Chhota Rajan
-
హత్య కేసులో చోటా రాజన్కు ఊరట
ముంబై: ట్రేడ్ యూనియన్ లీడర్ దత్తా సామంత్ హత్య కేసులో గ్యాంగ్స్టర్ చోటా రాజన్ను నిరపరాధిగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. 1997లో జరిగిన ఈ హత్యకు చోటా రాజన్ కుట్ర పన్నాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు వెల్లడించింది. సామంత్ తన జీపులో పంత్ నగర్ నుంచి ఘట్కోపర్ వెళుతుండగా మోటార్బైక్పై వచి్చన దుండగులు ఆయనపై 17 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో సామంత్ అక్కడికక్కడే మరణించాడు. ఈ హత్య వెనుక చోటా రాజన్ హస్తం ఉందంటూ ప్రాసిక్యూషన్ కేసు నమోదు చేసింది. అయితే అందుకు గల సాక్ష్యాధారాలను సమరి్పంచడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో ప్రత్యేక న్యాయమూర్తి బి.డి.షెల్కె రాజన్కు కేసు నుంచి విముక్తి కలి్పంచారు. అతనిపై మరిన్ని కేసులు పెండింగ్లో ఉండడంతో విడుదలయ్యే అవకాశాల్లేవు. -
మళ్లీ జైలుకు: కరోనాతో కోలుకున్న గ్యాంగ్స్టర్ చోటా రాజన్
ఢిల్లీ: కరోనా బారిన పడిన గ్యాంగ్స్టర్ చోటా రాజన్ కోలుకున్నాడు. అతడు కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. అతడి ఆరోగ్యం మెరుగవడంతో అధికారులు ఢిల్లీ ఎయిమ్స్ నుంచి తిహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 22వ తేదీన చోట రాజన్ కరోనా వైరస్ బారినపడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆ నెల 24వ తేదీన ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలో ఒక్కసారిగా చోట రాజన్ మృతి చెందాడనే వార్తలు గుప్పుమన్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చోటా రాజన్ మృతి చెందారనే వార్త వైరల్గా మారింది. ఈ పుకార్లపై పోలీస్, ఆస్పత్రి అధికారులు స్పందించి ‘లేదు.. లేదు. చోట రాజన్ చనిపోలేదు. చికిత్స పొందుతున్నాడు’ అన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. చివరకు ఆయన కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంతో తిహార్ జైలుకు తిరిగి వెళ్లాడు. చదవండి: మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా చదవండి: దారుణం.. వేశ్యను వాడుకుని డ్రైనేజీలో పారవేత -
జోతిర్మయి డే హత్య కేసు..చోటా రాజన్ దోషి
-
జే డే కేసులో ఛోటా రాజన్కు జీవిత ఖైదు
సాక్షి, ముంబై : ఏడేళ్ల కిందట దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రముఖ జర్నలిస్టు జే డే(జ్యోతిర్మయ్ డే) హత్య కేసులో ముంబై ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు(బుధవారం) తీర్పు వెలువరించింది. ఈ కేసులో గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్ని దోషిగా తేల్చిన కోర్టు ...అతడితో పాటు మరో ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. ముంబైకి చెందిన జే డే.. మిడ్ డే పత్రికలో క్రైమ్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నారు. 2011 జూన్11న విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా సుబర్బన్ పొవాయ్ ప్రాంతంలో ఆయనపై మోటార్ సైకిళ్లపై వచ్చిన కొందరు వ్యక్తులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జే డేని ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. ప్రముఖ క్రైమ్ రిపోర్టర్ అయిన జే డే ముంబైలో నేరచరిత్ర కలిగిన 20 మంది గ్యాంగ్స్టర్ల గురించి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అతను హత్యకు గురయ్యారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న మహారాష్ట్ర పోలీసులు తొలుత మరో జర్నలిస్టు జిగ్నా వోరాను ఈ కేసులో నిందితురాలిగా అనుమానించి విచారణ చేపట్టారు. వృత్తి రీత్యా ఏర్పడిన శత్రుత్వంతోనే వోరా ఈ హత్య చేసి ఉంటారని భావించిన పోలీసులు ఆమె వద్ద నుంచి మరింత సమాచారం సేకరించారు. ఆ తర్వాత లోతైన విచారణ చేపట్టిన పోలీసులు ఛోటా రాజన్కు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడంతోనే అతడు ఈ హత్య చేశాడనే నిర్ధారణకు వచ్చారు. సతీశ్ కాలియా అనే కాంట్రాక్టు కిల్లర్కు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఈ హత్య చేయించినట్టు పోలీసు విచారణలో వెలుగు చూసింది. ఈ హత్య తర్వాత అక్కడి నుంచి పరారైన సతీశ్ను పోలీసులు ఎట్టకేలకు రామేశ్వరంలో అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ముంబై ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో తొలి నుంచి నిందితురాలిగా ఉన్న వోరాను కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. ఈ కేసులో ఛోటా రాజన్తో పాటు మరో పది మందిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం వీరికి రేపు శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది. నకిలీ పాస్పోర్టు కేసులో దోషిగా ఉన్న ఛోటా రాజన్ ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. -
చోటారాజన్ గ్యాంగ్ సభ్యుడు అరెస్ట్
లక్నో: మాఫియా డాన్ చోటరాజన్ గ్యాంగ్ సభ్యుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చోటరాజన్ గ్యాంగ్లో షార్ప్ షూటర్ ఖాన్ ముబారక్ను ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని దగ్గర నుంచి పెద్ద ఎత్తున తుపాకులు, బుల్లెట్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ఫోర్స్ ఆపరేషన్లో ఖాన్ ముబారక్ పట్టుబడ్డాడు. చోటా రాజన్ ముఠా సభ్యులు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారన్న దానిపై టాస్క్ఫోర్స్ పోలీసులు అతని నుంచి కూపీ లాగుతున్నారు. -
జైల్లోనే ఛోటా రాజన్ హత్యకు 'ఢీ' గ్యాంగ్ స్కెచ్!
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్ను హత్య చేసేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఛోటా షకీల్ గ్యాంగ్ పన్నిన కుట్రను పోలీసులు మరోసారి చేధించారు. ఛోటా షకీల్ గ్యాంగ్ సభ్యుడు జునైద్ చౌదరిని ఈశాన్య ఢిల్లీలోని వజీరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. 21 ఏళ్ల జునైద్ చౌదరి ఇండియా మోస్ట్ వాంటెడ్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంలా టాప్ గ్యాంగ్స్టర్ కావాలనుకుంటున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. పాకిస్తాన్లో జన్మించి కెనేడియన్ రచయితగా స్థిరపడ్డ తారెక్ ఫతా హత్యకు కుట్రపన్ని జునైద్ చౌదరి పోలీసులకు చిక్కాడు. అయితే ఈ హత్యతోనే మరో హత్యకు కుట్రపన్నాడు జునైద్. ఇప్పటికే గత ఏడాది ఛోటా రాజన్ను కోర్టుకు తీసుకెళ్లే సమయంలో చంపాలని జునైద్ పథకం రచించి విఫలమయిన విషయం తెలిసిందే. రాజన్ను చంపేందుకు జునైద్తో పాటూ నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లు రాబిన్సన్, యూనిస్, మనీశ్లను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే ఈ సారి మాత్రం ముందుగా ఫతాను హతమార్చి పోలీసులకు చిక్కితే నేరుగా తీహార్ జైలుకెళ్లొచ్చని స్కెచ్ గీశాడు. దీంతో జైల్లోనే చోటా రాజన్ని మట్టుపెట్టొచ్చని ప్లాన్ వేశాడు. టెర్రరిజమ్ ఖండిస్తూ ఫతా పలుమార్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఫతాని అంతమొందిచాలని జునైద్ భావించాడని డీసీపీ(స్పెషల్ సెల్) పీఎస్ కుష్వా తెలిపారు. ఫతా ఢిల్లీ రానున్న నేపథ్యంలో జునైద్ రెక్కీ నిర్వహిస్తూ పోలీసులకు చిక్కాడు. ఈశాన్య ఢిల్లీలోని గోకాల్పురీ ప్రాంతంలోని భాగీరథి విహార్కు చెందిన ఓ పాల వ్యాపారి కుమారుడు జునైద్. -
ఛోటా రాజన్కు జైలు శిక్ష
న్యూఢిల్లీ: నకిలీ పాస్ట్ పోర్ట్ కేసులో గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్తో పాటు మరో ముగ్గురికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. సోమవారం వీరిని దోషులుగా నిర్ధారించిన ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ రోజు (మంగళవారం) శిక్షలను ఖరారు చేసింది. వీరికి జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వీరేందర్ కుమార్ గోయల్ తీర్పు చెప్పారు. ఫోర్జరీ పత్రాలతో మారుపేరుతో ఛోటా రాజన్ పాస్ పోర్టు పొందినట్టు గతేడాది జూన్ 8న సీబీఐ కోర్టులో అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. రాజన్తో పాటు పాస్ పోర్టు అధికారులు జయశ్రీ దత్తాత్రేయ్ రహతె, దీపక్ నట్వర్లాల్ షా, లలిత లక్ష్మణన్లపై కేసు నమోదైంది. 1998-99లో బెంగళూరులో ఛోటా రాజన్.. మోహన్ కుమార్ అనే పేరుతో నకిలీ పాస్ పోర్టు పొందాడని, ఇందుకు పాస్ట్ పోర్టు అధికారులు సహకరించారని సీబీఐ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. నేరం రుజువు కావడంతో రాజన్తో పాటు అతనికి సహకరించిన వారికి శిక్ష పడింది. 2015 అక్టోబర్లో ఇండోనేసియా పోలీసులకు పట్టుబడ్డ రాజన్ను ఆ ఏడాది నవంబర్లో భారత్కు అప్పగించారు. -
ఛోటా రాజన్కు మరో ఎదురు దెబ్బ
-
ఛోటా రాజన్కు మరో ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్కు మరో ఎదురుదెబ్బ తగలింది. నకిలీ పాస్ పోర్టు కేసులో సోమవారం ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఛోటా రాజన్ను దోషీగా ప్రకటించింది. రేపు (మంగళవారం) రాజన్కు శిక్షను ఖరారు చేయనున్నట్టు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వీరేందర్ కుమార్ గోయల్ ప్రకటించారు. ఫోర్జరీ పత్రాలతో మారుపేరుతో ఛోటా రాజన్ పాస్ పోర్టు పొందినట్టు గతేడాది జూన్ 8న సీబీఐ కోర్టులో అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. రాజన్తో పాటు పాస్ పోర్టు అధికారులు జయశ్రీ దత్తాత్రేయ్ రహతె, దీపక్ నట్వర్లాల్ షా, లలిత లక్ష్మణన్లపై కేసు నమోదైంది. 1998-99లో బెంగళూరులో ఛోటా రాజన్.. మోహన్ కుమార్ అనే పేరుతో నకిలీ పాస్ పోర్టు పొందాడని, ఇందుకు పాస్ట్ పోర్టు అధికారులు సహకరించారని సీబీఐ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. నేరం రుజువు కావడంతో రాజన్తో పాటు అతనికి సహకరించిన వారిని కోర్టులో దోషులుగా ప్రకటించింది. హత్యలు, స్మగ్లింగ్, కిడ్నాప్ సహా రాజన్పై 85కు పైగా కేసులున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్లతో అతనిపై దాఖలైన కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2015 అక్టోబర్లో ఇండోనేసియా పోలీసులకు పట్టుబడ్డ రాజన్ను ఆ ఏడాది నవంబర్లో భారత్కు అప్పగించారు. -
మాజీ ఎంపీ వర్సెస్ మాఫియా డాన్
న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఇద్దరు కరడుగట్టిన నేరస్తుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షహబుద్దీన్, అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ వ్యవహారం అధికారులకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. తీహార్ జైలులో వీరిద్దరూ వేర్వేరు గదుల్లో ఉన్నారు. చోటారాజన్ ఉన్న గదిలో అధికారులు టీవీ ఏర్పాటు చేయడంపై షహబుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తనకు కూడా టీవీ కావాలని అధికారులకు లేఖ రాశాడు. టీవీలో లేకపోవడంతో బోర్ కొడుతోందని, ఒంటరిగా ఫీలవుతున్నానని పేర్కొన్నాడు. రాజన్ గది నుంచి వస్తున్న మ్యూజిక్ తనకు నిద్రాభంగం కలిగిస్తోందని తెలిపాడు. 45 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న షహబుద్దీన్ ను తీహార్ నంబరు వన్ జైలులో ఉంచారు. కరడుగట్టిన నేరస్తులు ఉండడంతో తమిళనాడు ప్రత్యేక పోలీస్ జవాన్లతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. షహబుద్దీన్ అభ్యర్థనపై జైలు అధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. -
దావూద్ కా బెహన్... మాఫియా క్వీన్!
ముంబయ్ అంటే బాలీవుడ్డే కాదు, ఇండియా బిజినెస్ కాపిటల్ కూడా! అంతేనా... ముంబయ్లో భాయ్ కల్చర్ కూడా బాగా ఫేమస్. దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్... చీకటి ప్రపంచంలో తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న మాఫియా ప్రముఖులు ముంబయ్ కేంద్రంగా పలు పనులు చేశారని అప్పుడప్పుడూ వార్తలు వినిపిస్తుంటాయి. దావుద్ చెల్లెలు హసీనా కొన్నాళ్లు మకుటం లేని మహారాణిలా ముంబయ్లో రాజ్యాధికారం చెలాయించారట! ఇప్పుడామె కథతో రూపొందుతున్న సినిమా ‘హసీనా’లో శ్రద్ధా కపూర్ టైటిల్ రోల్లో నటిస్తున్నారు. ఫొటోలో చూస్తున్నది సినిమాలో ఆమె ఫస్ట్ లుక్. ఎక్కువగా గ్లామరస్ పాత్రలు చేసే శ్రద్ధ... కళ్లలో కనబరుస్తున్న క్రూరత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 17 ఏళ్ల వయసు నుంచి 40 ఏళ్ల వయసు వరకూ హసీనా జీవితంలో జరిగిన విషయాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. -
ఛోటా రాజన్ ఏం చేస్తున్నాడో తెలుసా?
