఈ మేరకు రాతపూర్వకంగా తన అభిప్రాయాన్ని తెలియజేసింది. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించే విధానాన్ని మళ్లీ తీసుకురావాలని కమిటీలోని కొందరు సభ్యులు సూచించగా, కేంద్ర న్యాయశాఖ దీనిపై స్పందించింది. ఈ అంశం జేపీసీ పరిధిలోకి రాదని పేర్కొంది. ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించాలా? లేక బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలా? అనేది పరిశీలించే అధికారం జేపీసీకి లేదని పరోక్షంగా తేల్చిచెప్పింది. జమిలి ఎన్నికలు అప్రజాస్వామికం కాదని స్పష్టంచేసింది. ఈ ఎన్నికల వల్ల దేశ సమాఖ్య నిర్మాణానికి ఎలాంటి విఘాతం కలగదని పేర్కొంది. బ్యాలెట్ పేపర్ల పట్ల కేంద్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించింది. సుప్రీంకోర్టు సైతం ఈవీఎంలౖవైపే మొగ్గు చూపుతోంది. పేపర్ బ్యాలెట్ విధానాన్ని మళ్లీ తీసుకురావాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. -
మోదీ తన మిత్రుడు ట్రంప్ వ్యాఖ్యలను పట్టించుకోవాలి
న్యూఢిల్లీ: ఓటింగ్ కోసం ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లకు బదులుగా బ్యాలెట్ పేపర్లను వాడాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారులకు చేసిన సూచనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రధాని మోదీ తన మిత్రుడు ట్రంప్ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. మనదేశ ఎలక్టోరల్ విధానం సమగ్రతపై వ్యక్తమవుతున్న ఆందోళనలకు బ్యాలెట్ విధానమే సరైన సమాధానమని పేర్కొంది. అమెరికాలో ఇటీవల జరిగిన రాష్ట్రాల గవర్నర్ల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ..‘ఈవీఎంల విధానం చాలా ఖరీదైన వ్యవహారం. దీనికి బదులుగా బ్యాలెట్ విధానాన్ని, ఒకే రోజు ఓటింగ్ చేపట్టడం వంటివి తీసుకురావడం మంచిది’అని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ‘ఎక్స్’లో పలు పోస్టులు చేశారు. ‘ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా లక్షల సంఖ్యలో ఓటర్లు పెరిగారు. అదేసమయంలో, ప్రతిపక్షాలకు చెందిన వారి ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించారు. ఇవన్నీ తెలిస్తే మోదీ మిత్రుడు ట్రంప్ సైతం షాకవుతారు’అని పేర్కొన్నారు. ‘ఈవీఎంలతో ఎన్నికల విధానాన్ని తారుమారు చేయవచ్చని ప్రపంచానికంతటికీ తెలిసినా బీజేపీ మాత్రం అమాయకత్వం ప్రదర్శించటం విషాదకరం. పారదర్శకతకు దూరంగా పారిపోయే బీజేపీ వైఖరి చూస్తే వాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది’అని తెలిపారు. -
బ్యాలెట్ రావాలి: అఖిలేశ్
లక్నో: ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం) లపై విశ్వసనీయత సడలుతున్నందున బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆదివారం డిమాండ్ చేశారు. ‘జర్మనీ వంటి దేశాలు కూడా బ్యాలెట్ పేపర్లే వాడుతున్నాయి. భారత్లో మాత్రం అధికార పెద్దలు స్వలాభం కోసం ఈవీఎంలను వాడుతున్నారు. వాటినెవరూ నమ్మడం లేదు. ఎన్నికల్లో గెలిచే వారు సైతం తమకు వాటిపై నమ్మకం లేదంటున్నారు’’ అని చెప్పారు. భారత సంతతికి చెందిన జర్మనీ ఎంపీ రాహుల్కుమార్ కాంబోజ్ కూడా మీడియాతో మాట్లాడారు. ‘‘బ్యాలెట్ పేపర్లు వాడితే పోలింగ్లో తేడాలున్నట్లు అనుమానం వస్తే రీ కౌంటింగ్కు అవకాశముంటుంది. జర్మనీలో దీన్నే అనుసరిస్తున్నారు’’ అని తెలిపారు. -
ఈవీఎంలతో గెలుస్తామంటే కుదరదు అక్కడ!
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అలియాస్ EVMలు. ప్రతీ ఐదేళ్లకొకసారి ఇవి మనల్ని పలకరిస్తుంటాయి. అయితే వాటి ద్వారా పడిన ప్రతీ ఓటుకు నిజంగా భద్రత ఉంటుందా?. ఈవీఎంలను హ్యక్ చేసి మెజారిటీ ప్రజలిచ్చిన తీర్పును మార్చే అవకాశాలు ఏమాత్రం లేవా? అనే అనుమానాలు కలగడం సహజమే. మొన్నీమధ్య ఏపీ ఎన్నికల టైంలో.. అంతకు ముందు.. మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల టైంలో ఈ తరహా ప్రశ్నలెన్నో తలెత్తాయి. అందుకేనేమో.. అమెరికాలాంటి అగ్రదేశం గత రెండు దశాబ్దాల ప్రయత్నాలతో ఎన్నికల విధానాన్ని ఈవీఎంల నుంచి మళ్లీ బ్యాలెట్కు తెచ్చుకుంది. నవంబర్ 5వ తేదీన జరగబోయే పోలింగ్ బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరగబోతోంది. 95 శాతం రిజిస్టర్డ్ ఓటర్లు అక్కడ పేపర్పై టిక్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 69.9 శాతం ఓటర్లు హ్యాండ్మార్క్డ్ పేపర్ బ్యాలెట్స్ విధానంలో ఓటేయొచ్చని, అలాగే బ్యాలెట్ మార్కింగ్ డివైజ్లతో(డిజిటల్ బ్యాలెట్.. ఓటేసి అప్పటికప్పుడే ఆ ప్రింట్ బయటకు తీయొచ్చు కూడా) కూడిన పేపర్బ్యాలెట్ ఓటింగ్ వైపు మరో 25.1 శాతం మంది మొగ్గుచూపిస్తారని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన.. కేవలం ఐదు శాతం ఓటర్లు మాత్రం మన దగ్గర ఈవీఎంల తరహా డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్(DRE) ద్వారా ఓటేసే ఛాన్స్ ఉంది.అక్కడ ఏరకంగా ప్రయత్నించినా ప్రజా తీర్పును మార్చడానికి వీలుండదన్నమాట. ఈవీఎంల మేనిపులేషన్తో గెలవడం అక్కడ ఎంతమాత్రం కుదరదన్నమాట. సాంకేతికతను ముందుగా పుణికిపుచ్చుకునే అమెరికాలో.. ఈ తరహా ఓటింగ్ ఇంకా జరుగుతుండడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే.. అమెరికాలో 2000 సంవత్సరం దాకా పేపర్ బ్యాలెట్స్ ఓటింగ్ జరిగేది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ వైపు అడుగులేసింది. ఓటర్లు డీఆర్ఈ లేదంటే పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే వీలు కల్పించారు. 2006 మధ్యంతర ఎన్నికల టైంలో 41.9 శాతం ఓటింగ్ డీఆర్ఈ వ్యవస్థ ద్వారానే జరిగింది. అయితే విదేశీ కుట్రలకు అవకాశం, హ్యాకింగ్ ఆరోపణల నేపథ్యంలో డీఆర్ఈపై అక్కడి ఓటర్లలోనూ నమ్మకం సన్నగిల్లింది. 2008 ఎన్నికల నుంచి డీఆర్ఈను ఓటర్లు తిరస్కరిస్తూ వచ్చారు. 2016 అమెరికా ఎన్నికల టైంలో రష్యా జోక్యం ఆరోపణలతో పూర్తిగా వాటిని పక్కన పడేశారు అక్కడి ఓటర్లు.అందుకే అనుమానాలుఈవీఎం 'అన్లాకింగ్'పై రాజకీయ దుమారం కొత్తేం కాదు. మన దేశంలో ఈసీ అందుకు అవకాశమే లేదని చెబుతున్నా.. కొన్ని ఎన్నికల ఫలితాలతో ప్రజల్లోనూ వాటి వాడకంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాల టైంలో నడిచిన చర్చే ఇందుకు ఉదాహరణ. ఈ తరుణంలో ఆధునిక ఈవీఎంల వాడకం బదులు సంప్రదాయ రీతిలో పేపర్ బ్యాలెట్ను ఉపయోగించాలనే అంశాన్ని కొందరు తెరపై తెచ్చారు. ఈ క్రమంలో..ఇదీ చదవండి: ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల మీద సమారు అరవై ఏళ్ల పాటు నేను పనిచేశాను. ఈవీఎం యంత్రాల వ్యవస్థనూ క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమే. దీని వల్ల ఫలితాలు తామరుమారవుతాయి. ఈవీఎంల కంటే పాత బ్యాలెట్ పేపర్ విధానమే చాలా ఉత్తమమైంది. ఇందులో అయితే ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి.:::కాంగ్రెస్ నేత శ్యామ్పిట్రోడాభారత్లో వాడే ఈవీఎంలు అమెరికాలో వాడే తరహావి కావు. ఇక్కడి ఈవీఎంలు కంప్యూటర్ ప్లాట్ఫాం మీద తయారు చేయలేదు. వాటికి బయటి నుంచి ఎలాంటి నెట్వర్క్తో అనుసంధానించే అవకాశమే లేదు. రీ ప్రోగ్రామింగ్ కూడా వీలు లేదు. ఇలాంటి పరికరాలను హహ్యాక్ చేయడం కుదరదు. కావాలంటే ప్రపంచ దేశాలు భారత ఈవీఎంలను వారి ఎన్నికల్లో వాడుకోవచ్చు.:: కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్భారత్లో వాడుతున్న ఈవీఎంలకు సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి రక్షణ ఉందనేది మనకెవరికీ తెలియదు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్కు సంబంధించి ఈవీఎంలు ISO 27001 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది నిపుణులు తేల్చాలి. ఈవీఎంల భద్రతకు ఎలాంటి సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్ను వాడుతున్నారనేది ఇప్పటివరకు బహిర్గతమవలేదు. ఎవరికీ తెలియదు.::: సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ఈవీఎంలను మనం తొలగించాలి. వీటిని వ్యక్తులు లేదంటే ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం. ఇది ఏ దేశానికైనా నష్టమే కలిగిస్తుంది.:: ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్ఇదీ చదవండి: మీకు తెలుసా? ఈ దేశాల్లో పేపర్ బ్యాలెటే ముద్దునిపుణుల నుంచి సామాన్యుల దాకా ఈవీఎంల వాడకంపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతుంటారు. కానీ, ఈ మధ్యకాలంలో పాపులర్ టెక్నాలజీ నిపుణులు కూడా వాటి పని తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తుండడం చూస్తున్నాం. దీంతో ఈవీఎంలపై అనుమానాలకు శాస్త్రీయ నివృత్తి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఈవీఎంలపై ఇంతమంది ఇన్ని అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నపుడు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడితేనే బెటరని సామాన్యులతో పాటు పార్టీల అధినేతలు సూచిస్తున్నారు. ఈవీఎంలు వాడకంలో అయ్యే ఖర్చుతో పోలిస్తే బ్యాలెట్ విధానంలో ఖర్చు కొద్దిగా పెరిగినప్పటికీ, ఎన్నికల ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఓటర్లకు ప్రజాస్వామ్యంపై పూర్తి నమ్మకం కలగాలంటే బ్యాలెట్ పేపరే బెస్ట్ అనే వాదన వినిపిస్తోంది. ‘‘పేపర్ బ్యాలెట్తో ఓటర్ల విశ్వాసాన్ని పెంచవచ్చు. మనలాంటి ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి. రెండింటినీ నిర్ధారించడానికి ఏకైక మార్గం, పేపర్ బ్యాలెట్కి తిరిగి వెళ్లడం. USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే మరియు డెన్మార్క్లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్ను ఉపయోగిస్తున్నప్పుడు, మనం ప్రపంచంలోని ఇతర దేశాలతో మార్పులు చేసి పేపర్ వైపు వెళ్లే సమయం ఇది. బ్యాలెట్, ఇది ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుంది. విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలి’’:::హర్యానా ఎన్నికలపై.. ఎగ్జిట్పోల్స్కు విరుద్ధంగా వెలువడిన ఫలితాలపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ట్వీట్ -
ఈవీఎంలపై అనేక అనుమానాలు.. పేపర్ బ్యాలెట్ బెటర్: సీపీఐ నారాయణ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు వెలువడి ప్రభుత్వాలు సైతం ఏర్పాటయ్యాయి. అయితే, ఎన్నికల్లో ఈవీఎంల పాత్రపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని పలువురు చెబుతున్న నేపథ్యంలో ఇక మీదట ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లనే వినియోగించాలని రాజకీయ నాయకులు కోరుతున్నారు. దీనికి సంబంధింది కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈవీఎంల వాడకంపై సీపీఐ నారాయణ స్పందించారు. తాజాగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘122 దేశాల్లో ఈవీఎంలు వినియోగించడం లేదు. చాలా దేశాల్లో బ్యాలెట్ పేపర్లనే వినియోగిస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఈవీఎంలపై అనుమానాలున్నాయి. మన దేశంలో మాత్రం అనుమానాలను, ఆరోపణలను పట్టించుకోవడం లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించుకూడదు. పేపర్ బ్యాలెట్స్ ద్వారానే ఎన్నికలను జరపాలి’ అని డిమాండ్ చేశారు. This is the time for discussion on EVM said CPI Narayana @cpimspeak @narayanacpi #cpitelangana #cpm #draja pic.twitter.com/k49ZLIimBb— Laxminarayana Masade (@lnmasade) June 17, 2024 -
EVMలపై వైఎస్ జగన్ కీలక ట్వీట్, ఏమన్నారంటే..
