Consumer Price Index
-
ద్రవ్యోల్బణం తగ్గింపే మా లక్ష్యం
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం కట్టడికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని, పెరిగిన ధరల భారం పౌరులపై పడకుండా చూసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman) అన్నారు. సాధారణ బడ్జెట్(General budget)పై చర్చలో భాగంగా గురువారం రాజ్యసభలో ఆమె ప్రసంగించారు. ‘‘వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.22 శాతంగా ఉంటే జనవరికల్లా దానిని 4.31 శాతానికి తగ్గించాం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ లక్ష్యాలకు తగ్గట్లుగా ఇప్పుడు ద్రవ్యోల్బణం 4 శాతానికి దిగొస్తోంది’’ అని మంత్రి నిర్మల అన్నారు. ఈ సందర్భంగా పలువురు విపక్ష నేతలు మంత్రి ప్రసంగానికి అడ్డు తగిలారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా విపక్ష, అధికార ఎన్డీఏ సభ్యుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. మోదీ సర్కార్ ఏ ఒక్క రాష్ట్రం పట్ల వివక్ష చూపలేదని నిర్మల బదులిచ్చారు. అయినా విపక్ష సభ్యులు మంత్రి సమాధానంతో సంతృప్తి చెందలేదు. తర్వాత పలు విపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. తర్వాత మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు.అంతర్జాతీయంగా అనిశ్చితి‘‘అభివృద్ధిని పరుగుపెట్టించే లక్ష్యంతో బడ్జెట్కు తుదిరూపునిచ్చాం. సమ్మిళిత అభివృద్ధికి బడ్జెట్ భరోసానిస్తుంది. ప్రైవేట్ రంగానికి పెట్టుబడుల ఊతం అందిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మౌలిక వసతుల కల్పన కోసం మూలధన వ్యయంలో పెట్టుబడుల పెంపుదల ఉంటుందేగానీ తగ్గుదల ఉండబోదు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, ప్రతికూల సవాళ్ల మధ్య బడ్జెట్ రూపకల్పన జరిగింది. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని రంగాలకు నిధుల కేటా యింపులు తగ్గాయి. పరిస్థి తులు మారుతున్నా అత్యంత కచ్చితత్వంతో ముందస్తు బడ్జెట్ అంచనాలు వేశాం. దేశ ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తు న్నాం. అంతర్జాతీయ పరిస్థి తులు ఎప్పటికప్పుడు మా రుతుండటంతో ఎల్లప్పుడూ ఒకే వ్యూహం పనికిరాదు. అనిశ్చితి రాజ్య మేలుతుండటంతో మన దిగుమతులపై దాని పెను ప్రభావం కొనసాగుతోంది. అంతర్జాతీయంగా నెల కొన్న అస్తవ్యస్త ధోరణి మన ఆర్థికాభివృద్ధి పథంలో అవరోధంగా మారుతోంది. ద్రవ్యో ల్బణం కారణంగా టమాటా, ఉల్లి, బంగాళా దుంప చివరకు పప్పు ధాన్యాల ధరల్లోనూ తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అననుకూల వాతావరణం కారణంగా దిగుబడులు తెగ్గోసు కుపోవడంతో ఆహార ద్ర వ్యోల్బణం కట్టుతప్పుతోంది. సరుకు రవాణా గొలు సుల్లో ఏవైనా ఆటంకాలుంటే వెంటనే కేంద్ర మంత్రుల బృందం రంగంలోకి దిగి సమయానికి విదేశీ దిగుమతులు వచ్చేలా చూస్తోంది’’ అని నిర్మల తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తర్వాత బడ్జెట్ తొలిసెషన్లో భాగంగా రాజ్యసభను వాయిదావేస్తున్నట్లు డిప్యూటీ ౖచైర్మన్ హరివంశ్ ప్రకటించారు. మార్చి పదో తేదీ ఉదయం 11 గంటలకు మళ్లీ రాజ్యసభ కార్యకలాపాలు మొదలుకానున్నాయని ఆయన చెప్పారు. -
దిగొస్తున్న ధరలు
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కూరగాయలు, గుడ్లు, పప్పు ధాన్యాల ధరల క్షీణతతో జనవరిలో మరికాస్త తగ్గి 4.31 శాతానికి పరిమితమైంది. ఇది అయిదు నెలల కనిష్టం. చివరిసారిగా 2024 ఆగస్టులో ఇది 3.65 శాతంగా నమోదైంది. వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గతేడాది జనవరిలో 5.1 శాతంగాను, డిసెంబర్లో 5.22 శాతంగాను ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం జనవరిలో ఆహార పదార్థాల బాస్కెట్ ద్రవ్యోల్బణం 6.02 శాతంగా ఉంది. గత ఆగస్టులో నమోదైన 5.66 శాతం తర్వాత ఇది కనిష్టం. గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్, ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గినట్లు ఎన్ఎస్వో తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటంతో ఆర్బీఐ త్వరలో మరోసారి కీలక వడ్డీ రేట్లను మరో పావు శాతం తగ్గించే అవకాశాలు ఉన్నాయి. -
రిటైల్ ధరలు దిగొచ్చాయ్..!
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండవ నెల ఆగస్టులో కూడా పూర్తి అదుపులో ఉంది. ధరల స్పీడ్ 3.65%గా (2023 ఇదే నెలతో పోల్చితే) నమోదైంది. అయితే నెలవారీగా 2024 జూలై (ఐదేళ్ల కనిష్ట స్థాయి 3.6%)తో పోలి్చతే స్వల్పంగా పెరగడం గమనార్హం. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన సమాచారం ప్రకారం... సూచీలోని ఫుడ్ బాస్కెట్ విభాగంలో ధరల స్పీడ్ ఆగస్టులో 5.66 శాతంగా ఉంది. జూలైలో ఈ రేటు 5.42 శాతం. ఒక్క కూరగాయలు చూస్తే, ద్రవ్యోల్బణం 10.71 శాతంగా ఉంది. కాగా, అక్టోబర్ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్షా సమావేశం జరగనుంది. అప్పటి వరకూ రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే దిగువస్థాయి ధోరణిలో కొనసాగితే ఆర్బీఐ రెపో రేటును తగ్గించే అవకాశాలు ఉన్నాయన్నది నిపుణుల అంచనా.పరిశ్రమలు పేలవం... పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) 2024 జూలైలో పేలవ పనితీరును ప్రదర్శించింది. వృద్ధి రేటు కేవలం 4.8%గా నమోదైంది. తయారీ, మైనింగ్ రంగాల పేలవ పనితీరు దీనికి నేపథ్యం. 2023 జూలై ఈ వృద్ధి రేటు 6.2%. ఇక ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి స్వల్పంగా 5.2%కి పెరిగింది. -
కూరగాయలు భగ్గు
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్లో ‘యూ’టర్న్ తీసుకుంది. పదకొండు నెలలుగా మెట్లు దిగివస్తూ, 2024 మేలో 4.8 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం, జూన్లో 28 బేసిస్ పాయింట్లు పెరిగి (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) 5.08 శాతానికి (2023 జూన్తో పోల్చి) చేరింది. అంతక్రితం గడిచిన నాలుగు నెలల్లో ఇంత తీవ్ర స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం నెలకొనడం ఇదే తొలిసారి. ఆహారం ప్రత్యేకించి కూరగాయల ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణం. రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలక విభాగమైన ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం 9.36%గా ఉంది. మేలో ఈ రేటు 8.69%. కూరగాయల ధరలు భారీగా 29.32% పెరిగాయి. పప్పు దినుసుల ధరలు 16.07 శాతంగా నమోదయ్యాయి. ధరల పెరుగుదల నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లాయి. -
ఆహార ధరలు ఇంకా తీవ్రమే..
న్యూఢిల్లీ: తక్షణం వడ్డీరేటు సరళతరం అయ్యే అవకాశం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ తెలిపారు. వినియోగ ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2 ప్లస్తో ఆరు శాతానికి కట్టడి చేయాలన్న కేంద్రం నిర్దేశం... ప్రస్తుతం 6 శాతం దిగువనే ఉన్న పరిస్థితి (మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతం)ని ఆయన ప్రస్తావిస్తూ, ‘‘ప్రస్తుత ద్రవ్యోల్బణం–4 శాతం లక్ష్యం మధ్య ఉన్న అంతరాన్ని బట్టి వడ్డీ రేటుపై వైఖరిని మార్చడం చాలా ముందస్తు చర్య అవుతుంది’’ అని ఉద్ఘాటించారు. రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 4 శాతమేనని పలు సందర్భాల్లో ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పొంచి ఉన్నాయని కూడా ఆయన పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. జూన్ 2023 నుండి వరుసగా 11వ నెలలో ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గింది. సేవల ద్రవ్యోల్బణం చారిత్రక కనిష్ట స్థాయిలకు దిగివచి్చంది. వస్తు ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు.. → మనం స్థిరమైన ప్రాతిపదికన 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం వైపునకు వెళ్లినప్పుడు వడ్డీరేటు వైఖరిలో మార్పు గురించి ఆలోచించే విశ్వాసం మనకు లభిస్తుంది. → ద్రవ్యోల్బణం ప్రయాణం అంచనాలకు తగ్గట్టుగానే పురోగమిస్తున్నది. అయితే పూర్తి 4 శాతం దిశగా ప్రయాణం అత్యంత కష్టతరమైన అంశం. ఇందుకు పలు అడ్డంకులు ఉన్నాయి. → మార్చి–మే మధ్య తయారీ, ఫ్యూయల్ అండ్ లైట్ ద్రవ్యోల్బణం తగ్గింది. అయితే ఆహార ద్రవ్యోల్బణం విషయలో ఇంకా ఆందోళనలు ఉన్నాయి. కూరగాయలుసహా పలు నిత్యావసరాల వస్తువుల ద్రవ్యోల్బణం స్పీడ్ రెండంకెలపైనే ఉంది. → స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విషయానికి వస్తే పలు అంశాలు వృద్ధికి దోహదపడే విధంగా తమ పాత్రను పోషిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వృద్ధి వేగం చాలా బలంగా ఉంది. ఇది మొదటి త్రైమాసికంలో బలంగా కొనసాగుతుందని భావిస్తున్నాం. జూన్ పాలసీ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ క్రితం 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచడం ఇక్కడ గమనార్హం. ఇదే జరిగితే దేశం వరుసగా నాలుగు సంవత్సరాల్లో 7 శాతం ఎగువన వృద్ధి సాధించినట్లు అవుతుంది. పాలసీ విధానం పునరుద్ఘాటన ఇంటర్వ్యూలో గవర్నర్ పాలసీ విధాన సమీక్ష అంశాలను పునరుద్ఘాటించడం గమనార్హం. ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి జూన్ 5 నుంచి 7వ తేదీ మధ్య మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో మెజారిటీ 4 శాతం దిగువకు రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే తన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటూ వరుసగా ఎనిమిదవసారి కీలక రేటు– రెపోను (6.5 శాతం) యథాతథంగా ఉంచింది. అయితే వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. వీరిలో ఎంపీసీ ఎక్స్టర్నల్ సభ్యులు జయంత్ వర్మతో ఆషిమా గోయల్ కూడా ఉన్నారు. అయితే ఆర్బీఐ ఎంపీసీ మెజారిటీ సభ్యులు –ఎటువంటి అనిశ్చితి లేకుండా ద్రవ్యోల్బణం దిగువబాటనే కొనసాగుతుందన్న భరోసా వచ్చే వరకూ– వేచిచూసే ధోరణి పాటించాలని అభిప్రాయపడ్డారు. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ దీన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. కాగా, వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలిగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆహార ధరలపరంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఎగిసే రిసు్కలను ఎంపీసీ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాలసీ సమీక్ష సందర్భంగా చెప్పారు. ధరలు నిలకడగా ఉండే విధంగా స్థిరత్వాన్ని సాధించగలిగితేనే అధిక వృద్ధి సాధనకు పటిష్టమైన పునాదులు వేయడానికి సాధ్యపడగలదని ఆయన పేర్కొ న్నారు. ద్రవ్యోల్బణం భయాలు ఇంకా పొంచే ఉన్నాయని ఎంపీసీలోని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2024–25లో 4.5 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ పాలసీ అంచనా. క్యూ1 (ఏప్రిల్–జూన్) 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3 లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం రిటైల్ ద్రవ్యో ల్బణం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. ఆహార ధరల తీవ్రతవల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు రావడం లేదని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష పేర్కొంది. మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, ఆర్బీఐ గవర్నర్ పేర్కొంటున్న లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం. -
5% దిగువనే రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 5 శాతం దిగువనే కొనసాగింది. సూచీ సమీక్షానెల్లో 4.83 శాతంగా నమోదయ్యింది. మార్చిలో నమోదయిన 4.85 శాతంతో పోలి్చతే స్వల్పంగా తగ్గింది. ఇది 11 నెలల కనిష్ట స్థాయి. అయితే 2023 ఇదే నెలతో పోల్చితే (4.7 శాతం) అధికంగా ఉంది. నెలవారీగా చూస్తే, ఒక్క ఆహార ద్రవ్యోల్బణం 8.52 శాతం (2024 మార్చి) నుంచి 8.70 శాతానికి పెరిగింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ 2తో 4 శాతంగా ఉండాలి. -
ఐదు నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: దేశీయ మార్చి రిటైల్ ద్రవ్యోల్బణం 4.85 శాతంతో ఐదు నెలల కనిష్ట స్థాయిలో క్షీణించింది. వినియోగదారుల ధరల సూచిక (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలో 5.09 శాతం, మార్చిలో 5.66 శాతంగా ఉంది. గతేడాది అక్టోబర్లో 4.87 శాతంగా ఉంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన డేటా ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం మార్చిలో 8.52 శాతంగా ఉంది, ఫిబ్రవరిలో 8.66 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణం 2-4 శాతం వద్ద ఉండేలా చూడాలని ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్కు బాధ్యతలు అప్పగించింది. కాగా, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.9 శాతంగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 3.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. -
రిటైల్ ధరల ఉపశమనం
న్యూఢిల్లీ: రెండు నెలల నుంచి దిగివస్తున్న వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా మూడవనెల అక్టోబర్లోనూ మరింత తగ్గింది. తాజా సమీక్షా నెల్లో 4.87 శాతంగా (2022 అక్టోబర్ నెలతో పోల్చి) నమోదయ్యింది. అంతక్రితం నాలుగు నెలల్లో (జూన్లో 4.81 శాతం) ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2 ప్లస్ లేదా మైనస్తో 4 శాతం వద్ద (మినహాయింపులకు లోబడి ఎగవముఖంగా 6 శాతం) ఉండాలన్నది సెంట్రల్ బ్యాంక్కు కేంద్రం నిర్దేశం. సెపె్టంబర్, అక్టోబర్లలో ఆర్బీఐకి నిర్దేశిత పరిధిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, తమ లక్ష్యం 4 శాతమేనని గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. 2022–2023 ఆర్థిక సంవత్సరంలో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంకాగా, 2023–24లో రేటు 5.4 శాతానికి తగ్గుతుందన్నది ఆర్బీఐ అంచనా. -
ఆర్బీఐ అంచనాలను మించి ద్రవ్యోల్బణం
ముంబై: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకు మించి నమోదవుతుందని యూబీఎస్ అంచనాలు వేస్తోంది. 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2 శాతం, క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2 శాతం. అయితే క్యూ2లో అంచనాలకు మించి 6.8 శాతం వినియోగ ద్రవ్యోల్బణం నమోదవుతందన్నది యూబీఎస్ తాజా అంచనా. సెపె్టంబర్లో 6 శాతం పైబడి సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం నమోదవుతుందని భావిస్తున్నట్లు యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ తన్వీ గుప్తా జైన్ పేర్కొన్నారు. జూలైలో నమోదయిన 15 నెలల గరిష్ట స్థాయి (7.44 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83 శాతానికి తగ్గినప్పటికీ ఈ స్థాయి సైతం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయికన్నా 83 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికంగా ఉండడం గమనార్హం. పలు నిత్యావసర వస్తువులు సామాన్యునికి అందని తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 9.94 శాతంగా ఉంది. ఒక్క కూరగాయల ధరల పెరుగుదల చూస్తే, 2023 ఆగస్టులో 26.14 శాతంగా ఉంది. ఆగస్టులో ఆయిల్, ఫ్యాట్స్ విభాగం (మైనస్ 15.28 శాతం) మినహా అన్ని విభాగాల్లో ధరలూ పెరుగుదనే సూచించాయి. వీటిలో తృణధాన్యాలు (11.85 శాతం), మాంసం–చేపలు (3.68 శాతం), గుడ్లు (4.31 శాతం), పాలు–పాల ఉత్పత్తులు (7.73 శాతం), పండ్లు (4.05 శాతం), కూరగాయలు (26.14 శాతం), పుప్పు దినుసులు (13.04 శాతం), చక్కెర, సంబంధిత ఉత్పత్తులు (3.80 శాతం), సుగంధ ద్రవ్యాలు (23.19 శాతం), ఆల్కాహాలేతర పానీయాలు (3.67 శాతం), ప్రెపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ విభాగం (5.31 శాతం), ఫుడ్ అండ్ బేవరేజెస్ (9.19 శాతం), పాన్, పొగాకు, మత్తు ప్రేరిత ఉత్పత్తులు (4.10 శాతం) ఉన్నాయి. దుస్తులు, పాదరక్షల విభాగంలో ఆగస్టు వినియోగ ద్రవ్యోల్బణం 5.15 శాతంగా ఉంది. హౌసింగ్ విభాగంలో ధరల పెరుగుదల 4.38 శాతం. ఫ్యూయెల్ అండ్ లైట్లో 4.31 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. -
వృద్ధి వేగవంతం.. ధరలే దారుణం
ముంబై: భారత ఆరి్థక వ్యవస్థ రెండో త్రైమాసికంలో ఊపందుకుంటోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆర్టికల్ ఒకటి పేర్కొంది. అయితే వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం ఆర్బీఐకి నిర్దేశిస్తున్న స్థాయికి మించి (6 శాతం) సగటున కొనసాగుతుండడమే ఆందోళన కరమైన అంశమని ఆర్బీఐ నెలవారీ బులెటిన్లో వెలువడిన ఒక కథనం పేర్కొంది. జూన్లో 4.87 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బనం జూలైలో 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి ఎగసిన నేపథ్యంలో తాజా కథనం వెలువడ్డం గమనార్హం. సమీక్షా నెల్లో టమాటా, కూరగాయలు, ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ధరల తీవ్రత విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోసైతం ప్రస్తావిస్తూ, సమస్యను తగ్గించడానికి తగిన మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్బీఐ అభిప్రాయాలు కావు... రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ కథనాన్ని రచించింది. అయితే, ఆరి్టకల్లో వ్యక్తీకరించిన అభిప్రాయాలు రచయితలవి మాత్రమేనని, వీటిని రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయాలుగా పరిగణించరాదని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. వెలువడిన ఆరి్టకల్లోని కొన్ని అంశాలు పరిశీలిస్తే.. మొదటి త్రైమాసికంలో పటిష్టమైన పనితీరు తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మందగించింది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత్లో వినియోగ డిమాండ్ బాగుంది. పెట్టుబడుల పరిస్థితి ప్రోత్సాహకరంగా కొనసాగుతోంది. ఆయా అంశాలు భారత్కు లాభిస్తున్నాయి. అంతర్జాతీయ మందగమన పరిస్థితులతో కుంటుపడిన ఎగుమతుల క్షీణబాట ప్రతికూలతలను అధిగమించగలుగుతున్నాం. -
ధర దడ
న్యూఢిల్లీ: ఆహార ధరలు ఇటు రిటైల్గానూ, అటు టోకుగానూ ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వం జూలైకి సంబంధించి సోమవారం వెలువరించిన గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో ఏకంగా 7.44%గా (2022 ఇదే నెల ధరలతో పోల్చి ధరల పెరుగుదల) నమోదయ్యింది. గడచిన 15 నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. సూచీలో కీలక విభాగాలైన కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు తీవ్రంగా పెరగడం దీనికి కారణం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ లేదా మైనస్తో 4% వద్ద ఉండాలి. అంటే అప్పర్ బ్యాండ్లో 6% అధిగమిస్తే... దానిని ఎకానమీలో డేంజర్ బెల్స్గా పరిగణించాల్సి ఉంటుంది. తాజా సమీక్షా నెలలో అంకెలు ఈ స్థాయిని అధిగమించడం గమనార్హం. 2022 జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.71% ఉంటే, ఈ ఏడాది జూన్లో 4.87గా నమోదయ్యింది. 2022 ఏప్రిల్లో 7.79% రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఆ స్థాయికి మళ్లీ రిటైల్ ద్రవ్యోల్బణం చేరడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఫుడ్ బాస్కెట్ 11.51 శాతం అప్ వినియోగ ధరల సూచీలో కీలక విభాగాలు చూస్తే.. ఒక్క ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం జూలైలో 11.51 %గా నమోదయ్యింది. జూన్లో ఈ రేటు 4.55 శాతం. జూలై 2022లో ఈ రేటు 6.69%గా ఉంది. ఒక్క కూరగాయల ధరలు జూలైలో ఏకంగా 37.43% ఎగశాయి. తృణ ధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ధరలు 13% పెరిగినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) పేర్కొంది. టోకు సూచీ మైనస్ 1.36 శాతం... టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూలైలో వరుసగా నాల్గవనెల మైనస్లోనే కొనసాగింది. టోకు సూచీ బాస్కెట్ మొత్తంగా చూస్తే జూలై ధరలు అసలు పెరగకపోగా మైనస్ 1.36 శాతంగా నమోదయ్యింది. ఈ ధోరణిని ప్రతి ద్రవ్యోల్బణంగా పరిగణిస్తారు. కాగా, సూచీలో కీలక విభాగమైన ఫుడ్ బాస్కెట్లో ధరల స్పీడ్ మాత్రం ఏకంగా 14.25% ఎగసింది (గత ఏడాది జూలై ధరలతో పోలి్చ). ఒక్క కూరగాయల ధరలు భారీగా 62.12% ఎగశాయి. తృణ ధాన్యాలు, పప్పు దినుసుల ధరలు వరుసగా 8.31%, 9.59% చొప్పున పెరిగాయి. ఇక మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, కెమికల్ అండ్ కెమికల్ ప్రొడక్ట్స్, జౌళి ధరలు మాత్రం తగ్గాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇదే ధోరణిలో ఆహార ధరలు పెరిగితే, టోకున ధరలు ప్రతి ద్రవ్యోల్బణం నుంచి ద్రవ్యోల్బణం బాటకు మారతాయని కేర్ఎడ్జ్ చీఫ్ ఎకనమిస్ట్ రజనీ సిన్హా పేర్కొన్నారు. -
ఎకానమీకి గణాంకాల ఊరట, దేశంలో గరిష్టానికి చేరిన రీటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి బుధవారం వెలువడిన గణాంకాలు ఎకానమీకి కొంత ఊరటనిచ్చాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెల్లో మూడు నెలల గరిష్ట స్థాయిలో 4.81 శాతంగా నమోదవగా, మే నెల పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 5.2 శాతం పురోగతి నెలకొంది. తయారీ, మైనింగ్ రంగాలు మంచి పనితీరును ప్రదర్శించాయి. రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెల్లో మూడు నెలల గరిష్ట స్థాయిని చూసినా, అది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయిలోనే ఉండడం ఊరట నిస్తున్న అంశం. అన్ని విభాగాలూ పురోగతిలోనే... మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం 5.7 శాతం వృద్ధిని (గత ఆర్థిక సంవత్సరం ఇదే నెల విలువతో పోల్చి) నమోదుచేసుకుంది. ♦ విద్యుత్ ఉత్పత్తి 0.9% వృద్ధి నమోదయ్యింది. ♦ మైనింగ్లో 6.4 శాతం పురోగతి ఉంది. ♦ క్యాపిటల్ గూడ్స్ విభాగంలో 8.2 శాతం వృద్ధి. ♦కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తిలో 1.1% వృద్ధి. ♦ మౌలిక, నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 14%. ఏప్రిల్– మే నెలల్లో... ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 4.8 శాతం వృద్ధి నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలల్లో ఈ రేటు 12.9 శాతంగా నమోదయ్యింది. అమెరికన్లకు ఊరట మరోవైపు అమెరికా ద్రవ్యోల్బణం కట్టడి అక్కడి ప్రజలకు భారీ ఊరట కల్పించింది. లేబర్ డిపార్ట్మెంట్ జూన్లో వార్షిక ప్రాతిపదికన వినియోగదారుల ధరల సూచిక 3 శాతం పెరిగింది. మేలో 4శాతం వార్షిక లాభం నుండి తగ్గింది. నెలవారీ ప్రాతిపదికన సీపీఐ ద్రవ్యోల్బణం 0.2 శాతం లాభపడింది. తాజాగా, సీపీఐ డేటా ఫెడరల్ రిజర్వ్ రేట్ పెంపుదల చివరకు ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పట్టింది.. సంవత్సరానికి పైగా సీపీఐ ద్రవ్యోల్బణం జూన్ 2022లో 9.1% శాతం 40 సంవత్సరాల గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఇది ఇప్పుడు వరుసగా 12 నెలలు పడిపోయింది. -
ధరల కట్టడే లక్ష్యం... కానీ సవాళ్లు ఉన్నాయ్!
