Border-Gavaskar Trophy
-
స్టార్స్ ఫ్లాప్ షో...
ఆఫ్స్టంప్ అవతల పడ్డ బంతులను ఆడే విషయంలో తీరు మార్చుకోని విరాట్ కోహ్లి... బ్యాటింగ్ ఆర్డర్లో ఏ స్థానంలో బరిలోకి దిగినా వైఫల్యాల బాట వీడని రోహిత్ శర్మ... అడపా దడపా మెరుపులు తప్ప నిలకడగా ఆకట్టుకోలేక ఇబ్బంది పడ్డ కేఎల్ రాహుల్... ఆల్రౌండరే అయినా అటు బ్యాట్తో, ఇటు బంతితోతనదైన ముద్ర వేయలేకపోయిన రవీంద్ర జడేజా... పేరుకు ప్రధాన పేసరే అయినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన మొహమ్మద్ సిరాజ్... ఇలా ఒకరిని మించి మరొకరు పేలవ ప్రదర్శన కనబరిస్తే ఫలితం ఇలా కాక మరెలా ఉంటుంది! స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య ‘వైట్వాష్’ నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండానే... ఆ్రస్టేలియాలో అడుగు పెట్టిన భారత జట్టు ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో కనీస ప్రదర్శన కనబర్చలేకపోయింది. గత రెండు పర్యాయాలు అద్వి తీయ ఆటతీరుతో కంగారూలను మట్టికరిపించి ప్రతిష్టాత్మక సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా... ముచ్చటగా మూడోసారి అదే మ్యాజిక్ చేయాలని ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ‘కర్ణుడి చావుకు కారణాలు అనేకం’ అన్నట్లు... భారత జట్టు సిరీస్ కోల్పోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగం ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు పరాజయానికి ప్రధాన కారణం బ్యాటింగే అనడంలో సందేహం లేదు. గత రెండు పర్యటనల్లో ఆ్రస్టేలియాపై భారత జట్టు పైచేయి సాధించడంలో అటు బౌలర్లతో పాటు బ్యాట్తో చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గంటల తరబడి క్రీజులో పాతుకుపోయి కంగారూ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన పుజారా వంటి ఆటగాడు తాజా జట్టులో లేకపోవడం జట్టు విజయావకాశాలను దెబ్బ కొట్టింది. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్లు.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోవడంతో సిరీస్లో ఏ దశలోనూ భారత జట్టు పూర్తి ఆధిపత్యం కనబర్చలేకపోయింది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు అందుబాటులో లేకపోయిన రెగ్యులర్ కెపె్టన్ రోహిత్ శర్మ ఆ తర్వాత వరుసగా ఐదు ఇన్నింగ్స్ల్లో 3, 6, 10, 3, 9 పరుగులు చేశాడు. మిడిలార్డర్ నుంచి ఓపెనర్గా ప్రమోషన్ పొందిన తర్వాత నిలకడ పెరగడంతో పాటు విధ్వంసకర బ్యాటర్గా గుర్తింపు సాధించిన ‘హిట్ మ్యాన్’... వరుస వైఫల్యాలతో చివరి మ్యాచ్ నుంచి తనంతట తానే తప్పుకున్నాడంటే అతడి ఫామ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జట్టులో అందరికంటే సీనియర్ అయిన విరాట్ కోహ్లి తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన తర్వాత వరుసగా 7, 11, 3, 36, 5, 17, 13 స్కోర్లు చేశాడు. విరాట్ అంకెల కన్నా అతడు అవుటైన తీరే సగటు అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఆస్ట్రేలియా బౌలర్లు ఆఫ్స్టంప్ అవతల బంతి వేయడం... విరాట్ దాన్ని ఆడాలా వద్దా అనే సంశయంలో బ్యాట్ తాకించడం... వికెట్ల వెనక క్యాచ్ ఇచ్చి వెనుదిరగడం... ఈ సిరీస్ మొత్తం ఇదే తంతు సాగింది. టన్నుల కొద్దీ పరుగులు చేసి ‘రన్ మెషిన్’ అనిపించుకున్న విరాట్ ఈ సిరీస్లో పూర్తిగా విఫలమవడం... జట్టు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. నిలకడలేమే ప్రధాన సమస్య రోహిత్ గైర్హాజరీలో ఓపెనర్గా బరిలోకి దిగి ఆకట్టుకున్న కేఎల్ రాహుల్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమయ్యాడు. 26, 77, 37, 7, 84, 4, 24, 0, 4, 13 ఈ సిరీస్లో రాహుల్ గణాంకాలివి. తొలి మూడు మ్యాచ్ల్లో ఫర్వాలేదనిపించిన అతడు చివరి రెండు టెస్టుల్లో విఫలం కావడంతో జట్టుకు మెరుగైన ఆరంభాలు లభించలేదు. స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమయ్యాడు.సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సిరీస్ మధ్యలోనే కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించగా... జడ్డూ తన వంతు బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. ఆసీస్ పిచ్లపై మెరుగైన రికార్డు, మంచి అనుభవం ఉన్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఆ స్థాయి ప్రభావం చూపలేకపోయాడు. మరో ఎండ్ నుంచి బుమ్రా కంగారూల వెన్నులో వణుకు పుట్టిస్తుంటే... దాన్ని సొమ్ము చేసుకుంటూ వికెట్లు పడగొట్టాల్సింది పోయి... ప్రత్యరి్థకి సులువుగా పరుగులు చేసే అవకాశం ఇచ్చాడు. మొత్తంగా ఐదు మ్యాచ్ల్లో కలిపి 20 వికెట్లు తీసినా... ఈ ప్రదర్శన అతడి స్థాయికి తగ్గదని చెప్పలేం. జట్టు పరిస్థితులతో సంబంధం లేకుండా పదే పదే తప్పుడు షాట్ సెలెక్షన్ కారణంగా వికెట్ సమర్పించుకున్న రిషబ్ పంత్ విమర్శల పాలైతే... వచ్చిన కొన్ని అవకాశాలను శుబ్మన్ గిల్ ఒడిసి పట్టలేకపోయాడు. టెస్టు ఫార్మాట్లో ఇంటా బయట నిలకడైన ఆటతీరు కనబరుస్తూ గత రెండు పర్యాయాలు ‘ప్రపంచ టెస్టు చాంపియన్షిప్’ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు దూసుకెళ్లిన భారత జట్టు... ఈసారి మాత్రం నిరాశ పరిచింది. చివరగా ఆడిన ఎనిమిది టెస్టుల్లో టీమిండియా కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసుకు దూరం కాక తప్పలేదు. ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో సిరీస్ కోల్పోవడం టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నితీశ్, యశస్వి అదుర్స్ పదేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ చేజారడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించలేకపోయినప్పటికీ ఈ సిరీస్ ద్వారా భారత జట్టుకు కొంత మేలు కూడా జరిగింది. స్టార్ ఆటగాళ్లు అంచనాలకు అందుకోలేకపోతున్న సమయంలో మేమున్నామంటూ యువ ఆటగాళ్లు బాధ్యతలు తీసుకున్నారు. తొలిసారి ఆ్రస్టేలియాలో పర్యటించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆటకట్టుకోగా... ఈ సిరీస్ ద్వారానే అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఐదు మ్యాచ్ల్లో 43.44 సగటుతో 391 పరుగులు చేసిన జైస్వాల్ భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్, కమిన్స్, హాజల్వుడ్, బోలండ్ వంటి పేసర్లను జైస్వాల్ అలవోకగా ఎదుర్కొన్న తీరు భవిష్యత్తుపై భరోసా పెంచుతోంది. ఇక పేస్ ఆల్రౌండర్ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న టీమిండియాకు నితీశ్ రెడ్డి రూపంలో జవాబు దొరికింది. మీడియం పేస్కు తోడు చక్కటి బ్యాటింగ్తో అతడు ఈ సిరీస్పై తనదైన ముద్రవేశాడు. 9 ఇన్నింగ్స్లు కలిపి నితీశ్ మొత్తం 298 పరుగులు సాధించి సిరీస్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్గా నిలిచాడు. టి20 ఫార్మాట్లో ధనాధన్ షాట్లు ఆడే నితీశ్... సుదీర్ఘ ఫార్మాట్కు పనికిరాడని విమర్శించిన వారికి మెల్బోర్న్ సెంచరీతో బదులిచ్చాడు. తనలో దూకుడుగా ఆడే శక్తితో పాటు క్రీజులో సుదీర్ఘ సమయం గడపగల సంయమనం కూడా ఉందని నిరూపించాడు. ఈ ప్రదర్శనతో నితీశ్ రెడ్డి టెస్టు జట్టులో చోటు నిలబెట్టుకోవడం ఖాయం కాగా... బౌలింగ్లో అతడు మరింత రాటుదేలితే భారత జట్టుకు అదనపు బలం చేకూరుతుంది. ఇక ఈ సిరీస్లో అత్యుత్తమ ప్రదర్శన అంటే అది బుమ్రాదే. తొలి టెస్టులో సారథిగా జట్టును గెలిపించిన బుమ్రా... సిరీస్ ఆసాంతం టీమ్ భారాన్ని భుజాల మీద మోశాడు. 9 ఇన్నింగ్స్ల్లో కలిపి 32 వికెట్లు తీసిన బుమ్రా... చివరి ఇన్నింగ్స్లో బౌలింగ్కు చేయలేకపోవడంతోనే టీమిండియా పరాజయం పాలైందనడంలో అతిశయోక్తిలేదు. ‘బుమ్రా ఎడం చేత్తో బౌలింగ్ చేసేలా చట్టం తీసుకొస్తాం’ అని ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్ అన్నాడంటే ఈ సిరీస్లో జస్ప్రీత్ జోరు ఎలా సాగిందో ఊహించుకోవచ్చు. -
ట్రోఫీ ప్రదానోత్సవానికి ఆహ్వానించలేదు: గావస్కర్
సిడ్నీ: ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్ విజేతకు ట్రోఫీ అందజేసే సమయంలో తనను ఆహ్వానించకపోవడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 1996–97 నుంచి భారత్, ఆ్రస్టేలియా మధ్య ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ నిర్వహిస్తుండగా... తాజాగా జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆ్రస్టేలియా జట్టు 3–1తో విజయం సాధించింది. ఆదివారం ఆఖరి టెస్టు ముగిసిన అనంతరం విజేతగా నిలిచిన ఆ్రస్టేలియా జట్టుకు ఆ్రస్టేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ ట్రోఫీ బహుకరించాడు. దీనిపై గావస్కర్ స్పందిస్తూ... ‘ట్రోఫీ ఇచ్చే సమయంలో అక్కడ ఉండటాన్ని ఇష్టపడేవాడిని. భారత్, ఆస్ట్రేలియా మధ్య అదీ బోర్డర్–గావస్కర్ సిరీస్ కదా. ఆ సమయంలో నేను మైదానంలోనే ఉన్నా. మెరుగైన ప్రదర్శన చేయడం వల్లే ఆ్రస్టేలియా గెలిచింది. నా స్నేహితుడు బోర్డర్తో కలిసి ట్రోఫీ అందించి ఉంటే ఇంకా ఆనందించేవాడిని’ అని అన్నాడు. మరోవైపు క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) స్పందన దీనికి భిన్నంగా ఉంది. సిరీస్లో ఆ్రస్టేలియా విజేతగా నిలిస్తే అలెన్ బోర్డర్... భారత్ గెలిస్తే సునీల్ గావస్కర్ ట్రోఫీ అందించాలని నిర్ణయించినట్లు సీఏ తెలిపింది. ఈ విషయాన్ని వారిదద్దరికీ గతంలోనే చెప్పినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. -
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజేత ఆసీస్
-
రోహిత్ను తప్పించి తుది సమరానికి!
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో గాయం, నిషేధం లేదా మరో వ్యక్తిగత కారణంతో కాకుండా ఫామ్ లేకపోవడంతో తుది జట్టుకు దూరమైన కెపె్టన్ ఇప్పటి వరకు ఎవరూ లేరు! కానీ ఇప్పుడు తొలిసారి రోహిత్ శర్మ అలాంటి స్థితిలో నిలిచాడు. వరుస వైఫల్యాలు, డ్రెస్సింగ్ రూమ్లో విభేదాలవంటి వార్తల నేపథ్యంలో రోహిత్పై వేటు పడింది. నేటి నుంచి ఆ్రస్టేలియాతో జరిగే చివరి టెస్టులో అతడిని టీమ్ మేనేజ్మెంట్ తప్పించడం ఖాయమైంది. సిరీస్లో తొలి పోరులో భారత్ను గెలిపించిన బుమ్రా నాయకత్వంలోనే ఇప్పుడు సిరీస్ను సమం చేసే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. భారత్ గెలిస్తే ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని నిలబెట్టుకోవడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరే ఆశలు ఇంకా మిగిలి ఉంటాయి. ఆసీస్ గెలిస్తే ఆ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. సిడ్నీ: భారత్, ఆ్రస్టేలియా మధ్య సుదీర్ఘ టెస్టు సిరీస్ చివరి అంకానికి చేరింది. నేటి నుంచి జరిగే ఐదో టెస్టులో ఇరు జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఆసక్తికరంగా సాగిన సమరంలో ప్రస్తుతం 1–2తో వెనుకబడిన భారత్ ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది. సొంతగడ్డపై భారత్ చేతిలో గత రెండు ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్లు ఓడిన ఆ్రస్టేలియా ఈసారి ఎలాగైనా తమ స్థాయిని ప్రదర్శించి ట్రోఫీని గెలుచుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో భారత్ ఓడితే డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరే అవకాశాలు పూర్తిగా కోల్పోతుంది. సిడ్నీ పిచ్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్కు సమానంగా సహకరించవచ్చు. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు తక్కువ. రోహిత్ స్థానంలో గిల్... కెపె్టన్ రోహిత్ శర్మ ఈ టెస్టులో ఆడే విషయంపై స్పందిస్తూ గురువారం ‘ఇప్పుడే ఏమీ చెప్పలేను’ అని కోచ్ గంభీర్ చెప్పడంలోనే రోహిత్ స్థానంలో సందేహం కనిపించింది. ఈ సిరీస్లో వ్యక్తిగత కారణాలరీత్యా తొలి టెస్టుకు దూరమైన రోహిత్... ఆ తర్వాత 5 ఇన్నింగ్స్లలో కలిపి 31 పరుగులే చేశాడు. ఇది ఆందోళనకరమే అయినా... వేటు పడవచ్చని ఎవరూ ఊహించలేదు. కానీ కోచ్ గంభీర్, సెలక్టర్ అగార్కర్తో చర్చించిన తర్వాత మ్యాచ్కు దూరంగా ఉండేందుకు రోహిత్ సిద్ధమయ్యాడు. అతని స్థానంలో శుబ్మన్ గిల్ జట్టులోకి రానున్నాడు. గాయంతో బాధపడుతున్న పేసర్ ఆకాశ్దీప్ స్థానంలో ప్రసిధ్ కృష్ణ లేదా హర్షిత్ రాణా ఆడే అవకాశం ఉంది. ఈ రెండు మార్పుల అనంతరం భారత జట్టు సిద్ధమైంది. అయితే పెర్త్లో సెంచరీ మినహా వరుసగా విఫలమైన కోహ్లి ఈ సారైనా రాణిస్తాడా అనేది చూడాలి. రాహుల్, పంత్, జడేజా కూడా తమపై ఉన్న అంచనాలకు అనుగుణంగా ఆడాల్సి ఉంది. బౌలింగ్లో బుమ్రాకు సిరాజ్ తగిన మద్దతు ఇస్తే ఆసీస్ను నిలువరించవచ్చు. మార్ష్ స్థానంలో వెబ్స్టర్... ఆస్ట్రేలియా కూడా ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. ఫామ్లో లేని మిచెల్ మార్ష్ స్థానంలో మరో ఆల్రౌండర్ వెబ్స్టర్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేయనున్నాడు. మెల్బోర్న్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మరో గెలుపుపై కంగారూలు గురి పెట్టారు. ఖ్వాజా మినహా మిగతా ఆటగాళ్లంతా ఫామ్లో ఉన్నారు. ఆల్రౌండర్ నైపుణ్యంతో సారథి కమిన్స్ జట్టును సమర్థంగా నడిపిస్తుండగా...10 వేల పరుగుల మైలురాయికి 38 పరుగుల దూరంలో ఉన్న స్మిత్ అతని సొంత మైదానంలో చెలరేగితే ఆసీస్ భారీస్కోరు సాధించడం ఖాయం. రోహిత్ అన్యమనస్కంగా... టెస్టుకు ముందు రోజు భారత జట్టు ప్రాక్టీస్ సమయంలోనే రోహిత్పై వేటుకు సంబంధించిన సంకేతాలు కనిపించాయి. స్లిప్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ సమయంలో వరుసగా కోహ్లి, రాహుల్, నితీశ్ రెడ్డి, గిల్ నిలబడగా... రోహిత్ జాడే కనిపించలేదు. నెట్స్లో ప్రధాన బ్యాటర్ల సాధన సాగినంత సేపూ అతను ఒక పక్కన నిలబడి బుమ్రాతో కబుర్లు చెబుతూ కనిపించాడు. ఆ తర్వాత అంతా ముగిసిన తర్వాత కొద్దిసేపు ప్రాక్టీస్ చేసినా తీవ్రత కనిపించలేదు. నేరుగా వచ్చిన బంతులను కూడా అతను ఆడే ప్రయత్నం చేయకపోగా, అవన్నీ స్టంప్స్ను పడగొట్టాయి. పూర్తి ఏకాగ్రతతో అతను అర గంట కూడా సాధన చేయలేదు. పక్క నెట్లోనే నితీశ్, గిల్లకు ప్రత్యేక సూచనలిస్తూ సాధన చేయించిన కోచ్ గంభీర్తో కనీసం పలకరింపులు కూడా కనపడలేదు. ప్రాక్టీస్ ముగిశాక బుమ్రా, అగార్కర్లతో కలిసి రోహిత్ మైదానం వీడాడు.1 సిడ్నీలో ఆ్రస్టేలియా జట్టుతో భారత్ ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడింది. టీమిండియా ఒక్క టెస్టులో మాత్రమే (1978లో) గెలిచి, ఐదు టెస్టుల్లో ఓడిపోయింది. మరో 7టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి. -
‘ఇప్పటికే ఎక్కువైంది’
ఆ్రస్టేలియా పర్యటనలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న భారత క్రికెట్ జట్టుపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలైనా ఆశించిన ఫలితాలు రావడంలేదు. దాంతో ఇక కఠిన నిర్ణయాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోవడం, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ‘వైట్వాష్’కు గురవడం... తాజాగా ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీలో 1–2తో వెనుకంజలో ఉండటంపై గంభీర్ కోచింగ్ తీరుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇన్నాళ్లు జట్టు కోచ్గా ఆటగాళ్లు సహజ శైలిలో ఆడేందుకు స్వేచ్ఛనిచ్చిన కోచ్ గౌతమ్ గంభీర్ ‘ఇప్పటికే ఎక్కువైంది... ఇక చాలు’ అని ఆటగాళ్లకు ఘాటుగా హెచ్చరించినట్లు సమాచారం. సిడ్నీ: ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టును ‘డ్రా’ చేసుకోగలిగే స్థితిలో నిలిచిన టీమిండియా... చివర్లో చేతులెత్తేసి ఓడిపోవడంపై హెడ్ కోచ్ గంభీర్ ఆటగాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రత్యేకంగా ఆటగాళ్ల పేర్లు తీసుకోకపోయినా... ఇకపై జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ధోరణిలో గంభీర్ ప్లేయర్లకు క్లాస్ తీసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డ్రెస్సింగ్ రూమ్ చర్చలు బయటకు రాకపోవడమే జట్టుకు శ్రేయస్కరమని మాజీ ఆటగాళ్లు హితబోధ చేస్తుండగా... ధోనీ, విరాట్ కోహ్లి సారథిగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు బయటకు వచ్చేవి కావని పలువురు గుర్తు చేస్తున్నారు. వరుస వైఫల్యాలతో ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు చేరే అవకాశాలను దాదాపు కోల్పోయిన భారత జట్టు... ఇక చివరిదైన సిడ్నీ టెస్టులోనైనా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంటుందా చూడాలి. ఆఖరి టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ 2–2తో ‘డ్రా’ అయినా... గత సిరీస్లో విజేతగా నిలిచినందుకు ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ భారత్ వద్దే ఉంటుంది. వేడెక్కిన డ్రెస్సింగ్ రూమ్... ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేని సమయంలో జరిగిన తొలి టెస్టు (పెర్త్)లో చక్కటి ప్రదర్శన కనబర్చిన టీమిండియా... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, యువ ఆటగాడు శుభ్మన్ గిల్ జట్టులో లేకపోయినా... తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా జట్టును ముందుండి నడిపించాడు. రెండో టెస్టు నుంచి రోహిత్, గిల్ తుది జట్టులోకి రావడంతో టీమిండియా ప్రదర్శన మరింత మెరుగవుతుందనుకుంటే... నానాటికి దిగజారింది. ఆ తర్వాత ఆడిన మూడు టెస్టుల్లో భారత జట్టు రెండింట ఓడి ఒక దానిని ‘డ్రా’ చేసుకుంది. మెల్బోర్న్ టెస్టులో ఒకదశలో మెరుగైన స్థితిలో నిలిచి ఆ తర్వాత పేలవ ఆటతీరుతో ఓటమిని కోరి కొని తెచ్చుకుంది. స్టార్ బ్యాటర్ కోహ్లి మరోసారి తన బలహీనత కొనసాగిస్తూ ఆఫ్స్టంప్ అవతలి బంతిని వెంటాడి అవుట్ కాగా... రిషభ్ పంత్ రెండు ఇన్నింగ్స్లలో అనవసర షాట్లు ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. ఇక నిలకడగా ఆడిన యశస్వి జైస్వాల్ కూడా షాట్ సెలెక్షన్ లోపంతోనే వెనుదిరగగా... ఈ సిరీస్లో ఇటు సారథిగా, అటు బ్యాటర్గా విఫలమవుతున్న రోహిత్ శర్మ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. దీంతో మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు సహజశైలిలో ఆడమని ప్రోత్సహించిన గంభీర్... జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇష్టారీతిన షాట్లు ఆడి అవుట్ కావడంపై పలువురు ఆటగాళ్లపై సీరియస్ అయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. డ్రెస్సింగ్రూమ్లో పరిస్థితి అంతా సవ్యంగా లేదని... ఆటగాళ్లలో అనిశ్చితి నెలకొందనే వార్తలు బయటకు వస్తున్నాయి. పుజారా కోసం పట్టుబట్టినా... గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా పర్యటనలో భారత జట్టు టెస్టు సిరీస్లు గెలవడంలో కీలక పాత్ర పోషించిన వన్డౌన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాను ఈసారి కూడా జట్టులోకి తీసుకోవాలని గంభీర్ పట్టుబట్టినా... సెలెక్షన్ కమిటీ మాత్రం అందుకు అంగీకరించలేదు. జట్టులో స్థిరత్వం తీసుకురాగల పుజారా వంటి ప్లేయర్ అవసరమని గంభీర్ చెప్పినా... సెలెక్షన్ కమిటీ పెడచెవిన పెట్టింది. తాజా సిరీస్లో తొలి టెస్టు అనంతరం కూడా గంభీర్ పుజారాను జట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఇక జట్టును ముందుండి నడిపించాల్సిన సారథి రోహిత్ శర్మనే టీమ్కు భారంగా పరిణమించాడనేది కాదనలేని సత్యం. ఏ స్థానంలో బ్యాటింగ్కు దిగినా... ‘హిట్మ్యాన్’ తన సహజసిద్ధ ఆటతీరు కనబర్చలేక పోతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి కెరీర్పై నీలినీడలు కమ్ముకోగా... ఆస్ట్రేలియాతో సిరీస్ అనంతరం కఠినమైన నిర్ణయాలు తప్పకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే యువ ఆటగాళ్లు నాయకత్వ బాధ్యతలు తీసుకునేందుకు ఇది తగిన సమయం కాదని... ఇలాంటి సంధి దశలో పరిస్థితులను చక్కదిద్దాలంటే అనుభవమే ముఖ్యమని ఓ సీనియర్ ఆటగాడు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. పింక్ బాల్ టెస్టులో ఆకాశ్దీప్ను కాదని హర్షిత్ రాణాను తుదిజట్టుకు ఎంపిక చేయడంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
నితీశ్ రెడ్డి ‘వైల్డ్ ఫైర్’
దేశం తరఫున ఆడుతూ కెరీర్లో తొలి సెంచరీ అంటే ఎలా ఉండాలి...జీవితకాలం ఇలాంటి క్షణాల కోసమే శ్రమించే కష్టాన్ని మరచిపోయేలా ఉండాలి...ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక మైదానంలో ఎందరో కలలు గనే చోట సాధించినట్లుగా ఉండాలి... అన్నీ అనుకూలించినప్పుడు కాదు...జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటూ తానేంటో చూపించాలి...అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొంటూ, శరీరానికి తగిలే దెబ్బలను తట్టుకుంటూ, వేలాది మంది తనకు జేజేలు పలికేలా శతకం బాదాలి...వీటన్నింటికీ ఒక్కటే సమాధానం! మన ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కొట్టినట్లుగా సెంచరీ ఉండాలి. మెల్బోర్న్ టెస్టులో భారీ ఆధిక్యంపై కన్నేసి విజయంపై గురి పెట్టిన ఆస్ట్రేలియాను మన నితీశ్, వాషింగ్టన్ సుందర్ సమర్థంగా అడ్డుకున్నారు. శతక భాగస్వామ్యంతో జట్టును గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించారు. ముందుగా ఫాలో ఆన్ ప్రమాదాన్ని తప్పించడంతో పాటు ఆపై ఆధిక్యాన్ని తగ్గిస్తూ వచ్చారు. నితీశ్ అద్భుత బ్యాటింగ్కు సుందర్ సమన్వయం తోడవడంతో కంగారూలు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. వీరిద్దరు కలిసి 47.3 ఓవర్ల పాటు ఆసీస్ బౌలర్లను నిలువరించారు. ఈ ఇద్దరు బ్యాటర్ల పోరు తర్వాత ప్రస్తుతానికి భారత్ ఓటమి ప్రమాదంనుంచి దాదాపుగా తప్పించుకున్నట్లే. మెల్బోర్న్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టు మ్యాచ్ను భారత యువ ఆటగాళ్లు ఆసక్తికరంగా మార్చారు. ఒక దశలో తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం కోల్పోయి ఓటమికి బాటలు వేసుకునేటట్లు కనిపించిన టీమిండియా కోలుకొని మెరుగైన స్థితికి చేరింది. మ్యాచ్ మూడో రోజు వెలుతురులేమితో ఆటను నిర్ణీత సమయానికి ముందే అంపైర్లు నిలిపివేశారు. అప్పటికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి (176 బంతుల్లో 105 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా...వాషింగ్టన్ సుందర్ (162 బంతుల్లో 50; 1 ఫోర్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం నితీశ్తో పాటు సిరాజ్ (2 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నాడు. భారత్ మరో 116 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్నైట్ స్కోరు 164/5తో ఆట కొనసాగించిన భారత్ శనివారం 70 ఓవర్లు ఆడి మరో 194 పరుగులు జోడించింది. ప్రస్తుతానికి ఆసీస్కు ఆధిక్యం ఉన్నా...నాలుగో రోజు ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు చేసి సవాల్ విసురుతుందనేది ఆసక్తికరం. మిగిలిన సమయం, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే రెండు రోజుల్లో రెండు ఇన్నింగ్స్లు పూర్తి కావడం అంత సులువు కాదు. అదే జరిగితే ఈ మ్యాచ్ కూడా ‘డ్రా’గా ముగియవచ్చు. భారీ భాగస్వామ్యం... తొలి ఇన్నింగ్స్లో 310 పరుగులు వెనుకబడి ఉన్న స్థితినుంచి రిషభ్ పంత్ (37 బంతుల్లో 28; 3 ఫోర్లు), రవీంద్ర జడేజా (17) మూడో రోజు ఆటను కొనసాగించారు. వీరిద్దరు మరింత బాధ్యతాయుతంగా ఆడి జట్టును రక్షించాల్సి ఉన్నా...ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. ముఖ్యంగా పంత్ చెత్త షాట్తో తన వికెట్ సమర్పించుకోగా, జడేజా ఎల్బీగా దొరికిపోయాడు. 30 పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగారు. జడేజా అవుటయ్యాక సుందర్ బ్యాటింగ్కు రాగా, మరో ఎండ్లో నితీశ్ 22 పరుగుల వద్ద ఆడుతున్నాడు. మరో మూడు వికెట్లు తీసి భారత్ ఆట ముగించవచ్చని భావించిన ఆసీస్కు ఇక్కడే అసలు ప్రతిఘటన ఎదురైంది. నితీశ్, సుందర్ చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ మెల్లగా స్కోరును పెంచుతూ పోయారు. లంచ్ సమయానికి స్కోరు 244/7 వద్ద నిలిచింది. రెండో సెషన్లో పూర్తిగా వీరిద్దరిదే హవా సాగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా 24 ఓవర్ల పాటు ఈ జోడీని విడదీయడంలో ఆసీస్ బౌలర్లు విఫలమయ్యారు. మూడో సెషన్లో కూడా వీరిద్దరు గట్టిగా నిలబడ్డారు. ఆసీస్ తొలి 15 ఓవర్లలో 22 పరుగులే ఇచ్చినా వికెట్ మాత్రం తీయలేకపోయింది. ఎట్టకేలకు 127 పరుగుల ఎనిమిదో వికెట్ భాగస్వామ్యం తర్వాత సుందర్ను అవుట్ చేసి లయన్ ఈ జోడీని విడదీశాడు. మరో రెండు పరుగులకే బుమ్రా (0) కూడా వెనుదిరిగాడు. అయితే మరో 15 బంతుల పాటు చివరి వికెట్ చేజార్చుకోకుండా భారత్ మూడో రోజును ముగించింది. స్కోరు వివరాలు: ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్ 474; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (రనౌట్) 82; రోహిత్ (సి) బోలండ్ (బి) కమిన్స్ 3; రాహుల్ (బి) కమిన్స్ 24; కోహ్లి (సి) క్యారీ (బి) బోలండ్ 36; ఆకాశ్దీప్ (సి) లయన్ (బి) బోలండ్ 0; పంత్ (సి) లయన్ (బి) బోలండ్ 28; జడేజా (ఎల్బీ) (బి) లయన్ 17; నితీశ్ రెడ్డి (బ్యాటింగ్) 105; సుందర్ (సి) స్మిత్ (బి)లయన్ 50; బుమ్రా (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 0; సిరాజ్ (బ్యాటింగ్) 2; ఎక్స్ట్రాలు 11; మొత్తం (116 ఓవర్లలో 9 వికెట్లకు) 358. వికెట్ల పతనం: 1–8, 2–51, 3–153, 4–154, 5–159, 6–191, 7–221, 8–348, 9–350. బౌలింగ్: స్టార్క్ 25–2–86–0, కమిన్స్ 27–6–86–3, బోలండ్ 27–7–57–3, లయన్ 27–4–88–2, మార్ష్ 7–1–28–0, హెడ్ 3–0–11–0. సుందర్ సంయమనం...దాదాపు నాలుగేళ్ల క్రితం వాషింగ్టన్ సుందర్ బ్రిస్బేన్ టెస్టుతో అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 161/5తో కష్టాల్లో ఉన్న స్థితిలో అతను బ్యాటింగ్కు దిగి జట్టును గట్టెక్కించాడు. అతను చేసిన 62 పరుగులు ఆ తర్వాత భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు మరోసారి అతను అలాంటి పాత్రనే పోషించాడు. ఈ టెస్టు కోసం ప్రధాన బ్యాటర్ గిల్ను పక్కన పెట్టి ఆల్రౌండర్ సుందర్ను తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ తప్పుడు నిర్ణయం జట్టు ఓటమికి కారణం కావచ్చని విశ్లేషకులు అన్నారు. అయితే సుందర్ తన బ్యాటింగ్తో వారి అనుమానాలను పటాపంచలు చేశాడు. ముఖ్యంగా ఏ రెగ్యులర్ బ్యాటర్కు తగ్గని రీతిలో అద్భుతమైన డిఫెన్స్తో జట్టు ఇన్నింగ్స్ను నిర్మించాడు. సుందర్ పట్టుదల, ఓపికతో అండగా నిలవడం వల్లే మరో వైపు నితీశ్ సెంచరీ సాధ్యమైంది. ఎంతో జాగ్రత్తగా ఆడిన సుందర్ ఏకంగా 162 బంతులు ఎదుర్కొన్నాడు. కమిన్స్ ఓవర్లో అతను కొట్టిన సింగిల్తో భారత్ ఫాలో ఆన్ ప్రమాదంనుంచి తప్పించుకుంది. తాను ఎదుర్కొన్న 103వ బంతికి గానీ సుందర్ ఏకైక ఫోర్ కొట్టలేదు. టీ విరామం తర్వాత 146 బంతుల్లో సుందర్ అర్ధసెంచరీ పూర్తయింది. మళ్లీ ఆ్రస్టేలియాను నిలువరించడంలో సఫలమైన తర్వాత చివరకు లయన్ బౌలింగ్లో అతను వెనుదిరిగాడు. బ్రిస్బేన్ విజయం తర్వాత తన కుక్క పిల్లకు అక్కడి మైదానం ‘గాబా’ పేరును సుందర్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడి ప్రదర్శన తర్వాత రెండో కుక్క పిల్ల ఏమైనా ఉంటే ‘ఎంసీజీ’ అంటాడేమో!ఇక తగ్గేదేలే...పెర్త్ టెస్టులో 73/6 నుంచి జట్టును 150 వరకు అతనే తీసుకెళ్లాడు...అడిలైడ్లో 87/5, 105/5 వద్ద ఉన్నప్పుడు 42, 42తో రెండు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్లు ఆడాడు. మెల్బోర్న్లో 191/6 నుంచి స్కోరును 300 దాటించాడు...ఈ సిరీస్లో తొలి రోజునుంచి తనదైన ముద్ర వేసిన నితీశ్ కుమార్ రెడ్డి 284 పరుగులతో ప్రస్తుతం టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ టెస్టుకు ముందు అతని ప్రదర్శన చూస్తే ఒక భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నట్లుగా కనిపించింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక ఎంసీజీలో అతను ఆ లోటును తీర్చుకున్నాడు. ఐపీఎల్లో మెరుపు ఇన్నింగ్స్లు, బంగ్లాదేశ్తో టి20లో 34 బంతుల్లో 74 పరుగుల ఆటతో తానేంటో చూపించినా...నితీశ్ను టెస్టు ఆటగాడిగా ఎవరూ చూడలేదు. 23 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 674 పరుగులు, బౌలింగ్లో 56 వికెట్ల అతని రికార్డు ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి అర్హతగా మారుతుందని, తుది జట్టులో స్థానం దక్కుతుందని ఊహించలేదు. మీడియం పేస్ బౌలింగ్ చేసే బ్యాటర్గా హార్దిక్ పాండ్యా తరహాలో గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని నితీశ్ తన గురించి తాను చెప్పుకున్నాడు. కానీ ఈ సిరీస్కు ముందు దులీప్ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్లలో రెండు డకౌట్లు బ్యాటింగ్పై కూడా సందేహాలు రేపాయి. కానీ టీమ్ మేనేజ్మెంట్ నితీశ్పై నమ్మకముంచింది. అతడిని తమ ట్రంప్ కార్డ్గా వాడి అద్భుత ఫలితాలు సాధించింది. ఇప్పుడు సెంచరీతో నితీశ్ తన స్థాయిని ప్రదర్శించాడు. అతను ఎనిమిదో స్థానంలో క్రీజ్లోకి వచ్చే సమయానికి భారత్ మరో 283 పరుగులు వెనుకబడి ఉంది. ఇలాంటి సమయంలోనూ ఎలాంటి తడబాటు లేకుండా అతను స్వేచ్ఛగా ఆడిన తీరు మాజీ క్రికెటర్లు, దిగ్గజాలను సైతం ఆకట్టుకుంది. షాట్ల ఎంపిక మాత్రమే కాదు, అతనిలో కనిపించిన ఆత్మవిశ్వాసం ఎంతో అనుభవం ఉన్నవాడిలా చూపించింది. ముఖ్యంగా క్రీజ్లో పట్టుదలగా నిలబడిన తీరు, పోరాటతత్వం ఈ 21 ఏళ్లు కుర్రాడిని మరో మెట్టు ఎక్కించాయి. స్టార్క్ బౌలింగ్తో ఆఫ్ డ్రైవ్ బౌండరీతో 81 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం అతను ‘పుష్ప’లా తగ్గేదేలే అంటూ సంకేతం చూపించాడు. ఆ తర్వాత పరిస్థితికి తగినట్లుగా తనను తాను మార్చుకున్నాడు. 85 స్కోరు వద్దనుంచి 97కు చేరేందుకు 48 బంతులు తీసుకున్నాడు. చివరకు ఆ క్షణం రానే వచ్చింది. సెంచరీ తర్వాత బ్యాట్ను మైదానంలో జెండా తరహాలో పాతి ఇది ఆరంభం మాత్రమే అన్నట్లుగా తన రాకను నితీశ్ ఘనంగా చూపించాడు. 21 ఏళ్ల 214 రోజుల వయసులో సెంచరీ బాది ఆ్రస్టేలియా గడ్డపై అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన వారిలో మూడో స్థానంలో అతను నిలవడం విశేషం. కమిన్స్తో తలపడి... నిలబడి...నితీశ్ ఇన్నింగ్స్లో చూడచక్కటి షాట్లు ఎన్నో ఉన్నాయి. అతని పది ఫోర్లు కూడా ఎంతో నియంత్రణతో, ఎలాంటి తడబాటు లేకుండా పూర్తి సాధికారతతో వచ్చాయి. ఆరంభంలో లయన్ బౌలింగ్లో ముందుకు దూసుకొచ్చి కొట్టిన సిక్స్, ఆ తర్వాతి బౌండరీలో చక్కటి ఫుట్వర్క్ కనిపించింది. అయితే సెంచరీని అందుకునే క్రమంలో అతను కొన్ని కఠిన క్షణాలను కూడా దాటాడు! ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్ , తన సన్రైజర్స్ సారథి కమిన్స్ బౌలింగ్ను అతను ఎదుర్కొన్న తీరు శనివారం ఆటలో హైలైట్గా నిలిచింది. ఎన్ని ప్రమాదకరమైన బంతులు వచ్చినా... నితీశ్ తలవంచి కాడి పడేయలేదు. వాటికి ఎదురొడ్డి నిలబడ్డాడు. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ 68వ ఓవర్ అతనిలోని మొండితనాన్ని చూపించింది. ముఖ్యంగా బౌన్సర్గా వచ్చిన మూడో బంతిని ఆడలేకపోయిన నితీశ్ అదృష్టవశాత్తూ చివరి క్షణంలో దానినుంచి తప్పించుకోగలిగాడు. ఆఖరి బంతి కూడా దాదాపు ఇదే తరహాలో అతడిని వెంటాడింది. మరికొద్ది సేపటికి కమిన్స్ బౌలింగ్లోనే బంతి మోచేయి కింది భాగంలో బలంగా తగలడంతో అతను విలవిల్లాడుతూ బ్యాట్ వదిలేశాడు. ఫిజియో వచ్చి చికిత్స చేయాల్సి వచ్చింది. అయితే ఈ కుర్రాడు ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయి తానేంటో చూపించాడు. ఆ మూడు బంతులు!లయన్ వేసిన ఇన్నింగ్స్ 112వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసి నితీశ్ మరో ఎండ్కు చేరుకున్నాడు. ఆ సమయంలో అతని స్కోరు 97. అదే ఓవర్ తర్వాత ఐదు బంతులు ఆడిన సుందర్ చివరి బంతికి అవుటయ్యాడు. తర్వాతి ఓవర్ చివరి బంతికి మరో రెండు పరుగులు తీసిన అతను 99 వద్ద నిలిచాడు. అయితే మరుసటి ఓవర్లో ఒక్కసారిగా ఉత్కంఠ చోటు చేసుకుంది. తొలి మూడు బంతులు ఎదుర్కొన్న బుమ్రా డకౌట్గా వెనుదిరిగాడు. ఆ సమయంలో సిరాజ్ క్రీజ్లోకి వచ్చాడు. కమిన్స్ బంతులను అతను ఆడగలడా అని అన్ని వైపులనుంచి సందేహం. మైదానంలో ఫ్యాన్స్ కూడా మునివేళ్లపై నిలిచారు. ఎలాగో అతను ఆ గండాన్ని దాటాడు. ఆఖరి బంతిని సిరాజ్ డిఫెండ్ చేసినప్పుడు ఎంసీజీ మొత్తం ఊగిపోవడం విశేషం! అయితే బోలండ్ తర్వాతి ఓవర్ మూడో బంతిని లాఫ్టెడ్ ఆన్డ్రైవ్గా ఆడటంతో నితీశ్ శతకం పూర్తయింది. అభిమానుల ఉత్సాహంతో ‘జి’ దద్దరిల్లగా...ప్రేక్షకుల మధ్య ఉన్న తండ్రి ముత్యాల రెడ్డి కన్నీళ్లపర్యంతమయ్యాడు. ఆ సమయంలో కామెంటరీలో ఉన్న మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ...‘ఈ భావోద్వేగ క్షణం గురించి ఏం చెప్పినా తక్కువే. అక్కడ ఏడుస్తోంది నితీశ్ తండ్రి మాత్రమే కాదు. మైదానంలో ఉన్న సగటు భారత అభిమానులకు కూడా అదే భావన వచ్చి ఉంటుంది. నా కళ్లల్లో కూడా కన్నీళ్లు తిరిగాయంటే ఆశ్చర్యపోవద్దు’ అని వ్యాఖ్యానించాడు. 5 ఎనిమిది లేదా అంతకంటే కింది స్థానంలో బ్యాటింగ్కు దిగి సెంచరీ సాధించిన ఆటగాళ్లలో నితీశ్ ఐదోవాడు. భారత ఆటగాళ్లలో అతనే మొదటివాడు. 8 ఈ సిరీస్లో నితీశ్ సిక్సర్ల సంఖ్య. గతంలో ఆ్రస్టేలియా గడ్డపై ఒక సిరీస్లో మైకేల్ వాన్ (8; ఇంగ్లండ్), క్రిస్ గేల్ (8;వెస్టిండీస్) మాత్రమే ఎనిమిది సిక్స్లు బాదారు.‘విశాఖపట్నం యువకుడు నితీశ్ కుమార్రెడ్డికి నా అభినందనలు. అండర్–16 స్థాయిలో, రంజీ ట్రోఫీలో ఎన్నో విజయాలతో అతను సత్తా చాటాడు. ఇలాంటి ఘనతలు మున్ముందు మరిన్ని సాధించాలని, భారత జట్టులో సభ్యుడిగా దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ –నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ‘బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ సాధించిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి నా అభినందనలు. జట్టు కష్టాల్లో ఉండి ఫాలో ఆన్ ప్రమాదం పొంచి ఉన్న సమయంలో పరిస్థితి చక్కదిద్దడంలో అతను కీలక పాత్ర పోషించాడు. రాబోయే ఎన్నో ఘనతల్లో ఇది మొదటిది కావాలి. మైదానంలో అతని విజయాలు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి -
స్వయంకృతం!