మాజీ డాన్ ఛోటా రాజన్ ఏం చేస్తున్నాడో.. ఎలా ఉన్నాడో తెలుసా? అతడి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, పూర్తిగా విషమించిందని అందువల్ల అతడికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స చేయించాల్సి వస్తోందని తెలిసింది. ఏదైనా బాగా పెద్ద ఆస్పత్రిలో అతడికి కార్డియాలజీ, యూరాలజీ విభాగాల్లో చికిత్స చేయించాలని ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అక్కడి బోర్డ్ ఆఫ్ డాక్టర్స్ మొత్తం అతడి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారని, ఆ తర్వాతే ఈ సలహా ఇచ్చారని చెబుతున్నారు. ప్రస్తుతం గుండె సమస్య, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో పాటు... ఛోటా రాజన్కు ఇన్సిషనల్ హెర్నియా, లాపరోటమీ, హైపర్టెన్షన్ కూడా ఉన్నాయి. ఒక్కోసారి అతడికి కడుపునొప్పి వస్తుందని, మరోసారి ముక్కులోంచి రక్తం వస్తుందని, ఇంకోసారి అసలు నిద్రపట్టకపోవడం లాంటివి ఉంటాయని.. అందువల్ల ఇప్పటివరకు పూర్తిగా ఏయే సమస్యలు ఉన్నాయో అనే సమగ్ర సమీక్ష కూడా ఇంకా జరగలేదని వైద్యులు అంటున్నారు. రాజన్కు తగిన చికిత్స అందించేందుకు వీలుగా పూర్తిగా అతడికి వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు సూచించింది. -
ముంభాయ్ మూవీ
ముంబై గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్ అరెస్ట్ అయి అప్పుడే ఏడాది గడిచిపోయింది. 2015 అక్టోబర్ 26న ‘ఇంటర్పోల్’ పోలీసులు అతడిని ఇండోనేషియాలోని బాలి దీవిలో అరెస్టు చేసి నవంబర్ 6న ఇండియాకు తరలించారు. ముంబైలో అతడి ప్రాణాలకు ముప్పు ఉండడంతో ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంచారు. అప్పటి నుండి అతడు జైల్లోనే ఉంటున్నాడు. మరోవైపు అతని పూర్వ మిత్రుడు ప్రస్తుత ప్రధాన విరోధి దావూద్ ఇబ్రహీమ్ పాకిస్తాన్లో తల దాచుకుంటూ భారత ప్రభుత్వ వేట నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విశేషం ఏమంటే ఈ అండర్వరల్డ్ డాన్ల వెంట చట్టం ఎలా పరిగెత్తిందో బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా అంతే పరిగెత్తింది. వారి జీవితాల ఆధారంగా సినిమాలు తీస్తూనే ఉంది. డాన్లు లేని హిందీ సినిమాలను ఊహించడం కష్టం. మీట నొక్కితే తెరుచుకునే తలుపులు, క్లబ్ డాన్సులూ, హెలికాప్టర్లు ఇలాంటి సినిమాటిక్ డాన్లను నేల మీదకు దించి చూపిన తొలి సినిమా ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’) అనే చెప్పాలి. ఆ తర్వాత విధు వినోద్ చోప్రా తీసిన ‘పరిందా’ డాన్ల వాస్తవిక జీవితాన్ని చూపించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ప్రవేశంతో హిందీలో దాదాపుగా సూటూ బూటూ వేసుకునే డాన్లు అంతమై, నిజమైన డాన్ల కథలు తెర మీదకు వచ్చాయి. తాజాగా సోనాక్షి సిన్హా ‘హసీనా’ పేరున తయారయ్యే సినిమాలో దావూద్ ఇబ్రహీం చెల్లెలుగా నటించనుండగా అర్జున్ రాంపాల్ హీరోగా గ్యాంగ్స్ట్టర్ అరుణ్ గావ్లీ జీవిత కథ ఆధారంగా రూపొందనున్న సినిమా వచ్చే సంవత్సరం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో బాలీవుడ్ను ప్రభావితం చేసిన డాన్లూ, వారి వల్ల వచ్చిన సినిమాలూ క్లుప్తంగా... ఛోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ నికల్జే. 1970లలో బ్లాక్ టిక్కెట్లు అమ్ముతూ, అప్పటి ముంబై డాన్ రాజన్ నాయర్ (బడా రాజన్) అనుచరుడిగా చేరి, క్రమంగా గ్యాంగ్స్టర్గా ఎదిగాడు. 1980, 90లలో ముంబైని ఛోటా రాజన్ గడగడలాడించాడు. రాజన్ని చంపిన ప్రత్యర్థి గ్యాంగ్పై పగ తీర్చుకుని ఛోటా రాజన్గా పేరుమోశాడు. కొన్నాళ్లు దావూద్ ఇబ్రహీంతో కలిసి పని చేసిన ఛోటా రాజన్ ముంబై పేలుళ్ల తర్వాత అతడి నుంచి విభేదించి, విడిపోయాడు. చివరకు ఇది ఒకరిని మరొకరు వేటాడే పరిస్థితికి తెచ్చింది. మహేశ్ మంజ్రేకర్ ‘వాస్తవ్’, రామ్ గోపాల్ వర్మ ‘సత్య’ సినిమాలు ఛోటా రాజన్ జీవితం నుంచి తీసుకున్న శకలాల ఆధారంగా తీసినవే. ఆ తర్వాత రామ్గోపాల్ వర్మ ‘కంపెనీ’ సినిమా తీసి దావూద్, ఛోటా రాజన్ల మధ్య ఉన్న వైరాన్ని కొంచెం కల్పిత కథ ఆధారంగా చూపించాడు. ఇందులో దావూద్ను పోలిన పాత్రలో అజయ్ దేవ్గణ్, ఛోటా రాజన్ను పోలిన పాత్రలో వివేక్ ఓబెరాయ్ నటించారు. కరీమ్ లాలా అసలు పేరు అబ్దుల్ కరీమ్ షేర్ఖాన్. ఆఫ్ఘనిస్థాన్లో పుట్టాడు. 1930లలో ఇండియా వచ్చి, తోటి పఠాన్లతో ఒక గ్యాంగ్ను ఏర్పరచుకుని, సెటిల్మెంట్లు మొదలుపెట్టాడు. జూద గృహాలు నడిపాడు. బంగారం, వెండి, ఎలాక్ట్రానిక్ వస్తువులు స్మగ్లింగ్ చేశాడు. డ్రగ్స్ అమ్మాడు. ఇలాంటి ఒక డాన్ని చూడడం బొంబాయికి అదే మొదటిసారి. అప్పటికే ఫీల్డులో ఉన్న హాజీ మస్తాన్, వరదరాజన్ ముదలియార్లతో సమానంగా నగరాన్ని తన చెప్పుచేతల్లోకి తీసుకున్నాడు. 1970లలో ఈ ముగ్గురి ధాటికి ముంబై తల్లడిల్లింది. అందుకే 1974లో వచ్చిన ‘జంజీర్’ సినిమాలో లాలాను పోలిన ‘షేర్ ఖాన్’ పాత్ర మనకు కనిపిస్తుంది. దానిని ధరించిన ప్రాణ్కు చాలా పేరు వచ్చింది. 1985లో లాలా మేనల్లుడు సమద్ఖాన్ని దావూద్ ఇబ్రహీం చంపేయడంతో లాలా ప్రాభవం తగ్గడం ప్రారంభమయింది. 2002లో తొంభై ఏళ్ల వయసులో కరీమ్ లాలా చనిపోయాడు. వరదరాజన్ ముదలియార్ కమలహాసన్ ‘నాయకన్’ సినిమా స్టోరీ ముదలియార్ జీవిత కథే. తమిళనాడు తీరప్రాంతం తూత్తుక్కుడి (ట్యుటికోరన్) నుంచి ముంబై వచ్చిన ముదలి యార్ ఓడరేవు కూలీగా జీవితం ప్రారంభించాడు. కొన్నాళ్లు హాజీ మస్తాన్ సహాయంతో రేవులోని రవాణా సామగ్రిని దొంగిలించేవాడు. ఆ తర్వాత గుడుంబా కాచి అమ్మాడు. ముంబైలోని మాతుంగ, ధారవి, సయాన్-కొలివాడ ప్రాంతాల్లోని తమిళుల నాయకుడిగా ముదలియార్ చాలా గట్టి పాత్ర పోషించాడు. 1980ల మధ్యలో అతడి గ్యాంగ్ కదలికలను ప్రభుత్వం బలంగా నియంత్రించడంతో ముంబై నుంచి చెన్నై వెళ్లిపోయాడు. 1988లో మరణించాడు. మణిరత్నం తీసిన ‘నాయకన్’ సినిమా చూశాక, ముదలియార్ మీద ప్రేమ పెరగడం, ‘కొంచెం ఎక్కువ గొప్పగానే చూపించారు’ అని కామెంట్ చేయడం ఖాయం. అబు సలేమ్ ఇతడి మీద నేరుగా బాలీవుడ్ సినిమా లేకపోయినా ఇతడు బాలీవుడ్ను గడగడలాడించేడమే కాదు బాలీవుడ్ నటి మోనికా బేడీని తన ప్రియురాలిగా చేసుకున్నాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న సలేమ్ది ఉత్తర ప్రదేశ్లోని ఔరంగాబాద్. ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్గా పని చేసి ముంబై చేరుకున్నాడు. అంధేరీలో ఒక టెలిఫోన్ బూత్ నడిపి, చిన్నాచితక నేరాల వల్ల పోలీసుల రికార్డుకు ఎక్కాడు. 1980లలో దావూద్ సోదరుడు అనీస్తో పరిచయం అయ్యాక ‘గన్ రన్నర్’గా మారాడు. గన్ రన్నర్ అంటే దేశంలోకి అక్రమంగా తుపాకులను తెప్పించేవాడని అర్థం. 1993 ముంబై పేలుళ్ల నిందితులలో సలేమ్ ఒకడు. సుభాష్ ఘయ్, రాజీవ్ రాయ్ వంటి వారిని డబ్బు కోసం బెదిరించాడు. టి-సీరీస్ యజమాని గుల్షన్ కుమార్ హత్య వెనుక సలేమ్ హస్తం ఉందంటారు. 1988లో దావూద్ గ్యాంగ్ నుంచి విడిపోయి దేశం విడిచిన సలేమ్ 2002లో మోనికా బేడీతో లిస్బన్లో అరెస్ట్ అయ్యాడు. 2005లో అతడిని ఇండియాకు రప్పించారు. హాజీ మస్తాన్ జీవితంలో ఎప్పుడూ బుల్లెట్ పేల్చని మాఫియా లీడర్గా హాజీమస్తాన్ ఒక వెలుగు వెలిగాడు. అసలు పేరు మస్తాన్ హైదర్ మీర్జా. ఊరు తమిళనాడులోని పణైకుళం. ‘దీవార్’లో అమితాబ్ క్యారెక్టర్, ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయ్’లో అజయ్ దేవగణ్ క్యారెక్టర్... ఆ వెలుగును ఇప్పటికీ సన్నగిల్లకుండా ఉంచాయి! 1934లో ఎనిమిదేళ్ల వయసులో తండ్రితో కలిసి ముంబై వచ్చిన మస్తాన్ టీనేజ్ వచ్చాక ఓడ రేవులో కూలీగా చేరాడు. ఖరీదైన వాచీల స్మగ్లింగ్ మొదలు పెట్టి బంగారపు అచ్చులు, ట్రాన్సిస్టర్లు స్మగుల్ చేశాడు. ఆ తర్వాత గుడుంబాలోకి దిగాడు. అలా మస్తాన్ సంపన్నుడయ్యాడు. హిందీలో చాలా సినిమాలకు ఫైనాన్స్ చేసిన మస్తాన్ కొన్ని స్వయంగా నిర్మించాడు కూడా. మధుబాలకు గొప్ప ఫ్యాన్ అయిన హాజీ మస్తాన్ ఆమెను చేసుకోలేక, అచ్చు అలాగే ఉన్న సోనా అనే అమ్మాయిని వివాహం చేసుకుని ఆమెతోనే జీవితం గడిపాడు. 1970లలో అరెస్ట్ అయ్యాక మస్తాన్ క్షీణదశ మొదలైంది. 1994లో చనిపోయాడు. అరుణ్ గావ్లీ అరుణ్ గావ్లీ కుటుంబం మధ్య ముంబైలోని బైకులాలో ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాలకు వీళ్ల కుటుంబం పాలు పోస్తుండేది. గావ్లీ నేర కార్యకలాపాలలో దిగాక ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. 1980లలో గ్యాంగ్స్టర్ రామ్ నాయక్ ద్వారా దావూద్ ఇబ్రహీమ్కి నమ్మకస్తుడయ్యాడు. ఆ తర్వాత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకుని ఎమ్మెల్యే అయ్యాడు! 2012 నాటి ఒక నేరానికి సంబంధించి గావ్లీ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతని జీవితం ఆధారంగా అర్జున్ రామ్పాల్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోంది. దావూద్ ఇబ్రహీం మోస్ట్ నొటోరియస్! పేరు మోసిన మాఫియా డాన్. దావూద్ తండ్రి ఓ పోలీస్ కానిస్టేబుల్. హాజీ మస్తాన్ తన తండ్రిని ఎంతగా అవమాన పరిచేవాడో కళ్లారా చూస్తూ పెరిగాడు. మస్తాన్పై కసి పెంచుకున్నాడు. పథకం ప్రకారం మస్తాన్ని మించిన డాన్ అయ్యాడు. మొదట పోలీసులతో సత్సంబంధాలు పెట్టుకుని వారి సహాయంతో కరీమ్ లాలా గ్యాంగ్లో ఒక్కొక్కరినీ హతమారుస్తూ వచ్చాడు. అలా హాజీ మస్తాన్ రెక్కలు కత్తిరించాడు. భారీ నేరాలకు పాల్పడ్డాడు. బలవంతపు వసూళ్లు, హవాలా వ్యాపారం చేశాడు. 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల వెనుక పథక రచన దావూదే అంటారు. ఎస్. హుస్సేన్ రాసిన ‘బ్లాక్ ఫ్రైడే’ ఈ పేలుళ్ల మీద వచ్చిన పుస్తకమే. అదే పేరుతో అనురాగ్ కాశ్యప్ సినిమా కూడా తీశారు. దావూద్ 1984లో దుబాయ్ పారిపోయాడు. ప్రస్తుతం అతడు పాకిస్తాన్లో ఉన్నట్లు పోలీసుల దగ్గర సమాచారం ఉంది. -
నాకు నకిలీ పాస్పోర్టు ఇచ్చింది అధికారులే: రాజన్
ఉగ్రవాదులపై పోరాడేందుకు వీలుగా భారత నిఘా వర్గాలే తనకు నకిలీ పాస్పోర్టు ఇప్పించాయని మాఫియా డాన్ ఛోటా రాజన్ కోర్టులో చెప్పాడు. బ్యాంకాక్లో 16 ఏళ్ల క్రితం నుంచి దావూద్ ఇబ్రహీం మనుషులు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని.. అందుకే తనకు మోహన్ కుమార్ అనే పేరుతో పాస్పోర్టు ఇచ్చారని ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగిన విచారణలో రాజన్ వెల్లడించాడు. ఉగ్రవాదులతోను, భారత వ్యతిరేక శక్తులతోను తాను పోరాడుతున్నానని, తనకు సాయం చేసిన వాళ్ల పేర్లు ఏంటో ఇప్పుడు బయట పెట్టలేనని అన్నాడు. దేశ ప్రయోజనాల కోసమే తాను ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడానని చెప్పాడు. దాదాపు పాతికేళ్ల నుంచి ఎవరికీ చిక్కకుండా తప్పించుకుంటున్న ఛోటా రాజన్ను గత సంవత్సరం ఇండోనేసియాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముందుగా అతడిపై నకిలీ పాస్పోర్టు కలిగి ఉన్నందుకు కేసు పెట్టారు. అతడితో పాటు మరో ముగ్గురు మాజీ పాస్పోర్టు అధికారుల మీద కూడా ఈ కేసు నమోదైంది. భారతీయ నిఘా సంస్థలకు 1993 ముంబై పేలుళ్ల నిందితుల గురించి తాను సమాచారం ఇస్తున్నట్లు తెలియడంతో దావూద్ మనుషులు తనను చంపేందుకు ప్రయత్నించారని విచారణలో రాజన్ తెలిపాడు. తన అసలు పాస్పోర్టును దుబాయ్లో వాళ్లు లాగేసుకున్నారని అన్నాడు. రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే. ఉగ్రవాదులపై పోరాటం సాగించేందుకే తాను తన గుర్తింపును రహస్యంగా ఉంచాల్సి వచ్చిందని తెలిపాడు. -
ఛోటా రాజన్ హత్యకు కుట్ర, నలుగురి అరెస్ట్
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్ను హత్య చేసేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఛోటా షకీల్ గ్యాంగ్ పన్నిన కుట్రను పోలీసులు చేధించారు. రాజన్ను చంపేందుకు రంగంలోకి దింపిన నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లు రాబిన్సన్, జునైద్, యూనిస్, మనీశ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛోటా రాజన్ను కోర్టుకు తీసుకెళ్లే సమయంలో చంపాలని వీరు పథకం పన్నినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఛోటా షకీల్తో నిందితులు ఫోన్ సంభాషణలు సాగించినట్టు గుర్తించామని, అనంతరం వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు స్పెషల్ పోలీస్ కమిషనర్ (స్పెషల్ సెల్) అరవింద్ దీప్ చెప్పారు. జూన్ 3వ తేదీన వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, 5 రోజులు పోలీసుల రిమాండ్కు అప్పగించారు. విచారణ అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా, జ్యుడిషియల్ కస్టడీకి అదేశించినట్టు అరవింద్ దీప్ చెప్పారు. ఓ నిందితుడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. గతేడాది నవంబర్లో ఇండోనేసియాలో అరెస్ట్ అయిన ఛోటా రాజన్ను భారత్కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
జైల్లో ఉన్నా.. ఆ డాన్ను లేపేస్తామంటున్నారు?