ముంబై: కేంద్రం నిర్దేశిస్తున్నట్లు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లక్ష్యానికి చేర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రయత్నిస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. అయితే ఆర్బీ ఐ ప్రయత్నాలకు ఎల్ నినో సవాలుగా నిలుస్తో ందని వెల్లడించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి సాధిస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన ఉద్ఘా టించారు. గత ఏడాది మే నుంచి 2.50 శాతం పెరిగిన రెపో రేటు (బ్యాంకులకు తాని చ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం), సరఫరాలవైపు సమస్య ల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.25 శాతానికి (2022 ఏప్రిల్లో 7.8 శాతం) దిగిరావడా నికి కారణమని ఆయన ఒక ఇంటర్వ్యూలో పే ర్కొన్నారు. గోధుమలు, బియ్యం నిల్వల వి డుదల వంటి ఫుడ్ కార్పొరేషన్ చర్యలు ధరలు దిగిరావడానికి కారణమయ్యాయి. కొన్ని ప్రొడక్టులపై సుంకాల తగ్గింపూ ఇక్కడ సానుకూలమయ్యింది. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► 2023–24లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతం ఉంటుందని భావిస్తున్నాం. 4 శాతానికి దీనిని కట్టడి చేయడానికీ ప్రయతి్నస్తున్నాం. ఎల్ నినో సవాళ్లు నెలకొనే ఆందోళనలు ఉన్నాయి. (పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలో మార్పులకు గురికావడమే ఎల్ నినో. ఇది భారత్, ఆ్రస్టేలియాలో భారీ వర్షపాతం, పంట ఉత్పాదకతకపై ప్రభావం, కరువు పరిస్థితులను సృష్టించడం వంటి పరిణామాలకు దారితీయవచ్చు.) ► ద్రవ్యోల్బణం అదుపులోనికి వస్తే, ప్రజలు తక్కువ వడ్డీరేటు వ్యవస్థను ఆశించవచ్చు. ► ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం రష్యా–ఉక్రెయిన్ యుద్ధమే. ఇది కమోడిటీ ధరలను పెంచే అంశం. అయితే ప్రస్తుతం బ్యారల్కు 76 డాలర్ల వద్ద ఉన్న క్రూడ్ ధర వల్ల ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదు. ► ప్రాజెక్ట్ రుణాలుసహా కార్పొరేట్ల నుండి క్రెడిట్ కోసం చాలా డిమాండ్ ఉంది. మొత్తం రుణ వృద్ధి అన్ని రంగాల విస్తృత ప్రాతిపాతిపదికన నమోదవుతోంది. ► 2023 క్యాలెండర్ సంవత్సరంలో రూపాయి తక్కువ అస్థిరతను కలిగి ఉంది. డాలర్తో పోలిస్తే దేశీయ కరెన్సీ బలపడింది. అస్థిరతను తగ్గించడానికి ఆర్బీఐ తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది. ► అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ రేట్లను పెంచినప్పటికీ రూపాయిపై ప్రభావం పడదని విశ్వసిస్తున్నాం. అమెరికాలో ఫెడ్ ఫండ్ రేటు 5 శాతం పెరిగినప్పటికీ దేశీయ కరెన్సీ స్థిరంగా ఉంది. ► దేశానికి వచీ్చ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వలకు మధ్య నికర వ్యత్యాసం– కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) 2023–24 ఆర్థిక సంవత్సరంలో ‘‘పటిష్ట నిర్వహణ స్థాయిలో’’ ఉంటుందని భావిస్తున్నాం. సేవా రంగం నుంచి అధిక ఎగుమతులు, క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉండడం దీనికి కారణం. ఈ ప్రయత్నాలకు ఎల్ నినో ప్రధాన విఘాతం – శక్తికాంత్దాస్, ఆర్బీఐ గవర్నర్ -
నెమ్మదిగా దారిలోకి.. ద్రవ్యోల్బణం
ముంబై: భారత్లో ద్రవ్యోల్బణ నెమ్మదిగా అదుపులోనికి వస్తుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం అన్నారు. సమీప మధ్యకాలిక సమయంలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం మేరకు 4 శాతానికి తగ్గించడం జరుగుతుందని కూడా భరోసా ఇచ్చారు. లండన్లో సెంట్రల్ బ్యాంకింగ్ నిర్వహించిన ఒక సెమినార్లో ఆయన ప్రసంగించారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మేలో రెండేళ్ల కనిష్టస్థాయి 4.25 శాతానికి తగ్గిన నేపథ్యంలో శక్తికాంత్దాస్ తాజా ప్రసంగం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం 2 ప్లస్ లేదా 2 మైనస్తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే 6 శాతం పైబడకూడదు. అయితే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, చమురు ధరల తీవ్రత, వడ్డీరేట్ల పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో 2022 నవంబర్, డిసెంబర్, 2023 మార్చి, ఏప్రిల్, మే మినహా మిగిలిన అన్ని నెలలూ 6 శాతం ఎగువనే రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగింది. తాజా సమీక్షా నెల మే నెల్లో 2021 ఏప్రిల్ కనిష్టాన్ని (4.23 శాతం) చూసింది. గడచిన నాలుగు నెలల నుంచీ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తుండగా, వరుసగా మూడవనెల నిర్దేశిత 6 శాతం దిగువన నమోదయ్యింది. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో గత మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటును ఆర్బీఐ 6.5 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం అదుపు నేపథ్యంలో గడచిన రెండు త్రైమాసికాల్లో యథాతథంగా కొనసాగించింది. తాజా గణాంకాల ధోరణి కొనసాగితే, ఆర్బీఐ 2023లో రెపో రేటును పెంచే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. జూన్ పాలసీ సమీక్ష సందర్భంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అంచనాలను మొదటి ద్వైమాసిక సమీక్షతో పోల్చితే ఇటీవలి రెండవ ద్వైమాసిక సమావేశాల్లో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ తగ్గించింది. కిత్రం 5.2 శాతం అంచనాలను స్వల్పంగా 5.1 శాతానికి కుదించింది. జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని వరుసగా 4.6 శాతం, 5.2 శాతం, 5.4 శాతం, 5.2 శాతాలుగా ఆర్బీఐ పాలసీ సమీక్ష అంచనా వేసింది. ఎల్నినో, రుతుపవనాలపై అంచనాల్లో ఇంకా స్పష్టత లేదని కూడా ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. తాజాగా శక్తికాంత్ దాస్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ♦ దేశంలో ద్రవ్యోల్బణం లక్ష్యం మేరకు 4 శాతానికి క్రమంగా దిగివస్తుంది. ♦ ఇటీవలి నెలల్లో ద్రవ్యోల్బణం కొంత తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ♦ రేటు నిర్ణయం అంశాలపై ఏమీ చెప్పలేని అనిశ్చితి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. ♦వృద్ధి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ధరల స్థిరత్వాన్ని కొనసాగించాలని ఆర్బీఐ భావిస్తోంది. అధిక జనాభా, వారి పురోగతిని అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ బ్యాంక్ వృద్ధిపై కూడా ఆర్బీఐ దృష్టిపెడుతుంది. ♦ ధరల స్థిరత్వం లేకుంటే ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని మేము గుర్తించాము. ద్రవ్య విధానం– దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వంపై పూర్తి దృష్టి కేటాయింపు ఉంటుంది. ♦ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి (4 శాతం ఎగువన) ఉన్నప్పటికీ మహమ్మారి సంవత్సరాలలో ఆర్బీఐ తన పాలసీ విధానంలో వృద్ధికి ప్రాధాన్యతనిచ్చిం ది. ♦ ఆర్థిక, ద్రవ్య విధానాల చురుకైన సమన్వయం, ప్రతిస్పందన వల్ల ఎకానమీ రికవరీ త్వరిత పునరుద్ధరణకు దోహదపడింది. ♦ బ్యాంకింగ్, డిజిటలైజేషన్, టాక్సేషన్, తయారీ అలాగే కార్మికులకు సంబంధించిన వివిధ నిర్మాణాత్మక సంస్కరణలు గత కొన్ని సంవత్సరాలుగా అమలయ్యాయి. తద్వారా మధ్యస్థ, దీర్ఘకాలంలో బలమైన– స్థిరమైన వృద్ధికి పునాదులు పడ్డాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో క్షీణత తర్వాత స్థూల దేశీయోత్పత్తి త్వరితగతిన మెరుగుపడ్డానికి ఆయా అంశాలు కారణం. ♦ 2023–24లో భారత్ 6.5 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటుందని భావిస్తున్నాం. ఇది 2023లో ప్రపంచ దేశాలకన్నా వేగవంతమైన వృద్ధి రేటు. ♦ మూలధన వ్యయాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత హర్షణీయం. ఇది ఎకానమీలో అదనపు సామర్థ్యాన్ని సృష్టిస్తోంది. అలాగే కార్పొరేట్ పెట్టుబడి చట్రంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న పునరుజ్జీవనాన్ని ప్రోత్సహిస్తుంది. ♦ నియంత్రణ, పర్యవేక్షణ విభాగాలపై కూడా ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంది. బ్యాంకుల వ్యాపార నిర్ణయాల విషయంలో నిరంతరం జోక్యం చేసుకోకుండా, బ్యాంకులు– ఇతర రుణ సంస్థల వ్యాపార నమూనాలను తరచూ లోతుగా పరిశీలిస్తూ, వాటి రుణాలు–డిపాజిట్ల అసమతుల్యతలు, నిధుల స్థిరత్వం నిశితంగా ఆర్బీఐ పరిశీలిస్తుంది. ♦ ఏదైనా అనిశ్చితి, సంక్షోభం తలెత్తే పరిస్థితి ఉంటే, ముందస్తు హెచ్చరిక సంకేతాల వ్యవస్థను మా బ్యాంకింగ్ కలిగి ఉంది. ఇవి ప్రమాదాన్ని పెంచడానికి దారితీసే సూచనలను, వాటిని కట్టడి చేసే చర్యలును సూచిస్తాయి. సవాళ్లను గుర్తించడానికి బ్యాంకింగ్ వెలుపలి ఆడిటర్ల సహాయసహకారాలనూ తీసుకుంటుంది. -
ఆర్థిక వ్యవస్థ శుభ సంకేతాలు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో తాజా గణాంకాలు ఉత్సాహాన్ని నింపాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 4.25 శాతంగా నమోదయ్యింది. అంటే 2022 మేతో పోల్చితే 2023 మేలో రిటైల్ ధరల బాస్కెట్ 4.25 శాతమే పెరిగిందన్నమాట. గడచిన రెండేళ్ల కాలంలో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడ్డం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం 2 ప్లస్ లేదా 2 మైనస్తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే 6 శాతం పైబడకూడదు. అయితే 2022 నవంబర్, డిసెంబర్, 2023 మార్చి, ఏప్రిల్, మే మినహా మిగిలిన అన్ని నెలలూ 6 శాతం ఎగువనే రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగింది. తాజా సమీక్షా నెల్లో 2021 ఏప్రిల్ కనిష్టాన్ని (4.23 శాతం) చూసింది. గడచిన నాలుగు నెలల నుంచీ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తుండగా, వరుసగా మూడవనెల నిర్దేశిత 6 శాతం దిగువన నమోదయ్యింది. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో గత మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటును ఆర్బీఐ 6.5 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం అదుపు నేపథ్యంలో గడచిన రెండు త్రైమాసికాల్లో యథాతథంగా కొనసాగించింది. తాజా గణాంకాల ధోరణి కొనసాగితే, ఆర్బీఐ 2023లో రెపో రేటును పెంచే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 4.7 శాతం కాగా, గత ఏడాది మే నెల్లో 7.04 శాతంగా ఉంది. కీలకాంశాలు ఇవీ... ఒక్క ఆహార విభాగాన్ని పరిశీలిస్తే, మే నెల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.91 శాతంగా ఉంది. ఏప్రిల్లో ఇది 3.84 శాతం. మొత్తం సూచీలో దీని వెయిటేజ్ దాదాపు 50 శాతం. ఆయిల్, ఫ్యాట్స్ ధరల స్పీడ్ తాజా సమీక్షా నెల్లో 16 శాతం తగ్గింది. కూరగాయల ధరలు 8.18 శాతం దిగివచ్చాయి. అయితే తృణధాన్యాలు, పప్పుదినుసుల ధరలు వరుసగా 12.65 శాతం, 6.56 శాతంగా ఉన్నాయి. ► ఫ్యూయెల్ లైట్ విభాగంలో ధరల స్పీడ్ ఏప్రిల్ లో 5.52% ఉంటే, మేలో 4.64 శాతం. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా. జూన్ త్రైమాసికంలో 4.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఏప్రిల్లో తయారీ, మైనింగ్ చక్కని పనితీరు ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి నెల ఏప్రిల్లో పారిశ్రామిక రంగం మంచి ఫలితాన్ని నమోదుచేసింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (సీపీఐ) వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదయ్యింది. తయారీ, మైనింగ్ రంగాలు మంచి వృద్ధిరేటును నమోదుచేసుకున్నట్లు అధికా రిక గణాంకాలు తెలిపాయి. 2023 మార్చితో పోల్చితే (1.7 శాతం వృద్ధి) గణాంకాల తీరు బాగున్నప్పటికీ, 2022 ఏప్రిల్తో పోల్చితే (6.7 శాతం) వృద్ధి రేటు తక్కువగా ఉండడం గమనార్హం. అయితే అప్పటి గణాంకాల్లో బేస్ తక్కువగా ఉండడం మరోఅంశం. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన తాజా అంకెలను పరిశీలిస్తే... -
భారీగా పడిపోయిన రీటైల్ ద్రవ్యోల్బణం
వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. దేశంలో వరుసగా మే నెలలో నాలుగో సారి రీటైల్ ద్రవ్యోల్బణం భారీగా పడిపోయింది. ఏప్రిల్లో రీటైల్ ద్రవ్యోల్బణం 4.70 ఉండగా మే నెల సమయానికి 4.25 కి పడిపోయిందని కేంద్ర గణాంకాల కార్యాలయం (National Statistics Office (NSO) తెలిపింది. వినియోగదారుల ధరల సూచీ ప్రకారం..మే నెలలో రీటైల్ ద్రవ్యోల్బణం 4.25 శాతంగా నమోదై 25 నెలల కనిష్ఠానికి చేరింది.ఈ ఏడాది జనవరి నుంచి 227 పాయింట్లు పడిపోవడం గమనార్హం. అయినప్పటికీ సీపీఐ ద్రవ్యోల్బణం వరుసగా 44వ నెలలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మధ్యకాలిక లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగా ఉంది. -
ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం 6.44 శాతం
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలో 6.44 శాతంగా (2022 ఇదే నెల ధరల బాస్కెట్తో పోల్చి) నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం కన్నా ఇది ఎగువన కొనసాగుతుండడం గమనార్హం. అయితే 2023 జనవరి 6.52% కన్నా ద్రవ్యోల్బణం కొంత తగ్గింది. ఆర్బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2022 నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి 6 శాతం ఎగువనే కొనసాగుతోంది. ► ఫుడ్ బాస్కెట్ రిటైల్ ద్రవ్యోల్బణం 5.95%గా నమోదైంది. కూరగాయల ధరలు వార్షిక ప్రాతిపదికన చూస్తే, 11.61% తగ్గాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 20%, తృణ ధాన్యా లు, ఉత్పత్తుల ధరలు 17% పెరిగాయి. ► ఫ్యూయెల్ అండ్ లైట్ సెగ్మెంట్లో ద్రవ్యోల్బణం 9.90 శాతంగా ఉంది. రెపో మరింత పెరుగుదల: డీబీఎస్ రిసెర్చ్ ఇదిలాఉండగా, రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువనే కొనసాగుతున్న నేపథ్యంలో, వచ్చే నెల జరగనున్న ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానం సందర్భంగా ఆర్బీఐ రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని డీబీఎస్ రిసెర్చ్ తన తాజా నివేదికలో అంచనావేసింది. -
మళ్లీ రిటైల్ ధర‘దడ..’
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పంజా విసిరింది. ధరల స్పీడ్ జనవవరిలో మూడు నెలల గరిష్ట స్థాయి 6.52 శాతంగా (2022 ఇదే నెలతో పోల్చి ధరల తీరు) నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్నదానిప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉండాలి. అయితే 10 నెలలు ఆపైన కొనసాగిన రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్, డిసెంబర్ నెలల్లో కట్టడిలోకి (ఆరు శాతం దిగువకు) వచ్చింది. ఆర్బీఐ ద్రవ్య, పరపతి విధానాలకు ముఖ్యంగా రెపోపై నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక అయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు), మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఈ నెల మొదట్లో వరుసగా ఆరవసారి పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం తాజా లెక్కల ప్రకారం ఫడ్ బాస్కెట్ ధర జనవరిలో 5.94 శాతం ఎగసింది. డిసెంబర్లో ఈ పెరుగుదల రేటు 4.19 శాతం. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 6.85 శాతం అయితే, పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 6 శాతంగా ఉంది. 2022–23లో రిలైట్ ద్రవ్యోల్బణం సగటును 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ తాజా పాలసీ సమీక్షలో అంచనావేయగా, జనవరి–డిసెంబర్ మధ్య 5.7 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. -
ధరల ఎఫెక్ట్.. దేశంలో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
దేశంలో నిత్యవసరాల ధరల మంట మండుతోంది. పెట్రోల్,డీజిల్తో పోటీగా కూరగాయలు, వంటనూనెల ధరలు రోజు రోజుకీ పెరిగిపోతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ధరా భారం నిరుపేదలనే కాకుండా మధ్యతరగతి, ఆపై వర్గాల వారినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీని ప్రభావం కారణంగా ఆహార ద్రవ్యోల్బణం దూసుకెళ్తుంది. డిసెంబర్ నెలలో ఆహార ద్రవ్యోల్బణం 4.19 శాతం ఉండగా..జనవరిలో 5.94 శాతానికి చేరింది. ప్రైస్ ఇండెక్స్ బాక్స్ ప్రకారం..రిటైల్ ద్రవ్యోల్బణంలో ఆహార ధరల ద్రవ్యోల్బణం వాటా దాదాపు 40 శాతంగా ఉంది. ఆర్బీఐ తొలిసారి మూడు నెలల కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) ద్రవ్యోల్బణం 6 శాతంగా అంచనా వేసింది. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్ నెలలో ద్రవ్యోల్బణం 6.77 శాతంగా ఉంది. దేశంలో ఆహార ధరలు విపరీతంగా పెరిగడం వల్లే రీటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. ఇక తృణధాన్యాల ధరలు ఏడాది ప్రాతిపదికన 16.12 శాతం పెరగగా, గుడ్లు 8.78 శాతం, పాలు 8.79 శాతం పెరిగాయి. కూరగాయల ధరలు 11.7 శాతం పడిపోయాయి. ద్రవ్యోల్బణం అంటే వస్తువుల సాధారణ ధరలు ఒక పీరియడ్ ఆఫ్ టైమ్లో క్రమంగా పెరిగే స్థాయినే ద్రవ్యోల్బణం అంటారు. మూడు నెలలు లేదా ఆరు నెలలు లేదా ఏడాది ఇలా ఒక పర్టిక్యులర్ కాలాన్ని లెక్కలోకి తీసుకొని ఈ ద్రవ్యోల్బణాన్ని కొలుస్తారు. -
ఎకానమీ శుభ సంకేతాలు!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీకి సంబంధించి వెలువడిన తాజా గణాంకాలు ఆశాజనక పరిస్థితిని సృష్టించాయి. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధికి సంబంధించి సూచీ– ఐఐపీ 2022 నవంబర్లో (2021 నవంబర్తో పోల్చి) ఐదు నెలల గరిష్ట స్థాయి 7.1 శాతంగా నమోదయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక పాలసీ రేటు నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్టానికి పడిపోయింది. ఈ సూచీ వరుసగా రెండవనెల ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువన 5.72 శాతంగా నమోదయ్యింది. 2022 అక్టోబర్లో ఐఐపీలో అసలు వృద్ధి లేకపోగా 4.2 శాతం క్షీణించింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గురువారం ఈ గణాంకాల ముఖ్యాంశాలు... కీలక రంగాల పురోగతి ► తయారీ: సూచీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న ఈ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు నవంబర్లో 6.1 శాతంగా నమోదయ్యింది. ► మైనింగ్: ఈ రంగంలో 9.7 శాతం పురోగతి ఉంది. ► విద్యుత్: విద్యుత్ ఉత్పత్తి వృద్ధి భారీగా 12.7 శాతం నమోదయ్యింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉ త్పత్తి, డిమాండ్ను సూచించే ఈ విభాగం ఏకంగా 20.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► డ్యూరబుల్స్: ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ఉత్పత్తికి సంబంధించి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 5.1 శాతం వృద్ధి నమోదుకాగా, సబ్సులు, పెర్ఫ్యూమ్స్ వంటి ఎఫ్ఎంసీజీ విభాగానికి సంబంధించిన కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్ విభాగంలో వృద్ధి రేటు 8.9 శాతంగా ఉంది. ► ఇన్ఫ్రా, నిర్మాణం: వృద్ధి 12.8 శాతంగా నమోదయ్యింది. ► తొమ్మిది నెలల్లో..: ఇక ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఐఐపీ వృద్ధి రేటు 5.5 శాతంగా ఉంది. తగ్గిన ఫుడ్ బాస్కెట్ ధరల స్పీడ్ డిసెంబర్లో ఫుడ్ బాస్కెట్ తగ్గడం మొత్త రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉండాల్సి ఉండగా, 2022 అక్టోబర్ వరకూ వరుసగా 10 నెలలు ఆ పైన కొనసాగింది. నవంబర్లో 5.88 శాతంగా నమోదుకాగా, మరుసటి నెల డిసెంబర్లో మరింత తగ్గి 5.72 శాతానికి (2021 డిసెంబర్తో పోల్చి) చేరడం ఎకానమీకి ఊరటనిచ్చే అంశం. ఎన్ఎస్ఓ గణాంకాల ప్రకారం, ఫుడ్ బాస్కెట్ ధరల స్పీడ్ నవంబర్లో 4.67 శాతం ఉండగా, డిసెంబర్లో మరింత తగ్గి 4.19 శాతానికి చేరింది. కూరగాయల ధరల స్పీడ్ వార్షికంగా 15 శాతానికి పైగా పడిపోయింది. పండ్ల ధరల స్పీడ్ 2 శాతంగా ఉంది. అయితే సుగంధ ద్రవ్యాల ధరలు మాత్రం 20 శాతం పెరిగాయి. తృణ ధాన్యాల ధరలు 14 శాతం ఎగశాయి. ఫ్యూయల్ అండ్ లైట్ విభాగంలో ధరల పెరుగుదల రేటు 11 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా 2022 మే తర్వాత ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోన 2.25 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 6.25 శాతానికి చేరింది. కొన్ని కమోడిటీల ఎగుమతుల నిషేధంసహా ధరల కట్టడికి కేంద్రం కూడా పలు చర్యలు తీసుకుంటోంది. -
ద్రవ్యోల్బణం కట్టడిలో వైఫల్యంపై ఆర్బీఐ చర్చ
ముంబై: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం లోపు కట్టడిచేయడంలో వైఫల్యం ఎందుకు చోటుచేసుకుందన్న అంశంపై గవర్నర్ శక్తికాంత్దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందుకు సంబంధించి కేంద్రానికి సమర్పించాల్సిన నివేదికాంశాలపై చర్చించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతంలోపు ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి ఆపైనే ధరల స్పీడ్ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ వివరణ ఇవ్వాల్సి ఉంది. కేంద్రానికి నివేదిక ఇవ్వనున్న విషయం ఇటీవలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష సందర్బంగా గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. అయితే ఈ వివరాలను తెలపడానికి మాత్రం నిరాకరించారు. సెంట్రల్ బ్యాంక్ తన లక్ష్యాన్ని విఫలం కావడానికి సంబంధించిన ఆర్బీఐ చట్టం 45జెడ్ ఎన్ సెక్షన్ కింద ఈ సమావేశం జరిగిందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. -
ధరల స్పీడ్కు వడ్డీ రేటు పెంపు బ్రేక్!