టీమిండియా చక్కటి అవకాశాన్ని చేజేతులా చెడగొట్టుకుంది. మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఒక దశలో 153/2తో పటిష్ట స్థితిలో నిలిచిన భారత్ 6 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. రెండో రోజును 164/5 వద్ద ముగించి ఫాలోఆన్ ఎదుర్కొనే ప్రమాదంలో పడింది. ఒక్క అనవసర రనౌట్ భారత ఇన్నింగ్స్ గతినే మార్చేసింది. స్మిత్ భారీ సెంచరీకి లోయర్ ఆర్డర్ సహకారం తోడవడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేయగా... ఆసీస్ సారథి కమిన్స్ చూపిన తెగువ మన టాపార్డర్లో లోపించింది. ఇక ఈ మ్యాచ్లో ఏదైనా ఆశ మిగిలుందంటే అది పంత్, జడేజా క్రీజులో ఉండటమే. మరి ఈ జోడీ మూడో రోజు ఆసీస్ పేసర్లను ఎలా ఎదుర్కుంటుందనే దానిపైనే భారత జట్టు ఆశలు ఆధారపడి ఉన్నాయి. మెల్బోర్న్: బౌలర్ల అసహాయతకు, బ్యాటర్ల నిర్లక్ష్యం తోడవడంతో ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ నాలుగో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. ప్రత్యర్థి బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్న పిచ్పై మనవాళ్లు కనీస ప్రదర్శన కనబర్చలేకపోవడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (118 బంతుల్లో 82; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో రాణించగా... విరాట్ కోహ్లి (36; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలండ్ రెండేసి వికెట్లు తీశారు. చేతిలో 5 వికెట్లు ఉన్న టీమిండియా... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 310 పరుగులు వెనుకబడి ఉంది. రిషభ్ పంత్ (6 బ్యాటింగ్), రవీంద్ర జడేజా (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఫాలోఆన్ తప్పించుకోవాలంటే రోహిత్ బృందం ఇంకా 111 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 311/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా 122.4 ఓవర్లలో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (197 బంతుల్లో 140; 13 ఫోర్లు, 3 సిక్స్లు) భారీ సెంచరీతో కదంతొక్కగా... కమిన్స్ (49; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో బుమ్రా 4, జడేజా 3 వికెట్లు పడగొట్టారు. ఒక్క రనౌట్తో... సాఫీగా సాగుతున్న భారత ఇన్నింగ్స్లో రనౌట్ చిచ్చు పెట్టింది. చూడచక్కటి షాట్లతో సెంచరీ దిశగా సాగుతున్న జైస్వాల్... బోలండ్ వేసిన ఇన్నింగ్స్ 41వ ఓవర్ చివరి బంతిని మిడాన్ వైపు కొట్టి సింగిల్ కోసం పరిగెత్తాడు. కానీ నాన్ స్ట్రయికింగ్ ఎండ్లో కోహ్లి స్పందించలేదు. అప్పటికే యశస్వి సగం పిచ్ దాటి వచ్చేశాడు. మిడాన్ వద్ద కమిన్స్ బంతిని అందుకొని కీపర్ కేరీ వైపు విసరడం అతను వికెట్లు గిరాటేయడం జరిగిపోయింది. దాంతో యశస్వి నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో యశస్వి–కోహ్లి మూడో వికెట్కు 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. యశస్వి రనౌట్తో ఏకాగ్రత కోల్పోయిన కోహ్లి ఈ సిరీస్లో మరోసారి తన బలహీనతను బయట పెట్టుకున్నాడు. బోలండ్ వేసిన ఇన్నింగ్స్ 43వ ఓవర్ తొలి బంతికి కోహ్లి అవుటయ్యాడు.ఆఫ్స్టంప్ అవతల వెళుతున్న బంతిని అనవసరంగా ఆడి కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నైట్ వాచ్మన్ ఆకాశ్దీప్ (0) కూడా అవుటవ్వడంతో భారత జట్టు సగం వికెట్లు కోల్పోయింది. గత రెండు మ్యాచ్ల్లో మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగి విఫలమైన రోహిత్ (3) ఓపెనర్గానూ నిరాశ పరచగా... కేఎల్ రాహుల్ (24; 3 ఫోర్లు) కమిన్స్ అద్భుతమైన బంతికి బౌల్డయ్యాడు. స్మిత్ సూపర్ సెంచరీ భారత బౌలింగ్ లోటుపాట్లను సొమ్ముచేసుకున్న స్మిత్ రెండో రోజు ఆసీస్కు భారీ స్కోరు సాధించి పెట్టాడు. బుమ్రా మినహా ఇతర బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుండటంతో సునాయాసంగా పరుగులు రాబట్టాడు. అతడికి మరో ఎండ్ నుంచి కమిన్స్ చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలో స్మిత్ 167 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అతడికిది 34వ శతకం. ఏడో వికెట్కు 112 పరుగులు జోడించిన అనంతరం కమిన్స్ అవుట్ కాగా... స్టార్క్ (15), లయన్ (13) సాయంతో కీలక పరుగులు జోడించాడు.స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: కోన్స్టాస్ (ఎల్బీ) (బి) జడేజా 60; ఖ్వాజా (సి) రాహుల్ (బి) బుమ్రా 57; లబుషేన్ (సి) కోహ్లి (బి) సుందర్ 72; స్మిత్ (బి) ఆకాశ్దీప్ 140; హెడ్ (బి) బుమ్రా 0; మార్ష్ (సి) పంత్ (బి) బుమ్రా 4; కేరీ (సి) పంత్ (బి) ఆకాశ్దీప్ 31; కమిన్స్ (సి) నితీశ్ రెడ్డి (బి) జడేజా 49; స్టార్క్ (బి) జడేజా 15; లయన్ (ఎల్బీ) (బి) బుమ్రా 13; బోలండ్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు: 27; మొత్తం (122.4 ఓవర్లలో ఆలౌట్) 474. వికెట్ల పతనం: 1–89, 2–154, 3–237, 4–240, 5–246, 6–299, 7–411, 8–455, 9–455, 10–474. బౌలింగ్: బుమ్రా 28.4–9–99–4; సిరాజ్ 23–3–122–0; ఆకాశ్దీప్ 26–8–94–2; జడేజా 23–4–78–3; నితీశ్ రెడ్డి 7–0–21–0; సుందర్ 15–2–49–1. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (రనౌట్) 82; రోహిత్ (సి) బోలండ్ (సి) కమిన్స్ 3; రాహుల్ (బి) కమిన్స్ 24; కోహ్లి (సి) కేరీ (బి) బోలండ్ 36; ఆకాశ్దీప్ (సి) లయన్ (బి) బోలండ్ 0; పంత్ (బ్యాటింగ్) 6; జడేజా (బ్యాటింగ్) 4; ఎక్స్ట్రాలు 9; మొత్తం (46 ఓవర్లలో 5 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–8, 2–51, 3–153, 4–154, 5–159. బౌలింగ్: స్టార్క్ 13–0–48–0; కమిన్స్ 13–2–57–2; బోలండ్ 12–3–24–2; లయన్ 5–1–18–0; మార్ష్ 3–0–15–0. కోహ్లిని గేలి చేసిన ఆసీస్ అభిమానులు తొలి రోజు ఆటలో ఆ్రస్టేలియా ఓపెనర్ కోన్స్టాస్ను ఢీకొట్టి జరిమానాకు గురైన కోహ్లికి రెండో రోజు మైదానంలో చేదు అనుభవం ఎదురైంది. విరాట్ ఆడుతున్నంత సేపు గోల చేసిన అభిమానులు... అతడు అవుటై మైదానాన్ని వీడుతున్నప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తున్న కోహ్లి తిరిగివచ్చి ఆసీస్ అభిమానుల వైపు ఆగ్రహంగా చూడగా... భద్రతా అధికారి అతడికి నచ్చజెప్పి తీసుకెళ్లాడు. కోహ్లి భుజం మీద చేయి వేసి... శుక్రవారం ఆటలో ఓ అభిమాని సెక్యూరిటీ వలయం దాటుకొని మైదానంలోకి దూసుకురావడం కలకలం రేపింది. తొలి సెషన్లో టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గ్రౌండ్లోకి వచ్చిన ఆ వ్యక్తి కోహ్లి భుజంపై చేయి వేయడం గమనార్హం. ఇది గుర్తించిన సిబ్బంది అతడిని బలవంతంగా మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.11 భారత్పై అత్యధిక (11) సెంచరీలు చేసిన బ్యాటర్గా స్మిత్ రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ (10) రెండో స్థానానికి పడిపోయాడు.1 ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీలో అత్యధిక (10) సెంచరీలు చేసిన బ్యాటర్గా స్మిత్ నిలిచాడు. విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్ 9 శతకాలతో రెండో స్థానంలో ఉన్నారు. -
టాప్–4 తడాఖా
ఆ్రస్టేలియా ప్రయోగించిన కొత్త అస్త్రం ఫలించింది. మెక్స్వీనీని తప్పించి ఎంపిక చేసిన 19 ఏళ్ల కుర్రాడు స్యామ్ కోన్స్టాస్ మెల్బోర్న్లో మెరిపించాడు. ప్రపంచ అత్యుత్తమ పేసర్గా మన్ననలు అందుకుంటున్న బుమ్రా బౌలింగ్లో... టి20ల తరహాలో పరుగులు రాబట్టి ఆతిథ్య జట్టులో ఆత్మవిశ్వాసం నింపాడు. అతడి స్ఫూర్తితో టాప్–4 ఆటగాళ్లు హాఫ్ సెంచరీలతో విజృంభించారు. వెరసి ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఆ్రస్టేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆఖర్లో బుమ్రా చెలరేగకపోయుంటే పరిస్థితి మరింత దిగజారేదే! ఇప్పటికైతే టీమిండియా పోటీలోనే ఉన్నా... పేస్కు సహకరిస్తున్న పిచ్పై తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరం! మెల్బోర్న్: టాపార్డర్ రాణించడంతో ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఆ్రస్టేలియాకు మంచి ఆరంభం లభించింది. టాప్–4 బ్యాటర్లు అర్ధశతకాలతో అదరగొట్టారు. ఫలితంగా ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీలో భాగంగా భారత్తో గురువారం మొదలైన నాలుగో టెస్టులో ఆతిథ్య ఆ్రస్టేలియా జట్టు తొలిరోజే మంచి స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 86 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. అరంగేట్ర ఆటగాడు సామ్ కోన్స్టాస్ (65 బంతుల్లో 60; 6 ఫోర్లు, 2 సిక్స్లు), ఉస్మాన్ ఖ్వాజా (121 బంతుల్లో 57; 6 ఫోర్లు), లబుషేన్ (145 బంతుల్లో 72; 7 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (111 బంతుల్లో 68 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.ఒకదశలో ఆసీస్ జోరు చూస్తుంటే 400 స్కోరు ఖాయమే అనిపించినా... మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రా (3/75) టీమిండియాను తిరిగి పోటీలోకి తెచ్చాడు. భారత బౌలర్లలో ఆకాశ్దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. స్మిత్తో పాటు కెపె్టన్ ప్యాట్ కమిన్స్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. కోన్స్టాస్ ల్యాప్ స్కూప్ సిక్సర్ రికార్డు స్థాయి అభిమానుల హర్షధ్వానాల మధ్య జాతీయ జట్టు తరఫున తొలి టెస్టు ఆడేందుకు బరిలోకి దిగిన టీనేజర్ కోన్స్టాస్ మొదటి మ్యాచ్లోనే గుర్తుండిపోయే ప్రదర్శనతో కట్టిపడేశాడు. బుమ్రా బౌలింగ్ను ఎదుర్కొనేందుకు మహామహా బ్యాటర్లే తడబడుతున్న తరుణంలో సంప్రదాయ శైలిని పక్కనపెట్టి ఎదురుదాడి లక్ష్యంగా పరుగులు రాబట్టడంలో సఫలమయ్యాడు. పట్టుమని పది ఫస్ట్క్లాస్ మ్యాచ్ల అనుభవం కూడా లేని 19 ఏళ్ల కోన్స్టాస్... బుమ్రా బౌలింగ్లో రెండు సిక్స్లు బాదడం విశేషం. ఏడో ఓవర్లో అతడు ల్యాప్ స్కూప్ ద్వారా కొట్టిన సిక్స్ మ్యాచ్కే హైలైట్. కోహ్లి వంటి దిగ్గజ ఆటగాడితో మాటల యుద్ధం జరిగిన తర్వాత కూడా ఈ టీనేజ్ కుర్రాడు సంయమనం కోల్పోకుండా పరిణతి ప్రదర్శించాడు. ఈ క్రమంలో 52 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న కోన్స్టాస్ కాసేపటికే జడేజా బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. స్మిత్, లబుషేన్ నిలకడ గత మూడు టెస్టుల్లో నిలకడ కనబర్చలేకపోయిన ఆసీస్ టాపార్డర్... కోన్స్టాస్ ఇన్నింగ్స్ స్ఫూర్తితో చెలరేగడంతో తొలి రోజు కంగారూలదే పైచేయి అయింది. లయ దొరకబుచ్చుకునేందుకు ఇబ్బంది పడుతున్న ఖ్వాజా 101 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... లబుషేన్ నింపాదిగా ఆడాడు. ఎలాంటి తొందరపాటుకు అవకాశం ఇవ్వకుండా ఒక్కో పరుగు జోడిస్తూ ఇన్నింగ్స్ను నిర్మించాడు. రెండో వికెట్ లబుషేన్తో కలిసి 65 పరుగులు జోడించిన అనంతరం ఖ్వాజా అవుటయ్యాడు. లబుషేన్, స్మిత్ జట్టు బాధ్యతలను భుజానెత్తుకున్నారు. దాంతో ఆసీస్ ఒకదశలో 237/2తో పటిష్ట స్థితిలో కనిపించింది. బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా... సిరాజ్, జడేజా ఆ తీవ్రత కొనసాగించలేకపోవడంతో ఆసీస్ ప్లేయర్లు సులువుగా పరుగులు రాబట్టారు. ఎట్టకేలకు మూడో వికెట్కు 83 పరుగులు జోడించిన తర్వాత లబుషేన్ను సుందర్ అవుట్ చేశాడు. బుమ్రా బ్రేక్ ఈ సిరీస్లో అద్భుత బౌలింగ్తో ఆకట్టుకుంటున్న బుమ్రా మూడో సెషన్లో తన తడాఖా చూపాడు. వరుస సెంచరీలతో జోరు మీదున్న ట్రావిస్ హెడ్ (0)ను ఓ చక్కటి బంతితో క్లీన్»ౌల్డ్ చేశాడు. బుమ్రా సంధించిన బుల్లెట్ లాంటి లెంత్ బాల్ హెడ్ ఆఫ్స్టంప్ బెయిల్ను గిరాటేసిన తీరు ముచ్చట గొలిపింది. ఏం జరిగిందో ఆలోచించుకునే లోపే హెడ్ బెయిల్ గాల్లోకి ఎగరగా... స్టేడియం మొత్తం ‘బూమ్.. బూమ్.. బుమ్రా’అనే నినాదాలతో హోరెత్తింది.మరుసటి ఓవర్లో మార్ష్ (4)ను బుమ్రా వెనక్కి పంపాడు. అలెక్స్ కేరీ (41 బంతుల్లో 31; 1 సిక్స్) చివర్లో వేగంగా పరుగులు సాధించగా... స్మిత్ అజేయంగా నిలిచాడు. రెండో రోజు కమిన్స్తో కలిసి స్మిత్ మరెన్ని పరుగులు జోడిస్తాడనే దానిపైనే ఈ మ్యాచ్ భవితవ్యం ఆధారపడి ఉంది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: కోన్స్టాస్ (ఎల్బీ) (బి) జడేజా 60; ఖ్వాజా (సి) రాహుల్ (బి) బుమ్రా 57; లబుషేన్ (సి) కోహ్లి (బి) సుందర్ 72; స్మిత్ (బ్యాటింగ్) 68; హెడ్ (బి) బుమ్రా 0; మార్ష్ (సి) పంత్ (బి) బుమ్రా 4; కేరీ (సి) పంత్ (బి) ఆకాశ్దీప్ 31; కమిన్స్ (బ్యాటింగ్) 8; ఎక్స్ట్రాలు 11; మొత్తం (86 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 311. వికెట్ల పతనం: 1–89, 2–154, 3–237, 4–240, 5–246, 6–299. బౌలింగ్: బుమ్రా 21–7–75–3; సిరాజ్ 15–2–69–0; ఆకాశ్దీప్ 19–5–59–1; జడేజా 14–2–54–1; నితీశ్ రెడ్డి 5–0–10–0; సుందర్ 12–2–37–1.1 అరంగేట్రం టెస్టులోనే భారత్పై అర్ధశతకం సాధించిన పిన్న వయసు (19 ఏళ్ల 85 రోజులు) ఆసీస్ ప్లేయర్గా కోన్స్టాస్ రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్గా ఆసీస్ తరఫున పిన్నవయసులో అర్ధశతకం చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇయాన్ క్రెయిగ్ (17 ఏళ్ల 240 రోజులు; 1953లో దక్షిణాఫ్రికాపై) తొలి స్థానంలో ఉన్నాడు.3 ఆ్రస్టేలియా తరఫున అరంగేట్రం టెస్టులో వేగవంతమైన అర్ధశతకం సాధించిన మూడో ప్లేయర్గా కోన్స్టాస్ (52 బంతుల్లో) నిలిచాడు. గిల్క్రిస్ట్ (46 బంతుల్లో; 1999లో పాకిస్తాన్పై), ఆగర్ (50 బంతుల్లో; 2013లో ఇంగ్లండ్పై) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.మెల్బోర్న్@ 87,242 ‘బాక్సింగ్ డే’ టెస్టు తొలి రోజు ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 87,242 మంది అభిమానులు హాజరయ్యారు. ఇరు జట్ల మధ్య టెస్టు మ్యాచ్కు హాజరైన అభిమానుల సంఖ్య ఇదే అత్యధికం. మెల్బోర్న్ టెస్టు ఆరంభానికి రెండు వారాల ముందే టికెట్లన్నీ అమ్ముడుపోగా... రికార్డు స్థాయిలో ప్రేక్షకులు మైదానానికి తరలివచ్చారు. -
గెలుపు పంచ్ ఎవరిదో?
ఆ్రస్టేలియా పర్యటనలో భారత జట్టు మరో కీలక పోరుకు సమాయత్తమైంది. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో కంగారూలను కట్టిపడేసేందుకు టీమిండియా అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంది.ఈ ఏడాదిని విజయంతో ముగించడం... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని చేజిక్కించుకోవడం... ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మార్గం సుగమం చేసుకోవడం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో రోహిత్ బృందం మైదానంలో అడుగు పెట్టనుంది. గత రెండు పర్యటనల్లో మెల్బోర్న్లో జయకేతనం ఎగరవేసిన టీమిండియా ఈ మైదానంలో ‘హ్యాట్రిక్’ విజయంపై కన్నేయగా... భారత జోరుకు అడ్డుకట్ట వేయాలని కంగారూలు కృతనిశ్చయంతో ఉన్నారు. మరింకెందుకు ఆలస్యం రసవత్తర పోరును ఆస్వాదించేందుకు మీరూ సిద్ధమైపోండి! మెల్బోర్న్: గత రెండు ‘బాక్సింగ్ డే’ టెస్టుల్లోనూ ఆ్రస్టేలియాను చిత్తు చేసిన భారత జట్టు... ముచ్చటగా మూడోసారి కంగారూలను మట్టికరిపించేందుకు రెడీ అయింది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా భారత్, ఆ్రస్టేలియా మధ్య గురువారం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరగనున్న ఈ పోరుకు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు తరలి రానుండగా... అశేష జనసందోహం ముందు ఆసీస్పై ఆధిపత్యం కనబర్చేందుకు రోహిత్ బృందం సిద్ధమైంది. ఈ సిరీస్లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు జరగగా ... ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే... చివరి టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీని చేజిక్కించుకుంటుంది. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించి సిరీస్లో బోణీ కొట్టిన భారత్... అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టు (డే–నైట్)లో పరాజయం చవిచూసింది. బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించగా... చివరకు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ప్రస్తుతానికి ఇరు జట్లు సమ ఉజ్జీగా ఉన్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించాలంటే... ఈ సిరీస్లో మిగిలిన రెండు టెస్టుల్లోనూ టీమిండియాకు విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో భారత జట్టు మెల్బోర్న్లో శక్తియుక్తులన్నీ ధారపోయడానికి సిద్ధమైంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ టీమ్ మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న రోహిత్ ఏ స్థానంలో బరిలోకి దిగుతాడనేది ఆసక్తికరంగా మారింది. పేస్కు సహకరించే మెల్బోర్న్ పిచ్పై రోహిత్ ఓపెనర్గా బరిలోకి దిగుతాడా... లేక మిడిలార్డర్లోనే కొనసాగుతాడా చూడాలి!మరోవైపు అరంగేట్ర సిరీస్లోనే తీవ్రంగా తడబడ్డ ఓపెనర్ మెక్స్వీనీని తప్పించిన ఆ్రస్టేలియా... టీనేజర్ స్యామ్ కొంటాస్ను ఓపెనర్గా ఎంపిక చేసింది. ఇక గాయం కారణంగా జట్టుకు దూరమైన హాజల్వుడ్ స్థానంలో బోలండ్ జట్టులోకి రానున్నాడు. రోహిత్ రాణించేనా! ‘జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధమే’ అని రోహిత్ శర్మ ఇప్పటికే స్పష్టం చేసినా... ‘హిట్మ్యాన్’ మిడిలార్డర్లో బరిలోకి దిగడం వల్ల జట్టుకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. వికెట్లు పడుతున్న దశలో క్రీజులోకి వచ్చిన రోహిత్ కనీసం ఎదురుదాడి చేసి ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీసే ప్రయత్నం కూడా చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. నాలుగో టెస్టులోనూ అతడు మిడిలార్డర్లోనే దిగే సూచనలున్నా... మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో భారీ షాట్లు ప్రాక్టీస్ చేసిన రోహిత్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది కీలకం. గత పదేళ్లుగా మెల్బోర్న్ స్టేడియంలో పరాజయం లేకుండా సాగుతున్న టీమిండియా... అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఈ సిరీస్లో ఓపెనర్గా బరిలోకి దిగి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన కేఎల్ రాహుల్పై భారీ అంచనాలు ఉండగా... యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ నిలకడ కొనసాగించాల్సిన అవసరముంది. కోహ్లికి మెల్బోర్న్లో మంచి రికార్డు ఉంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన కోహ్లి... ఆ తర్వాత తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. పదే పదే ఆఫ్స్టంప్ ఆవల పడ్డ బంతికి వికెట్ సమర్పించుకోవడం అభిమానులను కలవరపెడుతోంది. అయితే ప్రాక్టీస్లో దీనిపై దృష్టి పెట్టిన విరాట్... ‘ఫోర్త్ స్టంప్’ లోపాన్ని అధిగమించేందుకు గట్టిగానే ప్రయత్నించాడు. మిడిలార్డర్లో పంత్ మంచి టచ్లో ఉండగా... పేస్ ఆల్రౌండర్గా ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి జట్టులో ఉండటం ఖాయమే. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తే వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రావచ్చు. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... ఒంటి చేత్తో బౌలింగ్ భారాన్ని మోస్తున్న ఏస్ పేసర్ బుమ్రా మరోసారి కీలకం కానున్నాడు. బుమ్రాతో కలిసి సిరాజ్, ఆకాశ్దీప్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్, గిల్, కోహ్లి, పంత్, జడేజా, నితీశ్ రెడ్డి/సుందర్, ఆకాశ్దీప్, బుమ్రా, సిరాజ్. ఆ్రస్టేలియా: కమిన్స్ (కెప్టెన్), ఖ్వాజా, సామ్ కొంటాస్, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్ , కేరీ, స్టార్క్, లయన్, బోలండ్.హెడ్ ఆట కట్టిస్తేనే...సొంతగడ్డపై ఆస్ట్రేలియా జట్టు కూడా కొన్ని సమస్యలతో సతమతమవుతోంది. వార్నర్ రిటైరయ్యాక సరైన ప్రత్యామ్నాయం లభించక ఇబ్బంది పడుతున్న ఆసీస్... ఈ సిరీస్ తొలి మూడు టెస్టులకు మెక్స్వీనీని ప్రయతి్నంచింది. అతడు విఫలమవ్వడంతో మరో యువ ఆటగాడు కొంటాస్ ను ఎంపిక చేసింది.లబుషేన్లో నిలకడ లోపించగా... గత మ్యాచ్లో సెంచరీతో స్టీవ్ స్మిత్ ఫామ్లోకి వచ్చాడు. వీళ్లంతా ఒకెత్తు అయితే... భారత్ పాలిట కొరకరాని కొయ్య మాత్రం ట్రవిస్ హెడ్ అనే చెప్పాలి. ఇటీవల టీమిండియాపై హెడ్ విజృంభిస్తున్న తీరు చూస్తుంటే మరోసారి అతడి నుంచి రోహిత్ జట్టుకు ప్రమాదం పొంచి ఉంది. బోలండ్కు సొంత మైదానమైన ఎంసీజీలో అతడికి ఘనమైన రికార్డు ఉంది. మరోవైపు స్టార్క్, కమిన్స్ బౌలింగ్లో ఏమరపాటుగా ఉంటే జరిగే నష్టం ఏంటో ఈ పాటికే టీమిండియాకు తెలిసొచ్చింది. ఈ నేపథ్యంలో ఎంసీజీ టెస్టులో మళ్లీ గెలవాలంటే టీమిండియా సమష్టిగా రాణించాల్సి ఉంటుంది.పిచ్, వాతావరణంమెల్బోర్న్ పిచ్ పేస్కు అనుకూలం. వికెట్పై 6 మిల్లీమీటర్ల పచ్చిక ఉంటుందని క్యూరేటర్ వెల్లడించాడు. తొలి రోజుఎండ అధికంగా ఉండనుంది. రెండో రోజు చిరు జల్లులు కురవొచ్చు. వర్షం వల్ల ఆటకు పెద్దగా ఆటంకం కలగకపోవచ్చు.4 భారత్ ఆ్రస్టేలియా మధ్య మెల్బోర్న్లో ఇప్పటి వరకు 14 మ్యాచ్లు జరిగాయి. ఇందులో భారత్ 4 టెస్టుల్లో గెలిచింది. ఆ్రస్టేలియా 8 టెస్టుల్లో విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి.6 బుమ్రా మరో ఆరు వికెట్లు తీస్తే (44 టెస్టుల్లో) భారత్ తరఫున వేగంగా 200 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్ అవుతాడు. అశ్విన్ 37 టెస్టుల్లో ఈ మైలురాయి దాటాడు.6 గత ఆరేళ్ల కాలంలో మెల్బోర్న్ మైదానంలో ఆరు సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. -
కంగారూలు కసితీరా...