న్యూఢిల్లీ: గత ఏడాది అక్టోబర్లో ఇండోనేషియాలో పట్టుబడ్డ అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ప్రస్తుతం తీహార్ జైలులో అత్యంత భద్రత మధ్య ఉన్నాడు. అయినా అతడికి చావు బెదిరింపులు ఆగడం లేదు. ఛోటా రాజన్ను చంపేస్తామంటూ తాజాగా దావూద్ ఇబ్రహీం నమ్మిన బంటు, గ్యాంగ్స్టర్ ఛోటా షకీల్ తీహార్ జైలు సీనియర్ అధికారికి ఎస్సెమ్మెస్ చేశాడు. ఈ బెదిరింపు మెసేజ్ నేరుగా ఛోటా షకీల్ మొబైల్ ఫోన్ నుంచే వచ్చినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్కు మంరిత అదనపు భద్రత కల్పించాలని జైలు అధికారులు నిర్ణయించారు. 971504265138 సెల్ నంబర్ నుంచి తీహార్ జైలు లా అధికారి సునీల్ గుప్తాకు ఇటీవల ఓ ఎస్సెమ్మెస్ వచ్చింది. ఛోటా రాజన్ను అతిత్వరలోనే అంతం చేస్తామని ఆ ఎస్సెమ్మెస్ బెదిరించింది. ఆ వెంటనే తీహార్ జైలు ల్యాండ్లైన్ నంబర్ ఓ కాల్ కూడా వచ్చింది. అందులోనూ రాజన్ ను చంపేస్తామని బెదిరించారు. ఈ నేపథ్యంలో రాజన్కు మరింత భద్రత పెంచిన జైలు సిబ్బంది.. ఈ బెదిరింపుల గురించి పోలీసులకు సమాచారమిచ్చారు. -
చోటా రాజన్పై సీబీఐ తొలి చార్జిషీటు
న్యూఢిల్లీ: నకిలీ పాస్పోర్టు కేసులో గ్యాంగ్స్టర్ చోటా రాజన్పై తొలి చార్జిషీట్ను సీబీఐ మంగళవారం దాఖలు చేసింది. రాజన్ సహా ముగ్గురు మాజీ పాస్పోర్టు ఉద్యోగులనూ నిందితులుగా పేర్కొంది. బెంగళూరు పాస్పోర్టు ఆఫీసుఉద్యోగులు రాజన్కు తప్పుడు అడ్రస్తో పాస్పోర్టు మంజూరవడానికి సాయపడ్డారని సీబీఐ పటియాలా హౌస్ కోర్టులో వె ల్లడించారు. -
ఛోటారాజన్కు ప్రాణభయం.. వీడియో కాన్ఫరెన్సుతో విచారణ!
ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న మాఫియాడాన్ ఛోటా రాజన్కు ప్రాణభయం విపరీతంగా పట్టుకుంది. అతడిని తాము చంపేయడం ఖాయమని డి-గ్యాంగులోని నెం.2 ఛోటా షకీల్ బహిరంగంగా హెచ్చరించాడు. దాంతో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నా కూడా.. తన ప్రాణాలకు గ్యారంటీ లేదని ఛోటా రాజన్కు అర్థమైపోయింది. కోర్టుకు వెళ్లే సమయంలోను, కోర్టు హాల్లో కూడా చంపడం ముంబై మాఫియా గ్యాంగులకు వెన్నతో పెట్టిన విద్య. అలాగే తనను కూడా హతమారుస్తారన్న భయంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని కోరాడు. దాన్ని జడ్జి కూడా ఆమోదించారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక జడ్జి వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మోకా కోర్టులో విచారణ సాగుతుండటంతో రాజన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేందుకు అనుమతించాలని సీబీఐ కోరింది. తీహర్ జైలు సూపరింటెండెంట్ కూడా ఈ మేరకు ఇంతకుముందే సీబీఐకి ఓ లేఖ రాశారు. ఆర్థర్ రోడ్డు జైలు ప్రాంగణంలో ఉన్న మోకా కోర్టుకు రాజన్ హాజరు కావాల్సి ఉంది. అయితే అతడిని నేరుగా ప్రవేశపెట్టాలంటే ప్రాణాలకు ముప్పు కాబట్టి, వీడియో కాన్ఫరెన్సు ద్వారానే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం నకిలీ పాస్పోర్టు కేసులో మాత్రమే ఛోటా రాజన్ అరెస్టయ్యాడు. ముంబైకి చెందిన ప్రముఖ జర్నలిస్టు జె డే హత్యకేసులో కూడా రాజన్పై ప్రొడక్షన్ వారంటు ఉంది. ఛోటా రాజన్ ఇప్పుడు చచ్చిన పాముతో సమానమని, అతడిని తాము ప్రత్యర్థిగా భావించడంలేదని ఇంతకుముందు దావూద్ ఇబ్రహీం పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఛోటా షకీల్ చెప్పాడు. అయితే అతడిని తీహార్ జైల్లోనే తాము లేపేయడం ఖాయమని స్పష్టం చేశాడు. ఇంతకుముందు కూడా రాజన్ను హతమార్చేందుకు ప్రయత్నించామని, అయితే అతడు తృటిలో తప్పించుకున్నాడని చెప్పాడు. -
ఛోటా రాజన్ ఎఫ్ఐఆర్ వివరాలివ్వలేం: సీబీఐ
న్యూఢిల్లీ: ఛోటా రాజన్ తప్పుడు ధ్రువపత్రాలిచ్చి అవినీతి మార్గంలో పాస్పోర్ట్ తీసుకున్న కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలివ్వడానికి సీబీఐ నిరాకరించింది. దీనికి ఆర్టీఐ నుంచి మినహాయింపుందని.. దరఖాస్తు చేసిన వెంకటేశ్ నాయక్కు తెలిపింది. అయితే ఆర్టీఐ నుంచి మినహాయింపు ఉన్నా.. అవినీతి ఆరోపణలొస్తే.. వివరాలు ఇవ్వాల్సిందేనని నాయక్ చెబుతున్నారు. -
సీబీఐకి జే.డే హత్యకేసు దర్యాప్తు
ముంబయి: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సీనియర్ పాత్రికేయులు జే. డే(జ్యోతిర్మయ్ డే) హత్య కేసు దర్యాప్తును సీబీఐ మంళవారం చేపట్టింది. ఛోటారాజన్ పై ఉన్న అన్ని కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడంతో ఈ కేసు కూడా సీబీఐకి బదిలీ అయింది. జర్నలిస్ట్ జ్యోతిర్మయ్ డే హత్య కేసు సహా ఛోటారాజన్ పై 70 కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినీ విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాన్ని బాంబే హైకోర్టు ఏర్పాటు చేసింది. జ్యోతిర్మయ్ డే హత్య కేసులో పది మంది నిందితులపై ప్రత్యేక కోర్టు అభియోగాలు నమోదు చేసింది. వీరిలో మహిళా జర్నలిస్టు జిగ్నా వోరా కూడా ఉన్నారు. 2011 జూన్ 11న సుబర్బన్ పొవాయ్ ప్రాంతంలో ఉదయం పూట రెండు మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు జ్యోతిర్మయి డేపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయారు. ఈ కేసులో జిగ్నా వోరాను అదే సంవత్సరం నవంబర్ నెలలో అదుపులోకి తీసుకొని విచారించగా కీలక ఆధారాలు బయటపెట్టింది. వాటి ఆధారంగా పదిమందిపై అభియోగాలు నమోదుచేశారు. మాఫియా డాన్ చోటా రాజన్ కు వ్యతిరేకంగా అనేక ఆర్టికల్స్ రాశారనే కారణంతో జేడేను హతమార్చినట్లు ప్రాథమిక దర్యాప్తు ద్వారా తెలుస్తోంది. మిడ్ డే అనే పత్రికకు జే డే ఎడిటర్గా పనిచేశారు. -
'జైల్లోనే ఛోటా రాజన్ను చంపేస్తాం'
మాఫియా డాన్ ఛోటా రాజన్ను తిహార్ జైల్లోనే హతమారుస్తామని మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుడిభుజం ఛోటా షకీల్ హెచ్చరించాడు. శనివారం దావూద్ 60వ బర్త్ డే సందర్భంగా ఛోటా షకీల్ ఓ జాతీయ వెబ్సైట్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. దావూద్ బర్త్ డే వేడుకలు, డి గ్యాంగ్ వ్యవహారాలు, ఛోటా రాజన్తో విరోధం తదితర విషయాల గురించి మాట్లాడాడు. ఛోటా రాజన్ చచ్చిన పాముతో సమానమని ఛోటా షకీల్ అన్నాడు. 'రాజన్ను మేం ప్రత్యర్థిగా భావించడం లేదు. మాకు వ్యతిరేకంగా అతను నిలబడలేడు. ప్రస్తుతం అతడు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజన్ను తిహార్ జైల్లోనే చంపేస్తాం. అతణ్ని చంపేందుకు గతంలో పలుమార్లు ప్రయత్నించాం. అయితే కొద్దిలో తప్పించుకున్నాడు. ఈ రోజు కాకపోతే రేపయినా రాజన్ను హతమారుస్తాం' అని ఛోటా షకీల్ చెప్పాడు. బాలిలో రాజన్ను అరెస్ట్ చేసిన ఇండోనేసియా పోలీసులు అతణ్ని భారత్కు అప్పగించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్లో రహస్య జీవితం గడుపుతున్న దావూద్ ఘనంగా బర్త్ డే వేడుకలు చేసుకుంటున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఛోటా షకీల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక డి గ్యాంగ్ నుంచి దావూద్ వైదొలిగి మరొకరికి బాధ్యతలు అప్పగించనున్నట్టు వచ్చిన వార్తలు కూడా వాస్తవం కాదని వెల్లడించాడు. 'దావూడ్ భాయ్ ఎప్పటికి రిటైర్ కాడు. ఎప్పటికి అతనే మాకు బాస్. అతడి స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఎవరికీ లేదు' అని ఛోటా షకీల్ చెప్పాడు. -
'దావూద్ను పట్టుకోవడం అంత ఈజీ కాదు'
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడం అంత సులభం కాదని, ఎందుకంటే అతను మన శత్రు దేశం రక్షణలో ఉన్నాడని ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీరజ్కుమార్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఇటీవల అరెస్టైన దావూద్ బద్ధ విరోధి, గ్యాంగ్స్టర్ ఛోటారాజన్ కూడా చేసే సాయమేమీ లేదని ఆయన చెప్పారు. 'దావూద్ పట్టుకోగలమని మేం చెప్పలేం. ఎందుకంటే పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కనుసన్నలో అతను ఉండటం. అతన్ని పట్టితేవాలన్న రాజకీయ చిత్తశుద్ధి మన దేశానికి లేకపోవడం. శత్రుదేశం రక్షణలో ఉండటం వల్లే అతను ఇంకా మనకు పట్టుబడకుండా ఉండగలుగుతున్నాడు. పరారీలో ఉన్న అతన్ని పట్టుకోవడం అంత సులభమేమీ కాదు' అని ఆయన చెప్పారు. నీరజ్కుమార్ 'డయల్ ఫర్ డాన్' పేరిట రాసిన పుస్తకాన్ని ముంబైలో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నీరజ్కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తే దావూద్ను భారత్కు తీసుకొచ్చి శిక్షించే అవకాశముంటుందని చెప్పారు. 1990లలో దావూద్ లొంగిపోవడానికి ముందుకొచ్చాడని నీరజ్కుమార్ తన పుస్తకంలో వెల్లడించడం.. ఇటీవల మీడియా పతాక శీర్షికలకు ఎక్కిన సంగతి తెలిసిందే. దావూద్తో తాను మూడుస్లారు ఫోన్లో సంభాషించానని, చివరిసారిగా తాను రిటైర్మెంట్కు ముందు 2013లో అతని నాకు ఫోన్ చేశాడని ఆయన వివరించారు. -
తీహార్ జైలుకు భద్రత పెంపు
న్యూఢిల్లీ: మాఫియా డాన్ ఛోటా రాజన్ ను తరలించడంతో తీహార్ జైలుకు భద్రత పెంచారు. ఛోటా రాజన్ ను ఉంచిన తీహార్ జైలు 2 పరిసరాల్లో అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి అంగుళం కవరయ్యేవిధంగా కెమెరాలు పెట్టారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో రాజన్ ను గురువారం తీహార్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో 10 మంది హెడ్ వార్డర్స్, 10 మంది వార్డర్స్, ఒక డిప్యూటీ సూపరిండెంటెంట్, ఇద్దరు అసిస్టెంట్ సూపరిండెంటెంట్స్ తో భద్రత ఏర్పాటు చేసినట్టు జైలు డీజీ తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి భద్రత ఉల్లంఘన జరిగినా సహించబోమని సిబ్బందిని హెచ్చరించినట్టు చెప్పారు. జైలు బయట ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ బలగాలను మొహరించినట్టు వెల్లడించారు. ఛోటా రాజన్ పై నమోదైన 71 కేసులపై సీబీబీ దర్యాప్తు జరుపుతోంది. -
తీహార్ జైలుకు చోటా రాజన్
ఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ను అధికారులు బుధవారం తీహార్ జైలుకు తరలించారు. సీబీఐ విచారణ అనంతరం ఛోటారాజన్కు కస్టడీని పొడిగించిన న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తిరిగి డిసెంబర్ 3న కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా స్పెషల్ జడ్జి ఓపి సైనీ ఆదేశించారు. కాగా, ఫేక్ పాస్ పోర్టు కేసులో సుదీర్ఘకాలంగా తప్పించుకు తిరుగుతున్న మాఫియా డాన్ రాజేంద్ర సదాశివ్ నిఖల్జీ అలియాస్ చోటారాజన్పై హత్యకేసు, డ్రగ్స్, సహా 85 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా వున్నాడు. అయితే ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర గుజరాత్, పోలీసుల నుంచి 71 కేసులను సీబీఐ విచారణకు స్వీకరించింది. ఇండోనేషియాలో పట్టుబడ్డ చోటా రాజన్ను ఇంటర్పోల్ సహాయంతో ప్రత్యేక విమానంలో అధికారులు భారత్కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. -
ఛోటా రాజన్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: మాఫియా డాన్ ఛోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ నికల్జేను మరో నాలుగు రోజులు సీబీఐ కస్టడీకీ అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. గత అక్టోబర్ 25న ఇండోనేసియాలోని బాలీలో అరెస్టయిన ఛోటా రాజన్ను నవంబర్ 6న భారత్కు తరలించిన సీబీఐ అధికారులు ఢిల్లీలోనే ఉంచి విచారిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం నాటికి కస్టడీ గడువు ముగియడంతో అధికారులు.. ఢిల్లీ సీబీఐ కోర్టు ఎదుట ఛోటాను హాజరుపర్చారు. ఈ నెల 19 వరకు రాజన్ను సీబీఐ కస్టడీకి అప్పగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఛోటా రాజన్ ను సీబీఐ ప్రధాన కార్యాలయంలోని ప్రత్యేక సెల్లో ఉంచి విచారిస్తున్నారు. కాగా, గత శుక్రవారం రాజన్ను ఆయన సోదరీమణులు కలుసుకున్నారు. 'భాయ్ దూజ్' పండుగ సందర్భంగా తమ సోదరుణ్ని కలుసుకునేందుకు అనుమతించాలని రాజన్ సోదరీమణులు కోర్టును అభ్యర్థించడంతో ఆమేరకు అనుమతి లభించింది. ముంబై, ఢిల్లీ నగరాల్లో చోటుచేసుకున్న 80 కేసుల్లో ప్రధాని నిందితుడిగా ఉన్న ఛోటా రాజన్.. భారత్ నుంచి పారిపోయి 27 ఏళ్లపాటు విదేశాల్లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. -
'మా అన్నను కలుస్తాం.. అనుమతించరూ..'!