న్యూఢిల్లీ: బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) పెంపు చర్యలు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కట్డికి దోహదపడుతుందని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్ స్పష్టం చేశారు. 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపునకు దిగివస్తుందన్న బరోసా ఇచ్చారు. వ్యవస్థలో ప్రస్తుత వడ్డీరేట్లు వృద్ధి రికవరీకి ఎటువంటి విఘాతం ఏర్పడని స్థాయిలోనే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. దీనికితోడు ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తగ్గుముఖం పడతాయని, సరఫరాల చైన్ మున్ముందు మరింత మెరుగుపడే అవకాశం ఉందని ఆమె ఒక టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో తెలిపారు. సరఫరాల వైపు సమస్యలను తగ్గించడానికి భారత్ ప్రభుత్వం నుంచి సైతం తగిన చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇవన్నీ వచ్చే ఐదారు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడతాయన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ద్రవ్యోల్బణం కట్టడికిగాను ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ గడచిన మే నుంచి పెంచిన 190 బేసిస్ పాయింట్ల రెపో రేటు ప్రభావం వ్యవస్థలో కనబడ్డానికి 5 నుంచి 6 త్రైమాసికాలు (సంవత్సన్నర వరకూ) పడుతుందని మరో ఎంపీసీ సభ్యుడు జయంత్ ఆర్ వర్మ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. కరెన్సీ విషయంలో మనం బెస్ట్ డాలర్ మారకంలో భారత్ రూపాయి ఎప్పటికప్పుడు చరిత్రాత్మక కనిష్టాలను తాకుతున్న అంశానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు ఎంపీసీ ఆరుగురు సభ్యుల్లో ఒకరైన గోయల్ సమాధానం చెబుతూ, ‘క్షీణించిన రూపాయి దిగుమతుల బిల్లును మరింత పెంచుతుంది. విదేశాలలో రుణాలు తీసుకున్న వారిని సమస్యల్లోకి నెడుతుంది. అయితే కొంతమంది ఎగుమతిదారులకు రాబడిని పెంచుతుంది’ అని అన్నారు. ఫెడ్ రేట్లు పెరగడం వల్ల అమెరికా తిరిగి వెళుతున్న డాలర్ల వల్ల ఈ రిజర్వ్ కరెన్సీ విలువ పెరుగతోందని అన్నారు. అన్ని కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడుతోందని వివరించారు. ఇతర అభివృద్ధి చెందిన, వర్థమాన మార్కెట్లతో పోల్చితే రూపాయి విలువ పతనం తక్కువగా ఉందని అన్నారు. ఇటీవల ఈక్విటీ ఇన్ఫ్లోస్ కూడా తిరిగి పెరుగుతున్నట్లు తెలిపారు. భారత్ ఈక్విటీల ధరల పతనం తక్కువగా పలు దేశాలతో పోల్చితే తక్కువగా ఉందని స్పష్టం చేశారు. భారత్ మార్కెట్పై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఇది తెలియజేస్తుందని పేర్కొన్నారు. వాల్యుయేషన్ ప్రభావాల వల్లే భారత్ విదేశీ మారకపు నిల్వలు (ఫారెక్స్) ఎక్కువగా పడిపోయాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ ఫారెక్స్ ఏడాది కాలంలో దాదాపు 100 డాలర్ల తగ్గి 544 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో 77 శాతం వ్యాల్యుయేషన్ల ప్రభావం వల్లే తగ్గాయని ఆర్బీఐ సెప్టెంబర్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా వివరించిన సంగతి తెలిసిందే. తక్కువ దిగుమతులు– అధిక ఎగుమతులు కరెంట్ ఖాతా (భారత్లోకి వచ్చీ–పోయే విదేశీ నిధుల మధ్య నికర వ్యత్యాసం) లోటును తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొన్న ఆమె, ఎగుమతుల పెంపు ఆవశ్యకతను ఉద్ఘాటించారు. అంతర్జాతీయ మందగమనం ప్రతికూలమే, కానీ... ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఏర్పడుతుందనే భయంపై అడిగిన ప్రశ్నకు గోయల్ సమాధానం చెబుతూ, ప్రపంచ మందగమనం భారత్పై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. ‘కానీ భారతదేశానికి పెద్ద దేశీయ మార్కెట్ ఉంది. దాని పరిమాణం, వైవిధ్యం, వైశాల్యం, ఆర్థిక రంగం బలం మంచి సానుకూల వృద్ధినే అందిస్తుంది’’ అని స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో కార్పొరేట్లు రుణాన్ని తగ్గించుకున్నారని, ఆర్థిక రంగం బాగా మూలధనం పొందిందని గోయల్ తెలిపారు. ఇవన్నీ భారతదేశానికి అంతర్జాతీయంగా ఎదురయ్యే ‘మందగమన’ సవాళ్లను తగ్గిస్తాయని వివరించారు. డిసెంబర్లో మరో అరశాతం పెంపు అవకాశం అషిమా గోయల్ ప్రకటన నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ 5 నుంచి 7వ తేదీ వరకూ జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటును కనీసం అరశాతం పెంచే అవకాశం కనిపిస్తోంది. 2022 సెప్టెంబర్ వరకూ గడచిన తొమ్మిది నెలల నుంచి ఆర్బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం సెంట్రల్ బ్యాంక్కు నిర్దేశిస్తున్న స్థాయి 6 శాతానికి మించి నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్ తర్వాత) చేరింది. మరింత పెరగవచ్చనీ ఆర్బీఐ సంకేతాలు ఇచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5 శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. -
ద్రవ్యోల్బణం ఎఫెక్ట్, మరింత పెరగనున్న ఆహార ధరలు?
ఆహారం,ఇంధన ధరల పెరుగుదలతో రిటైల్ వినియోగదారుల ధరల సూచిక (CPI) ఆధారంగా ఈ ఏడాది ఆగస్టులో ద్రవ్యోల్బణం 7 శాతానికి పెరిగింది.దీంతో రానున్న రోజుల్లో ఆహారంతో పాటు ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశీయ ఉత్పత్తుల్ని నిలకడగా ఉంచేందుకు, ధరల పెరుగుదలను అరికట్టడానికి గోధుమ పిండి, బియ్యం, మైదా మొదలైన ఆహార ఉత్పత్తుల ఎగుమతులను ప్రభుత్వం నిషేధించింది. దీని ప్రభావం రాబోయే వారాల్లో ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. "రిటైల్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ)ఆధారంగా ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలై లో 6.71 శాతం నుండి ఆగస్టు నాటికి 7.0 శాతం నమోదు చేసింది. పెరిగిన ద్రవ్యోల్భణానికి కారణం ఆహారం, ఇంధర పెరుగుదలే కారణమని మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. -
సామాన్యుడికి 'ధరా' ఘాతం, కట్టడి చేయాలని నిర్మలా సీతారామన్ పిలుపు!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక పరపతి విధాన సమీక్షకు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం జూన్లో 7.01 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 జూన్ నెలతో పోల్చితే ఈ వస్తువుల బాస్కెట్ 7.01 శాతం పెరిగిందన్నమాట. అయితే మే నెలతో (7.04 శాతం) పోల్చితే స్వల్పంగా తగ్గింది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం 2 నుంచి 6 శాతం మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలి. అయితే ఈ స్థాయికి మించి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇది వరుసగా ఆరవనెల. తీవ్ర ద్రవ్యోల్బణం నేపథ్యంలో మే, జూన్ నెలల్లో ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను రెండు దఫాలుగా 0.90 బేసిస్ పాయింట్లు (0.4 శాతం, 0.5 శాతం) పెంచింది. దీనితో ఈ రేటు 4.9 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. కాగా, ద్రవ్యోల్బణం స్పీడ్ను నియంత్రించాల్సిన తక్షణ అవసరం ఉందని ఒక ప్రకటనలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వస్తువుల వారీగా ఈ కట్టడి జరగాలని ఆమె అన్నారు. ధరల తీరిది... ఇక మేతో పోల్చితే ఫుడ్ బాస్కెట్లో ధరల స్పీడ్ 7.97 శాతం నుంచి జూన్లో 7.75 శాతానికి స్వల్పంగా తగ్గింది. మేలో 18.26 శాతం ఉన్న కూరగాయల ధరాఘాతం జూన్లో 17.37 శాతానికి దిగివచ్చింది. పప్పులు సంబంధిత ప్రొడక్టుల ధర మరింతగా 1.02 శాతం తగ్గింది. మేతో తగ్గుదల 0.42 శాతం. పండ్ల ధరలు 2.33 శాతం నుంచి 3.10 శాతానికి చేరాయి. ఇంధనం, విద్యుత్ కేటగిరీలో మాత్రం ధరల స్పీడ్ 9.54 శాతం నుంచి 10.39 శాతానికి చేరింది. -
మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.04%
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మే నెల్లో 7.04 శాతంగా నమోదయ్యింది. అంటే ఈ సూచీలోని వస్తువుల బాస్కెట్ ధర 2021 మే నెలతో పోల్చితే 7.04 శాతం పెరిగిందన్నమాట. అంతక్రితం నెల ఏప్రిల్ (7.79 శాతం) కన్నా ద్రవ్యోల్బణం కొంచెం తగ్గడం ఊరటనిచ్చే అంశం. అయితే ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శాతం శ్రేణిపైన ద్రవ్యోల్బణం కొనసాగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆరుశాతం పైన రేటు నమోదుకావడం ఇది వరుసగా ఐదవనెల. ఏప్రిల్ కన్నా మేలో ధరల స్పీడ్ తగ్గడానికి ఆహార, ఇంధన ధరల్లో కొంత తగ్గుదల నమోదుకావడం కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి. మే 21న కేంద్రం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం, సరఫరాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ఇక్కడ గమనార్హం. మరోవైపు గత నెల ప్రారంభంలో ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. జూన్ మొదటి వారంలో ఈ రేటు మరో అరశాతం పెరిగింది. ఇదే ధోరణిని ఆగస్టు ద్వైమాసిక సమావేశాల్లోనూ సెంట్రల్ బ్యాంక్ కొనసాగిస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు.. ► 2022 మేలో ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 7.97 శాతం. ఏప్రిల్లో ఈ రేటు 8.31 శాతంగా ఉంది. మొత్తం వినియోగ ధరల సూచీలో ఫుడ్ బాస్కెట్ వెయిటేజ్ 39.06 శాతం. ఏప్రిల్లో 5.96 శాతం ఉన్న తృణ ధాన్యాల ద్రవ్యోల్బణం మేలో 5.33 శాతానికి తగ్గింది. ఇక ఆయిల్, ఫ్యాట్ ధరల స్పీడ్ కూడా ఇదే కాలంలో 17.28 శాతం నుంచి 13.26 శాతానికి తగ్గింది. పండ్ల ధరలు 4.99 శాతం నుంచి 2.33 శాతానికి తగ్గాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం 15.41 శాతం నుంచి 18.26 శాతానికి పెరిగాయి. కాగా, గుడ్ల ధరలు 4.65 శాతం క్షీణిస్తే, పప్పు దినుసుల ధరలు 0.42% తగ్గాయి. ► ఇక ఇంధనం, లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 10.80% ఉంటే మేలో 9.54%కి తగ్గింది. ఆర్బీఐ అంచనాలు ఇలా... 2022–23 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు ధర బ్యారల్కు (ఇండియన్ బాస్కెట్) 105 ఉంటుందని అంచనాలతో ఇటీవలి పాలసీ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2022లో తగిన వర్షపాతం, దీనితో తగిన ఖరీఫ్ పంట దిగుబడి అంచనాతో 2022–23 ఆర్థిక సంవత్సరంలో సగటును రిటైల్ ద్రవ్యోల్బణం 6.7% ఉంటుందని (తొలి అంచనా 5.5%) ఆర్బీఐ అంచనావేసింది. మొదటి త్రైమాసికంలో 7.5%, రెండవ త్రైమాసికంలో 7.4%, మూడవ త్రైమాసికంలో 6.2% నమోద య్యే రిటైల్ ద్రవ్యోల్బణం నాల్గవ త్రైమాసికంలో కేంద్రం నిర్దేశిత స్థాయి లోపునకు దిగివస్తుందని, 5.8%గా నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. జనవరి (6.01%), ఫిబ్రవరి (6.07%), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95%) నెలల్లో హద్దులు మీరి రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడం ఆందోళన కలిగించింది. పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్య్లోల్బణం ఏప్రిల్లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి ఎగసింది. -
దడ పుట్టిస్తున్న ధరలు.. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ..
న్యూఢిల్లీ: దేశ ప్రధాన ఆర్థిక రంగం ఇంకా సవాళ్లలోనే కొనసాగుతోందని తాజాగా విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు వెల్లడించాయి. కరోనా మూడవ వేవ్ (ఒమిక్రాన్) సవాళ్ల నేపథ్యంలో మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 1.9 శాతంగా నమోదయ్యింది. ఇక సామాన్యునికి ఆందోళన కలిగించే స్థాయిలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో ఏకంగా 7.79 శాతానికి ఎగసింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే రిటైల్ ఉత్పత్తుల బాస్కెట్ ధర 7.79 శాతం పెరిగిందన్నమాట. 2021 ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.23 శాతం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే వరుసగా నాలుగు నెలల నుంచి ఆపై స్థాయిలోనే రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగుతుండడం గమనార్హం. కరోనా సవాళ్లతో నెలకొన్న సరఫరాల సమస్యలు ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో మరింత పెరిగాయి. డాలర్ మారకంలో రూపాయి కనిష్ట స్థాయి పతనం ధరా భారాన్ని మరింత పెంచుతోంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గురువారం విడుదల చేసిన ద్రవ్యోల్బణం గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► 2014 మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 8.33 శాతానికి చేరింది. అటు తర్వాత మళ్లీ ఆ స్థాయిలో రేటును చూడ్డం ఇదే తొలిసారి. ► ఆహార, ఇంధన ధరల భారీ పెరుగుదల తాజాగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పెంచుతోంది. ► 2021 ఏప్రిల్లో ఒక్క ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 1.96% అయితే, 2022 మార్చితో 7.68%గా ఉంది. ఏప్రిల్లో ఈ రేటు ఏకంగా 8.38%కి పెరిగింది. ఫుడ్ బాస్కెట్లో ఒక్క కూరగాయల ధరలు ఏకంగా 15.41% పెరిగాయి. మార్చిలో ఈ పెరుగుదల 11.64 %. ► ఇంధనం, లైట్ విభాగంలో రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 7.52 శాతం ఉంటే, ఏప్రిల్లో 10.80 శాతానికి ఎగసింది. ► వంట నూనెలు, ఫ్యాట్స్ విభాగంలో ధరల భారం మార్చితో పోల్చితే (18.79 శాతం) స్వల్పంగా 17.28 శాతానికి తగ్గినా సామాన్యునికి ఈ స్థాయి ధరల పెరుగుదలే చాలా తీవ్రమైనది కావడం గమనార్హం. ఎరువులతోపాటు భారత్ వంట నూనెల అవసరాలకు ఉక్రెయిన్ ప్రధాన వనరుగా ఉంది. యుద్ధంతో ఆ దేశం అతలాకుతలం నేపథ్యంలో సరఫరాల సమస్యలు తీవ్రమయ్యాయి. జూన్లో మరో దఫా రేటు పెంపు! ఈ సంవత్సరం ప్రారంభం నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి నమోదవుతోంది. జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. తాజా సమీక్షా నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 శాతానికి చేరడంతో జూన్ మొదటి వారంలో జరిగే పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ ఎంపీసీ మరో దఫా రేట్ల పెంపు ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు. పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ మొదటి వారం ఆర్బీఐ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ కమిటీ అంచనావేసింది. అయితే ఈ లెక్కలు తప్పే అవకాశాలు స్పష్టమవడంతో నేపథ్యంలో ఈ నెల మొదట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యపరపతి విధాన మధ్యంతర కమిటీ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా రెపో రేటును అనూహ్య రీతిలో 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచింది. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. 2018 ఆగస్టు తర్వాత ఆర్బీఐ పాలసీ రేటు పెంపు ఇది. కరోనా సవాళ్ల తీవ్రత నేపథ్యంలో... 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు కొనసాగుతోంది. వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల కాలంలో రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఆర్బీఐ కొనసాగిస్తోంది. 4.4 శాతానికి రెపో రేటును పెంచడంతోపాటు వ్యవస్థలో నుంచి తక్షణం రూ.87,000 కోట్లు వెనక్కు మళ్లే విధంగా... రెపో రేటుతో బ్యాంకులు ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కూడా పరపతి విధాన కమిటీ 50 బేసిస్ పాయింట్లు పెంచి, 4.5%కి చేర్చింది. మేలోనూ పైపైనే... గతవారం అనూహ్యంగా జరిగిన ఆర్బీఐ రేటు పెంపు నిర్ణయం సమర్థనీయమేనని వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తాజా స్పీడ్ (7.79 శాతం) స్పష్టం చేస్తోంది. అలాగే జూన్ 2022లో మరో దఫా రేటు పెంపు ఖాయమన్న అంచనాలను ఈ గణాంకాలు పెంచుతున్నాయి. 2021 మేలో అధిక బేస్ వల్ల (6.3 శాతం) 2022 మేలో రిటైల్ ద్రవ్యోల్బణం కొంత తగ్గవచ్చని భావిస్తున్నాం. హై బేస్ ప్రాతిపదిక కొంత తగ్గినా, ఆర్బీఐకి నిర్దేశిస్తున్న లక్ష్యానికి ఎగవనే 6.5 శాతంగా మేలో ద్రవ్యోల్బణం ఉంటుందని మేము అంచనా వేస్తున్నాము – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్. పారిశ్రామికోత్పత్తికి హైబేస్, ఒమిక్రాన్ తలనొప్పులు పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 2022 మార్చిలో కేవలం 1.9 శాతంగా నమోదయ్యింది. కరోనా మూడవ వేవ్ ఒమిక్రాన్ సవాళ్లతో పాటు 2021 మార్చి నెల హై బేస్ (అప్పట్లో వృద్ధి రేటు ఏకంగా 24.2 శాతం) దీనికి కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. మొత్తం ఐఐపీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం సమీక్షా నెల మార్చిలో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. జనవరి, ఫిబ్రవరిలో కూడా ఐఐపీపై (వృద్ధి రేటు కేవలం 1.5 శాతం) ఒమిక్రాన్ ప్రతికూల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దాదాపు అన్ని కీలక రంగాలపై హై బేస్ ప్రభావం కనిపించింది. ► తయారీ: మార్చిలో కేవలం 0.9 శాతం వృద్ధి నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ రేటు ఏకంగా 28.4 శాతం. ► మైనింగ్: వృద్ధి రేటు 6.1% నుంచి 4 శాతానికి తగ్గింది. ► విద్యుత్: 22.5 శాతం వృద్ధి రేటు 6.1 శాతానికి దిగివచ్చింది ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్కు ప్రాతిపదిక అయిన ఈ విభాగంలో వృద్ధి రేటు 50.4 శాతం నుంచి ఏకంగా 0.7 శాతానికి తగ్గింది. ►కన్జూమర్ డ్యూరబుల్స్: 2021 మార్చిలో 59.9 శాతం వృద్ధి నమోదయితే, తాజా సమీక్షా నెల్లో అసలు వృద్ధి లేకపోగా 3.2 శాతం క్షీణించింది. 2021–22లో 8.4 శాతం పురోగతి కాగా మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఐఐపీ వృద్ధి రేటు 8.4 శాతంగా ఉంది. 2020–21 ఇదే కాలంలో అసలు వృద్ది నమోదుకాకపోగా 8.4 శాతం క్షీణతలో ఉంది. 2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట... మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది. 2020 మార్చి (మైనస్ 18.7%) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకు క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. -
అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా చర్యలు
ముంబై: అంతర్జాతీయ పరిస్థితులు, పరిణామాలకు అనుగుణంగా ఎప్పుటికప్పుడు సకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధాన చర్యలు ఉండాలని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య, పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి ఈ నెల 6 నుంచి 8 వరకూ జరిగిన సమావేశాల మినిట్స్ ఈ విషయాన్ని తెలిపింది. అనిశ్చితి ఆర్థిక పరిస్థితుల్లో నిర్ణయాలు అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా సకాలంలో తీసుకోవాలన్న గవర్నర్ అభిప్రాయానికి ఐదుగురు సభ్యులు మద్దతు పలికినట్లు మినిట్స్ వెల్లడించింది. ద్రవ్యోల్బణమే ప్రధాన సవాలు: పాత్ర కాగా, డి–గ్లోబలైజేషన్ ఆసన్నమైనట్లు కనిపిస్తున్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణమే ప్రధాన సవాలు ఉండే అవకాశం ఉందని, ఈ సవాలును జాగ్రత్తగా ఎదుర్కొనాలని ఎంపీసీ సభ్యుడు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ‘‘1980 నుంచి ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం 60 శాతం అభివృద్ధి చెందిన దేశాలు 5 శాతం కంటే ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సగానికి పైగా ద్రవ్యోల్బణం 7 శాతం కంటే ఎక్కువగా ఉంది. ధరల పెరుగుదల సామాజిక సహన స్థాయిలను పరీక్షిస్తోంది’’ అని సమావేశంలో ఆయన పేర్కొన్నట్లు మినిట్స్ తెలిపాయి. మినిట్స్ ప్రకారం సమావేశంలో ముఖ్య అంశాలు, నిర్ణయాలు ► భారత్ ఎకానమీపై ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, ఈ నేపథ్యంలో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ► ఏప్రిల్తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 60 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గింపు. దీనితో ఈ అంచనా 7.8 శాతం నుంచి 7.2 శాతానికి డౌన్. ► పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలనూ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంఉ. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి అప్. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని అంచనా. ► ద్రవ్యోల్బణం కట్టడి దిశలో వ్యవస్థలో ఒకపక్క అదనంగా ఉన్న లిక్విడిటీ వెనక్కు తీసుకుంటూనే మరో వైపు వృద్ధే లక్ష్యంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) యథాతథంగా 4 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయం. దీనితో ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా వరుసగా 11 ద్వైమాసిక సమావేశాలోనూ ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించినట్లయ్యింది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ (ఇండియన్ బాస్కెట్) బ్యారల్ ధర 100 డాలర్లుగా అంచనా. ► అన్ని బ్యాంకుల కస్టమర్లకూ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయెల్స్కు వెసులుబాటు ► అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకోడానికి కొత్తగా ‘ఎస్డీఎఫ్’ ఇన్స్ట్రమెంట్. వడ్డీ రేట్ల పెంపు ఖాయం: కేకీ మిస్త్రీ వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఇతర సెంట్రల్ బ్యాంకులతో పోలిస్తే రిజర్వ్ బ్యాంకు వెనుకబడి లేదని హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్, సీఈవో కేకీ మిస్త్రీ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది క్రమంగా రెండు లేదా మూడు దఫాలుగా పెం చేందుకు అవకాశం ఉందని .. కానీ ఎకానమీపై దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ నెల తొలినాళ్లలో పరపతి విధానం ప్రకటించిన ఆర్బీఐ.. రెపో రేటును యధాతథంగా 4 శాతం స్థాయిలోనే కొనసాగించిన సంగ తి తెలిసిందే. ఇటు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ అటు వృద్ధికి కూడా ఊతమిచ్చేలా రేట్ల పెంపుపై ఉదారవాద ధోరణిని కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ భావించింది. ఈ నేపథ్యంలోనే మిస్త్రీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణంతో భారత్లో ధరల పెరుగుదలను పోల్చి చూడరాదని ఆయన చెప్పారు. చరిత్ర చూస్తే అమెరికాలో ఎంతో కాలంగా ద్రవ్యోల్బణం అత్యంత కనిష్ట స్థాయుల్లో నమోదు అవుతుండగా .. భారత్లో భారీగా ఉంటోందని, రెండింటికి మధ్య 400 బేసిస్ పాయింట్ల మేర వ్యత్యాసం ఉంటోందని మిస్త్రీ తెలిపారు. అలాంటిది.. ప్రస్తుతం అమెరికాలో ఏకంగా 8.5 శాతం స్థాయిలో ద్రవ్యోల్బణం ఎగియగా.. భారత్లో 5.7 శాతం ద్రవ్యోల్బణం కావచ్చన్న అంచనాలు నెలకొన్నట్లు ఆయన చెప్పారు. ‘ఆ రకంగా చూస్తే అమెరికాతో పోల్చినప్పుడు మన దగ్గర ద్రవ్యోల్బణం 2.8 శాతం తక్కువగా ఉంది. ఇంత భారీ ద్రవ్యోల్బణం ఎన్నడూ చూడలేని అమెరికా .. వడ్డీ రేట్ల పెంపు వంటి తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది‘ అని మిస్త్రీ పేర్కొన్నారు. అమెరికాను చూసి భారత్ కూడా అదే ధోరణిలో వెళ్లాల్సిన అవసరం కనిపించడం లేదన్నారు. -