గుంటూరు, సాక్షి: ఏపీ ఎన్నికల ఆశ్చర్యకరమైన ఫలితాలపైనా ఒకవైపు.. ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్, అన్లాకింగ్ తదితర అంశాలపై చర్చ మరోవైపు తీవ్ర చర్చ నడుస్తోంది. ఫలితాలపై వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రమే కాదు.. ఏపీ ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ఓ కీలక సందేశం ఉంచారు.‘‘న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు. జరిగినట్లు కనిపించాలి కూడా. అలాగే ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తమ్మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు. ఈవీఎంలు కాదు. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి’’ అని అన్నారాయన.Just as justice should not only be served, but should also appear to have been served, so should democracy not only prevail but must appear to be prevalent undoubtedly. In electoral practices across the world in almost every advanced democracy, paper ballots are used, not EVMs.…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 18, 20242024 సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్లపై మరోమారు చర్చ మొదలైన సంగతి తెలిసిందే. టెస్లా యజమాని, టెక్నాలజీ మేధావి ఎలాన్ మస్క్ స్వయంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే ఈవీఎంలపై నిషేధం అవసరమని విస్పష్టంగా పేర్కొనగా... కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మస్క్ వ్యాఖ్యలను ఖండించారు. అయితే రాజీవ్ మాటలకు ప్రత్యుత్తరంగా మస్క్ ఇంకో ట్వీట్ చేస్తూ... ఏనీథింగ్ క్యాన్ బీ హ్యాక్డ్ అని స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాదు... దేశంలో టెలికాం విప్లవానికి పునాదులు వేసిన వ్యక్తి, సీ-డాక్ వ్యవస్థాపకుడు శ్యామ్ పిట్రోడా సైతం ఈ చర్చలో పాల్గొంటూ ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమేనని వ్యాఖ్యానించడం ఇటీవలి పరిణామమే.ఈవీఎం 'అన్లాకింగ్'పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈసీ అందుకు అవకాశమే లేదని చెబుతున్నా.. తాజా ఫలితాలతో ప్రజల్లోనూ వాటి వాడకంపై అనుమానాలు రెకెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆధునిక ఈవీఎంల వాడకం బదులు సంప్రదాయ రీతిలో పేపర్ బ్యాలెట్ను ఉపయోగించాలనే అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు వైఎస్ జగన్. -
కర్నూలు ప్రెస్కు అరుదైన అవకాశం
కర్నూలు(సెంట్రల్): కర్నూలులోని ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణ కేంద్రం(రీజనల్ ప్రింటింగ్ ప్రెస్)కు అరుదైన అవకాశం లభించింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల ఎన్నికలకు సంబంధించిన సర్విస్ బ్యాలెట్ పేపర్లు, ఈవీఎంలపై అతికించే బ్యాలెట్ పేపర్లు, ఎన్నికలకు అవసరమైన ఇతర అన్ని రకాల పేపర్లను ఇక్కడే ముద్రిస్తున్నారు. విజయవాడలోని గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ పనిచేయకపోవడంతో ఈ ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల బ్యాలెట్ పేపర్లు, ఇతర పేపర్లను ముద్రించే బాధ్యతను కర్నూలు రీజనల్ ప్రింటింగ్ ప్రెస్కు అప్పగించారు. విజయవాడలో ప్రెస్ మూతబడటంతో... ప్రస్తుతం మన రాష్ట్రంలో కర్నూలు, విజయవాడలో మాత్రమే ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మె ల్యే, ఎంపీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన అన్ని రకాల బ్యాలెట్లు, పేపర్లను ఈ ప్రెస్లలోనే ముద్రిస్తారు. గతంలో విజయవాడ ప్రింటింగ్ ప్రెస్లో కోస్తాంధ్రా, ఉత్తరాంధ్రలకు సంబంధించిన అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల బ్యాలెట్ పేపర్లను ముద్రించేవారు. కర్నూలులోని ఎన్ఆర్పేటలో ఉన్న రీజనల్ ప్రింటింగ్ ప్రెస్లో రాయలసీమ జిల్లాలకు సంబంధించిన బ్యాలెట్, ఇతర పేపర్లను ముద్రించేవారు. అయితే, ఇటీవల విజయవాడ ప్రింటింగ్ ప్రెస్ మూతపడటంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కర్నూలులోనే ముద్రిస్తున్నారు. ఈ మేరకు నామినేషన్ల ఉపసంహరణ తర్వా త 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి బరిలో ఉన్న అభ్యర్థులు, వారి గుర్తులతో కూడిన బ్యాలెట్ పేపర్ల ముద్రణ ముమ్మరంగా సాగుతోంది. సుమారు 150 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా 24 గంటలు పనిచేస్తూ సకాలంలో బ్యాలెట్లు, ఇతర పేపర్ల ముద్రణకు కృషి చేస్తున్నారు. -
సుప్రీంలో ట్రంప్కు భారీ విజయం
వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ ఊరట. కొలరాడో ప్రైమరీ బ్యాలెట్ పత్రాల నుంచి ఆయన పేరు తొలగించాలన్న రాష్ట్ర సుప్రీంకోర్టు తీర్పును అమెరికా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఆయన పేరుండాల్సిందేనంటూ సంచలన తీర్పు వెలువరిచింది. దాంతో కొలరాడోతో పాటు ఇలినాయీ, మెయిన్ వంటి రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్పై పేరు తొలగింపు ముప్పు ఎదుర్కొంటున్న ట్రంప్కు భారీ ఊరట లభించింది. ఆయా రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్ధత్వం కోసం ప్రైమరీల్లో ట్రంప్ పోటీకి మార్గం సుగమమైంది. పార్లమెంట్పైకి మద్దతుదారులను ఉసిగొల్పారన్న ఆరోపణలపై రాజ్యాంగంలోని 14వ సవరణ మూడో సెక్షన్ను ఉపయోగించి ట్రంప్ను ప్రైమరీ నుంచి కొలరాడో సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. అధ్యక్ష అభ్యరి్థపై కోర్టు ఈ సెక్షన్ను వాడటం అమెరికా చరిత్రలో అదే తొలిసారి. 14వ సవరణను వాడే అధికారం పార్లమెంట్కే తప్ప రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇది అమెరికా సాధించిన ఘన విజయంమని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
బ్యాలెట్పై ‘ఎక్స్’ మార్కు ఎందుకేశారు?
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నిక సమయంలో బ్యాలెట్ పత్రాలను పాడుచేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు గాను రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. అనిల్ మసీహ్ను ప్రశ్నించడం ద్వారా, రిటర్నింగ్ అధికారిని దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ క్రాస్ ఎగ్జామినేట్ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా భావిస్తున్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. చండీగఢ్ మేయర్గా ఎన్నికైన మనోజ్ సోంకార్ రాజీనామా, ఆప్ కౌన్సిలర్లు ముగ్గురు ఆదివారం బీజేపీ పంచన చేరినట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. అభ్యర్థులను ప్రలోభ పెట్టడాన్ని తీవ్రమైన అంశంగా పేర్కొంది. తాజాగా ఎన్నికలు జరపటానికి బదులుగా కొత్త రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణంలో మరోసారి ఓట్లను లెక్కించడం మంచిదని భావిస్తున్నట్లు తెలిపింది. అయితే, మంగళవారం బ్యాలెట్ పత్రాలను పరిశీలించాకే ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. నిజాయతీగా సమాధానమివ్వండి సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మసీహ్ను కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘ఇది చాలా తీవ్రమైన వ్యవహారం. నిజాయతీగా సమాధానాలు చెప్పకుంటే ప్రాసిక్యూట్ చేస్తాం. ఆ ఫుటేజీ చూశాం. మీరు బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు పెడుతూ కెమెరా వైపు ఎందుకు చూస్తున్నారు? ఎందుకు క్రాస్ మార్కులు పెట్టారు?’ అని అడిగారు. ఎనిమిది బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కు పెట్టింది నిజమేనని మసీహ్ అంగీకరించారు. అవి అప్పటికే పాడైపోయి ఉన్నందున, వేరు చేసేందుకే అలా చేశాన’ని చెప్పారు. ‘బ్యాలెట్ పేపర్లపై మీరు కేవలం సంతకం మాత్రమే చేయాలి. అలాంటప్పుడు వాటినెందుకు పాడు చేశారు? బ్యాలెట్ పేపర్లపై రిటర్నింగ్ అధికారులు ఇతరత్రా మార్కులు వేయొచ్చని ఏ నిబంధనల్లో ఉంది?’అని సీజేఐ అడిగారు. ఎన్నికల ప్రక్రియలో కలుగ జేసుకున్నందుకు మసీహ్ను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని చండీగఢ్ యంత్రాంగం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతానుద్దేశించి సీజేఐ పేర్కొన్నారు. మంగళవారం జరిగే విచారణకు కూడా హాజరుకావాలని అనిల్ మసీహ్ను ఆదేశించారు. ధర్మాసనంలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు. బ్యాలెట్ పత్రాలు, కౌంటింగ్ వీడియో పరిశీలిస్తాం బ్యాలెట్ పత్రాలతోపాటు ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన మొత్తం వీడియో ఫుటేజీని తమకు పంపించాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించింది. రికార్డులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఒక న్యాయాధికారికి బాధ్యతలు అప్పగించాలని, పటిష్ట బందోబస్తు నడుమ ఆయన్ను ఢిల్లీకి పంపాలని స్పష్టం చేసింది. ఏం జరిగిందంటే..? జనవరి 30వ తేదీన మేయర్ ఎన్నికలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎనిమిది ఓట్లను చెల్లనివిగా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ప్రకటించడం, బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకార్ చేతిలో ఆప్–కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి నాలుగు ఓట్ల తేడాతో ఓటమిపాలవడం తెలిసిందే. బీజేపీ మైనారిటీ సెల్కు చెందిన అనిల్ మసీహ్ కావాలనే ఓట్లను చెల్లనివిగా ప్రకటించారని ఆప్ ఆరోపించింది. కెమెరా వైపు చూసుకుంటూ ఆప్ కౌన్సిలర్లకు చెందిన బ్యాలెట్ పేపర్లపై మసీహ్ ‘ఎక్స్’ మార్కువేస్తున్న ఫుటేజీని ఆప్ కోర్టుకు సమర్పించింది. ఈ నెల 5వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ చర్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. -
చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సీరియస్.. కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను తారుమారు చేశారన్న కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు చండీగఢ్ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. ఆయన్ను మంగళవారం కూడా విచారణకు రావాలని తెలిపింది. అంతేగాక మేయర్ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను రేపు సుప్రీంకోర్టుకు తీసుకురావాలని ఆదేశించింది. అందుకోసం ఒక జ్యుడిషియల్ అధికారిని నియమించాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారికి, రికార్డులకు భద్రత కల్పించాలని తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు బ్యాలెట్ పేపర్లు, ఓట్ల లెక్కింపు మొత్తం వీడియో రికార్డింగ్ను పరిశీలిస్తామని పేర్కొంది. సు చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. అయితే రిటర్నింగ్ అధికారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. చదవండి: యూపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది: మోదీ నిజాయితీగా సమాధానాలు చెప్పండి: సుప్రీం చండీగఢ్ మేయర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ అత్యున్నత న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. విచారణ సందర్బంగా సీజేఐ డీవై చంద్రచూడ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అనిల్ మసీహ్ను పలు సూటి ప్రశ్నలు సంధించింది. నిజాయితీగా సమాధానాలు చెప్పకుంటే తనపై విచారణ చేస్తామని హెచ్చరించింది. ఇది తీవ్రమైన విషయమని పేర్కొన్న ధర్మాసనం... ‘మేం వీడియో చూశాము. బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు వేస్తూ కెమెరాను చూసి ఏం చేస్తున్నారు? ఎందుకు మార్కులు వేస్తున్నారు అని ప్రశ్నించింది. ఎనిమిది బ్యాలెట్ పత్రాలపై క్రాస్ మార్కులు వేసినట్లు అంగీకరించిన రిటర్నింగ్ అధికారి.. చెడిపోయిన బ్యాలెట్ పత్రాలను వేరుచేయవలసి ఉన్నందున తాను అలా చేశానని బదులిచ్చారు. ‘మీరసలు బ్యాలెట్ పత్రాలను ఎందుకు పాడు చేశారు. పత్రాలపై సంతకం మాత్రం చేయడమే మీ బాధ్యత. మీరు బ్యాలెట్ పత్రాలపై ఇతర గుర్తులు వేయవచ్చని నిబంధనలలో ఎక్కడ పొందుపరిచారు’ అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అనంతరం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా వైపు తిరిగి.. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ను రేపు మళ్లీ ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఆయన జోక్యం చేసుకుంటున్నాడని సీజేఐ పేర్కొన్నారు. తాజాగా ఎన్నికలు నిర్వహించే బదులు కొత్త రిటర్నింగ్ అధికారితో ఓట్లను లెక్కించాలని తొలుత ప్రతిపాదించారు బ్యాలెట్ పత్రాలను పరిశీలించిన తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. జనవరి 30న జరిగిన మేయర్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎనిమిది ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ ప్రకటించడంతో బీజేపీకి చెందిన మనోజ్ సోంకర్ చేతిలో ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్కుమార్ నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ మైనారిటీ సెల్ సభ్యుడు మిస్టర్ మసీహ్ ఉద్దేశపూర్వకంగా ఓట్లను చెల్లుబాటు చేయలేదని ఆప్ ఆరోపించింది. ఈ క్రమంలోనే రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో అతడు కెమెరాను చూస్తూ కొంతమంది ఆప్ కౌన్సిలర్ల బ్యాలెట్ పత్రాలపై ఏదో రాస్తున్నట్లు కనిపిస్తుంది.దీంతో ఆప్ కౌన్సిలర్ ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. తొలుత ఈ పిటిషన్పై ఫిబ్రవరి 5న విచారించిన సుప్రీంకోర్టు.. అనిల్ మసీహ్ చర్య ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని పేర్కొంది. -
అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎం వాడరు!
ఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు ఎన్నికల కోసం ఎన్నో సంస్కరణలు, మార్పులు జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉంటాయి కూడా. ఇందులో ఈవీఎంల వాడకం అనేది టెక్నాలజీతో ముడిపడిన అంశం. ఎన్నికలొచ్చిన ప్రతీసారి చర్చనీయాంశంగా(రాజకీయ విమర్శలకు సైతం వేదిక) మారుతుంటుంది కూడా. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పుడు ఈవీఎంలనే ఉపయోగిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. మరి.. రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఈవీఎంలు ఎందుకు వాడటం లేదు?. బ్యాలెట్ పేపర్ విధానంతోనే రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు జరుగుతుందసలు?.. ముందుగా ఈవీఎం టెక్నాలజీ సంగతి చూద్దాం. ఈవీఎంలలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు.. దాని పక్కనే సంబంధిత బటన్ ఉంటుంది. ఓటర్లు నచ్చిన అభ్యర్థి బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఉన్న సాఫ్ట్ వేర్ ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనే విషయాన్ని కౌంటింగ్ రోజున క్షణాల్లో చూపించేస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల విషయానికి వచ్చేసరికి... దీని పోలింగ్ విధానం అలగ్ ఉంటుంది. ఈవీఎంలు ఎంత మాత్రం సరిపోవు. ఎందుకంటే.. ఓటు వేసే వారికి కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలనే నిబంధన ఇక్కడ వర్తించదు. ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులకు తమ ఛాయిస్ ఆధారంగా ప్రిఫరెన్సియల్ ఓట్లు వేసే ఛాన్స్ ఉంది. ప్రాధాన్యతల ఆధారంగా, వారి ఇష్టానుసారం ఒకరి కంటే ఎక్కువ మందికి ఓటర్లు ఓటేయొచ్చు. చివరికి.. ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఓట్లు పడ్డాయనే ఆధారంగా విజేతను ప్రకటిస్తారు!. బ్యాలెట్ పేపర్లోని కాలమ్ 2 లో ఓటర్ ఇష్టాన్ని బట్టి ఒకటి.. రెండు.. మూడు.. ఇలా ఎంతమందికైనా ఓటు వేయవచ్చు. అందువల్లే రాష్ట్రపతి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తారు. మరి ఈవీఎంలలో కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది కదా. ఈ కారణంగానే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడం లేదు. -
MPTC, ZPTC Election Results: ఆ ఎనిమిది చోట్లా ఫలితాలు నిలిపివేత
సాక్షి, అమరావతి: ఏడు ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల ఫలితాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నిలిపివేసింది. వాటి పరిధిలోని మొత్తం 18 బూత్లలో రీపోలింగ్ నిర్వహించాలని జిల్లా అధికారులకు ఎస్ఈసీ ఆదేశించింది. ఆ బూత్లకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు పూర్తిగా తడిసిపోయి లెక్కింపునకు వీలుగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలోని గొరిగనూర్ ఎంపీటీసీ పరిధిలోనున్న రెండు పోలింగ్ బూత్లలో మొత్తం 742 ఓట్లు పూర్తిగా తడిసిపోయాయి. అయితే, అక్కడి ఓట్లన్నీ లెక్కించగా, అత్యధిక ఓట్లు దక్కించుకున్న అభ్యర్థి, రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి మధ్య 517 ఓట్ల తేడా ఉంది. దీంతో అక్కడ రెండు బూత్ల పరిధిలో తడిసిపోయిన 742 ఓట్లు కీలకంగా మారాయి. దీంతో ఆ ఫలితాన్ని నిలిపివేయాలని జిల్లా అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. అదే సమయంలో గొరిగనూర్ ఎంపీటీసీ ఫలితాన్ని కూడా నిలిపివేశారు. బ్యాలెట్ పత్రాలు తడిసిపోయిన రెండు బూత్లలో రీపోలింగ్ నిర్వహించి, ఆ ఓట్ల ఆధారంగా జమ్ములమడుగు జెడ్పీటీసీ, గొరిగనూర్ ఎంపీటీసీ స్థానం ఫలితాలను అధికారులు ప్రకటిస్తారు. అలాగే.. ► శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబుగం ఎంపీటీసీ పరిధిలోని నాలుగు పోలింగ్ బూత్లు, ఆమదాలవలస కాత్యాచారులపేట ఎంపీటీసీ పరిధిలోని ఒక బూత్ పరిధిలో ఎక్కువ సంఖ్యలో బ్యాలెట్ పత్రాలు తడిసిపోవడంతో ఆ రెండు ఎంపీటీసీ స్థానాల ఫలితాలను కూడా నిలిపివేసి, అక్కడ రీ పోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశించింది. ► ఇదే కారణంతో విశాఖపట్నం జిల్లా గోలుగొండ మండలం పాకాలపాడు ఎంపీటీసీ స్థానం ఫలితాన్నీ నిలిపివేశారు. అక్కడ రెండు బూత్లో రీపోలింగ్ నిర్వహిస్తారు. ► తూర్పు గోదావరి జిల్లా మారేడుమల్లి మండలం దోరచింతలపాలెం ఎంపీటీసీ, పెద్దాపురం మండలం పులిమేరు ఎంపీటీసీ స్థానం ఫలితాలను కూడా నిలిపివేశారు. దోరచింతలపాలెంలో ఏడు, పులిమేరులో ఒక బూత్లలో రీ పోలింగ్కు ఆదేశించారు. ► వైఎస్సార్ జిల్లా ముద్దనూరు మండలం కొర్రపాడు ఎంపీటీసీ ఫలితం కూడా బ్యాలెట్ పత్రాలు తడిసిన కారణంగానే నిలిచిపోయింది. ఇక్కడ ఒక బూత్ పరిధిలో రీపోలింగ్ జరుగుతుంది. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలను ఈ నెల 24, 25 తేదీలలో నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసినందున ఈ 18 చోట్లా 25వ తేదీ తర్వాతే రీ పోలింగ్ నిర్వహించే అవకాశముందని ఎస్ఈసీ అధికారులు వెల్లడించారు. -
నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో రీపోలింగ్?