న్యూఢిల్లీ: ఇండోనేషియాలోని బాలిలో అరెస్టయి ప్రస్తుతం ఢిల్లీలో సీబీఐ అధికారుల అదుపులో ఉన్న చోటా రాజన్ను కలిసేందుకు ఆయన సోదరిమణులు వచ్చారు. శుక్రవారం తన సోదరుడిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన ఇద్దరు సోదరీలు సీబీఐ కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అండర్వరల్డ్ డాన్, గ్యాంగ్స్టర్ అయిన చోటా రాజన్ ను అరెస్టు చేసేందుకు ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో అతడిని ఇండోనేషియాలోని ప్రముఖ పర్యాటక ద్వీపం బాలిలో ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి బాలికి వచ్చిన రాజన్ను ఆస్ట్రేలియా పోలీసులిచ్చిన సమాచారంతో బాలి విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. అంతర్జాతీయంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్లో ఒకడైన రాజన్ మరో ప్రముఖ డాన్ దావూద్ ఇబ్రహీంకు ఒకప్పుడు కుడిభుజం.. దావూద్ డీ కంపెనీలో నంబర్ 2 పొజిషన్ లో ఉన్నాడు. అయితే 1993 ముంబై పేలుళ్ల అనంతరం దావూద్కు, డీ కంపెనీకి ప్రధాన ప్రత్యర్థిగా మారాడు. -
ముంబై డాన్కు కర్ణాటకలో పాస్పోర్టు!
మాఫియా డాన్ ఛోటా రాజన్కు మోహన్ కుమార్ అనే పేరుతో నకిలీ పాస్పోర్టు ఉండటం వల్లే అతడు పట్టుబడ్డాడు. అయితే ఆ పాస్పోర్టులో అతడి చిరునామా, పుట్టిన స్థలం మాత్రం ఎక్కడున్నాయో తెలుసా.. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో! ఇదెలా సాధ్యమయ్యిందో తెలియక పోలీసులు తల పట్టుకుంటున్నారు. ఇండోనేషియాలోని బాలిలో అరెస్టయిన ఛోటా రాజన్.. పి. మోహన్ కుమార్ అనే పేరుతో పాస్పోర్టు తీసుకున్నాడు. అందులో అతడి చిరునామా ఓల్డ్ ఎంసీ రోడ్, ఆజాద్ నగర్, మాండ్యా అని ఉంది. పాస్పోర్టు నంబరు జి9273860. ఇది 2008లో జారీ అయ్యింది. తాను మాండ్యాలోనే పుట్టినట్లు కూడా అందులో ఉంది. ఈ పాస్పోర్టు ఉపయోగించి ఎక్కువగా ఆస్ట్రేలియా, ఆఫ్రికాల మధ్య ఛోటా రాజన్ తిరిగాడు. ఛోటారాజన్ నకిలీ పాస్పోర్టుతో తిరుగుతున్నట్లు అందరూ చెబుతున్నా, మాండ్యా పోలీసులు మాత్రం అబ్బే కాదంటున్నారు. నిజంగానే అక్కడ ఒక పాత ఎంసీ రోడ్డు, ఆజాద్ నగర్ ఉన్నాయి. దాంతో పోలీసులతో కుమ్మక్కు కావడం వల్లే ఈ పాస్పోర్టు సంపాదించగలిగాడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మాండ్యా వెస్ట్ పోలీసు స్టేషన్ పరిధిలోకి రాజన్ ఇచ్చిన చిరునామా వస్తుంది. కానీ అక్కడ మోహన్ కుమార్ అనే పేరుతో ఎవరూ లేరని స్పష్టమైంది. ఈ ఆధారాలతో రాజన్ మీద మొదటి కేసును డీల్ చేయాలని సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి. -
రాజన్ను త్వరలోనే లేపేస్తాం
మాఫియా డాన్, దావూద్ ఇబ్రహీం కుడి భుజం లాంటి ఛోటా షకీల్ నోరు విప్పాడు. త్వరలోనే తాము ఛోటా రాజన్ను లేపేయడం ఖాయమని స్పష్టం చేశాడు. పాతికేళ్లుగా తమ డి కంపెనీకి ఛోటా రాజన్తో శత్రుత్వం ఎందుకు ఉందో కూడా తెలిపాడు. 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల నిందితుల్లో ఆరుగురిని ఛోటా రాజన్ గ్యాంగు చంపేసింది. 1998-2001 మధ్య ఈ హత్యలు జరిగాయి. దాన్ని తాము ఈరోజు వరకు జీర్ణించుకోలేకపోతున్నట్లు షకీల్ చెప్పాడు. బాలిలో రాజన్ అరెస్టు అయినప్పటి నుంచి మళ్లీ రెండు దశాబ్దాల నాటి పాత పగలను గుర్తుకు తెచ్చుకున్నామన్నాడు. అప్పట్లో రాజన్ గ్యాంగు హతమార్చినవాళ్లలో యాకూబ్ యేడా సోదరుడు మజీద్ ఖాన్ ఒకడు. అతడు దావూద్ ఇబ్రహీంతో పాటు ఛోటా షకీల్కు కూడా బాగా సన్నిహితుడు. ఈ హత్యలో రాజన్కు పోలీసులు కూడా సహకరించారని షకీల్ అంటున్నాడు. ఇప్పటికే డి కంపెనీ కోర్టులో రాజన్కు మరణశిక్ష విధించామని, ఈ హత్యల కారణంగా త్వరలోనే రాజన్ను చంపడం ఖాయమని స్పష్టం చేశాడు. త్వరలోనే అవకాశం రావాలని అల్లాను కోరుకుంటున్నట్లు చెప్పాడు. సీబీఐ వాళ్లు రాజన్ను ముంబై పోలీసులకు అప్పగించడానికి నిరాకరించడంపై కూడా ఛోటా షకీల్ వ్యాఖ్యానించాడు. ''రాజన్ ఏమైనా వాళ్లకు చుట్టమా.. అందుకే ముంబై పోలీసులకు అప్పగించలేదా? కేసులన్నీ ముంబైలోనే కదా ఉన్నవి.. ఆరుగురు నిర్దోషులను చంపేశాడు. ఆ కేసులు కూడా ముంబై పోలీసుల వద్దే ఉన్నాయి. ఈ హత్యల వల్లే అతడికి దేశభక్తుడన్న పేరు వచ్చేసింది'' అని ఛోటా షకీల్ అన్నాడు. -
ఛోటా రాజన్కు 10 రోజుల సీబీఐ కస్టడీ
న్యూఢిల్లీ: నకిలీ పాస్పోర్టు కేసులో మాఫియా డాన్ ఛోటా రాజన్కు కోర్టు 10 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. భద్రతా కారణాల నేపథ్యంలో శనివారం సీబీఐ ప్రధాన కార్యాలయంలోనే కోర్టు విచారణ జరిపింది. అనంతరం మేజిస్ట్రేట్ అతణ్ని సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. నకిలీ పాస్పోర్టుతో దేశం విడిచిపారిపోయినందుకు రాజన్పై సీబీఐ రెండు కేసులు నమోదు చేసింది. ఇందులో ఒక కేసును అతడిని తీసుకురావడానికి మలేసియా వెళ్లే ముందు కిందటి నెల 31న నమోదు చేసింది. ఈ కేసులోనే కోర్టు అతడికి సీబీఐ కస్టడీ విధించింది. గతనెల 25న ఆస్ట్రేలియా నుంచి ఇండోనేసియాకు వచ్చిన రాజన్ను బాలిలో పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం బాలి నుంచి సీబీఐ అధికారులు రాజన్(అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే)ను ఢిల్లీకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రాజన్ నకిలీ పాస్పోర్టులో తండ్రి పేరుగా రాజన్ పేరే ఉంది. ఇండోనేసియా నుంచి ఢిల్లీకి రాజన్ను తరలించాక అతని నుంచి అధికారులు సేకరించిన వాటిలో ఈ పాస్పోర్టు ఉంది. -
అసలు పేరు చెప్పి దొరికిపోయాడు!
మాఫియా డాన్ ఛోటా రాజన్ ఎలా పట్టుబడ్డాడన్నది ఇప్పటివరకు సరిగ్గా వెలుగులోకి రాలేదు. నిజానికి బాలిలో విమానం దిగిన తర్వాత అక్కడి అధికారులకు తన పేరును పాస్పోర్టు మీద ఉన్న 'మోహన్ కుమార్' అని కాకుండా, తన అసలు పేరైన 'రాజేంద్ర నికల్జే' అని చెప్పాడట. దాంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, ఇంటర్పోల్ వర్గాలు విచారించాయి. అతడి వేలిముద్రలు, ఇతర వివరాలు తమ వద్ద ఉన్న డేటాలో ఛోటా రాజన్ వివరాలతో సరిపోవడంతో భారతదేశంలో ఉన్న ఇంటర్పోల్ అధికారులకు బాలి ఇంటర్పోల్ అధికారులు ఈ విషయం చెప్పారు. రాజన్ కేసు విచారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సీబీఐ బృందం వెంటనే బాలి వెళ్లి, రాజన్ను వెంట పెట్టుకుని తీసుకొచ్చింది. కోర్టులో సీబీఐ వర్గాలు అతడిని ప్రవేశపెట్టగా, కోర్టు ఐదు రోజుల సీబీఐ కస్టడీకి రాజన్ను పంపింది. ఢిల్లీలో దిగిన కాసేపటికే సీబీఐ వర్గాలు ఛోటా రాజన్ను అరెస్టు చేశాయి. నకిలీ పత్రాల ఆధారంగా పాస్పోర్టు తీసుకున్న నేరంలో ముందుగా అరెస్టు చేశారు. మోహన్ కుమార్ అనే పేరుతో రాజన్కు పాస్పోర్టు ఉంది. దీంతో పాస్పోర్టు చట్టం ప్రకారం మోసం, ఫోర్జరీ తదితర నేరాలకు గాను అతడిని అరెస్టు చేశారు. ముంబై పోలీసులు ఇంకా అధికారికంగా రాజన్ మీద ఉన్న కేసులను ఢిల్లీ పోలీసులకు బదిలీ చేయాల్సి ఉంది కాబట్టి, అరెస్టు చేయడానికి తక్షణ కారణం వెతుక్కోవాల్సి వచ్చింది. శనివారం నుంచి ఈ ఐదు రోజుల్లో రాజన్ను సీబీఐ వర్గాలు ఇంటరాగేట్ చేస్తాయి. ఇప్పటివరకు ముంబై పోలీసులలో ఎవరెవరు దావూద్ ఇబ్రహీం కోసం పనిచేస్తున్నారో వాళ్ల పేర్లు వెల్లడించలేదు కాబట్టి దాని కోసమే ముందుగా దర్యాప్తు సాగొచ్చని తెలుస్తోంది. -
పేర్లు బయటపెట్టిన ఛోటా రాజన్?