బ్రిస్బేన్లో తొలి రోజు వరుణుడు విజృంభిస్తే... రెండో రోజు ఆ్రస్టేలియా బ్యాటర్లు వీర విహారం చేశారు. ట్రావిస్ హెడ్ టీమిండియాపై తన ఆధిపత్యం కొనసాగిస్తూ మరో సెంచరీతో విరుచుకుపడగా... స్టీవ్ స్మిత్ సాధికారిక సెంచరీతో కదంతొక్కాడు. ఫలితంగా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ మూడో టెస్టులో ఆ్రస్టేలియా భారీ స్కోరు సాధించింది. భారత మేటి పేసర్ బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టినా... అతనికి సహచర బౌలర్ల నుంచి ఆశించిన సహకారం లభించలేదు. దాంతో ఆ్రస్టేలియా మ్యాచ్పై పట్టు సాధించే అవకాశాన్ని సృష్టించుకుంది. మూడో రోజు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్న ఈ పోరులో భారత బ్యాటర్ల ఆటతీరుపైనే టీమిండియా ఆశలు ఆధారపడి ఉన్నాయి.బ్రిస్బేన్: సొంతగడ్డపై ఆ్రస్టేలియా జట్టు అదరగొట్టింది. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆ్రస్టేలియా భారీ స్కోరు నమోదు చేసింది. గత మ్యాచ్ విజయం ఇచ్చిన స్ఫూర్తితో విజృంభించిన ఆ్రస్టేలియా ఆదివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 101 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. భారత్తో మ్యాచ్ అంటే చాలు పూనకం వచ్చినట్లు చెలరేగే ట్రావిస్ హెడ్ (160 బంతుల్లో 152; 18 ఫోర్లు) వరుసగా రెండో మ్యాచ్లోనూ భారీ శతకంతో విజృంభించగా... చాన్నాళ్లుగా ఫామ్లో లేని మాజీ కెపె్టన్ స్టీవ్ స్మిత్ (190 బంతుల్లో 101; 12 ఫోర్లు) రికార్డు సెంచరీతో రాణించాడు. వీరిద్దరి అసమాన ప్రదర్శన ముందు... బుమ్రా (5/72) ఒంటరి పోరాటం చిన్నబోయింది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (47 బంతుల్లో 45 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించడంతో రెండో రోజు ఆ్రస్టేలియా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఓవర్నైట్ స్కోరు 28/0తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ ఓవరాల్గా రెండో రోజు 377 పరుగులు జతచేయడం విశేషం. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టగా... సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. మూడో రోజు ఆసీస్ ఇంకెన్ని పరుగులు జోడిస్తుందనేది ఆసక్తికరం. తొలి సెషన్ మనదే... వర్ష సూచన మధ్య ప్రారంభమైన రెండో రోజు ఆటలో మొదట మన బౌలర్లు ఆకట్టుకున్నారు. బుమ్రాకు వికెట్ సమరి్పంచుకోకూడదు అనే సంకల్పంతో ముందుకు సాగిన ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజా (54 బంతుల్లో 21), నాథన్ మెక్స్వీనీ (49 బంతుల్లో 9) చివరకు అతడి బౌలింగ్లోనే వెనుదిరిగారు. బంతి బంతికి వికెట్ తీసేలా కనిపించిన బుమ్రా... వరుస ఓవర్లలో వీరిద్దరినీ పెవిలియన్కు పంపాడు. దీంతో ఆ్రస్టేలియా 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో భారత జట్టుకు మెరుగైన ఆరంభమే లభించినట్లు అనిపించింది. లబుషేన్ (55 బంతుల్లో 12)తో పాటు ఆరంభంలో స్మిత్ అతి జాగ్రత్తకు పోవడంతో భారత బౌలర్లదే పైచేయి అయింది. గంటకు పైగా క్రీజులో గడిపినా... ఒక్క షాట్ ఆడలేకపోయిన లబుషేన్ చివరకు ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్లో వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ 75/3తో నిలిచింది. ఇదే జోరు కొనసాగిస్తే మ్యాచ్పై టీమిండియా పట్టు సాధించడం ఖాయమే అనే అంచనాలకు వస్తున్న తరుణంలో... స్మిత్తో కలిసి హెడ్ వీరోచితంగా పోరాడాడు. మొత్తానికి తొలి సెషన్ ముగిసేసరికి ఆసీస్ 104/3తో నిలిచింది. 12 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు మూడో సెషన్ ఆరంభలోనూ స్మిత్, హెడ్ జోరు సాగింది. నాలుగో వికెట్కు 241 పరుగులు జత చేసిన తర్వాత ఎట్టకేలకు బుమ్రా ఈ జోడీని విడదీశాడు. టెస్టు ఫార్మాట్లో 25 ఇన్నింగ్స్ల తర్వాత సెంచరీ నమోదు చేసుకున్న స్మిత్... మూడంకెల స్కోరు చేసిన వెంటనే పెవిలియన్ చేరగా... పేస్ ఆల్రౌండర్ మిషెల్ మార్ష్ (5) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఆఫ్స్టంప్ లైన్లో బుమ్రా వేసిన బంతికి మార్ష్ స్లిప్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.అదే ఓవర్లో హెడ్ కూడా ఔటయ్యాడు. భారీ షాట్కు ప్రయత్నించిన ట్రవిస్ వికెట్ కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 12 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడంతో ఇకనైనా ఆసీస్ ఇన్నింగ్స్కు తెరపడుతుందని ఆశిస్తే... వికెట్ కీపర్ అలెక్స్ కేరీ దాన్ని అడ్డుకున్నాడు. కెపె్టన్ ప్యాట్ కమిన్స్ (20)తో కలిసి ధాటిగా ఆడుతూ కీలక పరుగులు జోడించాడు. గాయం కారణంగా కాసేపు మైదానానికి దూరమైన సిరాజ్... ఆఖరికి ఒక వికెట్ పడగొట్టగా... కేరీతో పాటు మిషెల్ స్టార్క్ (7 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. తదుపరి మూడు రోజుల ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందన్న హెచ్చరికల మధ్య ఈ మ్యాచ్లో ఇప్పటికే ఆ్రస్టేలియా పటిష్ట స్థితికి చేరింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) పంత్ (బి) బుమ్రా 21; మెక్స్వీనీ (సి) కోహ్లి (బి) బుమ్రా 9; లబుషేన్ (సి) కోహ్లి (బి) నితీశ్ రెడ్డి 12; స్మిత్ (సి) రోహిత్ (బి) బుమ్రా 101; హెడ్ (సి) పంత్ (బి) బుమ్రా 152; మార్ష్ (సి) కోహ్లి (బి) బుమ్రా 5; కేరీ (బ్యాటింగ్) 45; కమిన్స్ (సి) పంత్ (బి) సిరాజ్ 20; స్టార్క్ (బ్యాటింగ్) 7; ఎక్స్ట్రాలు 33; మొత్తం (101 ఓవర్లలో 7 వికెట్లకు) 405. వికెట్ల పతనం: 1–31, 2–38, 3–75, 4–316, 5–326, 6–327, 7–385. బౌలింగ్: బుమ్రా 25–7–72–5; సిరాజ్ 22.2–4–97–1; ఆకాశ్దీప్ సింగ్ 24.4–5–78–0; నితీశ్ కుమార్ రెడ్డి 13–1–65–1; రవీంద్ర జడేజా 16–2–76–0.భారీ భాగస్వామ్యం లంచ్ విరామం అనంతరం ఆస్ట్రేలియా గేర్ మార్చింది. అప్పటి వరకు రక్షణాత్మక ధోరణిలో ఆడిన ఆసీస్ ప్లేయర్లు... ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టారు. ముఖ్యంగా గత కొంతకాలంగా... టీమిండియాపై మెరుగైన ప్రదర్శన చేస్తూ... మన బౌలింగ్కు కొరకరాని కొయ్యలా మారిన హెడ్ అలరించాడు. రెండో సెషన్లో కెపె్టన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ జోడీకి పరోక్షంగా సహకరించాయి. హెడ్ క్రీజులో కుదురుకునే సమయంలో ఫీల్డింగ్ మొహరింపు అనుకూలంగా ఉండటంతో అతడు సునాయాసంగా పరుగులు రాబట్టగలిగాడు. షార్ట్బాల్ను సరిగ్గా ఆడలేని బలహీనతను సొమ్ము చేసుకునే విధంగా బౌలింగ్ సాగకపోగా... అడపాదడపా జరిగిన ప్రయాత్నాల్లో రోహిత్ థర్డ్ మ్యాన్ను మొహరించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. బుమ్రా బౌలింగ్లో ఆచితూచి ఆడిన హెడ్ ఆ తర్వాత దూసుకెళ్లాడు. మరో ఎండ్ నుంచి స్మిత్ అతడికి చక్కటి సహకారం అందించాడు. టచ్లోకి వచ్చాక రవీంద్ర జడేజా, నితీశ్ రెడ్డి బౌలింగ్ను లక్ష్యంగా చేసుకుంటూ హెడ్ బౌండరీలతో చెలరేగిపోయాడు. కొత్త బంతితో బౌలింగ్ చేయించేందుకు ప్రధాన పేసర్లను తప్పించడంతో ఆసీస్ జోడీ స్వేచ్ఛగా ముందుకు సాగింది. ఇన్నింగ్స్ ఆరంభంలో ఆత్మవిశ్వాసం లేకుండా కనిపించిన స్మిత్... లయ అందుకున్నాక ట్రేడ్మార్క్ షాట్లతో అలరించాడు. ఆకాశ్దీప్ బౌలింగ్లో ఇబ్బంది పడినట్లు కనిపించిన స్మిత్... మిగిలిన వాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. దీంతో రెండో సెషన్లో ఆసీస్ జట్టు వికెట్ కోల్పోకుండా 130 పరుగులు చేసింది. 1 అంతర్జాతీయ క్రికెట్లో భారత్పై అత్యధిక సెంచరీలు (15) చేసిన ప్లేయర్గా స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. ఆసీస్ మాజీ కెపె్టన్ పాంటింగ్ (14) పేరిట ఉన్న ఈ రికార్డును స్మిత్ అధిగమించాడు. జో రూట్ (13) మూడో స్థానంలో ఉన్నాడు. టీమిండియాపై వన్డేల్లో 5 శతకాలు బాదిన స్మిత్, టెస్టుల్లో 10 సెంచరీలు చేశాడు. ఇక భారత్, ఆ్రస్టేలియా మధ్య టెస్టుల్లో అత్యధిక (10) సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. సచిన్ (11) అగ్రస్థానంలో ఉన్నాడు. 1 టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు వేర్వేరు జట్లపై 10 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన తొలి ప్లేయర్గా స్టీవ్ స్మిత్ రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లండ్పై 12 శతకాలు నమోదు చేసిన స్మిత్కు భారత్పై ఇది పదో సెంచరీ.2 టెస్టుల్లో ఆ్రస్టేలియా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో స్మిత్ (33) రెండో స్థానానికి చేరాడు. బ్రిస్బేన్ మ్యాచ్లో శతకంతో స్మిత్... స్టీవ్ వా (32)ను దాటేశాడు. రికీ పాంటింగ్ 41 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. 12 టెస్టు మ్యాచ్లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం బుమ్రాకిది 12వ సారి. భారత పేసర్లలో కపిల్దేవ్ 16 సార్లు ఈ ఫీట్ నమోదు చేయగా... బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు.10 ఆసియా ఆవలి పిచ్లపై బుమ్రా 5 వికెట్లు పడగొట్టడం ఇది పదోసారి. ఈ జాబితాలో కపిల్దేవ్ (9)ను అధిగమించి బుమ్రా అగ్రస్థానానికి చేరాడు. -
ఆధిక్యంలోకి వెళతారా!
బ్రిస్బేన్: ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా భారత్, ఆ్రస్టేలియా మధ్య నేటి నుంచి బ్రిస్బేన్లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్లు చెరో విజయంతో 1–1తో సమఉజ్జీలుగా ఉండగా... పేస్కు స్వర్గధామమైన బ్రిస్బేన్లో ఎవరు పైచేయి సాధిస్తారనేది కీలకంగా మారింది. అడిలైడ్లో జరిగిన రెండో టెస్టులో భారత బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో... టీమిండియాకు పరాజయం తప్పకపోగా... ఈ మ్యాచ్లో వాటిని అధిగమించి విజయం సాధించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. తొలి టెస్టులో సెంచరీ చేసినప్పటికీ... ఆఫ్స్టంప్ అవతల పడుతున్న బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లి నుంచి సాధికారిక ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. ఇక గత కొంత కాలంగా సుదీర్ఘ ఫార్మాట్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న రోహిత్ శర్మ తిరిగి ఓపెనింగ్ చేయడం ఖాయమే. మరోవైపు గత మ్యాచ్లో విజయంతో ఆ్రస్టేలియా ఆత్మవిశ్వాసంతో ఉన్నా... స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా పేలవ ఫామ్ ఆసీస్ను ఇబ్బంది పెడుతోంది. ఒత్తిడిలో రోహిత్, కోహ్లి కెరీర్లో దాదాపు చివరి ఆ్రస్టేలియా పర్యటనలో ఉన్న భారత సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, కోహ్లి ఒత్తిడిలో కనిపిస్తున్నారు. తొలి టెస్టుకు అందుబాటులో లేని రోహిత్... అడిలైడ్లో మిడిలార్డర్లో బరిలోకి దిగి ప్రభావం చూపలేకపోయాడు. దీంతో మరోసారి రోహిత్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా... కేఎల్ రాహుల్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఏకైక స్పిన్నర్గా అశ్విన్, సుందర్, జడేజా మధ్య పోటీ ఉన్నా... గతంలో ఇక్కడ మెరుగైన ప్రదర్శన చేసిన వాషింగ్టన్ సుందర్ వైపు మొగ్గు చూపొచ్చు. ఇక మూడో పేసర్గా హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్దీప్ సింగ్కు అవకాశం దక్కవచ్చు. ఆత్మవిశ్వాసంలో ఆ్రస్టేలియా.. సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా అదే జోరులో సిరీస్లో ఆధిక్యం సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్లో ఘోర పరాజయం ఎదురైనా... అడిలైడ్లో హెడ్ మెరుపు సెంచరీతో చెలరేగడంతో కంగారూలు గాడిన పడ్డారు. అయితే స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్తో పాటు ఉస్మాన్ ఖ్వాజా, మెక్స్వీనీ, మిషెల్ మార్‡్ష, అలెక్స్ కేరీ రాణించాల్సిన అవసరముంది. లబుషేన్ గత మ్యాచ్లో అర్ధశతకంతో ఆకట్టుకున్నా... పూర్తి నియంత్రణతో కనిపించలేదు. బౌలింగ్లో మాత్రం ఆసీస్కు ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, గిల్, కోహ్లి, పంత్, రాహుల్, నితీశ్ రెడ్డి, సుందర్/అశ్విన్, ఆకాశ్దీప్, సిరాజ్, బుమ్రా. ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), ఖ్వాజా, మెక్స్వీనీ, లబుషేన్, స్మిత్, హెడ్, మార్‡్ష, కారీ, స్టార్క్, లయన్, హాజల్వుడ్. పిచ్, వాతావరణం బ్రిస్బేన్ పిచ్ పేస్, బౌన్స్కు సహకరించనుంది. ఈ టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. తొలి రోజు ఉదయం వర్షం కురిసే అవకాశముంది. -
IND vs AUS 3rd Test: ఫుల్ ప్రాక్టీస్...
బ్రిస్బేన్: ఆ్రస్టేలియాతో మూడో టెస్టుకు ముందు భారత క్రికెట్ జట్టు కఠోర సాధన చేస్తోంది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని నిలబెట్టుకోవడంతో పాటు... ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరడమే లక్ష్యంగా సాగుతున్న టీమిండియా గురువారం బ్రిస్బేన్లో చెమటోడ్చింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్లు చెరో టెస్టు గెలిచి 1–1తో సమంగా నిలవగా... శనివారం నుంచి మూడో మ్యాచ్ ప్రారంభం కానుంది. దీని కోసం గురువారమే బ్రిస్బేన్ చేరుకున్న రోహిత్ శర్మ బృందం... రోజంతా ప్రాక్టీస్లో నిమగ్నమైంది. గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా పర్యటనలో టెస్టు సిరీస్లు గెలిచిన టీమిండియా... ఈసారి కూడా అదే మ్యాజిక్ కొనసాగిస్తూ ‘హ్యాట్రిక్’ కొట్టాలని భావిస్తోంది. అడిలైడ్లో ‘పింక్ బాల్’తో జరిగిన రెండో టెస్టులో పరాజయంతో జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసం లోపించినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో మాజీ కెపె్టన్ విరాట్ కోహ్లి ఆటగాళ్లకు కీలక సూచనలు చేశాడు. టెస్టు ఫార్మాట్లో రోహిత్ కన్నా ఎక్కువ అనుభవం ఉన్న కోహ్లి... గురువారం ప్రాక్టీస్ సందర్భంగా సహచరుల్లో స్ఫూర్తి నింపాడు. తిరిగి పుంజుకునే విధంగా యువ ఆటగాళ్లకు కీలక సూచనలు ఇచ్చాడు. బుమ్రా, రోహిత్తోనూ కోహ్లి విడిగా చర్చిస్తూ కనిపించాడు. గత మ్యాచ్లో మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగి విఫలమైన కెపె్టన్ రోహిత్ శర్మ... మూడో టెస్టులో ఏ స్థానంలో బరిలోకి దిగుతాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ అటు కొత్త బంతితో పాటు... పాత బంతితోనూ సాధన కొనసాగించాడు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కొత్త బంతితో ప్రాక్టీస్ చేశారు.పచ్చికతో కూడిన గబ్బా పిచ్... పేస్కు, బౌన్స్కు సహకరించడం ఖాయం కాగా... రోహిత్ ఓపెనర్గానే బరిలోకి దిగి ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీయడమే మేలని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రాక్టీస్ సెషన్ను దగ్గరుండి పర్యవేక్షించాడు. ఈ సందర్భంగా రోహిత్, కోహ్లీతో గంభీర్ సుదీర్ఘంగా సంభాషిoచాడు. ఆకాశ్కు అవకాశం దక్కేనా! నెట్స్లో భారత బౌలర్లంతా తీవ్రంగా శ్రమించగా... పేసర్ ఆకాశ్దీప్ తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. అయినా మూడో టెస్టులో అతడికి అవకాశం దక్కడం కష్టమే. ఆ్రస్టేలియాతో తొలి టెస్టు ద్వారానే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా రెండో మ్యాచ్లో ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఇప్పుడప్పుడే అతడి స్థానానికి వచ్చిన ప్రమాదమేమీ లేకపోయినా... ప్రాక్టీస్లో ఆకాశ్ బౌలింగ్ చూస్తుంటే హర్షిత్ స్థానంలో అతడికి అవకాశం ఇవ్వడమే మేలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడో టెస్టు జరగనున్న పిచ్ హర్షిత్ బౌలింగ్ శైలికి సహకరించే అవకాశాలున్నాయి. శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకొని దేశవాళీల్లో సత్తాచాటిన సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో పాల్గొనే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. రంజీ ట్రోఫీతో పాటు ముస్తాక్ అలీ టోర్నీలో షమీ సత్తా చాటినా... టెస్టు మ్యాచ్కు అవసరమైన ఫిట్నెస్ అతడు ఇంకా సాధించలేదు. ‘షమీ గాయం నుంచి కోలుకున్నా... ఇంకా మడమ వాపు పూర్తిగా తగ్గలేదు. ఎక్కువ పనిభారం పడితే గాయం తిరగబెట్టే ప్రమాదం ఉంది. అతడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడటానికి ముందు ఒక్కో మ్యాచ్లో 10 ఓవర్ల పాటు మూడు స్పెల్స్ వేయాల్సి ఉంటుంది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో షమీ బెంగాల్ తరఫున బరిలోకి దిగుతాడు’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మూడో టెస్టులోనూ భారత జట్టు ఏకైక స్పిన్నర్తోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లో ఎవరికి చాన్స్ దక్కుతుందో చూడాలి. జైస్వాల్ బస్ మిస్.. రెండో టెస్టు ముగిసిన అనంతరం గురువారం అడిలైడ్ నుంచి బ్రిస్బేన్కు బయలుదేరే సమయంలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిర్ణీత సమయానికి టీమ్ బస్ వద్దకు చేరుకోలేకపోయాడు. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... జైస్వాల్ను అక్కడే వదిలి మిగిలిన జట్టుతో ఎయిర్పోర్ట్కు పయనమయ్యాడు. జట్టు సభ్యులంతా వచి్చన తర్వాత కూడా జైస్వాల్ అక్కడికి రాకపోవడంతో రోహిత్ అసహనానికి గురయ్యాడు. ఉదయం 10 గంటలకు విమానం ఎక్కాల్సి ఉండటంతో... జట్టు సభ్యులంతా గం 8:30కి హోటల్ నుంచి బయలుదేరగా... జైస్వాల్ సమయానికి రాలేకపోయాడు. దీంతో 20 నిమిషాల అనంతరం హోటల్ సిబ్బంది ప్రత్యేక వాహనంలో జైస్వాల్ను విమానాశ్రయానికి చేర్చారు. -
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు.. నెట్స్లో చెమటోడ్చుతున్న భారత ప్లేయర్లు
అడిలైడ్: రెండో టెస్టులో ఆ్రస్టేలియా చేతిలో ఘోర పరాజయం మూటగట్టుకున్న భారత జట్టు తిరిగి గాడిన పడటంపై దృష్టి పెట్టింది. భారత్, ఆ్రస్టేలియా మధ్యఅడిలైడ్ వేదికగా ‘గులాబీ బంతి’తో జరిగిన రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగియగా... మంగళవారం టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ‘అదనపు సమయాన్ని హోటల్ రూమ్స్లో కాకుండా... మైదానంలో గడపండి’ అని మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ అన్న మాటల ప్రభావమో, లేక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించాలనే తపనో కానీ మంగళవారం భారత ఆటగాళ్లు నెట్స్లో తీవ్రంగా శ్రమించారు.‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా ఇరు జట్ల మధ్య శనివారం నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. దీని కోసం బుధవారం బ్రిస్బేన్ బయలుదేరనున్న టీమిండియా... మంగళవారం అడిలైడ్లో కఠోర సాధన చేసింది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘మూడో టెస్టు కోసం సాధన మొదలైంది’ అని రాసుకొచ్చింది. గత 12 టెస్టు ఇన్నింగ్స్ల్లో కేవలం ఒకే ఒక్క అర్ధశతకంతో 142 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ... పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొంటూ కనిపించగా... పెర్త్ టెస్టులో సెంచరీ బాదిన కోహ్లి తన ఆఫ్స్టంప్ బలహీనతను అధిగమించడంపై దృష్టి పెట్టాడు. హెడ్ కోచ్ గంభీర్ పర్యవేక్షణలో ఆటగాళ్లంతా నెట్స్లో సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశారు. కేఎల్ రాహుల్ డిఫెన్స్పై దృష్టి సారించగా... పంత్ భారీ షాట్లు సాధన చేశాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేసర్లతో బంతులు వేయించుకొని ప్రాక్టీస్ సాగించాడు. హర్షిత్ రాణా, ఆకాశ్దీప్, యశ్ దయాళ్, జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. వీరితో పాటు త్రో డౌన్ స్పెషలిస్ట్ల బంతులతో కూడా బ్యాటర్లు సాధన చేశారు. సీనియర్ పేసర్లు బుమ్రా, సిరాజ్తో పాటు ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ప్రాక్టీస్కు దూరంగా ఉన్నారు. బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు 7 టెస్టులు జరిగాయి. ఒక మ్యాచ్లో భారత్ నెగ్గగా... ఐదు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా గెలిచింది, మరో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. -
ఉత్సాహంతో టీమిండియా.. ఒత్తిడిలో ఆస్ట్రేలియా
ఆ్రస్టేలియా గడ్డపై వరుసగా మూడోసారి టెస్టు సిరీస్ సాధించడంతో పాటు... ప్రపంచ టెస్టు చాంపియన్íÙప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలనే లక్ష్యంతో టీమిండియా రెండో టెస్టుకు సమాయత్తమైంది. గతంలో ఇక్కడే జరిగిన ‘పింక్ బాల్ టెస్టు’లో పేలవ ప్రదర్శనతో ఘోర పరాజయం మూటగట్టుకున్న భారత జట్టు ఈసారి చరిత్ర తిరగరాయాలని భావిస్తుంటే... గులాబీ బంతితో మ్యాజిక్ చేయాలని ఆసీస్ బృందం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో అడిలైడ్లో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి. అడిలైడ్: ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ సిరీస్లో బోణీ కొట్టిన టీమిండియా అదే జోరు కొనసాగించాలని చూస్తుంటే... తిరిగి పుంజుకుని సిరీస్ సమం చేయాలని కంగారూలు భావిస్తున్నారు. ఈ మ్యాచ్ ‘డే అండ్ నైట్’పద్ధతిలో ‘పింక్ బాల్’తో నిర్వహించనున్నారు. ఆసీస్ గడ్డపై చివరిసారి అడిలైడ్లోనే ‘గులాబీ టెస్టు’ ఆడిన భారత జట్టు తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు (36 ఆలౌట్) నమోదు చేసుకోగా... ఆ చేదు జ్ఞాపకాలను అధిగమించి ముందంజ వేయాలని టీమిండియా యోచిస్తోంది. గత మ్యాచ్కు అందుబాటులో లేకపోయిన రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ రాకతో భారత జట్టు బలం మరింత పెరిగింది. రోహిత్ మిడిలార్డర్లో.. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకు దూరమైన రోహిత్... అడిలైడ్లో మిడిలార్డర్లో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించాడు. పెర్త్ టెస్టులో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ జంట మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో ఈ జోడీని విడదీయడం లేదని పేర్కొన్నాడు. గాయంతో తొలి మ్యాచ్ ఆడని గిల్ మూడో స్థానంలో బరిలోకి దిగనుండగా... నాలుగో స్థానంలో కోహ్లి ఆడతాడు. ఆ్రస్టేలియా గడ్డపై ఘనమైన రికార్డు ఉన్న కోహ్లి తిరిగి లయ అందుకోవడం జట్టుకు సానుకూలాంశం కాగా... మిడిలార్డర్లో రోహిత్, పంత్ బ్యాటింగ్ చేయనున్నారు. అడిలైడ్ పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశాలున్నప్పటికీ ‘పింక్ బాల్’ టెస్టు కావడంతో టీమ్ మేనేజ్మెంట్ వాషింగ్టన్ సుందర్వైపే మొగ్గు చూపనుంది. పేస్ ఆల్రౌండర్గా ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి చోటు నిలబెట్టుకోనుండగా... హైదరాబాద్ పేసర్ సిరాజ్, హర్షిత్ రాణాతో కలిసి బుమ్రా పేస్ భారాన్ని మోయనున్నాడు. తొలి టెస్టు తర్వాత లభించిన 10 రోజుల విరామంలో భారత జట్టు పీఎం ఎలెవన్తో పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటంతో పాటు నెట్స్లో కఠోర సాధన చేసింది. అచ్చొచ్చిన అడిలైడ్లో... పెర్త్లో భారత జట్టు చేతిలో ఘోర పరాజయం తర్వాత తిరిగి పుంజుకునేందుకు ఆ్రస్టేలియా కసరత్తులు చేస్తోంది. స్వదేశంలో ఇప్పటి వరకు ఆడిన 12 ‘డే అండ్ నైట్’ మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క దాంట్లో ఓడిన ఆస్ట్రేలియా... అడిలైడ్లో ఆడిన 7 ‘పింక్ టెస్టు’ల్లోనూ విజయం సాధించింది. గత టెస్టులో భారత ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పేసర్ హాజల్వుడ్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా... అతడి స్థానంలో బోలాండ్ తుది జట్టులోకి రానున్నాడు. ఖ్వాజా, లబుషేన్, స్మిత్ కలిసికట్టుగా రాణించాలని ఆసీస్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఫ్లడ్లైట్ల వెలుతురులో స్టార్క్, కమిన్స్ బంతులను ఎదుర్కోవడం భారత ప్లేయర్లకు శక్తికి మించిన పనే. పిచ్, వాతావరణం అడిలైడ్ పిచ్ అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లకు సమానంగా సహకరించనుంది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. పిచ్పై పచ్చిక ఉండనుంది. ఆరంభంలో పేసర్లకు అదనపు ప్రయోజనం లభించనుంది. తొలి రెండు రోజులు ఆటకు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. 22 ఇప్పటి వరకు మొత్తం 22 డే అండ్ నైట్ టెస్టులు జరిగాయి. అన్ని మ్యాచ్ల్లోనూ ఫలితాలు రావడం విశేషం. అత్యధికంగా ఆ్రస్టేలియా జట్టు 12 డే అండ్ నైట్ టెస్టులు ఆడి 11 మ్యాచ్ల్లో నెగ్గి, ఒక మ్యాచ్లో ఓడింది. 7 అడిలైడ్లో ఆ్రస్టేలియా జట్టు ఆడిన 7 డే అండ్ నైట్ టెస్టుల్లోనూ గెలుపొందింది.4 భారత జట్టు ఇప్పటి వరకు 4 డే అండ్ నైట్ టెస్టులు ఆడింది. ఇందులో మూడింటిలో గెలిచి (2019లో బంగ్లాదేశ్పై కోల్కతాలో; 2021లో ఇంగ్లండ్పై అహ్మదాబాద్లో; 2022లో శ్రీలంకపై బెంగళూరులో), ఒక మ్యాచ్లో (2020 లో ఆ్రస్టేలియా చేతిలో అడిలైడ్లో) ఓడిపోయింది.తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్ ), జైస్వాల్, రాహుల్, గిల్, కోహ్లి, పంత్, సుందర్, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా, బుమ్రా, సిరాజ్. ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్ ), ఖ్వాజా, మెక్స్వీనీ, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్ , కేరీ, స్టార్క్, లయన్, బోలాండ్. -
బెంబేలెత్తించిన బుమ్రా.. విజయం వాకిట్లో టీమిండియా
కంగారూలకు పెట్టని కోటలాంటి పెర్త్లో టీమిండియా అదరగొడుతోంది. బౌలర్ల స్ఫూర్తికి బ్యాటర్ల జోరు తోడవడంతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత్ తొలి విజయానికి చేరువైంది. యశస్వి జైస్వాల్ భారీ సెంచరీకి... కోహ్లి సమయోచిత శతకం తోడవడంతో ఆ్రస్టేలియా ముందు టీమిండియా 534 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.మన ఆటగాళ్లు చెడుగుడు ఆడుకున్న పిచ్పై ఆసీస్ బ్యాటర్లు తడబడ్డారు. ఫలితంగా 4.2 ఓవర్లలోనే ఆతిథ్య జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో గెలుపు ఆశలు వదులుకున్న ఆసీస్ ఆటగాళ్లు నాలుగో రోజు ఎంత సమయం క్రీజులో నిలుస్తారో వేచి చూడాలి!పెర్త్: ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు తొలి టెస్టులో విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లు చెలరేగడంతో ఆ్రస్టేలియా ముందు కొండంత లక్ష్యం నిలిచింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (297 బంతుల్లో 161; 15 ఫోర్లు, 3 సిక్స్లు) భారీ సెంచరీతో కదంతొక్కగా... విరాట్ కోహ్లి (143 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కళాత్మక శతకంతో విజృంభించాడు. ఓవర్నైట్ స్కోరు 172/0తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 134.3 ఓవర్లలో 487/6 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్ (176 బంతుల్లో 77; 5 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (27 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. కోహ్లి సెంచరీ పూర్తి కాగానే భారత కెపె్టన్ బుమ్రా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. ఫలితంగా ఆ్రస్టేలియా ముందు 534 పరుగుల లక్ష్యం నిలిచింది. లయన్ 2... స్టార్క్, హాజల్వుడ్, కమిన్స్, మార్ష్తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 4.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. బుమ్రా (2/1), సిరాజ్ (1/7) ఆసీస్ను దెబ్బ కొట్టారు. మెక్స్వీనీ (0), కమిన్స్ (2), లబుషేన్ (3) అవుట్ కాగా... ఉస్మాన్ ఖ్వాజా (9 బంతుల్లో 3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న ఆసీస్... విజయానికి ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్ల జోరు ఇలాగే సాగితే సోమవారం తొలి సెషన్లోనే ఆసీస్ ఆట ముగిసే అవకాశాలున్నాయి. ‘జై’స్వాల్ గర్జన సుదీర్ఘ ఫార్మాట్లో భారీ సెంచరీలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న యశస్వి జైస్వాల్... ఆ్రస్టేలియా గడ్డపై ఆడుతున్న తొలి టెస్టులోనే సత్తా చాటాడు. బౌన్సీ పిచ్పై రాణించేందుకు ప్రత్యేకంగా సాధన చేసి బరిలోకి దిగిన 22 ఏళ్ల జైస్వాల్... నాణ్యమైన పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో ఆసీస్ గడ్డపై తొలి వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రాహుల్తో కలిసి రికార్డుల్లోకెక్కిన జైస్వాల్.. 205 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టార్క్ వేసిన బౌన్సర్ను అప్పర్ కట్తో జైస్వాల్ సిక్సర్గా మలిచిన తీరు హైలైట్. తొలి ఇన్నింగ్స్లో చెత్త షాట్కు పెవిలియన్ చేరిన జైస్వాల్... ఈసారి ఎలాంటి తప్పిదాలు చేయకుండా ముందుకు సాగాడు. క్లిష్టమైన పిచ్పై మెరుగైన డిఫెన్స్తో ఆకట్టుకున్న రాహుల్ను స్టార్క్ అవుట్ చేయగా... దేవదత్ పడిక్కల్ (71 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు.రెండో కొత్త బంతి తీసుకున్న అనంతరం పడిక్కల్ పెవిలియన్ చేరగా... జైస్వాల్ 275 బంతుల్లో 150 మార్క్ దాటాడు. 23 ఏళ్లలోపు వయసులో నాలుగుసార్లు 150 పైచిలుకు పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచిన జైస్వాల్ చివరకు మార్ష్బౌలింగ్లో వెనుదిరిగాడు. ‘కోహ్లి’నూర్ ఇన్నింగ్స్... చాన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న విరాట్ కోహ్లి... ‘క్లాస్ శాశ్వతం, ఫామ్ తాత్కాలికం’ అని నిరూపించాడు. పిచ్ బౌన్స్కు సహకరిస్తున్న సమయంలో సంయమనం చూపి... కుదురుకున్నాక ట్రేడ్మార్క్ కవర్ డ్రైవ్లతో కట్టి పడేశాడు. స్వల్ప వ్యవధిలో జైస్వాల్తో పాటు పంత్ (1), జురేల్ (1) అవుట్ అయిన దశలో కోహ్లి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (29; ఒక సిక్స్)తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. అనూహ్య బౌన్స్తో కంగారూలు పరీక్షించినా... కోహ్లి ఏమాత్రం తడబడలేదు. పదే పదే వికెట్ పక్క నుంచి షాట్లు ఆడుతూ చకచకా పరుగులు రాబట్టాడు. సుందర్ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి టి20ల తరహాలో రెచి్చపోయి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్లో బౌండరీతో కోహ్లి టెస్టుల్లో 30వ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ (29)ను అధిగమించిన కోహ్లి... ఆసీస్ గడ్డపై ఏడో సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 150; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 104; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) మార్ష్161; రాహుల్ (సి) కేరీ (బి) స్టార్క్ 77; పడిక్కల్ (సి) స్మిత్ (బి) హాజల్వుడ్ 25; కోహ్లి (నాటౌట్) 100; పంత్ (స్టంప్డ్) కేరీ (బి) లయన్ 1; జురేల్ (ఎల్బీ) (బి) కమిన్స్ 1; సుందర్ (బి) లయన్ 29; నితీశ్ కుమార్ రెడ్డి (నాటౌట్) 38; ఎక్స్ట్రాలు 55; మొత్తం (134.3 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్) 487. వికెట్ల పతనం: 1–201, 2–275, 3–313, 4–320, 5–321, 6–410. బౌలింగ్: స్టార్క్ 26–2–111–1; హాజల్వుడ్ 21–9–28–1; కమిన్స్ 25–5–86–1; మార్ష్12–0–65–1; లయన్ 39–5–96–2; లబుషేన్ 6.3–0–38–0; హెడ్ 5–0–26–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: మెక్స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 0; ఖ్వాజా (బ్యాటింగ్) 3; కమిన్స్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 2; లబుషేన్ (ఎల్బీ) (బి) బుమ్రా 3; ఎక్స్ట్రాలు 4; మొత్తం (4.2 ఓవర్లలో 3 వికెట్లకు ) 12. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–12, బౌలింగ్: బుమ్రా 2.2–1–1–2; సిరాజ్ 2–0–7–1.201 ఈ మ్యాచ్లో భారత ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ తొలి వికెట్కు జోడించిన పరుగులు. ఆ్రస్టేలియా గడ్డపై టీమిండియాకు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. 1986 సిడ్నీ టెస్టులో గావస్కర్–శ్రీకాంత్ నమోదు చేసిన 191 పరుగుల భాగస్వామ్యం రెండో స్థానానికి చేరింది. 3 ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. 1968లో జయసింహ, 1977లో గావస్కర్ ఈ ఘనత సాధించారు. -
పెర్త్పై పట్టు
బౌలర్ల అసమాన ప్రదర్శనకు... ఓపెనర్ల సహకారం తోడవడంతో పెర్త్ టెస్టుపై టీమిండియాకు పట్టు చిక్కింది. తొలి రోజు పేస్కు స్వర్గధామంలా కనిపించిన పిచ్పై రెండో రోజు భారత ఓపెనర్లు చక్కని సంయమనంతో బ్యాటింగ్ చేశారు. ఫలితంగా ఆ్రస్టేలియా బౌలర్లు ఒత్తిడిలో కూరుకుపోగా... జైస్వాల్, రాహుల్ అర్ధశతకాలతో అజేయంగా నిలిచారు. అంతకుముందు మన పేసర్ల ధాటికి ఆ్రస్టేలియా 104 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవరాల్గా 218 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్... మూడోరోజు ఇదే జోరు కొనసాగిస్తే ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో బోణీ కొట్టడం ఖాయం!పెర్త్: ‘ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి’ అన్న చందంగా... తొలి ఇన్నింగ్స్లో పేలవ షాట్ సెలెక్షన్తో విమర్శలు ఎదుర్కొన్న భారత ఆటగాళ్లు... రెండో ఇన్నింగ్స్లో సాధికారికంగా ఆడటంతో ఆ్రస్టేలియాతో తొలి టెస్టులో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. కంగారూ పేసర్ల కఠిన పరీక్షకు భారత ఓపెనర్లు సమర్థవంతంగా ఎదురు నిలవడంతో పెర్త్ టెస్టులో బుమ్రా సేన పైచేయి దిశగా సాగుతోంది. ఓవర్నైట్ స్కోరు 67/7తో శనివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా... చివరకు 51.2 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 46 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మిషెల్ స్టార్క్ (112 బంతుల్లో 26; 2 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (21) క్రితం రోజు స్కోరుకు రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగినా... స్టార్క్ మొండిగా పోరాడాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా... హర్షిత్ రాణా 3, మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (193 బంతుల్లో 90 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి చేరువవగా... తొలి ఇన్నింగ్స్లో సందేహాస్పద నిర్ణయానికి పెవిలియన్ చేరిన రాహుల్ (153 బంతుల్లో 62 బ్యాటింగ్; 4 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఏడుగురు బౌలర్లను మార్చిమార్చి ప్రయతి్నంచినా ఆసీస్ ఈ జోడీని విడగొట్టలేకపోయింది. చేతిలో 10 వికెట్లు ఉన్న టీమిండియా ఓవరాల్గా 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి రోజు 17 వికెట్లు కూలగా... రెండో రోజు మూడు వికెట్లు మాత్రమే పడ్డాయి. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారకపోయినా... భారత బ్యాటర్లు మూడో రోజు కూడా ఇదే జోరు కొనసాగిస్తే ఈ మ్యాచ్లో భారత్కు భారీ ఆధిక్యం లభించనుంది. స్టార్క్ అడ్డుగోడలా.. తొలి రోజు మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతో పూర్తి ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టిన భారత బౌలర్ల సహనానికి రెండోరోజు స్టార్క్ పరీక్ష పెట్టాడు. స్పెషలిస్ట్ బ్యాటర్ను తలపిస్తూ తన డిఫెన్స్తో కట్టిపడేశాడు.ఓవర్నైట్ బ్యాటర్ అలెక్స్ కేరీని కీపర్ క్యాచ్ ద్వారా వెనక్కి పంపిన బుమ్రా... టెస్టుల్లో 11వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్నాడు. నాథన్ లయన్ (5) కూడా త్వరగానే ఔట్ కాగా... చివరి వికెట్కు హాజల్వుడ్ (31 బంతుల్లో 7 నాటౌట్; ఒక ఫోర్)తో కలిసి స్టార్క్ చక్కటి పోరాటం కనబర్చాడు. ఈ జోడీని విడదీయడానికి బుమ్రా ఎన్ని ప్రయోగాలు చేసినా సాధ్యపడలేదు. ఈ ఇద్దరు పదో వికెట్కు 110 బంతుల్లో 25 పరుగులు జోడించి జట్టు స్కోరును వంద పరుగుల మార్క్ దాటించారు. చివరకు హర్షిత్ బౌలింగ్లో స్టార్క్ కీపర్కు క్యాచ్ ఇవ్వడంతో ఆ్రస్టేలియా ఇన్నింగ్స్కు తెరపడింది. ఫలితంగా భారత జట్టుకు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓపెనింగ్ అజేయం తొలి ఇన్నింగ్స్ పేలవ ప్రదర్శనను మరిపిస్తూ... రెండో ఇన్నింగ్స్లో భారత ఓపెనర్లు సత్తాచాటారు. పిచ్ కాస్త బ్యాటింగ్కు అనుకూలంగా మారిన మాట వాస్తవమే అయినా... భీకర పేస్తో విజృంభిస్తున్న కంగారూ బౌలర్లను కాచుకుంటూ జైస్వాల్, రాహుల్ సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. క్లిష్టమైన బంతుల్ని డిఫెన్స్ ఆడిన ఈ జోడీ... చెత్త బంతులకు పరుగులు రాబట్టింది. జైస్వాల్ కచ్చితమైన షాట్ సెలెక్షన్తో బౌండరీలు బాదాడు. రాహుల్ డిఫెన్స్తో కంగారూలను కలవరపెట్టాడు. సమన్వయంతో ముందుకు సాగిన ఓపెనర్లిద్దరూ బుల్లెట్లలాంటి బంతుల్ని తట్టుకొని నిలబడి... గతితప్పిన బంతులపై విరుచుకుపడ్డారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్లో భారత్ 3.01 రన్రేట్తో పరుగులు చేసింది. ఈ క్రమంలో మొదట జైస్వాల్ 123 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... కాసేపటికి రాహుల్ 124 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు. టెస్టు క్రికెట్లో జైస్వాల్కు ఇదే అత్యంత నెమ్మదైన హాఫ్సెంచరీ కాగా... ఆ తర్వాత గేర్ మార్చిన యశస్వి ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగు పెట్టించాడు. రెండు సెషన్ల పాటు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ పడగొట్టలేకపోయిన ఆసీస్ బౌలర్లు... మూడో రోజు తొలి సెషన్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారనేదానిపై భారత ఆధిక్యం ఆధారపడి ఉంది. మైదానంలో బాగా ఎండ కాస్తుండటంతో... నాలుగో ఇన్నింగ్స్లో పగుళ్లు తేలిన పిచ్పై లక్ష్యఛేదన అంత సులభం కాకపోవచ్చు. రికార్డు స్థాయిలో ప్రేక్షకులు పెర్త్ టెస్టుకు అభిమానులు ఎగబడుతున్నారు. రెండో రోజు శనివారం ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 32,368 మంది అభిమానులు వచ్చారు. ఈ స్టేడియం చరిత్రలో టెస్టు మ్యాచ్కు ఇంతమంది ప్రేక్షకుల హాజరు కావడం ఇదే తొలిసారి. ‘భారత్, ఆ్రస్టేలియా తొలి టెస్టుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలి రెండు రోజుల్లో 63,670 మంది మ్యాచ్ను వీక్షించారు’ అని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ ఇప్పటి వరకు ఒక టెస్టు మ్యాచ్ (2006–07 యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మ్యచ్)కు అత్యధికంగా 1,03,440 మంది హాజరయ్యారు. ఇప్పుడు తాజా టెస్టులో మరో మూడు రోజుల ఆట మిగిలి ఉండగా... ఇంకో 39,771 మంది తరలివస్తే ఆ రికార్డు బద్దలవనుంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 150; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) కోహ్లి (బి) బుమ్రా 8; మెక్స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 10; లబుషేన్ (ఎల్బీ) (బి) సిరాజ్ 2; స్మిత్ (ఎల్బీ) బుమ్రా 0; హెడ్ (బి) హర్షిత్ రాణా 11; మార్ష్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 6; కేరీ (సి) పంత్ (బి) బుమ్రా 21; కమిన్స్ (సి) పంత్ (బి) బుమ్రా 3; స్టార్క్ (సి) పంత్ (బి) హర్షిత్ రాణా 26; లయన్ (సి) రాహుల్ (బి) హర్షిత్ రాణా 5; హాజల్వుడ్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 5; మొత్తం (51.2 ఓవర్లలో ఆలౌట్) 104. వికెట్ల పతనం: 1–14, 2–19, 3–19, 4–31, 5–38, 6–47, 7–59, 8–70, 9–79, 10–104. బౌలింగ్: బుమ్రా 18–6–30–5, సిరాజ్ 13–7–20–2, హర్షిత్ రాణా 15.2–3–48–3, నితీశ్ రెడ్డి 3–0–4–0, సుందర్ 2–1–1–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (బ్యాటింగ్) 90; రాహుల్ (బ్యాటింగ్) 62; ఎక్స్ట్రాలు 20; మొత్తం (57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 172. బౌలింగ్: స్టార్క్ 12–2–43–0, హాజల్వుడ్ 10–5–9–0, కమిన్స్ 13–2–44–0, మార్ష్ 6–0–27–0, లయన్ 13–3–28–0, లబుషేన్ 2–0–2–0, హెడ్ 1–0–8–0. -
కుప్పకూలి... కూల్చేసి...
గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా గడ్డపై టెస్టు సిరీస్లు నెగ్గిన భారత జట్టు ‘హ్యాట్రిక్’ దిశగా తొలి అడుగు తడబడుతూ వేసింది. కంగారూ పేసర్లను ఎదుర్కోలేక భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇక కష్టమే అనిపించిన దశలో బౌలర్లు విజృంభించి టీమిండియాను తిరిగి పోటీలోకి తెచ్చారు. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం టెస్టులో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటే... బంతితో తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. నాయకుడు ముందుండి నడిపిస్తే ఎలా ఉంటుందో బుమ్రా చాటి చెప్పగా... అతడికి సిరాజ్, హర్షిత్ రాణా చక్కటి సహకారం అందించారు. రెండో రోజు ఇదే జోరు కొనసాగి... బౌలర్ల కృషికి బ్యాటర్ల సహకారం తోడైతే ఈ మ్యాచ్పై భారత్కు పట్టు చిక్కుతుంది. పెర్త్: బ్యాటర్లు విఫలమైన చోట... బౌలర్లు సత్తా చాటడంతో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తొలి రోజు భారత జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. ఐదు మ్యాచ్ల ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు ప్రారంభమైంది. పేసర్లకు స్వర్గధామం లాంటి పిచ్పై ఇరు జట్ల బౌలర్లు విజృంభించడంతో తొలి రోజే 17 వికెట్లు నేలకూలడం విశేషం. ఆట ముగిసే సమయానికి భారత్ భారీ ఆధిక్యం సాధించే స్థితిలో నిలిచింది. ఆ్రస్టేలియా గడ్డపై గత ఏడు దశాబ్దాల్లో ఒక టెస్టు మ్యాచ్లో తొలి రోజు 17 వికెట్లు పడటం ఇదే తొలిసారి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 49.4 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం టెస్టులో (59 బంతుల్లో 41; 6 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్గా నిలవగా... రిషబ్ పంత్ (78 బంతుల్లో 37; 3 ఫోర్లు, ఒక సిక్సర్), కేఎల్ రాహుల్ (74 బంతుల్లో 26; 3 ఫోర్లు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో హాజల్వుడ్ 4 వికెట్లు... స్టార్క్, కమిన్స్, మార్ష్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆ్రస్టేలియా ఆట ముగిసే సమయానికి 27 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (28 బంతుల్లో 19 బ్యాటింగ్; 3 ఫోర్లు), స్టార్క్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, హర్షిత్ రాణా ఒక వికెట్ తీశారు. చేతిలో 3 వికెట్లు ఉన్న ఆతిథ్య జట్టు భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది. రెండో రోజు తొలి సెషన్లో వీలైనంత త్వరగా ఆ్రస్టేలియాను ఆలౌట్ చేస్తే టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కుతుంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు నిలకడగా ఆడితే ఈ టెస్టు ఫలితాన్ని శాసించే అవకాశం లభిస్తుంది. బుల్లెట్లాంటి బంతులతో.. బ్యాటర్ల వైఫల్యంతో డీలా పడ్డ జట్టులో బుమ్రా తిరిగి జవసత్వాలు నింపాడు. ప్రతి బంతికి వికెట్ తీసేలా కనిపించి టీమిండియాకు శుభారంభం అందించాడు. మూడో ఓవర్లో మెక్స్వీనీ (10)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న బుమ్రా... ఏడో ఓవర్లో ఆసీస్కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. నాలుగో బంతికి ఉస్మాన్ ఖ్వాజా (8)ను అవుట్ చేసిన బుమ్రా... ఆ మరుసటి బంతికి ప్రమాదకర స్టీవ్ స్మిత్ (0)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. కెప్టెన్ స్పూర్తితో చెలరేగిన యువ పేసర్ హర్షిత్ రాణా మంచి వేగంతో ఆకట్టుకోగా... హైదరాబాదీ పేసర్ సిరాజ్ మెయిడెన్లతో విజృంభించాడు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ (11)ను హర్షిత్ క్లీన్ బౌల్డ్ చేశాడు. పచ్చికతో కూడిన పిచ్పై టాస్ గెలిచిన బుమ్రా బ్యాటింగ్ నిర్ణయం తీసుకోవడం క్రీడాభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసినా... ఇన్నింగ్స్ సాగుతున్న కొద్దీ అది సరైందనే భావన బలపడింది. మార్ష్ (6) రూపంలో తొలి వికెట్ ఖాతాలో వేసుకున్న సిరాజ్... క్రీజులో పాతుకుపోయిన లబుషేన్ (52 బంతుల్లో 2)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆసీస్ సారథి కమిన్స్ (3)ను బుమ్రా అవుట్ చేయడంతో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. పేస్కు అనుకూలమైన పిచ్పై భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్లో ఎలా ఆడతారనే అంశంపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. నమ్మకాన్ని నిలబెట్టుకున్న నితీశ్ ప్లేయర్ల సహనానికి పరీక్ష పెట్టే పెర్త్ పిచ్పై మొదట మన బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. ఆసీస్ బౌలర్లు విజృంభిస్తుంటే... కుదురుకోవడానికి ప్రయత్నించకుండా బాధ్యతారహిత షాట్లతో వికెట్లు సమర్పించుకున్నారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) మూడో ఓవర్లోనే అవుట్ కాగా... 23 బంతులు ఎదుర్కొన్న దేవదత్ పడిక్కల్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.ఆదుకుంటాడనుకున్న కోహ్లి (5) ఎక్కువసేపు నిలవలేకపోగా... కాస్త పోరాడిన కేఎల్ రాహుల్ అంపైర్ సందేహాస్పద నిర్ణయానికి పెవిలియన్ చేరాడు. ధ్రువ్ జురేల్ (11), వాషింగ్టన్ సుందర్ (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఫలితంగా భారత జట్టు 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పటికే క్రీజులో ఉన్న పంత్కు నితీశ్ జత కలవడంతో భారత జట్టు కోలుకోగలిగింది.ఆసీస్ గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న పంత్... కమిన్స్ బౌలింగ్లో కళ్లు చెదిరే సిక్స్తో ఆకట్టుకోగా... తొలి టెస్టు ఆడుతున్న నితీశ్ రెడ్డి ధాటిగా ఆడాడు. ఏడో వికెట్కు 48 పరుగులు జోడించిన అనంతరం పంత్ వెనుదిరిగాడు. పంత్ అవుటయ్యాక నితీశ్వేగంగా ఆడి జట్టు స్కోరును 150కి చేర్చి చివరి వికెట్గా పెవిలియన్కు చేరాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) మెక్స్వీనీ (బి) స్టార్క్ 0; రాహుల్ (సి) కేరీ (బి) స్టార్క్ 26; పడిక్కల్ (సి) కేరీ (బి) హాజల్వుడ్ 0; కోహ్లి (సి) ఖ్వాజా (బి) హాజల్వుడ్ 5; పంత్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 37; జురేల్ (సి) లబుషేన్ (బి) మార్ష్ 11; సుందర్ (సి) కేరీ (బి) మార్ష్ 4; నితీశ్ రెడ్డి (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 41; హర్షిత్ (సి) లబుషేన్ (బి) హాజల్వుడ్ 7; బుమ్రా (సి) కేరీ (బి) హాజల్వుడ్ 8; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 150. వికెట్ల పతనం: 1–5, 2–14, 3–32, 4–47, 5–59, 6–73, 7–121, 8–128, 9–144, 10–150. బౌలింగ్: స్టార్క్ 11–3–14–2; హాజల్వుడ్ 13–5–29–4; కమిన్స్ 15.4–2–67–2; లయన్ 5–1–23–0; మార్ష్ 5–1–12–2. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) కోహ్లి (బి) బుమ్రా 8; మెక్స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 10; లబుషేన్ (ఎల్బీ) (బి) సిరాజ్ 2; స్మిత్ (ఎల్బీ) బుమ్రా 0; హెడ్ (బి) హర్షిత్ రాణా 11; మార్ష్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 6; కేరీ (బ్యాటింగ్) 19; కమిన్స్ (సి) పంత్ (బి) బుమ్రా 3; స్టార్క్ (బ్యాటింగ్) 6; ఎక్స్ట్రాలు 2; మొత్తం (27 ఓవర్లలో 7 వికెట్లకు) 67. వికెట్ల పతనం: 1–14, 2–19, 3–19, 4–31, 5–38, 6–47, 7–59. బౌలింగ్: బుమ్రా 10–3–17–4; సిరాజ్ 9–6–17–2; హర్షిత్ రాణా 8–1–33–1. హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం ఈ మ్యాచ్ ద్వారా ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, పేస్ బౌలర్ హర్షిత్ రాణా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశారు. మ్యాచ్ ఆరంభానికి ముందు నితీశ్కు మాజీ కెపె్టన్ విరాట్ కోహ్లీ టెస్టు క్యాప్ అందించగా... హర్షిత్కు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశి్వన్ జాతీయ జట్టు క్యాప్ ఇచ్చి అభినందించారు. భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన 315వ ఆటగాడిగా నితీశ్ కుమార్ రెడ్డి, 316వ ప్లేయర్గా హర్షిత్ నిలిచారు. ఇటీవల బంగ్లాదేశ్తో స్వదేశంలో జరిగిన టి20 సిరీస్లో నితీశ్ తొలిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. న్యూఢిల్లీలో జరిగిన రెండో టి20 మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. మరోవైపు ఆ్రస్టేలియా ఓపెనర్ మెక్స్వీనీ కూడా పెర్త్ మ్యాచ్తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. -
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీకి రంగం సిద్ధం
-
India vs Australia: ఎవరిదో శుభారంభం!
క్రీడాభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్ ప్రారంభం కానుంది. గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా పర్యటనలో అదరగొట్టిన టీమిండియా ఈసారీ గెలిస్తే అరుదైన ‘హ్యాట్రిక్’ నమోదు చేస్తుంది. 136 ఏళ్ల తర్వాత ఆ్రస్టేలియా గడ్డపై ఆస్ట్రేలియాను వరుసగా మూడు సిరీస్లలో ఓడించిన తొలి జట్టుగా భారత్ నిలుస్తుంది. 1888లో ఇంగ్లండ్ జట్టు మాత్రమే వరుసగా మూడు సిరీస్లలో ఆస్ట్రేలియాను వారి దేశంలోనే ఓడించింది. ఆ తర్వాత ఇన్నేళ్లకు భారత జట్టుకు ఈ అవకాశం లభిస్తోంది. అయితే ఈసారి భారత జట్టుకు పెద్దగా సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో క్లీన్స్వీప్ కావడం... తొలి మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం... గాయంతో యువ ఆటగాడు శుబ్మన్ గిల్ వైదొలగడం... పుజారా, రహానే వంటి టెస్టు స్పెషలిస్టులు లేకపోవడం... కోహ్లి, కేఎల్ రాహుల్ ఆటలో నిలకడలేమి... వెరసి భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో అంచనా వేసే పరిస్థితి లేదు. గత రెండు పర్యాయాల్లో భారత జట్టు చేతిలో సిరీస్ కోల్పోయిన ఆ్రస్టేలియా ఈసారి మాత్రం అదరగొట్టే ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది. భారత్పై తొలి టెస్టు నుంచే ఒత్తిడి పెంచి ఈ సుదీర్ఘ సిరీస్లో శుభారంభం చేయాలనే లక్ష్యంతో కమిన్స్ బృందం ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ప్రవేశ పెట్టినప్పటి నుంచి రెండుసార్లు ఫైనల్ చేరిన టీమిండియా ... ముచ్చటగా మూడోసారి తుదిపోరుకు అర్హత సాధించాలంటే ఈ సిరీస్ను 4–0తో గెలవాల్సి ఉంటుంది. సొంతగడ్డపై ప్రత్యర్థి కోసం పన్నిన స్పిన్ ఉచ్చులో చిక్కి కివీస్ చేతిలో వైట్వాష్ కు గురైన భారత జట్టు... పేస్కు సహకరించే ఆ్రస్టేలియా గడ్డపై ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి! పెర్త్: పోరాటతత్వానికి పెట్టింది పేరైన ఆ్రస్టేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సమరానికి భారత జట్టు సిద్ధమైంది. ఆనవాయితీకి భిన్నంగా ఈసారి సిరీస్లో ఐదు టెస్టులు నిర్వహించనుండగా... శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్ విజయం ఇరు జట్లకు అత్యవసరం కావడంతో హోరాహోరీ పోరు సాగడం ఖాయం. గత రెండు ఆసీస్ పర్యటనల్లో (2018–19, 2020–21) సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి ట్రోఫీ గెలుచుకున్న టీమిండియా... వరుసగా మూడోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని చూస్తోంది. ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0–3తో సిరీస్ కోల్పోయిన భారత జట్టు ఒత్తిడిలో కనిపిస్తోంది. గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత జట్టుకు ఇదే తొలి విదేశీ టెస్టు సిరీస్ కాగా... అతడితో పాటు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి ఈ పర్యటన మరింత కీలకం కానుంది. గత ఆసీస్ పర్యటనలో రాణించిన పుజారా, రహానే, షమీ, శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో లేకపోగా... యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ పరీక్ష కానుంది. మరోవైపు సొంతగడ్డపై ఆసీస్ మెరుగైన సాధనతో సిద్ధంగా ఉంది. నితీశ్ రెడ్డి అరంగేట్రం! ఆ్రస్టేలియా పర్యటనలో రాణిస్తే అందరి దృష్టిని ఆకర్షిస్తారు. కెరీర్ తొలి నాళ్లలో సచిన్ టెండూల్కర్ ‘వాకా’ పిచ్పై శతకంతోనే మరింత పేరు ప్రఖ్యాతలు సాధించగా... 2014 ఆసీస్ టూర్ లో కోహ్లి నాలుగు శతకాలతో చెలరేగి ‘కింగ్’ అనిపించుకున్నాడు. యావత్ ప్రపంచ దృష్టి సారించే ఆ్రస్టేలియా పర్యటన ద్వారా పుజారా, రిషభ్ పంత్ సాధించిన గుర్తింపు తక్కువేమీ కాదు. అలాగే ఇక్కడ విఫలం కావడంతోనే కెరీర్కు ముగింపు పలికిన ప్లేయర్లకూ కొదవలేదు. గతంలో దిలీప్ వెంగ్సర్కార్, కృష్ణమాచారి శ్రీకాంత్ ఇలాగే జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడు కోహ్లి, రోహిత్, అశ్విన్ విషయంలోనూ ఇలాంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సాధారణంగా భారత్, ఆస్ట్రేలియా సిరీస్కు ముందు కనిపించే మాటల యుద్ధం ఈసారి పెద్దగా తెర పైకి రాకపోగా... తొలి టెస్టు సమయంలోనే ఐపీఎల్ వేలం జరగనుండటం... ఆసీస్ సీనియర్ల నోటికి తాళాలు వేసినట్లు కనిపిస్తోంది. తుది జట్టు ఎంపిక విషయంలో భారత జట్టుకు ఇబ్బందులు తప్పడం లేదు. రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా... గాయంతో దూరమైన గిల్ స్థానాన్ని దేవదత్ పడిక్కల్ భర్తీ చేయనున్నాడు. కోహ్లి, పంత్తో కలిసి ధ్రువ్ జురేల్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయనున్నాడు. పేస్ ఆల్రౌండర్గా నితీశ్ కుమార్ రెడ్డి, ఏకైక స్పిన్నర్గా అశ్విన్కు జట్టులో స్థానం పక్కా కాగా... తాత్కాలిక కెప్టెన్ బుమ్రా పేస్ దళాన్ని నడిపించనున్నాడు. సిరాజ్, ఆకాశ్దీప్, ప్రసిధ్, హర్షిత్లలో ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కవచ్చు. స్మిత్ అచ్చొచ్చిన స్థానంలోనే... డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ అనంతరం సరైన ఓపెనర్ లేక ఇబ్బంది పడుతున్న ఆ్రస్టేలియా జట్టు పలు ప్రయోగాలు చేసి విఫలమైంది. టీమిండియాతో సిరీస్కు ముందు ఆసీస్కు ఆ సమస్య తీరినట్లే అనిపిస్తోంది. ఇటీవల భారత్ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియా ‘ఎ’జట్టుకు సారథ్యం వహించిన నాథన్ మెక్స్వీనీ ఈ సిరీస్లో ఉస్మాన్ ఖ్వాజాతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.దీంతో స్మిత్ తనకు అచ్చొచ్చిన నాలుగో స్థానంలోనే బరిలోకి దిగనున్నాడు. లబుషేన్, ట్రావిస్ హెడ్, మిషెల్ మార్ష్, అలెక్స్ క్యారీలతో ఆసీస్ మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. పెర్త్ పిచ్పై మెరుగైన గణాంకాలు ఉన్న నాథన్ లయన్ స్పిన్ బాధ్యతలు మోయనుండగా... కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్ భారత టాపార్డర్ను ఇబ్బంది పెట్టడానికి అస్త్రశ్రస్తాలతో సిద్ధమయ్యారు. 24న రోహిత్ శర్మ రాక... వ్యక్తిగత కారణాలరీత్యా ఆ్రస్టేలియాతో తొలి టెస్టుకు దూరమైన భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈనెల 24న జట్టుతో చేరనున్నాడు. రోహిత్ గైర్హాజరీలో తొలి టెస్టులో బుమ్రా జట్టును నడిపించనుండగా... మొదటి టెస్టు మూడో రోజు రోహిత్ టీమిండియాతో కలుస్తాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెల 6 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు (డే అండ్ నైట్) రోహిత్ అందుబాటులో ఉండనున్నాడు. పిచ్, వాతావరణం పెర్త్ పిచ్ పేస్కు, బౌన్స్కు ప్రసిద్ధి. మ్యాచ్కు రెండు రోజుల ముందు అకాల వర్షం కారణంగా పిచ్ను పూర్తిగా సిద్ధం చేయలేకపోయామని క్యూరేటర్ ఐజాక్ మెక్డొనాల్డ్ వెల్లడించగా... రెండు రోజులుగా బాగా ఎండ కాయడంతో వికెట్ పూర్వ స్థితికి చేరింది. పచ్చికతో కూడిన పిచ్పై తొలి రోజు ఆట కీలకం కానుంది.భారత్తో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ ఎంతో ప్రత్యేకమైంది. ఈసారి ఐదు మ్యాచ్లు ఉండటంతో దీని ప్రాధాన్యత మరింత ఎక్కువ. తొలి టెస్టు సమయంలోనే ఐపీఎల్ వేలం జరగనున్నప్పటికీ... ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతింటుందని అనుకోవడం లేదు. వేలంలో చాలా మంది ఆసీస్ ఆటగాళ్లు ఉన్నారు. అయితే అందులో ప్లేయర్లు చేయాడానికి ఏమీ ఉండదని అందరికీ తెలుసు. స్వదేశంలో ఆడేటప్పుడు అంచనాల ఒత్తిడి ఉండటం సహజమే. భారత్ కఠిన ప్రత్యర్థి. వారిని ఎదుర్కొనేందుకు మేం బాగా సిద్ధమయ్యాం. ఐపీఎల్ సందర్భంగా భారత యువ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నా. బంతిని స్వింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్లో రాణించే సత్తా అతడిలో ఉంది. –ప్యాట్ కమిన్స్, ఆ్రస్టేలియా కెప్టెన్ కెప్టెన్సీని పదవిగా కాకుండా బాధ్యతగా భావిస్తా. దాని కోసం సదా సిద్ధంగా ఉంటా. చిన్నప్పటి నుంచి సవాళ్లను ఎదుర్కోవడం అలవాటే. గతంలో నాయకత్వం చేసిన అనుభవం ఉంది. అయితే ఇది ఒక్క మ్యాచ్కే... రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ రెండో టెస్టు నుంచి బాధ్యతలు తీసుకుంటాడు. ఎవరి శైలి వారికి ఉంటుంది. రోహిత్, కోహ్లిని అనుకరించాలని చూడను. దేశానికి సారథ్యం వహించడం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదు. నితీశ్ కుమార్ రెడ్డిలో ప్రతిభకు కొదవలేదు. మేనేజ్మెంట్కు అతడిపై విశ్వాసం ఉంది. కోహ్లి బ్యాటింగ్పై వ్యాఖ్యలు చేయను. అతడి సారథ్యంలోనే జట్టులోకి వచ్చా. జట్టులో అతడి ప్రాధాన్యత ఏంటో అందరికీ తెలుసు. –బుమ్రా, భారత కెప్టెన్ 52 ఆ్రస్టేలియా గడ్డపై ఆ్రస్టేలియాతో భారత జట్టు ఇప్పటి వరకు 52 టెస్టులు ఆడింది. ఇందులో 9 టెస్టుల్లో గెలిచింది. 30 టెస్టుల్లో ఓడిపోయింది. 13 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి.4 ఆస్ట్రేలియాలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ జరగనుండటం ఇది నాలుగోసారి. గతంలో 1947లో, 1977లో, 1991లో రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్లతో కూడిన టెస్టు సిరీస్ను నిర్వహించారు. ఐదు టెస్టులతో కూడిన మూడు సిరీస్లలోనూఆ్రస్టేలియా జట్టే విజేతగా నిలవడం గమనార్హం. తుది జట్లు (అంచనా) భారత్: బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, పడిక్కల్, కోహ్లి, పంత్, జురేల్, అశ్విన్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా/ప్రసిధ్ కృష్ణ, సిరాజ్/ఆకాశ్దీప్. ఆ్రస్టేలియా: కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖ్వాజా, మెక్స్వీనీ, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్, క్యారీ, స్టార్క్, లయన్, హాజల్వుడ్. -
పెర్త్లో బౌన్సీ పిచ్
పెర్త్: అకాల వర్షం కారణంగా పెర్త్ పిచ్ను పూర్తిగా సిద్ధం చేయలేకపోయామని ప్రధాన క్యూరేటర్ ఐజాక్ మెక్డొనాల్డ్ పేర్కొన్నాడు. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్లో భాగంగా శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుండగా... బుధవారం అక్కడ అసాధారణ వర్షం కురిసింది. దీంతో పిచ్ ఉపరితలం కాస్త దెబ్బతిందని... సాధారణంగా ఇక్కడ కనిపించే పగుళ్లు ఈసారి ఎక్కువ లేవని పేర్కొన్నాడు. పెర్త్లోని ‘వాకా’ పిచ్ అసాధారణ పేస్, అస్థిర బౌన్స్కు ప్రసిద్ధి. గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్ల్లో పేసర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. అయితే ఈసారి పిచ్ దీనికి భిన్నంగా స్పందించే అవకాశం ఉందని ఐజాక్ అన్నాడు. ‘ఇది సంప్రదాయ పెర్త్ టెస్టు పిచ్ మాత్రం కాదు. వర్షం కారణంగా పిచ్ను కవర్లతో కప్పి ఉంచడం వల్ల ఒక రోజంతా వృథా అయింది. ఎండ బాగా కాస్తే తిరిగి పేస్కు అనుకూలించడం ఖాయమే. సాధారణ సమయానికంటే ముందే పిచ్ను సిద్ధం చేసే పని ప్రారంభించాం. ప్రస్తుతానికి పిచ్పై తేమ ఉంది. అది పొడిబారితే మార్పు సహజమే. పిచ్పై ఉన్న పచ్చిక పేసర్లను ఊరిస్తుంది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. అయితే ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ ఉండవు. రోజంతా ఎండ కాస్తే పిచ్ సంప్రదాయ పద్ధతిలో మారిపోతుంది’ అని ఐజాక్ వివరించాడు. ‘వాకా’ పిచ్పై 8 నుంచి 10 మిల్లీమీటర్ల గడ్డి ఉండనుందని క్యూరేటర్ చెప్పాడు. పిచ్పై అసాధారణ పగుళ్లు ఏర్పడేందుకు తగిన సమయం లేకపోయినా... అనూహ్య బౌన్స్ మాత్రం తప్పకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. -
ఐపీఎల్ వేలం కోసం వెటోరి
పెర్త్: ఆ్రస్టేలియా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ డానియెల్ వెటోరి పెర్త్లో భారత్తో జరిగే తొలి టెస్టు మధ్యలోనే జట్టును వీడి ఐపీఎల్ మెగా వేలానికి బయలుదేరుతాడు. ఈ న్యూజిలాండ్ బౌలింగ్ దిగ్గజం ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)కు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. దీంతో 45 ఏళ్ల వెటోరి సౌదీ అరేబియాలోని రెండో పెద్ద నగరం జిద్దాలో ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే వేలంలో పాల్గొంటాడు. ఐదు టెస్టుల ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో తొలి టెస్టు 22 నుంచి పెర్త్లో జరుగుతుంది. ‘ఐపీఎల్ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్ అయిన వెటోరికి మద్దతిస్తాం. అతను మొదటి టెస్టు సన్నాహానికి చేయాల్సిందంతా (ట్రెయినింగ్) చేసే వేలానికి హాజరవుతాడు. ఇందులో మాకు ఏ ఇబ్బంది లేదు. మెగా వేలం ముగిసిన వెంటనే మళ్లీ మా జట్టుతో కలుస్తాడు’ అని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సీఏ నేషనల్ డెవలప్మెంట్ కోచ్ లాచ్లన్ స్టీవెన్స్... తొలి టెస్టు కోసం వెటోరి పాత్రను భర్తీ చేస్తారని సీఏ తెలిపింది. కివీస్కు చెందిన వెటోరి మాత్రమే కాదు... ఆ్రస్టేలియన్ దిగ్గజాలు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్లు సైతం జిద్దాకు పయనమవుతారు. పాంటింగ్ పంజాబ్ కింగ్స్కు, లాంగర్ లక్నో సూపర్ జెయింట్స్కు హెడ్ కోచ్లుగా ఉన్నారు. దీంతో ‘చానెల్ సెవెన్’లో వ్యాఖ్యాతలు వ్యవహరించనున్న వీళ్లిద్దరు కూడా పెర్త్ టెస్టు మధ్యలోనే మెగా వేలంలో పాల్గొననున్నారు. -
అశ్విన్తో ఢీకి రెడీ!
మెల్బోర్న్: భారత వెటరన్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్లో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని, ఈసారి అతడు మ్యాచ్పై పట్టు బిగించకుండా చేస్తానని ఆ్రస్టేలియన్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్నాడు. కంగారూ గడ్డపై అశ్విన్కు మంచి రికార్డు లేదు. స్వదేశంలో 21.57 సగటు నమోదు చేస్తే ఆసీస్లో అది 42.15 మాత్రమే. అయితే గత రెండు బోర్డర్–గావస్కర్ సిరీస్లలో ఫామ్లో ఉన్న స్మిత్ను అదే పనిగా అవుట్ చేసి పైచేయి సాధించాడు. ఈ రెండు సిరీస్లలో అశ్విన్ అతన్ని క్రీజులో పాతుకుపోనీయకుండా ఐదుసార్లు పెవిలియన్ చేర్చాడు. దీనిపై ఆసీస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్ మాట్లాడుతూ ‘ఈసారి అలా జరగకుండా చూసుకోవాలి. అయితే అశ్విన్ మాత్రం ఉత్తమ స్పిన్నర్. తప్పకుండా తన ప్రణాళికలు తనకు ఉంటాయి. గతంలో అతని ఎత్తుగడలకు బలయ్యాను. నాపై అతనే ఆధిపత్యం కనబరిచాడు. ఇప్పుడలా జరగకుండా చూసుకోవాలంటే ఆరంభంలోనే అతను పట్టు బిగించకుండా దీటుగా ఎదుర్కోవాలి’ అని అన్నాడు. గత కొన్నేళ్లుగా తమ ఇద్దరి మధ్య ఆసక్తికర సమరమే జరుగుతోందన్నాడు. ఒకరు పైచేయి సాధిస్తే, మరొకరు డీలా పడటం జరుగుతుందని... ఐదు టెస్టుల్లో పది ఇన్నింగ్స్ల్లో ఇప్పుడు ఎవరూ ఆధిపత్యం కనబరుస్తారో చూడాలని స్మిత్ తెలిపాడు. అతన్ని బ్యాట్తో పాటు మానసికంగానూ దెబ్బకొట్టాలంటే ఆరంభంలోనే మంచి షాట్లతో ఎదురుదాడికి దిగాలని చెప్పాడు. 35 ఏళ్ల స్మిత్ టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయికి 315 పరుగుల దూరంలో ఉన్నాడు. త్వరలో జరిగే ఐదు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో అతను తనకెంతో ఇష్టమైన, అచ్చొచి్చన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇటీవలి కాలంలో స్మిత్ తరచూ ఓపెనర్గా బరిలోకి దిగి పూర్తిగా విఫలమయ్యాడు. -
కేఎల్ రాహుల్పై దృష్టి
మెల్బోర్న్: టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ను ఒత్తిడిలోనే ఉంచే ప్రయత్నం చేస్తామని... ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ అన్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 22 నుంచి ఐదు మ్యాచ్ల ‘బోర్డర్–గావస్కర్’ టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ్రస్టేలియా ‘ఎ’తో భారత ‘ఎ’ జట్టు ఒక అనధికారిక టెస్టు ఆడి ఓడిపోగా... రెండో మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఆడేందుకు రాహుల్తో పాటు వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ముందుగానే ఆ్రస్టేలియాలో అడుగు పెట్టారు. ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న రాహుల్... ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ సిరీస్కు ముందు ఈ మ్యాచ్లో సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నాడు. తాజాగా న్యూజిలాండ్తో తొలి టెస్టులో మాత్రమే ఆడి తర్వాత తుది జట్టులో చోటు కోల్పోయిన రాహుల్... బోర్డర్–గావస్కర్ సిరీస్లోని మొదటి టెస్టు కోసం తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలరీత్యా తొలి టెస్టుకు అందుబాటులో లేకపోతే టీమ్ మేనేజ్మెంట్ రాహుల్కే తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ నేపథ్యంలో బోలాండ్ మాట్లాడుతూ.. ‘గతంలో రాహుల్కు బౌలింగ్ చేసిన అనుభవం ఉంది. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత స్వదేశంలో అతడికి బౌలింగ్ చేయనున్నా. అతడు ప్రపంచ స్థాయి ప్లేయర్. అతడిని ఒత్తిడిలో ఉంచేందుకు ప్రయత్నిస్తాం’ అని అన్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓడినంత మాత్రాన టీమిండియాను తక్కువ అంచనా వేయడం లేదని బోలాండ్ పేర్కొన్నాడు. ‘ఇక్కడి పిచ్లపై బౌన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ్రస్టేలియా పర్యటన కోసం టీమిండియా జట్టును ఎంపిక చేసుకునే విధానం భారత్తో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది’ అని అన్నాడు. 2015లో తొలిసారి ఆ్రస్టేలియాలో పర్యటించిన రాహుల్... సిడ్నీ టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్నాడు. గత ఏడాది డిసెంబర్లో సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాపై చివరిసారి సెంచరీ చేసిన రాహుల్... ఆ తర్వాత 9 ఇన్నింగ్స్ల్లో కేవలం రెండు అర్ధశతకాలు మాత్రమే నమోదు చేశాడు. -
వార్నర్ కూడా అవుట్
న్యూఢిల్లీ: భారత పర్యటనలో మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా ఆ్రస్టేలియా కష్టాలు కొనసాగుతున్నాయి. కాలి కండరాల గాయంతో ఇప్పటికే పేస్ బౌలర్ హాజల్వుడ్ సిరీస్ నుంచి తప్పుకొని స్వదేశానికి వెళ్లిపోగా... హాజల్వుడ్ సరసన తాజాగా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా చేరాడు. రెండో టెస్టులో గాయపడ్డ వార్నర్ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లోని మిగతా రెండు టెస్టులకూ దూరమయ్యాడు. అతను స్వదేశానికి పయనమవుతాడని, అయితే వచ్చే నెలలో జరిగే మూడు వన్డేల సిరీస్కల్లా జట్టుకు అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) వర్గాలు తెలిపాయి. ‘ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో వార్నర్ మోచేతికి ఫ్రాక్చర్ అయింది. వైద్య పరీక్షల అనంతరం గాయం తీవ్రత దృష్ట్యా పూర్తిగా కోలుకునేందుకు పునరావాస శిబిరానికి పంపాలని సీఏ నిర్ణయించింది. నాలుగు టెస్టుల సిరీస్ ముగిశాక జరిగే వన్డే సిరీస్ ఆడతాడని బోర్డు అంచనా వేస్తుంది’ అని సీఏ తెలిపింది. 36 ఏళ్ల ఓపెనర్ ఈ పర్యటనలో నిరాశ పరిచాడు. మైదానంలో గాయపడటంతో అతని స్థానంలో కన్కషన్ సబ్స్టిట్యూట్గా రెన్షా బరిలోకి దిగాడు. మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్లో, నాలుగో టెస్టు 9 నుంచి అహ్మదాబాద్లో జరుగుతుంది. -
Border-Gavaskar Trophy: ‘జడ్డూ’ తిప్పేశాడు...