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: లెక్కించాల్సిన బ్యాలెట్ పేపర్లు తడవడంతో నాలుగు ఎంపీటీసీ స్థానాలో రీ పోలింగ్ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి అందిన నివేదిక మేరకు శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబుంగం ఎంపీటీసీ స్థానంలో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో, విశాఖపట్నం జిల్లా గొలిగొండ మండలం పాకాలపాడు ఎంపీటీసీ పరిధిలో రెండు బూత్ల్లోనూ రీపోలింగ్కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతి తెలిపినట్టు తెలిసింది. కాగా, ఇలాగే బ్యాలెట్ బాక్సులు తడిచిపోవడంతో వైఎస్సార్ జిల్లాలో కొర్రపాడు, గొరిగెనూరు ఎంపీటీసీ స్థానాలకు రీపోలింగ్ నిర్వహించే అంశంపై ఆ జిల్లా అధికారులు ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులను సంప్రదించారు. అయితే, రాత్రి 12 గంటల సమయానికి ఆ రెండు ఎంపీటీసీలకు సంబంధించి అధికారులకు ఎలాంటి లిఖితపూర్వక నివేదికలు అందని కారణంగా అక్కడ ఎలాంటి అ«ధికార నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. కొర్రపాడు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి మూడు బ్యాలెట్ బాక్సులకుగాను ఒక బాక్సులో నీళ్లు చేరడంతో లెక్కింపునకు అంతరాయం కలిగింది. అప్పటికి లెక్కించిన రెండు బ్యాలెట్ బాక్సుల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి పుష్పలతకు 355 ఓట్ల మెజారిటీ లభించింది. కాగా, మిగిలిన బాక్సులో 600 ఓట్లున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం.. మొత్తం బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కించిన తర్వాతే ఫలితాన్ని ప్రకటించాల్సి ఉంది. ఇదే కారణంతో ముద్దనూరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థిని ఉమాదేవికి 6,409 ఓట్ల మెజారిటీ ఉన్నప్పటికీ ఆమె గెలుపొందినట్లు అధికారులు ధ్రువీకరించలేదు. ఇక, జమ్మలమడుగు మండలం గొరిగెనూరు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి మూడు బ్యాలెట్ బాక్సులకుగాను రెండింటిలో నీళ్లు చేరడంతో కౌంటింగ్ ఆపేశారు. ఇదే కారణంతో జమ్మలమడుగు జెడ్పీటీసీ ఫలితం కూడా ఆగిపోయింది. ఈ విషయమై జాయింట్ కలెక్టర్ సాయికాంత్వర్మ మాట్లాడుతూ పై విషయాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని, తదుపరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరికొన్నిచోట్ల బ్యాలెట్ పత్రాలు తడిచినా.. పోలింగ్ జరిగిన ఐదున్నర నెలల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడం కారణంగా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల్లోకి కొన్నిచోట్ల వర్షపు చెమ్మ చేరి కొన్ని పత్రాలు దెబ్బతినడం, చెదలు పట్టడం చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం ఐదారు చోట్ల ఈ పరిస్థితిని అధికారులు గుర్తించారు. బ్యాలెట్ బాక్సుల్లో మొత్తం ఓట్లు దెబ్బతినకుండా కొన్ని మాత్రమే పాడయ్యాయి. దెబ్బతిన్న ఓట్లను పక్కనపెట్టి మిగతా ఓట్లను లెక్కించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా జిల్లాల అధికారులకు సూచించింది. -
94 టన్నుల బ్యాలెట్ పత్రాలు
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల సన్నాహాలను పురపాలక శాఖ వేగవంతం చేసింది. రాష్ట్రంలో 12 నగర పాలక సంస్థలు, 75 పురపాలక సంఘాల్లో మార్చి 10న నిర్వహించనున్న పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయడం, బ్యాలెట్ పత్రాల ముద్రణ తదితర ఏర్పాట్లు ఊపందుకున్నాయి. పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి సున్నితమైనవి, అత్యంత సున్నితమైన వాటిని గుర్తించారు. వార్డులవారీగా ఓటర్ల జాబితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ► మున్సిపల్ ఎన్నికల కోసం మొత్తం 15,978 బ్యాలెట్ బాక్సులు అవసరమని అంచనా వేశారు. జంబో బాక్సులు 922, పెద్ద బాక్సులు 10,673, మీడియం సైజు బాక్సులు 2,540, చిన్న సైజు బాక్సులు 1,843 వినియోగించను న్నారు. కొన్ని బ్యాలెట్ బాక్సులను గతంలో హైదరాబాద్లో పురపాలక సంస్థ ఎన్నికల కోసం పంపించారు. వాటిని వెనక్కి తెప్పించనున్నారు. ► బ్యాలెట్ విధానంలో నిర్వహించే ఈ ఎన్నికల కోసం బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రక్రియను పురపాలక శాఖ చేపట్టింది. 13 జిల్లాలకు 94 టన్నుల వైట్వోవ్ కాగితాలను పంపించారు. ఎన్ని బ్యాలెట్ పత్రాలు అవసరమవుతా యన్నది జిల్లాల వారీగా కలెక్టర్లు నిర్ణయిస్తారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ కోసం నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల వారీగా ప్రింటింగ్ ప్రెస్లను కలెక్టర్లు ఎంపిక చేస్తారు. ► పోలింగ్ కోసం అవసరమైన ఇండెలిబుల్ ఇంక్ (సిరా)ను సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది మున్సిపల్ ఎన్నికల కోసం తెప్పించిన సిరా గడువు తీరడంతో కొత్తగా ఆర్డర్ ఇచ్చారు. 5 ఎంఎల్ సిరా సీసాలు 13,500, 10 ఎంఎల్ సిరా సీసాలు 26,500 తెప్పించాలని నిర్ణయించారు. ► పురపాలక ఎన్నికల కోసం మొత్తం 9,307 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 12 నగర పాలక సంస్థల పరిధిలో 5,020 కేం ద్రాలు, 75 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల పరిధిలో 4,287 పోలింగ్ కేంద్రాలున్నాయి. ► పోలింగ్ కేంద్రాల్లో సున్నితమైనవి 2,890, అత్యంత సున్నితమైనవి 2,466 కేంద్రాలు ఉండగా 3,951 సాధారణ పోలింగ్ కేంద్రా లున్నాయి. 12 నగర పాలక సంస్థల్లో సున్నితౖ మెనవి 1,465, అత్యంత సున్నితమైనవి 1,159, సాధారణమైనవి 2,396 కేంద్రాలు ఉన్నాయి. 75 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల పరిధిలో సున్నితమైనవి 1,425, అత్యంత సున్నితమైనవి 1,307, సాధారణ మైనవి 1,555 కేంద్రాలున్నాయి. ► మున్సిపల్ ఎన్నికల కోసం తొలిసారిగా ఓటర్ల ఫొటోలున్న స్లిప్పులు పంపిణీ చేయనున్నారు. మున్సిపల్ ఓటర్ల వివరాలను పురపాలక శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. వార్డుల వారీగా ఓటర్ల పేర్లతో సహా జాబితాలను అందుబాటులో ఉంచారు. -
తుప్పల్లో, చెరువుల్లో బ్యాలెట్ పేపర్లు
బలిజిపేట (విజయనగరం): విజయనగరం జిల్లా బలిజిపేట మండలంలోని నారన్నాయుడువలసలో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. కౌంటింగ్ సమయంలో అధికారులు డ్రామా నడిపించి శనివారం రాత్రి 11 గంటలకు టీడీపీ మద్దతు అభ్యర్థి తోముచిట్టి వెంకటరమణ 15 ఓట్లతో గెలుపొందినట్లు ప్రకటించారు. నారన్నాయుడువలస పంచాయతీలో ఉన్న 10 వార్డులకు ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా పాఠశాల భవనాలున్నాయి. వాటిలో ఒకవైపు ఒక రూములో 3 వార్డులు, వంటగదిలో ఒక వార్డుకు, మరొకవైపు ఉండే భవనాలలో రెండు రూముల్లో 6 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ అయిన తరువాత అన్ని పోలింగ్ బాక్సులను ఒకచోట చేర్చి కౌంటింగ్ ప్రారంభించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా 4 వార్డుల పోలింగ్ బాక్సులను అక్కడే ఉంచి 5, 6, 7, 8, 9, 10 వార్డులకు చెందిన కౌంటింగ్ను వేరే భవనాలలో నిర్వహించారు. ఈ సమయంలో మొదటి 4 వార్డులకు చెందిన బాక్సుల వద్ద టీడీపీ మద్దతుదారులు ఓట్లు మార్పులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకు తార్కాణంగా ఆదివారం ఉదయం పోలింగ్స్టేషన్కు వెనుకభాగంలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు గుర్తులపై ముద్రలతో ఉండే బ్యాలెట్ పేపర్లు, బాక్సుల పై భాగంలో ఉండే సీళ్ల తొలగింపులు చేసిన ఆధారాలు కనిపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామ సమీపంలో ఉండే చెరువులో బ్యాలెట్ పేపర్లు, రశీదులు దొరికాయి. ఆబోతుల ప్రసాదు అనే ఓటరు ఒక పర్యాయం ఓటువేసినా అతడి సంతకంతో వేరొక రశీదు రావడాన్ని చూపించారు. ఇదే విషయాన్ని ఆర్వో చంద్రశేఖర్ వద్ద ప్రస్తావించగా అన్ని బాక్సులు దగ్గర ఉంచి కౌంటింగ్ చేశామని, కౌంటింగ్ ఏజెంట్లకు అన్నీ తెలియజేశామన్నారు. బ్యాలెట్ పేపర్ల విషయం తెలియదని చెప్పారు. -
సర్పంచ్.. మలి పంచ్ నేడే
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు రెండో విడత జరిగే గ్రామాల్లో శనివారం ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలు మినహా మిగతా చోట్ల మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరుగు తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాయి. రెండో విడతలో 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ కాగా 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని ఒక్కో గ్రామ పంచాయతీలలో సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 2,786 చోట్ల సర్పంచి పదవులకు పోలింగ్ జరగనుంది. సర్పంచి స్థానాలకు 7,507 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడత గ్రామాల్లో 33,570 వార్డులుండగా 12,604 ఏకగ్రీవమయ్యాయి. మరో 149 వార్డులలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 20,817 వార్డులకు పోలింగ్ జరగనుంది. వార్డులకు 44,876 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 29,304 కేంద్రాల్లో పోలింగ్.. రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం 29,304 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు తదితర సామగ్రితో పోలింగ్ సిబ్బంది శుక్రవారం రాత్రికే ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. 4,181 కేంద్రాలను అత్యంత సమస్యాత్మ కంగా, 5,480 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. బ్యాలెట్ పేపరుతో ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 18,387 పెద్దవి, 8,351 మధ్యస్థం, 24,034 చిన్న సైజు బ్యాలెట్ బాక్స్లను వినియోగిస్తున్నారు. పోలింగ్ విధుల్లో 81,327 మంది సిబ్బంది పాల్గొంటుండగా 4,385 మంది జోనల్ అధికారులు, రూట్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లుగా వ్యవహరిం చనున్నారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మధ్యాహ్నం 1.30 గంటల వరకు పోలింగ్ సమయంగా నిర్ణయించారు. కోవిడ్ పాజిటివ్ బాధితులకు పోలింగ్ చివరిలో గంట పాటు కరోనా జాగ్రత్తలతో ఓటు వేసేందుకు అనుమతిస్తామని కమిషన్ అధికారులు తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 9,661 కేంద్రాలలో ప్రత్యేక వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ తమ కార్యాలయాల నుంచి పర్యవేక్షించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్.. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు శనివారం సాయంత్రమే మొదలు కానుంది. నాలుగు గంటల నుంచి లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. బ్యాలెట్ బాక్స్లను నిర్దేశిత ప్రాంతానికి తరలించి తొలుత వార్డులకు తర్వాత సర్పంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. వేర్వేరు గదుల్లో ఏర్పాట్లు.. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు వెంటనే చేపడుతున్న నేపథ్యంలో రెండు వేర్వేరు గదుల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, ఇతరులు బ్యాలెట్ పేపర్లు తాకకుండా బారికేడ్లతో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. రెండో విడత ఎన్నికల ఏర్పాట్లపై పంచాయతీరాజ్శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, జిల్లా ఇన్చార్జ్ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు రాత్రి కూడా నిర్వహించే పక్షంలో తగినన్ని లైట్లు, సిబ్బందికి భోజన సదుపాయాలు కల్పించాలన్నారు. కంట్రోల్ రూం ద్వారా వెబ్ కాస్టింగ్ను నిరంతరం పర్యవేక్షించాలని, డేటాను భద్రంగా ఉంచాలని సూచించారు. ఐదు వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో అదనంగా ఒక అధికారిని నియమించాలని, పెద్ద పంచాయతీలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్వోకి సహాయంగా గెజిటెడ్ అధికారిని నియమించుకోవాలని సూచించారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం 13 జిల్లాలకు ఇప్పటికే రూ.80 కోట్లు విడుదల చేశామని, రెండో విడత కోసం రూ.116 కోట్లు విడుదలయ్యాయని, నిధులను పొదుపుగా వినియోగించాలని పేర్కొన్నారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించామన్న ఎస్ఈసీ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల సంఘం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో 11గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఉండగా.. 8 పార్టీలు తమ అభిప్రాయం తెలిపాయని ఈసీ ప్రకటించింది. బీజేపీ మాత్రమే ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు వెల్లడించింది. స్థానిక ప్రభుత్వం బ్యాలెట్ పేపర్ ఎన్నికకే అనుకూలంగా ఉంది. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలను అధికార టీఆర్ఎస్తో పాటు విపక్షాలు సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. -
స్థానికంలోనూ 'నోటా'
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో నోటాకు చోటు కల్పించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాలెట్ పత్రాలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఇది పెద్ద తలనొప్పేనని నాయకులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఏప్రిల్లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ నోటాకు కొన్ని ప్రధాన పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు రావడమే దీనికి కారణం. ఇప్పటివరకు ఈవీఎంలలో మాత్రమే నోటాకు చోటు ఉండేది. ఇప్పుడు బ్యాలెట్ పత్రాలలోనూ ఇది ప్రత్యక్షం కానుంది. అభ్యర్థుల ఎన్నికల గుర్తులు తరువాత ఈ నోటా గుర్తు ఉంటుంది. పోటీ చేసే వారు ఎవరూ నచ్చకపోతే ఈ గుర్తుకుఓటు వేయొచ్చు. ఇప్పటివరకు గత్యంతరం లేక ఎవరో ఒకరి వైపు ఓటర్లు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు నోటా ఉండడంతో దానిని ఉపయోగించుకోవడం వల్ల తమకు ఇబ్బందేనని నాయకులు చెబుతున్నారు. ఇది ఒక్కోసారి జయాపజయాలను నిర్దేశించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలకంటే ఎక్కువగా ♦ గత సార్వత్రిక ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్లను పరిశీలిస్తే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల కంటే ఎక్కువ వచ్చాయి. దీంతో ఆ పార్టీల అభ్యర్థులు కంగుతిన్నారు. నియోజకవర్గాల వారీగా నోటాకు పోలైన ఓట్లు ఇలా.. ♦ కొవ్వూరులో 2165, నిడదవోలులో 1693, ఆచంటలో 1453, పాలకొల్లులో 1170, నరసాపురంలో 1143, భీమవరంలో 1492, ఉండిలో 1885, తణుకులో 1885, ఉంగుటూరులో 2321, దెందులూరులో 2546, ఏలూరులో 1524, గోపాలపురంలో 3998, పోలవరంలో 6004, చింతలపూడిలో 3477 ఓట్లు నోటాకు పోలయ్యాయి. -