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో ఇప్పటికీ సంబంధాలున్న ముంబై పోలీసు అధికారుల పేర్లను ఛోటా రాజన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ముంబై పోలీసులలో చాలామంది దావూద్తో కుమ్మక్కయ్యారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజన్ చెప్పడంతో అతడిని ముంబై కాకుండా ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న రాజన్.. ముంబై పోలీసులలో ఎవరెవరికి దావూద్తో సంబంధాలు ఉన్నాయో వాళ్ల పేర్లన్నీ బయటపెట్టాడని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. రాజన్ మీద హత్యలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, డ్రగ్స్ అక్రమ రవాణా లాంటి 75కు పైగా నేరారోపణలు ఉన్నాయి. అయితే, రాజన్ అక్కడ బాలిలో విమానం అలా ఎక్కాడో లేదో.. ముంబై పోలీసు కమిషనర్ అహ్మద్ జావేద్ ప్రెస్మీట్ పెట్టి, మొత్తం అతడిమీద ఉన్న కేసులన్నింటినీ సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. -
ఛోటాకు బడా సెక్యూరిటీ
-
లాఠీ లాక్కుని.. కానిస్టేబుళ్లనే కొట్టి!
(వెబ్సైట్ ప్రత్యేకం) అది ముంబై చెంబూరు ప్రాంతంలోని సహకార్ థియేటర్. 1979వ సంవత్సరం.. కొంతమంది కుర్రాళ్లు బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారు. నగరవ్యాప్తంగా బ్లాక్ టికెట్ల దందా మీద విరుచుకుపడుతున్న ముంబై పోలీసులు.. సహకార్ థియేటర్ వద్ద కూడా లాఠీలు విదిలించారు. అంతలో అక్కడ బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్లలో ఓ కుర్రాడు వచ్చి, ఓ కానిస్టేబుల్ వద్ద లాఠీ లాక్కుని ఐదుగురు పోలీసులను బాగా కొట్టాడు. వాళ్లలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి కూడా. ఆ ఒక్క సంఘటనతో ముంబైలోని గ్యాంగుల కళ్లు ఆ కుర్రాడి మీద పడ్డాయి. అతడి పేరు రాజేంద్ర సదాశివ్ నిఖల్జే. చాలామంది పిలిచినా అతడు మాత్రం రాజన్ నాయర్ అనే మాఫియా డాన్ గ్యాంగులోకే వెళ్లాడు. రాజన్ నాయర్ను అంతా బడా నాయర్ అని పిలిచేవాళ్లు. తమిళనాడు నుంచి ముంబై వెళ్లిన బడా నాయర్.. తొలిరోజుల్లో టైప్ రైటర్లు దొంగతనం చేసేవాడు. ఓసారి పోలీసులు చోర్బజార్లో అతడిని అరెస్టు చేసి రకరకాల కేసులు పెట్టి మూడేళ్ల పాటు జైల్లో ఉంచడంతో.. జైలే నాయర్ను మాఫియా డాన్గా మార్చింది. బడా నాయర్కు మొదట్లో నమ్మకస్తుడిగా ఉండే కుంజు అహ్మద్ అనే వ్యక్తి అతడిని మోసం చేసి, వేరే గ్యాంగు పెట్టుకోవడమే కాక.. నాయర్ ఎంతగానో ప్రేమించిన యువతిని ఎత్తుకెళ్లిపోయాడు. ఆ తర్వాత రాజేంద్ర నిఖల్జే ఈ గ్యాంగులో చేరి.. నాయర్కు బాగా నమ్మకస్తుడిగా మారాడు. ఎత్తు కూడా తక్కువగా ఉండటంతో అందరూ అతడిని ఛోటా రాజన్ అని పిలిచేవాళ్లు. కొన్నాళ్ల తర్వాత కుంజు చేతిలో బడా రాజన్ హత్యకు గురయ్యాడు. దాంతో ఛోటారాజన్ ఆదేశాల మేరకు ముంబైలో బంద్ పాటించారు. అప్పటికి శివసేన లాంటి పార్టీలు కూడా ఇంకా బంద్ పిలుపు ఇచ్చేవి కావు. బంద్ విజయవంతం కావడంతో ఛోటా రాజన్ పేరు మాఫియా వర్గాల్లో కూడా అందరికీ బాగా తెలిసింది. తర్వాత కుంజును హతమార్చేందుకు అతడు వేసిన ప్లాన్లు, వాటిని అమలుచేసిన తీరు.. ఇవన్నీ దావూద్ ఇబ్రహీం దృష్టిని ఆకట్టుకున్నాయి. దాంతో ఛోటా రాజన్కు దావూద్ అడ్డా అయిన 'ముసాఫిర్ఖానా' నుంచి పిలుపు వచ్చింది. దావూద్ గ్యాంగ్ నుంచి ఆహ్వానం అందడమంటే చిన్న విషయం కాదు కాబట్టి వెంటనే మారు మాట్లాడకుండా వెళ్లి చేరిపోయాడు. దావూద్ అండదండలకు తోడు తన తెలివితేటలతో కుంజును అతడి సొంత ప్రాంతంలోనే హతమార్చాడు ఛోటా రాజన్. అప్పటి నుంచి దావూద్కు నమ్మకస్తుడైన అనుచరుడిగా మారిపోయాడు. ఆ గ్యాంగులో ప్రముఖుడిగా కూడా ఎదిగాడు. కానీ తర్వాతి కాలంలో దావూద్తో విభేదాలు తలెత్తి, వేరే సొంత గ్యాంగు పెట్టుకోవడమే కాక.. దావూద్ మనుషులను చంపించడంలో కూడా ముందడుగు వేశాడు. 27 ఏళ్ల క్రితం దేశం విడిచి పారిపోయి వివిధ దేశాల్లో రకరకాల వ్యాపారాలు చేస్తూనే ముంబైలో తన మాఫియా సామ్రాజ్యాన్ని కూడా నడిపించాడు. దావూద్ మనుషులను హతమార్చడంతో దేశభక్త డాన్ అనే ముద్ర కూడా సంపాదించాడు. చివరకు ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారంతో ఇంటర్పోల్ వర్గాలు బాలిలో అరెస్టు చేయడంతో ఇన్నాళ్లకు మళ్లీ ఢిల్లీ చేరుకున్నాడు. -కామేశ్వరరావు పువ్వాడ -
భారత్కు డాన్ ఛోటా రాజన్
-
ఛోటా రాజన్ వచ్చేది నేడు ఉదయమే!
నేడు ఉదయం ఢిల్లీకి... బాలి/న్యూఢిల్లీ: మాఫియా డాన్ చోటా రాజన్ను సీబీఐ, ఢిల్లీ, ముంబై పోలీసు అధికారులతో కూడిన బృందం భారత్కు తీసుకువస్తోంది. రాజన్తో ఇండోనేసియాలోని బాలి నుంచి గురువారం(భారత కాలమానం ప్రకారం) రాత్రి 7.45 గంటలకు బయల్దేరిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకోనుంది. దగ్గర్లోని అగ్ని పర్వతం బద్ధలై, పొగ, బూడిద కమ్ముకోవడంతో బాలి విమానాశ్రయాన్ని మూసేయడంతో రాజన్ తరలింపు ఆలస్యమైంది. పోలీసుల వేట తీవ్రం కావడంతో 1988లో రాజన్ దుబాయి పారిపోయాడు. అక్టోబర్ 25న ఆస్ట్రేలియా నుంచి బాలికి వచ్చిన రాజన్ను ఇండోనేసియా పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. భారత్లో రాజన్పై హత్య, స్మగ్లింగ్, బలవంతపు వసూళ్లు తదితర 75కు పైగా కేసులున్నాయి. వాటిలో దాదాపు 70 ముంబైలోనే నమోదై ఉన్నాయి. టాడా, ఉగ్రవాద నిరోధక చట్టం, మోకా తదితర కఠిన చట్టాల కింద ఆయనపై కేసులున్నాయి. కాగా, రాజన్పై ఉన్న అన్ని కేసులను సీబీఐకి అప్పగిస్తున్నట్లు గురువారం మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. అంతర్జాతీయ నేరాల విచారణలో సీబీఐకి ఉన్న నైపుణ్యాన్ని, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి కేపీ బక్షి తెలిపారు. రాజన్కు, కేంద్ర భద్రతాసంస్థలకు మధ్య కుదిరిన ఒప్పందం మేరకే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ ఒప్పందంలో భాగంగా.. ముంబైలో తనపై ఉన్న కేసుల విచారణను ముంబై పోలీసుల నుంచి తప్పించాలని, తనను మహారాష్ట్ర జైళ్లో పెట్టకూడదని రాజన్ షరతులు విధించినట్లు తెలిపాయి. అయితే, రాజన్ను త్వరలో ముంబైకి తీసుకువస్తామని ముంబై పోలీస్ కమిషనర్ జావేద్ అహ్మద్ స్పష్టం చేయడం విశేషం. రాజన్ హస్తం ఉందని భావిస్తున్న జర్నలిస్ట్ జ్యోతిర్మయి డే హత్యకు సంబంధించిన కేసుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో ఆస్ట్రేలియాలోని భారతీయ దౌత్య కార్యాలయం నుంచి రాజన్ పొందిన పాస్పోర్ట్ను భారత్ రద్దు చేసింది. దీనిపై విచారణకు ఆదేశించింది. తప్పుడు ధ్రువపత్రాలతో పాస్పోర్ట్ పొందిన ఘటనలు సాధారణమేనని, అయితే, తమ దృష్టికి వచ్చిన వాటిపై చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ పేర్కొన్నారు. ఒకప్పుడు అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ప్రధాన అనుచరుడైన ఛోటా రాజన్.. 1993 ముంబై పేలుళ్లను వ్యతిరేకించి ‘డీ’ గ్యాంగ్కు దూరమయ్యాడు. అనంతరం దావూద్ ఇబ్రహీంకు ప్రధాన శత్రువుగా మారాడు. -
ఛోటారాజన్.. వచ్చేస్తున్నాడు!
-
ఛోటారాజన్.. వచ్చేస్తున్నాడు!
బాలి: మాఫియా గ్యాంగ్స్టర్ ఛోటారాజన్తోపాటు సీబీఐ అధికారుల బృందం గురువారం సాయంత్రం బాలి విమానాశ్రయానికి చేరుకుంది. రాత్రిలోగా అతన్ని ఢిల్లీకి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. క్విక్ రెస్పాన్స్ టీమ్ను రంగంలోకి దించారు. ఢిల్లీకి ఛోటారాజన్ను తరలించిన అనంతరం మొదట సీబీఐ అధికారులు విచారించనున్నారు. ముంబై అండర్ వరల్డ్ మాఫియా కార్యకలాపాలు, దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన సమాచారాన్ని అతని నుంచి తెలుసుకున్న తర్వాత అతన్ని ముంబై పోలీసులకు అప్పగించే అవకాశముంది. ఇండోనేషియా రాజధాని బాలిలో అరెస్టయిన ఛోటారాజన్ను ఇప్పటికే భారత్కు తరలించాల్సి ఉంది. అయితే స్థానికంగా ఉన్న అగ్నిపర్వతం నుంచి పొగ వస్తుండటంతో రెండురోజులపాటు బాలి విమానాశ్రయాన్ని మూసివేయడంతో అతని తరలింపులో జాప్యం జరిగిన సంగతి తెలిసిందే. ఛోటారాజన్ తరలింపు విషయమై ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ అతను త్వరలోనే భారత్లో ఉంటాడని చెప్పారు. -
ఛోటా తరలింపు వాయిదా
-
ఛోటా తరలింపు వాయిదా
బాలిలో అగ్నిపర్వతం విస్ఫోటనంతో విమానాశ్రయం మూసివేత బాలి: ఇండోనేసియాలోని బాలిలో పట్టుబడ్డ ముంబై మాఫియా డాన్ ఛోటా రాజన్ను భారత్కు తరలించే కార్యక్రమం మరో రోజు వాయిదా పడింది. బాలి సమీపంలోని రింజని అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా బూడిద మేఘాలు ఆవరించటంతో విమాన రాకపోకలకు అవకాశం లేనందున మంగళవారం రాత్రి బాలి విమానాశ్రయాన్ని మూసేయడం తెలిసిందే. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మూసివేతను బుధవారమూ పొడిగించారు. గురువారం ఉదయం వరకూ ఇక్కడి నుంచి విమానాలు బయలుదేరే అవకాశం లేదని అధికారులు చెప్పినట్లు భారత పోలీసు బృందానికి చెందిన అధికారులు తెలిపారు. ఫలితంగా గురువారం ఉదయం వరకూ ఛోటా రాజన్ తరలింపు వాయిదా పడినట్లేననన్నారు. నేరుగా ఢిల్లీకి తరలింపు.. రాజన్ను బాలి నుంచి నేరుగా ఢిల్లీకి తీసుకువచ్చి.. తొలుత సీబీఐ కస్టడీలో ఉంచాలని భద్రతా సంస్థలు నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అతడిని ఇండోనేసియా నుంచి నేరుగా ముంబై తీసుకువెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి. రాజన్ ప్రాణాలకు ముప్పుండంతో అతడిని వెంటనే ముంబై పోలీసులకు అప్పగించటానికి కేంద్రం విముఖత చూపినట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. రాజన్ను బాలి నుంచి ముంబైకి తీసుకువస్తామని చెప్పిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్.. అతడిని ముంబై పోలీసుల కస్టడీకి అప్పగించే విషయమై కేంద్రంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసమే రాజన్ దొరికిపోయాడా?