న్యూఢిల్లీ: భారత్కు అచ్చొచ్చిన ఢిల్లీ వికెట్పై పర్యాటక జట్టే స్పిన్తో అల్లాడిస్తే... ఆతిథ్య జట్టు అంతకుమించే చేయాలి కదా! సరిగ్గా... టీమిండియా కూడా అదే చేసింది. ఒక్క సెషన్ అయినా పూర్తిగా ఆడనివ్వకుండానే ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసింది. రవీంద్ర జడేజా (7/42) బిగించిన ఉచ్చులో ఆస్ట్రేలియా క్లీన్బౌల్డయింది. 31.1 ఓవర్లలోనే 113 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. ఇందులో 12 ఓవర్లు, 61 పరుగులు క్రితం రోజువే కాగా... మూడో రోజు ఆసీస్ ఆడింది 19.1 ఓవర్లే! చేసింది కూడా 52 పరుగులే! అంటే సగటున ప్రతి రెండు ఓవర్లకు ఓ వికెట్ను సమర్పించుకుంది. అంతలా ప్రపంచ నంబర్వన్ టెస్టు జట్టు జడుసుకుంది. ‘జడ్డూ’ ఏకంగా ఐదుగురు బ్యాటర్లను బౌల్డ్ చేశాడు. అనంతరం 115 పరుగుల సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 26.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి గెలిచింది. రెండో ఇన్నింగ్స్లో రెండు జట్ల బౌలర్లు ఎక్స్ట్రాలు ఇవ్వకపోవడం విశేషం. మ్యాచ్ మొత్తం లో పది వికెట్లు తీయడంతోపాటు కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన జడేజాకు వరుసగా రెండోసారీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నాలుగు టెస్టుల సిరీస్లో 2–0తో ఉన్న భారత్ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని తమ వద్దే అట్టిపెటుకుంది. క్రితంసారి కూడా భారతే గెలిచింది. ఇక ఈ సిరీస్లో మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్లో జరుగుతుంది. ఇండోర్ టెస్టులోనూ భారత్ గెలిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా అర్హత సాధిస్తుంది. ఇలా మొదలై... అలా కూలింది! ఓవర్నైట్ స్కోరు 61/1తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా పతనం తొలి ఓవర్ నుంచే మొదలైంది. ఓపెనర్ హెడ్ (46 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్) అశ్విన్ బౌలింగ్లో ఒక బౌండరీ కొట్టి ఆఖరి బంతికి అవుటయ్యాడు. కాసేపటికే సీనియర్ బ్యాటర్ స్మిత్ (19 బంతుల్లో 9; 1 ఫోర్) కూడా అతని బౌలింగ్లోనే వికెట్ల ముందు దొరికాడు. తర్వాత జడేజా మాయాజాలం మొదలవడంతో కొత్తగా ఇంకెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఓవర్నైట్ బ్యాటర్ లబుషేన్ (50 బంతుల్లో 35; 5 ఫోర్లు) సహా స్వల్ప వ్యవధిలో క్యారీ (7), కమిన్స్ (0), లయన్ (8), కున్మన్ (0)లను జడేజా క్లీన్బౌల్డ్ చేశాడు. కచ్చితత్వం లేని స్వీప్ షాట్లు, అనవసరమైన రివర్స్ స్వీప్ షాట్లు ఆస్ట్రేలియన్ల కొంపముంచాయి. ప్రపంచంలో ఎక్కడైనా పేస్ బంతులు బ్యాటర్లను బెంబేలెత్తిస్తాయి. కానీ ఇక్కడ స్లో డెలివరీలకే విలవిలలాడారు. దీంతో ఆదివారం ఆటలో 9 వికెట్లు చేతిలో ఉన్న ఆసీస్ కనీసం 20 ఓవర్లయినా ఆడలేకపోయింది. అశ్విన్కు 3 వికెట్లు దక్కాయి. స్పిన్ తిరగడంతో భారత ప్రధాన సీమర్ మొహమ్మద్ సిరాజ్కు బంతిని అప్పగించాల్సిన అవసరమే రాలేదు. లంచ్ బ్రేక్ అనంతరం సులువైన లక్ష్యఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ ఆడాడు. కానీ కేఎల్ రాహుల్ (1) తన వైఫల్యం కొనసాగించాడు. 100వ టెస్టు ఆడుతున్న పుజారా (74 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) కుదురుగా ఆడగా, మధ్యలో విరాట్ కోహ్లి (31 బంతుల్లో 20; 3 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (12)ల వికెట్లు కూలాయి. అప్పటికే టీమిండియా విజయతీరానికి దగ్గరవగా మిగతా లాంఛనాన్ని కోన శ్రీకర్ భరత్ (22 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి పుజారా పూర్తి చేశాడు. 27వ ఓవర్ వేసిన మర్పీ బౌలింగ్లో నాలుగో బంతిని పుజారా మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించి భారత్ను గెలిపించాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 263; భారత్ తొలి ఇన్నింగ్స్: 262; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఉస్మాన్ ఖాజా (సి) శ్రేయస్ అయ్యర్ (బి) జడేజా 6; ట్రవిస్ హెడ్ (సి) శ్రీకర్ భరత్ (బి) అశ్విన్ 43; లబుషేన్ (బి) జడేజా 35; స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 9; రెన్షా (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 2; హ్యాండ్స్కాంబ్ (సి) కోహ్లి (బి) జడేజా 0; క్యారీ (బి) జడేజా 7; కమిన్స్ (బి) జడేజా 0; లయన్ (బి) జడేజా 8; మర్ఫీ (నాటౌట్) 3; కున్మన్ (బి) రవీంద్ర జడేజా 0; మొత్తం (31.1 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–23, 2–65, 3–85, 4–95, 5–95, 6–95, 7–95, 8–110, 9–113, 10–113. బౌలింగ్: అశ్విన్ 16–3–59–3, మొహమ్మద్ షమీ 2–0–10–0, రవీంద్ర జడేజా 12.1–1–42–7, అక్షర్ పటేల్ 1–0–2–0. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (రనౌట్) 31; కేఎల్ రాహుల్ (సి) అలెక్స్ క్యారీ (బి) లయన్ 1; చతేశ్వర్ పుజారా (నాటౌట్) 31; విరాట్ కోహ్లి (స్టంప్డ్) క్యారీ (బి) మర్ఫీ 20; శ్రేయస్ అయ్యర్ (సి) మర్ఫీ (బి) నాథన్ లయన్ 12; శ్రీకర్ భరత్ (నాటౌట్) 23; మొత్తం (26.4 ఓవర్లలో 4 వికెట్లకు) 118. వికెట్ల పతనం: 1–6, 2–39, 3–69, 4–88. బౌలింగ్: కున్మన్ 7–0–38–0, నాథన్ లయన్ 12–3–49–2, టాడ్ మర్ఫీ 6.4–2–22–1, ట్రవిస్ హెడ్ 1–0–9–0. 100: అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి ఆస్ట్రేలియాపై భారత్కిది 100వ విజయం. మూడు ఫార్మాట్లలో రెండు జట్ల మధ్య 273 మ్యాచ్లు జరిగాయి. ఆసీస్తో 104 టెస్టులు ఆడిన భారత్ 32 విజయాలు అందుకొని, 43 పరాజయాలు చవిచూసింది. ఒక మ్యాచ్ ‘టై’కాగా, 28 ‘డ్రా’గా ముగిశాయి. 143 వన్డేల్లో టీమిండియా 53 మ్యాచ్ల్లో గెలిచి, 80 మ్యాచ్ల్లో ఓడింది. 10 మ్యాచ్లు రద్దయ్యాయి. 26 టి20 మ్యాచ్ల్లో భారత్ 15 విజయాలు సాధించి, 10 మ్యాచ్ల్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది. 25012: అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్ (టెస్టు, వన్డే, టి20)లలో కలిపి కోహ్లి సాధించిన పరుగులు (492 మ్యాచ్లు). సచిన్ (664 మ్యాచ్ల్లో 34, 357 పరుగులు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ క్రికెటర్ కోహ్లి కాగా... 25 వేల పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితా లో కోహ్లి ఆరో స్థానంలో ఉన్నాడు. 8: సొంతగడ్డపై టెస్టుల్లో జడేజాకిది ఎనిమిదో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు. భారత్ తరఫున అనిల్ కుంబ్లే (9 సార్లు) ‘టాప్’లో ఉండగా, సచిన్ (8 సార్లు) సరసన జడేజా నిలిచాడు. సిరాజ్, కోహ్లి, భరత్, జడేజా, అక్షర్ పటేల్ -
Border-Gavaskar Trophy: ఆస్ట్రేలియా కాస్త మెరుగ్గా...
ఓపెనర్లు అర్ధసెంచరీ భాగస్వామ్యం అందించారు. గత మ్యాచ్లో విఫలమైన ఇద్దరు బ్యాటర్లు ఈసారి చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చారు. రెండు సందర్భాల్లో జట్టు మెరుగైన స్థితిలో నిలిచి భారీ స్కోరు దిశగా వెళుతున్నట్లు అనిపించింది. అయినా సరే చివరకు వచ్చేసరికి ఆస్ట్రేలియా సాధారణ స్కోరుకే పరిమితమైంది. తొలి టెస్టుతో పోలిస్తే కాస్త ఫర్వాలేదనిపించినా ఓవరాల్గా మొదటి రోజే ఆలౌట్ అయిన జట్టు ఆట ఆశలు రేపేలా లేదు! షమీ పదునైన పేస్కు తోడు అశ్విన్, జడేజా స్పిన్తో ఆసీస్ను దెబ్బ కొట్టారు. బ్యాటింగ్కు ఏమాత్రం ఇబ్బందిగా లేని పిచ్పై రెండో రోజు భారత్ ఎంత స్కోరు సాధిస్తుందనేది ఆసక్తికరం. న్యూఢిల్లీ: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ రెండో టెస్టులోనూ మొదటి రోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 78.4 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖాజా (125 బంతుల్లో 81; 12 ఫోర్లు, 1 సిక్స్), హ్యాండ్స్కాంబ్ (142 బంతుల్లో 72 నాటౌట్; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. మొహమ్మద్ షమీ (4/60) ప్రత్యర్థిని పడగొట్టగా, అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం ఎలాంటి ఇబ్బంది లేకుండా 9 ఓవర్లు ఎదుర్కొన్న భారత్ ఆట ముగిసే సమయానికి 21 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (13 బ్యాటింగ్), రాహుల్ (4 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నా రు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్న భారత సీనియర్ క్రికెటర్ పుజారా ను దిగ్గజం సునీల్ గావస్కర్ సన్మానించారు. స్మిత్ డకౌట్... గత మ్యాచ్తో పోలిస్తే ఈసారి ఆస్ట్రేలియా ఓపెనర్లు తొలి గంట పాటు కాస్త ప్రతిఘటన కనబర్చగలిగారు. ఖాజా ఆత్మవిశ్వాసంతో ఆడగా, వార్నర్ (15; 3 ఫోర్లు)లో తడబాటు కొనసాగింది. 21వ బంతికి గానీ అతను తొలి పరుగు తీయలేకపోయాడు. ఈ క్రమంలో సిరాజ్ బౌలింగ్లో మోచేతికి, హెల్మెట్కు బంతి బలంగా తగలడంతో వార్న ర్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. షమీ ఓవర్లో రెండు వరుస ఫోర్లు కొట్టిన వార్నర్ అతని తర్వాతి ఓవర్లోనే వెనుదిరిగాడు. మరోవైపు స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్వీప్ షాట్లతో పరుగులు రాబట్టిన ఖాజా 71 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆసీస్కు అసలు దెబ్బ అశ్విన్ ఓవర్లో తగిలింది. 91/1తో మెరుగ్గా ఉన్న స్థితిలో లబుషేన్ (18)ను అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా... మరో రెండు బంతులకే భరత్ చక్కటి క్యాచ్తో స్మిత్ (0) డకౌట్ కావడం ఒక్కసారిగా కంగారూలు వెనక్కి తగ్గేలా చేసింది. రెన్షా స్థానంలో ఈ మ్యాచ్లోకి వచ్చిన ట్రవిస్ హెడ్ (12; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువసేపు నిలవలేదు. కీలక భాగస్వామ్యాలు... ఆసీస్ను గట్టెక్కించే బాధ్యత ఖాజా, హ్యాండ్స్కాంబ్లపై పడింది. వీరిద్దరు క్రీజ్లో ఉన్నంతసేపు చకచకా పరుగులు జోడించారు. ముఖ్యంగా జడేజాను లక్ష్యంగా చేసుకొని వీరు పరుగులు రాబట్టారు. అయితే స్వీప్ షాట్లతోనే 29 పరుగులు సాధించిన ఖాజా చివరకు అదే షాట్కు వికెట్ను సమర్పించుకున్నాడు. క్యారీ (0) వెంటనే అవుట్ కాగా... ఈసారి ప్యాట్ కమిన్స్ (33; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక పరుగులు సాధించాడు. మరోవైపు 110 బంతుల్లో హ్యాండ్స్కాంబ్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆసీస్ జోరు పెంచుతున్న దశలో రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో కమిన్స్, మర్ఫీ (0) వికెట్లతో దెబ్బ కొట్టాడు. చివరి రెండు వికెట్ల షమీ ఖాతాలోకి వెళ్లాయి. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) భరత్ (బి) షమీ 15; ఖాజా (సి) రాహుల్ (బి) జడేజా 81; లబుషేన్ (ఎల్బీ) (బి) అశ్విన్ 18; స్మిత్ (సి) భరత్ (బి) అశ్విన్ 0; హెడ్ (సి) రాహుల్ (బి) షమీ 12; హ్యాండ్స్కాంబ్ (నాటౌట్) 72; క్యారీ (సి) కోహ్లి (బి) అశ్విన్ 0; కమిన్స్ (ఎల్బీ) (బి) జడేజా 33; మర్ఫీ (బి) జడేజా 0; లయన్ (బి) షమీ 10; కున్మన్ (బి) షమీ 6; ఎక్స్ట్రాలు 16; మొత్తం (78.4 ఓవర్లలో ఆలౌట్) 263. వికెట్ల పతనం: 1–50, 2–91, 3–91, 4–108, 5–167, 6–168, 7–227, 8–227, 9–246, 10–263. బౌలింగ్: షమీ 14.4–4–60–4, సిరాజ్ 10–2–30–0, అశ్విన్ 21–4–57–3, జడేజా 21–2–68–3, అక్షర్ 12–2–34–0. భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బ్యాటింగ్) 13, రాహుల్ (బ్యాటింగ్) 4; ఎక్స్ట్రాలు 4; మొత్తం (9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 21. బౌలింగ్: కమిన్స్ 3–1–7 –0, కున్మన్ 4–1–6–0, లయన్ 2–0–4–0. 13: భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 13వ క్రికెటర్గా పుజారా గుర్తింపు పొందాడు. గతంలో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్దేవ్, సునీల్ గావస్కర్, వెంగ్ సర్కార్, గంగూలీ, కోహ్లి, ఇషాంత్ శర్మ, హర్భజన్æ, సెహ్వాగ్ ఈ ఘనత సాధించారు. 1: అంతర్జాతీయ టి20 ఫార్మాట్ మొదలయ్యాక ఒక్క అంతర్జాతీయ టి20 కూడా ఆడకుండానే 100 టెస్టులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్ పుజారా. -
Border Gavaskar Trophy, 1st Test: స్పిన్తో ‘విన్ ఇండియా’
ఎప్పట్లాగే భారత్ స్పిన్ అస్త్రంతోనే రంగంలోకి దిగుతుందని... వార్మప్లో పేస్ పిచ్తో మభ్యపెడుతుందని ఆస్ట్రేలియా సన్నాహక మ్యాచ్ అక్కర్లేదంది. నెట్స్లో అదేపనిగా స్పిన్ బౌలింగ్లోనే శ్రమించింది. అశ్విన్ను పోలిన డూప్లికేట్ బౌలర్తో తెగ ప్రాక్టీస్ చేసింది. ఇంత చేసినా ‘కంగారు’ తప్పలేదు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో ఫైనల్ చేరిన జట్టు అనూహ్యంగా మూడే రోజుల్లో చిత్తయ్యింది. భారత్ భారీ విజయంతో బోర్డర్–గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ను ప్రారంభించింది. నాగ్పూర్: ఆస్ట్రేలియా భయపడినట్లే జరిగింది. భారత్ స్పిన్ అస్త్రంతోనే గెలిచింది. అయితే కంగారూ టీమ్ చేసిన కసరత్తుకు ఓడిన తీరుకు ఏ మాత్రం పొంతనే లేదు. ఆసీస్లాంటి మేటి జట్టు రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 100 (తొలి ఇన్నింగ్స్లో 63.5; రెండో ఇన్నింగ్స్లో 32.3) ఓవర్లయినా ఆడకపోవడం... మ్యాచ్ మూడో రోజే ముగిసిపోవడం మాత్రం ఎవరూ ఊహించనిది. తొలి ఇన్నింగ్స్ను జడేజా (5/47, 2/34) కూల్చినట్లే... రెండో ఇన్నింగ్స్ను అశ్విన్ (3/42, 5/37) పడగొట్టేశాడు. దీంతో తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్లో 1–0తో ముందడుగు వేసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న జడేజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆట మొదలైందిలా... ఓవర్నైట్ స్కోరు 321/7తో మూడోరోజు శనివారం తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ 139.3 ఓవర్లలో సరిగ్గా 400 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్లలో జడేజా (185 బంతుల్లో 70; 9 ఫోర్లు) తన క్రితం రోజు స్కోరుకు 4 పరుగులే చేసి మర్ఫీ బౌలింగ్లో క్లీన్బౌల్డయ్యాడు. మరోవైపు అక్షర్ పటేల్ (174 బంతుల్లో 84; 10 ఫోర్లు, 1 సిక్స్) తొలి సెషన్లో కుదురుగా ఆడాడు. మిగిలిన టెయిలెండర్ల సాయంతో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయాలన్న పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. షమీ (47 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడాడు. తమ ప్రధాన బ్యాటర్లను వణికించిన మర్ఫీ బౌలింగ్లో షమీ వరుస సిక్సర్లతో అలరించాడు. అయితే షమీని మర్ఫీ తన మరుసటి ఓవర్లో బోల్తా కొట్టించాడు. దీంతో తొమ్మిదో వికెట్కు 52 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత సిరాజ్ (1 నాటౌట్) అండతో జట్టు స్కోరును 400 పరుగులకు చేర్చిన అక్షర్ను అదే స్కోరు వద్ద కమిన్స్ బౌల్డ్ చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 223 పరుగుల ఆధిక్యం సాధించింది. అరంగేట్రం చేసిన బౌలర్ మర్ఫీ ఒకే ఇన్నింగ్స్లో 7 వికెట్లు తీశాడు. ఆసీస్ కూలిందిలా... లంచ్ బ్రేక్ తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ మొదలైంది. కానీ మూడో సెషన్కు ముందే 32.3 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటైంది. ఒకే ఒక్క సెషన్లో అగ్రశ్రేణి జట్టయిన ఆసీస్ మొత్తం 10 వికెట్లను కోల్పోవడం గమనార్హం. రెండో ఓవర్ నుంచే అశ్విన్ను రంగంలోకి దించడం... అతను ఉస్మాన్ ఖాజా (5)ను పెవిలియన్ చేర్చడంతో ఆసీస్ పతనం శరవేగంగా మొదలై అంతే వేగంగా ముగిసింది. కీలక వన్డౌన్ బ్యాటర్ లబుషేన్ (17)ను జడేజా అవుట్ చేయగా, మిగతా బ్యాటర్లు వార్నర్ (10), రెన్షా (2), హ్యాండ్స్కోంబ్ (6), క్యారి (10)లను అశ్విన్ తన వరుస ఓవర్లలో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 20వ ఓవర్ పూర్తవకముందే ఆసీస్ 64/6 స్కోరుతో ఇన్నింగ్స్ పరాజయానికి సిద్ధమైంది. తర్వాత అక్షర్ (1/6), జడేజా (2/34), షమీ (2/13) తలా ఒక చేయి వేయడంతో ఆస్ట్రేలియా వంద పరుగులైనా చేయలేకపోయింది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 177; భారత్ తొలి ఇన్నింగ్స్: 400. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఉస్మాన్ ఖాజా (సి) కోహ్లి (బి) అశ్విన్ 5; వార్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 10; లబుషేన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 17; స్మిత్ (నాటౌట్) 25; రెన్షా (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 2; హ్యాండ్స్కోంబ్ (ఎల్బీడబ్ల్యూ)(బి) అశ్విన్ 6; క్యారీ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 10; కమిన్స్ (సి) భరత్ (బి) జడేజా 1; మర్ఫీ (సి) రోహిత్ (బి) అక్షర్ 2; లయన్ (బి) షమీ 8; బోలండ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (32.3 ఓవర్లలో ఆలౌట్) 91. వికెట్ల పతనం: 1–7, 2–26, 3–34, 4–42, 5–52, 6–64, 7–67, 8–75, 9–88, 10–91. బౌలింగ్: షమీ 4.3–1–13–2, అశ్విన్ 12–3–37–5, సిరాజ్ 1–1–0–0, జడేజా 12–3–34–2, అక్షర్ 3–0–6–1. 91: భారత గడ్డపై టెస్టుల్లో ఆస్ట్రేలియాకిది అత్యల్ప స్కోరు. 2004లో ముంబైలో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా 93 పరుగులకు ఆలౌటైంది. ఓవరాల్గా భారత్పై ఆస్ట్రేలియాకిది రెండో అత్యల్ప స్కోరు. 1981 మెల్బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా 83 పరుగులకు ఆలౌటైంది. 25: భారత్లో అశ్విన్ టెస్టు ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీయడం ఇది 25వసారి. తాజా ప్రదర్శనతో అనిల్ కుంబ్లే (25 సార్లు) సరసన అశ్విన్ నిలిచాడు. స్వదేశంలో అత్యధికంగా ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన బౌలర్లల జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (45 సార్లు), రంగన హెరాత్ (26 సార్లు) ఉన్నారు. 5: ఆస్ట్రేలియాపై భారత జట్టు ఇన్నింగ్స్ విజయం సాధించడం ఇది ఐదోసారి. చివరిసారి భారత్ 2013లో హైదరాబాద్లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ విజయం అందుకుంది. 10: నాగ్పూర్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు పదిసార్లు ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యారు. వారి టెస్టు చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. 2001లో కోల్కతా టెస్టులో, గత ఏడాది శ్రీలంకపై గాలె టెస్టులో తొమ్మిదిమంది బ్యాటర్లు ఎల్బీగా వెనుదిరిగారు. భారత బౌలర్లు కూడా ఓ టెస్టులో పదిసార్లు ఎల్బీగా అవుట్ చేయడం ఇదే తొలిసారి. జడేజాకు జరిమానా తొలి టెస్టు విజయంలో కీలకపాత్ర పోషించిన రవీంద్ర జడేజాపై జరిమానా పడింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ సమయంలో స్పిన్నర్ అంపైర్ల అనుమతి తీసుకోకుండా తన చేతి వేలు వాపు తగ్గేందుకు అయింట్మెంట్ రాశాడు. ఇది కాస్తా బాల్ ట్యాంపరింగ్ అనుమానాల్ని రేకేత్తించగా... మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్ వీడియోల్ని పరిశీలించి ట్యాంపరింగ్కు పాల్పడలేదని తేల్చారు. అయితే అంపైర్ల అనుమతి లేకుండా అలా చేయడం ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని... మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ ఇచ్చారు. -
Border-Gavaskar Trophy 2023: అసలు సిసలు ‘పరీక్ష’
సమయం వచ్చేసింది... ధనాధన్ క్రికెట్ తరంలో టెస్టు క్రికెట్ను సజీవంగా నిలబెడుతూ అంతా ఎదురు చూస్తున్న పోరుకు రంగం సిద్ధమైంది... హోరాహోరీ సమరాలు, పోటాపోటీ మాటల తూటాలు, అగ్రశ్రేణి ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనలు, అనూహ్య మలుపులు, చిరస్మరణీయ ఫలితాలు... ఒకటేమిటి భారత్, ఆస్ట్రేలియా మధ్య పోరు అంటే అన్ని రకాల దినుసులతో కూడిన సంపూర్ణ భోజనం... గత కొన్నేళ్లుగా టెస్టు క్రికెట్లో అత్యంత ఆసక్తికర మ్యాచ్లతో ‘యాషెస్’ను మించి అభిమానులను అలరిస్తున్న ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ కోసం ఇరు జట్లు సమస్త అస్త్రాలు, సర్వ సన్నాహాలతో బరిలోకి దిగబోతున్నాయి. 33 రోజుల వ్యవధిలో సాగే ఈ నాలుగు టెస్టుల్లో తుది విజేతగా ఎవరు నిలిచినా... అభిమానులకు ఫుల్ వినోదం మాత్రం గ్యారంటీ! నాగ్పూర్: తొలి వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో రన్నరప్గా నిలిచిన భారత జట్టు మరోసారి ఫైనల్కు అర్హత సాధించే లక్ష్యంతో సొంతగడ్డపై అత్యంత కీలక పోరుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో నేటి నుంచి జరిగే నాలుగు టెస్టుల సిరీస్లో టీమిండియా కనీసం మూడు మ్యాచ్లు గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తుంది. మరోవైపు ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన ఆసీస్ బృందం భారత గడ్డపై సిరీస్ గెలిచే ‘అత్యంత కఠిన ఆపరేషన్’ కోసం తమ సర్వశక్తులూ ఒడ్డనుంది. తమ దేశంలోనే వరుసగా రెండుసార్లు టీమిండియాకు సిరీస్లు కోల్పోయిన కంగారూ బృందం ఇక్కడ సత్తా చాటి ప్రతీకారం తీర్చుకోగలదా అనేది ఆసక్తికరం. స్వదేశంలో అసమాన రికార్డు, తాజా ఫామ్ చూస్తే భారత్దే పైచేయిగా కనిపిస్తున్నా... ఆస్ట్రేలియాలాంటి బలమైన జట్టును తక్కువగా అంచనా వేస్తే భంగపాటు తప్పదు. కేఎస్ భరత్ అరంగేట్రం? తుది జట్టులో కచ్చితంగా ఉండే ఆరుగురు కాకుండా మిగతా ఐదు స్థానాలకు జట్టులో పోటీ నెలకొని ఉంది. చివరి నిమిషంలో టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరం. రోహిత్, పుజారా, కోహ్లి, అశ్విన్, జడేజా, షమీ ఆడటం ఖాయం కాగా, వైస్ కెప్టెన్గా ఇప్పటికే రెండుసార్లు మీడియా సమావేశాలకు వచ్చిన కేఎల్ రాహుల్ స్థానానికి కూడా ఢోకా ఉండకపోవచ్చు. రోహిత్కు ఓపెనింగ్ భాగస్వామిగా రాహులే బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే గాయంతో దూరమైన శ్రేయస్కు బదులుగా మిడిలార్డర్లో గిల్, సూర్యకుమార్లలో ఒకరినే ఎంచుకోవాల్సి ఉంటుంది. వన్డేలు, టి20ల్లో కలిపి గత ఏడు ఇన్నింగ్స్లలో 4 సెంచరీలు చేసిన గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి అతనికే తొలి ప్రాధాన్యత. సూర్యకుమార్ ప్రధానంగా టి20 ఫామ్తోనే టీమ్లోకి వచ్చాడు. అతని ఫస్ట్ క్లాస్ రికార్డు (45.93 సగటు) మరీ గొప్పగా ఏమీ లేదు. అయితే పంత్ లేకపోవడంతో అతని తరహాలో తక్కువ సమయంలో ఎదురుదాడికి దిగి ప్రత్యర్థిని ఆత్మరక్షణలో పడేసే దూకుడు సూర్యలో ఉందని మేనేజ్మెంట్ భావిస్తోంది. అలా చూస్తే సూర్య కీలకమవుతాడు. కీపర్ స్థానం కోసం ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్ మధ్య పోటీ ఉంది. ఎడంచేతి వాటం, ధాటి ఇషాన్ సొంతమైనా... ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతని కీపింగ్ సామర్థ్యంపై సందేహాలు ఉన్నాయి. మరోవైపు మూడో స్పిన్నర్గా అక్షర్ పటేల్ను ఆడిస్తారా లేక వైవిధ్యం కోసం కుల్దీప్ను తీసుకుంటారా చూడాలి. ఎంత స్పిన్ పిచ్ అయినా సరే నాలుగో స్పిన్నర్ ఆలోచన లేకపోవచ్చు. షమీతో పాటు సిరాజ్ బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువ. అశ్విన్, జడేజా చెలరేగితే ఆసీస్ బెంబేలెత్తిపోవడం ఖాయం. రెండో స్పిన్నర్ ఎవరు? ఆస్ట్రేలియా టాప్–5 బ్యాటింగ్ లైనప్ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. భారత గడ్డపై టెస్టుల్లో పేలవమైన రికార్డు ఉన్న వార్నర్ ఈసారి దానిని చక్కదిద్దుకుంటాడా అనేది చూడాలి. ఎప్పటిలాగే స్మిత్ అసమాన బ్యాటింగ్పై ఆసీస్ ఆధారపడుతోంది. నాటి సిరీస్లో అతనికి మరే బ్యాటర్ నుంచి సహకారం లభించలేదు. ఈసారి ఆ పాత్రను పోషించేందుకు దాదాపు స్మిత్లాంటి సామర్థ్యం ఉన్న లబుషేన్ సిద్ధంగా ఉన్నాడు. బౌలింగ్లో హాజల్వుడ్ దూరం కావడంతో కెప్టెన్ కమిన్స్పై బాధ్యత పెరిగింది. ప్రధాన స్పిన్నర్ నాథన్ లయన్ ఆ జట్టు కీలక అస్త్రం కాగా, అతనికి అండగా ఎవరు నిలుస్తారో చూడాలి. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ యాష్టన్ అగర్కంటే కొత్త ఆటగాడు మర్ఫీకి ఎక్కువ సానుకూలతలు ఉన్నాయి. తుది జట్లు (అంచనా): భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, పుజారా, కోహ్లి, గిల్/సూర్యకుమార్, జడేజా, అశ్విన్, భరత్, అక్షర్/కుల్దీప్, షమీ, సిరాజ్. ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), వార్నర్, ఖాజా, లబుషేన్, స్మిత్, హెడ్, హ్యాండ్స్కోంబ్/రెన్షా, క్యారీ, అగర్/మర్ఫీ, లయన్, బోలండ్. -
Border-Gavaskar Trophy 2023: ‘మా వద్దా స్పిన్ అస్త్రాలు ఉన్నాయి’
బెంగళూరు: భారత గడ్డపై టెస్టు సిరీస్ అంటే స్పిన్ బౌలింగ్ ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలుసు. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లాంటి స్పిన్నర్లను ఎదుర్కొని ఆస్ట్రేలియా ఎలా పరుగులు సాధిస్తుందనేది ఆసక్తికరం. అయితే మరోవైపు తమ స్పిన్ కూడా బలమైందేనని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నమ్ముతున్నాడు. ఈ నెల 9 నుంచి బోర్డర్–గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో కమిన్స్ శనివారం మీడియాతో మాట్లాడాడు. తమ జట్టులోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారని, భిన్నమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని కమిన్స్ అన్నాడు. ఈ సిరీస్లో నాథన్ లయన్ ఆసీస్ ప్రధానాస్త్రం కాగా, ఇతర స్పిన్నర్లు అతనికి అండగా నిలవనున్నారు. ‘మా జట్టులోనూ ఆఫ్స్పిన్నర్, లెగ్స్పిన్నర్, లెఫ్టార్మ్ పేసర్... ఇలా భిన్నమైన బౌలర్లు అందుబాటులో ఉన్నారు. అయితే పరిస్థితులను బట్టి 20 వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న బౌలింగ్ బృందాన్నే ఎంచుకుంటాం. నాగపూర్లో తొలి టెస్టు సమయానికే స్పష్టత వస్తుంది’ అని కమిన్స్ చెప్పాడు. తమ స్పిన్నర్లపై మేనేజ్మెంట్కు గట్టి నమ్మకం ఉందని అతను వెల్లడించాడు. ‘ఆస్టన్ అగర్ మంచి ప్రతిభావంతుడు. గత రెండు విదేశీ పర్యటనల్లో ఆడిన స్వెప్సన్కు అనుభవం వచ్చింది. మర్ఫీ కూడా గత సిరీస్ ఆడాడు. ట్రవిస్ హెడ్ కూడా మంచి ఆఫ్స్పిన్ వేయగలడు. కాబట్టి వీరంతా లయన్కు సహకరించగలరు’ అని ఆసీస్ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. అయితే స్పిన్పై చర్చలో తమ పేస్ బౌలర్ల పదును గురించి ఎవరూ చర్చించడం లేదని కమిన్స్ వ్యాఖ్యానించాడు. ‘అన్ని పరిస్థితుల్లోనూ సత్తా చాటగల పేస్ బౌలర్లు మాకు ఉన్నారు. పేస్కు పెద్దగా సహకరించని సిడ్నీ పిచ్లపై కూడా వారు చెలరేగారు. గత భారత పర్యటనలో రాంచీ టెస్టులో నేను మంచి ప్రదర్శన కనబర్చడం మరచిపోలేను. ఈసారి నాపై మరింత బాధ్యత ఉంది’ అని కంగారూ టీమ్ సారథి పేర్కొన్నాడు. మరోవైపు వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ తొలి టెస్టు ఆడే అవకాశాలు మెరుగవుతున్నాయి. తాజా సన్నాహక శిబిరంలో అతను బాగా బౌలింగ్ చేశాడని, బ్యాటింగ్లో కొంత అసౌకర్యంగా ఉన్నా... మ్యాచ్ సమయానికి కోలుకుంటే తుది జట్టులో స్థానం ఖాయమని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ వెల్లడించాడు. గ్రీన్ టీమ్లోకి వస్తే అదనపు స్పిన్నర్ను ఆడించేందుకు ఆసీస్కు అవకాశం ఉంటుంది. ‘రివర్స్ స్వింగ్’ పని చేస్తుంది: క్యారీ భారత్లో స్పిన్ బౌలింగ్ ప్రభావం గురించే అంతా మాట్లాడుతున్నారని, అయితే రివర్స్ స్వింగ్ తమను ఇబ్బంది పెట్టవచ్చని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ అభిప్రాయపడ్డాడు. 2018లో ఆసీస్ ‘ఎ’ తరఫున ఇక్కడ ఆడినప్పుడు స్పిన్ కోసం సిద్ధమైతే భారత పేసర్లు రివర్స్ స్వింగ్తో తమను పడగొట్టారని గుర్తు చేసుకున్నాడు. బుమ్రా, పంత్లాంటి ఆటగాళ్లు లేక ప్రస్తుత భారత జట్టు కొంత బలహీనంగా కనిపిస్తోందని, కొద్దిగా కష్టపడితే ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ గెలిచే అవకాశం ఉందని మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ వ్యాఖ్యానించాడు. టీమిండియా కోహ్లిపై అతిగా ఆధారపడుతోందన్న చాపెల్... ఖాజా, లబుషేన్లాంటి ఆటగాళ్లకు ఇది అతి పెద్ద పరీక్షగా అభివర్ణించాడు. -
మమ్మల్ని చూసే ద్రవిడ్ అలా...
సిడ్నీ: గత కొన్నేళ్లలో భారత క్రికెట్ జట్టు విదేశాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా వరుసగా రెండుసార్లు ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి బోర్డర్–గావస్కర్ ట్రోఫీని గెలుచుకోవడం పెద్ద విశేషం. ఈ విజయాల వెనక భారత ‘ఎ’ జట్టు కోచ్గా యువ ఆటగాళ్లను తీర్చి దిద్దిన రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉంది. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా దిగ్గజం గ్రెగ్ చాపెల్ గుర్తు చేస్తున్నాడు. గతంలో తమ దేశంలో ఇలాంటి పటిష్టమైన వ్యవస్థ ఉండేదని... దానిని స్ఫూర్తిగా తీసుకొని ద్రవిడ్ భారత్లో ఫలితాలు సాధిస్తే తమ టీమ్ మాత్రం వెనుకబడిపోయిందని అతను అభిప్రాయపడ్డాడు. ‘చరిత్రను చూస్తే యువ ఆటగాళ్లను తీర్చిదిద్ది సీనియర్ టీమ్లోకి వచ్చేసరికి రాటుదేల్చే గొప్ప వ్యవస్థ ఆస్ట్రేలియా క్రికెట్లో ఉంది. కానీ గత రెండేళ్లుగా పరిస్థితి మారింది. ఎంతో మంది ప్రతిభావంతులైన కుర్రాళ్లను నేను చూశాను. కానీ వారు దారితెన్నూ లేనట్లు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే విషయంలో ఆస్ట్రేలియా ఇప్పటికే వెనుకబడిపోయింది. ఇంగ్లండ్ ఇందులో బాగా పని చేస్తుండగా భారత్ కూడా ఆసీస్ను వెనక్కి నెట్టేసింది. భారత్లో దీనిని రాహుల్ ద్రవిడ్ సమర్థంగా అమలు చేస్తున్నాడు. నిజానికి అతను ఆస్ట్రేలియాలో ఉన్న వ్యవస్థను చూసి నేర్చుకొని భారత్లో దానిని తీర్చిదిద్దాడు’ అని చాపెల్ వ్యాఖ్యానించాడు. -
బ్యాండ్ బాజాతో రహానేకు ఘన స్వాగతం..
-
అజింక్య రహానేకు గ్రాండ్ వెల్కమ్ : వీడియో వైరల్
సాక్షి, ముంబై: ఆస్ట్రేలియా గడ్డపై సరికొత్త చరిత్రను లిఖించిన టీమిండియా కెప్టెన్ అంజిక్య రహానేకు ముంబైలో ఘన స్వాగతం లభించింది. అపూర్వ విజయయంతో బోర్డర్-గావస్కర్ ట్రోఫిని దక్కించుకున్న రహానే టీంపై దేశవ్యాప్తంగా ప్రశంసలజల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని ఆయన అభిమానులు, స్థానికులు కూడా రహానే ఘన స్వాగతం పలికారు. గురువారం ముంబైలోని ఆయన నివాసానికి తిరిగివచ్చిన తరుణంలో బాండ్ బాజాలతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. టీమిండియా విజయంతో దేశం గర్వపడేలా చేసిన కూల్ కెప్టెన్ రహానేకు అపూర్వ స్వాగతం పలికారు అభిమానులు. కుమార్తె ఆర్యను ఎత్తుకుని వస్తున్న రహానేపై పూల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను రహానె భార్య రాధిక ఇన్స్టాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది ఆస్ట్రేలియాలో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడంతో టీమ్ ఇండియాకు నాయకత్వం వహించిన అజింక్య రహానే నేతృత్వంలోని యంగ్ ఇండియా టీం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా రహానే తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా దొపావ్కర్ను సెప్టెంబర్ 26, 2014లో లవ్ కమ్ ఆరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతుల ముద్దుల కూతురే ఆర్య . Skipper Ajinkya Rahane received a grand reception at his home in Mumbai. ❤🤩 pic.twitter.com/2h3W0Khest — Anish Singh (@The_anishsingh) January 21, 2021 -
వానతో విరామం...