రెండు ఎంపీటీసీలకు రీపోలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ఎంపీటీసీ స్థానా ల్లో రీపోలింగ్ జరగనుంది. సోమవారం జరిగిన మొదటి విడత పరిషత్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల బ్యాలెట్ పత్రాలు కలసిపోవడంతో ఈ స్థానాల విష యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసు కుంది. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండ లం అజీజ్నగర్ ఎంపీటీసీ, సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం అల్వాల్ ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 14 న మూడో విడత ఎన్నికల్లో భాగంగా రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ఎంపీటీసీ స్థానంలో బ్యాలెట్పత్రాలు కలసిపోయినా, దీన్ని సకాలంలో గుర్తించడంతో సోమవారమే సరిచేసి ఎన్నికలు నిర్వహించారు. రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ఈ రెండు ఎంపీటీసీ స్థానాల్లో ఓటర్లకు తప్పుడు బ్యాలెట్ పేపర్లను పంపిణీ చేసిన నేపథ్యంలో మళ్లీ ఎన్నికల నిర్వహణకు నోటి ఫికేషన్ జారీచేయాలని అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. ఈ స్థానాల్లోని ఓటర్లకు ఈ నెల 14న నిర్వహించే రీపోలింగ్ సందర్భంగా ఎడమ చేతి నాలుగో వేలిపై సిరాచుక్క వేయాలని సూచించింది. కాగా, పరిషత్ ఎన్నికల్లో భాగంగా తనిఖీల సందర్భంగా ఇప్పటివరకు రూ.1.6 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఒక్కరోజే రూ.3.95 లక్షల నగదు, రూ.1.6 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 86 ఫిర్యాదులందాయి. మొత్తం 190 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాటిపై చర్యలు చేపట్టినట్లు ఎస్ఈసీకి పోలీస్ శాఖ తెలిపింది. -
తప్పుల తడకగా బ్యాలెట్ పేపర్లు
చౌటుప్పల్/సంస్థాన్నారాయణపురం : మొదటి విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్లో ఉమ్మడి నల్లగొండజిల్లాలో పలుచోట్ల బ్యాలెట్ పేపర్లు తప్పుల తడకగా వచ్చాయి. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి గ్రామంలో 29వ పోలింగ్ బూత్లో అదే మండలం లోని నేలపట్ల గ్రామానికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు ఇచ్చారు. ఈ క్రమంలో 13మంది ఓటర్లు ఇవే బ్యాలెట్ పేపర్లతో ఓట్లు వేశారు. తర్వాత తప్పును కొందరు ఓటర్లు గుర్తించి అధికారులకు చెప్పడంతో అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. దీంతో అధికారు లు స్పందించి బ్యాలెట్ పేపర్లను ఆ గ్రామానికి పంపించారు. అనంతరం ఆ 13 మందిని తిరిగి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. అలాగే సంస్థాన్నారాయణపురం మండలం కంకణాలగూడెం ఎంపీటీసీ స్థానం పరిధిలోని శేరిగూడెంలో 12వ పోలింగ్ కేంద్రానికి జనగామ ఎంపీటీసీ అభ్యర్థుల బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. ఇది గమనించని అధికారులు పోలింగ్ నిర్వహించారు. అప్పటికే 130 ఓట్లు పోలయ్యాయి. కంకణాలగూడెం ఎంపీటీసీ పరిధిలోని కొత్తగూడెంలో 13వ పోలింగ్ కేంద్రానికి కూడా జనగామ ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. ఇక్కడ 6 బ్యాలెట్ పేపర్లు ఉపయోగించగా 2 బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటు వేశారు. నలుగురు ఓటర్లను ఓటు వేయకుండా అక్కడికే ఆపగా ఇద్దరు మాత్రం వాటిపైనే ఓటు వేశారు. అనంతరం ఆ ఇద్దరిని పిలిపించి సరైన బ్యాలెట్ పేప ర్లతో ఓటు వేయించారు. నల్లగొండ జిల్లా దేవరకొం డ మండల పరిధిలోని తెలుగుపల్లిలో కొన్ని బ్యాలెట్ పేపర్లలో కాంగ్రెస్ పార్టీ గుర్తు లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసు కున్న అధికారులు బ్యాలెట్ పత్రాలను మార్పించడంతో సమస్య పరిష్కారమైంది. -
వాట్సాప్లో చక్కర్లు కొడుతున్న బ్యాలెట్ పేపర్
నేలకొండపల్లి : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని ఎంపీటీసీ–3 పరిధిలోని పోలింగ్ బూత్లో ఓ యువకుడు తాను ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ను ఫొటో తీసి వాట్సాప్లో పెట్టిన సంఘటన హల్చల్ చేస్తోంది. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం తాను ఏ పార్టీకి ఓటు వేశాననే బ్యాలెట్ పేపర్ను వాట్సాప్లో పెట్టడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
బ్యాలెట్తో ఎన్నికలు జరిపే ప్రసక్తే లేదు
-
ఓటింగ్ యంత్రాలను రద్దు చేయాలని మాయవతి డిమాండ్
-
మమత చొరవ.. ఏకమైన విపక్షాలు
సాక్షి, న్యూఢిల్లీ: బ్యాలెట్ పేపర్ ఎన్నికల డిమాండ్ ఒక్కసారిగా పుంజుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చొరవతో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. మంగళవారం హస్తినలో ఆమె పలు పార్టీల నేతలతో వరుస చర్చలు జరిపిన విషయం విదితమే. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్లతో ఆమె భేటీ అయి ఈ అంశంపై మంతనాలు సాగించారు. సుమారు 15 జాతీయ పార్టీలు.. ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్లనే వాడాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈసీ ముందు తమ గళాన్ని బలంగా వినిపించేందుకు విపక్షాలు సిద్ధమౌతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, ఎన్సీపీ, ఆర్జేడీ, ఆప్, డీఎంకే, జేడీఎస్, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ ఓటింగ్ను డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు శివసేన కూడా వీరికి జత కలిసినట్లు సమాచారం. (ఈవీఎంలకు వ్యతిరేకంగా ఐక్యత) ఈ మేరకు వచ్చే వారం ఆయా పార్టీ ప్రతినిధులంతా భేటీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ముందు తమ డిమాండ్ ఉంచాలన్న నిర్ణయానికి వచ్చారు. ఉత్తర ప్రదేశ్తోపాటు పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్కు పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో ముందుండి చక్రం తిప్పటం ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని మమతా బెనర్జీ యత్నిస్తున్నట్లు విశ్లేషకుల అంచనా. -
ఈవీఎంలకు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల(ఈవీఎం)కు బదులు బ్యాలెట్ పత్రాలనే ఉపయోగించాలని, లేదంటే అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటు రసీదు వచ్చే ఈవీఎంలను ఉపయోగించాలని ఎన్డీయే ఏతర ప్రతిపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. అవి తమ డిమాండ్ను సాధించేందుకు ఏకమవుతున్నాయి కూడా. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) విజయం సాధించడానికి కారణం ఈవీఎంలను ట్యాంపర్ చేయడమేనని ప్రతిపక్షాలు ఆరోపించడం, పాటిదార్ల ఉద్యమ నాయకుడు హార్ధిక్ పటేల్ దీనిపై పెద్ద ఎత్తున గొడవ చేసిన విషయం తెల్సిందే. ఈ ఏడాది ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మళ్లీ ఈవీఎంల అంశం ముందుకు వచ్చింది. ఈ అంశంపై చర్చించేందుకు సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నాయకుడు జనేశ్వర్ మిశ్రా నివాసంలో జరిగిన సమావేశానికి బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి మినహా అందరు హాజరు కావడం విశేషం. ఈవీఎంలకు వ్యతిరేకంగా మొట్టమొదట ఆందోళన నిర్వహించినదీ మాయావతియేనని, ఈ అంశంపై మున్ముందు జరిగే సమావేశాలకు ఆమె తప్పకుండా హాజరు అవతారని ఆమె పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్దళ్, సీపీఐ, సీపీఎం పార్టీలు హాజరయ్యాయి. దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో దశల వారిగా ఓటుకు రసీదు వచ్చే యంత్రాలను ఉపయోగిస్తామని, అందులో భాగంగా ముందుగా ప్రతి నియోజకవర్గంలో ఐదు శాతం పోలింగ్ కేంద్రాల్లో వీటిని అమలు చేస్తామని ఎన్నికల కమిషన్ ఇదివరకే ప్రకటించింది. అయితే ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక్క పోలింగ్ కేంద్రంలో మాత్రమే అమలు చేయగలిగింది. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పత్రాల అంశం డిమాండ్ ముందుకు వచ్చింది. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ అంశాన్ని సమగ్రంగా చర్చించేందుకు మరో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఎన్డీయే ఏతర ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఫిబ్రవరిలో జరగనున్న త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించినట్లయితే అన్నింటికీ ఓటు రసీదు వచ్చే పద్ధతి ఉండాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. -
719 ఓట్లు.. 727 బ్యాలెట్ పేపర్లు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం–2లోని ది హైదరాబాద్ జింఖానా క్లబ్ ఎన్నికల ఫలితాలు రద్దయ్యాయి. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును సాయంత్రం చేపట్టి ఇంకాసేపట్లో ఫలితాలు వెల్లడిస్తారనంగా ఎన్నికలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో సభ్యులందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అర్హత లేని సభ్యులు ఓట్లు వేశారని ఆందోళన చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొత్తం 719 మంది ఓటర్లు ఉండగా, 727 బ్యాలెట్ పేపర్లు రావడంతో ఎన్నిక వివాదాస్పదమైంది. 11 మంది సభ్యులు బకాయిలు చెల్లించకపోవడంతో ఓటు వేసేందుకు వారిని అనర్హతగా గుర్తించాలని, వారి ఓట్లు ఎలా పడ్డాయంటూ ఓ వర్గం వాదనకు దిగి రద్దు చేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఎన్నికలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా క్లబ్ చైర్మన్ పదవికి గుళ్ళపల్లి భవాని, టీ. శివరాజేంద్ర ప్యానల్స్ పోటీపడ్డాయి. -
ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లే వాడాలి
సిమ్లా: ఎన్నికల్లో ఈవీఎంల వాడటాన్ని నిషేధించాలంటూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ డిమాండ్ చేశారు. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు వాడటాన్ని నిషేధించి, బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని ఆయన బుధవారమిక్కడ అన్నారు. కాగా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీఎంల వాడకంపై వీరభద్ర సింగ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవలి జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే బీజేపీ గెలిచిందంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కూడా బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలకు మొగ్గుచూపుతోంది. బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. -
ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
బ్యాలెట్ పత్రాలు తనిఖీ చేసిన భన్వర్లాల్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ బుధవారం తనిఖీ చేశారు. ఈ నెల 19న జరుగనున్న ఎన్నికల బ్యాలెట్ పత్రాల ముద్రణ 13వ తేదీన పూర్తయింది. అప్పటి నుంచి హైదరాబాద్ చాదర్ఘాట్లోని విక్టరీ ప్లేగ్రౌండ్లో వీటి పరిశీలన, తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం భన్వర్లాల్ వీటిని తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్ధన్రెడ్డి, అడిషనల్ సీఈవో అనూప్సింగ్, రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్లు ఆయన వెంట ఉన్నారు. దాదాపు 20 టేబుళ్లను సందర్శించి భన్వర్లాల్ బ్యాలెట్ పేపర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి బ్యాలెట్ పేపర్పై అభ్యర్థుల ఛాయాచిత్రాలు స్పష్టంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి బ్యాలెట్ పేపర్ను కూలంకషంగా పరిశీలించాలని, ఏవిధమైన పొరపాటు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సమీక్షలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రామకృష్ణారావు, అధికారులు చంద్రయ్య, శశికిరణాచారి, ప్రేమ్రాజ్, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ అధికారులు, డీఆర్వోలు పాల్గొన్నారు. -
పట్టాభికి నోటీసులు
సాక్షి ప్రతినిధి – నెల్లూరు : ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రచారం నిర్వహిస్తున్న తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోటీలోని అభ్యర్థులు పింక్, తెలుపు రంగులో నమూనా బ్యాలెట్ ముద్రించుకోకూడదు. పట్టాభి ఈ నిబంధన ఉల్లంఘించి నమూనా బ్యాలెట్లు ముద్రించారని పీడీఎఫ్ అభ్యర్థుల మద్దతుదారులు రెండు రోజుల కిందట ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన ఎన్నికల అధికారులు ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకున్నారు. ఈ నమూనా బ్యాలెట్లు ఎందుకు ముద్రించారు ? ఎక్కడ, ఎన్ని ముద్రించారు? ఎక్కడెక్కడ పంపిణీ చేశారు? తదితర విషయాలపై రాత పూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలని సహాయ రిటర్నింగ్ అధికారి నోటీసు జారీ చేశారు. ఇదిలా ఉండగా పట్టాభితో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వాసుదేవనాయుడు పేరుతో కూడా పింక్, తెలుపు రంగులో నమూనా బ్యాలెట్ పత్రాలు ముద్రించి ఓటర్లకు పంపిణీ చేస్తున్నారని పీడీఎఫ్ అభ్యర్థుల మద్దతుదారులు ఎన్నికల అధికారులకు మరో ఫిర్యాదు చేశారు. -
‘అడ్వాన్సు’గా మెక్కేశారు