సామాన్యుడికి కన్నీళ్లు ? దిగులు పుట్టిస్తున్న ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: అటు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం, ఇటు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో సామాన్యుడికి కన్నీళ్లు తెప్పించాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 6.07 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే రిటైల్ ధరల బాస్కెట్ 6.07 శాతం పెరిగిందన్నమాట. 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తోంది. వరుసగా రెండవ నెలలోనూ (జనవరిలో 6.01 శాతం) ఈ స్థాయి దాటి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక టోకు ద్రవ్యోల్బణం ఏకంగా రెండంకెలపైన 13.11 శాతంగా ఉంది. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... రిటైల్ ద్రవ్యోల్బణం... ఎనిమిది నెలల గరిష్టం 2021 జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.26 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్టానికి చేరడానికి ఆహార ధరలు ప్రధాన కారణమని గణాంకాలు వెల్లడించాయి. ఆహార ధరల బాస్కెట్ సమీక్షా నెల్లో 5.89 శాతంగా నమోదయ్యింది. జనవరిలో ఈ రేటు 5.43 శాతం. ఈ బాస్కెట్లో తృణధాన్యాల ధరలు 3.95 శాతం పెరిగాయి. మాంసం, చేపల ధరలు 7.45 శాతం ఎగశాయి. కాగా, గుడ్ల ధరల స్పీడ్ 4.15 శాతంగా ఉంది. కూరగాయల ధరలు 6.13 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 6.09 శాతం ఎగశాయి. పండ్ల ధరలు మాత్రం జనవరితో పోల్చితే స్థిరంగా 2.26 శాతంగా ఉన్నాయి. ఇక ‘ఫ్యూయెల్ అండ్ లైట్’ విభాగంలో ధరా భారం తీవ్రంగా 8.73 శాతంగా ఉంది. అయితే జనవరి 9.32 శాతంతో పోల్చితే ఇది కొంచెం తగ్గడం ఊరట. క్రూడ్ ధరల తీవ్రత నేపథ్యంలో రానున్న నెలల్లో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరుతుందన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. ఆర్బీఐపై దృష్టి... ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక కావడం గమనార్హం. ద్రవ్యోల్బణం 6 శాతం పైబడిందంటే.. అది పాలసీ రేటు నిర్ణయం ప్రభావం చూపుతోంది. వరుసగా రెండవ నెలా రిటైల్ ద్రవ్యోల్బణం కట్టుతప్పడంతో రానున్న ఏప్రిల్ ఆర్బీఐ పాలసీ సమావేశాల నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో జనవరి–మార్చి త్రైమాసికంలో సగటున 5.7 శాతంగా ఉంటుందని, ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ ఫిబ్రవరి మొదట్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది. ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ మెజారిటీ (6:5) అభిప్రాయపడింది. అయితే రెపో రేటు ప్రస్తుతానికి యథాతథంగా కొనసాగించడానికి మాత్రం ఆరుగురు సభ్యులు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. వృద్ధే లక్ష్యంగా వరుసగా పది ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ రెపో రేటు యథాతథంగా కొనసాగుతోంది. టోకు ద్రవ్యోల్బణానికి క్రూడ్ సెగ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 13.11 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి) ఉంది. క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణంకాగా, నాన్–ఫుడ్ ఐటమ్స్ ధరలు కూడా తీవ్రంగా ఎగశాయి. టోకు ద్రవ్యోల్బణం రెండంకెల పైన కొనసాగుతుండడం ఆందోళనకరమైన అంశం. గడచిన పదకొండు నెలల నుంచీ అంటే 2021 ఏప్రిల్ నుంచి టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైనే కొనసాగుతోంది. 2021 ఫిబ్రవరిలో ఈ రేటు 4.83 శాతం. అప్పటిలో అతి తక్కువ బేస్, తాజా ధరలు తీవ్ర స్థాయిలో కనబడ్డానికి ఒక కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ► ఫ్యూయెల్ అండ్ పవర్ బాస్కెట్ రెండూ కలిపి ధరాభారం 31.50 శాతంగా ఉంది. అయితే ఒక్క క్రూడ్ పెట్రోలియం ధరల స్పీడ్ ఫిబ్రవరిలో ఏకంగా 55.17 శాతంగా ఉంది. జనవరిలో ఈ పెరుగుదల 39.41 శాతం. ► ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 8.19 శాతంగా ఉంది. కూరగాయల ధరల స్పీడ్ 26.93 శాతం. గుడ్లు, మాంసం, చేపల ధరలు 8.14 శాతం పెరిగాయి. ఉల్లి ధర 26.37 శాతం తగ్గింది. అయితే ఆలూ ధరలు మాత్రం 14.78 శాతం పెరిగాయి. జనవరిలో ధర పెరక్కపోగా 14.45 శాతం తగ్గింది. ► సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగంలో ద్రవ్యోల్బణం 9.84 శాతంగా ఉంది. జనవరిలో ఈ రేటు 9.42 శాతం. -
పరిశ్రమలు పడక.. ధరలు పైపైకి!
న్యూఢిల్లీ: భారత్ తాజా స్థూల ఆర్థిక గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు నవంబర్లో కేవలం 1.4 శాతంగా ఉంది. ఇక డిసెంబర్లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా 5.59 శాతానికి పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న శ్రేణి కన్నా (2–6 శాతం) ఇది తక్కువగానే ఉన్నప్పటికీ ఎగువముఖ పయనం ఆందోళన కలిగిస్తోంది. సూచీ కదలికలు ఇలా... జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గణాంకాల ప్రకారం 2020 నవంబర్లో ఐఐపీ సూచీ 126.7 వద్ద ఉంది. 2021 నవంబర్లో ఈ సూచీ 128.5కు ఎగసింది. అంటే వృద్ధి రేటు 1.4 శాతమన్నమాట. 2019 నవంబర్లో సూచీ 128.8 పాయింట్ల వద్ద ఉంటే. అంటే కోవిడ్–19 దేశంలోకి ప్రవేశించిక ముందు నవంబర్ నెలతో పోల్చితే ఇంకా పారిశ్రామిక వృద్ధి దిగువలోనే ఉందని గ ణాంకాలు సూచిస్తున్నాయి. 2020 నవంబర్లో పారిశ్రామిక రంగం ఉత్పత్తి (–1.6%) క్షీణతలో ఉన్నా, తాజా సమీక్షా నెల (నవంబర్ 2021) ఈ విభాగం పేలవ పనితీరునే కనబరచడం గమనార్హం. కీలక రంగాలు చూస్తే.. ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77.63 శాతం వాటా ఉన్న ఈ విభాగంలో వృద్ధి (2020 నవంబర్తో పోల్చి) కేవలం 0.9 శాతంగా నమోదయ్యింది. ► మైనింగ్: ఈ రంగంలో మాత్రం కొంచెం సానుకూల వృద్ధి రేటు 5 శాతం నమోదయ్యింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాలు, డిమాండ్కు సంబంధించిన ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా 3.7 శాతం క్షీణత నెలకొంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజరేటర్లు, ఎయిర్కండీషనర్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం 5.6 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, పెర్ఫ్యూమ్స్ వంటి ఎంఎఫ్సీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) విభాగంలో వృద్ధి 0.8 శాతం. నవంబర్–డిసెంబర్ మధ్య ‘బేస్ ఎఫెక్ట్’ ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్–నవంబర్ మధ్య ఐఐపీ వృద్ధి 17.4%గా నమోదైంది. దీనికి ‘లో బేస్’ ఎఫెక్ట్ ప్రధాన కారణం. ‘పోల్చు తున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదవడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కు వగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. 2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట... మహమ్మారి కరోనా భయాలతో కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల బాటన పయనించింది. 2020 మార్చి (మైనస్ 18.7%) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకూ క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. ధరల తీవ్రత మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం అప్పర్ బాండ్ 6 శాతం దిశగా కదులుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్లో 4.91 శాతంగా ఉన్న రిటైల్ ఉత్పత్తుల ధరల బాస్కెట్, డిసెంబర్లో ఏకంగా 5.59 శాతానికి (2020 ఇదే నెలతో పోల్చి) చేరింది. తాజా సమీక్షా నెల్లో ఒక్క వస్తు, సేవల ధరలు (ఆహార, ఇంధన రంగాలు కాకుండా) ఏకంగా 6.2 శాతానికి చేరడం గమనార్హం. 2021 డిసెంబర్లో ఆహార ద్రవ్యోల్బణం 4.05 శాతంగా ఉంది. నవంబర్లో రేటు 1.87 శాతం. తృణ ధాన్యాలు, ఉత్పత్తులు, గుడ్లు, పాలు–పాల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, ప్రెపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ ధరలు నవంబర్తో పోల్చితే పెరిగాయి. అయితే కూరగాయలు, పండ్లు, ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ధరలు మాత్రం కొంత తక్కువగా ఉన్నాయి. ఇంధనం, లైట్ క్యాటగిరీలో ద్రవ్యోల్బణం 10.95 శాతంగా ఉంటే, నవంబర్లో ఈ రేటు 13.35 శాతంగా ఉంది. 2021 జూలైలో 5.59 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం అటు తర్వాత తగ్గుతూ వచ్చినా, తిరిగి 2021 అక్టోబర్ నుంచి పెరుగుతూ వస్తోంది. -
రిటైల్ ద్రవ్యోల్బణం.. మూడు నెలల గరిష్టం
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్లో 4.91 శాతంగా నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శ్రేణిలోనే నవంబర్ ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ, గడచిన మూడు నెలల్లో ఈ స్థాయిలో ఈ అంకెలు నమోదుకావడం ఇదే తొలిసారి. ఆహార ఉత్పత్తుల ధరల్లో పెరుగుదలే దీనికి కారణమని సోమవారం వెలువడిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఆగస్టులో 5.3 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 4.35 శాతానికి తగ్గింది. అయితే అక్టోబర్లో స్వల్పంగా 4.48 శాతానికి ఎగసింది. రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడిలో ఉంటుందన్న భరోసాతో వృద్ధే లక్ష్యంగా ఆర్బీఐ వరుసగా తొమ్మిది ద్వైమాసిక సమావేశంలోనూ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) తాజా ప్రకటనలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► నవంబర్లో ఫుడ్ బాస్కెట్ ధర 1.87 శాతం పెరిగితే, అక్టోబర్లో ఈ పెరుగుదల రేటు 0.85 శాతంగా ఉంది. 2020 నవంబర్లో ఈ రేటు ఏకంగా 9.5 శాతం. ► గత ఏడాది నవంబర్తో పోల్చితే తాజా సమీక్షా నెల్లో కూరగాయల ధరలు తగ్గాయి. అయితే నెలవారీగా (2021 అక్టోబర్తో పోల్చి) ధరలు పెరిగాయి. ► ఆయిల్, ఫ్యాట్ విభాగంలో వార్షికంగా ధర 29.67 శాతం పెరిగింది. అయితే ఈ పెరుగుదల రేటు అక్టోబర్తో పోల్చితే తక్కువ. ► అక్టోబర్తో పోల్చితే పండ్ల ధరలు పెరిగాయి. ఆర్బీఐ అంచనాలు ఇలా... ఆర్థిక సంవత్సరంలో సగటును రిటైల్ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా కొనసాగుతుందని, మూడు, నాలుగు త్రైమాసికాల్లో 5.1%, 5.7%గా ఉంటుం దని ఆర్బీఐ అంచనావేసింది. 2022–23 క్యూ1, క్యూ2లలో 5 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. -
రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యం
ముంబై: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడి చేయడమే లక్ష్యమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. తద్వారా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో– ప్రస్తుతం 4 శాతం)ను యథాతథంగా కొనసాగించడానికి కట్టుబడి ఉన్నట్లు అక్టోబర్ ద్వైమాసిక పాలసీ సమీక్ష నిర్ణయించింది. ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగిన సెంట్రల్ బ్యాంక్ ద్వైమాసిక సమావేశాల మినిట్స్ శుక్రవారం విడుదలయ్యాయి. దీని ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం పూర్తి అదుపులోనికి వస్తుందన్న ఆర్బీఐ అంచనాలతో రెపో యథాతథం కొనసాగింపునకు ఆర్బీఐ పాలసీ కమిటీ ఆమోదముద్ర వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటు 5.7 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలను తాజాగా 5.3 శాతానికి కుదించింది. దీనివల్ల సామాన్యునిపై ధరల భారం తీవ్రత తగ్గుతుంది. దీనికితోడు తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వల్ల వ్యవస్థలో వినియోగం పెరుగుదలకు, డిమాండ్ పునరుద్ధరణకు దోహదపడుతుంది.ఇక రిటైల్ ద్రవ్యోల్బణం రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1 శాతం, 4.5 శాతం, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2 శాతం నమోదవుతుందని భావిస్తోంది. ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వృద్ధికి ఢోకా ఉండబోదన్నది ఆర్బీఐ అంచనావేసింది. తొలి 10.5 శాతం అంచనాలను జూన్ పాలసీ సమీక్షలో ఆర్బీఐ 9.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. 2021–22 మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి నమోదుకాగా, రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 7.9 శా తం, 6.8 శాతం, 6.1 శాతం వృద్ధి నమోదవుతుం దని ఆర్బీఐ అంచనావేసింది. 2022–23 మొదటి త్రైమాసికంలో ఈ అంచనా 17.2 శాతంగా ఉంది. -
దిగివచ్చిన ఆహార ధరలు
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం స్పీడ్ ఆగస్టులో మరింత తగ్గింది. 5.3 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఇదే నెలతో పోలి్చతే రిటైల్ ఉత్పత్తుల బాస్కెట్ ధర 5.3 శాతం పెరిగిందన్నమాట. 2020 ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.69 శాతం ఉంటే, 2021 జూలైలో 5.59 శాతంగా ఉంది. సంబంధిత రెండు నెలలతో పోల్చితే ధరల స్పీడ్ తాజా సమీక్షా నెల 2021 ఆగస్టులో కొంత తగ్గిందన్నమాట. ఆహార ఉత్పత్తుల ధరలు కొంత తగ్గడం దీనికి ప్రధాన కారణమని సోమవారం వెలువడిన జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) లెక్కలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కీలక విభాగాలు ఇలా ► ఆహార బాస్కెట్ ద్రవ్యోల్బణం 2021 ఆగస్టులో 3.11 శాతంగా ఉంది. ఇది జూలైలో 3.96 శాతం. ► కూరగాయల ధరలు 11.7 శాతం తగ్గాయి. ► పప్పు దినుసులు సంబంధిత ఉత్పత్తుల ధరలు 1.42 శాతం దిగివచ్చాయి. ► అయితే ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ విషయంలో ధరలు ఏకంగా 33 శాతం ఎగశాయి. ► ఇంధనం, విద్యుత్ విషయంలో ద్రవ్యోల్బణం 13 శాతంగా ఉంది. ► సేవల ద్రవ్యోల్బణం 6.4 శాతం. 2–6 శ్రేణి లక్ష్యం... బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక. 2 నుంచి 6 శాతం మధ్య ఈ రేటు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. 2020 హైబేస్ నేపథ్యంలో 2021 ఏప్రిల్లో 4.29 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ సరఫరాల సమస్య తీవ్రత నేపథ్యంలో మే, జూన్ నెలల్లో వరుసగా 6.3 శాతం, 6.26 శాతాలకు పెరిగింది. జూలైలో కొంత తగ్గి 5.59 శాతంగా ఉంది. 2021–22లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.7 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. సగటున రెండవ త్రైమాసికంలో 5.9 శాతం, మూడవ త్రైమాసికంలో 5.3 శాతం, నాల్గవ త్రైమాసికంలో 5.8 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం నమోదవుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2022–23లో ద్రవ్యోల్బణం 5.1 శాతం ఉంటుందని ఆర్బీఐ ప్రస్తుతం భావిస్తోంది. 2020 మార్చి తర్వాత 115 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించిన గవర్నర్ నేతృత్వంలోని ఆర్బీఐ పాలసీ సమీక్షా కమిటీ, గడచిన ఏడు ద్వైమాసిక సమీక్షా సమావేశాల నుంచి రెపో రేటును యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడి జరుగుతుందన్న అంచనాలు, వృద్ధికి ఊపును అందించాల్సిన ఆవశ్యకత నేపథ్యంలో సరళతర రేట్ల విధానానికే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేస్తోంది. -
కట్టడిలోకి రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో అదుపులోనికి వచ్చింది. 5.59 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 జూలైలో పోల్చితే 2021 జూలైలో రిటైల్ ఉత్పత్తుల బాస్కెట్ ధర 5.59 శాతం పెరిగిందన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ రేటు–రెపోకు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం నిర్దేశాల (ఆర్బీఐకి) ప్రకారం 2 నుంచి 6శాతం శ్రేణిలో ఉండాలి. అయితే మే, జూన్ నెలల్లో వరుసగా 6.3 శాతం, 6.26 శాతాలుగా నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం గురువారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఆహార ద్రవ్యోల్బణం జూన్లో 5.15 శాతం ఉంటే, జూలైలో 3.96 శాతానికి తగ్గింది. కూరగాయల ధరల చూస్తే జూన్లో 0.7 శాతం తగ్గితే, జూలైలో ఈ తగ్గుదల ఏకంగా 7.75 శాతంగా ఉంది. పప్పు దినుసుల ధరలు ఇదే కాలంలో 10.01% నుంచి 9.04%కి దిగివచ్చాయి. అయితే మాంసం, చేపలు, గుడ్లు, పాలు వంటి ప్రొటీన్ ఆధారిత ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఆయిల్ ఫ్యాట్స్ ధరలు 32.53% పెరిగాయి. అయితే జూలైలో ఈ పెరుగుదల రేటు 35%గా ఉంది. -
మళ్లీ పరిశ్రమలు మైనస్!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి శుక్రవారం వెలువడిన గణాంకాలు నిరాశపరిచాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2021 జనవరిలో 1.6 శాతం క్షీణించింది. 2020 జనవరిలో ఐఐపీ 2.2 శాతం వృద్ధిలో ఉంది. ఇక వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 4.06 శాతం ఉండగా, ఫిబ్రవరిలో 5.03 శాతానికి చేరింది. గడచిన మూడు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయి 2–6 శాతం శ్రేణిలోనే ఉన్నప్పటికీ, మూడు నెలల గరిష్టానికి చేరడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణంమే ప్రాతిపదిక కావడం గమనార్హం. తాజా గణాంకాల నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తి, వ్యవస్థలో డిమాండ్ పెంపునకు మరో విడత రెపో తగ్గింపునకు రిటైల్ ద్రవ్యోల్బణం ‘అడ్డంకిగా కొనసాగే’ అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్ బ్యాంక్, గడచిన (2020 ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్, ఫిబ్రవరి 2021 నెలల్లో) నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో ‘ద్రవ్యోల్బణం భయాలతో’ యథాతథ రేటును కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రతకు ఆహార ధరల పెరుగుదల కారణం కావడం మరో కీలకాంశం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే... కీలక రంగాలు పేలవం ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77.6 శాతం వాటా కలిగిన తయారీ రంగంలో ఉత్పత్తి 2020 జనవరితో పోల్చితే, 2021 జనవరిలో 2 శాతం క్షీణించింది. 2020 ఇదే నెలలో ఈ విభాగంలో 1.8 శాతం వృద్ధి నమోదయ్యింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్కు ప్రతిబింబమైన ఈ విభాగంలో క్షీణత భారీగా 9.6 శాతంగా నమోదయ్యింది. 2020 జనవరిలో ఈ క్షీణత 4.4 శాతంగానే ఉంది. ► కన్జూమర్, నాన్ కన్జూమర్ డ్యూరబుల్స్: ఈ రెండు విభాగాలూ జనవరిలో క్షీణతను నమోదుచేసుకున్నాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 0.2 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక సబ్బులు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, కాస్మెటిక్స్ వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ డ్యూరబుల్స్ (నాన్ డ్యూరబుల్స్) విభాగం ఏకంగా 6.8 శాతం క్షీణతను నమోదుచేసుకోవడం గమనార్హం. 2020 జనవరిలోనూ ఈ రెండు విభాగాలు క్షీణతలోనే ఉన్నాయి. ► మైనింగ్: 3.7 శాతం మైనస్లో ఉంది. ► విద్యుత్: ఈ విభాగంలో మాత్రం 5.5 శాతం ఉత్పత్తి వృద్ధి నమోదయ్యింది. కరోనా నేపథ్యంలో... కోవిడ్–19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో గత ఏడాది మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 18.7 శాతం క్షీణతలోకి జారిపోయింది. 2020 ఆగస్టు వరకూ ఇదే క్షీణ పరిస్థితి కొనసాగింది. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో సెప్టెంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి వృద్ధిలోకి మారింది. ఒక శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అక్టోబర్లో కూడా 4.2 వృద్ధి నమోదయ్యింది. ఇందుకు పండుగల సీజన్ కూడా కలిసి వచ్చింది. అయితే నవంబర్లో తిరిగి ఐఐపీ 2.1 శాతం క్షీణతలోకి పడిపోయింది. డిసెంబర్లో తిరిగి 1.56 శాతం వృద్ధి నమోదుచేసుకున్నా (తొలి అంచనా 1 శాతం నుంచి ఎగువ దిశలో తాజా సవరణ), తిరిగి జనవరిలో క్షీణతలోకి జారిపోయింది. ఏప్రిల్–జనవరి మధ్య 12.2 శాతం క్షీణత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఏప్రిల్ నుంచి జనవరి వరకూ చూస్తే, పారిశ్రామిక ఉత్పత్తి 12.2 శాతంగా ఉంది. 2019–20 ఇదే కాలంలో కనీసం స్వల్పంగానైనా 0.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ఆహార ధరలు పైపైకి... రిటైల్ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, 2021 ఫిబ్రవరిలో ఫుడ్ బాస్కెట్కి సంబంధించి ధరల స్పీడ్ 3.87 శాతంగా ఉంది (2020 ఇదే నెలతో పోల్చి). జనవరిలో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 1.87 శాతంగా ఉంది. ఇందులో వేర్వేరుగా చూస్తే ఆయిల్, ఫ్యాట్స్ విభాగంలో ధరలు ఏకంగా 20.78 శాతం పెరిగాయి. పండ్ల ధరలు 6.28 శాతం ఎగశాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం 6.27 శాతం తగ్గాయి. జనవరిలో ఈ తగ్గుదల ఏకంగా 15.84 శాతం ఉండడం గమనార్హం. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 2.59 శాతం పెరిగాయి. పప్పు దినుసుల ధరలు 12.54 శాతం ఎగశాయి. గుడ్ల ధరలు 11.13 శాతం పెరిగాయి. ఇక ‘ప్యూయెల్ అండ్ లైట్’ విభాగంలో ద్రవ్యోల్బణం 3.53 శాతంగా నమోదయ్యింది. హెల్త్ కేటగిరీ ద్రవ్యోల్బణం 6.33 శాతంగా ఉంటే, రవాణా, కమ్యూనికేషన్ల విభాగంలో ధరల స్పీడ్ 11.36 శాతంగా ఉంది. -
రేటు కోతకు గణాంకాలు ‘సై’!