ప్రధాన బ్యాట్స్మన్ రోహిత్ శర్మ అవుట్... తర్వాతి 37 బంతుల్లో వచ్చినవి 2 పరుగులే... మరింత ఉత్సాహంతో ఆసీస్ కనిపిస్తుండగా ఒత్తిడిలో భారత జట్టు... మూడో సెషన్లో పట్టుదలగా నిలవాల్సిన పరిస్థితి... ఇన్నింగ్స్ కొనసాగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో గానీ వర్షం రాకతో మ్యాచ్లో అనూహ్య విరామం వచ్చేసింది. మైదానం అనుకూలంగా లేకపోవడంతో మూడో సెషన్లో ఒక్క బంతి కూడా వేయకుండానే ఆటను రద్దు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతానికి మరో 307 పరుగులు వెనుకబడి ఉన్న టీమిండియా ఆదివారం ఎలా పుంజుకుంటుందో చూడాలి. అంతకుముందు కనీసం 400 పరుగుల చేయాలనే లక్ష్యంతో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియాను అంతకంటే చాలా ముందుగా నిలిపివేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. బ్రిస్బేన్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ విజేతను తేల్చే పోరుకు వాన ఆటంకంగా మారింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ రెండో రోజు శనివారం మొత్తంగా 54.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 26 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. చతేశ్వర్ పుజారా (8 బ్యాటింగ్), కెప్టెన్ అజింక్య రహానే (2 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజ్లో ఉండగా... దూకుడుగా ఆడబోయిన రోహిత్ శర్మ (74 బంతుల్లో 44; 6 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 274/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 95 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయి 369 పరుగులవద్ద ఆలౌటైంది. కెప్టెన్ టిమ్ పైన్ (104 బంతుల్లో 50; 6 ఫోర్లు), కామెరాన్ గ్రీన్ (107 బంతుల్లో 47; 6 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో నటరాజన్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్ తలా 3 వికెట్లు తీశారు. 4 పరుగులకు 3 వికెట్లు... శుక్రవారం సాధ్యమైనంత త్వరగా ఆస్ట్రేలియా ఆట ముగిద్దామని భావించిన భారత్ సఫలం కాలేకపోయింది. ఆసీస్ లోయర్ ఆర్డర్ మరోసారి చెప్పుకోదగ్గ పోరాట పటిమ కనబర్చింది. ఆరో వికెట్కు 98 పరుగులు జోడించిన అనంతరం పైన్ను అవుట్ చేసి భారత్ రెండో రోజు తొలి వికెట్ సాధించింది. 102 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ఆసీస్ కెప్టెన్ వెనుదిరిగాడు. మరో రెండు పరుగుల వ్యవధిలోనే గ్రీన్, కమిన్స్ (2) కూడా పెవిలియన్ చేరడంతో ప్రత్యర్థిని ఆలౌట్ చేసేందుకు భారత్కు మంచి అవకాశం లభించింది. అయితే మిషెల్ స్టార్క్ (20 నాటౌట్), కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్న నాథన్ లయన్ (24) దీనికి అడ్డు పడ్డారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన వీరిద్దరు తొమ్మిదో వికెట్కు 39 పరుగులు జోడించారు. ఆ తర్వాత హాజల్వుడ్ (11) సహకారంతో స్టార్క్ తమ జట్టుకు మరికొన్ని పరుగులు అందించాడు. గిల్ విఫలం... భారత జట్టుకు ఈసారి చెప్పుకోదగ్గ ఆరంభం అందించడంలో ఓపెనింగ్ జోడి విఫలమైంది. కమిన్స్ తన తొలి ఓవర్లోనే శుబ్మన్ గిల్ (7)ను అవుట్ చేసి దెబ్బ కొట్టాడు. అయితే రోహిత్ శర్మ చక్కటి షాట్లతో చకచకా పరుగులు రాబట్టాడు. కమిన్స్ బౌలింగ్లోనే రోహిత్ మూడు ఫోర్లు కొట్టగా... గ్రీన్ బౌలింగ్లో కొట్టిన స్క్వేర్ డ్రైవ్ బౌండరీ హైలైట్గా నిలిచింది. ఇదే జోరులో లయన్ బౌలింగ్లో ముందుకు దూసుకొచ్చి కొట్టిన షాట్తో రోహిత్ ఇన్నింగ్స్కు తెరపడింది. రెండో సెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన పుజారా, రహానే 6.1 ఓవర్లలో 2 పరుగులే జోడించారు. టీ విరామం సమయంలో వచ్చిన వర్షం కారణంగా ఆపై ఆట సాధ్యం కాలేదు. ఆస్ట్రేలియా అసంతృప్తి వర్షం పూర్తిగా ఆగిపోయి దాదాపు గంట అయింది. బ్రిస్బేన్ మైదానంలోని అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ వల్ల అవుట్ ఫీల్డ్లో నీరు మొత్తం తోడేశారు. కవర్లు కూడా తొలగించారు. ఇక కొద్ది సేపట్లో ఆట జరగడం ఖాయమని భావించిన ఆసీస్ ఆటగాళ్లు వార్మప్ కూడా చేస్తున్నారు... ఈ దశలో అనూహ్యంగా అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడక్కడా తడి ఉండటంతో గ్రౌండ్ అనుకూలంగా లేదని వారు భావించారు. అయితే అంపైర్ల నిర్ణయం ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ను అసంతృప్తికి గురి చేసింది. స్థానిక సమయం ప్రకారం ఆట నిర్దేశిత ముగింపు సమయంలో మరో 45 నిమిషాలు మిగిలి ఉన్నాయి. కనీసం 10 ఓవర్లు లేదంటే అరగంట ఆటైనా జరగవచ్చని ఆస్ట్రేలియా ఆశించింది. ఒత్తిడిలో ఉన్న భారత్ను మరింతగా ఇబ్బంది పెట్టి మరో వికెట్ సాధించగలిగినా కంగారూలకు పట్టు చిక్కినట్లే. పైగా రోహిత్ను అవుట్ చేసి లయన్ అప్పుడే లయ అందుకున్నాడు. ఈ సమయంలో ఆటను నిలిపివేయడంతో నిరాశకు గురైన పైన్... అంపైర్ పాల్ విల్సన్తో వాదించడం కనిపించింది. వాన కారణంగా కోల్పోయిన సమయాన్ని పూడ్చేందుకు మిగిలిన మూడు రోజుల్లో ప్రతీ రోజు ఆట నిర్ణీత సమయంకంటే అర గంట ముందుగా ప్రారంభమవుతుంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) రోహిత్ శర్మ (బి) సిరాజ్ 1; హారిస్ (సి) సుందర్ (బి) శార్దుల్ 5; లబ్షేన్ (సి) పంత్ (బి) నటరాజన్ 108; స్మిత్ (సి) రోహిత్ (బి) సుందర్ 36; వేడ్ (సి) శార్దుల్ (బి) నటరాజన్ 45; గ్రీన్ (బి) సుందర్ 47; పైన్ (సి) రోహిత్ (బి) శార్దుల్ 50; కమిన్స్ (ఎల్బీ) (బి) శార్దుల్ 2; స్టార్క్ (నాటౌట్) 20; లయన్ (బి) సుందర్ 24; హాజల్వుడ్ (బి) నటరాజన్ 11; ఎక్స్ట్రాలు 20; మొత్తం (115.2 ఓవర్లలో ఆలౌట్) 369 వికెట్ల పతనం: 1–4, 2–17, 3–87, 4–200, 5–213, 6–311, 7–313, 8–315, 9–354, 10–369. బౌలింగ్: సిరాజ్ 28–10–77–1, నటరాజన్ 24.2–3–78–3, శార్దుల్ 24–6–94–3, సైనీ 7.5–2–21–0, సుందర్ 31–6–89–3, రోహిత్ 0.1–0–1–0. భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) స్టార్క్ (బి) లయన్ 44, శుబ్మన్ గిల్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 7, పుజారా (బ్యాటింగ్) 8, రహానే (బ్యాటింగ్) 2, ఎక్స్ట్రాలు 1, మొత్తం (26 ఓవర్లలో 2 వికెట్లకు) 62. వికెట్ల పతనం: 1–11, 2–60. బౌలింగ్: స్టార్క్ 3–1–8–0, హాజల్వుడ్ 8–4–11–0, కమిన్స్ 6–1–22–1, గ్రీన్ 3–0–11–0, నాథన్ లయన్ 6–2–10–1. -
ఆఖరి సమరానికి ‘సై’
ఆంక్షలు, అలసిన శరీరాలు, గాయాలు, గెలుపోటములు... అన్నీ అధిగమించిన అనంతరం ఆస్ట్రేలియా పర్యటన ఆఖరి అంకానికి చేరింది. సిడ్నీలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఓటమిని తప్పించుకున్న భారత్ ఇప్పుడు చివరి సమరానికి సన్నద్ధమైంది. కీలక ఆటగాళ్లు దూరమైన తర్వాత కూడా ఆత్మవిశ్వాసానికి లోటు లేకుండా ఆడిన టీమిండియా మరొక్కసారి బలం కూడదీసుకొని తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చగలిగితే వరుసగా రెండో సారి కంగారూ పర్యటనను అద్భుతంగా ముగించగలుగుతుంది. కనీసం ‘డ్రా’ చేసినా బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంటుంది. మరో వైపు సొంతగడ్డపై భారత్ చేతిలో వరుసగా రెండో సిరీస్ను చేజార్చుకోరాదని భావిస్తున్న ఆసీస్ కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ‘గాబా’ మైదానంలో 1988నుంచి ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా రికార్డు కొనసాగిస్తుందా లేదా రహానే సేన ముందు తలవంచుతుందా చూడాలి! బ్రిస్బేన్: వన్డే సిరీస్లో పరాజయం, టి20ల్లో సిరీస్ గెలుపు తర్వాత టెస్టు సిరీస్లో ప్రస్తుతం 1–1తో సమంగా నిలిచిన భారత జట్టు ఆఖరి పోరులో తమ సత్తాను చాటుకునేందుకు బరిలోకి దిగనుంది. శుక్రవారం నుంచి ఇక్కడి ‘గాబా’ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య చివరిదైన నాలుగో టెస్టు జరగనుంది. మూడో టెస్టులో ప్రదర్శన తర్వాత తాము ఎలాంటి సవాల్కైనా సిద్ధమని భారత్ నిరూపించగా... కచ్చితంగా మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో ఆసీస్పైనే తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర సమరం ఖాయం. తుది జట్టులోకి ఎవరు? గాయాలతో జడేజా, విహారి చివరి టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించేసింది. అయితే ప్రధాన పేసర్ బుమ్రా విషయంలో మాత్రం ఇంకా పూర్తి స్పష్టతనివ్వలేదు. పొత్తి కడుపులో కండరాల గాయంతో బాధపడుతున్న బుమ్రా 100 శాతం ఫిట్గా లేడనేది వాస్తవం. బుధవారం భారత జట్టు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనగా...బుమ్రా మాత్రం బౌలింగ్ చేయలేదు. అయితే బుమ్రా కూడా లేకపోతే పేస్ బౌలింగ్ మరీ పేలవంగా మారిపోయే అవకాశం ఉండటంతో పూర్తి ఫిట్గా లేకపోయినా అతడిని ఆడిస్తారా అనేది చూడాలి. వెన్నునొప్పితో బాధపడుతున్న అశ్విన్ పూర్తిగా కోలుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. విహారి స్థానంలో మయాంక్ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయం. అయితే అతను మిడిలార్డర్లో కాకుండా ఓపెనర్గానే ఆడితే (రోహిత్తో కలిసి) మిగతా బ్యాట్స్మెన్ ఒక్కో స్థానం దిగువన ఆడతారు. జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్ రావచ్చు. అయితే బ్రిస్బేన్ పిచ్ను దృష్టిలో ఉంచుకొని అశ్విన్ రూపంలో ఒకే స్పిన్నర్ను ఆడించి నాలుగో పేసర్ను తీసుకుంటే మాత్రం శార్దుల్ ఠాకూర్కు అవకాశం ఉంది. బుమ్రా చివరి నిమిషంలో తప్పుకుంటే నటరాజన్ అరంగేట్రం చేస్తాడు. బ్యాటింగ్లో రహానే, పుజారాలపై ప్రధాన భారం ఉంది. వీరిద్దరు నిలబడితే భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. రోహిత్, గిల్ కూడా రాణిస్తే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించవచ్చు. గత రికార్డుల ప్రకారం ఇది భారత్కు అచ్చి రాని మైదానమే అయినా... ఎన్నో ఇలాంటి అసాధ్యమైన ఘనతలను ఇటీవల టీమిండియా తిరగరాస్తూ వచ్చింది. అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఇది కూడా ఆ జాబితాలో చేరుతుంది. ఆసీస్ ఏం చేస్తుందో! మెల్బోర్న్లో ఓటమి తర్వాత సిడ్నీలో గెలుపు అవకాశాన్ని చేజార్చుకున్న ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఒత్తిడిలోకి పడిపోయింది. బ్రిస్బేన్లో ఆడేందుకు భారత్ భయపడుతుందంటూ వ్యాఖ్యలు చేసినవారంతా సిడ్నీలో టీమిండియా ప్రదర్శన తర్వాత నోరు విప్పే సాహసం చేయలేదు. కఠిన పరిస్థితుల్లోనూ పదునైన బౌలింగ్ను ఎదుర్కొని రహానే బృందం ఆడిన తీరు ఆసీస్ శిబిరంలో ఆందోళన పెంచింది. ‘36’లాంటి అనూహ్యం సంభవిస్తే తప్ప భారత్ను ఓడించలేమని వారికి అర్థమైంది. బ్రిస్బేన్లో పరిస్థితి ఆస్ట్రేలియాకు అనుకూలంగా ఉందని తాను చెప్పలేనని స్పిన్నర్ లయన్ వ్యాఖ్యానించడం పరిస్థితిని చూపిస్తోంది. అమిత భారం మోస్తున్న ముగ్గురు ప్రధాన పేసర్లలో ఒకరు టెస్టుకు ముందు తప్పుకునే ప్రమాదం కూడా ఉందని వినిపిస్తోంది. అదే జరిగితే ఆసీస్ మరింత బలహీనంగా మారిపోతుంది. ఫిట్గా లేకపోయినా మరో సారి వార్నర్ను ఎలాగైనా ఆడించాలని జట్టు సిద్ధమైంది. స్మిత్ ఫామ్లోకి రావడమే ఆ జట్టుకు పెద్ద ఊరట. అతనితో కలిసి లబ్షేన్ కూడా రాణిస్తే ఆతిథ్య జట్టు గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. ► నాథన్ లయన్కు ఇది 100వ టెస్టు మ్యాచ్. అతను ఈ మైలురాయి చేరనున్న 13వ ఆస్ట్రేలియా క్రికెటర్. మరో 4 వికెట్లు తీస్తే అతను టెస్టుల్లో 400 వికెట్లు కూడా పూర్తి చేసుకుంటాడు. ► బ్రిస్బేన్లో 6 టెస్టులు ఆడిన భారత్ ఒక్కటి కూడా గెలవలేదు. 5 ఓడి 1 మ్యాచ్ డ్రా చేసుకుంది. మరో వైపు ఈ మైదానంలో ఆడిన 62 టెస్టుల్లో 40 గెలిచిన ఆసీస్ 8 మాత్రమే ఓడింది. 1988లో విండీస్ చేతిలో ఓడిన తర్వాత గత 31 టెస్టుల్లో ఆ జట్టుకు ఇక్కడ పరాజయం ఎదురవలేదు. -
అశ్విన్, విహారి వీరోచిత ప్రదర్శన
భారత జట్టు మ్యాచ్ గెలవలేదు... కానీ గెలిచినంత ఆనందాన్ని పంచింది... ఐదు రోజులు ఆడిన తర్వాత స్కోరు బోర్డు చూస్తే ‘డ్రా’గానే కనిపించవచ్చు... కానీ ఆట ఆఖర్లో కనిపించిన ఉత్కంఠ, ఉద్వేగాలు అక్షరాల రూపంలో రాయలేనివి... ఇక ఈ మ్యాచ్ను కాపాడుకోవడం కష్టం అనిపించిన క్షణం నుంచి ఇద్దరు ఆటగాళ్లు చూపించిన పట్టుదల, తెగువ నభూతో... సరిగ్గా నిలబడేందుకు కూడా ఇబ్బంది పడుతున్న బ్యాట్స్మన్ ఒకవైపు... పరుగు సంగతి దేవుడెరుగు, నడవడమే కష్టంగా అనిపించిన బ్యాట్స్మన్ మరోవైపు... తమలో ఒకరు వెనుదిరిగినా పెవిలియన్లో కట్టుతో కూర్చున్న ఆటగాడి నుంచి ఏమీ ఆశించలేని పరిస్థితిలో వారిద్దరు ఏకంగా 42.4 ఓవర్ల పాటు (256 బంతులు) పోరాడారు. జట్టును ఓటమి నుంచి రక్షించి సగర్వంగా నిలబడ్డారు. సెంచరీలు సాధించకపోయినా సరే... సిడ్నీ మైదానం ఎప్పటికీ మరచిపోలేని విధంగా హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్లు తమ పేర్లతో ప్రత్యేక ముద్ర వేశారు. ఐదు వికెట్లు తీసిన తర్వాత గెలుపు సంబరాలు ఎంతో దూరంలో లేవని భావించిన ఆసీస్ కలలు ఈ ఇద్దరి పోరాటం ముందు భ్రమలుగా తేలిపోయాయి. అందుబాటులో ఉన్న అస్త్ర శస్త్రాలు అన్నీ ఉపయోగించినా ఫలితం దక్కక ఆతిథ్య జట్టు ‘డ్రా’తో బిక్క మొహం వేసింది. సిరీస్ విజేతను తేల్చే తుది సమరం కోసం బ్రిస్బేన్ బయల్దేరడానికి ముందు ఏ జట్టు ఆత్మవిశ్వాసం ఆకాశాన్నంటుతోందో కొత్తగా చెప్పాలా! సిడ్నీ: అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత జట్టు బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కీలక సమరంలో ఓటమిని తప్పించుకుంది. ఆస్ట్రేలియాతో సోమవారం మూడో టెస్టును ‘డ్రా’గా ముగించిన టీమిండియా సిరీస్లో 1–1తోనే సమాన స్థితిలో నిలిచింది. 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 98/2తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (118 బంతుల్లో 97; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకోగా, చతేశ్వర్ పుజారా (205 బంతుల్లో 77; 12 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం హనుమ విహారి (161 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్; 7 ఫోర్లు)ల మారథాన్ భాగస్వామ్యంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. వీరిద్దరు 42.4 ఓవర్లపాటు క్రీజ్లో నిలిచి ఆరో వికెట్కు 62 పరుగులు జోడించారు. ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ జోడీని విడదీయడంలో విఫలమయ్యారు. మ్యాచ్లో టాప్ స్కోరర్గా నిలిచిన స్టీవ్ స్మిత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్లో చివరిదైన నాలుగో టెస్టు జరుగుతుంది. పంత్ మెరుపులు... ఐదో రోజు ఆట రెండో ఓవర్లోనే భారత్కు షాక్ తగిలింది. లయన్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడబోయిన కెప్టెన్ రహానే (18 బంతుల్లో 4) షార్ట్లెగ్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో ప్రమోట్ అయి ఐదో స్థానంలో బరిలోకి దిగిన రిషభ్ పంత్ తన సహజ ధోరణిలో చెలరేగిపోయాడు. మరోవైపు పుజారా పట్టుదలగా నిలబడి వికెట్ కాపాడే ప్రయత్నం చేయడంతో పంత్కు ధాటిగా ఆడే అవకాశం కలిగింది. ముఖ్యంగా లయన్ బౌలింగ్లో అతను ఎదురుదాడి చేసిన తీరు ఆకట్టుకుంది. ఒక ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన పంత్... అతని తర్వాత ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు.కొంత విరామం తర్వాత లయన్ బౌలింగ్లోనే వరుసగా లాంగాఫ్, లాంగాన్ మీదుగా రెండు భారీ సిక్సర్లు బాది 64 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు పుజారా కొన్ని చక్కటి ఫోర్లతో పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో మ్యాచ్లో పుజారా రెండో హాఫ్ సెంచరీని (170 బంతుల్లో) అందుకున్నాడు. అనంతరం తొమ్మిది బంతుల వ్యవధిలో నాలుగు ఫోర్లు కొట్టిన పంత్ సెంచరీకి చేరువయ్యాడు. అయితే చివరకు లయన్దే పైచేయి అయింది. అతని బౌలింగ్లో ముందుకొచ్చి ఆడబోయిన పంత్ గల్లీలో కమిన్స్కు చిక్కాడు. మరో ఎండ్లో కమిన్స్ కొత్త బంతిని వరుసగా మూడుసార్లు బౌండరీకి తరలించిన పుజారా... హాజల్వుడ్ వేసిన చక్కటి బంతికి క్లీన్బౌల్డయ్యాడు. ఈ దశలో జట్టు ప్రమాదంలో పడినట్లు కనిపించినా... అశ్విన్, విహారి అద్భుత భాగస్వామ్యంతో ఆదుకున్నారు. \స్మిత్ ఏమిటిలా? డ్రింక్స్ విరామ సమయంలో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా స్మిత్ చేసిన చర్య చర్చకు దారి తీసింది. పంత్ క్రీజ్ నుంచి పక్కకు వెళ్లిన సమయంలో క్రీజ్పైకి వచ్చిన స్మిత్...షాడో ప్రాక్టీస్ చేస్తూ ఆపైతన కాలితో బ్యాట్స్మన్ గార్డ్ మార్క్ను చెరిపేస్తున్న వీడియో బయట పడింది. తర్వాత పంత్ వచ్చి మళ్లీ మార్క్ను సెట్ చేసుకున్నాడు. అయితే ఇది కావాలని పంత్ ఏకాగ్రతను చెడగొట్టే ప్రయత్నమా, లేక రొటీన్గా నిబంధనలకు లోబడి అతను అలా చేశాడా అనేది అర్థం కాలేదు. దీనిపై అధికారికంగా మాత్రం ఎలాంటి స్పష్టత లేదు కానీ కొందరు మాజీలు అతని చర్యను విమర్శించారు. మోసగాడు ఎప్పటికీ మోసగాడే అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. విహారి ఇన్నింగ్స్ సెంచరీతో సమానం. అతను గర్వపడే ప్రదర్శన ఇది. నాకు బ్యాటింగ్లో అచ్చొచ్చిన సిడ్నీ మైదానంలో మరో మంచి ఇన్నింగ్స్ ఆడటం ఆనందంగా ఉంది. కమిన్స్ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఇద్దరం గాయాలతో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఏకాగ్రత కోల్పోరాదని గట్టిగా అనుకున్నాం. మాకు కొంత అదృష్టం కూడా కలిసొచ్చింది. –అశ్విన్ టెస్టు మ్యాచ్ చివరి రోజు బ్యాటింగ్ చేసి ఇలా జట్టును కాపాడటం ఎంత సంతృప్తినిచ్చిందో మాటల్లో చెప్పలేను. గెలిచి ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది. ఆట ముగిసిన తర్వాత కూడా మా ఆనందాన్ని ఎలా చూపించాలో కూడా అర్థం కాలేదు. –విహారి ‘మ్యాచ్ ‘డ్రా’నే అయినా మేం ఆడిన పరిస్థితులను బట్టి చూస్తే ఇది మాకు విజయంతో సమానం. ఫలితం గురించి ఆలోచించకుండా మేం చివరి వరకు పోరాడాలని భావించాం. మా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. విహారి, అశ్విన్ చూపిన పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువే. వెస్టిండీస్లో చేసిన సెంచరీకంటే విహారి ఈ ఇన్నింగ్సే అత్యుత్తమం. కఠిన పరిస్థితుల్లో గాయంతో అతను చూపిన పట్టుదల నిజంగా ఎంతో ప్రత్యేకం. పంత్ కూడా చాలా బాగా ఆడాడు. లెఫ్ట్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ కోసమే అతడిని ముందుగా పంపాం. వీరిద్దరు ఉన్నంత వరకు విజయంపై దృష్టి పెట్టాం. ఆ తర్వాతే ‘డ్రా’ గురించి ఆలోచించాం. చివరి ఐదు–ఆరు ఓవర్లలో మాత్రం ఒక్కో బంతిని లెక్క పెడుతూ వచ్చాం. –రహానే, భారత కెప్టెన్ ఫలితాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. మా బౌలర్లు చాలా బాగా ఆడారు. మంచి అవకాశాలు వచ్చాయి. క్యాచ్లు వదిలేయడం నేను చేసిన పెద్ద తప్పు. గత రెండు మ్యాచ్లతో పోలిస్తే ఇక్కడ మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినా ఫలితం దక్కలేదు. –పైన్, ఆస్ట్రేలియా కెప్టెన్ స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 338; భారత్ తొలి ఇన్నింగ్స్: 244; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 312/6 డిక్లేర్డ్; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) స్టార్క్ (బి) కమిన్స్ 52; గిల్ (సి) పైన్ (బి) హాజల్వుడ్ 31; పుజారా (బి) కమిన్స్ 77; రహానే (సి) వేడ్ (బి) లయన్ 4; పంత్ (సి) కమిన్స్ (బి) లయన్ 97; విహారి (నాటౌట్) 23; అశ్విన్ (నాటౌట్) 39; ఎక్స్ట్రాలు 11, మొత్తం (131 ఓవర్లలో 5 వికెట్లకు) 334 వికెట్ల పతనం: 1–71, 2–92, 3–102, 4–250, 5–272. బౌలింగ్: స్టార్క్ 22–6–66–0, హాజల్వుడ్ 26–12–39–2, కమిన్స్ 26–6–72–1, లయన్ 46–17–114–2, గ్రీన్ 7–0–31–0, లబ్షేన్ 4–2–9–0. -
సిడ్నీ టెస్టులో భారత్ తడబాటు
ఆస్ట్రేలియా చేతిలో మూడో టెస్టులో భారత్కు భంగపాటు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో రోజు ప్రత్యర్థికంటే మెరుగైన స్థితిలో నిలిచి భారీ స్కోరుకు బాటలు వేసుకున్న టీమిండియా బ్యాట్స్మెన్ వైఫల్యంతో కుప్పకూలింది. ఆసీస్ పేస్ త్రయం పదునైన బౌలింగ్ను ఎదుర్కోలేక మన ఆటగాళ్లు చేతులెత్తేసి భారీ ఆధిక్యం సమర్పించుకున్నారు. రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి తమ ఓవరాల్ ఆధిక్యాన్ని 197 పరుగులకు పెంచుకుంది. ఆదివారం కనీసం రెండు సెషన్లలో మరిన్ని పరుగులు జోడించి సవాల్ విసిరేందుకు సన్నద్ధమైంది. నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కఠినంగా మారిపోయే చోట మనోళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి. సిడ్నీ: బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ముందంజ వేసే లక్ష్యంతో ఉన్న ఆస్ట్రేలియా అందుకు తగ్గ వేదికను సిద్ధం చేసుకుంది. భారత్తో మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. లబ్షేన్ (47 బ్యాటింగ్), స్మిత్ (29 బ్యాటింగ్) క్రీజ్లో ఉండగా... ఓవరాల్ ఆధిక్యం 197 పరుగులకు చేరింది. 35 పరుగులకే ఓపెనర్లు వార్నర్ (13), పకోవ్స్కీ (10)లను భారత్ అవుట్ చేసినా... లబ్షేన్, స్మిత్ మూడో వికెట్కు అజేయంగా 68 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 244 పరుగులకు ఆలౌటైంది. చతేశ్వర్ పుజారా (176 బంతుల్లో 50; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఆసీస్ బౌలర్ కమిన్స్కు 4 వికెట్లు దక్కాయి. విహారి విఫలం... భారీ స్కోరు సాధించే ఆశలతో మూడో రోజు ఆటలో బరిలోకి దిగిన భారత్కు ఏదీ కలిసి రాలేదు. ఆరంభంలోనే కమిన్స్ వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకొని కెప్టెన్ రహానే (22) వెనుదిరిగాడు. ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి (4) రనౌటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్కు దిగిన రిషభ్ పంత్ (67 బంతుల్లో 36; 4 ఫోర్లు) తనదైన శైలిలో దూకుడుగా ఆడి చకచకా పరుగులు రాబట్టాడు. 14 పరుగుల వద్ద అతని అవుట్ కోసం ఆసీస్ డీఆర్ఎస్ కోరగా, ఫలితం భారత్కు అనుకూలంగా వచ్చింది. అయితే కమిన్స్ బౌలింగ్లో గాయమైన తర్వాత ఏకాగ్రత చెదిరిన పంత్, మరో పది బంతులకే స్లిప్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దురదృష్టవశాత్తూ ఇదే స్కోరు వద్ద భారత్ పుజారా వికెట్ కూడా కోల్పోయింది. ఆ తర్వాత మిగిలిన నాలుగు భారత వికెట్లు తీసేందుకు ఆసీస్కు ఎక్కువ సమయం పట్టలేదు. అయితే సహచరులు వెనుదిరుగుతున్నా... మరో ఎండ్లో రవీంద్ర జడేజా (37 బంతుల్లో 28 నాటౌట్; 5 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లతో ఒంటరి పోరాటం చేయడంతో ప్రత్యర్థి ఆధిక్యం వంద పరుగుల లోపు పరిమితమైంది. మూడు రనౌట్లు... భారత జట్టు పతనంలో రనౌట్లు కూడా కీలకపాత్ర పోషించాయి. తొలి ఇన్నింగ్స్లో ఏకంగా ముగ్గురు బ్యాట్స్మెన్ రనౌట్గా వెనుదిరిగారు. 37 బంతుల్లో 4 పరుగులే చేయగలిగిన విహారి ఒత్తిడిలో అనవసరపు పరుగు కోసం ప్రయత్నించి వెనుదిరగాల్సి వచ్చింది. లయన్ బౌలింగ్లో ముందుకు దూసుకొచ్చి మిడాఫ్ దిశగా షాట్ ఆడిన అతను అదే ఊపులో సింగిల్ పూర్తి చేసేందుకు ఉపక్రమించాడు. అయితే హాజల్వుడ్ విసిరిన డైరెక్ట్ త్రో వికెట్లను కూల్చింది. తర్వాతి వంతు అశ్విన్ది. గ్రీన్ బౌలింగ్లో జడేజా షాట్ ఆడి సింగిల్ కోసం పిలవగా... కాస్త అలసత్వంతో పరుగెత్తిన అశ్విన్ (10) అవతలి ఎండ్కు చేరలేక పెవిలియన్ బాట పట్టాడు. బుమ్రాతోనూ ఇలాగే జరిగింది. స్టార్క్ బౌలింగ్లో జడేజా షాట్ ఆడి స్ట్రయికింగ్ కాపాడుకునేందుకు లేని రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే లబ్షేన్ విసిరిన త్రో నాన్స్ట్రైకింగ్ ఎండ్లో వికెట్లను పడగొట్టడంతో బుమ్రా ఆట ముగిసింది. 2008లో మొహాలీ టెస్టు (ఇంగ్లండ్తో) తర్వాత ఒకే ఇన్నింగ్స్లో ముగ్గురు భారత ఆటగాళ్లు రనౌట్ కావడం ఇదే తొలిసారి. జడేజా, పంత్లకు గాయాలు భారత జట్టును గాయాల బెడద వీడట్లేదు. కొత్తగా ఈ జాబితాలో జడేజా, పంత్ చేరారు. కమిన్స్ బౌలింగ్లో పంత్ పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో విఫలం కాగా... బంతి అతని ఎడమ మోచేతిని బలంగా తాకింది. దాంతో తీవ్ర నొప్పితో ఇబ్బంది పడిన అతను స్వల్ప చికిత్స అనంతరం ఆటను కొనసాగించాడు. అయితే భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత అతడిని స్కానింగ్ కోసం తీసుకెళ్లారు. గాయం తీవ్రత తక్కువే కావడం ఊరట కలిగించగా... ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో అతనికి బదులు సాహా కీపింగ్ చేశాడు. అవసరమైతే పంత్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తాడు. ఇన్నింగ్స్ చివర్లో స్టార్క్ వేసిన షార్ట్ బంతిని ఎదుర్కొనే క్రమంలో జడేజా ఎడమ చేతి బొటన వేలుకు బలమైన దెబ్బ తగిలింది. విలవిల్లాడిన జడేజాకు కూడా చికిత్స చేసిన తర్వాత స్కానింగ్కు పంపారు. జడేజా గాయం మాత్రం భారత్కు నష్టం కలిగించే అవకాశం ఉంది. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా... అతని వేలుకు ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. జడేజా గ్లవ్ తొడిగి బ్యాటింగ్ చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది. అన్నింటికి మించి అది అతని బౌలింగ్ చేయి కావడంతో ఈ మ్యాచ్తో పాటు చివరి టెస్టులో కూడా జడేజా ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 29 ఓవర్లు ఆడినా జడేజా బౌలింగ్ చేయకపోవడం పరిస్థితిని సూచిస్తోంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 338; భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి అండ్ బి) హాజల్వుడ్ 26; గిల్ (సి) గ్రీన్ (బి) కమిన్స్ 50; పుజారా (సి) పైన్ (బి) కమిన్స్ 50; రహానే (బి) కమిన్స్ 22; విహారి (రనౌట్) 4; పంత్ (సి) వార్నర్ (బి) హాజల్వుడ్ 36; జడేజా (నాటౌట్) 28; అశ్విన్ (రనౌట్) 10; సైనీ (సి) వేడ్ (బి) స్టార్క్ 3; బుమ్రా (రనౌట్) 0; సిరాజ్ (సి) పైన్ (బి) కమిన్స్ 6; ఎక్స్ట్రాలు 9; మొత్తం (100.4 ఓవర్లలో ఆలౌట్) 244 వికెట్ల పతనం: 1–70, 2–85, 3–117, 4–142, 5–195, 6–195, 7–206, 8–210, 9–216, 10–244. బౌలింగ్: స్టార్క్ 19–7–61–1, హాజల్వుడ్ 21–10–43–2, కమిన్స్ 21.4–10–29–4, లయన్ 31–8–87–0, లబ్షేన్ 3–0–11–0, గ్రీన్ 5–2–11–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వార్నర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 13; పకోవ్స్కీ (సి) (సబ్) సాహా (బి) సిరాజ్ 10; లబ్షేన్ (బ్యాటింగ్) 47; స్మిత్ (బ్యాటింగ్) 29; ఎక్స్ట్రాలు 4; మొత్తం (29 ఓవర్లలో 2 వికెట్లకు) 103 వికెట్ల పతనం: 1–16, 2–35. బౌలింగ్: బుమ్రా 8–1–26–0, సిరాజ్ 8–2–20–1, సైనీ 7–1–28–0, అశ్విన్ 6–0–28–1. ► పుజారా అర్ధ సెంచరీకి తీసుకున్న బంతులు. పుజారా కెరీర్లో ఇదే నెమ్మదైన అర్ధ సెంచరీ. 2018లో దక్షిణాఫ్రికాతో జొహన్నెస్బర్గ్లో జరిగిన టెస్టులో పుజారా173 బంతులు ఆడి అర్ధ సెంచరీ సాధించాడు. ► అశ్విన్ బౌలింగ్లోవార్నర్ అవుటవ్వడం ఇది పదోసారి. వార్నర్ను ఎక్కువసార్లు అవుట్ చేసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ది రెండో స్థానం. స్టువర్ట్ బ్రాడ్ (10 సార్లు) తొలి స్థానంలో... అండర్సన్ (8 సార్లు) మూడో స్థానంలో ఉన్నారు. -
‘సమం’ నుంచి మరో సమరానికి...