కడప కార్పొరేషన్ అధికారులకు మున్సిపల్ ఎన్నికలు వరంగా మారాయి. ఎన్నికల నిర్వహణపేరుతో అందినకాడికి దోచుకుని కార్పొరేషన్ ను ఖాళీ చేశారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారోననే ఉద్దేశంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే యత్నంలో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. లక్షలకు లక్షలు మింగేసి నింపాదిగా కూర్చున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఖర్చు వివరాలపై సమగ్ర దర్యాప్తు జరిపితే అక్రమార్కుల గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. కడప కార్పొరేషన్, న్యూస్లైన్: మున్సిపల్ ఎన్నికలు కొందరు అధికారులకు వరంగా మారాయి. ఇచ్చేవాడుంటే చచ్చేవాడూ లేచి వస్తాడనే సామెత చందాన మున్సిపల్ ఎన్నికల సమయంలో కొందరు అధికారులు విచ్చలవిడిగా అడ్వాన్సులు తీసుకొని కడప నగరపాలక సంస్థను నిలువునా ముంచారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రూ.35 లక్షలు ఖర్చుచేయమంటే కడప కార్పొరేషన్లో మాత్రం దానికి నాలుగింతలు అంటే రూ. 1.35కోట్లు ఖర్చు చేశారు. దీన్ని బట్టే మన అధికారులు ఎన్నికలను ఎంత ‘కాస్ట్లీ’గా నిర్వహించారో తెలుస్తోంది. కడప నగరపాలక సంస్థ పరిధిలోని 246 పోలింగ్ స్టేషన్లలో టేబుళ్లు ఉన్నాయి, అయినా అధికారులు ఇష్టారాజ్యంగా కొత్త టేబుళ్లు, ర్యాక్లు కొన్నారు. అన్నికేంద్రాలకు విద్యుదీకరణ ఉంది. మంచినీరు, బారికేడ్లు కట్టడానికి ఇంజనీరింగ్ అధికారులు లక్షలకు లక్షలు అడ్వాన్సులు తీసుకొన్నారు. అందరు ఇంజినీర్లకు సమానంగా పోలింగ్ స్టేషన్లు కేటాయించినందున ఇంచుమించు అందరికీ సమానంగా ఖర్చు కావాలి. కానీ కొందరికి లక్ష, రెండు లక్షలే ఖర్చుకాగా మరికొందరికి మాత్రం ఐదారు లక్షలు ఖర్చు అయ్యింది. ఒక చేయి తిరిగిన ఇంజినీరింగ్ అధికారైతే అత్యధికంగా రూ. 6లక్షలు అడ్వాన్సు తీసుకోవడమే గాక ఆఫీసులో కొత్త ఛాంబర్ల ఏర్పాటు, కార్పొరేషన్ గోడలకు, బారికేడ్లకు పెయింటింగ్ల పేరుతో అందినకాడికి వెనకేసుకొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్లో రెండు జిరాక్స్ మిషిన్లు ఉన్నాయి. అదనంగా ఒక పెద్ద జిరాక్స్ మిషిన్ను బాడుగకు తెచ్చారు. ఎన్నికలు జరిగినన్నిరోజులు దీనికి ఇచ్చిన బాడుగతో ఒక కొత్త జిరాక్స్ మిషినే కొనవచ్చు. దీనిప్రకారం కార్పొరేషన్లో మొత్తం మూడు జిరాక్స్ మెషీన్లు ఉండగా కొందరు మాత్రం జిరాక్స్ చేయించినట్లు బిల్లులు పెట్టడం గమనార్హం. ఇంకొందరైతే కంప్యూటర్లకు మరమ్మతులు చేయించామని బిల్లులు చేసుకొన్నట్లు తెలిసింది. ఈవీఎం మిషన్లపై అతికించే సుమారు 500 బ్యాలెట్ పేపర్లను తీసుకురావడానికి కర్నూలుకు వెళ్లేందుకు మిగిలిన కార్పొరేషన్ల అధికారులు రూ. 5 వేల నుంచి 10వేలు తీసుకుపోతే మన కార్పొరేషన్ అధికారులు మాత్రం రూ. 30వేలు తీసుకుపోయినట్లు సమాచారం. ఈ బ్యాలెట్ పేపర్లను ప్రభుత్వమే ఉచితంగా ముద్రించి ఇస్తుంది. ఈ మొత్తమంతా కేవలం ప్రయాణచార్జీలు, బస చేసినందుకే. కోడ్ ఆఫ్ కండక్ట్కు సంబంధించి వాల్రైటింగ్స్ ఉన్న చోట సున్నం కొట్టే పనిని కార్పొరేషన్ సిబ్బందితో చేయించి బిల్లులు మాత్రం లక్షల్లో చేసుకొన్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల సమయంలో నోటిఫికేషన్ వెలువడిన మార్చి 10వ తేదీనుంచి 18వ తేదీ వరకూ 8 నామినేషన్ కేంద్రాలలో ఆర్వోలు, ఏఆర్ఓలు, వారికి సహాయంగా 5 మంది కార్పొరేషన్ సిబ్బందిని నియమించారు. అంటే మొత్తం 40 మంది 8 రోజుల పాటు పనిచేశారు. వీరికి తోడు మరో 60 మంది పనిచేశారనుకొన్నా రోజుకు 100 మంది అవుతారు. వీరికి 8 రోజులకు రూ. 150లతో లెక్కేస్తే రూ. 1.20 లక్షలు. అలాగే పోలింగ్కు ముందురోజు, పోలింగ్రోజు రెండు రోజుల పాటు సుమారు 2వేల మంది చొప్పున విధులు నిర్వహించారు. ఈ లెక్కన రెండు రోజులకు నాలుగు వేలమందికి రూ. 6.00లక్షలు. మొత్తం 7.20 లక్షలు కావాలి. ఎంత దుబారాగా ఖర్చుపెట్టినా భోజనాల ఖర్చు రూ. 30 లక్షలు దాటదు. అయతే కార్పొరేషన్లో రిఫ్రెష్మెంట్స్ కోసం రూ. 44 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. నగరపాలక ఉన్నతాధికారి మంచితనం, ఉదారస్వభావాన్ని ఆధికారులు తమకు అనుకూలంగా మలుచుకొన్నట్లు దీన్నిబట్టి స్పష్టంగా అర్థమవుతోంది. ఈ అవినీతి వ్యవహారంపై చాలామంది సమాచార హక్కు చట్టం ద్వారా కూపీ లాగాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ దుబారా ఖర్చుపై కొత్త పాలకవర్గం కూడా కఠిన చర్యలు తీసుకొనే అవకాశాలు లేకపోలేదు. మున్సిపల్ కమిషనర్ వివరణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన నిధుల దుర్వినియోగంపై కడప కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసును న్యూస్లైన్ వివరణ కోరగా అదంతా అవాస్తవమన్నారు. ఖర్చు చేసిన మొత్తానికి సరిపడే బిల్లులు సిబ్బంది తెచ్చిఇచ్చారన్నారు. ఇది తప్పుడు సమాచారమని ఆయన కొట్టి పారేశారు. కాగా, ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. 20 రోజుల్లో రూ. 44 లక్షలు తిన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పనిచేసిన వారికి ఒక రోజుకు రిఫ్రెష్మెంట్స్ కోసం రూ. 150 వరకూ ఖర్చు చేసే సౌలభ్యం ఉంది. అయితే మనవాళ్లు అంతకు రెట్టింపు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఉదయం ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, మధ్యాహ్నం బిర్యానీ, రాత్రి బిర్యానీలు తెప్పించుకొని కార్పొరేషన్ను కాల్చుకుతిన్నారు. నామినేషన్ల సమయంలో వేళాపాళా లేకుండా తెచ్చిన భోజనం తిని చాలామందికి విరేచనాలు అయ్యాయి. దీంతో చాలామంది అప్పట్లో ఆ భోజనం తినలేదు. పోలింగ్కు ముందురోజు వాటర్ క్యాన్లకు డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందని కనీవినీ ఎరుగని రీతిలో వాటర్ప్యాకెట్లు తెచ్చి పనికానిచ్చారు. -
నడిరోడ్డుపై బ్యాలెట్ పత్రాలు
-
నడిరోడ్డుపై బ్యాలెట్ పత్రాలు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కృష్ణాయపాలెం ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటు వేసిన 15 బ్యాలెట్ పత్రాలు నడిరోడ్డుపై దర్శనమిచ్చాయి. ఇక్కడ ఎంపీటీసీ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాపాక వీరవెంకటకృష్ణ, టీడీపీ తరఫున మిరియాల చినవెంకట్రావు పోటీపడగా, టీడీపీ అభ్యర్థి వెంకట్రావు 5 ఓట్ల తేడాతో విజయం సాధించినట్టు ప్రకటించారు. పోలైన ఓట్లలో 24 చెల్లలేదని పేర్కొన్నారు. అయితే, కృష్ణాయపాలెం ఎంపీటీసీ స్థానం పరిధిలోని రామన్నపాలెంలో గురువారం ఉదయం 15 బ్యాలెట్ పత్రాలు రోడ్డుపై పడివున్నాయి. వీటిని గ్రామానికి చెందిన మూగ వ్యక్తి ఏరుకుని వెళ్తుండగా వైఎస్సార్సీపీ అభ్యర్థి తరఫు వ్యక్తులు చూసి అవాక్కయ్యారు. పరిశీలించగా ఆ 15 బ్యాలెట్ పత్రాలపై ఓటు ముద్రవేసి ఉంది. వీటిని వైఎస్సార్సీపీ అభ్యర్థి ఏలూరు తీసుకువెళ్లి కలెక్టర్కు అందజేశారు. ఈ వ్యవహారంపై విచార ణ జరిపి న్యాయం చేయాలని అభ్యర్థి వెంకటకృష్ణ కలెక్టర్ను కోరారు. -
బ్యాలెట్ పేపర్లకు చెదలు
మూడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ తడిసినా లెక్కకు వచ్చిన బ్యాలెట్లు నెల్లూరు/కాకినాడ: మండల, జెడ్పీ ఎన్నికల్లో కొన్నిచోట్ల బ్యాలెట్ పత్రాలు తడిసిపోగా కొన్నిచోట్ల చెదలుపట్టాయి. దీంతో మూడు కేంద్రాల్లో రీపోలింగ్కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. తడిసిన బ్యాలెట్లను ఆరబెట్టి లెక్కేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని మూడు పోలింగ్ స్టేషన్లలోని మూడు బాక్స్ల్లో బ్యాలెట్లకు చెదలుపట్టింది. అక్కడ ఈనెల 18న రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలంలోని ఇసుకదామెర్ల, మన్నెం వారిపల్లె, తొట్టిపల్లి పోలింగ్ కేంద్రాల్లోని బాక్సుల్ని కావలి జేబీ డిగ్రీ కళాశాల లెక్కింపు కేంద్రంలో భద్రపరిచారు. మంగళవారం ఓట్ల లెక్కింపునకు ఈ బాక్సులు తెరవటంతో చెదలు బయటపడింది. బాక్సుల్లోని బ్యాలెట్లను బయటకు తీసి చెదలు తొలగించి వాటిని సరిచేసే ప్రయత్నం చేశారు. ఇందులో చాలా బ్యాలెట్లు లెక్కింపునకు పనికిరాకుండా పోవడంతో రీపోలింగ్ నిర్వహించాలని అభ్యర్థులు పట్టుబట్టారు. దీనిపై కలెక్టర్ నివేదిక మేరకు ఈ మూడు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ బాక్సుల్లో 1,516 బ్యాలెట్లు ఉండటంతో ఈ మండలం నుంచి జెడ్పీటీసీ స్థానానికి పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎవరికైనా 1,516 ఓట్ల కంటే ఎక్కువ మెజారిటీ వస్తే మాత్రం ఇక్కడ జెడ్పీటీసీ స్థానానికి రీపోలింగ్ జరపాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతకంటే తక్కువ మెజారిటీతో ఏ అభ్యర్థి అయినా గెలుపొందితే ఈ మూడు బూత్ల పరిధిలో జెడ్పీటీసీ స్థానానికి కూడా రీపోలింగ్ నిర్వహించాలని సూచించింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వీఎస్ లక్ష్మి కళాశాల కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్రూమ్లో భద్రపరిచిన పెదపూడి మండలం గొల్లలమామిడాడ-1, 2, 4 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఏడు బ్యాలెట్ బాక్సులు, పెద్దాడ గ్రామానికి చెందిన మూడు బాక్సుల్లోకి నీళ్లు చేరడంతో బ్యాలెట్ పత్రాలు తడిసిపోయాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన బ్యాలట్ పత్రాలు ఒకదానికొకటి అంటుకుపోయా యి. చిరిగిపోకుండా వీటిని విడదీయడానికి సిబ్బంది ఇబ్బంది పడ్డారు. అధికారులు మార్కెట్ నుంచి డ్రయ్యర్స్ తెప్పించి ఆరబెట్టి బ్యాలట్ పత్రాలను విడదీశారు. వాటిపై ఓటర్లు వే సిన స్వస్తిక్ ఓటు ముద్రలను అభ్యర్థులకు చూపించారు. అన్నీ సవ్యంగా ఉండడంతో వారు లెక్కింపునకు అంగీకరించారు. రామచంద్రపురం వీఎస్ఎం కళాశాలలోని స్ట్రాంగ్రూమ్లో భద్రపర్చిన కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి 41/9 బ్యాలెట్ బాక్స్లో 535 బ్యాలెట్ పత్రాలు తడిసిపోయాయి. వీటిని కూడా ఆరబెట్టిన అనంతరం లెక్కించారు. -
బ్యాలెట్ పత్రాలకు చెదలు
నెల్లూరు జిల్లా కావలిలో ఓ కళాశాలలో ఉంచిన కొండాపురం మండలం బ్యాలెట్ బాక్స్లకు చెదలు పట్టాయి. మంగళవారం ఓట్లు లెక్కింపు సందర్బంగా బ్యాలెట్ బాక్స్లను ఏజెంట్లు బయటకు తీశారు. అందులోని బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టి చిరిగిపోయి ఉన్నాయి. బ్యాలెట్ పత్రాలు చిరిగిపోయిఉండటంపై ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని ఏజెంట్లు ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్డీవో బ్యాలెట్ బాక్స్లు, పత్రాలను పరిశీలించి జిల్లా కలెక్టర్ పరిస్థితి వివరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు దీనిపై రిటర్నింగ్ అధికారి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
పోస్టల్ బ్యాలెట్లపై రగడ
అద్దంకి, న్యూస్లైన్: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విషయంలో తలెత్తిన వివాదం శనివారం ఉపాధ్యాయుల ధర్నాకు దారితీసింది. అధికారులు రోజుకో మాట మార్చడంతో సుమారు 300 పోస్టల్ ఓట్లు మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు ఏ మండలంవారు ఆ మండలంలోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయాలని అధికారులు తొలుత సూచించారు. దీంతో సుమారు 1000 వరకూ ఆయా మండలాల్లో పోలయ్యాయి. ఇంకా 300 పోస్టల్ ఓట్లు పోలవ్వాల్సి ఉన్నాయి. వీటిని అద్దంకిలోనే వేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఉపాధ్యాయులు ఓట్లు వేసేందుకు శుక్రవారం అద్దంకి రాగా వారికి చేదు అనుభవం ఎదురైంది. బ్యాలెట్ ఓట్లు చేతికి ఇవ్వమని, పోస్టులో పంపిస్తామని అధికారులు సెలవిచ్చారు. దీంతో ఖంగుతిన్న ఉపాధ్యాయులు తహసీల్దార్ జీ సుజాత దృష్టికి తీసుకెళ్లగా శనివారం ఉదయం వస్తే బ్యాలెట్ పేపర్లు చేతికిస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం శనివారం ఉపాధ్యాయులు కార్యాలయానికి వెళ్లగా అక్కడ అధికారులు కనిపించలేదు. ఉన్నతాధికారులకు ఫోన్ చేయగా బ్యాలెట్ పేపర్లు పోస్టులోనే పంపుతామ ని సెలవిచ్చారు. దీంతో ఆగ్రహించిన ఉ పాధ్యాయులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ వీవీ రమణకుమార్, ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు అక్కడకు చేరుకుని ఉపాధ్యాయులతో మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ సుజాతతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. ఆర్వో ఆదేశాలు అలానే ఉన్నాయని ఆమె తెలిపారు. దీంతో శని, ఆదివారాలు సెలవులు కావడంతో పోస్టల్ బ్యాలెట్లు అందే అవకాశం లేదని, అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఓట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఓట్లు చెల్లకుండా పోతే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని చెప్పి ఉపాధ్యాయులు వెనుదిరిగారు. గంగాధర్, బాబూరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ల వైపు చూపు
ఉద్యోగుల ఓట్లు పొందడానికి అభ్యర్థుల పాట్లు విజయనగరం అర్బన్, న్యూస్లైన్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థుల చూపు పోస్టల్ బ్యాలెట్లు పొందిన ఉద్యోగస్తులపై పడింది. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ నువ్వా, నేనా అన్నట్టుగా ఎన్నికలు జరగడంతో ప్రతి ఓటూ కీలకమైంది. దీంతో ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఓట్లు పొందడానికి అభ్యర్థు లు ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో సుమారు 20 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులున్నారు. వీరిలో ఎన్నికల విధులు నిర్వహించే సుమారు 16 వేల మంది పోస్టల్ బ్యాలెట్లు పొందారు. ఇప్పటికే వీరి ఇళ్లకు పోస్టు ద్వారా బ్యాలెట్ పత్రాలు చేరాయి. దీంతో అభ్యర్థులు ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఇళ్ల చిరునామాలు, ఫోన్ నంబర్లు సేకరించి ఫోన్ చేసి మరీ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. సామాజిక కులాలు, బంధుత్వాల పేరుతో భోజనాలు పెడుతూ ఒక్కో ఓటుకు *500 నుంచి వెయ్యి రూపాయల వరకు ఇస్తున్నట్లు భోగట్టా. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘ నాయకులను మచ్చిక చేసుకుంటున్నారు. ఈ నెల 16వ తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండడంతో ఉపాధ్యాయులు, ఉద్యోగుల చుట్టూ అభ్యర్థులు, మద్దతుదారులు చక్కర్లు కొడుతున్నారు. -
తారుమారు
హైదరాబాద్ లోక్సభ ఈవీఎంలలో మల్కాజిగిరి బ్యాలెట్ పత్రాలు ఎన్నికల అధికారి పరిశీలనలో వెల్లడి విచారణకు ఆదేశం అర్ధరాత్రి వరకు ఈవీఎంల పునఃపరిశీలన సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. వివిధ లోక్సభ నియోజకవర్గాల కోసం ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించిన బ్యాలెట్ పత్రాలు (ఈవీఎంలలో అమర్చేవి) ఈవీఎంలలోకి వచ్చేసరికి మారిపోయాయి. బుధవారం మాసబ్ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర ్వహించిన ఈవీఎం ర్యాండమైజేషన్ కార్యక్రమంలో ఒక ఈవీఎంను పరిశీలించిన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్కుమార్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. హైదరాబాద్ లోక్సభ అభ్యర్థుల జాబితాతో ఉండాల్సిన బ్యాలెట్ పత్రం స్థానంలో మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థుల పేర్లతో కూడిన బ్యాలెట్ పత్రం ఉండటమే ఇందుకు కారణం. హైదరాబాద్ లోక్సభ పరిధిలోని బహదూర్ఫుర అసెంబ్లీ నియోజకవర్గంలో వినియోగించాల్సిన దాదాపు 21 ఈవీఎంలలో ఇదే పరిస్థితి. మల్కాజిగిరి లోక్సభకు సంబంధించిన సుమారు 1000 బ్యాలెట్ పత్రాలు హైదరాబాద్ లోక్సభకు వచ్చాయని తెలిసింది. షాక్ నుంచి తేరుకున ్న ఎన్నికల అధికారి సోమేశ్కుమార్ జరిగిన సంఘటనపై విచారణకు ఆదేశించారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ పనులకు ఇన్చార్జిగా ఉన్న స్పెషల్ కమిషనర్ రాహుల్ బొజ్జాపై సీరియస్ అయ్యారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ఇదిలా ఉంటే.. బ్యాలెట్ పత్రాలను కనీసం పరిశీలించకుండా ఈవీఎంలలో అమర్చిన బహదూర్పుర అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మాసుమ బేగంపై హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముఖేష్కుమార్ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీసీఎల్ఏ, యూఎల్సీ నుంచి 26మంది డిప్యూటీ కలెక్టర్లను పిలిపించి అన్ని లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను తనిఖీ చేయిం చారు. ఆయా పోలింగ్ స్టేషన్లకు సంబంధించి బ్యాలెట్ యూనిట్ నెంబరు, కంట్రోల్ యూనిట్ నెంబరు సరిపోలుతున్నాయా.. లేదా?, ఈవీఎంలలో అమర్చిన బ్యాలెట్ పత్రం అదే అసెంబ్లీ/లోక్సభ నియోజకవర్గానిదా.. కాదా?, ఈవీఎంలకు తగిలించిన ట్యాగ్లలో పోలింగ్ స్టేషన్ అడ్రస్ సరిగా ఉందా..లేదా?..తదితర అం శాలను క్షుణ్ణంగా పరిశీలించాలని డిప్యూటీ కలె క్టర్లను ఆదేశించారు. అర్ధరాత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగినట్లు సమాచారం. -