న్యూఢిల్లీ: సరళతర ద్రవ్య పరపతి విధానం దిశలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరో కీలక చర్య తీసుకునేందుకు వీలు కల్పించే ఆర్థిక గణాంకాలు మంగళవారం వెలువడ్డాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2020 డిసెంబర్లో 4.59 శాతంగా నమోదయ్యింది. అంటే 2019 ఇదే నెలతో పోల్చితే రిటైల్ ద్రవ్యోల్బణానికి సంబంధించి పరిగణనలోకి తీసుకునే ఉత్పత్తుల బాస్కెట్ ధర 4.59 శాతం పెరిగిందన్నమాట. 15 నెలల కనిష్ట స్థాయి ఇది. ఇక పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2020 నవంబర్లో 1.9 శాతం క్షీణించింది. అంతక్రితం రెండు నెలలు వృద్ధి బాటలో నడిచిన సూచీ మళ్లీ క్షీణతను చూడ్డం గమనార్హం. కేంద్రం ఆర్బీఐకి ఇస్తున్న నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 6 – 2 శాతం శ్రేణిలో (ప్లస్2 లేదా మైనస్2తో 4 శాతం వద్ద) ఉండాలి. ఈ లెక్కన తాజా సమీక్షా నెల్లో రిటైల్ ద్రవ్యోల్బణం గాడిన పడినట్లే భావించాల్సి ఉంటుంది. 2021 ఫిబ్రవరి 3 నుంచి 5 వరకూ ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన ద్వైమాసిక సమావేశం జరగనుంది. పారిశ్రామిక ‘పేలవం’ కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020 మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 18.7 శాతం క్షీణించింది. అటు తర్వాత ఆగస్టు 2020 వరకూ మైనస్గానే కొనసాగింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వరుసగా 0.48 శాతం, 4.2 (అక్టోబర్లో గత 3.6 శాతం అంచనాల నుంచి మరింత మెరుగుపరచడం జరిగింది) శాతం వృద్ధి నమోదయ్యింది. అయితే నవంబర్లోనే తిరిగి క్షీణతను నమోదుచేసుకున్నట్లు జాతీయ గణాంకాల కార్యాలయ తాజా ప్రకటన వివరించింది. 2019 నవంబర్లో ఐఐపీ 2.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. తాజా సమీక్షా నెల 2020 నవంబర్లో వేర్వేరుగా వివిధ రంగాల తీరును చూస్తే.... తయారీ: ఎకానమీలో దాదాపు 15 శాతం వాటా కలిగిన ఈ విభాగం 1.7 శాతం క్షీణించింది. మైనింగ్: క్షీణత 7.3 శాతం. విద్యుత్: ఈ విభాగంలో 3.5 శాతం వృద్ధి నెలకొంది. భారీ యంత్ర పరికరాలు, డిమాండ్కు సంకేతంగా పరిగణించే క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తిలో 7.1 శాతం క్షీణ రేటు నమోదయ్యింది. కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి 0.7 శాతం పడిపోయింది. నాన్ కన్జూమర్ డ్యూరబుల్స్: ఇక దుస్తులు, సబ్బులు, టూత్ పేస్టుల ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) విభాగానికి సంబంధించిన ఈ విభాగంలో సైతం 0.7 శాతం క్షీణరేటే నమోదుకావడం ఆందోళనకరమైన అంశం. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 15.5 శాతం క్షీణత పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 15.5 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే కాలంలో స్వల్పంగానైనా 0.3 శాతం వృద్ధి నమోదయ్యింది. తగ్గిన ఆహార ధరా భారం... రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో లక్ష్యాల మేరకు 4.59%కి దిగిరావడానికి శాంతించిన ఆహార ఉత్పత్తుల ధరలు కొంత కారణం. ఆర్బీఐ నిర్దేశిత స్థాయిలోకి రిటైల్ ద్రవ్యోల్బణం దిగిరావడం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే తొలిసారి. కూరగాయల ధరలు నవంబర్లో 10.41% తగ్గాయి (నవంబర్లో 15.63% పెరుగుదల). ఆహార ద్రవ్యోల్బణం మొత్తంగా చూస్తే, 3.41% తగ్గింది (16 నెలల కనిష్టం). నవంబర్లో ఈ రేటు 9.5%. తృణ ధాన్యాల ధరల్లో కేవలం 0.98% పెరుగుదల నమోదయ్యింది. నవంబర్లో 2.32% పెరుగుదల రేటు ఉంది. తాజా గణాంకాల నేపథ్యంలో ఆర్బీఐ రేటు కోత లేదా ప్రస్తుత సరళ విధానం కొనసాగించడానికి మార్గం సగమం అయ్యిందని నిపుణులు భావిస్తున్నారు. -
ఆర్బీఐ మూడో‘సారీ’..
ముంబై: అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన కమిటీ (ఆర్బీఐ–ఎంపీసీ) ప్రధాన నిర్ణయం వెలువడింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను యథాతథంగా 4 శాతంగానే కొనసాగించాలని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రతను దీనికి కారణంగా చూపింది. ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 4% స్థాయిలో ఉండాలి. అయితే దీనికి మించి కొనసాగుతోంది. క్యూ4లో 5.8 శాతానికి ద్రవ్యోల్బణం! అక్టోబర్–డిసెంబర్ (క్యూ3), జనవరి–మార్చి (క్యూ4) కాలాల్లో ద్రవ్యోల్బణం వరుసగా 6.8 శాతం, 5.8 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ అంచనావేసింది. ఈ అంచనాల నేపథ్యంలో సరళతర వడ్డీరేట్ల విధానమే కొనసాగించడం జరుగుతుందని స్పష్టం చేసింది. తద్వారా ద్రవ్యోల్బణం తగ్గితే వడ్డీరేట్లూ మరింత దిగివస్తాయని సూచించింది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది. అకాల వర్షాలు, కార్మికుల కొరత, సేవల వ్యయాల తీవ్రత, అధిక కమోడిటీ ధరలు, పన్నులు, సరఫరాల్లో సమస్యల వంటి పలు సమస్యలు టోకు, రిటైల్ ధరల పెరుగుదలకు కారణాలని ఆర్బీఐ పాలసీ సమీక్ష విశ్లేషించింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు 1%) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, రిటైల్ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టు, అక్టోబర్ నెలల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది. అయితే ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న విశ్లేషణ చేస్తున్న ఆర్బీఐ, సరళతర పరపతి విధానాన్నే పాటించడానికి మొగ్గుచూపుతోంది. ఇక రెపో రేటు తగ్గించని నేపథ్యంలో.. రివర్ రెపో రేటు (బ్యాంకులు తన వద్ద డిపాజిట్చేసే అదనపు నిధులపై ఆర్బీఐ చెల్లించే వడ్డీరేటు) కూడా యథాపూర్వం 3.35 శాతంగానే కొనసాగనుంది. డిపాజిటర్లకు ఊరట ఆర్బీఐ పాలసీ కమిటీ తాజా నిర్ణయం ప్రకారం, రుణ గ్రహీతలకు ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ల (ఈఎంఐ)ల భారం తగ్గే అవకాశాలు తక్కువ. అయితే ఇది డిపాజిట్లకు ఊరటనిచ్చే అంశం. బ్యాంకులు ఎఫ్డీలపై తదుపరి వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు లేవు. ఇప్పటికే ఏడాది ఆపైన కాలపరిమితుల స్థిర డిపాజిట్ రేటు 4.90–5.50% శ్రేణిలో ఉన్నాయని, ప్రస్తుత ద్రవ్యోల్బణంతో పోల్చితే ఇది నెగెటివ్ రిటర్న్స్ అనీ ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. వడ్డీరేట్లు మరింత తగ్గి, ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంటే అది పొదుపులు, డిపాజిట్లు, కరెంట్ అకౌంట్లపై ప్రతికూల ప్రభావం చూపి సమీపకాలంలో వృద్ధికి విఘాతం కలిగిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఫైనాన్షియల్ వ్యవస్థలో డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు ఆర్బీఐ పాలసీ ప్రకటన స్పష్టం చేసింది. ద్రవ్య లభ్యతకు లోటుండదు ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్యలభ్యత)కు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చర్యలు ఉంటాయని ఆర్బీఐ భరోనాను ఇచ్చింది. ఇందుకు అవసరమైన సమయంలో అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేసింది. కార్పొరేట్ బ్యాండ్స్ మరింత విస్తరించడానికీ చర్యలు ఉంటాయని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ పురోగతి 2020–21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణత 9.5 శాతం ఉంటుందని ఆర్బీఐ తాజా సమీక్షలో అంచనా వేసింది. మొదటి త్రైమాసికంలో స్థూల జీడీపీ భారీగా 23.9 శాతం క్షీణత దీనికి నేపథ్యం. అయితే ఈ అంచనాలను తాజాగా 7.5 శాతానికి మెరుగుపరిచింది. అలాగే గత సమీక్ష సందర్భంగా నాల్గవ త్రైమాసికంలోనే స్వల్ప వృద్ధి రేటు (0.5%) నమోదవుతుందని పేర్కొంది. తాజాగా ఈ అంచానాలనూ మెరుగుపరిచింది. మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 0.1%, నాలుగో త్రైమాసికంలో (జనవరి–మార్చి) 0.7% వృద్ధి రేట్లు నమోదవుతాయని పేర్కొంది. అక్టోబర్ పాలసీ సమీక్షలో డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 5.6% క్షీణత నమోదవుతుందని అంచనావేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ క్షీణత అంచనాలకన్నా మెరుగ్గా 7.5%గా నమోదుకావడం తెలిసిందే. నగదు వినియోగం తగ్గింపు చర్యలు కాంటాక్ట్లెస్ కార్డ్ లావాదేవీ పరిమితి పెంపు కాంటాక్ట్లెస్ కార్డ్ లావాదేవీ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2,000 నుంచి రూ.5,000కు పెంచుతూ పాలసీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 14వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది. నిరంతరాయంగా ఆర్టీజీఎస్... భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్స్ (ఆర్టీజీఎస్) ఇక నిరంతరాయంగా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఆర్టీజీఎస్ సేవలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య అందుబాటులో ఉంటున్నాయి. ప్రతి నెలా రెండు, నాలుగు శనివారాల్లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉండడం లేదు. 2019 డిసెంబర్లో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (ఎన్ఈఎఫ్టీ) వ్యవస్థ నుంచి నిరంతరాయ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రూ.2 లక్షల వరకూ లావాదేవీలకు ఎన్ఈఎఫ్టీ సేవలను పొందవచ్చు. డిజిటల్ లావాదేవీల పెంపు లక్ష్యంగా 2019 జూలై నుంచి ఎన్ఈటీఎఫ్, ఆర్టీజీఎస్ ద్వారా లావేదేవీలపై చార్జీలను ఆర్బీఐ నిలుపుచేసింది. ప్రాఫిట్, డివిడెండ్లపై బ్యాంకులకు వరం... కోవిడ్–19 మహమ్మారి సవాళ్లను ఎదుర్కొనడానికి వీలుగా 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, సహకార బ్యాంకులు లాభాలను తమవద్దే ఉంచుకోవాలని, డివిడెండ్లను చెల్లించవద్దని ఆర్బీఐ సూచించింది. కష్ట నష్టాలను ఎదుర్కోడానికి మద్దతుగా అలాగే రుణ మంజూరీలకు మూలధన నిర్వహణ కీలకమని ఈ సందర్భంగా పేర్కొంది. లాభాలు తమవద్దే ఉంచుకోవడం, అలాగే డివిడెండ్ చెల్లింపుల నిలిపివేతలకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు కూడా తెలిపింది. బ్యాంకుల తరహాలో డివిడెండ్ పంపిణీకి సంబంధించి ఎన్బీఎఫ్సీలకు మార్గదర్శకాలు ఏమీ లేవని కూడా ఈ సందర్భంగా ఆర్బీఐ గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో జనవరిలో సమగ్ర మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలిపింది. వృద్ధికి ఊతం– ఆర్థిక స్థిరత్వం లక్ష్యం ఆర్థికాభివృద్ధికి ఊతం ఇవ్వడానికి, ఆర్థిక స్థిరత్వానికి తగిన చర్యల తీసుకుంటున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ‘ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాల నేపథ్యంలో సరళతర ద్రవ్య పరపతి విధానాన్నే ఆర్బీఐ కొనసాగించనుంది. మహమ్మారి ప్రభావాన్ని జాగ్రత్తగా అంచనావేస్తూ, ఆర్థిక వ్యవస్థ పురోగతికి తగిన నిర్ణయాలను తీసుకుంటాం. ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ చెందుతోందని కీలక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్లో పాసింజర్, మోటార్సైకిల్ అమ్మకాల్లో రెండంకెల వృద్ధి కనబడుతోంది. రైల్వే రవాణా పెరిగింది. విద్యుత్ డిమాండ్ మెరుగుపడింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ), అర్బన్ సహకార బ్యాంకులపై నిర్వహణా పరంగా మరింత పర్యవేక్షణ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో రికవరీ మరింత పటిష్టం అవుతోంది. పట్టణ డిమాండ్ మరింత మెరుగుపడుతోంది. వ్యాక్సిన్ వస్తోందన్న వార్తలు ఆశావహ పరిస్థితులను మెరుగుపరుస్తోంది. రానున్న 2021–22 బడ్జెట్ వృద్ధికి దోహదపడేదిగా ఉంటుందని విశ్వసిస్తున్నాం’ అని చెప్పారు. కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్... ఆర్బీఐ యోచనకాదు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949కు అవసరమైన సవరణలు చేస్తూ, స్వయంగా బ్యాంకులను తెరవడానికి బడా కార్పొరేట్ సంస్థలకు అనుమతి ఇవ్వవచ్చని ఆర్బీఐ ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ చేసిన సిఫారసు అంశాన్ని ఆర్బీఐ గవర్నర్ తన పాలసీ ప్రకటనలో ప్రస్తావించారు. ఈ ప్రతిపాదన ఆర్బీఐ అంతర్గత కమిటీ చేసిన సూచన తప్ప, ఆర్బీఐది కాదన్న విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆర్బీఐ ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. రేటింగ్ దిగ్జజం ఎస్అండ్పీ సహా ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య, ప్రపంచబ్యాంక్ మాజీ చీఫ్ ఎకనమిస్ట్ కౌశిక్ బసు ఈ ప్రతిపాదనను బహిరంగంగానే తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. డిజిటల్ బ్యాంకింగ్పై విశ్వాసం పెంచాలన్నదే లక్ష్యం... కొత్త కార్డుల జారీ నిలిపివవేతసహా హెచ్డీఎఫ్సీ బ్యాంక్పై తీసుకున్న పలు చర్యలను ఆర్బీఐ గవర్నర్ పాలసీ ప్రకటన సందర్భంగా ప్రస్తావించారు. డిజిటల్ బ్యాంకింగ్ పట్ల వినియోగదారుల విశ్వాసాన్ని చెక్కుచెదరకుండా కొనసాగించాలన్నదే ఆర్బీఐ నిర్ణయం ఉద్దేశమని తెలిపారు. సాంకేతిక విభాగంపై బ్యాంకర్లు మరింత పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ వ్యవస్థ పటిష్టతకు తగిన చర్యలన్నింటినీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాజమాన్యం తీసుకుంటుందన్న విశ్వాసాన్నీ దాస్ వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆన్లైన్ సేవల అంతరాయల అంశాన్ని కూడా ఆర్బీఐ పరిశీలిస్తోందని తెలిపారు. వృద్ధికి దోహదం యథాతథ వడ్డీరేట్ల విధానాన్ని సెంట్రల్ బ్యాంక్ కొనసాగిస్తుందన్నది ఊహించిందే. అయితే సరళతర ఆర్థిక విధానాన్ని కొనసాగిస్తున్నట్లు చేస్తున్న ప్రకటన వృద్ధికి, మార్కెట్లకు ఊతం ఇచ్చే అంశం. పటిష్ట డిమాండ్ కొనసాగడానికి దోహదపడుతుంది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ అరశాతం వరకూ తగ్గే చాన్స్ వృద్ధి పునరుద్ధరణ లక్ష్యంగా రెపో రేటు మరింత తగ్గడానికి తగిన వెసులుబాటు ఉంది. 2020–21 తదుపరి ద్వైమాసిక సమీక్షల సందర్భంగా రేటు పావు శాతం నుంచి అరశాతం వరకూ తగ్గే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం కట్టడికి పటిష్ట చర్యలు అవసరం. – అభీక్ బారువా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ ప్రోత్సాహకరం.. ఆర్థిక వ్యవస్థ క్షీణ రేట్లు సవరిస్తూ పాలసీ నిర్ణయం ప్రోత్సాహకరమైనది. కేంద్రం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలతో దేశం ఆర్థిక పురోగతితో వచ్చే ఏడాదిలోకి ప్రవేశిస్తుందని మేము ఆశిస్తున్నాం. సరఫరాల వ్యవస్థ మరింత మెరుగుపడాల్సి ఉంటుంది. –సంగీతా రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ గృహ డిమాండ్కు ఊతం సరళతర ద్రవ్య పరపతి విధానాన్నే కొనసాగిస్తున్నట్లు పాలసీ ప్రకటన గృహ డిమాండ్కు ఊతం ఇవ్వడానికి దోహదపడుతుంది. తగిన వడ్డీరేట్లు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. డిమాండ్ పునరుద్ధరణ దిశలో ప్రత్యేకించి మధ్య తరగతికి హర్షదాయకమైన పాలసీ నిర్ణయం ఇది. – నిరంజన్ హిరనందని, నరెడ్కో ప్రెసిడెంట్ వడ్డీరేట్ల తగ్గింపు కష్టమే రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో రేటు తగ్గింపు కష్టం. భవిష్యత్తులోనూ ఇదే ధోరణి ఉంటుందని భావిస్తున్నాం. అయితే సరళతర విధానాన్నే కొనసాగించాలన్న నిర్ణయం దీర్ఘకాలంపాటు వడ్డీరేట్లు తక్కువగా ఉంటాయనడానికి సంకేతంగా భావించవచ్చు. – అదితీ నయ్యర్, ప్రిన్సిపల్ ఎకనమిస్ట్, ఐసీఆర్ఏ -
రిటైల్కు రెక్కలొచ్చాయ్!