ముంబై: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ తనకుతానుగా అరెస్టయి.. కావాలనే భారత్ తిరిగి వస్తున్నాడా? ప్రస్తుతం కనిపిస్తున్న కారణాలు అవుననే అంటున్నాయి. 55 ఏళ్ల ఛోటా రాజన్ అత్యవసరంగా మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరముంది. భారత్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి అతను గత ఏడాదికాలంగా ప్రణాళికలు రచిస్తున్నాడని, ఇక్కడ అతనికి కిడ్నీ దానం ఇవ్వడానికి కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారని ముంబై క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపాయి. 'ఛోటారాజన్ రెండు మూత్రపిండాలూ చెడిపోయాయి. దీంతో ఆయన ప్రస్తుతం డయాలసిస్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఆయన బతకాలంటే ఒక కొత్త కిడ్నీ అవసరముంది. పరారీ ఖైదీగా ఉన్న రాజన్ విదేశాల్లో ఈ శస్త్రచికిత్స చేయించుకోవడం వీలుపడదు' అని క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒకరు తెలిపారు. భారత్ తిరిగొస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు అధికారులు అనుమతించే అవకాశముందని రాజన్ భావిస్తున్నాడని ఆయన వివరించారు. సుదీర్ఘకాలంగా ప్లానింగ్! ఛోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ నికాల్జే గత ఏడాదే తన ఆరోగ్య పరిస్థితి గురించి భారత్లోని తన కుటుంబసభ్యులకు వివరించాడు. గత రెండు దశాబ్దాలుగా పరారీలో అజ్ఞాత జీవితం గడుపుతున్న అతని రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో రాజన్ మేనల్లుడు ఒకరు కిడ్నీ దానం చేయడానికి ముందుకొచ్చినట్టు సమాచారం. రాజన్ తన వైద్య పరీక్షల వివరాలు కుటుంబసభ్యులకు మెయిల్ ద్వారా పంపించగా.. వాటిని దక్షణ ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోని నెఫ్రాలజిస్టుకు చూపించారు. దీంతో ఇద్దరి కిడ్నీలు మ్యాచ్ అవుతాయని, రాజన్కు ఆయన మేనల్లుడు కిడ్నీ ఇవ్వవచ్చునని వైద్యుడు సలహా ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మలేషియాలోని బాలిలో ఛోటారాజన్ అరెస్టయ్యాడు. ఒకవైపు దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఛోటా షకీల్ నుంచి ప్రాణహాని, మరోవైపు అనారోగ్యం కారణంగానే అతను అరెస్టు అవ్వడానికి సిద్ధపడినట్టు పోలీసువర్గాలు భావిస్తున్నాయి. -
ఛోటా రాజన్ తరలింపు ఆలస్యం?
బాలి: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ను భారత్కు తీసుకురావడం ఆలస్యమయ్యే అవకాశముంది. ఇండోనేసియా నుంచి మంగళవారం రాత్రి ఛోటా రాజన్ను స్వదేశానికి తరలించాలని భారత అధికారులు ప్రయత్నించారు. అయితే బాలి సమీపంలో అగ్ని పర్వతం పేలడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఛోటా రాజన్ జింబాబ్వేకు పారిపోతుండగా బాలి విమానాశ్రయంలో ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజన్ను భారత్కు తీసుకువచ్చేందుకు ముంబై, ఢిల్లీ పోలీసులతో పాటు సీబీఐ అధికారులు ఇండోనేసియా వెళ్లారు. -
ఛోటా రాజన్ సంచలన వ్యాఖ్యలు
-
ఛోటారాజన్కు భారత పాస్పోర్ట్ ఎలా వచ్చింది?
ముంబై: పరారీలో ఉన్న అండర్ వరల్డ్ మాఫియా డాన్ ఛోటారాజన్ అరెస్టుతో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రాజన్ వద్ద నుంచి ప్రామాణికమైన ఒరిజనల్ పాస్ పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకోవడం భద్రతావర్గాలను విస్మయపరుస్తున్నది. సాధారణంగా సామాన్య ప్రజలు పాస్ పోర్టు కావాలంటే ప్రామాణికమైన పత్రాలున్నా.. అధికారుల చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటిది రాజన్ కు సిడ్నీలోని భారత కాన్సులేట్ ద్వారా ప్రామాణిక పాస్ పోర్టు లభించడంలో ఎవరు సహకారం అందించారు? అసలు సరైన తనిఖీలు చేయకుండానే రాయబార కార్యాలయం అధికారులు రాజన్ చేతిలో పాస్ పోర్టు పెట్టారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కర్ణాటక మాండ్యకు చెందిన మోహన్ కుమార్ పేరిట భారత పాస్ పోర్టుతో ప్రయాణిస్తున్న ఛోటా రాజన్ ను బాలీ ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. అతనికి 2008 జూలై 8న భారత సిడ్నీలోని భారత కాన్సులేట్ ఈ పాస్ పోర్టు జారీచేసింది. అయితే రాజన్ కొత్త పాస్ పోర్టుకు ఆస్ట్రేలియాలో దరఖాస్తు చేసుకున్నాడా? లేక తన పాస్ పోర్టు పోయిందని మరో పాస్ పోర్టు పొందాడా? అన్నది తెలియాల్సి ఉంది. కొత్త పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు తప్పనిసరిగా తన పాత పాస్ పోర్టు నెంబర్ తో సహా వివరాలు తెలియజేయాలి. అయితే, ఈ నిబంధనలన్నింటినీ దాటుకొని, మారుపేరుతో రాజన్ పాస్ పోర్టు ఎలా పొందాడన్నదే ఇప్పుడు భద్రతా వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నది. సామాన్యులు పాస్ పోర్టు పొందడానికి సవాలక్ష ఇబ్బందులు పడుతుంటే, పేరుమోసిన డాన్ లు, నేరగాళ్లు అవలీలగా మారుపేర్లతో అక్రమంగా పాస్ పోర్టులు తీసుకొని విదేశాల్లో యథేచ్ఛగా తిరుగడంపై వారు సీనియర్ పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఛోటా రాజన్ సంచలన వ్యాఖ్యలు
బాలి: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముంబై పోలీసుల్లో కొంతమంది దావూద్ ఇబ్రహీం మనుషులు ఉన్నారని వెల్లడించాడు. దావూద్ తో కుమ్మక్కయి తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. ముంబై పోలీసులు తనకు అన్యాయం చేశారని, తప్పుడు కేసులు బనాయించారని మీడియాతో చెప్పాడు. తనను నానారకాలుగా వేధించారని వాపోయాడు. దావూద్ ఇబ్రహీంకు తాను భయపడబోనని ప్రకటించాడు. 22 ఏళ్లుగా దావూద్ తో పోరాడుతున్నానని చెప్పాడు. దావూద్, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. భారత ప్రభుత్వం తనను ఏ జైలుకు పంపినా వెళ్తానని అన్నాడు. కాగా, ఇండోనేసియాలోని బాలి జైలులో ఉన్న ఛోటారాజన్ ను ఈరోజు భారత్ కు తీసుకువచ్చే అవకాశముంది. -
ఛోటారాజన్ ల్యాప్టాప్లో దావూద్ గుట్టు!
-
ఛోటా రాజన్ ఇంత 'ఛోటా'నా?
ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే కాంట్రవర్సీ కింగ్ 'రామ్ గోపాల్ వర్మ' మరోసారి తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. ఈసారి ఆయన.. ఇటీవల పట్టుబడిన మాఫియా డాన్ 'ఛోటా రాజన్'పై కాన్సంట్రేట్ చేశారు. ఇద్దరు పోలీసుల మధ్యలో ఉన్న ఛోటా రాజన్ ఫొటో ఒకదాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేసి 'ఛోటా రాజన్ ఇంత ఛోటా అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు.. ' అంటూ రాజన్ ఎత్తును ఉద్దేశిస్తూ హాస్యాస్పదమైన కామెంట్ రాశారు. ఇదివరకే వర్మ.. ప్రముఖ రాజకీయ నాయకులు, పోలీస్ ఆఫీసర్లు, వ్యాపారవేత్తలలో ఛోటా రాజన్ ఎవరెవరి పేర్లు బయట పెడతాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. Never thought Chota Rajan can become so Chota pic.twitter.com/uoZGP6S3ug — Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2015 -
రేపు భారత్కు ఛోటా రాజన్!
బాలి: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ను మంగళవారం భారత్కు తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ఛోటా రాజన్ను తొలుత ఢిల్లీకి తీసుకురావచ్చని సమాచారం. రాజన్ను స్వదేశానికి తీసుకువచ్చే విషయంపై భారత అధికారుల బృందం ఇండోనేసియా అధికారులతో చర్చిస్తోంది. ముంబై, ఢిల్లీ పోలీసులు, సీబీఐ అధికారులతో కూడిన బృందం బాలి జైల్లో ఉన్న ఛోటా రాజన్ను కలిసింది. గత వారం ఛోటా రాజన్ జింబాబ్వేకు పారిపోతుండగా బాలి విమానాశ్రయంలో ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో రాజన్పై 70కిపైగా కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ సరఫరా, బలవంతపు వసూళ్లు, హత్య తదితర కేసులు ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా పోలీసులకు దొరకుండా తప్పించుకుని తిరుగుతున్న ఛోటా రాజన్ ఎట్టకేలకు ఇండోనేసియా పోలీసులకు పట్టుబడ్డాడు. -
ఛోటారాజన్ ల్యాప్టాప్లో దావూద్ గుట్టు!
బాలి (ఇండోనేషియా): అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లో 'డీ' గ్యాంగ్ అధినేత దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన కీలక సమాచారం ఉండే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఛోటా రాజన్ను భారత్కు రప్పించేందుకు సీబీఐ అధికారులు మలేషియా రాజధాని బాలి చేరుకున్నారు. బాలి పోలీసుల అదుపులో ఉన్న ఛోటా రాజన్ ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని త్వరలోనే భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారం మేరకు ఛోటా రాజన్ను బాలి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే అతని వద్ద నుంచి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో తన గ్యాంగ్తోపాటు 'డీ' గ్యాంగ్కు సంబంధించిన కీలక సమాచారం ఉండే అవకాశముందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ గ్యాంగ్ల మధ్య బద్ధ విరోధం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఛోటా రాజన్ ల్యాప్టాప్, మొబైల్లో దావూద్ గ్యాంగ్ కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారం దొరకవచ్చునని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఛోటా రాజన్ ముంబైకి తరలించి.. నగరంలోని ప్రధాన పోలీసు కార్యాలయంలో విచారించనున్న నేపథ్యంలో ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. -
రాజన్ కోసం భారత బృందం
-
రాజన్ కోసం భారత బృందం
ఇండోనేసియా వెళ్లిన సీబీఐ, పోలీసు అధికారులు న్యూఢిల్లీ/బాలి: మాఫియా డాన్ చోటా రాజన్ను భారత్కు తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. అతణ్ని తీసుకువచ్చేందుకు సీబీఐ, ముంబై, ఢిల్లీ పోలీసుల బృందం ఆదివారం ఇండోనేసియా వెళ్లింది. మరోవైపు.. బాలి జైల్లో ఉన్న రాజన్తో జకార్తాలోని భారత ఎంబసీ కార్యదర్శి సంజీవ్ కుమార్ భేటీ అయ్యారు. రాజన్ అరెస్టు తర్వాత భారత ఉన్నతాధికారి అతణ్ని కలవడం ఇదే తొలిసారి. ఇండోనేసియాతో నేరగాళ్ల అప్పగింత ఒప్పందం లేకపోవడంతో భారత అధికారులు.. రాజన్ను తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. రాజన్ భారతీయుడని చెప్పే పత్రాలను ఇప్పటికే అక్కడి అధికారులకు అందజేశారు. రాజన్పై ముంబైలో 75, ఢిల్లీ లో 6 కేసులు ఉన్నాయి. ముంబైలో 20 హత్య కేసులున్నాయి. రాజన్ను భారత్కు రప్పించగానే.. సీబీఐ అతడిని ముంబై పోలీసులకు అప్పగించనుంది. -
'ఏమాత్రం డౌట్ వచ్చినా.. చంపించేవాడు'
ముంబై: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ స్వార్థపరుడు, పచ్చి అవకాశవాదని మాజీ అనుచరులు చెబుతున్నారు. ఛోటా రాజన్ తన గ్యాంగ్ సభ్యులను అనుమానించేవాడని, వారిపై ఏమాత్రం సందేహం వచ్చినా చంపాలని ఆదేశించేవాడని చెప్పారు. ఇండోనేసియా పోలీసులు ఛోటా రాజన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలో భారత్కు తీసుకురానున్నారు. ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో కలసి పనిచేసిన ఛోటా రాజన్ 1990లో అతనితో విభేదాలు వచ్చి విడిపో్యాడు. ఆ తర్వాత సొంతంగా గ్యాంగ్ నడిపేవాడు. ఛోటా రాజన్ తన వద్ద పనిచేసిన ఓపీ సింగ్, మోహన్ కొటియన్, బాలా కొటియన్, భరత్ నేపాలి, శామ్యూల్ అలియాస్ శామ్ను చంపించినట్టు సమాచారం. ఓపీ సింగ్ను నాసిక్ జైల్లో చంపారు. తన స్థానంలో నాయకుడిగా ఎదిగేందుకు ఓపీ సింగ్ ప్రయత్నిస్తున్నాడనే అనుమానంతో ఛోటా రాజన్ అతన్ని హత్య చేయించాడు. జర్నలిస్ట్ జే డేను కూడా రాజన్ ఇలాగే చంపించినట్టు అండర్ వరల్డ్ కథనం. తనకు సంబంధించిన సమాచారాన్ని ఛోటా షకీల్కు చేరవేస్తున్నాడని అనుమానంతో డేను చంపించాడని తెలిపారు. 'రాజన్కు ఏ మాత్రం తెలివిలేదు. గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఎవరైనా ఇతరుల గురించి చెడుగా చెబితే అది నిజామా కాదా అని తెలుసుకునేవాడు కాదు. ఇప్పుడు రాజన్కు మిత్రుల కంటే శత్రువులే ఎక్కువయ్యారు' అని అండర్ వరల్డ్ వర్గాలు వెల్లడించాయి. రాజన్ శత్రువుల జాబితాలో ఛోటా షకీల్తో పాటు గ్యాంగ్స్టర్లు విజయ్ శెట్టి, రవి పూజారి, హేమంత్ పూజారి ఉన్నారు. -
త్వరలోనే భారత్కు చోటా రాజన్!
-
త్వరలోనే భారత్కు చోటా రాజన్!