ముగిసిన పరిషత్ పోరు
సాక్షి, ఖమ్మం: జిల్లాలో పరిషత్ పోరు ముగిసింది. తొలి విడతలో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకోగా...శుక్రవారం నాడు ఖమ్మం డివిజన్లో మలివిడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అభ్యర్థుల గుర్తులు తారుమారు, పోల్ స్లిప్పులు లేకపోవడం, సమస్యలు పరిష్కరించలేదని ఓటింగ్కు దూరం, ఓటర్లను ప్రలోభ పరిచే చర్యలకు పోలీసుల బ్రేకులు... ఇలా మలివిడతలో కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. మొత్తం రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు సజావుగా జరగడంలో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. శుక్రవారం ఉదయం 7 గంటలకే ఖమ్మంరూరల్, నేలకొండపల్లి, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు తరలివచ్చారు. బ్యాలెట్ పత్రం కావడంతో ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరిగింది. మండుటెండలోనూ ఓటర్లు క్యూలోనిల్చొని ఓటు వేశారు. ఉష్ణతాపం తాళలేక పోలింగ్ కేంద్రాల్లో కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. మధ్యాహ్నం 2 గంటలకే అన్ని కేంద్రాలలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. తల్లాడ మండలం కలకొడిమ ఎంపీటీసీ బ్యాలెట్పత్రాల స్థానంలో వెంగన్నపేట ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలు రావటంతో పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. అప్పటికే 11 మంది వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 12వ వ్యక్తి ఓటు వేయడానికి వెళ్లి బ్యాలెట్ పత్రాన్ని గమనించడంతో పోలింగ్ను నిలిపివేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరిగి పోలింగ్ ప్రారంభమైంది. పెనుబల్లి మండలం లంకపల్లి ఎస్సీ కాలనీలో బైండోవర్ కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ 20 కుటుంబాల ఓటర్లు పోలింగ్ను బహిష్కరించగా... సత్తుపల్లి డీఎస్పీ అశోక్కుమార్ వారికి సర్దిచెప్పటంతో చివరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సత్తుపల్లి మండలం కిష్టారంలో నలుగురు, తుంబూరులో ఒకరు క్యూలో గంటల తరబడి నిల్చొని సొమ్మసిల్లి పడిపోవటంతో పీ హెచ్సీ సిబ్బంది వైద్య సహాయం అందించారు. రఘునాథపాలెం మండలంలోని రాంక్యాతండా పంచాయతీ పరిధిలో ఉన్న తండాలన్నింటికీ కలిపి రాంక్యాతండా పాఠశాలలోనే నాలుగు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఒకేసారి ఓటర్లు అంతా పాఠశాలకు చేరుకోవడంతో ఆవరణ మొత్తం ఓటర్లతో నిండిపోయింది. దీంతో ఉదయం 8 గంటలకే భారీగా క్యూ కట్టారు. ఎండవేడిమికి తాళలేక ఇబ్బంది పడ్డారు. తండాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పినా అధికారులు వినలేదని ఓటర్లు అగ్రహం వ్యక్తంచేశారు. క్యూ విషయంలో అక్కడ ఓటర్లు, పోలీసులకు మధ్య ఘర్షణ జరగడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచుకొండ పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాలు రాత్రి డబ్బులు పంచారంటూ పోలింగ్కేంద్రం సమీపంలో ఘర్షణపడ్డారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పోలింగ్కేంద్రానికి దూరంగా పంపించారు. వైరా మండలం గొల్లపుడి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఏజెంట్పై టీడీపీ నాయకుడు దాడి చేశాడు. దీంతో ఇరువర్గాల మధ్య కొంతసేపు ఘర్షణ జరిగింది. పోల్ స్లిప్పులు లేకపోవడంతో వైరాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్లలో అర్దగంట సేపు పోలింగ్ నిలిచిపోయింది. కొణిజర్ల మండలం కొండవనమాల, కాచారం గ్రామాల్లో పోలింగ్ సుమారు గంట సేపు నిలిచి పోయింది. రెండు గ్రామాల్లో ఓటర్ల జాబితా తారుమారు కావడంతో ఓటర్లు తికమక పడ్డారు. కొండవనమాల ఓటర్లు కాచారానికి, కాచారం ఓటర్లు కొండవనమాలకు జాబితా మారింది. అధికారులు గుర్తించి సరిచేసే సరికి గంట సేపు పోలింగ్ నిలిచిపోయింది. ఎర్రుపాలెం మండలం గట్టగౌరారం, సత్యనారాయణపురం గ్రామాల్లో ఓటర్ల జాబితా తారుమారు కావడంతో అర్దగంట పాటు పోలింగ్ నిలిచిపోయింది. బోనకల్ మండలం కలకోటలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పైడిపల్లి మురళి పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో ఆయనను అరెస్టు చేశారు. లక్ష్మీపురం గ్రామంలో ఏఎంసీ వైఎస్ చైర్మన్ మైనేని నారాయణ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో ఓటర్లకు సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ నేతలు అల్పాహారం పెడుతున్నారని అక్కడ ఉన్న ఆటోను సీజ్ చేశారు. కాకరవాయిలో ఎక్కువ మంది ఓటర్లు ఉండడంతో రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఖమ్మంరూరల్ మండలం మంగళగూడెంలో తమ సమస్యలను పరిష్కరించలేదని బీసీ కాలనీకి చెందిన 20 మంది ఓటర్లు ఓటును బహిష్కరించారు. -
ఆందోళనకు దిగిన ఓటర్లు
వెల్దుర్తి, న్యూస్లైన్: అధికారుల నిర్లక్ష్యంతో బ్యాలెట్ పేపర్లు తప్పల తడకగా మారాయి. విషయాన్ని గమనించిన ఓటర్లు ఆందోళనకు దిగడంతో కాసేపు పోలింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో ఎంపీటీసీ పో లింగ్ను వాయిదా వేసి జెడ్పీటీసీ పోలిం గ్ను నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే..వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని చర్లపల్లి గ్రామంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్స్టేషన్ నం.6లో వెల్దుర్తి-2 ఎంపీటీసీ ఎన్నికలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఎంపీటీసీ బ్యాలెట్ రెండో బండిల్లోని సీరియల్ నం. 2051 నుండి 2100 వరకు ఉన్న 50 బ్యాలెట్ పేపర్లుండగా 2051 నుండి 2065 వరకు వెల్దుర్తి ఎంపీటీసీ-2 నమూన బ్యాలెట్ సరిగానే అచ్చు అయ్యాయి. అయితే 2066 నుండి 2100 వరకు ఉన్న బ్యాలెట్ పేపర్లలో వెల్దుర్తి ఎంపీటీసీ-1 నమూన బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. 44 బ్యాలెట్ పత్రాల్లో గుర్తులు, పేర్లు తప్పుగా ప్రచురితమయ్యాయి. దీనిని ఓటర్లు గమనిం చి అందోళన చేపట్టారు. అప్పటికే ఈ బెండిల్లో 29 ఓట్లు పోలయ్యాయి. విష యం తెలిసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుభాషిణి పోలింగ్ కేంద్రానికి చేరుకొని బ్యాలెట్ పేపర్లను పరిశీలించారు. ఉదయం 8 గంటల నుండి 9.30 గంటల వరకు పోలింగ్ నిలిపివేశారు. దీంతో ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద పడిగాపులుకాశారు. ఎన్నికల అధికారులకు, కలెక్టర్కు అధికారిణి సుభాషిణి విషయాన్ని ఫోన్ ద్వారా వివరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 9.30 గంటలకు కేవలం జెడ్పీటీసీ ఎన్నికలను మత్రమే ప్రారంభించి ఎంపీటీసీ పోలింగ్ను నిలిపివేశారు. త్వరలో రీపోలింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. సిబ్బంది నిర్లక్ష ్యంతోనే రీపోలింగ్: జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం స్థానిక ఎన్నికల అధికారులు, పీఓలు, ఏపీఓల నిర్లక్ష్యమే రీపోలింగ్కు దారి తీసిందని జిల్లా పరిషత్ సీఈఓ ఆశీర్వాదం పేర్కొన్నారు. పోలింగ్ నిలిచిపోయిన విషయం తెలుసుకున్న జడ్పీ సీఈఓ ఆశీర్వాదం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి బ్యాలెట్ పత్రాలను పరిశీలించారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు ఆదివారం రీపోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. -
మలి విడతలోనూ భారీ పోలింగ్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మలి విడత ప్రాదేశిక పోరులోనూ భారీగా పోలింగ్ జరిగింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 81.73 శాతం పోలింగ్ నమోదైంది. కాగా రెండో విడత బ్యాలెట్ పత్రాల ముద్రణలోనూ పొరపాటు దొర్లింది. వెల్దుర్తి మండలం చెర్లపల్లి గ్రామంలో ఎంపీటీసీ-2 బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల పేర్లను తప్పుగా ముద్రించారు. 30 ఓట్లు పడిన తర్వాత గుర్తించిన అధికారులు పోలింగ్ను నిలిపివేశారు. ఈ నెల 13న రీపోలింగ్కు ఎన్నికల కమిషన్ ఆదేశించారు. తొలి విడత ఎన్నికల్లోనూ సంగారెడ్డి మండలం కాశీపురంలో ఇదే తరహా పొరపాటు దొర్లగా శుక్రవారం ఇక్కడ రీపోలింగ్ నిర్వహించారు. పై రెండు సంఘటనలకు బాధ్యులను చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి స్మితా సబర్వాల్ చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఎండ తీవ్రతతో మహిళలు, వృద్ధులు ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల గంటల తరబడి ఎండలో నిలబడి ఓట్లు వేయాల్సి రావడంతో కొందరు కళ్లు తిరిగిపడిపోయారు. వర్గల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే నర్సారెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితి నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. చెర్లగూడెం ఎంపీటీసి పరిధిలోని కాశీపూర్ గ్రామంలో 43 బూత్లో రీపోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తొలి విడతలో ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలపై పేర్లు తప్పుగా ముద్రించడంతో ఇక్కడ రీపోలింగ్ నిర్వహించారు. నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, వర్గల్, మలుగు మండలాల్లో శుక్రవారం స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. వర్గల్ మండలం గౌరారం గ్రామంలోని రెండు పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ స్లిప్లు ఓటరు జాబితాతో పొంతన లేకపోవడం వల్ల వాటిని సరిచేసేసరికి చాలా సమయం పట్టింది. ఫలితంగా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. వర్గల్లో పోలింగ్ సందర్భంగా ఎమ్మెల్యే నర్సారెడ్డి, టీడీపీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ప్రచారంలో భాగంగా ‘నన్ను కించపరిచే విధంగా మాట్లాడతావా?’ అంటూ ఎమ్మెల్యే.. శ్రీనివాస్రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి నువ్వెంత? అంటే నువ్వెంత? అంటూ పరస్పరం ధూషణకు దిగారు. ఫలితంగా ఇరు పార్టీల నాయకులు పోగై ఘర్షణ తలెత్తే వాతావరణం నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. తూప్రాన్ మండలం రంగాయపల్లి గ్రామంలో గీత దాటి వెళ్లి టీఆర్ఎస్, టీడీపీ నాయకులు ప్రచారం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు చెదగొట్టారు. నర్సాపూర్ మండలంలోని పెద్దచింతకుంట గ్రామంలో ఓటు వేయడానికి వచ్చిన నాగభూషణం అనే వ్యక్తిపై ఓ కానిస్టేబుల్ చేయి చేసుకోవడమే కాక, పోలీసు స్టేషన్కు తీసుకొని వెళ్లారు. పోలీసుల తీరుపై గ్రామస్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆయన్ను విడిచి పెట్టేవరకు పోలింగ్ జరపవద్దని పట్టుబట్టారు. చివరకు పోలీసులు దిగొచ్చి నాగభూషణంను వదిలేశారు. హత్నూర మండలంలోని నాగారం, బోర్పట్ల గ్రామాలతో పాటు కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామంలో పోలింగ్ సమయం ముగిసినప్పటికీ ఓటర్లు ఇంకా బారులు తీరి ఉన్నారు. వారికి టోకె న్లు ఇచ్చి సుమారు 6 గంటల వరకు ఓటింగ్కు అనుమతించారు. పోలింగ్ బూత్ లేదనే కారణంతో కామారం తండా గిరిజనులు కామారం వచ్చి ఓటేయడానికి నిరాకరించారు. దీంతో నాయకులు, అధికారులు వారిని బుజ్జగించి ఓట్లు వేయించారు. చిన్నశంకరంపేట పోలింగ్ కేంద్రంలో పరిధిలో ఉన్న మెడికల్ షాపును అధికారులు మూసివేయించడంతో ప్రజలు మందుల కోసం ఇబ్బందులు పడ్డారు. చందంపేట, సూరారం, ఖాజాపూర్ గ్రామాల్లో 200లకు పైచిలుకు ఓట్లు గల్లంతు కావడంతో ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ మండలంలోని అనంతసాగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు వచ్చిన గిరిజన మహిళ జెమిని బాయి సొమ్మసిల్లి పడిపోగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఓటు హక్కు వినియోగించుకున్న శతాధిక వృద్ధురాలు పుల్కల్: మండలంలో శుక్రవారం జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఓ వృద్ధురాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుల్కల్ మండల కేంద్రానికి చెందిన బచ్చమొల్ల నింగమ్మ 101 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆమె కొడుకు బచ్చం మాణిక్యం ఇదే గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున భరిలో ఉన్నారు. -
పోలింగుకు రెడీ