సాక్షి, హైదరాబాద్ : దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వస్తు, సేవల రిటైల్ ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యుడిని ధరాఘాతం తాకుతోంది. జీవనవ్యయం పెరిగి జేబుపై ఆర్థికభారం పడుతోంది. అక్టోబర్ నెలలో దేశంలో ద్రవ్యోల్బణం 7.61 శాతానికి చేరుకోగా, తెలంగాణ రాష్ట్రంలో అది ఏకంగా 10.37 శాతానికి ఎగబాకింది. దీంతో ద్రవ్యోల్బణం రేటులో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో ఉంది. గత ఏడాది ఒకనెలతో పోల్చితే (ఉదాహరణకు అక్టోబర్ 2019– అక్టోబర్ 2020 మధ్య తేడా), ఈ ఏడాది అదేనెలలో వినియోగదారుల ధరల సూచీలో పెరుగుదల రేటునే ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం పెరిగినపుడు... ప్రజల జీవన వ్యయం పెరిగిపోతుంది. రూపాయి కొనుగోలు శక్తి తగ్గుతుంది. కేంద్ర గణాంక, ప్రభుత్వ కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంఎస్పీఐ) అక్టోబర్ నెలకు సంబంధించిన ద్రవ్యోల్బణం గణాంకాలను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం 2020 అక్టోబర్లో రాష్ట్రంలో ద్రవ్యోల్బణం 10.37 శాతానికి చేరింది. పశ్చిమబెంగాల్ 10.89 శాతం ద్రవ్యోల్బణంతో దేశంలో అగ్రస్థానంలో నిలవగా, 10.14 శాతంతో ఒడిశా, 10.03 శాతంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ రెండో స్థానంలో ఉండటాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో రిటైల్ ధరలు రాకెట్ వేగంతో పెరిగిపోయాయని స్పష్టమవుతోంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం గత కొంతకాలంగా దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణాన్ని నమోదు చేస్తూ వస్తోంది. గత మార్చి నెలలో దేశంలో ద్రవ్యోల్బణం 5.91 శాతం నమోదు కాగా, 8.12 శాతంతో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. పల్లెల్లో బతుకుభారం గత అక్టోబర్లో గ్రామీణ తెలంగాణలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. 11.98 శాతం ద్రవ్యోల్బణం రేటుతో గ్రామీణ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ పట్టణ ప్రాంతాలు 9.05 శాతం ద్రవ్యోల్బణంతో జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచాయి. మరో విధంగా చెప్పాలంటే తెలంగాణ పల్లెల్లో రిటైల్ ధరలు దాదాపు 12 శాతం, పట్టణాల్లో 9.05 శాతం పెరిగాయి. ద్రవ్బోల్బణం పెరిగితే రూపాయి విలువ క్షీణించి ప్రజల కొనుగోలు శక్తిని హరిస్తుంది. కూరగాయలు, ఉల్లి ధరలే ప్రధానకారణం ప్రధానంగా కూరగాయలు, ఉల్లి, ఇతర ఆహారపదార్థాల ధరలు అసాధారణంగా పెరగడంతో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయింది. వినియోగదారుల ధరల సూచిక (కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్) ప్రకారం గతేడాదితో పోల్చితే ప్రస్తుతం జాతీయ స్థాయిలో కూరగాయల ధరలు 22.51 శాతం, పప్పు ధాన్యాల ధరలు 18.34 శాతం, మాంసం, చేపల ధరలు 18.70 శాతం, గుడ్ల ధరలు 21.81 శాతం, నూనెల ధరలు 15.17 శాతం వరకు పెరిగిపోయాయి. కరోనా మహమ్మారి నియంత్రణకు లాక్డౌన్ విధించిన నాటి నుంచి కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. చాలా కూరగాయలు కిలో సగటున రూ.60 నుంచి 100 వరకు ఎగబాకాయి. ఇక ఉల్లి ధరలకు రెక్కలు వచ్చి ఒకదశలో కిలో రూ.80 నుంచి రూ.100 వరకు పలికింది. భారీ వర్షాలతో ఉల్లి, కూరగాయల పంటలు దెబ్బతినడంతో మార్కెట్లో డిమాండ్కు సరిపడా సరఫరా లేక ధరలు పెరుగుదలకు దారితీసిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణలో వరిసాగు పెరడమే కారణం తెలంగాణ రాష్ట్రం కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు, చేపలు, మాంసం వంటి ఆహార పదార్థాలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. స్థానికంగా ఉన్న డిమాండ్కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో రాష్ట్రంలో వీటి ధరలు దేశంలోని ఇతర ప్రాంతాల కన్నా అధికంగా ఉంటున్నాయని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. 2011–12లో రాష్ట్రంలో రూ.9,317.47 కోట్ల విలువ చేసే పండ్లు, కూరగాయల ఉత్పత్తి జరగగా, 2017–18 వచ్చేసరికి ఈ ఉత్పత్తుల విలువ రూ.5,737.41 కోట్లకు తగ్గిపోయిందని కేంద్ర గణాంక, ప్రభుత్వ కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో గత దశాబ్దకాలంగా పండ్లు, కూరగాయల ఉత్పత్తి దాదాపు సగానికి తగ్గిపోయిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో వరిసాగు ఏటేటా గణనీయంగా పెరిగిపోతోంది. వివిధ సాగునీటి ప్రాజెక్టుల కింద దశాబ్దాలుగా బీడువారిన లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ ఏడాది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని సరఫరా చేసి స్థిరీకరించారు. గతంలో కూరగాయలు, పప్పుదినుసులు, ఇతర పంటలు పండించిన రైతులు సాగునీరు వచ్చేసరికి వరి సాగువైపు మళ్లారు. దీంతో ఈ ఏడాది రాష్ట్రంలో కూరగాయల సాగు మరింతగా తగ్గిపోవడంతో... సరఫరా తగ్గి వీటి ధరలు గణనీయంగా పెరిగిపోయాయని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన నియంత్రిత పంటల సాగు విజయవంతమై... స్థానిక అవసరాలకు తగ్గట్టు ఇక్కడే కూరగాయలు, పండ్ల ఉత్పత్తులు పెరిగితే ధరలు దిగి వచ్చే అవకాశముంది. డిమాండ్కు తగ్గట్టు సప్లై లేదు ఆర్థిక మాంద్యం, కరోనా మహమ్మారి, లాక్డౌన్, నిరుద్యోగం కారణంగా ప్రజల జేబుల్లో డబ్బులు లేకుండా పోయాయి. ఈ పరిస్థితుల్లో కొనుగోలుదారులు లేక డిమాండ్ పతనమై ధరలు తగ్గాల్సింది పోయి... పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో డిమాండ్కు తగ్గట్టు ఆహారపదార్థాల సరఫరా లేకపోవడం ధరలు పెరగడానికి దోహదపడింది. దేశానికే ధాన్య భండాగారంగా పేరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం, కూరగాయలు, పండ్లు, ఉల్లి, పప్పులు, మసాల దినుసులు, ఇతర ఆహారపదార్థాల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతోంది. ఇతర రాష్ట్రాల్లో వీటికి సంబంధించిన ధరలు కొద్దిగా పెరిగినా తెలంగాణలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోతోంది. ప్రధానంగా పేద, బలహీనవర్గాల ప్రజల జీవనం దుర్భరంగా మారిందని ద్రవ్యోల్బణం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణకు అవసరమైన పండ్లు, కూరగాయలు, పప్పులు వంటి వాటి ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కూరగాయలు, ఉల్లిని పేదలకు సబ్సిడీపై సరఫరా చేయాలి. లేకుంటే పేద ప్రజలకు రెండు పూటల కడుపు నిండా తిండి కూడా లభించదు. – పీఎస్ఎం రావు, ఆర్థికవేత్త -
అదుపులోకిరాని రిటైల్ ధరలు
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనికి రావడంలేదు. 2020 అక్టోబర్లో 7.61 శాతంగా నమోదయ్యింది. అంటే సూచీలోని ఉత్పత్తుల బాస్కెట్ ధర 2019 అక్టోబర్తో పోల్చితే 2020 అక్టోబర్లో 7.61 శాతం పెరిగిందన్నమాట. ఆహారోత్పత్తుల ధరల పెరుగుదల మొత్తం సూచీపై ప్రభావం చూపిస్తోంది. సెప్టెంబర్లో సూచీ 7.27 శాతంగా ఉంది. సూచీలోని ప్రధాన విభాగాల్లో ఒకటైన ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 10.68 శాతం ఉంటే, అక్టోబర్లో 11.07 శాతంగా నమోదయ్యింది. కూరగాయల ధరలు వార్షికంగా చూస్తే, అక్టోబర్లో 22.51 శాతం పెరిగాయి. వడ్డీరేట్ల తగ్గింపు కష్టమే! రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనికిరాని పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4శాతం) మరింత తగ్గించే అవకాశాలు లేనట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలని కేంద్రం ఆర్బీఐకి నిర్దేశిస్తోంది. అయితే ఈ స్థాయికి మించి ఈ రేటు నమోదవుతోంది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, రిటల్ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్ట్, అక్టోబర్ నెలల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది. తగ్గుతుందన్న విశ్వాసం... అయితే సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ అంచనావేస్తోంది. వ్యవసాయ రంగం పరిస్థితి ఆశాజనకంగా ఉండడం, ముడి చమురు ధరలు ఒక నిర్దిష్ట శ్రేణితో తిరుగుతుండడం, లాక్డౌన్ నిబంధనల సడలింపులతో సరఫరాల వ్యవస్థ మెరుగుపడుతుండడం ఆర్బీఐ అంచనాలకు ప్రధాన కారణాలు. వెరసి డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) 5.4 శాతానికి, మార్చి త్రైమాసికంలో (క్యూ4) 4.5 శాతానికి ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న అంచనాలను వెలువరించింది. క్యూ3లో 3.2–5.9 శాతం శ్రేణి ఉంటే, క్యూ4లో ఈ శ్రేణి 2.4–6.6 శాతం మధ్య ఉంటుందని ఆర్బీఐ తన పాలసీ సమీక్షలో భావించింది. ఈ అంచనాల నేపథ్యంలో వృద్ధికి దోహదపడే సరళతర ద్రవ్య విధానంవైపే ఆర్బీఐ మొగ్గుచూపుతోంది. మరోవైపు ఇప్పటికే ఏడాది ఆపైన కాలపరిమితుల స్థిర డిపాజిట్ రేటు 4.90 నుంచి 5.50 శాతం శ్రేణిలో ఉన్నాయని, ప్రస్తుత ద్రవ్యోల్బణంతో పోల్చితే ఇది నెగటివ్ రిటర్న్స్ అనీ ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. -
సామాన్యునిపై ధరల భారం
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయిని దాటి ధరలు తీవ్రమవుతున్నాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 7.34 శాతంగా (2019 సెప్టెంబర్తో పోల్చి) నమోదయ్యింది. గత ఎనిమిది నెలల్లో ఇంత అధిక స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. జాతీయ గణాంకాల కార్యాలయం సోమవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ముఖ్య విభాగాలు చూస్తే... ► వినియోగ ధరల సూచీలో ఒక్క కన్జూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ను చూస్తే, సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం భారీగా 10.68%కి ఎగసింది. కూరగాయల ధరలు 20.73% పెరిగాయి. ప్రొటీన్ రిచ్ గుడ్ల ధరలు 15.47% పెరిగాయి. ► ఫ్యూయెల్ అండ్ లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం 2.87 శాతంగానే ఉంది. తగ్గుతుందంటున్న ఆర్బీఐ...: నిజానికి ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4% వద్ద ధరల స్పీడ్ ఉండాలి. దీని ప్రాతిపదికనే తన ద్రవ్య పరపతి విధానంలో కీలకమైన రెపో రేటుపై (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు–ప్రస్తుతం 4%) ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటోంది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, ద్రవ్యోల్బణం ఇబ్బం దులతో ఆగస్టులో యథాతథ విధానాన్ని ప్రకటించింది. తాజా అక్టోబర్ విధాన సమీక్షలోనూ ఇదే విధానాన్ని కొనసాగించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికా ల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నా యనేది ఆర్బీఐ అంచనా. సెప్టెంబర్ త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 6.8%గా ఉంటుందని, అయితే వచ్చే త్రైమాసికాల్లో ఈ సమస్య తగ్గుతుందని ఆర్బీఐ పేర్కొంది. వెరసి డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) 5.4%కి, మార్చి త్రైమాసికంలో (క్యూ4) 4.5%కి ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న అంచనాలను వెలువరించింది. -
టోకు ధరలు.. మైనస్ నుంచి ప్లస్
న్యూఢిల్లీ: ప్రభుత్వం సోమవారం నాడు ఆగస్టుకు సంబంధించి అటు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలను, ఇటు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను విడుదల చేసింది. టోకు ద్రవ్యోల్బణం 0.16 శాతం నమోదయితే, రిటైల్ ద్రవ్యోల్బణం 6.69 శాతంగా నమోదయ్యింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన టోకు ధరల గణాంకాల్లో కీలక అంశాలను పరిశీలిస్తే... టోకు డిమాండ్ మెరుగుపడుతుందనుకోలేం! టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల తర్వాత మొట్టమొదటిసారి ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితుల నుంచి బయటపడింది. ఆగస్టులో ద్రవ్యోల్బణం 0.16 శాతంగా నమోదయ్యింది. అంటే 2019 ఆగస్టుతో పోల్చితే 2020 ఆగస్టులో టోకు బాస్కెట్లోని మొత్తం ఉత్పత్తుల ధర 0.16 శాతం పెరిగిందన్నమాట. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించిన తర్వాత వరుసగా ఏప్రిల్ (– 1.57%), మే (–3.37%), జూన్ (–1.81%), జూలై (–0.58%) నెలల్లో ప్రతికూల టోకు ద్రవ్యోల్బణం రేట్లు నమోదయ్యాయి. వ్యవస్థలో డిమాండ్ లేమి పరిస్థితులను ప్రతి ద్రవ్యోల్బణం సూచిస్తుంది. అయితే తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థలో మళ్లీ డిమాండ్ కనిపిస్తోందనడానికి సూచన కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఆగస్టులో ద్రవ్యోల్బణం పెరగడానికి బేస్ ఎఫెక్టే కారణమన్నది వారి అంచనా. అంటే 2019 ఆగస్టులో నమోదయిన టోకు ద్రవ్యోల్బణం అతి తక్కువగా ఉండడం (కేవలం 1.17%), ఆర్థిక మందగమనం వల్ల అటు తర్వాత నెలల్లోనూ వ్యవస్థలో పూర్తి ప్రతి ద్రవ్యోల్బణం పరిస్థితులే నెలకొనడం వంటి అంశాలతో తాజా సమీక్షా నెల 2020 ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం కొంచెం పెరిగినట్లు ‘గణాంకాల్లో’ కనిపిస్తోందన్నది వారి అభిప్రాయం. దీనినే బేస్ ఎఫెక్ట్ మాయగా నిపుణులు పేర్కొంటారు. కాగా మార్చిలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 0.42%. మూడు ప్రధాన విభాగాలను చూస్తే... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్ ఫుడ్ విభాగాలతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్లో ద్రవ్యోల్బణం ఆగస్టులో 1.60 శాతానికి తగ్గింది. 2019 ఆగస్టులో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 6.51 శాతం. ఇక ఈ విభాగంలో కేవలం ఫుడ్ ఆర్టికల్స్ను తీసుకుంటే, ద్రవ్యోల్బణం 7.80 శాతం నుంచి 3.84 శాతానికి తగ్గింది. నాన్ ఫుడ్ ఆర్టికల్స్లో మాత్రం ప్రతి ద్రవ్యోల్బణం (–1.46 శాతం) కొనసాగుతోంది. 2019 ఇదే నెలలో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 4.68 శాతం. ► ఇంధనం, విద్యుత్: ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ 3.53 శాతం నుంచి మరింతగా మైనస్ 9.68 శాతానికి పెరిగింది. ► తయారీ: తయారీ రంగంలో 1.27 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. 2019 ఆగస్టులో ఇది స్థిరంగా ఉంది. టోకున ‘నిత్యావసరాల’ మంట డబ్ల్యూపీఐ... ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం వార్షికంగా చూస్తే 7.80% నుంచి 3.84%కి తగ్గినా, నిత్యావసరాల ధరలు మాత్రం ఇంకా సామాన్యునికి భారంగానే ఉండడం గమనార్హం. కూరగాయల ధరలు 7.03% పెరిగాయి (2019 ఆగస్టుతో పోల్చి). పప్పు దినుసుల ధరలు 9.86% ఎగశాయి. ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల ధరలు 6.23% పెరిగాయి. ఆలూ ధరలు భారీగా 82.93 శాతం ఎగశాయి. అయితే ఉల్లిపాయల ధరలు మాత్రం 34.48% తగ్గాయి. -
మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.91 శాతం
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2020 మార్చిలో 5.91 శాతంగా నమోదయ్యింది. అంటే రిటైల్ ఉత్పత్తుల బాస్కెట్ ధర 2019 మార్చి ధరలతో పోల్చితే 2020 మార్చిలో 5.91 శాతం పెరిగిందన్నమాట. నిజానికి ఫిబ్రవరిలో నమోదయిన 6.58 శాతంకన్నా ఇది తక్కువే. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం నిజానికి 2 శాతం ఉండాలి. అయితే ఈ స్థాయికి మైనస్ రెండు, లేదా ప్లస్ రెండు కూడా తగిన స్థాయిగానే పరిగణించడం జరుగుతుంది. దీనిప్రకారం 5.91 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం అంటే కొంత ఆందోళనకర అంశమే. తక్కువ స్థాయి వడ్డీరేట్ల సరళతర ద్రవ్య పరపతి విధానం అనుసరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్థాయి భారీ రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు భారంగానే ఉంటుంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన ద్రవ్యోల్బణం గణాంకాలను విభాగాల వారీగా చూస్తే... ► ఆహారం, పానీయాలు: ఈ విభాగం మొత్తంగా ద్రవ్యోల్బణం రేటు 7.82 శాతంగా ఉంది. ఈ విభాగంలో కూరగాయలు (18.63 శాతం), పప్పులు, పప్పు దినుసులు (15.85 శాతం), తృణ ధాన్యాలు (5.30 శాతం), మాంసం, చేపలు (9.15 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (6.47 శాతం), నూనె, కొవ్వు పదార్థాలు (7.54 శాతం), గుడ్లు (5.56 శాతం), సుగంధ ద్రవ్యాల (9.82 శాతం) ధరలు ఐదు శాతంపైగా పెరిగాయి. కాగా నాలుగు శాతంలోపు ధరలు పెరిగిన ఉత్పత్తుల్లో పండ్లు (3.56 శాతం), చక్కెర, తీపి పదార్థాల ఉత్పత్తులు (3.85 శాతం), ఆల్కహాలేతర పానీయాలు (2.24 శాతం), ప్రిపేర్డ్ మీల్స్ , స్నాక్స్ (2.84 శాతం) వంటివి ఉన్నాయి. ► పాన్, పొగాకు ఇతర మత్తు ప్రేరిత పదార్థాలు: ద్రవ్యోల్బణం 4.71 శాతం ► దుస్తులు, పాదరక్షల విభాగం: ధరల స్పీడ్ 2.11 శాతంగా ఉంది. ► హౌసింగ్: 4.23 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ► ఫ్యూయెల్ అండ్ లైట్: ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 6.59 శాతంగా ఉంది. -
బాబోయ్ ధరలు!
న్యూఢిల్లీ: ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో డిసెంబర్లో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగిసింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న స్థాయిని దాటేసి.. ఏకంగా 7.35 శాతంగా నమోదైంది. ఇది అయిదున్నరేళ్ల గరిష్ట స్థాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2018 డిసెంబర్లో 2.11 శాతంగా ఉండగా, 2019 నవంబర్లో 5.54 శాతంగాను, డిసెంబర్లో 7.35 శాతంగాను నమోదైంది. చివరిసారిగా 2014 జూలైలో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు.. రిటైల్ ద్రవ్యోల్బణం 7.39 శాతం. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిని తాకడం ఇదే ప్రథమం. రెండు శాతం అటూ, ఇటూగా ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కట్టడి చేయాలంటూ రిజర్వ్ బ్యాంక్కు ప్రభుత్వం నిర్దేశించింది. కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోవడంలో ఆర్బీఐ .. రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలనే పరిగణనలోకి తీసుకుంటుంది. ధరల పెరుగుదల భయాల కారణంగానే.. గత డిసెంబర్లో జరిగిన పరపతి విధాన సమీక్షలో మరో విడత వడ్డీ రేట్లను తగ్గించకుండా ఆర్బీఐ కాస్త విరామమిచ్చింది. ఫిబ్రవరి 6న తదుపరి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష జరపనుంది. ఈ తరుణంలో నిర్దేశించుకున్న స్థాయికి మించి ద్రవ్యోల్బణ గణాంకాలు నమోదు కావడంతో రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లపై తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ద్రవ్యోల్బణ గణాంకాలకు సంబంధించి మరిన్ని వివరాలు చూస్తే.. ► 2018 డిసెంబర్తో పోలిస్తే గతేడాది డిసెంబర్లో కూరగాయల ధరలు అత్యధికంగా 60.5 శాతం ఎగిశాయి. ► మొత్తం ఆహార ద్రవ్యోల్బణం 14.12 శాతం పెరిగింది. 2018 డిసెంబర్లో ఇది మైనస్ 2.65 శాతంగా ఉండగా, గతేడాది నవంబర్లో 10.01 శాతంగా ఉంది. ► పప్పుల ధరలు 15.44 శాతం, మాంసం.. చేపల రేట్లు 10 శాతం పెరిగాయి. రేట్ల కోతకు మరింత విరామం.. ఇప్పటికే ఎకానమీ మందగమనంలో ఉన్న తరుణంలో ద్రవ్యోల్బణం కూడా ఎగియడం వల్ల పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను మరింత తగ్గించడానికి ఆస్కారం లేకుండా పోతుందని పేర్కొన్నారు. ఇది స్టాగ్ఫ్లేషన్ (అధిక ద్రవ్యోల్బణం, వృద్ధి మందగమన పరిస్థితి)కి దారి తీయొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. 2020 ఆఖరు త్రైమాసికం దాకా రిజర్వ్ బ్యాంక్ మరో దఫా కీలక పాలసీ రేట్లను తగ్గించకపోవచ్చని ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. జనవరిలో ద్రవ్యోల్బణం గణాంకాలు గణనీయంగా కరెక్షన్కు లోను కావొచ్చని, అయినప్పటికీ ఆర్బీఐ పాలసీ రేట్ల తగ్గింపునకు కొన్నాళ్ల పాటు విరామం తప్పకపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. -
రిటైల్ ధరల మంట
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2019 అక్టోబర్లో అదుపు తప్పింది. 4.62 శాతంగా నమోదయ్యింది. అంటే వినియోగ వస్తువుల బాస్కెట్ ధర 2018 అక్టోబర్తో పోల్చిచూస్తే, 2019 అక్టోబర్లో 4.62 శాతం పెరిగిందన్నమాట. గడిచిన 16 నెలల కాలంలో (జూన్ 2018లో 4.92 శాతం) ఇంత తీవ్ర స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతాన్ని మించకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి (ఆర్బీఐ) కేంద్రం నుంచి నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్ 2’ లేదా ‘మైనస్ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. అంటే రిటైల్ ద్రవ్యోల్బణం ఎగువదిశలో 4% దాటకూడదన్నమాట. సెప్టెంబర్లో 5.11 శాతంగా ఉన్న ఆహార ఉత్పత్తుల బాస్కెట్ ధరల స్పీడ్ అక్టోబర్లో 7.89%కి పెరిగింది. ఒక్క కూరగాయల ధరలు ఇదే కాలంలో 5.40%నుంచి 26.10%కి ఎగిశాయి. పండ్ల ధరలు 0.83% నుంచి 4.08%కి పెరిగాయి. తృణధాన్యాల ధరలు 2.16%, మాంసం, చేపల ధరలు 9.75%, గుడ్ల ధరలు 6.26% పెరిగాయి. పప్పులు సంబంధిత ఉత్పత్తుల ధరలు 11.72 శాతం ఎగిశాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 3.10 శాతం పెరిగాయి. రెపోరేటు కోత ఇక లేనట్లే! అక్టోబర్లో ఈ రేటు అదుపు తప్పిన నేపథ్యంలో మరో దఫా ఆర్బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు (ప్రస్తుతం 5.15%) తగ్గింపునకు అవకాశాలు తక్కువేనన్నది నిపుణుల అభిప్రాయం. అలా చేస్తే, వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మరింత పెరుగుతుందని, దీనితో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందనీ, ఇది నిరుపేదల కొనుగోళ్లపై పెను భారం చూపుతుందన్నది ఆర్థిక సిద్ధాంతం. గడిచిన ఐదు ఆర్బీఐ ద్వైమాసిక సమావేశాల్లో 135 బేసిస్ పాయింట్లు (1.35%) రెపో రేటు తగ్గి 5.15 శాతానికి దిగివచ్చింది. -
టోకు ధరలు.. అదుపులోనే!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్ ఆగస్టులో యథాతథంగా జూలై తరహాలోనే 1.08 శాతంగా కొనసాగింది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కూడా నిర్దేశిత 4% దిగువన కొనసాగుతుండడంతో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరో దఫా రెపో రేటు కోతకు అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వృద్ధే లక్ష్యంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.4 శాతం) గడచిన నాలుగు ద్వైమాసికాల్లో ఆర్బీఐ 1.1 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ఆరి్థక వృద్ధి మందగమనం, పారిశ్రామిక రంగం నత్తనడక వంటి అంశాల నేపథ్యంలో మరో దఫా రేటు కోత తప్పదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా ఆగస్టు గణాంకాలను చూస్తే, ఆహార ఉత్పత్తుల ధరలు కొంత పెరిగినా, తయారీ రంగంలో ఉత్పత్తుల ధరలు మాత్రం అసలు (జీరో) పెరగలేదు. ఫుడ్ ఆరి్టకల్స్ ధరలు జూలైలో 6.15 శాతం ఉంటే, ఆగస్టులో 7.67 శాతానికి ఎగశాయి. కూరగాయల ధరలు 10.67 శాతం నుంచి 13.07 శాతానికి ఎగశాయి. కాగా ఇంధనం, ఫ్యూయెల్ అండ్ పవర్ బాస్కెట్ ధర 4 శాతం పెరిగింది. -
6 నెలల గరిష్టం అయినా... అదుపులోనే!