ఆదివారం ఇండోనేషియాలో అన్సారీ పర్యటన అమల్లోకి రానున్న ఒప్పందాలు బాలి/న్యూఢిల్లీ: ఇండోనేషియాలో పట్టుబడ్డ అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ను భారత్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య నేరస్తుల అప్పగింత, పరస్పర న్యాయ సహకారం అంశాలపై ఒప్పందాలు జరిగాయని.. వీటి ఆధారంగా రాజన్ను భారత్ తరలించేందుకు మార్గం సుగమం అవుతుందని.. ఇండోనేసియాలోని భారత రాయబారి గుర్జిత్ సింగ్ తెలిపారు. నేరస్తుల అప్పగింతపై 2011లోనే ఒప్పందం కుదిరిందని.. అయితే ఆదివారం భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఇండోనేసియా రానున్న సందర్భంగా.. అధికారికంగా నేరస్తుల అప్పగింత మొదలవుతుందని తెలిపారు. రాజన్ను వీలైనంత త్వరగా భారత్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, హోంశాఖ, తమ శాఖ కలిసి పనిచేస్తున్నాయని విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. మరోవైపు.. ఇండోనేసియా పోలీసుల ఆధీనంలో ఉన్న రాజన్ను ఆయన న్యాయవాది ఫ్రాన్సికో ప్రస్సార్ కలిశారు. పోలీసులు శుక్రవారం రాజన్ను ఆరుగంటలు ప్రశ్నించారు. భారత్లో చేసిన వివిధ నేరాలపై విచారించారు. అతడు తమకు సహకరించాడని తెలిపారు. ఈ విచారణపై భారత దౌత్యకార్యాలయానికి నివేదిక సమర్పించారు. తనకు ప్రాణాపాయం ఉందని రాజన్ భావిస్తే.. తన న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేయవచ్చని బాలి నగర పోలీసులు తెలిపారు. రెండ్రోజుల్లో భారత అధికారులు బాలికి వెళ్లి.. రాజన్ను తీసుకు వచ్చే అవకాశాలున్నాయి. -
'లొంగిపోలేదు.. భారత్ కు వెళ్తా'
బాలి: తనకు ప్రాణాలకు ముప్పు ఉందని మాఫియా డాన్ ఛోటా రాజన్ పేర్కొన్నాడు. తనకు ప్రత్యేక భద్రత కల్పించాలని బాలి పోలీసులకు లిఖితపూర్వకంగా విన్నవించుకున్నాడు. జైలులో వైద్య సదుపాయాలు కూడా సరిగా లేవని తెలిపాడు. ప్రస్తుతం అతడు ఇండోనేసియాలోని బాలి పోలీసు స్టేషన్ లో ఉన్నాడు. అతడిని భారత్ కు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తాను లొంగిపోలేదని, భారత్ కు తిరిగి వెళ్లాలనుకుంటున్నానని ఛోటా రాజన్ తెలిపాడు. తాను జింబాబ్వేకు పారిపోవాలనుకోలేదని స్పష్టం చేశాడు. భారత్కు వెళ్లాలని లేదని, తనను విడుదల చేస్తే జింబాబ్వేకు పారిపోతానంటూ తమను వేడుకున్నాడని బాలి పోలీస్ కమిషనర్ రెయిన్హర్డ్ నయింగోలన్.. భారత్కు చెందిన ఓ జాతీయ టీవీ చానెల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా బాలి విమానాశ్రయంలో ఛోటా రాజన్ను ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
'లొంగిపోలేదు.. భారతదేశానికే వెళ్తా'
-
రాజన్ ఆస్తుల విలువ.. ఎంతో తెలుసా!
మాఫియా డాన్ ఛోటా రాజన్ ఏ మాత్రం ఆస్తులు సంపాదించి ఉంటాడో అంచనా వేయగలరా? దాదాపు 4-5 వేల కోట్ల పైమాటేనట. ఈ విషయాన్ని ముంబై పోలీసు అధికారులు చెబుతున్నారు. అతడి పెట్టుబడుల్లో సగానికి పైగా భారతదేశంలోను, అందునా ముంబై నగరం, శివార్లలోనే ఉన్నాయి. చైనాలో ఓ హోటల్, సింగపూర్, థాయ్లాండ్లలో కొన్ని నగల దుకాణాలు, జకార్తాలో ఓ హోటల్ కూడా ఉన్నాయట. ఆఫ్రికన్ దేశాల్లో, ముఖ్యంగా జింబాబ్వేలో వజ్రాల వ్యాపారాల్లోనూ ఇతడికి భాగం ఉంది. అందుకే జింబాబ్వే వెళ్లి, అక్కడి అధికారుల సాయంతో ఆశ్రయం పొందుదామని ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ, భారతదేశానికి బాగా అవసరమైన వ్యక్తికి ఆశ్రయం ఇవ్వడానికి జింబాబ్వే సిద్ధంగా లేదు. భారత్లో కావాలంటే మంచి వైద్యం అందిస్తామని, అంతేతప్ప జడ్ ప్లస్ లాంటి సెక్యూరిటీ మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదని భారత అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. తనపై దావూద్ గ్యాంగ్ దాడిచేసే అవకాశాలు ఉన్నాయన్నది రాజన్ అనుమానం. ప్రస్తుతం కిడ్నీ వ్యాధి కారణంగా డయాలసిస్ చేయించుకుంటున్నందున గట్టిగా ఎదురుదాడి చేసే పరిస్థితుల్లో రాజన్ లేడు. అందుకే ఎలాగోలా జింబాబ్వే పారిపోవాలని ప్రయత్నించినట్లు ఇండోనేషియా పోలీసులు కూడా చెబుతున్నారు. ఇక భారతదేశంలో ఛోటా రాజన్పై దాదాపు 75 కేసులు నమోదయ్యాయి. అందులో సుమారు 25 హత్య కేసులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు అత్యంత కఠినమైన 'మోకా' చట్టం కింద పెట్టినవే. దీంతో ఒక్కసారి తమ చేతికి చిక్కితే కనీసం మూడేళ్ల పాటు కస్టడీలో ఉంచుకునే అవకాశం ఉందన్నది భారత పోలీసుల నమ్మకం. -
లొంగిపోలేదు.. భారతదేశానికే వెళ్తా: ఛోటా రాజన్
దాదాపు రెండు దశాబ్దాల పాటు నిఘా ఏజెన్సీలకు, పోలీసు వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మాఫియా డాన్ ఛోటా రాజన్ విషయంలో రోజుకో సరికొత్త కథనం బయటకు వస్తోంది. ఇండోనేషియా పోలీసుల విచారణలో అతడు చెప్పిన మాటలు ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటున్నాయి. నిన్నటివరకు తాను జింబాబ్వే వెళ్లాలనుకుంటున్నానని, భారత దేశానికి పంపొద్దని రాజన్ కోరినట్లు చెప్పగా.. తాజాగా తాను భారత దేశానికే వెళ్తానని అన్నట్లు చెబుతున్నారు. అలాగే, ఛోటారాజన్ను పోలీసులు అరెస్టు చేయలేదని, అతడి ఆరోగ్యం బాగోని కారణంగా తనంతట తానే లొంగిపోయాడని కూడా తొలుత చెప్పారు. కానీ, తాను లొంగిపోలేదని, అలాంటి ప్రసక్తే లేదని ఇప్పుడు అతడు అంటున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒకప్పుడు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కుడి భుజంలా ఉండే ఛోటా రాజన్, ఆ తర్వాత దావూద్కు ఎదురుతిరిగి ప్రత్యేకంగా సొంత గ్యాంగు పెట్టుకున్నాడు. ఎట్టకేలకు రాజన్ లొంగిపోవడంతో, అతడి తర్వాత ఆ సామ్రాజ్య పగ్గాలు అతడి నమ్మిన బంటు విక్కీ మల్హోత్రా చేతికి వెళ్తున్నాయి. -
విక్కీ మల్హోత్రా చేతికి ఛోటా రాజన్ సామ్రాజ్యం!
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ ఛోటారాజన్ అరెస్టుతో ఆయన సామ్రాజ్యం పగ్గాలు మరో గ్యాంగ్ స్టర్ విక్కీ మల్హోత్రా చేతుల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తున్నది. విక్కీ మల్హోత్రా ఛోటా రాజన్కు కుడిభుజం లాంటివాడు. తన బాస్ ఆశీస్సులతో అతను స్వతంత్ర అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసి.. దావూద్ ఇబ్రహీం 'డీ' గ్యాంగ్కు చెక్ పెట్టాలని భావిస్తున్నాడు. గడిచిన కొద్ది నెలల్లో అతని కదలికలు చూస్తుంటే.. అతడు సొంత గ్యాంగ్తో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నదని అతని కోసం గాలిస్తున్న భద్రతా సంస్థలు చెప్తున్నాయి. విక్కీ మల్హోత్రా గత రెండు దశాబ్ధాల నుంచి ఛోటారాజన్కు కుడిభుజంగా వ్యవహరిస్తున్నాడు. కష్టాల్లోనూ, సుఖాల్లోనూ వెంటే ఉన్నాడు. 2000 సంవత్సరంలో బ్యాంకాక్లో ఛోటారాజన్పై హత్యాయత్నం జరిగిన తర్వాత అతని కీలక అనుచరులు రవి పూజారి, సంతోష్ షెట్టి దూరం జరిగినా.. విక్కీ మాత్రం ధోకా చేయలేదు. 2005లో ఢిల్లీలోని అశోకా హోటల్ వద్ద అరెస్టయిన విక్కీ 2010లో బెయిల్ మీద బయటకొచ్చి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటినుంచి అతను దుబాయ్, ఆఫ్రికా మధ్య చక్కర్లు కొడుతున్నట్టు భావిస్తున్నారు. ఇదే సమయంలో దావూద్ కూడా గ్యాంగ్ కార్యకలాపాలను ఆఫ్రికాకు విస్తరించడం గమనార్హం. 'డీ' కంపెనీ వ్యవహారాలను కమాండ్ చేస్తున్న ఛోటా షకీల్ ముంబైలో అండర్ వరల్డ్ సామ్రాజ్యంలో పట్టుసాధించకుండా నిరోధించేందుకే ఛోటా రాజన్ సామ్రాజ్య పగ్గాలు విక్కీకి ఇచ్చినట్టు భావిస్తున్నారు. విక్కీ మల్హోత్రా గ్యాంగ్ను నిరోధించేందుకు 'డీ' కంపెనీ ప్రయత్నిస్తే.. మళ్లీ ముంబైలో గ్యాంగ్వార్ ప్రారంభమయ్యే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఛోటా షకీల్ నుంచి ముప్పు పొంచి ఉండటం, ఆస్ట్రేలియా పోలీసులు తనకోసం గాలిస్తుండటం, అనారోగ్యం తదితర కారణాలతో గత మే-ఏప్రిల్లోనే ఛోటా రాజన్ ఆస్ట్రేలియా నుంచి పలుసార్లు ఇంటెలిజెన్స్ సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరిపాడని, పెద్దగా సానుకూలత రాకపోవడంతో తనకు తాను ముందుకొచ్చి అతను అరెస్టయి ఉంటాడని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో తనతో టచ్లో ఉన్న విక్కీ మల్హోత్రాను ఒప్పించి.. అతనికి తన సామ్రాజ్యాన్ని అప్పగించి.. ఛోటా రాజన్ అరెస్టయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. విక్కీ గతంలో దావూద్ కంపెనీతో చేతులు కలిపాడని వచ్చిన వార్తలను భద్రతా సంస్థలు తోసిపుచ్చాయి. అతడు ఇప్పటికీ ఛోటా రాజన్కే నమ్మకస్తుడిగా ఉన్నాడని పేర్కొన్నాయి. -
ఛోటా రాజన్ భయపడుతున్నాడు
జకర్తా: ఎందరినో గడగడలాడించిన మోస్ట్ అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్కు పోలీసులకు దొరికిసరికే భయం పట్టుకుంది. ఇండోనేసియా పోలీసులకు దొరికిన చోటా రాజన్ చాలా భయపడుతున్నాడు. భారత్కు వెళ్లాలని లేదని, తనను విడుదల చేస్తే జింబాబ్వేకు పారిపోతానంటూ ఇండోనేసియా పోలీసులను వేడుకుంటున్నాడు. బాలి పోలీస్ కమిషనర్ రెయిన్హర్డ్ నయింగోలన్ ఈ విషయాలను వెల్లడించారు. భారత్కు చెందిన ఓ జాతీయ టీవీ చానెల్కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 'తనను విడుదల చేయాలని, విడుదల చేస్తే జింబాబ్వేకు పారిపోతానని ఛోటా రాజన్ కోరాడు. జింబాబ్వేకు పారిపోయేందుకు ఆస్ట్రేలియా నుంచి బాలి వచ్చినట్టు చెప్పాడు. అతను చాలా భయపడుతున్నాడు. వరసపెట్టి సిగరెట్లు కాలుస్తున్నాడు. భారత్కు వెళ్లాలని లేదని చెప్పాడు' అని బాలి పోలీస్ కమిషనర్ చెప్పారు. ఛోటా రాజన్ తమ విచారణకు సహకరిస్తున్నాడని తెలిపారు. అతను కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పారు. త్వరలోనే భారత్కు పంపుతామని నయింగోలన్ తెలిపారు. ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా.. బాలి విమానాశ్రయంలో ఛోటా రాజన్ను ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
చోటా రాజన్ భయపడుతున్నాడు
-
రాజన్ను తీసుకురావటంలో సమస్య లేదు: కేంద్రం
ఇండోనేసియాతో చర్చిస్తున్నాం ♦ రెండ్రోజుల్లో బాలీకి సీబీఐ అధికారులు ♦ రెండు, మూడు ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు న్యూఢిల్లీ/జకార్తా: ఇండోనేసియాలో అరెస్ట్ అయిన అండర్వరల్డ్ డాన్ ఛోటా రాజన్(55)ను భారత్కు తీసుకురావటంలో చట్టపరమైన సమస్యలేమీ ఉండబోవని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ దిశగా ఇండోనేసియా అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు. రెండుదేశాల్లో చట్టాలు వేర్వేరుగా ఉన్నందున.. సీబీఐ అధికారులు వీటిని పరిశీలిస్తున్నారని తెలిపారు. కాగా, ఛోటా రాజన్ అప్పగింతపై ఇబ్బందులు ఉండకపోవచ్చని ఇండోనేసియాలోని భారత రాయబారి గుర్జిత్ సింగ్ చెప్పారు. భారత అధికారులు జారీచేసిన నోటీసుపైనే చోటా రాజన్ను అరెస్ట్చేసినందున అతడి అప్పగింత విషయంలో ఇబ్బందులు తలెత్తవన్నారు. ‘‘ఇండోనేసియాతో నేరస్తుల అప్పగింత ఒప్పందంతోపాటు పరస్పర న్యాయ సహకార ఒడంబడిక ఉంది. ఈ కేసుతోపాటు ఇతర కేసుల్లోనూ ఇవి వర్తిస్తాయని భావిస్తున్నాం. రాజన్ అప్పగింత విషయంలో ఏ ఇతర లీగల్ డాక్యుమెంట్ అవసరమవుతుందని నేను అనుకోను’ అని గుర్జిత్ సింగ్ అన్నారు. అయితే.. దావూద్ ఇబ్రహీం నుంచి రాజన్కు ప్రాణహాని ఉన్నందున.. అతణ్ణి క్షేమంగా భారత్కు తీసుకొచ్చేందుకు రెండు మూడు ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజన్పై ఎక్కువ కేసులు మహారాష్ట్రలో ఉన్నందున తమ పోలీసులకు అప్పగించేలా సీబీఐని కోరతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తెలిపారు. రాజన్ను భారత్కు తీసుకు వచ్చేందుకు రెండ్రోజుల్లో సీబీఐ అధికారులు బాలీ వెళ్లే అవకాశం ఉంది. -