అడిలైడ్ టెస్టు ఫలితం తర్వాత భారత జట్టు 0–4కు సిద్ధపడాల్సిందేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన పలువురు మాజీ క్రికెటర్లు రెండో మ్యాచ్ తర్వాత మళ్లీ మాట్లాడే సాహసం చేయలేకపోయారు. ప్రతికూల పరిస్థితుల్లో టీమిండియా సాధించిన విజయం అలాంటిది మరి. ఇప్పుడు ఇరు జట్లు సమాన స్థితిలో నిలిచిన దశలో కొత్త సమరానికి రంగం సిద్ధం కాగా... ప్రత్యర్థితో పోలిస్తే భారత జట్టులోనే ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపిస్తోంది. మెల్బోర్న్ స్ఫూర్తిని కొనసాగిస్తూ మూడో టెస్టులోనూ గెలవగలిగితే బోర్డర్–గావస్కర్ ట్రోఫీని భారత్ సగర్వంగా నిలబెట్టుకోగలుగుతుంది. సొంతగడ్డపై భారత్ చేతిలో వరుసగా రెండో సిరీస్ కోల్పోరాదని భావిస్తున్న ఆస్ట్రేలియా తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగుతున్న నేపథ్యంలో... సిడ్నీలో సీన్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరం. సిడ్నీ: టెస్టు సిరీస్లో పైచేయి సాధించే క్రమంలో భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు పోరుకు సన్నద్ధమయ్యాయి. నేటి నుంచి జరిగే ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్లో ముందంజ వేస్తుంది. భారత్ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే చివరి టెస్టులో ఓడినా బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోగలదు. పలువురు కీలక ఆటగాళ్లు దూరమైనా... బలాబలాల్లో ఆతిథ్య జట్టుతో పోలిస్తే రహానే బృందానిదే కాస్త పైచేయిగా ఉంది. ఓపెనర్గా రోహిత్... గత రెండు మ్యాచ్లలాగే ఈసారి కూడా భారత్ తమ తుది జట్టును ఒకరోజు ముందే ప్రకటించింది. గాయం వివాదం... ఫిట్నెస్ పరీక్ష... కఠిన క్వారంటైన్ను దాటి వచ్చిన రోహిత్ శర్మకు ఊహించినట్లుగానే స్థానం లభించింది. రోహిత్ కోసం మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్పై వేటు పడింది. ఈ సిరీస్లో నాలుగు ఇన్నింగ్స్లలో కలిపి మయాంక్ 31 పరుగులే చేశాడు. ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి స్థానంపై కూడా ప్రమాద ఘంటిక మోగినా... రోహిత్ ఓపెనింగ్ చేయాలని మేనేజ్మెంట్ భావించడంతో మయాంక్ను పక్కన పెట్టాల్సి వచ్చింది. గత ఏడాది ఓపెనర్గా మారిన అనంతరం రోహిత్ ఐదు టెస్టుల్లో మూడు సెంచరీలతో చెలరేగినా... అవన్నీ స్వదేశంలో ఆడినవే. విదేశాల్లో ఇంతవరకు ఓపెనింగ్ చేయని రోహిత్ ఎలా ఆడతాడన్నది చూడాలి. ప్రధాన బ్యాట్స్మన్ పుజారా నుంచి కూడా ఇంకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. రహానే బ్యాటింగ్లో కీలకం కానుండగా, విహారికి తన కెరీర్ కాపాడుకునేందుకు ఇంతకంటే మంచి అవకాశం లభించదు. బౌలింగ్లో 2014 తర్వాత ఇంత తక్కువ అనుభవం ఉన్న పేసర్లతో భారత్ బరిలోకి దిగుతోంది. బుమ్రా 16 టెస్టులు, సిరాజ్ ఒకే ఒక టెస్టు ఆడగా, నవదీప్ సైనీకి తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో బుమ్రాపై మరింత బాధ్యత పెరిగింది. అయితే స్పిన్నర్ అశ్విన్ అద్భుత ఫామ్లో ఉండటం సానుకూలాంశం. జడేజా కూడా తన స్పిన్ పదును చూపిస్తే ఆసీస్ బ్యాట్స్మెన్కు తిప్పలు తప్పవు. పకోవ్స్కీ అరంగేట్రం... గాయంతో తొలి రెండు టెస్టు మ్యాచ్లకు దూరమైన డేవిడ్ వార్నర్ రాకతో ఆసీస్ బలం పెరిగింది. అతను 100 శాతం ఫిట్గా లేకపోయినా ఆడించే ప్రయత్నం చేయడం ఆ జట్టు బ్యాటింగ్ బలహీతనను చూపిస్తోంది. వార్నర్కు తోడుగా కొత్త కుర్రాడు విల్ పకోవ్స్కీ ఓపెనర్గా రావడం దాదాపుగా ఖాయం. ఈ కొత్త జోడి అందించే ఓపెనింగ్పైనే ఆసీస్ ఇన్నింగ్స్ పురోగతి ఆధారపడి ఉంది. అన్నింటికి మంచి ఆస్ట్రేలియాను ఆందోళనపరుస్తున్న అంశం టాప్ బ్యాట్స్మన్ స్మిత్ ఫామ్. రెండు మ్యాచ్లలోనూ అతను ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పుడు సొంత మైదానం సిడ్నీలోనైనా స్మిత్ చెలరేగి జట్టును నడిపించాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. పింక్ టెస్టు మ్యాచ్... అడిలైడ్ టెస్టు ‘పింక్ బాల్’ టెస్టు కాగా... ఇప్పుడు సిడ్నీలో జరగబోయేది పింక్ టెస్టు. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు సంబంధించి ప్రచారంలో భాగంగా మైదానంలో పలు చోట్ల గులాబీ రంగును ప్రదర్శిస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్తో మృతి చెందిన ఆస్ట్రేలియా దిగ్గజ పేస్ బౌలర్ గ్లెన్ మెక్గ్రాత్ భార్య జేన్ స్మారకార్థం సిడ్నీ టెస్టును పింక్ టెస్టుగా పరిగణిస్తారు. ఆసీస్ ఆటగాళ్లు తొలి రోజు గులాబీ క్యాప్లు ధరించి మైదానంలోకి దిగుతారు. మ్యాచ్ ద్వారా సేకరించే నిధుల్లో కొంత మొత్తాన్ని గ్లెన్ మెక్గ్రాత్కు చెందిన జేన్ మెక్గ్రాత్ ఫౌండేషన్కు అందజేస్తారు. పురుషుల టెస్టు మ్యాచ్కు తొలి మహిళా అంపైర్ పురుషుల టెస్టు మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించనున్న తొలి మహిళా అంపైర్గా క్లెయిర్ పొలొసాక్ (ఆస్ట్రేలియా) గుర్తింపు పొందనుంది. సిడ్నీ టెస్టులో ఆమె ఫీల్డ్ అంపైర్గా కాకుండా... ఫోర్త్ అంపైర్గా వ్యవహరించనుంది. న్యూసౌత్ వేల్స్కు చెందిన 32 ఏళ్ల క్లెయిర్ 2019లో నమీబియా–ఒమన్ పురుషుల జట్ల మధ్య జరిగిన ఐసీసీ డివిజన్–2 వన్డే లీగ్ మ్యాచ్లో ఆన్ ఫీల్డ్ అంపైర్గా పనిచేసింది. పిచ్, వాతావరణం గత కొద్ది రోజులుగా నగరంలో వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ మ్యాచ్కు కూడా కొంత అంతరాయం కలగవచ్చు. గతంలో స్పిన్నర్లకు బాగా అనుకూలించిన సిడ్నీ పిచ్ ఇప్పుడు మారింది. కొంత బౌన్స్ ఉంది. పచ్చికను కూడా ఉంచారు కాబట్టి ఆరంభంలో పేసర్లకు అనుకూలిస్తుంది. నిలదొక్కుకుంటే తర్వాత పరుగులు సాధించవచ్చు. జట్ల వివరాలు భారత్ (తుది జట్టు): రహానే (కెప్టెన్), రోహిత్, గిల్, పుజారా, విహారి, పంత్, జడేజా, అశ్విన్, సిరాజ్, బుమ్రా, సైనీ. ఆస్ట్రేలియా (అంచనా): పైన్ (కెప్టెన్), వార్నర్, పకోవ్స్కీ, స్మిత్, లబ్షేన్, వేడ్, గ్రీన్, కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్, లయన్. ► భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో మొత్తం 12 టెస్టులు జరిగాయి. భారత్కు ఒక్క టెస్టులోనే విజయం (1978లో) దక్కింది. టీమిండియా మిగతా ఐదు టెస్టుల్లో ఓడిపోయి, ఆరు టెస్టులను ‘డ్రా’ చేసుకుంది. ► మరో 97 పరుగులు చేస్తే పుజారా టెస్టుల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. ► 400 వికెట్ల మైలురాయిని అందుకునేందుకు లయన్కు కావాల్సిన వికెట్లు -
విజయ మధురం
పది రోజుల్లో ఎంత తేడా... అత్యల్ప స్కోరు సాధించిన అవమాన భారంతో తలవంచుకున్న భారత ఆటగాళ్లు ఇప్పుడు సగర్వంగా నిలబడ్డారు. అడిలైడ్ పరాభవం తర్వాత అన్ని ప్రతికూలతలను అధిగమించిన టీమిండియా మెల్బోర్న్లో మెరిసింది. గత ఓటమి బాధను మరచిపోయేలా చేస్తూ అసాధారణ విజయంతో ఏడాదిని ముగించింది. తొలి రోజు నుంచి ఆస్ట్రేలియాపై ఆధిపత్యం ప్రదర్శించిన రహానే సేన చివరి వరకు ఆ పట్టును నిలబెట్టుకుంది. ఫలితంగా ఎప్పటికీ గుర్తుండిపోయే గెలుపుతో సిరీస్ను సమం చేసింది. నాలుగో రోజు ఆసీస్ మరో 67 పరుగులు జోడించి ఆలౌట్ కాగా... 70 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శతకంతో జట్టును నడిపించిన సారథి రహానే విన్నింగ్ షాట్తో టీమిండియా బృందంలో ఆనందం వెల్లివిరియగా ఆసీస్ పెవిలియన్లో నిశ్శబ్దం వినిపించింది. ఇక కొత్త సంవత్సరంలోనూ ఇదే జోరు సాగించి బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవడమే భారత్ తక్షణ లక్ష్యం! మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ను భారత్ 1–1తో సమం చేసింది. మంగళవారం నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్పై ఘన విజయం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 133/6తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 200 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (146 బంతుల్లో 45; 5 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్గా నిలవగా, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 131 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి భారత్ ముందు 70 పరుగుల లక్ష్యం నిలిచింది. భారత్ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి దీనిని అందుకుంది. శుబ్మన్ గిల్ (36 బంతుల్లో 35 నాటౌట్; 7 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అజింక్య రహానే (40 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) రెండో వికెట్కు 51 పరుగులు జోడించి జట్టును విజయతీరం చేర్చారు. ఆస్ట్రేలియాతో ‘సెంచరీ’ టెస్టులో భారత్కు విక్టరీ అందించారు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జనవరి 7 నుంచి సిడ్నీలో జరుగుతుంది. ఆకట్టుకున్న సిరాజ్ ఆసీస్ చివరి వరుస బ్యాట్స్మన్ అంత సులభంగా లొంగలేదు. మిగిలిన నాలుగు వికెట్లు తీసేందుకు భారత్కు 37.1 ఓవర్లు పట్టాయి. గ్రీన్, కమిన్స్ (103 బంతుల్లో 22; ఫోర్) కలిసి పోరాడుతూ ఏడో వికెట్కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఎట్టకేలకు ఒక షార్ట్ బంతితో కమిన్స్ను అవుట్ చేసి బుమ్రా ఈ జోడీని విడదీశాడు. కొద్ది సేపటికి సిరాజ్ బౌలింగ్లో పుల్ షాట్కు ప్రయత్నించిన గ్రీన్... జడేజా చక్కటి క్యాచ్కు వెనుదిరిగాడు. ఆ తర్వాత లయన్ (15 బంతుల్లో 3)ను సిరాజ్ అవుట్ చేయగా, హాజల్వుడ్ (21 బంతుల్లో 10)ను బౌల్డ్ చేసిన అశ్విన్ ఆసీస్ ఆట ముగించాడు. పుజారా నిరాశ లక్ష్యం చిన్నదే అయినా 19 పరుగుల వద్దే జట్టు రెండు వికెట్లు కోల్పోవడం కొంత ఆందోళన రేపింది. మయాంక్ అగర్వాల్ (5) మరోసారి విఫలమవ్వగా, పుజారా (3) కూడా పేలవ షాట్ ఆడి గల్లీలో క్యాచ్ ఇచ్చాడు. తన సహజ ధోరణికి భిన్నంగా పుజారా కాలితో గ్రౌండ్ను తన్ని, ఆపై బౌండరీ వద్ద ప్రకటనల హోర్డింగ్ను కూడా బ్యాట్తో కొట్టి తన అసహనాన్ని ప్రదర్శించాడు! అయితే ఆ తర్వాత గిల్, రహానే ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరు వరుస బౌండరీలతో చకచకా పరుగులు సాధించారు. చివరకు లయన్ బౌలింగ్లో బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా పుల్ షాట్ ఆడి సింగిల్ తీయడంతో భారత్ గెలుపు పూర్తయింది. ఆస్ట్రేలియాపై మరో దెబ్బ! అసలే ఓటమి భారంతో ఉన్న ఆసీస్కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానా విధించడంతో పాటు కీలకమైన నాలుగు ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ పాయింట్లను కూడా తగ్గించింది. నిర్ణీత సమయంకంటే ఆస్ట్రేలియా 2 ఓవర్లు ఆలస్యంగా వేసింది. నిబంధనల ప్రకారం ఒక్కో ఓవర్కు మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాతో పాటు రెండు పాయింట్ల చొప్పున కోత విధిస్తారు. ఆసీస్ దిగ్గజం డేవిడ్ బూన్ ఈ మ్యాచ్ రిఫరీ కావడం విశేషం! సిడ్నీలోనే మూడో టెస్టు భారత్, ఆస్ట్రేలియా మధ్య షెడ్యూల్ ప్రకారం జనవరి 7 నుంచి సిడ్నీలోనే మూడో టెస్టు జరుగుతుంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) అధికారికంగా ప్రకటించింది. న్యూసౌత్వేల్స్ రాష్ట్రంలో కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్ వేదికను సిడ్నీ నుంచి మార్చవచ్చని, అవసరమైతే మెల్బోర్న్లోనే మూడో టెస్టు జరపాలని ఇప్పటి వరకు ప్రతిపాదనలు వచ్చాయి. సిడ్నీలో మంగళవారం మూడు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కొన్ని షరతులతో టెస్టును నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. కట్టుదిట్టమైన కోవిడ్–19 ఆంక్షల నేపథ్యంలో ఆటగాళ్లు సిడ్నీకి ప్రయాణించనున్నారు. ► మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో భారత్ సాధించిన టెస్టు విజయాల సంఖ్య. విదేశీ గడ్డపై భారత్ అత్యధిక విజయాలు అందుకున్న వేదికగా ఎంసీజీ అవతరించింది. క్వీన్స్పార్క్ ఓవల్ (ట్రినిడాడ్), సబీనా పార్క్ (జమైకా), సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (కొలంబో) మైదానాల్లో భారత్ మూడేసి టెస్టుల్లో గెలిచింది. ఇంగ్లండ్, భారత్ మాత్రమే ఎంసీజీలో నాలుగు అంతకంటే ఎక్కువ టెస్టుల్లో ఆస్ట్రేలియాపై గెలిచాయి. ► అజింక్య రహానే సెంచరీ చేసిన టెస్టు మ్యాచ్ల్లో భారత జట్టు ఇప్పటివరకు ఓడిపోలేదు. రహానే 12 సెంచరీలు చేయగా... 8 టెస్టుల్లో భారత్ గెలిచింది (వీటిలో ఓ టెస్టులో అతను రెండు సెంచరీలు చేశాడు). మరో మూడు టెస్టులను ‘డ్రా’గా ముగించింది. ► ఆస్ట్రేలియా గడ్డపై టాస్ ఓడిపోయి టెస్టు మ్యాచ్లో గెలుపొందడం 2003 తర్వాత భారత్కిదే తొలిసారి. 2003లో అడిలైడ్ టెస్టులో భారత్ ఈ తరహా లోనే గెలిచింది. విదేశీ గడ్డపై మాత్రం 2010 తర్వాత భారత్కు ఇలాంటి విజయం దక్కింది. 2010లో శ్రీలంకతో జరిగిన టెస్టులోనూ భారత్ టాస్ ఓడాక గెలుపు రుచి చూసింది. ► ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్లోని తొలి టెస్టులో ఓడిపోయి రెండో టెస్టులో గెలిచి సిరీస్ను 1–1తో సమం చేసిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. గతంలో వెస్టిండీస్ (1975–76 సీజన్); న్యూజిలాండ్ (2011లో) ఇలా చేశాయి. ► వరుసగా రెండు పర్యటనల్లో ఎంసీజీ మైదానంలో రెండు వరుస టెస్టులు నెగ్గడం భారత్కిది రెండోసారి. 1977, 1980లలో ఇలా నెగ్గిన భారత్ 2018, 2020లో పునరావృతం చేసింది. ► స్వదేశంలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఒక్కరు కూడా కనీసం అర్ధ సెంచరీ చేయకపోవడం 32 ఏళ్ల తర్వాత జరిగింది. చివరిసారి 1988లో డిసెంబరు 24 నుంచి 29 వరకు ఎంసీజీ వేదికగా వెస్టిండీస్తో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఎవరూ అర్ధ సెంచరీ చేయలేకపోయారు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 285 పరుగుల తేడాతో ఓడిపోయింది. ► లసిత్ మలింగ (శ్రీలంక; 6/92; 2004లో) తర్వాత గత 50 ఏళ్లలో ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసిన టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండో బౌలర్గా సిరాజ్ (5/77) నిలిచాడు. సిరాజ్తోపాటు గతంలో ఫిల్ డిఫ్రిటాస్ (ఇంగ్లండ్; 5/94; 1986లో), అలెక్స్ ట్యూడర్ (ఇంగ్లండ్; 5/108; 1998లో) కూడా ఆస్ట్రేలియాలో తమ అరంగేట్రం టెస్టులో ఐదు వికెట్లు తీశారు. గర్వంగా ఉంది: రహానే మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నా. ముఖ్యంగా కొత్త కుర్రాళ్లు సిరాజ్, గిల్ చూపిన పట్టుదలను ఎంత ప్రశంసించినా తక్కువే. సాధారణంగా అరంగేట్ర ఆటగాళ్లు అత్యుత్సాహంతో తమపై నియంత్రణ కోల్పోతారు. కానీ నాలుగైదేళ్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ అనుభవం ఉన్న వీరిద్దరు అలాంటి అవకాశం ఇవ్వలేదు. దాంతో కెప్టెన్ పని సులువైంది. తొలి రోజు పదో ఓవర్లోనే బౌలింగ్కు దిగి అశ్విన్ ఆసీస్పై ఒత్తిడి పెంచాడు. ఐదుగురు బౌలర్ల వ్యూహం బాగా పని చేసింది. ఆల్రౌండర్గా జడేజా తన విలువ చూపించాడు. అడిలైడ్లో ఒక్క గంటలో మ్యాచ్ చేజారింది. అయితే దాని నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఆ ఓటమి గురించే ఆలోచిస్తూ ఉంటే ముందుకు వెళ్లలేకపోయాం. మేం అలా చేయలేదు. మరింత పట్టుదలతో, దూకుడుతో ఇక్కడ బరిలోకి దిగాలని అనుకున్నాం. ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా రాణిస్తే ఫలితం రాబట్టగలమని తెలుసు. –అజింక్య రహానే, భారత కెప్టెన్ స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 195; భారత్ తొలి ఇన్నింగ్స్ 326; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వేడ్ (ఎల్బీ) (బి) జడేజా 40, బర్న్స్ (సి) పంత్ (బి) ఉమేశ్ 4, లబ్షేన్ (సి) రహానే (బి) అశ్విన్ 28, స్మిత్ (బి) బుమ్రా 8, హెడ్ (సి) మయాంక్ (బి) సిరాజ్ 17, గ్రీన్ (సి) జడేజా (బి) సిరాజ్ 45, పైన్ (సి) పంత్ (బి) జడేజా 1, కమిన్స్ (సి) మయాంక్ (బి) బుమ్రా 22, స్టార్క్ (నాటౌట్) 14, లయన్ (సి) పంత్ (బి) సిరాజ్ 3, హాజల్వుడ్ (బి) అశ్విన్ 10, ఎక్స్ట్రాలు 8, మొత్తం (103.1 ఓవర్లలో ఆలౌట్) 200. వికెట్ల పతనం: 1–4, 2–42, 3–71, 4–98, 5–98, 6–99, 7–156, 8–177, 9–185, 10–200. బౌలింగ్: బుమ్రా 27–6–54–2, ఉమేశ్ యాదవ్ 3.3–0–5–1, సిరాజ్ 21.3–4–37–3, అశ్విన్ 37.1–6–71–2, రవీంద్ర జడేజా 14–5–28–2. భారత్ రెండో ఇన్నింగ్స్: మయాంక్ (సి) పైన్ (బి) స్టార్క్ 5, గిల్ (నాటౌట్) 35, పుజారా (సి) గ్రీన్ (బి) కమిన్స్ 3, రహానే (నాటౌట్) 27, ఎక్స్ట్రాలు 0, మొత్తం (15.5 ఓవర్లలో 2 వికెట్లకు) 70. వికెట్ల పతనం: 1–16, 2–19. బౌలింగ్: స్టార్క్ 4–0–20–1, కమిన్స్ 5–0–22–1, హాజల్వుడ్ 3–1–14–0, లయన్ 2.5–0–5–0, లబ్షేన్ 1–0–9–0. -
విహారి, పృథ్వీ షా, సాహాలకు చోటు
అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అసలు సమరానికి సమయం ఆసన్నమైంది. సంప్రదాయ టెస్టు క్రికెట్లో ప్రస్తుతం సమఉజ్జీల్లాంటి రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాను సొంతగడ్డపైనే ఓడించి చరిత్ర సృష్టించిన భారత జట్టు ఇప్పుడు అదే బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకునేందుకు అంతే ఉత్సాహంతో మళ్లీ బరిలోకి దిగుతోంది. అయితే అప్పటి ఆసీస్ జట్టు లెక్క వేరు... ఇప్పుడు బలం పెరిగిన కంగారూల జట్టు వేరు. ఈ ఫార్మాట్లో అద్భుత ఫామ్లో ఉన్న టిమ్ పైన్ బృందం మరోసారి ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా చెలరేగి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో హోరాహోరీ ఖాయం కాగా ఇరు జట్ల మధ్య తొలి డే అండ్ నైట్ టెస్టుతో అడిలైడ్ టెస్టుకు మరింత ఆకర్షణ పెరిగింది. అడిలైడ్: వన్డేలు, టి20ల్లో సమంగా నిలిచిన తర్వాత భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇక టెస్టుల్లో సత్తా చాటేందుకు ‘సై’ అంటున్నాయి. బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భాగంగా నేటి నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ పోరును గులాబీ బంతితో డే అండ్ నైట్ మ్యాచ్గా నిర్వహించనుండటం విశేషం. గత పర్యటనలో ఇక్కడ సిరీస్ గెలిచిన టీమిండియా ఆ ఘనతను కొనసాగించాలంటే శుభారంభం తప్పనిసరి. భార్య ప్రసవం కారణంగా ఈ మ్యాచ్ ముగిశాక కెప్టెన్ కోహ్లి స్వదేశానికి తిరిగి రానున్న నేపథ్యంలో అతడి నాయకత్వంలో ఈ టెస్టు జట్టుకు కీలకంగా మారింది. ఆరుగురు బ్యాట్స్మెన్తో... ఆశ్చర్యకరంగా మ్యాచ్కు రోజు ముందే భారత మేనేజ్మెంట్ తమ తుది జట్టును ప్రకటించింది. రెండు ప్రాక్టీస్ మ్యాచ్లలోనూ ఆకట్టుకోలేకపోయిన పృథ్వీ షాకు మయాంక్తో జతగా ఓపెనింగ్ చేసే అవకాశం దక్కడం విశేషం. తాజా ఫామ్ ప్రకారం శుబ్మన్ గిల్ అరంగేట్రం చేయవచ్చని భావించినా... పృథ్వీపై టీమ్ మేనేజ్మెంట్ నమ్మకముంచింది. తనదైన స్ట్రోక్ ప్లేతో అతను దూకుడైన ఆరంభం ఇవ్వగలడని భారత్ భావిస్తూ ఉండవచ్చు. అదే విధంగా బ్యాటింగ్లో పంత్దే పైచేయిగా ఉన్నా... వికెట్ కీపింగ్లో తిరుగులేని సాహాకే జట్టు ఓటేసింది. డే అండ్ నైట్ మ్యాచ్లో బంతి గమనం కీపర్ను కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండటంతో పంత్కంటే ఎంతో మెరుగైన సాహాకు అవకాశం లభించింది. మరోవైపు జడేజాలాంటి ఆల్రౌండర్ను కాదని ఆరో నంబర్ బ్యాట్స్మన్గా ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతని చక్కటి టెక్నిక్, సుదీర్ఘ సమయం పాటు క్రీజ్లో నిలబడగల నైపుణ్యం, గత ఆస్ట్రేలియా పర్యటనలో రాణించిన అనుభవంతో పాటు అవసరమైతే పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేయగల సామర్థ్యంతో విహారి ఎంపికయ్యాడు. సీనియర్ ఇషాంత్ శర్మ లేకపోవడంతో ఊహించినట్లుగా షమీ, బుమ్రా, ఉమేశ్లతో భారత పేస్ దళం బరిలోకి దిగుతోంది. ప్రధాన స్పిన్నర్గా సీనియర్ అశ్విన్ జట్టులోకి వచ్చాడు. తాను బరిలోకి దిగుతున్న ఏకైక టెస్టులో నాయకుడిగా, బ్యాట్స్మన్గా కూడా కోహ్లి సత్తా చాటాల్సి ఉంది. అతనితో పాటు ప్రధానంగా పుజారా, రహానే బ్యాటింగ్ నైపుణ్యంపైనే ఈ సిరీస్ ఫలితం ఆధారపడి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. గులాబీ బంతితో మన పేసర్లు ఎలా బౌలింగ్ చేస్తారనేది ఆసక్తికరం. బర్న్స్కు అవకాశం ఆస్ట్రేలియా జట్టు టాపార్డర్ పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. గాయంతో వార్నర్ దూరం కాగా అతని స్థానంలో ఆడాల్సిన పకోవ్స్కీ కూడా గాయపడటంతో పరిస్థితి మరింత దిగజారింది. దాంతో కొత్త ఆటగాడిని ఓపెనర్గా ప్రయత్నించే బదులు ఎంతో కొంత అనుభవం ఉన్న (21 టెస్టులు) జో బర్న్స్ను ఓపెనర్గా ఎంపిక చేసింది. ఈ సీజన్లో 9 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో కలిపి కేవలం 6.89 సగటుతో 62 పరుగులే చేసి ఘోరమైన ఫామ్లో ఉన్నా... బర్న్స్ తప్ప ఆసీస్కు మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు. రెండో ఓపెనర్గా మాథ్యూ వేడ్ ఆడటం ఖాయమైంది. అయితే ఆసీస్ బ్యాటింగ్ బలమంతా ఇద్దరు స్టార్ బ్యాట్స్మెన్లోనే ఉంది. వరల్డ్ నంబర్వన్ స్టీవ్ స్మిత్తో పాటు లబ్షేన్ మ్యాచ్ను ఒంటిచేత్తో తమవైపు తిప్పగల సమర్థులు. భారత్ వీరిద్దరిని నిలువరించాల్సి ఉంది. స్మిత్కు వెన్ను నొప్పి సమస్య లేదని, అతను బరిలోకి దిగుతున్నాడని ఆసీస్ ప్రకటించింది. పింక్ బాల్తో మంచి అనుభవం ఉన్న పేస్ త్రయం స్టార్క్, కమిన్స్, హాజల్వుడ్లు టెస్టును శాసించగలరు. స్పిన్నర్ లయన్ కూడా ఫామ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్తో ఆల్రౌండర్ గ్రీన్ అరంగేట్రం చేస్తున్నాడు. సొంత మైదానంలో ఆడటంతో పాటు డే–నైట్ టెస్టుల అనుభవం ఉన్న ఆసీస్దే ప్రత్యర్థితో పోలిస్తే ఒకింత పైచేయిగా కనిపిస్తోంది. పిచ్, వాతావరణం గులాబీ బంతి ఎక్కువసేపు మన్నికగా ఉండేందుకు సాధారణంగా పింక్ టెస్టుల్లో పిచ్పై ఎక్కువ పచ్చికను ఉంచుతారు. ఫలితంగా ఆరంభంలో బంతి పేసర్లకు బాగా అనుకూలిస్తుంది. చిరు జల్లులకు అవకాశం ఉన్నా... మ్యాచ్పై ప్రభావం ఉండకపోవచ్చు. జట్ల వివరాలు భారత్ (తుది జట్టు): కోహ్లి (కెప్టెన్), మయాంక్, పృథ్వీ షా, పుజారా, రహానే, విహారి, సాహా, అశ్విన్, షమీ, ఉమేశ్, బుమ్రా. ఆస్ట్రేలియా (అంచనా): పైన్ (కెప్టెన్), బర్న్స్, వేడ్, లబ్షేన్, స్మిత్, హెడ్, గ్రీన్, కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్, లయన్. 14: అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో ఇప్పటివరకు జరిగిన డే–నైట్ టెస్టుల సంఖ్య. అన్నింట్లోనూ ఫలితాలు వచ్చాయి. 7: ఆస్ట్రేలియాలో జరిగిన డే–నైట్ టెస్టులు. అన్నింటా ఆస్ట్రేలియా జట్టే గెలిచింది. 1:భారత్ ఒకే డే–నైట్ టెస్టు (2019లో బంగ్లాదేశ్తో) ఆడి విజయం సాధించింది. కరోనా కారణంగా అందరికీ వాస్తవాలు అర్థమై ప్రాధాన్యతలు మారిపోయాయనేది నా అభిప్రాయం. పాత తరహాలో వ్యక్తిగతంగా కొందరి పట్ల ద్వేషం చూపించడంలో అర్థం లేదని అంతా అనుకుంటున్నారు. ఆసీస్ ఆటగాళ్ల వ్యవహార శైలిలో మార్పు రావడంతోపాటు ఐపీఎల్లో కలిసి ఆడటం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. ఏదైనా అంతా ప్రొఫెషనల్గానే సాగుతుంది. పరుగులు సాధించడంలో, ప్రత్యర్థి వికెట్లు తీయడంలో దూకుడు లోటు ఏమీ ఉండదు కానీ అనవసరపు అంశాలు మాత్రం వడబోసి పక్కన పడేయడం ఖాయం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు మైదానంలో దిగి క్రికెట్ ఆడటమే గొప్ప అదృష్టంగా భావిస్తున్నారు. అలాంటప్పుడు ఇతర అంశాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. అయితే క్రికెట్ నాణ్యత విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడబోం. ఈ సిరీస్లో అద్భుత ప్రదర్శనను మీరు చూస్తారు. ఎలాంటి సవాల్నైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉండే కొత్త తరం భారత దేశానికి నేను ప్రతినిధిని. నేను ఎప్పుడైనా నాలాగే ఉండేందుకు ప్రయత్నిస్తా. ఆస్ట్రేలియన్ల మానసిక దృక్పథంతో నన్ను పోల్చడం అనవసరం. నేను నేనే. భారతీయుడినే. నేను స్వదేశం వెళ్లాక రహానే కెప్టెన్సీని అద్భుతంగా నిర్వర్తిస్తాడని నమ్మకంతో ఉన్నాను. –కోహ్లి, భారత కెప్టెన్ -
టీమిండియా అద్భుత ప్రదర్శనలు
భారత జట్టు 2018–2019లో తొలిసారి ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి మొదటిసారి సిరీస్ సొంతం చేసుకున్నా... ఈ సిరీస్ తుది ఫలితంతో సంబంధం లేకుండా ఆసీస్ గడ్డపై మన అభిమానులు మరచిపోలేని కొన్ని అద్భుత ప్రదర్శనలు టీమిండియా ఆటగాళ్ల నుంచి వచ్చాయి. ఆస్ట్రేలియాలాంటి పటిష్ట జట్టును వారి మైదానాల్లో సాధారణ టీమ్గా మార్చేస్తూ సాగిన మన క్రికెటర్ల ఆట చిరస్మరణీయం. గురువారం నుంచి బోర్డర్–గావస్కర్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో అలాంటి ఐదు జ్ఞాపకాలను ఎంచుకుంటే... 2007–08 సిరీస్ (మూడో టెస్టు–పెర్త్) ఫలితం: 72 పరుగులతో భారత్ విజయం విశేషాలు: ఈ మ్యాచ్ ఫలితం మన జట్టు భావోద్వేగాలతో ముడిపడటం విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. అంతకుముందు సిడ్నీ టెస్టు సందర్భంగా హర్భజన్–సైమండ్స్ మధ్య జరిగిన ‘మంకీ గేట్’ వివాదం, ఒక దశలో టూర్ నుంచి తప్పుకోవాలనుకున్న భారత్ ఆలోచన, విచారణ తదితర పరిణామాల తర్వాత కుంబ్లే నాయకత్వంలో జట్టు ఒక్కటై సర్వం ఒడ్డి గెలుపు కోసం పోరాడింది. ద్రవిడ్ (93), సచిన్ (71)ల బ్యాటింగ్తో భారత్ 330 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 212 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్మణ్ (79) ఆటతో టీమిండియా 294 పరుగులు సాధించి ఆసీస్ ముందు 413 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఆతిథ్య జట్టు 340 పరుగులకు కుప్పకూలడం, భారత జట్టు సంబరాల్లో మునగడం చకచకా జరిగిపోయాయి. 2003–04 సిరీస్ (రెండో టెస్టు–అడిలైడ్) ఫలితం: 4 వికెట్లతో భారత్ గెలుపు విశేషాలు: సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై భారత్కు దక్కిన విజయమిది. పాంటింగ్ (242) డబుల్ సెంచరీతో ఆస్ట్రేలియా 556 పరుగులు చేయగా... ద్రవిడ్ (233), వీవీఎస్ లక్ష్మణ్ (148)ల మధ్య 303 పరుగుల భాగస్వామ్యం భారత్నూ దాదాపు సమంగా (523 పరుగులు) నిలిపింది. అయితే రెండో ఇన్నింగ్స్లో అగార్కర్ (6/41) ధాటికి ఆసీస్ అనూహ్యంగా 196 పరుగులకే కుప్పకూలింది. 233 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి భారత్ ఛేదించిన క్షణాన తన సహజ శైలికి భిన్నంగా ద్రవిడ్ ఆవేశంగా గాల్లోకి విసిరిన విజయపు పంచ్ను ఎవరూ మరచిపోలేరు. 1977–78 సిరీస్ (మూడో టెస్టు–మెల్బోర్న్) ఫలితం: 222 పరుగులతో భారత్ ఘన విజయం విశేషాలు: ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు సాధించిన తొలి టెస్టు విజయమిది. రెండు ఇన్నింగ్స్లలో లెగ్స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్ ఆరేసి వికెట్లతో (6/52, 6/52) చెలరేగి ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. మొహిందర్ అమర్నాథ్ (72), గుండప్ప విశ్వనాథ్ (59) అర్ధ సెంచరీలతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 256 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 213 పరుగులకు పరిమితమైంది. గావస్కర్ (118) సెంచరీ సహాయంతో రెండో ఇన్నింగ్స్లో 343 పరుగులు చేసిన భారత్ ప్రత్యర్థి ముందు 387 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఆసీస్ 164 పరుగులకే కుప్పకూలింది. 1985–86 సిరీస్ (తొలి టెస్టు–అడిలైడ్) ఫలితం: మ్యాచ్ ‘డ్రా’ విశేషాలు: భారత దిగ్గజ క్రికెటర్ కపిల్దేవ్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లు పడగొట్టడం మ్యాచ్ను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసింది. ఇప్పటికీ ఆస్ట్రేలియా గడ్డపై భారత బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే (8/106) కావడం విశేషం. కపిల్ కెప్టెన్గా ఉన్న ఈ మ్యాచ్లో ముందుగా ఆస్ట్రేలియా గ్రెగ్ రిచీ (128), డేవిడ్ బూన్ (123) సెంచరీలతో 381 పరుగులు చేయగా... గావస్కర్ (166 నాటౌట్) అజేయ శతకంతో భారత్ 520 పరుగుల భారీ స్కోరు సాధించింది. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 8 ఓవర్లే ఆడే అవకాశం దక్కగా, మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. 1991–92 సిరీస్ (ఐదో టెస్టు–పెర్త్) ఫలితం: 300 పరుగులతో భారత్ ఓటమి విశేషాలు: మ్యాచ్లో భారత్కు భారీ పరాజయం ఎదురైనా... ఒక్క ఆటగాడి ప్రదర్శన మాత్రం తదనంతర కాలంలో అతను ఆల్టైమ్ గ్రేట్గా మారడానికి కావాల్సిన పునాదిని వేసింది. 19 ఏళ్ల సచిన్ టెండూల్కర్ తొలి ఇన్నింగ్స్లో 161 బంతుల్లో 16 ఫోర్లతో 114 పరుగులు చేయడం విశేషం. ఇదే సిరీస్లో అంతకుముందు సిడ్నీ టెస్టులో కూడా సచిన్ అజేయంగా 148 పరుగులు చేసి ఆస్ట్రేలియాలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచినా... దానికంటే ఆ సమయంలో ప్రపంచంలో ఫాస్టెస్ట్ పిచ్గా గుర్తింపు పొందిన ‘వాకా’ మైదానంలో సచిన్ చేసిన ఈ ప్రత్యేక శతకం అతని స్థాయిని పెంచింది. సచిన్ బౌండరీలన్నీ దాదాపుగా చూడచక్కటి స్క్వేర్ కట్లే. బూన్ (107) సెంచరీతో ఆస్ట్రేలియా 346 పరుగులు చేయగా, భారత్ 272 పరుగులకు పరిమితమైంది. అనంతరం డీన్ జోన్స్ (150 నాటౌట్), మూడీ (101) శతకాలతో ఆసీస్ 367 పరుగులకు డిక్లేర్ చేసి సవాల్ విసిరింది. అయితే భారత్ 141 పరుగులకే కుప్పకూలింది. -