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 2.92 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 ఏప్రిల్లో సూచీలోని వస్తువుల బాస్కెట్ ధర 2019 ఏప్రిల్లో 2.92 శాతం పెరిగిందన్నమాట. ఈ స్థాయిలో రిటైల్ ధరల స్పీడ్ నమోదుకావడం ఆరు నెలల్లో ఇదే తొలిసారి. అయితే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశిత లక్ష్యం 4 శాతం లోపే ఉండడం గమనార్హం. మున్ముందు ఇదే రీతిలో ధరలు కొనసాగితే ఆర్బీఐ మరోదఫా రేటు రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో– ప్రస్తుతం 6 శాతం) తగ్గింపు ఖాయమన్న సంకేతాలు ఉన్నాయి. కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్లుసహా ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల ఏప్రిల్లో ధరల స్పీడ్ కొంత పెరిగింది. కేంద్రం సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ►మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.86 శాతం ఉంటే, 2018 ఏప్రిల్లో 4.58 శాతంగా ఉంది. ► అక్టోబర్ 2018 తరువాత (3.38%) ఈ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదవడం ఇదే తొలిసారి. ► ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే, ధరలు 1.1% పెరిగాయి. మార్చిలో ఈ పెరుగుదల రేటు కేవలం 0.3%. కూరగాయల ధరలు 2.87% పెరిగాయి. అయితే పండ్ల ధరలు మాత్రం గత ఏడాది ఏప్రిల్ నుంచి 2019 ఏప్రిల్ను చూస్తే తగ్గాయి. ► ఇంధనం, లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం 2.42 శాతం నుంచి 2.56 శాతానికి పెరిగింది. ►కాగా గ్రామీణ భారతంలో ధరల స్పీడ్ మార్చిలో 1.8 శాతం ఉంటే, ఏప్రిల్లో ఇది 1.87 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 4.1 శాతం నుంచి 4.23 శాతానికి చేరింది. ► నిర్దేశిత కొన్ని పట్టణాలు, గ్రామాల నుంచి ఎన్ఎస్ఎస్ఓ ఫీల్డ్ ఆపరేషన్స్ డివిజన్ల నుండి ఈ గణాంకాలను సేకరించడం జరుగుతుంది. 2019–2020లో 4 శాతం అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకూ) రిటైల్ ద్రవ్యోల్బణం రేటు సగటున 4 శాతం ఉంటుందని భావిస్తున్నట్లు క్రిసిల్ రిసెర్చ్ అంచనావేస్తోంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 3.4 శాతంగా ఉంది. ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశాలు ఉండడం తమ అంచనాలకు కారణంగా పేర్కొంది. -
వడ్డీ రేట్లు ఇంకా తగ్గుతాయా?
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతకు అటు కేంద్రం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తూ, శుక్రవారం తాజా ఆర్థిక గణాంకాలు వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ద్వారా పరిశీలించే ఈ రంగం వృద్ధి ఈ ఏడాది ఫిబ్రవరిలో కేవలం 0.1 శాతం. 2018 ఫిబ్రవరిలో ఇది 6.9 శాతం. ఇది 20 నెలల కనిష్టస్థాయి. 2017 జూన్ (0.3 శాతం) తర్వాత ఇంత పేలవ వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక మార్చి నెలలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కొంచెం పెరిగి 2.57 శాతంగా నమోదయ్యింది. అయితే ఇది ఆర్బీఐ నిర్దేశిస్తున్న 4 శాతం దిగువనే ఉండడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం ఇవ్వడానికి ఆర్బీఐ మరోదఫా రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6 శాతంగా ఉంది) రేటు కోతకు వీలుకల్పిస్తున్న గణాంకాలు ఇవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) విడుదల చేసిన గణాంకాలను చూస్తే... తయారీ రంగం పేలవం... ► తయారీ: మొత్తం సూచీలో 78 శాతం వాటా కలిగిన తయారీ విభాగం 2019 ఫిబ్రవరిలో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. ఈ రంగంలో వృద్ధి లేకపోగా 0.3 శాతం క్షీణత నమోదయింది. 2018 ఫిబ్రవరిలో ఈ విభాగం భారీగా 8.4 శాతం వృద్ధిని నమోదుచేసింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 10 మాత్రమే సానుకూల ఫలితాన్ని నమోదు చేయటం గమనార్హం. ► క్యాపిటల్ గూడ్స్: భారీ పెట్టుబడులకు సంకేతమైన భారీ యంత్రపరికరాల ఉత్పత్తి సంబంధ క్యాపిటల్ గూడ్స్... ఉత్పత్తి 2018లో 16.6 శాతమయితే ఇప్పుడు ఈ రేటు 8.8 శాతానికి తగ్గింది. ► విద్యుత్: ఈ రంగంలో ఈ రేటు 4.5 శాతం నుంచి 1.2 శాతానికి పడింది. ► మైనింగ్: ఈ విభాగంలో ఉత్పత్తి రేటు మాత్రం కొంత మెరుగుపడి, 2 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే నెలలో ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా 0.4 శాతం క్షీణత నమోదయ్యింది. ► కన్జూమర్ ప్రొడక్ట్స్: కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం 1.2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటే, నాన్–డ్యూరబుల్స్ విభాగం 4.3 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ► నవంబర్ గణాంకాలు దిగువముఖం: 2018 నవంబర్ ఐఐపీ వృద్ధి రేటును సైతం దిగువముఖంగా 0.3 శాతం నుంచి 0.2 శాతానికి తగ్గడం గమనార్హం. 11 నెలల కాలంలో.. 2018 ఏప్రిల్ నుంచి 2019 ఫిబ్రవరి నెలలను చూస్తే, పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు స్వల్పంగా తగ్గి 4 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో (2017 ఏప్రిల్ నుంచి 2018 మార్చి మధ్య) ఈ రేటు 4.3 శాతంగా ఉంది. స్వల్పంగా పెరిగిన రిటైల్ ధరల స్పీడ్ వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 2.86 శాతంగా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ రేటు 2.57 శాతంకాగా, 2018లో మార్చిలో 4.28 శాతం. మార్చిలో ఆహార ఉత్పత్తులు, ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయని గణాంకాలు పేర్కొన్నాయి. 4 శాతం లోపు రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలన్నది ఆర్బీఐ, విధాన నిర్ణేతల నిర్ణయం. ఈ దిగువనే తాజా గణాంకాలు ఉండడం గమనార్హం. ఆర్బీఐ నిర్దేశ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగడం ఇది వరుసగా ఎనిమిదవ నెల. 2018 జూలై (4.17 శాతం) తర్వాత 4 శాతంపైకి రిటైల్ ద్రవ్యోల్బణం ఎప్పుడూ పెరగలేదు. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ నియంత్రణలోని కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం తాజా రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కలను విడుదల చేసింది. 0.3 శాతం పెరిగిన ఫుడ్ బాస్కెట్ ధర ఫుడ్ బాస్కెట్ ధర మార్చిలో 0.3 శాతం పెరిగింది (2018 ఇదే నెల ధరలతో పోల్చి). ఫిబ్రవరిలో ఈ ధర అసలు పెరక్కపోగా –0.66 శాతం తగ్గింది. పండ్లు, కూరగాయల ధరల్లో పెరుగుదల లేకపోగా –5.88 శాతం తగ్గాయి. ఫిబ్రవరిలోనూ ఈ తగ్గుదల –4.90 శాతంగా ఉంది. తృణ ధాన్యాలు, ఉత్పత్తుల ధరలు 1.32 శాతం నుంచి 1.25 శాతానికి తగ్గాయి. -
తగ్గిన రిటైల్ ధరల స్పీడ్
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ధరల స్పీడ్ కొంత తగ్గింది. జూలైలో 4.17 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 జూలైతో పోల్చితే 2018 జూలైలో రిటైల్ వస్తువుల బాస్కెట్ ధర కేవలం 4.17 శాతమే పెరిందన్నమాట. ఇంత తక్కువ స్థాయిలో ధరల పెరుగుదల రేటు నమోదుకావడం తొమ్మిది నెలల్లో ఇదే తొలిసారి. కూరగాయల ధరలు తగ్గడం ఇందుకు ఒక కారణం. కాగా గత ఏడాది జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.36 శాతంకాగా, ఈ ఏడాది జూన్ నెలలో రేటు 4.85 శాతం. కాగా ఫుడ్ అండ్ శీతల పానీయాల ధరల పెరుగుదల రేటు 1.73 శాతం. ఇందులో కూరగాయల ధరలు అసలు పెరక్కపోగా –2.19 శాతం తగ్గాయి. పప్పు దినుసులు (–8.91 శాతం), చక్కెర (–5.81 శాతం) ధరలదీ ఇదే ధోరణి. గుడ్లు 7.41 శాతం, పండ్లు (6.98 శాతం, చేపలు 2.26 శాతం పెరిగాయి. -
మూడేళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
డిసెంబర్లో 3.41 శాతం న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ ఆధారిత– రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో మూడేళ్ల కనిష్ట స్థాయి 3.41 శాతానికి పడిపోయింది. అంటే 2015 డిసెంబర్లో కొన్ని వస్తువుల బాస్కెట్ ధరను 2016 డిసెంబర్తో పోల్చిచూస్తే... ధరలు 3.41 శాతం పెరిగాయన్నమాట. కాగా 2015 నవంబర్లో ఈ రేటు 3.63 శాతంకాగా, 2015 డిసెంబర్లో 5.61 శాతం. తాజా గణాంకాలను చూస్తే,... డిసెంబర్ నెలలో కొన్ని రంగాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడి డిమాండ్ తగ్గడంతో పాటు కూరగాయల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇందుల్లో వేర్వేరు కీలక విభాగాలను చూస్తే... • ఆహారం, పానీయాలు: ధరల పెరుగుదల 1.98%గా ఉంది. • పాన్, పొగాకు ఇతర మత్తు ప్రేరితాలు: 6.39% ధరల పెరుగుదల • దుస్తులు, పాదరక్షల విభాగం: ధరల పెరుగుదల రేటు 4.88 శాతం • హౌసింగ్: ఈ రంగంలో రేటు పెరుగుదల 4.98 శాతం • ఇంధనం, లైట్: ధరల పెరుగుదల రేటు 3.77 శాతం నిత్యావసరాలను చూస్తే: డిసెంబర్లో కూరగాయలు ధరలు అసలు పెరక్కపోగా, 2015 డిసెంబర్ ధరతో పోల్చితే –14.59 శాతం క్షీణత నమోదయ్యింది. పప్పు దినుసుల ధరలు కూడా ఇదే రకంగా –1.57 శాతం క్షీణించాయి. అయితే చక్కెర సంబంధిత ఉత్పత్తుల ధరలు మాత్రం భారీగా 21.06 శాతం ఎగశాయి. -
రిటైల్ ద్రవ్యోల్బణం13 నెలల కనిష్టానికి
♦ సెప్టెంబర్లో 4.41% ♦ కూరగాయల ధరల తగ్గుదల ప్రభావం న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 13 నెలల కనిష్టానికి దిగొచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో 5.05 శాతంగా ఉన్న వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత నెలలో 4.41 శాతానికి తగ్గింది. కూరగాయల ధరలు తగ్గడమే సెప్టెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం దిగిరావడానికి ప్రధాన కారణం. వడ్డీరేట్ల నిర్ణయంలో రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను కీలకంగా ఆర్బీఐ పరిగణిస్తుందని, రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడంతో ప్రతికూల వృద్ధిలో ఉన్న పారిశ్రామిక రంగానికి జోష్ నివ్వడానికి డిసెంబర్లో ఆర్బీఐ కీలక రేట్లలో కోత విధించడానికి అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా కట్టడి చేయాలని ఆర్బీఐ లక్ష్యంగా నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. ఈ నెల మొదట్లోనే ఆర్బీఐ రెపో రేటులో పావు శాతం కోత విధించి 6.25 శాతానికి తగ్గించింది. ఆగస్టులో 5.91 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం గత నెలలో 3.88 శాతానికి తగ్గిపోయింది. అలాగే కూరగాయల ద్రవ్యోల్బణం 1.02 శాతం నుంచి మైనస్ 7.21 శాతానికి పడిపోయింది. గత నెలలో పప్పుధాన్యాలు, గుడ్ల ధరలు తగ్గాయి. చేపలు, మాంసం ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో స్వల్పంగా తగ్గి 5.83 శాతానికి తగ్గింది. అయితే పండ్ల ధరలు పెరిగాయి. ఈ ఏడాది ఆగస్టులో 4.22 శాతంగా ఉన్న పట్టణ ప్రాంత రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 3.64 శాతానికి, అలాగే గ్రామీణ ప్రాంత రిటైల్ ద్రవ్యోల్బణం 5.87 శాతం నుంచి 4.96 శాతానికి తగ్గాయి. కాగా గతంలో రిటైల్ ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయి రికార్డ్ గత ఏడాది ఆగస్టులో 3.74 శాతంగా నమోదైంది. ఈ ఏడాది జీడీపీ వృద్ధి 7.9 శాతం: క్రిసిల్ వర్షాలు బాగా కురవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు పెరుగుతాయని, దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ వినియోగం 90 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 5 శాతంగా, జీడీపీ 7.9 శాతంగా ఉండగలదని క్రిసిల్ అంచనా వేస్తోంది. -
రిటైల్ ధరలు 3 నెలల కనిష్టం
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ధరల పెరుగుదల రేటు వార్షికంగా మార్చిలో 5.17%గా నమోదయ్యింది. అంటే ఈ బాస్కెట్లోని మొత్తం వస్తువులు సంబంధిత విభాగాల ధరలు 2014 మార్చి నెలతో పోల్చితే 2015 మార్చిలో 5.17 శాతం పెరిగాయన్నమాట. ఇంత కనిష్ట పెరుగుదల రేటు నమోదుకావడం మూడు నెలల తరువాత ఇదే తొలిసారి. 2014 డిసెంబర్లో ఈ వార్షిక ద్రవ్యోల్బణం రేటు 5 శాతం. జనవరిలో 5.19 శాతం కాగా, ఫిబ్రవరిలో 5.37 శాతం. సోమవారం కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. కూరగాయల ధరలు భారమే... వరుసగా రెండు నెలలతో పోల్చితే(2015 ఫిబ్రవరి, మార్చి) ధరల రేటు తగ్గినప్పటికీ, వార్షికంగా చూస్తే, కూరగాయలు, పప్పు దినుసులు, పాలు-పాల ఉత్పత్తుల ధరలు తీవ్రంగానే ఉన్నాయి. ఫిబ్రవరిలో కూరగాయల ధరలు (వార్షిక ప్రాతిపదికన) 13.01% పెరిగితే, మార్చి నెలలో ఈ రేటు 11.26%. పప్పు దినుసుల ధర లు మార్చిలో వార్షికంగా 11.48% పెరిగాయి. ఫిబ్రవరిలో ఈ రేటు 10.61%గా ఉంది. పాలు- పాల పదార్థాల విషయంలో ఈ రేటు 9.21% నుంచి 8.35%కి తగ్గింది. కాగా, గ్రామీణ ప్రాం తాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.58%గా, పట్టణ ప్రాంతాల్లో 4.75%గా నమోదైంది. -
రిటైల్ ధరలు పెరిగాయ్..
- ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం 5.37 % - వరుసగా మూడో నెలా పైపైకి.. రేట్ల కోత ఆశలపై నీళ్లు..! న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.37 శాతంగా నమోదయ్యింది. అంటే ఈ బాస్కెట్లోని మొత్తం వస్తువుల ధరలు 2014 ఫిబ్రవరితో పోల్చితే 2015 ఫిబ్రవరిలో 5.37 శాతం పెరిగాయన్నమాట. నవంబర్లో 4.38 శాతంగా ఉన్న ఈ రేటు అటు తర్వాతి నెలల్లో క్రమంగా పెరుగుతూ వస్తోంది. డిసెంబర్లో 5 శాతంగా, జనవరిలో 5.11 శాతంగా నమోదయ్యింది. వరుసగా మూడు నెలల నుంచీ ఈ రేటు పెరుగుతూ వస్తున్నందున, ఇక ఇప్పట్లో మరోదఫా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు (బ్యాంకులకు తాను స్వల్పకాలికంగా ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) కోతకు అవకాశం లేదని పలువురు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. తాజాగా విడుదలైన జనవరి పారిశ్రామిక వృద్ధి రేటు గణాంకాలు కూడా రేట్ల కోతకు అవకాశం లేని అంశమేనన్నది వారి వాదన. నిత్యావసరాల భారం ఆహారం, పానీయాల ధరలు 6.76 శాతం ఎగశాయి. ఇక్కడ ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే ధరలు 6.79 శాతం పెరిగాయి. పెరిగిన ఉత్పత్తుల్లో కూరగాయలు (13.01%), పప్పు దినుసులు (10.61శాతం), పాలు-సంబంధిత ఉత్పత్తులు (9.21 శాతం), సుగంధ ద్రవ్యాలు (9.16 శాతం), పండ్లు (8.93 శాతం), ప్రెపేర్డ్ మీల్స్ (7.41 శాతం), మాంసం, చేపలు (5.03 శాతం), ఆల్కాహాలేతర పానీయాలు (4.62 శాతం), తృణ ధాన్యాలు (2.91 శాతం) ఉన్నాయి. -
స్వల్పంగా పెరిగిన ధరలు
డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం * నవంబర్లో ఈ రేటు 4.38 శాతం * ఆహారోత్పత్తుల ధరల పెరుగుదల కారణం న్యూఢిల్లీ: రిటైల్ ధరలు 2014 డిసెంబర్లో స్వల్పంగా పెరిగాయి. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం వృద్ధి రేటు 5 శాతంగా నమోదయ్యింది. అంటే 2013 డిసెంబర్తో పోల్చితే 2014 డిసెంబర్లో రిటైల్ ధరలు 5 శాతం పెరిగాయన్నమాట. 2014 నవంబర్లో ఈ రేటు 4.38 శాతంగా ఉంది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా ఈ ధరల పెరుగుదల శాతాన్ని లెక్కిస్తారు. డిసెంబర్లో ద్రవ్యోల్బణం పెరగడానికి పళ్లు, కూరగాయలుసహా కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుదలే కారణమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఫిబ్రవరి 3వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య,పరపతి విధాన సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఈ గణాంకాలు వెలువడ్డాయి. వివిధ విభాగాల్లో ఉత్పత్తుల పెరుగుదల రేట్లు ఇలా... * ఆహార పానీయాల విభాగం మొత్తంగా చూసుకుంటే, ధరలు రెండు వరుస నెలల్లో 3.5 శాతం నుంచి 5 శాతానికి చేరాయి. విడివిడిగా ఉత్పత్తులను చూస్తే, 2014 నవంబర్లో కూరగాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా (2013 నవంబర్తో పోల్చితే) 10.9 శాతం క్షీణించగా, గత డిసెంబర్లో మాత్రం 0.58 శాతం పెరిగాయి * కాగా పట్టణాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్లో 4.69 శాతం ఉంటే, ఇది డిసెంబర్లో 5.32 శాతానికి చేరింది. గ్రామీణ ప్రాంతంలో ఈ రేటు 4.09 శాతం నుంచి 4.71 శాతానికి చేరింది. -
ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులు!