నేడు రెండో విడత ‘స్థానిక’ సమరం పూర్తికానున్న ఎన్నికలు 29 జెడ్పీటీసీ స్థానాలకు 153 మంది, 470 ఎంపీటీసీ స్థానాలకు 1779 మంది బరిలో ఎన్నికల విధులకు 8227 మంది సిబ్బంది 317 సమస్యాత్మక గ్రామాలు గుర్తింపు జెడ్పీసెంటర్, న్యూస్లైన్: రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలు శుక్రవారం జరుగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఈ విడతలో మొత్తం 8,227 సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. దీంతో జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగియనున్నాయి. ఈ నెల 6వతేదీన మొదటి విడత ముగిసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సిబ్బంది లాంటి సౌకర్యాలను అధికారులు గురువారం రాత్రి సమకూర్చారు. ఒక్కో పోలింగ్ స్టేషన్కు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ముగ్గురు పోలింగ్ క్లర్క్స్ ఉంటారు. 1932 మంది బరిలో... రెండో విడతలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు మొత్తం 1932 మంది బరిలో ఉన్నారు. ఇందులో 29 జెడ్పీటీసీ స్థానాలకు 153 మంది, 470 ఎంపీటీసీ స్థానాలకు 1779 మంది బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈనెల 11వ తేదిన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 11,31,903 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు... రెండో విడతలో 11,31,903 మంది తమ ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. ఇందులో 5,64,080 పురుష ఓటర్లు, 5,67,750 మహిళ ఓటర్లు, 73 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల ఎంపిక... రెండు విడుతలకు మొత్తం 1577 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. మొత్తం 173 కేంద్రాల్లో 1577 పీఎస్లు ఉంటాయి. జిల్లాలో తొలి, మలి విడతలకు కలిపి 3,020 పీఎస్లను ఉన్నాయి. ఇందులో 1577 ప్రిసైడింగ్ ఆఫీసర్లకు తోడుగా ప్రతీ మండలానికి అవసరాన్ని బట్టి 5, 6 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లను అదనంగా నియమించారు. రెండో విడతకు 1577 మంది పీఓలు, 1577 మంది ఏపీఓలు, 4,725 మందిని పోలింగ్ క్లర్క్స్ ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. కేంద్రాలు ఎంపిక... ఈ విడతలో మొత్తం 29 మండలాల్లో జరుగుతాయి. మహబూబ్నగర్, నారాయణపేట్ డివిజన్లలో ఎన్నికలు జరుగనున్నాయి. మహబూబ్నగర్ డివిజన్లోని మండలాలు అడ్డాకుల, ఫరూక్నగర్, బాల్నగర్, భూత్పూర్, హన్వాడ, జడ్చర్ల, నారాయణపేట మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్కాలేజీలో భద్ర పరుస్తారు. కోయిల్కొండ, కొందుర్గు, కొత్తూరు, మహబూబ్నగర్ మండలాలకు చెందిన బాక్సులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్కాలేజీలో, మిడ్జిల్ మండలానికి చెందిన బాక్సులను సీబీఎం కాలేజి కల్వకుర్తిలో భద్ర పరుస్తారు. నారాయణపేట డివిజన్లోని మండలాలు ఆత్మకూరు, బొంరాస్పేట్, సీసికుంట, దామరగిద్ద, దేవరకద్ర, ధన్వాడ, దౌల్తాబాద్, కోయిలకొండ,కోసిగి. మద్దూర్, మాగనూర్, మక్తల్, నారాయణపేట, నర్వ, ఊట్కూర్ మండలాల కు చెందిన పెట్టెలను శ్రీదత్త బీఈడీ కాలేజీ నారాయణపేట్లో, కొత్తకోటకు చెందిన బాక్సులు వనపర్తి కేడీఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో భద్ర పరుస్తారు. సమస్యాత్మక గ్రామాలు గుర్తింపు... ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికలకు ఆటకం కల్గించే గ్రామాలను ఇప్పటికే గుర్తించారు. ఇలా గుర్తించిన లిస్టును పోలీస్ శాఖకు అందజేశారు. సమస్యాత్మ గ్రామాలతో పాటు పోలింగ్ స్టేషన్లను కూడా గుర్తించారు.జిల్లాలో మొత్తం 317 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. ఇందులో 217 సమస్యాత్మక గ్రామాల్లో 217 మంది మైక్రో అబ్జర్వర్లు నిరంతం పర్యవేక్షించనున్నారు. వంద పీఎస్లలో వెబ్కాస్టింగ్ ద్వారా నిరంతరం ఇంజనీరింగ్ విద్యార్థులు పర్యవేక్షిస్తారు. రెండో విడుత జరిగే ఎన్నికలల్లో దామరగిద్ద, కేశంపేట మండలాల్లో అత్యధికంగా 20 గ్రామాలను గుర్తించారు. తర్వాత నవాబ్పేట్ మండలంలో 18 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. అత్యల్పంగా దౌలతబాద్లో 3 గ్రామాలను గుర్తించారు. బ్యాలెట్ బాక్సులు రెడీ... ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతుండడంతో బ్యాలెట్ బ్యాక్స్ల అవసరం పడింది. గత సంవత్సరం సర్పంచ్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించారు. 1577 పీఎస్లకు గాను 3154 బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే సరఫరా చేశారు. వీటికి అదనంగా మరో 10 శాతం బాక్సులను అందుబాటులో ఉంచారు. తాయిలాలతో అభ్యర్థులు... ఓటింగ్ కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠత నెలకొంది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవటానికి అభ్యర్థులు రంగంలోనికి దిగారు. మద్యం బాటిళ్లు, డబ్బు సంచులతో మోహరించారని సమాచారం. ఇప్పటికే అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా కుల దేవతల ఆలయాల నిర్మాణాలు, శశ్మాన వాటికలు ఏర్పాటు వంటిపై పలు గ్రామాల్లో ఓటర్లుకు హామీలు ఇవ్వడంతోపాటు ఆయ్యే తాయిలాలు లెక్కించి అడ్వాన్సులు ముట్టచెప్పినట్లు ప్రచారంలో ఉంది. ఓటుకు రూ. 300 వందల నుంచి రూ.అయిదు వందల వరకు పంపిణీ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. -
తొలిపోరు ప్రశాంతం
నెల్లూరు(టౌన్), న్యూస్లైన్: స్పల్ప ఘటనలు మినహా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తొలివిడత పోలింగ్ జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 258 ఎంపీటీసీ, 21 జెడ్పీటీసీలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమేణా 11 గంటలకు ఊపందుకుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా లెక్క చేయక పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులుదీరారు. మధ్యాహ్నం తర్వాత కొంత నెమ్మదిగా సాగినా సాయంత్రానికి 77.88గా నమోదయింది. నార్త్రాజుపాళెం, బుచ్చిరెడ్డిపాళెం, విడవలూరు, కోవూరు, వింజమూరు తదితర మేజర్ పంచాయతీల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులుదీరి కనిపించారు. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, బోగోలు మండలం కోవూరుపల్లిలో 5 గంటల తర్వాత కూడా ఓటర్లు క్యూలో ఉండడంతో వారిని అనుమతించారు. ఈ క్రమంలో పోలింగ్ 6 గంటల వరకు కొనసాగింది. మొత్తంగా 7,04,671 మంది ఓటర్లకు గాను 5,50,660 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ వేశారు. అత్యధికంగా కావలి మండలంలో 88.34 శాతం పోలింగ్ నమోదుకాగా, అత్యల్పంగా వరికుంటపాడులో 60.46 శాతంగా నమోదయింది. చెదురుమదురు ఘటనలు అల్లూరు మండలంలోని మత్స్య కారగ్రామాలు, ఉదయగిరి, మర్రిపాడు మండలాల్లో కొన్నిచోట్ల స్వల్ప ఘర్షణలు చోటుచేసుకోగా పోలీసులు చెదరగొట్టారు. కొడవలూరు మండలం యల్లాయపాళెంలో ఎస్సై వెంకటరమణ, ఓటర్లకు మధ్య వివాదం చెలరేగింది. ఓటర్లతో ఎస్సై దురుసుగా వ్యవహరించడంతో సమస్య జటిలమైంది. సీఐ గంగావెంకటేశ్వర్లు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దారు. జలదంకి మండలం చామదలలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య వివాదం చోటుచేసుకోవడంతో గంటసేపు పోలింగ్ ఆగింది. అక్కడ విధుల్లో ఉన్న డీఎస్పీ చౌడేశ్వరి ఇరువర్గాల వారికి నచ్చజెప్పి పోలింగ్ను కొనసాగేలా చూశారు. అనంతసాగరం మండలం లింగంగుంటలో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. ఏఎస్పేట మండలం కావలి యడవల్లిలో టీడీపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. కోవూరులో తారుమారైన గుర్తు కోవూరు-1 సెగ్మెంట్లో ఇండిపెండెంట్ అభ్యర్థి ముసలి విజయకుమారికి అధికారులు నీటి కుళాయి గుర్తును కేటాయించారు. బ్యాలెట్ పేపర్లో మాత్రం చేతిపంపును ముద్రించడంతో ఆమె అభ్యంతరం తెలిపారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కలెక్టర్ శ్రీకాంత్ ఎన్నికల కమిషనర్కు సమాచారం అందించారు. వారి సూచన మేరకు ఈ సెగ్మెంట్లో 11వ తేదీన రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. బ్యాలెట్ పేపర్ల గల్లంతు బోగోలులోని 28వ నంబర్ బూత్లో 100 బ్యాలెట్ పేపర్లు గల్లంతయ్యాయి. వీటిని ఓ పార్టీ కార్యకర్తలు తస్కరించారని ప్రచారం జరిగింది. అయితే అధికారులు పోలింగ్ను కొనసాగించడంపై ఏజెంట్లు, కొందరు ఓటర్లు అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన రీపోలింగ్ నిర్వహిస్తామని జెడ్పీ సీఈఓ జితేంద్ర తెలిపారు. మొత్తం మీద పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. -
నేడు ‘తొలి’ పోలింగ్
గ్రామాలకు తరలివెళ్లిన పోలింగ్ సిబ్బంది ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ 1,315 పోలింగ్ కేంద్రాలు.. 3,967 బ్యాలెట్ బాక్సులు 22 మండలాల్లో 10,72,793 మంది ఓటర్లు అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 13 6,802 మందితో భారీ పోలీస్ బందోబస్తు ఏలూరు, న్యూస్లైన్ : జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్ తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లలో ఆదివారం ఉద యం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 75 జోన్ల పరిధిలోని 139 రూట్లలో పోలీస్ బందోబస్తు నడుమ ఎన్నికల సిబ్బం ది సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. 22 మండలాల్లో 413 ఎంపీటీసీ పదవులకు వెయ్యి మంది, 22 జెడ్పీటీసీ పదవులకు 64 మంది తలపడుతున్నారు. మొత్తం 1,315 పోలింగ్ కేంద్రాల పరి దిలో 10,72,793 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. పోలింగ్కు 3,967 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. వీటిలో 2,775 చిన్నవి, 277 మధ్య తరహా సైజు, 915 పెద్ద బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. వీటిని ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు తరలించారు. మొత్తంగా 6,575మంది పోలింగ్ సిబ్బంది, 6,802మంది పోలీసులు విధుల్లో పాలు పంచుకుంటున్నారు. పోలింగ్ ఇక్కడే.. జిల్లాలో ఏలూరు, పెదపాడు, పెదవేగి, దెందులూరు, భీమడోలు, నిడమర్రు, చింతలపూడి, ద్వారకాతిరుమల, గణపవరం, ఉంగుటూరు, టి.నర్సాపురం, కామవరపుకోట, లింగపాలెం, తాడేపల్లిగూడెం, పెంటపాడు, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాలలో పోలింగ్ జరగనుంది. 24.86 లక్షల బ్యాలెట్ పత్రాలు జెడ్పీటీసీ అభ్యర్థుల కోసం 12,43,050 తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను, ఎంపీటీసీ అభ్యర్థుల కో సం 12,43,050 గులాబీ రంగు బ్యాలె ట్ పత్రాలను సిద్ధం చేశారు.తొలివిడతలో మొత్తం 24,86,100 బ్యాలెట్ పత్రాలను వినియోగించనున్నారు. కలెక్టరేట్, జెడ్పీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా, ఓటర్లను ప్రలోభ పెడుతున్నా, పోలింగ్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైనా కలెక్టరేట్లోని 1800-425-1365, జెడ్పీ కార్యాలయంలో 08812-232351 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. జెడ్పీలో కంట్రోల్ రూమ్ 24గంటలూ పనిచేస్తుందన్నారు. -
బ్యాలెట్ బాక్సులొచ్చేశాయ్!
విశాఖ రూరల్, న్యూస్లైన్: cఆయా కార్యాలయాల్లో ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో సిబ్బంది వాటిని పరిశీలించారు. జిల్లాలో 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాల పోలింగ్ కోసం మూడు రకాల బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఒక్కో స్థానంలో ఓట్ల సంఖ్యను బట్టి బాక్సుల ను కేటాయిస్తున్నారు. వెయ్యి ఓట్లు కంటే అధికంగా ఉన్న కేంద్రానికి రెండు పెద్ద బాక్సులు, వెయ్యి లోపు ఓట్లు, ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉండే కేంద్రానికి ఒక పెద్దది, మధ్య తరహా బాక్సులు, అంతకంటే తక్కువ ఓట్లు ఉన్న స్థానాల్లో చిన్న బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఒక పెద్ద బాక్సులో 1200 నుంచి 1400 వరకు ఓట్లు వేసే అవకాశముంటుంది. ఈ ఎన్నికలకు మొత్తంగా 2300 పెద్దవి, 1800 మధ్యతరహావి, 1200 చిన్న బాక్సులను అందుబాటులో ఉంచారు. వాటన్నింటినీ ఇప్పటికే పరిశీలించి భద్రపరిచారు. వీటితో పాటు బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా దాదాపుగా తుది దశకు చేరుకుంది. జెడ్పీటీసీలకు సంబంధించిన తెల్ల రంగులోను, ఎంపీటీసీలవి గులాబీ రంగులోను ముద్రించారు. అభ్యర్థుల పేర్లు తెలుగు అక్షర క్రమం అనుసరించి గుర్తులు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులు సక్రమంగా ఉన్నదీ లేనిదీ మండల కేంద్రాల్లో మంగళవారం నిశితంగా పరిశీలించారు. వాటితోపాటు బ్యాలెట్లపై ఉన్న సీరియల్ నంబర్లను సైతం పరిశీలించారు. సవ్యంగా లేని బ్యాలెట్ పత్రాల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు. ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో 16,50,329 మంది ఓటర్లు ఉండగా ఒక్కొక్కరు జెడ్పీటీసీ, ఎంపీటీసీకి రెండేసి ఓట్లు వేయనున్నారు. దీని ప్రకారం బ్యాలెట్ పత్రాలు సిద్ధమయ్యాయి. 10 శాతం రిజర్వ్తో పాటు దాదాపుగా 36.5 లక్షల బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. ఎన్నికలు ఈ నెల 6,11 తేదీల్లో జరగనున్నాయి. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను మండల కేంద్రాలకు. అక్కడే మే 7వ తేదీ తరువాత లెక్కింపును చేపట్టనున్నారు. -
బ్యాలెట్ పేపర్ల ముద్రణ తనిఖీ
కరీంనగర్ సిటీ, న్యూస్లైన్: వివిధ ప్రింటింగ్ ప్రెస్లలో ముద్రిస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలను గురువారం కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తనిఖీ చేశారు. ముద్రణ ఎప్పటివరకు పూర్తవుతాయని అడిగి తెలుసుకున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, జెడ్పీ డెప్యూటీ సీఈవో సత్యవతి ఉన్నారు. కోడ్ ఉల్లంఘిస్తే నేరుగా తెలపండి : ఎన్నికల అధికారి ఉషారాణి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తున్నట్లు భావిస్తే తమకు నేరుగా తెలపాలని ఎన్నికల రాష్ట్ర పరిశీలకులు వి.ఉషారాణి పేర్కొన్నారు. వి.ఉషారాణి సెల్ నంబర్ 81796 75804, సి.పార్థసారథి సెల్ నంబర్ 81790 24803 కు సమాచారం ఇవ్వొచ్చన్నారు. 29న జెడ్పీటీసీ అభ్యర్థులకు అవగాహన జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీచేస్తున్న జగిత్యాల, పెద్దపల్లి, మంథని డివిజన్ అభ్యర్థులకు ఈ నెల 29న ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించనున్నట్లు రిటర్నింగ్ అధికారి విజయ్గోపాల్ తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం ఉంటుందన్నారు. -
బ్యాలెట్ పేపర్ల ముద్రణను బాధ్యతగా నిర్వహించండి
ఎన్నికల అధికారులకు కలెక్టర్ శ్రీధర్ ఆదేశం సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం కావాల్సిన 36 లక్షల బ్యాలెట్ పేపర్ల ముద్రణను బాధ్యతగా స్వీకరించి చేపట్టాలని ఎంపీడీఓలు, ప్రత్యేకాధికారులను కలెక్టర్ బీ.శ్రీధర్ ఆదేశించారు. ప్రాదేశిక ఎన్నికల నిర్వహణపై ఎంపీడీఓలు, ప్రత్యేకాధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయినందున బ్యాలెట్ పేపర్ల ముద్రణ ప్రారంభించాల్సి ఉందన్నారు. ఈనెల 30లోగా ఆయా మండలాలకు కేటాయించిన తేదీల్లో బ్యాలెట్ పేపర్ల ముద్రణను పూర్తిచేసి పోలీసు బందోబస్తు మధ్య మండల కేంద్రాలకు తరలించిన అనంతరం పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయాలని సూచించారు. మండల స్థాయిలో ఈనెల 26న, ఏప్రిల్ 1న ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, వంద శాతం సిబ్బంది తరగుతులకు హాజరయ్యేలా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జెడ్పీటీసీ అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.రెండు లక్షలు, ఎంపీటీసీకి రూ.లక్ష నిర్ధారించినందున అంతకుమించి ఖర్చుచేయకుండా ప్రత్యేక కమిటీలు పర్యవేక్షిస్తాయని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి ఫిర్యాదులువస్తే 24 గంటలలోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జేసీ చంపాలాల్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈఓ చక్రధర్రావు, ఎన్సీఎల్పీ పీడీ సుధాకర్రెడ్డి, డీపీఓ సురేష్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ బ్యాలట్ పత్రాలు స్వాధీనం