విల్ పకోవ్స్కీకి తొలి అవకాశం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న 22 ఏళ్ల విల్ పకోవ్స్కీకి జాతీయ జట్టు పిలుపు లభించింది. భారత్తో జరిగే నాలుగు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం సెలక్టర్లు పకోవ్స్కీని ఎంపిక చేశారు. వార్నర్తో పాటు అతను ఓపెనర్గా ఆడే అవకాశం ఉంది. విక్టోరియాకు చెందిన పకోవ్స్కీ షెఫీల్డ్ షీల్ట్ టోర్నీలో గత రెండు మ్యాచ్లలో వరుసగా రెండు డబుల్ సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఓవరాల్గా 22 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 55.48 సగటుతో అతను 1720 పరుగులు సాధించాడు. 17 మంది సభ్యుల బృందంలో పకోవ్స్కీతో పాటు చోటు లభించిన మరో నలుగురు ఆటగాళ్లు కూడా ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరఫున టెస్టులు ఆడలేదు. కామెరాన్ గ్రీన్, మిషెల్ స్వెప్సన్, మైకేల్ నెసెర్, సీన్ అబాట్లు జట్టులోకి ఎంపికయ్యారు. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 17నుంచి అడిలైడ్లో తొలి టెస్టు జరుగుతుంది. జట్టు వివరాలు: టిమ్ పైన్ (కెప్టెన్), సీన్ అబాట్, జో బర్న్స్, ప్యాట్ కమిన్స్, కామెరాన్ గ్రీన్, హాజల్వుడ్, ట్రవిస్ హెడ్, లబ్షేన్, లయన్, నెసెర్, ప్యాటిన్సన్, పకోవ్స్కీ, స్టీవ్ స్మిత్, స్టార్క్, స్వెప్సన్, వేడ్, వార్నర్ -
నన్ను క్షమించండి: ఆస్ట్రేలియా కెప్టెన్
ధర్మశాల: టీమిండియాతో నాలుగు టెస్టుల సిరీస్ సందర్భంగా నోరు పారేసుకుని, అనుచితంగా ప్రవర్తించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్.. సిరీస్ ఓటమి సందర్భంగా దిగొచ్చాడు. తాను భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయానని, తనను క్షమించాల్సిందిగా స్మిత్ కోరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది. ధర్మశాలలో కీలక నాలుగో టెస్టులో భారత్ చేతిలో ఓటమి అనంతరం స్మిత్ మాట్లాడుతూ.. 'సిరీస్ అంతా గొడవలు, వివాదాలతో సాగింది. నేను ప్రతిసారీ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. ఇందుకు క్షమాపణలు చెబుతున్నా' అని చెప్పాడు. ఈ సిరీస్ భారత క్రికెటర్లు, ముఖ్యంగా బౌలర్లు బాగా రాణించారని స్మిత్ ప్రశంసించాడు. ధర్మశాల టెస్టు మ్యాచ్లో భారత క్రికెటర్ మురళీ విజయ్ను స్మిత్ దూషించాడు. స్మిత్ నోరుపారేసుకున్నప్పటి దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ఇక డీఆర్ఎస్ విషయంలోనూ పలుమార్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో గొడవ పెట్టుకున్నాడు. ఇక ఇతర ఆసీస్ ఆటగాళ్లు కూడా కెప్టెన్ స్మిత్ బాటలోనే ఘర్షణ వైఖరి అవలంభించారు. -
నాకు ఆశ్చర్యం కలిగించలేదు: దాదా
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సాధించడం టీమిండియాకు గొప్ప విజయమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసించాడు. భారత ఆటగాళ్లు బాగా రాణించారని అన్నాడు. ధర్మశాలలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ గెలుపొంది.. 4 మ్యాచ్ల సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. 'టీమిండియాకిది గొప్ప విజయం. గ్రేట్ సమ్మర్. ఈ విజయం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే భారత గడ్డపై భారత్ను ఓడించడం చాలా కష్టం. 2001లో ఆస్ట్రేలియా, భారత్ల మధ్య టెస్టు సిరీస్ జరిగింది. నా క్రికెట్ కెరీర్లో నేను చూసిన అత్యంత బలమైన జట్టు అప్పటి ఆస్ట్రేలియానే. అయినా కంగారూలు టీమిండియాను ఓడించలేకపోయారు. ఈ సిరీస్లో కూడా ఆసీస్ 1-0తో ముందంజలో ఉన్నా చివరకు ఓటమి తప్పలేదు. ప్రపంచంలో ఏ జట్టుకైనా భారత్లో సిరీస్ను గెలవడం సవాలే' అని దాదా అన్నాడు. సిరీస్లో ఓడినా ఆసీస్ పోరాట పటిమ కనబరిచిందని ప్రశంసించాడు. -
'బెంగ' తీర్చాల్సిన సమయం
► నేటి నుంచి రెండో టెస్టు ► భారత్పైనే ఒత్తిడి ► ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా ► టీమిండియాలో మార్పులు! అంతా అనుకున్నట్లు సాగితే ఈ సమయానికి భారత జట్టు 1–0 ఆధిక్యంతో అమితోత్సాహంతో రెండో టెస్టు బరిలోకి దిగేది. కానీ ‘రెండున్నర రోజుల’ పతనం తర్వాత ఆ షాక్ నుంచి కోలుకొని నిలబడాల్సిన స్థితి ఇప్పుడు మన జట్టుది. ఒక మ్యాచ్లో జట్టు ఓడటం అసాధారణం ఏమీ కాకపోయినా, ఘోర వైఫల్యం సహజంగానే మానసికంగా కూడా జట్టును దెబ్బ తీసింది. అయితే ఇప్పుడు తమలో అసలు సత్తాను బయట పెట్టి పుణే పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. బెంగళూరులోనైనా మన ఆట మారుతుందా అనేది ఆసక్తికరం. సిరీస్కు ముందు అన్ని వైపుల నుంచి అండర్డాగ్ ముద్ర పడటంతో ఒక రకమైన ఆందోళనతో కనిపించిన ఆస్ట్రేలియాను తొలి మ్యాచ్ విజయం ఆకాశంలో నిలిపింది. ‘భారత బ్యాట్స్మెన్ను రెచ్చగొట్టము’ అంటూ మర్యాద చూపిన కంగారూలు ఇప్పుడు తమ సహజశైలిలో మాటల దాడి చేసేందుకు కావాల్సిన ధైర్యాన్ని పుణే విజయం ఇచ్చింది. పైగా భారత గడ్డపై వారికి మెరుగైన రికార్డు ఉన్న వేదికపై జరగబోతున్న మ్యాచ్ ఆసీస్ ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. మరి ఆ జట్టు అదే జోరు కొనసాగిస్తుందా లేక ప్రత్యర్థి ముందు సాగిలపడుతుందా! బెంగళూరు: బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. నాలుగు టెస్టుల ఈ సిరీస్లో భాగంగా నేటి (శనివారం) నుంచి ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. సిరీస్లో వెనుకబడిన భారత్ ఇక్కడ విజయం సాధించి సమంగా నిలవాలని పట్టుదలగా ఉండగా... ఈ మ్యాచ్ గెలిస్తే ట్రోఫీని నిలబెట్టుకునే అవకాశం ఉన్న ఆసీస్ మరో గెలుపు అందుకోవాలని భావిస్తోంది. పుణే పిచ్పై వివాదం చెలరేగడంతో ఈ వికెట్పై కూడా అందరి దృష్టి నిలిచింది. అయితే ఇక్కడ వికెట్ గురించి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆశ్చర్యకర మార్పులు... భారత జట్టు కెప్టెన్గా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా గత 22 టెస్టుల్లో విరాట్ కోహ్లి ఒక మ్యాచ్లో ఆడిన తుది జట్టును తర్వాతి మ్యాచ్లో కొనసాగించలేదు. ప్రతీసారి కనీసం ఒక ఆటగాడినైనా మారుస్తూ వచ్చాడు. పుణేలో సమష్టి వైఫల్యం నేపథ్యంలో ఇప్పుడు కూడా జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. కోహ్లి స్వయంగా చెప్పినట్లు ఇవి ‘ఆశ్చర్యకరంగా’ ఉండవచ్చు. అందుకోసం తాను మొదటి నుంచి జపిస్తున్న ఐదుగురు బౌలర్ల మంత్రాన్ని పక్కన పెడతాడా అనేది చూడాలి. తొలి టెస్టులో భారత బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. కాబట్టి అదనపు బ్యాట్స్మన్ అవసరం కనిపిస్తోంది. అప్పుడు కరుణ్ నాయర్కు చోటు కల్పించే అవకాశం ఉంది. అదే జరిగితే గత మ్యాచ్లో విఫలమైన ఆల్రౌండర్ జయంత్ యాదవ్ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్కు అనుకూలం కాబట్టి భారత్ సాధ్యమై నంత భారీ స్కోరు సాధిస్తేనే మ్యాచ్పై పట్టు చిక్కు తుంది. ఈ మైదానంలో చక్కటి రికార్డు ఉన్న విజయ్, పుజారాలతో పాటు ‘హోం బాయ్’ లోకేశ్ రాహుల్ కూడా మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఇంగ్లండ్ సిరీస్ నుంచి చూస్తే బంగ్లాదేశ్తో టెస్టు మినహా అన్నింటిలో విఫలమైన రహానేకు ప్రస్తుతానికైతే కెప్టెన్, కోచ్ నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. కానీ దీనిని నిలబెట్టుకునేందుకు రహానే ఆ స్థాయి ఇన్నింగ్స్ ఒకటి ఆడాల్సి ఉంది. ఇక విరాట్ కూడా గత మ్యాచ్ అరుదైన వైఫల్యం తర్వాత తనకూ సొంత గ్రౌండ్లాంటి ఈ వేదికపై గొప్ప ఇన్నింగ్స్ ఆడితే భారత్కు మ్యాచ్లో విజయావకాశాలు ఖాయంగా ఉంటాయి. పిచ్ మారుతున్న కొద్దీ చివర్లో కీలకపాత్ర పోషించాల్సిన అశ్విన్, జడేజాలు గత మ్యాచ్ పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్నారు. పేసర్లలో ఉమేశ్ ఖాయం కాగా, రివర్స్ స్వింగ్కు అవకాశం ఉంటే ఇషాంత్ స్థానంలో భువనేశ్వర్ రావచ్చు. ఏదేమైనా గత మ్యాచ్లో కలిసికట్టుగా విఫలమైన టీమిం డియా, ఈసారి ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిస్తేనే ఈ టెస్టులో ఆధిక్యం ప్రదర్శించవచ్చు. జోరు కొనసాగుతుందా... పుణే టెస్టులో గెలిచిన జట్టునే ఏ మాత్రం మార్పులు లేకుండా కొనసాగిస్తున్నట్లు ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రకటించేసింది. అద్భుత విజయంతో ఆ జట్టులో ఉత్సాహం కనిపిస్తున్నా... ఏమరుపాటుగా వ్యవహరిస్తే పరాభవం తప్పదని ఆసీస్కు బాగా తెలుసు. అందుకే సిరీస్పై పట్టు సాధించేందుకు వచ్చిన కీలక అవకాశాన్ని ఆ జట్టు కోల్పోరాదని భావిస్తోంది. బ్యాటింగ్లో స్మిత్ ముందుండి నడిపిస్తుండగా, కొత్త కుర్రాడు రెన్షా ఆకట్టుకున్నాడు. అద్భుతంగా ఆడకపోయినా షాన్ మార్‡్ష, హ్యాండ్స్కోంబ్ కూడా మెరుగ్గానే ఆడారు. తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకునేలా ఈసారి మరింత బాగా ఆడాల్సిన బాధ్యత మరో ప్రధాన బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్పై ఉంది. ఈ విధ్వంసకర ఓపెనర్ ఒక్కసారి క్రీజ్లో నిలదొక్కుకుంటే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. పుణేలో తొలి సెషన్లో అతని శైలిలో దూకుడు కూడా కనిపించింది. ఇక 12 వికెట్లతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన స్పిన్నర్ ఒకీఫ్ తనపై ఉన్న ఒత్తిడిని అధిగమించి మరోసారి భారత బ్యాట్స్మెన్ను నిరోధించగలడా చూడాలి. భారత్తో పోలిస్తే ఆసీస్ అదనపు బలం పేస్ బౌలింగ్లో కూడా ఉంది. ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్ల జాబితాలో ఉన్న మిషెల్ స్టార్క్, హాజల్వుడ్లు భారత్ను ఏ సమయంలోనైనా దెబ్బ తీయగల సమర్థులు. ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లలో ఎవరూ కూడా బెంగళూరులో టెస్టు మ్యాచ్ ఆడలేదు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, విజయ్, పుజారా, రహానే, సాహా, జయంత్/నాయర్, అశ్విన్, జడేజా, ఉమేశ్, ఇషాంత్/భువనేశ్వర్. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), రెన్షా, వార్నర్, షాన్ మార్‡్ష, హ్యాండ్స్కోంబ్, మిషెల్ మార్‡్ష, వేడ్, స్టార్క్, ఒకీఫ్, లయోన్, హాజల్వుడ్. ఒత్తిడా... నాపైనా లేక జట్టు పైనా! నేను ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నానా? నేను చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నాను. అంతా బాగుంది. అందుకే చిరునవ్వులు కూడా చిందిస్తున్నాను! మాపై ఒత్తిడి ఉందంటూ ఆసీస్ కెప్టెన్ చెప్పడం అతని వ్యక్తిగత అభిప్రాయం. మీడియా సమావేశాల్లో ఈ తరహా మాటల యుద్ధం చేయడంలో వారు నిష్ణాతులు అని నాకు బాగా తెలుసు. అయితే వారి మాటలకంటే కూడా మేం మా ఆటపైనే ఎక్కువగా దృష్టి పెట్టాం. పుణే టెస్టులో కనబర్చిన చెత్త ఆటను మేం మళ్లీ ప్రదర్శించబోమని హామీ ఇస్తున్నాను. ఆ మ్యాచ్ ఓడినంత మాత్రాన అన్నీ ఓడతామని కాదు. గత రెండేళ్లుగా మంచి క్రికెట్ ఆడుతున్నాం. ఇక్కడా అలాంటి ఆటనే చూపిస్తాం. ఫలితం ఎలా ఉంటుందో సిరీస్ ముగిశాక చూద్దాం. మా లోపాలు సరిదిద్దుకునేందుకు తొలి టెస్టు అవకాశం ఇచ్చింది. మ్యాచ్ ఫలితాన్ని బట్టి మా సన్నాహకాల్లో మార్పు ఉండదు. అదే పట్టుదలతో మేం సాధన చేస్తాం. ప్రత్యేకంగా ఏ ఒక్క ఆటగాడిపైనో దృష్టి పెట్టడం లేదు. టెస్టు గెలవాలంటే 20 వికెట్లు తీయాల్సిందే. ఈ మైదానంలో చాలా మ్యాచ్లు ఆడాను కాబట్టి వికెట్ గురించి బెంగ లేదు. మ్యాచ్ ముందు పరిస్థితులను బట్టే తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటాం. – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ తొలి టెస్టులో పిచ్ కూడా మా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈసారి మాత్రం పిచ్ చాలా భిన్నంగా ఉంది కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా మమ్మల్ని మేం మార్చుకోవాల్సి ఉంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్లో సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ ప్రతీ మ్యాచ్లో 400కు పైగా స్కోరు చేసినా సరిపోలేదు. మేం గెలవాలంటే కనీసం 550– 600 పరుగులైనా చేయాలి. ట్రోఫీని నిలబెట్టుకునేందుకు మాకు మరో విజయం కావాలి. చాలా వేగంగా ఒకటి, రెండు సెషన్లలో కూడా మ్యాచ్ మావైపు మొగ్గు చూపవచ్చు. కాబట్టి భారత్పై చాలా ఒత్తిడి ఉంటుంది. వారు బలంగా కోలుకునే ప్రయత్నం చేస్తారని తెలుసు కానీ మేం సిద్ధంగా ఉన్నాం. అశ్విన్తో పోటీ బాగుంది. గతం లో అతడిని నెట్స్లో ఎదుర్కొన్న సమయంలో అతను నాకు లెగ్ స్పిన్ బంతులేసి తన బలం బయటపడకుండా చూసుకున్నాడు కూడా. – స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా కెప్టెన్ ► 2 చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా 2 టెస్టులు గెలిచింది. భారత్లో ఎక్కడా ఆ జట్టు ఒక మ్యాచ్కు మించి గెలవలేదు. ఇక్కడ ఆడిన 4 టెస్టుల్లో మరొకటి ఓడి, ఒక మ్యాచ్ను ఆసీస్ ‘డ్రా’ చేసుకుంది. ► 4 ఈ మైదానంలో భారత్ గత 20 ఏళ్లలో 4 మ్యాచ్లలో ఓడి 2 మాత్రమే గెలవగలిగింది. సొంతగడ్డపై భారత్కు ఒక మైదానంలో ఇదే పేలవమైన రికార్డు. ► 50 మురళీ విజయ్కు ఇది 50వ టెస్టు మ్యాచ్. ► 112 స్టీవెన్ స్మిత్ మరో 112 పరుగులు చేస్తే టెస్టుల్లో ఐదువేల పరుగులు పూర్తవుతాయి. పిచ్, వాతావరణం సాధారణ ఉపఖండపు వికెట్. ఆరంభంలో కనీసం రెండు రోజుల పాటు బ్యాటింగ్కు అనుకూలించి ఆ తర్వాత టర్న్ అవుతుంది. ఇలాంటి చోట తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించడమే కీలకమవుతుంది. కాబట్టి టాస్కు అమిత ప్రాధాన్యత ఏర్పడింది. ఇక్కడ జరిగిన ఆఖరి టెస్టు (భారత్–దక్షిణాఫ్రికా) వర్షం కారణంగా ఒక రోజు తర్వాత రద్దయింది. ఆ తర్వాత అవుట్ఫీల్డ్ను కొత్త తరహా టెక్నాలజీలో పూర్తిగా ఆధునీకరించారు. మ్యాచ్ రెండో రోజు ఆదివారం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. గత మ్యాచ్ వివాదం నేపథ్యంలో బీసీసీఐ పిచెస్ కమిటీ చైర్మన్ దల్జీత్ సింగ్ ఈసారి బెంగళూరు పిచ్ ఛాయలకే రాకుండా పూర్తిగా స్థానిక సంఘానికే అప్పగించారు. -
అక్షర్కు అవకాశం దక్కుతుందా!
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఇప్పటికే కోల్పోయిన నేపథ్యంలో నాలుగో టెస్టులో భారత తుది జట్టు ఏ విధంగా ఉండబోతోందో అనేది ఆసక్తికరం. సిడ్నీ క్రికెట్ మైదానం (ఎస్సీజీ) స్పిన్కు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. మ్యాచ్ నాలుగు, ఐదు రోజుల్లో స్పిన్నర్లు ప్రభావితం చేస్తారని రికార్డులు చెబుతున్నాయి. కాబట్టి తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉండే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా జట్టు కూడా ఇదే ఆలోచనతో లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆస్టన్ అగర్కు జట్టులో చోటిచ్చింది. కాబట్టి భారత్నుంచి అశ్విన్తో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఆడతాడా అనేది చూడాలి. గాయపడిన జడేజా స్థానంలో ఆస్ట్రేలియాకు వచ్చిన అక్షర్ ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. కోహ్లి సారథ్యంలో వన్డేలు ఆడిన అక్షర్పై కెప్టెన్కు మంచి నమ్మకముండటం కూడా అతని అవకాశాలు పెంచుతోంది. అక్షర్ను తీసుకుంటే ఉమేశ్, షమీలలో ఒకరిపై వేటు పడుతుంది. వరుసగా విఫలమవుతున్న ధావన్ స్థానంలో సురేశ్ రైనాకు చోటు ఇవ్వాలని కూడా మేనేజ్మెంట్ భావిస్తోంది. తొలి మ్యాచ్లో విఫలమైనా, తన సహజమైన ఓపెనింగ్ స్థానంలో రాహుల్ ఆడతాడు. రైనాకు ఆరోస్థానంలో బరిలోకి దిగుతాడు. రైనా స్పిన్ బౌలింగ్ కూడా కొంత వరకు ఉపయోగపడవచ్చు. మరో వైపు ధోని తప్పుకోవడంతో వికెట్ కీపర్గా వృద్ధిమాన్ సాహా బరిలోకి దిగడం మాత్రం ఖాయమైంది. -
‘డ్రా’తో గట్టెక్కారు
70 ఓవర్లు.... 384 పరుగుల లక్ష్యం... ఒక దశలో భారత్ స్కోరు 19 పరుగులకే 3 వికెట్లు... మరో పరాభవం తప్పదనుకుంటున్న వేళ... కోహ్లి, రహానే మళ్లీ ఆకట్టుకున్నారు. ప్రత్యర్థులు మాటలతో కాక పుట్టించినా... భయంకరమైన బంతులతో విరుచుకుపడినా... పట్టుదలతో పోరాడి క్రీజ్లో నిలిచారు. మ్యాచ్ను ‘డ్రా’ దిశగా మళ్లించారు. కొద్దితేడాలో కోహ్లి, రహానే, పుజారా అవుటైనా... చివర్లో ఒత్తిడికి తట్టుకొని ధోని, అశ్విన్ స్ఫూర్తిదాయక ఆటతీరుతో భారత్ను గట్టెక్కించారు. విజయంతో కాకుండా ‘డ్రా’తోనే సరిపెడదామని భావించిన ఆసీస్ కెప్టెన్ స్మిత్ చాలా ఆలస్యంగా డిక్లేర్ చేయడం కూడా భారత్కు కలిసొచ్చింది. సిరీస్ 2-0తో ఆస్ట్రేలియా వశం ⇒ రాణించిన కోహ్లి, రహానే ⇒ వచ్చే నెల 6 నుంచి నాలుగో టెస్టు మెల్బోర్న్: ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మూడో టెస్టు నాటకీయ పరిణామాల మధ్య ‘డ్రా’గా ముగిసింది. ఆట మొత్తం ఆసీస్ ఆధిపత్యం చూపినా... ఆఖరి రోజు సహనంతో ఆడిన భారత్ ఓటమి నుంచి గట్టెక్కింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చకచకా వికెట్లు చేజార్చుకున్నా... చివరి సెషన్ మొత్తం నిలకడను చూపిన టీమిండియా కంగారూల విజయానికి బ్రేక్ వేసింది. దీంతో ఎంసీజీలో భారత్, ఆసీస్ల మధ్య జరిగిన మూడో టెస్టు ‘డ్రా’ అయ్యింది. ఫలితంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని మరో మ్యాచ్ మిగిలి ఉండగానే స్మిత్ సేన 2-0తో కైవసం చేసుకుంది. 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 66 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. కోహ్లి (99 బంతుల్లో 54; 7 ఫోర్లు), రహానే (117 బంతుల్లో 48; 6 ఫోర్లు) మరోసారి ఆకట్టుకున్నారు. పుజారా (21), ధోని (39 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అంతకుముందు 261/7 ఓవర్నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ను 98 ఓవర్లలో 9 వికెట్లకు 318 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. మార్ష్ (215 బంతుల్లో 99; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. చకచకా... లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్కు... ఆరంభంలోనే కంగారూలు షాక్ ఇచ్చారు. కట్టుదిట్టమైన బంతులతో చెలరేగుతూ 9 ఓవర్లలోపే ధావన్ (0), రాహుల్ (1), విజయ్ (11)లను అవుట్ చేశారు. దీంతో భారత్ 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కోహ్లికి జత కలిసిన రహానే అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. దాదాపు మూడు గంటలకు పైగా ఓపికగా బ్యాటింగ్ చేసి చేజారిపోయిన మ్యాచ్ను ‘డ్రా’వైపు మళ్లించారు. అయితే టీ విరామం తర్వాత తొలి బంతికే కోహ్లి అవుట్ కావడంతో ఆసీస్కు విజయంపై ఆశ పుట్టింది. కానీ పుజారా నిలకడను చూపడంతో కంగారూలకు నిరాశ తప్పలేదు. దాదాపు 16.5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన చతేశ్వర్ ఐదో వికెట్కు రహానేతో కలిసి 37 పరుగులు జోడించి అవుటయ్యాడు. మరో నాలుగు ఓవర్ల తర్వాత రహానే కూడా వెనుదిరగడంతో మ్యాచ్ రసకందాయంలో పడింది. అయితే చివర్లో ధోని, అశ్విన్ (34 బంతుల్లో 8 నాటౌట్) ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. చివరకు మరో నాలుగు ఓవర్ల ఆట మిగిలి ఉండగానే స్మిత్ ‘డ్రా’కు అంగీకరించాడు. ఫలితంగా 1997 తర్వాత మరోసారి మెల్బోర్న్ మైదానంలో జరిగిన టెస్టు ‘డ్రా’గా ముగిసింది. హారిస్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్లోని చివరిదైన నాలుగో టెస్టు జనవరి 6 నుంచి సిడ్నీలో జరుగుతుంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 530; భారత్ తొలి ఇన్నింగ్స్: 465; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్ప్: 318/9 డిక్లేర్డ్; భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ ఎల్బీడబ్ల్యూ (బి) హాజల్వుడ్ 11; ధావన్ ఎల్బీడబ్ల్యూ (బి) హారిస్ 0; రాహుల్ (సి) వాట్సన్ (బి) జాన్సన్ 1; కోహ్లి (సి) బర్న్స్ (బి) హారిస్ 54; రహానే (సి) మార్ష్ (బి) హాజల్వుడ్ 48; పుజారా (బి) జాన్సన్ 21; ధోని నాటౌట్ 24; అశ్విన్ నాటౌట్ 8; ఎక్స్ట్రాలు: 7; మొత్తం: (66 ఓవర్లలో 6 వికెట్లకు) 174 వికెట్ల పతనం: 1-2; 2-5; 3-19; 4-104; 5-141; 6-142 బౌలింగ్: జాన్సన్ 15-3-38-2; హారిస్ 16-8-30-2; హాజల్వుడ్ 15-3-40-2; లయోన్ 12-0-36-0; వాట్సన్ 6-1-14-0; స్మిత్ 2-0-10-0. ‘ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో మేం ఎంచుకున్న మార్గాలు మాకే ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని మ్యాచ్ మొత్తం కొనసాగించాలి. మ్యాచ్ ‘డ్రా’ అయినందుకు కాస్త సంతోషమే. చివరి రోజు ఆట వల్లే ఇది సాధ్యమైంది. కొత్త కుర్రాళ్లు కుదురుకోవడానికి సమయం ఇవ్వాలి’-ధోని (భారత కెప్టెన్) ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలిచినందుకు సంతోషంగా ఉంది. చివరిసారి చెత్తగా ఓడాం. మళ్లీ ఇప్పుడు అనుకున్నది సాధించాం. వచ్చేసారి భారత్కు వెళ్లినప్పుడు మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం. డిక్లేర్ విషయంలో రెండుసార్లు పునరాలోచించా. అయినప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోయా. అడిలైడ్ కంటే ఈ పిచ్ కాస్త మెరుగ్గా ఉం డటంతో ఆలస్యం చేశా’ - స్మిత్ (ఆసీస్ కెప్టెన్) -
మళ్లీ జారవిడిచారు!
మెల్బోర్న్లోనూ అదే ఆట... గత మ్యాచ్లకు రీప్లే ప్రదర్శన... హాడిన్పై షార్ట్ బంతి ప్రయోగిస్తే వికటించింది... అసలు బ్యాటింగ్ చేయగలడా అనుకున్న 9వ నంబర్ ఆటగాడు కూడా అర్ధ సెంచరీ సాధించేశాడు. స్వయంగా వికెట్ ఇచ్చుకుంటే తప్ప స్మిత్పై ఎలాంటి ఎత్తుగడ పని చేయలేదు. టెస్టుల్లో కెప్టెన్గా తన బలహీనతను మరోసారి ప్రదర్శించిన ధోని, ప్రత్యర్థిని ఎలా కట్టడి చేయాలో తెలీక చేతులెత్తేశాడు. మైదానం మారినా మన బౌలింగ్, వ్యూహాలు మారలేదు. ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ మరోసారి చెలరేగింది. 50 వేలకు పైగా ప్రేక్షకుల ప్రోత్సాహం, సహచరుల అండతో నాయకుడు జట్టును ముందుండి నడిపించాడు. కంగారూల స్కోరు 500 దాటితే... భారత ప్రధాన బౌలర్లు నలుగురు ‘సెంచరీ’ మార్క్ను అందుకున్నారు. తొలి 5 వికెట్లకు ఆసీస్ 216 పరుగులు చేస్తే, మన బౌలర్ల సహకారంతో తర్వాతి 5 వికెట్లకు 314 పరుగులు చేసింది. కొండంత స్కోరు ముందుండగా భారత్ నెమ్మదిగా అడుగులు వేసింది. విజయ్ మళ్లీ తన నిలకడ ప్రదర్శిస్తే, ధావన్ తనకు అలవాటైన రీతిలో నిష్ర్కమించాడు. ఇప్పుడు మన జట్టుకు కావాల్సింది ఆసీస్ రెండో రోజు ఆట స్ఫూర్తి. ఎలాంటి స్థితిలోనూ తొణకకుండా ప్రత్యర్థి చూపిన పట్టుదలతో మూడో రోజు ఎంసీజీలో టీమిండియా బ్యాట్స్మెన్ సత్తా చాటుతారా? లేక సాగిలపడతారా? చూడాలి. తీరు మారని భారత బౌలింగ్ ⇒ చెలరేగిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ⇒ తొలి ఇన్నింగ్స్లో 530 ఆలౌట్ ⇒ స్మిత్ భారీ సెంచరీ, రాణించిన హారిస్ ⇒ భారత్ 108/1 మెల్బోర్న్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో భారత జట్టు.. ప్రత్యర్థి భారీ స్కోరు ముందు ఎదురీదుతోంది. ఇక్కడి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 37 ఓవర్లలో వికెట్ నష్టానికి 108 పరుగులు చేసింది. మురళీ విజయ్ (102 బంతుల్లో 55 బ్యాటింగ్; 5 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (25 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. హారిస్ బౌలింగ్లో శిఖర్ ధావన్ (28) తొలి వికెట్గా వెనుదిరిగాడు. భారత్ ప్రస్తుతం మరో 422 పరుగులు వెనుకబడి ఉంది. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హాజల్వుడ్ బౌలింగ్లో పుజారా ఇచ్చిన సునాయాస క్యాచ్ను కీపర్ హాడిన్ వదిలేయకపోతే భారత్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండేది. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 530 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (305 బంతుల్లో 192; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకోగా, ర్యాన్ హారిస్ (88 బంతుల్లో 74; 8 ఫోర్లు, 1 సిక్స్), బ్రాడ్ హాడిన్ (84 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. స్మిత్... హాడిన్తో ఆరో వికెట్కు 110 పరుగులు, హారిస్తో ఎనిమిదో వికెట్కు 106 పరుగులు జత చేశాడు. తొలి రోజు మందకొడిగా ఆడిన ఆసీస్ రెండో రోజు మాత్రం ధాటిని ప్రదర్శించింది. భారత పేలవ బౌలింగ్ను పూర్తిగా ఉపయోగించుకున్న ఆ జట్టు 5.18 రన్రేట్తో 52.3 ఓవర్లలోనే 271 పరుగులు జోడించడం విశేషం. షమీ అయితే పూర్తిగా గతి తప్పాడు. మిగతా ముగ్గురు బౌలర్లు కలిసి 29 ఫోర్లు ఇస్తే, అతనొక్కడే 23 బౌండరీలు ఇచ్చాడు. షమీ 4 వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో 3 వికెట్లు తీశారు. స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: రోజర్స్ (సి) ధోని (బి) షమీ 57; వార్నర్ (సి) ధావన్ (బి) ఉమేశ్ 0; వాట్సన్ (ఎల్బీ) (బి) అశ్విన్ 52; స్మిత్ (బి) ఉమేశ్ 192; మార్ష్ (సి) ధోని (బి) షమీ 32; బర్న్స్ (సి) ధోని (బి) ఉమేశ్ 13; హాడిన్ (సి) ధోని (బి) షమీ 55; జాన్సన్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 28; హారిస్ (ఎల్బీ) (బి) అశ్విన్ 74; లయోన్ (బి) షమీ 11; హాజల్వుడ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 16; మొత్తం (142.3 ఓవర్లలో ఆలౌట్) 530 వికెట్ల పతనం: 1-0; 2-115; 3-115; 4-184; 5-216; 6-326; 7-376; 8-482; 9-530; 10-530. బౌలింగ్: ఇషాంత్ 32-7-104-0; ఉమేశ్ 32.3-3-130-3; షమీ 29-4-138-4; అశ్విన్ 44-9-134-3; విజయ్ 5-0-14-0. భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (బ్యాటింగ్) 55; ధావన్ (సి) స్మిత్ (బి) హారిస్ 28; పుజారా (బ్యాటింగ్) 25; ఎక్స్ట్రాలు 0; మొత్తం (37 ఓవర్లలో వికెట్ నష్టానికి) 108 వికెట్ల పతనం: 1-55. బౌలింగ్: జాన్సన్ 9-3-24-0; హారిస్ 7-3-19-1; హాజల్వుడ్ 9-4-19-0; వాట్సన్ 4-0-14-0; లయోన్ 8-0-32-0. ⇒ కెప్టెన్గా తొలి రెండు టెస్టుల్లోనూ సెంచరీ చేసిన ఐదో ఆటగాడు స్మిత్. ఆస్ట్రేలియా తరఫున తొలి క్రికెటర్. 2007-08లో హేడెన్ తర్వాత వరుసగా మూడు సెంచరీలు చేసిన ఆసీస్ ఆటగాడు కూడా స్మిత్ కావడం విశేషం. ⇒ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక స్టంపింగ్లు (134) చేసిన ఆటగాడిగా ధోని రికార్డు సృష్టించాడు. సంగక్కర (133)ను అతను అధిగమించాడు. అలాగే టెస్టుల్లో 38 స్టంపింగ్లతో భారత్ తరఫున కిర్మాణీ (38)తో సమంగా నిలిచాడు. ⇒ నలుగురు భారత బౌలర్లు ఒకే ఇన్నింగ్స్లో 100కు పైగా పరుగులు ఇవ్వడం 2014లో ఇది నాలుగోసారి. ఈ ఏడాది టీమిండియా తరఫున వేర్వేరు మ్యాచ్ల్లో ఏకంగా 26 సార్లు ఇలా పరుగులిచ్చారు. గతంలో ఒకే క్యాలెండర్ ఇయర్లో ఏ జట్టు కూడా 18 సార్లకు మించి సమర్పించలేదు. భారీగా పరుగులు ఇచ్చుకోవడం నిరాశకు గురి చేసింది. ఈ వికెట్పై పరుగులకు మంచి అవకాశముంది కాబట్టి మేమూ భారీ స్కోరు చేస్తాం. మాకు ఆరంభం లభించింది కూడా. హాడిన్ షార్ట్ బంతులు ఆడలేడనే అలా బౌలింగ్ చేశాం. స్మిత్అలాంటి ఫామ్లో ఉన్నప్పుడు ప్రత్యర్థికి కొంత అదృష్టం కూడా కలిసి రావాలి. ఈ రెండు రోజులు నా బౌలింగ్తో సంతృప్తి చెందా -అశ్విన్, భారత స్పిన్నర్ మా జట్టు భారీ స్కోరు చేయడం సంతోషంగా ఉంది. క్రీజ్లో అన్ని నాకు అనుకూలంగా జరిగాయి. మా చివరి వరుస బ్యాట్స్మెన్ ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించాడు. దీనికి భారత్ వద్ద సమాధానం లేకపోయింది. డబుల్ సెంచరీ కోల్పోవడం పట్ల నిరాశగా లేను. వేగంగా పరుగులు చేసి డిక్లేర్ చేయాలనుకున్నా. చివర్లో మరిన్ని వికెట్లు తీసి ఉంటే ఇంకా బాగుండేది. అయితే మూడు రోజు ఆరంభంలో ఆ పని చేయగలం -స్టీవెన్ స్మిత్, ఆసీస్ కెప్టెన్ సెషన్-1: ఆస్ట్రేలియా దూకుడు ఓవర్నైట్ స్కోరు 259/5తో ఆసీస్ ఆట ప్రారంభించింది. హాడిన్ షార్ట్ బంతుల బలహీనత తెలిసిన భారత బౌలర్లు పదే పదే అవే బంతులు వేశారు. అయితే ఇది సత్ఫలితం ఇవ్వలేదు. షమీ వేసిన నాలుగో ఓవర్లో మూడు ఫోర్లు బాది హాడిన్ జవాబిచ్చాడు. ఇదే క్రమంలో 75 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. గత 15 ఇన్నింగ్స్లలో అతనికి ఇదే తొలి అర్ధ సెంచరీ. మరోవైపు 191 బంతుల్లో స్మిత్ ఈ సిరీస్లో వరుసగా మూడో శతకాన్ని సాధించాడు. హాడిన్ అవుటయ్యాక వచ్చిన జాన్సన్ కూడా ఉమేశ్, షమీ బౌలింగ్లలో వరుసగా రెండేసి ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించాడు. మరో భారీ షాట్కు ప్రయత్నించిన అతను స్టంపౌట్గా వెనుదిరిగాడు. ఓవర్లు: 25, పరుగులు: 130, వికెట్లు: 2 సెషన్-2: అదే జోరు లంచ్ తర్వాత కూడా స్మిత్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. అనూహ్యంగా హారిస్ నుంచి కూడా భారత బౌలర్లకు ప్రతిఘటన ఎదురైంది. అశ్విన్ వేసిన ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి అతనూ ఆధిక్యం ప్రదర్శించాడు. చివరకు అశ్విన్ బౌలింగ్లోనే భారీ సిక్సర్ కొట్టిన అనంతరం తర్వాతి బంతికి అవుటయ్యాడు. 273 బంతుల్లో 150 పరుగులు అందుకున్న స్మిత్ డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోయాడు. అయితే ఇదే జోరులో ఉమేశ్ బౌలింగ్లో ర్యాంప్ షాట్ ఆడబోయి వికెట్లు వదిలేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్లు: 27.3, పరుగులు: 141, వికెట్లు: 3 సెషన్-3: ఆకట్టుకున్న విజయ్ ఫామ్లో ఉన్న మురళీ విజయ్ మరోసారి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ ఆరంభించగా, ధావన్ కాస్త తడబడ్డాడు. ఆసీస్ బౌలర్లు కూడా చక్కటి లైన్ అండ్ లెంగ్త్తో బ్యాట్స్మెన్ను కట్టడి చేశారు. వాట్సన్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి కాస్త దూకుడు ప్రదర్శించే ప్రయత్నం చేసిన ధావన్, హారిస్ వేసిన తర్వాతి ఓవర్లోనే స్లిప్లో క్యాచ్ ఇచ్చాడు. మరోవైపు విజయ్ మాత్రం చక్కటి ఆటతీరు కనబర్చాడు. సంయమనం కోల్పోకుండా ఆడిన అతను 93 బంతుల్లో ఈ సిరీస్లో మూడో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాడిన్ చలవతో బతికిపోయిన పుజారా కూడా ఆ తర్వాత మరో అవకాశం ఇవ్వలేదు. ఓవర్లు: 37, పరుగులు: 108, వికెట్లు: 1