మాఫియా డాన్ చోటా రాజన్ అరెస్ట్
-
మాఫియా డాన్ చోటా రాజన్ అరెస్ట్
బాలిలో అదుపులోకి తీసుకున్న ఇండోనేసియా పోలీసులు ► ఆస్ట్రేలియా నుంచి బాలికి వస్తుండగా విమానాశ్రయంలోనే అరెస్ట్ ► ఈ వారంలోనే భారత్కు తరలింపు! ► ఇండోనేసియా అధికారులతో భారత దర్యాప్తు సంస్థల సంప్రదింపులు ► దావూద్ ఇబ్రహీంకు పోటీగా ఎదిగిన గ్యాంగ్స్టర్ రాజన్ ► ముంబై నేర సామ్రాజ్యంపై పట్టు కోసం డీ కంపెనీకి సవాలు... ► 'చోటా'హత్యకు దావూద్ పలు విఫలయత్నాలు ► రాజన్ అరెస్ట్ గొప్ప విజయం: రాజ్నాథ్ న్యూఢిల్లీ/జకార్తా అండర్వరల్డ్ డాన్, గ్యాంగ్స్టర్ చోటా రాజన్(55) అరెస్టయ్యాడు. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో ఇండోనేసియాలోని ప్రముఖ పర్యాటక ద్వీపం బాలిలో ఆ దేశ పోలీసులు ఆదివారం చోటా రాజన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి బాలికి వచ్చిన రాజన్ను ఆస్ట్రేలియా పోలీసులిచ్చిన సమాచారంతో బాలి విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. ఈ వారమే ఆయనను భారత్కు తరలించనున్నారు. భారత్- ఇండోనేసియాల మధ్య నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ప్రత్యేక ఒడంబడిక లేనప్పటికీ.. రాజన్ తరలింపులో ఎలాంటి సమస్య ఎదురుకాబోదని భారతీయ అధికారులు భావిస్తున్నారు. రాజన్ను భారత్కు తీసుకువచ్చేందుకు దౌత్యపరమైన అనేక మార్గాలున్నాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్లో ఒకడైన రాజన్ మరో ప్రముఖ డాన్ దావూద్ ఇబ్రహీంకు ఒకప్పుడు కుడిభుజం.. దావూద్ డీ కంపెనీలో నంబర్ 2. 1993 ముంబై పేలుళ్ల అనంతరం దావూద్కు, డీ కంపెనీకి ప్రధాన ప్రత్యర్థిగా మారాడు. ముంబైలో దావూద్ నేర సామ్రాజ్యాన్ని సవాలు చేశాడు. అప్పట్నుంచీ రాజన్ను హతమార్చేందుకు దావూద్ పలుమార్లు విఫల యత్నాలు చేశాడు. పరారీలో ఉన్న చోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ నికల్జే అలియాస్ మోహన్ కుమార్ అలియాస్ నానా కోసం భారత్ గత రెండు దశాబ్దాలుగా గాలిస్తోంది. ఆయనపై 20కి పైగా హత్యాకేసులు, డ్రగ్స్ దందా, స్మగ్లింగ్, బలవంతపు వసూళ్లు, అక్రమంగా ఆయుధాలు కలిగిఉండటం సహా అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. రాజన్ విషయంలో సహకరించాల్సిందిగా ఇంటర్పోల్తో పాటు పలు దేశాలకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. 1995లోనే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బాలీలో రాజన్ను అరెస్ట్ చేశారు. చోటా రాజన్ అరెస్ట్ వార్తను ఇండోనేసియా పోలీసులు, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, సీబీఐ డెరైక్టర్ అనిల్ సిన్హా ధ్రువీకరించారు. రాజన్ అరెస్ట్ గొప్ప విజయమని రాజ్నాథ్ అభివర్ణించారు. గుర్తింపు, పరిశీలన తదితర చట్టపరమైన ప్రక్రియ అనంతరం తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. సీబీఐ, ఇతర భారతీయ దర్యాప్తు సంస్థలు ఇండోనేసియా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయన్నారు. రాజన్ అరెస్ట్లో చొరవ చూపిన ఇంటర్పోల్కు, ఇండోనేసియా అధికారులకు రాజ్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ తదుపరి లక్ష్యం 1993 ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహమేనా అన్న మీడియా ప్రశ్నకు 'భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూద్దాం' అంటూ బదులిచ్చారు. రాజన్ అరెస్ట్ విషయమై ఆస్ట్రేలియా అధికారులతో చాలాసార్లు సంప్రదింపులు జరిపామని, భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేసియాల సమష్టి కృషి, పరస్పర సహకారంతోనే రాజన్ అరెస్ట్ సాధ్యమైందని సీబీఐ అధికార ప్రతినిధి దేవ్ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. రాజన్పై అత్యధిక కేసులు ముంబైలోనే నమోదై ఉన్నాయని, ఆయనను భారత్కు తరలించిన అనంతరం రాష్ట్రానికి తీసుకువచ్చే విషయమై కేంద్రాన్ని అభ్యర్థిస్తామని మహారాష్ట్ర హోంమంత్రి రామ్ షిండే తెలిపారు. రాజన్ మారు పేరుతో, వేరే ధ్రువపత్రాలతో గత ఏడేళ్లుగా కట్టుదిట్టమైన వ్యక్తిగత భద్రతాసిబ్బంది రక్షణలో ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. రాజన్ ఆస్ట్రేలియాలో ఉంటున్న విషయాన్ని ఆదేశ ఫెడరల్ పోలీస్ గత నెలలో ధ్రువీకరించిందని, ఈ విషయమై భారతీయ అధికారులతో సంప్రదింపులు జరిపిందని బాలి పోలీస్ అధికార ప్రతినిధి హేరీ వియంటో వెల్లడించారు. ప్రస్తుతం రాజన్ను బాలి పోలీస్ ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలిపారు. అరెస్ట్ సమయంలో రాజన్ వద్ద మోహన్కుమర్ పేరుతో పాస్పోర్ట్ ఉందన్నారు. ఆ ఒప్పందం కీలకం ఇండోనేసియాతో ఇటీవల కుదిరిన ఒక ఒప్పందం రాజన్ తరలింపులో కీలకంగా మారనుంది. ఇరుదేశాల నుంచి కోర్టు వారంటుతో నేరస్తుల తరలింపు సాధ్యమయ్యే అవకాశం ఆ ఒప్పందంతో లభిస్తుంది. ఇరుదేశాల్లోని పరారీలో ఉన్న నిందితుల తరలింపుతో పాటు నేరపరమైన అంశాల్లో పరస్పర సహకారం అందించుకోవాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. ఆ ఒప్పందంపై ఈ ఆగస్ట్లోనే సంతకాలు జరిగాయి. అనంతరం ఆగస్ట్ 21న ఆ ఒప్పందాన్ని భారత్ ప్రభుత్వం దీన్ని నోటిఫై చేసింది. ఇండియాకు తీసుకువచ్చేంతవరకు అనుమానమే..! రాజన్ను భారత్కు తీసుకువచ్చేంతవరకు తనకు అనుమానమేనని ముంబైలో క్రిమినల్ గ్యాంగ్ల పనిపట్టిన అధికారి, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ ఎంఎన్ సింగ్ వ్యాఖ్యానించారు. తన గత అనుభవాల ఆధారంగా అలా అనుమానిస్తున్నానన్నారు. 2000 సంవత్సరంలో బ్యాంకాక్లో రాజన్పై దాడి జరిగి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తాను, మహారాష్ట్ర హోంమంత్రి చగన్ భుజ్బల్ నాటి కేంద్ర విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ను కలిసి, రాజన్ను భారత్కు తీసుకువచ్చే విషయంలో చొరవ చూపాలని కోరి న విషయాన్ని సింగ్ గుర్తు చేసుకున్నారు. రాజన్ను విచారించడం ద్వారా వ్యవస్థీకృత నేర సామ్రాజ్యం, రాజకీయ నేతలు, పోలీసుల మధ్య నెలకొని ఉన్న రహస్య సంబంధాలు వెల్లడయ్యే అవకాశముందని ముంబైలో పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి వైపీ సింగ్ వ్యాఖ్యానించారు. 2011లో హత్యకు గురైన సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ క్రైం రిపోర్టర్ జ్యోతిర్మయి డే కేసు విషయంలో, 2010లో దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కాస్కర్పై హత్యాయత్నం కేసు విషయంలోనూ పురోగతి సాధ్యమవుతుందన్నారు. జ్యోతిర్మయి డేను రాజన్ ఆదేశాల మేరకే హత్య చేశారని ఆరోపణలున్నాయి. రాజన్కు ఆర్థికంగా సహకరించిన ముంబైలోని బిల్డర్ల వివరాలు వెల్లడవుతాయని సింగ్ పేర్కొన్నారు. -
దావూద్ చిక్కేనా!
సెంట్రల్ డెస్క్: అబూ సలేం, చోటా రాజన్ దొరికారు. ఇప్పు డు అందరి దృష్టి మాఫియా దందాను విస్తరించి ఒకప్పుడు ముంబైని శాసించిన ‘బిజినెస్మన్’పై పడింది. భారత్ మోస్ట్వాంటెడ్ క్రిమినల్స్లో మొదటివాడైన దావూద్ ఇబ్రహీంను భారత్కు పట్టితేవడం సాధ్యమేనా? ఐఎస్ఐ నీడలో పాకిస్తాన్లోని కరాచీలో దావూద్ సురక్షితంగా ఉన్నాడు. ఇటీవలే అతని భార్య భారత్లోని ఓ టీవీ ఛానల్ విలేకరితో మాట్లాడింది కూడా. దావూద్ పడుకున్నాడని, అతని భార్యను మాట్లాడుతున్నానని స్పష్టంగా చెప్పింది. అయితే పాకిస్తాన్ మాత్రం ఎప్పటిలాగే పాతపాటే పాడింది. తమ దేశంలో దావూద్ లేడని చెప్పింది. మరోవైపు భారత్ మాత్రం గట్టి ఆధారాలు పాక్కు అందజేశామంటోంది. కానీ ఈ ఏడాది మే నెలలో పార్లమెంటులో సమాధానం చెప్పాల్సి వచ్చినపుడు మాత్రం దావూద్ ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి అతన్ని వెనక్కితెచ్చే ప్రక్రియను ప్రారంభించలేకపోతున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. భారత నిఘా వ్యవస్థల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దావూద్కు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయడం లేదని మాజీ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. భద్రతను కల్పించడమే కాకుండా తరచూ మకాం మార్చాల్సిందిగా దావూద్కు ఐఎస్ఐ సలహాలిస్తోంది. అతని కదలికలన్నీ ఐఎస్ఐ కనుసన్నల్లోనే జరుగుతాయని చెబుతారు. కరాచీలో పలు వ్యాపారాల్లో దావూద్ భారీ పెట్టుబడులు కూడా పెట్టినట్లు సమాచారం. ఒసామా బిన్ లాడెన్తో సన్నిహిత సంబంధాలు నెరిపాడని చెప్పి... అమెరికా 2003లో దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించింది. అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి చేయడం ద్వారా పాక్ మెడలు వంచితే... దావూద్ను భారత్కు తెప్పించడం సాధ్యపడొచ్చు. లాడెన్ను అమెరికా హతమార్చినపుడు రాజకీయంగా తీవ్ర ఇరకాటాన్ని ఎదుర్కొన్న పాక్ పాలకులు... మరోసారి అలాంటి పరిస్థితిని కోరుకుంటారా? దావూద్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిచ్చిన ఐఎస్ఐ... తమ రహస్యాలు బయటపడటానికి అంగీకరిస్తుందా? -
'ఛోటా రాజన్ను మాకు అప్పగించాలి'
అండర్ వరల్డ్ మాఫియా డాన్ ఛోటారాజన్ అరెస్టుపై భారత ప్రభుత్వం స్పందించింది. ఛోటా రాజన్ను అరెస్టుచేసినందుకు ఇంటర్ పోల్, మలేషియా పోలీసులకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఛోటారాజన్ అరెస్టును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ధ్రువీకరించింది. ఇంటర్పోల్ అభ్యర్థన మేరకు మలేషియా పోలీసులు ఛోటారాజన్ను అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. ఇదిలా ఉండగా, ఛోటారాజన్పై ముంబైలో అధిక కేసులు ఉండటంతో అతన్ని భారత్కు రప్పించిన తర్వాత మహారాష్ట్ర పోలీసులకు అప్పగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఛోటారాజన్ను తమకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్టు మహారాష్ట్ర హోంమంత్రి రామ్షీండే తెలిపారు. -
మాఫియా డాన్ ఛోటా రాజన్ అరెస్టు
-
మాఫియా డాన్ ఛోటా రాజన్ అరెస్టు
దాదాపు రెండు దశాబ్దాలుగా భారత దేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలను వణికిస్తూ.. దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ అరెస్టయ్యాడు. ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారం మేరకు అతడిని ఇంటర్పోల్ వర్గాలు ఇండోనేషియాలోని బాలిలో అరెస్టు చేశాయి. ఒకప్పుడు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహిత సహచరుడైన ఛోటా రాజన్.. ఆ తర్వాత అతడికి గట్టి ప్రత్యర్థిగా మారాడు. ముంబై పోలీసులు, భారత నిఘా ఏజెన్సీలు దాదాపు రెండు దశాబ్దాలుగా అతడి కోసం వెతుకుతున్నారు. 1995 నుంచి ఛోటా రాజన్ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇప్పటికీ ముంబై నేర సామ్రాజ్యంలో జరుగుతున్న అనేక ఘటనలలో అతడి హస్తం ఉందని చెబుతుంటారు. దావూద్ ఇబ్రహీం - ఛోటా రాజన్ వర్గాల మధ్య చాలా కాలంగా గొడవలు ఉన్నాయి. వాళ్లలో దావూద్ గ్యాంగ్ ఇప్పుడు ఛోటా రాజన్కు సంబంధించిన సమాచారం అందించి ఉండొచ్చని కూడా చెబుతున్నారు. మన నిఘా సంస్థలు ఆ సమాచారం సేకరించాయో, లేదా వాళ్లెవరైనా ఇచ్చారో అప్పుడే చెప్పలేమని అంటున్నారు. భారతదేశానికి అతడిని డిపోర్ట్ చేసే అవకాశం ఉందని ఇండోనేసియా పోలీసులు, ఇంటర్పోల్ వర్గాలు చెబుతున్నాయి.