అనపర్తి, న్యూస్లైన్ : మహేంద్రవాడ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలట్ పత్రాలను కోర్టు కమిషనర్లు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో అనపర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మేజిస్ట్రేట్ బీవీఎల్ కుమారి ఇద్దరు కమిషనర్లను నియమించారు. సర్పంచ్ పదవికి సంబంధించి న్యాయవాది ఎస్వీవీ సత్యనారాయణ రెడ్డి, వార్డు పదవికి సంబంధించి న్యాయవాది టీవీవీ రమణమూర్తిలను కమిషనర్లుగా నియమిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో శనివారం మండల పరిషత్ కార్యాలయంలో భద్రపరచిన మహేంద్రవాడ పంచాయతీకి సంబంధించిన బ్యాలట్ పత్రాలను అధికారులు, గెలుపు, ఓటమి పొందిన అభ్యర్థుల సమక్షంలో కమిషనర్లు పరిశీలించారు. అనంతరం బ్యాలట్ పత్రాలను స్వాధీనం చేసుకుని, పోలీసు బందోబస్తు మధ్య కోర్టుకు తరలించారు. గతేడాది జూలై 23న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని మహేంద్రవాడకు సర్పంచ్గా కుడిపూడి అన్నపూర్ణ తన సమీప ప్రత్యర్థి గుండుపల్లి దుర్గపై 13 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు ధ్రువీకరించారు. అన్నపూర్ణకు 1896 ఓట్లు రాగా, దుర్గ 1883 ఓట్లు సాధించారు. మూడో వార్డులో వెలగల శ్రీనివాసరెడ్డి మూడు ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి సబ్బెళ్ల వెంకటరెడ్డిపై గెలుపొందారు. ఇందులో శ్రీనివాసరెడ్డి 131 ఓట్లు, వెంకటరెడ్డి 128 ఓట్లు పొందారు. సర్పంచ్ పదవికి పోటీ చేసిన దుర్గ, వార్డు సభ్యుడిగా పోటి చేసిన వెంకటరెడ్డి అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలు కావడంతో, తమకు అన్యాయం జరిగిందంటూ వీరు కోర్టును ఆశ్రయించారు. వీరి తరఫున న్యాయవాది వి.సుందరరావు వాదిస్తున్నారు. ప్రతివాదులు అన్నపూర్ణ, శ్రీనివాసరెడ్డి తరఫున న్యాయవాదులు ఎం.రవిషణ్ముఖరెడ్డి, కె.మన్మోహన శ్రీనివాసరెడ్డి, సబ్బెళ్ల సూరారెడ్డి వాదించనున్నారు. మండల పరిషత్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచిన బ్యాలట్ బాక్సులను కోర్టు కమిషనర్ల సమక్షంలో బాక్సులను తెరిచేందుకు ఉపక్రమించగా, అందులో ఒకటి కనిపించలేదని విశ్వసనీయంగా తెలిసింది. స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచిన బాక్సులను క్షుణ్ణంగా పరిశీలించగా, కుతుకులూరుకు చె ందిన బ్యాలట్ బాక్సులో కలిసినట్టు గమనించారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఓటరు తిరస్కరించవచ్చు
ఎన్నికల అభ్యర్థులపై సుప్రీంకోర్టు విప్లవాత్మక తీర్పు న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరినీ వ్యతిరేక ఓటుతో తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. బ్యాలెట్ పత్రాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ‘పై వారెవరూ కాదు’ (నన్ ఆఫ్ ది అబోవ్ - నోటా) అనే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే ఏర్పాటు చేయాలని.. ప్రత్యేక మీటను పొందుపరచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిర్దేశిస్తూ విప్లవాత్మక ఆదేశాలు జారీచేసింది. చెతన్యవంతమైన ప్రజాస్వామ్యంలో.. ‘పై వారెవరూ కాదు’ అనే మీటను ఎంచుకునే అవకాశం ఓటరుకు తప్పనిసరిగా ఇవ్వాలని.. దానివల్ల రాజకీయ పార్టీలు మంచి అభ్యర్థిని పోటీకి నిలపక తప్పనిసరి పరిస్థితి వస్తుందని అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొంది. ఈవీఎంలలో ‘నోటా’ మీటను ఏర్పాటు చేయటం ద్వారా ఓటర్లకు సాధికారత లభిస్తుందని, ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో సమర్థవంతమైన రాజకీయ భాగస్వామ్యాన్ని పెంపొంది స్తుందని వ్యాఖ్యానించింది. వ్యతిరేక ఓటు (నెగెటివ్ ఓటు) వేసే హక్కు ఓటర్లకు కల్పించాలని కోరుతూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పార్లమెంటులోని ఓటింగ్ యంత్రాల్లో ఎస్, నోస్, అబ్స్టెయిన్ (తటస్థం) అనే మూడు మీటలు ఉంటాయనే విషయాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఎన్నికల్లోనూ ‘నోటా’ మీట నొక్కటం ద్వారా ఓటరు వాస్తవానికి తాను ఓటు వేయకుండా తటస్థంగా ఉన్నట్లు చెప్పటమే అవుతుందని పేర్కొంది. వ్యతిరేక ఓటు ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఈసీకి సుప్రీంకోర్టు నిర్దేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని జస్టిస్ రంజన ప్రకాశ్దేశాయ్, జస్టిస్ రంజన్ గొగోయ్లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల్లో ముఖ్యాంశాలివీ... భావప్రకటన హక్కులో భాగం ‘‘వ్యక్తులందరూ ఏదైనా ఒక అంశంపై మాట్లాడే, విమర్శించే, విభేదించే హక్కును 19వ అధికరణ కల్పిస్తోంది. ఇది సహనమనే స్ఫూర్తి ఆధారంగా నిలబడుతుంది. ప్రజలు విభిన్నమైన అభిప్రాయాలు, ఆలోచనలు, సిద్ధాంతాలు కలిగివుండేందుకు అనుమతిస్తుంది. ఒక వ్యక్తిని వ్యతిరేక ఓటు వేసేందుకు అనుమతించకపోవటం.. భావప్రకటనా స్వాతంత్య్రాన్నే హరిస్తుంది. ఓటు వేయటం అనేది భావప్రకటనా హక్కులో ఒక అంశం. రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ కింద ఈ హక్కును కల్పించటం జరిగింది. ఒక వ్యక్తిని వ్యతిరేక ఓటు వేసేందుకు అనుమతించకపోవటం భావప్రకటనా స్వేచ్ఛను, 21వ అధికరణ అయిన స్వేచ్ఛా హక్కును హరిస్తుంది. మచ్చలేని అభ్యర్థులకు అవకాశం వస్తుంది... ప్రపంచంలోని 13 దేశాల్లో ఈ వ్యతిరేక ఓటు అమలులో ఉంది. ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే.. దేశాన్ని సరిగా పరి పాలించేందుకు అందుబాటులో ఉన్నవారిలో ఉత్తములైన వారిని ప్రజా ప్రతినిధులుగా ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. వ్యతిరేక ఓటు ఎన్నికల ప్రక్రియలో వ్యవస్థాగత మార్పుతెస్తుంది. పార్టీలు నిలిపిన అభ్యర్థులను ప్రజలు పెద్ద సంఖ్యలో తిరస్కరించినప్పుడు.. ప్రజాభీష్టాన్ని అంగీకరించి పార్టీలు మచ్చలేని అభ్యర్థులను పోటీకి నిలబెట్టక తప్పని పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్య పురోభివృద్ధికి దోహదం... ప్రజాస్వామ్య పురోభివృద్ధికి వ్యతిరేక ఓటు దోహదపడుతుంది. ప్రజలు రాజకీయ ప్రక్రియలో సమర్థవంతంగా పాల్గొనటాన్ని వేగవంతం చేస్తుంది. ఎన్నికల ప్రక్రియలో స్వచ్ఛతను పెంపొందిస్తుంది. ఇది పార్టీలు, వారి అభ్యర్థులు ప్రజలు తమ గురించి ఏమనుకుంటున్నారనేదానిపై స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది. ప్రస్తుత వ్యవస్థలో అసంతృప్తికి గురైన ఓటర్లు సాధారణంగా ఓటు వేయటానికి రారు. ఫలితంగా వారి ఓట్లను అవినీతి శక్తులు దుర్వినియోగం చేసే అవకాశమిస్తుందనే వాస్తవం కూడా.. వ్యతిరేక ఓటు ఆవశ్యకతను బలపరుస్తుంది. పార్లమెంటులో ‘తటస్థం’ తరహాలోనే... పార్లమెంటులోని ఓటింగ్ యంత్రాల్లో ఎస్, నోస్, అబ్స్టెయిన్ (తటస్థం) అనే మూడు మీటలు ఉంటాయి. అంటే.. సభ్యులు తటస్థం అనే మీటను ఎంచుకునే అవకాశం కల్పించారు. అలాగే.. పిటిషనర్లు కోరుతున్న ‘నోటా’ మీట.. సరిగ్గా ఈ ‘తటస్థం’ మీట వంటిదే. నోటా మీట నొక్కటం ద్వారా ఓటరు వాస్తవానికి.. అభ్యర్థులలో ఎవరూ తన ఓటు వేయటానికి తగిన అభ్యర్థిగా గుర్తించకపోతే.. తాను ఓటు వేయకుండా తటస్థంగా ఉన్నట్లు చెప్పటమే అవుతుంది. ఈవీఎంలలో ‘నోటా’ మీట ఏర్పాటు చేయాలి... బ్యాలెట్ పత్రాలు / ఈవీఎంలలో పైవారెవరూ కాదు (నోటా) అనే మరో మీటను ఏర్పాటు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్కు మేం నిర్దేశిస్తున్నాం. దీనివల్ల పోలింగ్ బూత్కు వచ్చే ఓటర్లు.. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరికీ ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నట్లయితే.. వారు ఎవరికీ ఓటు వేయకూడదనే తమ హక్కును వినియోగించుకునేందుకు, అదే సమయంలో తమ ఓటు గోప్యత హక్కును వినియోగించుకోవటానికి అవకాశం కలుగుతుంది. అభ్యర్థుల పేర్ల జాబితా చివర్లో ‘నోటా’ మీటను ఏర్పాటు చేయాలి. ఈ వ్యతిరేక ఓటు పద్ధతిని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల సంఘం దశలవారీగా కానీ, ఒకేసారి కానీ అమలు చేయాలి. దీనిని అమలు చేసేందుకు ఈసీకి అవసరమైన సహాయం కేంద్ర ప్రభుత్వం అందించాలి.’’ వ్యతిరేక ఓటుకూ గోప్యత తప్పనిసరే... ఓటర్ల ‘నోటా’ ఓట్ల విషయంలో గోప్యత పాటించాలని కూడా ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు నిర్దేశించింది. ‘‘ఓటు వేసే హక్కుతో పాటు, ఓటు వేయకుండా ఉండే హక్కు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 79(డి), 41(2), (3), 49-ఒ నిబంధనల కింద చట్టబద్ధంగా గుర్తించారు. ఓటరు తన ఓటు వేయాలని నిర్ణయించుకున్నా కానీ, తన ఓటు వేయరాదని నిర్ణయించుకున్నా కానీ గోప్యత పాటించాల్సి ఉంటుంది’’ అని స్పష్టంచేసింది. ‘‘ఓటరు తన ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లయితే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 128 సెక్షన్, సంబంధిత నిబంధనల కింద గోప్యత పాటించటం జరుగుతుందని.. ఒకవేళ ఓటరు తన ఓటు వేయకూడదని నిర్ణయించుకుంటే గోప్యత పాటించబోమని చెప్పటం కుదరదు. ఓటు వేయకూడదని నిర్ణయించుకున్న ఓటరుతో భిన్నంగా వ్యవహరించే 49-ఒ నిబంధనలోని ఒక భాగం, ఫామ్ 17-ఎ అనేవి.. ఈ గోప్యతను ఉల్లంఘించేందుకు తోడ్పడుతున్నాయి. ఇది ఏకపక్షం, నిర్హేతుకం, 19వ అధికరణను ఉల్లంఘించటమే. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 79(డి), 128 సెక్షన్లకు విరుద్ధం’’ అని సుప్రీం తేల్చిచెప్పింది. అదనపు వ్యయం, శ్రమ అవసరం లేదు... వ్యతిరేక ఓటు వేసే సదుపాయాన్ని ప్రస్తుత ఈవీఎంలలోనే ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే, లేదా సాంకేతిక పరిజ్ఞానంలో ఎలాంటి మార్పూ చేయకుండానే ఏర్పాటు చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనికి సంబంధించి ఈసీ నివేదనను ఉటంకిస్తూ.. ఈవీఎంలో చివరి మీటను వ్యతిరేక ఓటుకు కేటాయించటానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నట్లు చెప్పింది. రాబోయే ఎన్నికల్లో అమలుకు అవకాశం ఇదిలావుంటే.. రాబోయే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ‘తిరస్కరించే హక్కు’ను అమలులోకి తెచ్చే అవకాశముందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. సుప్రీం తీర్పును సాధ్యమైనంత వేగంగా అమలుచేసేందుకు సవివర మార్గదర్శకాలు జారీచేయటం జరుగుతుందని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీల మిశ్రమ స్పందన సుప్రీం తీర్పుపై పార్టీల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఈ తీర్పును పూర్తిగా అధ్యయనం చేయకుండా స్పందించటం తొందరపాటవుతుందని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు జాగ్రత్తగా స్పందించాయి. అయితే.. ఈ తీర్పు అసాధారణ పరిస్థితిని సృష్టించిందని, దీనిని సరిచేయాల్సి ఉందని సీపీఎం వ్యాఖ్యానించింది. సీపీఐతోపాటు పౌర సమాజంలోని ప్రముఖులు ఈ తీర్పును ఆహ్వానించారు. ‘వ్యతిరేక ఓట్లు అత్యధికంగా ఉంటే ఏమిటనేటువంటి అన్ని అంశాలనూ కోర్టు పరిగిణనలోకి తీసుకుందా లేదా అనేది చూడాలి. ఇప్పటికిప్పుడు స్పందించటం తొందరపాటు అవుతుంది’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ అన్నారు. ‘మేం ఎన్నికల సంస్కరణలకు అనుకూలం. ఈ తీర్పు సరైనదా, పొరపాటా అని ఇప్పుడే చెప్పటం తొందరపాటు అవుతుంది’ అని బీజేపీ ఉపాధ్యక్షుడు నక్వీ పేర్కొన్నారు. ఈ తీర్పు రాజకీయాల్ని బాగుచేసే దిశగా చిన్న, బలమైన ముందుడగు అవుతుందని లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులందరినీ తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉందన్న సుప్రీం తీర్పును టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వాగతించారు. వ్యతిరేక ఓటు అంటే చెల్లని ఓటే?! అభ్యర్థులందరినీ తిరస్కరించే అవకాశం ఓటరుకు కల్పించాలన్న సుప్రీం తీర్పు నేపథ్యంలో కొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు వ్యతిరేక ఓటు వేస్తే ఏం జరుగుతుందనేది ఇందులో ప్రధానంగా ఉంది. అయితే.. దీనిపై ఎన్నికల చట్టంలో ఎలాంటి ప్రస్తావనా లేనప్పటికీ.. ‘పై వారెవరూ కాదు’ అనే వ్యతిరేక ఓటును చెల్లని ఓటుగా పరిగణించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితిలో ఓట్లు పొందిన అభ్యర్థుల్లో అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటించటం జరగవచ్చని అంచనా వేస్తున్నాయి. ‘తప్పనిసరి ఓటు’ కూడా కావాలి... నేను ఈ తీర్పును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. ఇది మన రాజ కీయాలపై చిరకాల ప్రభావం చూపుతుందని ఖచ్చితంగా చెప్తున్నా. తప్పనిసరి ఓటు వల్ల కూడా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగల పలు ప్రయోజనాలు ఉన్నాయి. తప్పనిసరి ఓటును తీసుకురావటం ద్వారా.. ఓటర్లు ఎట్టిపరిస్థితుల్లోనూ పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేయాల్సి ఉంటుంది కాబట్టి.. ఎన్నికలపై విపరీతమైన వ్యయాన్ని నివారించవచ్చు. తప్పనిసరి ఓటుపై మేం బిల్లును ప్రవేశపెట్టాం. అందులో తిరస్కరించే హక్కు కూడా ఉంది. కానీ కాంగ్రెస్ దానిని పూర్తిగా వ్యతిరేకించింది. ఈ బిల్లును 2008, 2009ల్లో రెండు సార్లు (రాష్ట్ర శాసనసభలో) ఆమోదించాం. కానీ గవర్నర్ దానిని ఆపివేశారు. - నరేంద్రమోడీ, గుజరాత్ సీఎం 14వ దేశంగా భారత్ ఎన్నికల్లో తనకు నచ్చని అభ్యర్థిని తిరస్కరించే విధానం అమలు చేస్తున్న ఫ్రాన్స్, బ్రెజిల్, ఫిన్లాండ్, అమెరికా లాంటి దేశాల సరసన భారత్ చేరింది. దీంతో నెగెటివ్ ఓటింగ్ విధానం అమలుచేసే దేశాల్లో 14వ దేశంగా భారత్ అవతరించనుంది. ప్రస్తుతం ఈవీఎంల ద్వారా ఫ్రాన్స్, బెల్జియం దేశాలు మాత్రమే ‘నన్ ఆఫ్ ది అబౌవ్ (నోటా)’ను అమలు చేస్తుండగా.. బ్రెజిల్, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, బంగ్లాదేశ్, అమెరికాలోని నెవడా రాష్ట్రం బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటర్లకు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. కాగా, ఫిన్లాండ్, స్వీడన్, అమెరికా, స్పెయిన్ దేశాల్లో ఓటర్లు బ్యాలెట్ను ఖాళీగా వదిలివేయవచ్చు. లేదంటే అభ్యర్థిపై కామెంట్లు కూడా రాయవచ్చు.