దేశ ఆర్థిక వ్యవస్థకు శుభ సూచకంలాంటి రెండు కీలక గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. ఒకపక్క పారిశ్రామిక రంగం పుంజుకోగా.. మరోపక్క రిటైల్ ధరలు మరింత శాంతించాయి. కార్పొరేట్ రంగానికి రానున్న రోజుల్లో ఇది సానుకూల పరిణామంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో రానున్న పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామిక రంగం కోలుకుంటున్న సంకేతాలు బలపడుతున్నాయి. సెప్టెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) వృద్ధి రేటు భారీగా పుంజుకొని 2.5 శాతానికి ఎగబాకింది. ఆగస్టులో ఈ రేటు కేవలం 0.48 శాతం మాత్రమే. అయితే, క్రితం ఏడాది సెప్టెంబర్లో పరిశ్రమల వృద్ధి 2.7 శాతంగా ఉంది. ప్రధానంగా మైనింగ్, తయారీ, యంత్రపరికరాల రంగాల మెరుగైన పనితీరు మొత్తం పారిశ్రామికోత్పత్తి పుంజుకోవడానికి ప్రధానంగా దోహదపడింది. ఏప్రిల్-సెప్టెంబర్కు ఇలా... ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధికి కూడా పరిశ్రమల ఉత్పాదకత జోరందుకుంది. ఐఐపీ వృద్ధి రేటు 2.8 శాతానికి ఎగసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 0.5 శాతమే కావడం గమనార్హం. రంగాల వారీగా... తయారీ: పారిశ్రామికోత్పత్తి సూచీలో 75 శాతం వెయిటేజీ ఉన్న ఈ రంగం ఉత్పాదకత సెప్టెంబర్లో 2.5 శాతానికి పుంజుకుంది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 1.4 శాతం. ఇక ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధికి చూస్తే వృద్ధి రేటు 0.2 శాతం నుంచి 2 శాతానికి పెరిగింది. మొత్తంమీద తయారీ రంగంలోని 22 పారిశ్రామిక విభాగాల్లో 15 విభాగాలు సెప్టెంబర్లో వృద్ధి చెందడం ఆర్థిక వ్యవస్థకు సానుకూలాంశం. మైనింగ్: సెప్టెబర్లో ఉత్పాదకత 0.7 శాతంగా వృద్ధి చెందింది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 3.6 శాతంగా ఉంది. ఇక ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఉత్పాదకత 2.5%గా నుంచి 2.1 శాతానికి తగ్గింది. యంత్రపరికరాలు: డిమాండ్కు కొలమానంగా పరిగణించే ఈ రంగం ఉత్పాదకత వృద్ధి రేటు సెప్టెంబర్లో ఏకంగా 11.6 శాతానికి ఎగబాకింది. గతేడాది ఇదే నెలలో ఉత్పాదకత మైనస్ 6.6 శాతంగా ఉంది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో కూడా మైనస్ 0.6 శాతం క్షీణత నుంచి 5.8 శాతం వృద్ధి బాటలోకి మళ్లింది. విద్యుత్: ఉత్పాదకత 12.9 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గింది. ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధిలో మాత్రం 5.9 శాతం నుంచి 10.4 శాతానికి ఎగసింది. కన్జూమర్ గూడ్స్: ఉత్పాదకత 1 శాతం నుంచి 4 శాతానికి పెరిగింది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో మైనస్ 1.2 శాతం క్షీణత నుంచి 4.6 శాతం వృద్ధిరేటును సాధించింది. కన్సూమర్ డ్యూరబుల్స్: ఈ రంగం ఉత్పాదకత మైనస్ 10.6 క్షీణత నుంచి మరింత తగ్గి మైనస్ 11.3 శాతానికి క్షీణించింది. ఆరు నెలల వ్యవధిలో కూడా ఉత్పాదకత మైనస్ 12.6 శాతానికి(అంతక్రితం ఇదే కాలంలో మైనస్ 11.1 శాతం) దిగజారింది. రిటైల్ ద్రవ్యోల్బణం మరింత కిందకు.. న్యూఢిల్లీ: ఆహారోత్పత్తుల ధరలు దిగిరావడంతో రిటైల్ ధరల పెరుగుదల రేటు కూడా భారీగా తగ్గింది. అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) 5.52 శాతానికి పరిమితమైంది. సెప్టెంబర్లో ఈ రేటు 6.46 శాతంగా ఉంది. వరుసగా నాలుగో నెలలోనూ ఇది తగ్గుముఖం పట్టడం గమనార్హం. 2012 జనవరిలో ఈ కొత్త సిరీస్ గణాంకాలను ప్రవేశపెట్టిన తర్వాత ఇంత తక్కువ స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటిసారి. కాగా, బేస్ రేటు తక్కువగా ఉండటం కూడా తాజా గణాంకాలపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కూరగాయల ఎఫెక్ట్... సీపీఐలో ఆహార ధరల ద్రవ్యోల్బణం రేటు సెప్టెంబర్లో 7.69 శాతంగా ఉండగా.. అక్టోబర్లో 5.59 శాతానికి తగ్గింది. ముఖ్యంగా కూరగాయల ధర పెరుగుదల సెప్టెంబర్లో 8.59 శాతంగా ఉంది(గతేడాది ఇదే నెలతో పోలిస్తే). అక్టోబర్లో ఈ రేటు మైనస్ 1.45 శాతంగా నమోదైంది. పండ్ల విభాగంలో ద్రవ్యోల్బణం రేటు కూడా అక్టోబర్లో 17.49 శాతానికి తగ్గింది(సెప్టెంబర్లో 22.4 శాతం). ఇక గుడ్లు, చేపలు, మాంసం వంటి ఆహారోత్పుత్తలకు సంబంధించిన ద్రవ్యోల్బణం 6.35 శాతం నుంచి స్వల్పంగా 6.34 శాతానికి తగ్గింది. ఆర్బీఐ సమీక్షపైనే అందరికళ్లూ.. రిటైల్ ధరలు నేలకు దిగిరావడం... టోకు ధరలు కూడా కనిష్టస్థాయిలోనే కొనసాగుతుండటంతో ఆర్బీఐ పాలసీ వడ్డీరేట్లను తగ్గింస్తుందా లేదా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా మందగమనంలో ఉన్న వృద్ధి రేటును గాడిలోపెట్టాలంటే వడ్డీరేట్లను తగ్గించాల్సిందేనని పారిశ్రామిక రంగం పదేపదే డిమాండ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 2న ఆర్బీఐ పాలసీ సమీక్ష జరపనుంది. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) సెప్టెంబర్లో ఐదేళ్ల కనిష్టమైన 2.38 శాతానికి తగ్గడం తెలిసిందే. అక్టోబర్ గణాంకాలు రేపు(శుక్రవారం) రానున్నాయి. వచ్చే ఏడాది మార్చికల్లా రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 8 శాతానికి, 2016 మార్చినాటికి 6 శాతానికి తగ్గాలనేది ఆర్బీఐ లక్ష్యం. గత నాలుగు సమీక్షల్లో పాలసీ వడ్డీరేట్లను ఆర్బీఐ గవర్నర రఘురామ్ రాజన్ యథాతథంగా కొనసాగించడం విదితమే. -
కార్మికుల డీఏ నిర్ధారణ కోసం ‘ధరల సూచిక’ విడుదల
హైదరాబాద్: పారిశ్రామిక కార్మికుల డీఏను నిర్ణయించేందుకు వినియోగించే ‘వినియోగదారుల ధరల సూచిక’లను శుక్రవారం కార్మిక శాఖ విడుదల చేసింది. 2014 జూన్తో ముగిసిన అర్ధ వార్షికానికి సంబంధించి పారిశ్రామిక కార్మికులకు 1116 పాయింట్లు.. పార్ట్-2లో ని వ్యవసాయ కార్మికులకు 822 పాయింట్లు కేటాయిం చింది. ఈ పాయింట్లు 2014 అక్టోబర్ 1 నుంచి 2015 మార్చి 31 వరకు అమలులోకి ఉంటాయని తెలిపింది. -
పన్ను తగ్గాలా?
మార్చి నెల వచ్చేసింది. ఆదాయపు పన్ను కోతల నుంచి తప్పించుకోవాలన్నా... ఒకవేళ ఇప్పటికే కోత పడి ఉంటే రిఫండ్ రూపంలోనైనా వెనక్కి తీసుకోవాలన్నా... తగినంత మొత్తాన్ని ఈ నెల్లో పొదుపు చేయాల్సిందే. ఎంపిక చేసిన పథకాల్లో పెట్టుబడి పెట్టాల్సిందే. పన్ను భారం తగ్గించుకోవడానికి చట్టం అనేక మార్గాలను సూచించింది. అందరికీ బాగా పరిచయం ఉన్న సెక్షన్ 80సీనే కాకుండా ఇంకా అనేక సెక్షన్లు పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి దోహదం చేస్తున్నాయి. వీటన్నింటిపై అవగాహన కల్పించేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... సెక్షన్ 80సీతో పాటు పలు సెక్షన్లు పన్ను భారం తగ్గించుకునేలా చేస్తాయి. వీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే సాధ్యమైనంత వరకు ఆదాయపు పన్నుకు దూరంగా ఉండొచ్చు. వీటిలో కొన్ని ముఖ్యమైన సెక్షన్లు ఇప్పుడు చూద్దాం.. సెక్షన్ 24బి రుణం తీసుకొని నిర్మించిన ఇంటికి రెండు సెక్షన్ల ద్వారా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. చెల్లిస్తున్న రుణంలో అసలుకు (అంటే వడ్డీ కాకుండా) చెల్లించే మొత్తంపై సెక్షన్ 80సీ కింద ప్రయోజనం పొందవచ్చు. అదే రుణానికి చెల్లించే వడ్డీపై సెక్షన్ 24(బి) కింద గరిష్టంగా ఏడాదికి రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80డీ/ 80డీడీ / 80డీడీబీ రోజువారి దైనందిన జీవితంలో ఆరోగ్య పరిరక్షణకు లేదా చికిత్సకు అయ్యే వ్యయాలపై పన్ను ప్రయోజనాలను పొందడానికి ఆదాయపు పన్ను చట్టంలో అనేక సెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా మూడు సెక్షన్లు 80డీ, 80డీడీ, 80డీడీబీ ముఖ్యమైనవి. 80డీ: హెల్త్ ఇన్సూరెన్స్కు చెల్లించే ప్రీమియంలపై సెక్షన్ 80డీ ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు. గరిష్టంగా రూ.15,000 వరకు సీనియర్ సిటిజన్స్ అయితే రూ.20,000 వరకు ఈ విధంగా తగ్గించుకోవచ్చు. అదే తల్లిదండ్రులకు కూడా వైద్య బీమా తీసుకుంటే అదనంగా మరో రూ.15,000 (సీనియర్ సిటిజన్స్కి రూ.20,000) ప్రయోజనం లభిస్తుంది. ఇది కాకుండా ఈ సంవత్సరం నుంచి ముందుజాగ్రత్త చర్యగా చేయించుకునే వైద్య పరీక్షలపై గరిష్టంగా రూ.5,000 వరకు పన్ను ప్రయోజనాలను పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల వైద్య పరీక్షలకూ ఇది వర్తిస్తుంది. 80డీడీబీ: కొన్ని ప్రధానమైన వ్యాధులకు చికిత్స చేయించుకుంటే సెక్షన్ 80డీడీబీ కింద గరిష్టంగా 40,000 వరకు ఆదాయంలోంచి తగ్గించి చూపించుకోవచ్చు. ఏయే వ్యాధి చికిత్సలకు మినహాయింపులు లభిస్తాయన్నది ఈ సెక్షన్లో వివరంగా ఉంటుంది. అదే సీనియర్ సిటిజన్ అయితే రూ.60,000 వరకు చూపించుకోవచ్చు. ఒక వేళ ఈ మొత్తాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా రీ-ఎంబర్స్మెంట్ పొందితే మాత్రం ఈ ప్రయోజనం లభించదు. 80యూ: అసెస్సీకి వైకల్యం ఉంటే కనుక సెక్షన్ 80యూ ప్రకారం మినహాయింపులు పొందచ్చు. అంగవైకల్యం తీవ్రతను బట్టి పొందే మినహాయింపు ఆధారపడి ఉంటుంది. ఇందుకు డాక్టర్ సర్టిఫికెట్ను పరిగణనలోకి తీసుకుంటారు. వైకల్యం సాధారణ స్థాయిలో ఉంటే ఆదాయం నుంచి రూ.50,000 తగ్గించి చూపించుకోవచ్చు. అదే తీవ్రత ఎక్కువగా ఉంటే రూ.75,000 వరకు మినహాయించుకోవచ్చు. 80డీడీ: వైకల్యం ఉన్న వారు మీపై ఆధారపడి ఉంటే (తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అక్కా చెల్లెల్లు, అన్నదమ్ములు) సెక్షన్ 80డీడీ కింద పన్ను ప్రయోజనాలు పొందచ్చు. ఒక మాదిరి వైకల్యం అయితే గరిష్టంగా రూ.50,000, అదే తీవ్ర వైకల్యమైతే గరిష్టంగా రూ.1,00,000 వరకు ఆదాయాన్ని తగ్గించి చూపించుకోవచ్చు. ఎల్ఐసీ జీవన్ ఆథార్ పాలసీకి చెల్లించే ప్రీమియంలు కూడా ఈ సెక్షన్ పరిధిలోకే వస్తాయి. సెక్షన్ 80జీ ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80జీ ద్వారా ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపులు లభిస్తాయి. అంటే ఈ మేరకు ఆదాయాన్ని తగ్గించి చూపించుకోవడం ద్వారా పన్ను భారం నుంచి ఉపశమనం పొందవచ్చు. అన్ని విరాళాలకు ఈ మినహాయింపులు లభించవు. ఇందుకు సంబంధించి సెక్షన్ 80జీలో అనేక నిబంధనలు ఉన్నాయి. కొన్ని విరాళాలపై పూర్తిగా 100 శాతం తగ్గింపు (డిడక్షన్) లభిస్తే మరికొన్నింటిపై 50 శాతం మాత్రమే లభిస్తాయి. జాతీయ రక్షణ నిధి, ప్రధానమంత్రి సహాయ నిధి, ముఖ్య మంత్రి సహాయ నిధి, నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మొనీ, జిల్లా సాక్షరతా మిషన్, కేంద్ర స్పోర్ట్స్ ఫండ్, కేంద్ర సాంస్కృతిక ఫండ్, నేషనల్ టెక్నాలజీ ఫండ్లకు ఇచ్చే విరాళాలపై ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తిగా 100 శాతం మినహాయింపులు లభిస్తాయి. జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, ప్రధానమంత్రి కరువు సహాయక నిధి, జాతీయ చిల్డ్రన్ ఫండ్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ వంటి వాటికిచ్చే విరాళాలపై 50 శాతం తగ్గింపు ప్రయోజనం లభిస్తుంది. అలాగే నగదు రూపంలో ఇచ్చే విరాళాలు, స్థూల జీతంలో 10 శాతం దాటని విరాళాలకు మాత్రమే ఈ డిడక్షన్స్ వర్తిస్తాయి. సెక్షన్ 54ఈసీ ఈ మధ్య కాలంలో బంగారం, షేర్ల ధరలు బాగా పెరిగాయి. ఇలా అమ్మినప్పుడు వచ్చిన లాభాలపై దీర్ఘకాలిక మూల ధన పన్ను (లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్) చెల్లించాలి. కాని ఈ పన్ను భారం నుంచి తప్పించుకోవడానికి ఆదాయ పన్ను చట్టంలో ప్రత్యేకంగా 54ఈసీ పేరుతో ఒక సెక్షన్ ఉంది. 54ఈసీ పరిధిలోకి వచ్చే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బాండ్స్లో ఈ లాభాలను ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. దీని ప్రకారం బంగారం, షేర్లు, స్థలాలు, ఇల్లు వంటివి అమ్మినప్పుడు వచ్చే లాభాలను ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్స్ మూడేళ్ళ లాకిన్ పిరియడ్ను కలిగి ఉంటాయి. కాని ఈ బాండ్స్ అందించే వడ్డీని మాత్రం ఆదాయంగా పరిగణిస్తారు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టకుండా ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా గరిష్టంగా 20 శాతం పన్ను భారం తగ్గుతుంది. సెక్షన్ 80జీజీ హెచ్ఆర్ఏ లేకపోయినా చెల్లించే ఇంటద్దెపై పన్ను ప్రయోజనాలు పొందడానికి ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉందన్న సంగతి చాలా మందికి తెలియనే తెలియదు. సెక్షన్ 80జీజీ ప్రకారం హెచ్ఆర్ఏ సౌలభ్యం లేని వృత్తినిపుణులు, వ్యాపారస్తులు వంటి వారు ఈ ప్రయోజనం పొందచ్చు. ఈ సెక్షన్ ప్రకారం మీ ఆదాయంలో గరిష్టంగా 25 శాతం లేదా నెలకు గరిష్టంగా రూ.2,000 వరకు ఆదాయం నుంచి మినహాయింపు పొందవచ్చు. కాని ఈ ప్రయోజనం పొందాలంటే నివసిస్తున్న ఊరిలో మీ పేరు మీద లేక భార్య పిల్లల పేర సొంతిల్లు ఉండకూడదు. అలాగే ఇంటికి సంబంధించిన ఎటువంటి ఇతర పన్ను ప్రయోజనాలను పొంది ఉండకూడదు. ఈ సెక్షన్ ఉపయోగించుకోవడం ద్వారా గరిష్టంగా రూ.7,400 వరకు పన్ను భారం తగ్గుతుంది. సెక్షన్ 80సీసీజీ రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం పేరుతో కొత్తగా సెక్షన్ 80సీసీజీ అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం తొలిసారిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేసే వారికే వర్తిస్తుంది. ఈ పథకం కింద గరిష్టంగా ఇన్వెస్ట్ చేసే రూ.50,000లో సగభాగం అంటే రూ.25,000 పన్ను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. వార్షికాదాయం పన్నెండు లక్షలు దాటిన వారికి ఇది వర్తించదు. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం సెక్షన్ 80ఈ చదువుల కోసం చేసే వ్యయాలపై పన్ను ప్రయోజనాలను పొందడానికి రెండు రకాల సెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి సెక్షన్ 80సీ కాగా రెండోది సెక్షన్ 80ఈ. పిల్లల చదువులకు చెల్లించే ట్యూషన్ ఫీజులపై సెక్షన్ 80సీ ప్రకారం గరిష్టంగా లక్ష రూపాయల వరకు పన్ను మినహాయింపులు లభిస్తాయి. అలా కాకుండా అసెస్సీనే ఉన్నత చదువు కోసం రుణం తీసుకుంటే అందుకు చెల్లించే వడ్డీపై సెక్షన్ 80ఈ ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ వడ్డీ మినహాయింపులపై ఎటువంటి పరిమితులు లేవు. కాని ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ మినహాయింపు కేవలం వడ్డీ చెల్లింపులపైన మాత్రమే. అసలుకు చెల్లించే వాటిపైన ఎటువంటి మినహాయింపులుండవు. అలాగే గరిష్టంగా 8 సంవత్సరాల వరకు ఈ మినహాయింపులను పొందవచ్చు. రుణం తీసుకుని ఎనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత చెల్లించే వడ్డీపై సెక్షన్ 80ఈ కింద మినహాయింపులు లభించవు. భార్య లేదా భర్త, పిల్లలు లేదా సొంతంగా ఉన్నత చదువుల కోసం తీసుకునే రుణాలన్నింటిపైనా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. సెక్షన్ 80సీ... పన్ను భారం తగ్గించుకోవడం అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది సెక్షన్ 80సీ. ఈ సెక్షన్ కింద చేసిన కొన్ని పొదు పులు, చెల్లింపుల ద్వారా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సెక్షన్ పరిధిలోకి అనేక సాధనాలు వచ్చినా గరిష్టంగా లక్ష రూపాయలు మించి ప్రయోజనం పొందలేరు. ఇప్పుడు ఈ సెక్షన్ పరిధిలోకి వచ్చే వాటిని ఒకసారి చూద్దాం... పొదుపు పథకాలు: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఈక్విటీ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ (ఈఎల్ఎస్ఎస్-ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్), బ్యాంకులో ఐదేళ్లకు చేసిన ఫిక్స్డ్ డపాజట్లు, జాతీయ పొదుపు సర్టిఫికెట్లు, సీనియర్ సిటిజన్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్, బీమా, యులిప్, పెన్షన్ పథకాలు ముఖ్యమైనవి. చెల్లింపులు: గృహ రుణం ఈఎంఐలో అసలు (ప్రిన్సిపల్) కింద చెల్లించే వాటా, ఇంటి రిజిస్ట్రేషన్కి చెల్లించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, వంటివి ఈ కోవలోకి వస్తాయి. ఆన్లైన్లో పునరుద్ధరణ ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఆన్లైన్లో పాలసీల పునరుద్ధరణ సదుపాయాన్ని కల్పించింది. మధ్యలో ప్రీమియంలు చెల్లించకుండా రద్దయిన పాలసీలను ఆన్లైన్లో ప్రీమియం చెల్లించడం, ఆరోగ్య ధృవీకరణ పత్రం ఇవ్వడం ద్వారా పునరుద్ధరించుకోవచ్చు. టాటా ఏఐఏ టర్మ్ పాలసీ ‘మహా రక్ష సుప్రీం’ పేరుతో టాటా ఏఐఏ టర్మ్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జీవితంలో బాధ్యతలు పెరుగుతున్న కొద్ది బీమా రక్షణ మొత్తం పెంచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. కనీస బీమా రక్షణ రూ.50 లక్షలుగా, కాలపరిమితి 10-40 ఏళ్లుగా నిర్ణయించారు. ధూమపానం అలవాటు లేనివారికి, మహిళలకు ప్రీమియంలో తగ్గింపు ఉంది. బిర్లా సన్లైఫ్ ఆర్జీఈఎస్ఎస్ బిర్లాసన్లైఫ్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ‘ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ సిరీస్-2’ను ప్రవేశపెట్టిం ది. కేవలం బీఎస్ఈ 100 ఇండెక్స్ షేర్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేసే ఈ పథకం మూడేళ్ల లాకిన్ పిరియడ్ను కలిగి ఉంటుంది. ఇది రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీం పరిధిలో ఉండటంతో మొదటిసారి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేవారికి పన్ను మినహాయింపులు లభిస్తాయి. సిగ్నా టీటీకే హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా రంగంలోకి మరో కంపెనీ వచ్చి చేరింది. అమెరికాకు చెందిన సిగ్నా, ఇండియాకు చెందిన టీటీకే సంయుక్తంగా సిగ్నా టీటీకే హెల్త్ న్సూరెన్స్ పేరిట వైద్య బీమా సేవలను ప్రారంభించాయి. వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు తగిన విధంగా సరికొత్త వైద్య బీమా పథకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఎల్ఐసీ రాజీవ్గాంధీ స్కీం ఎల్ఐసీ నొమూరా మ్యూచువల్ ఫండ్ రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీంను ప్రారంభించింది. సెక్షన్ 80సీసీజీ కింద ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసే తొలి ఈక్విటీ పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ పథకం మార్చి 14తో ముగుస్తుంది. మూడేళ్ల లాకిన్ పిరియడ్ ఉన్న ఈ పథకంలో కనీస ఇన్వెస్ట్మెంట్ మొత్తం రూ.5,000. మోర్గాన్స్టాన్లీ డివిడెండ్లు మోర్గాన్స్టాన్లీ రెండు ఈక్విటీ పథకాలపై డివిడెండ్ను ప్రకటించింది. ఏస్ ఫండ్పై 10 శాతం, గ్రోత్ ఫండ్పై 15 శాతం డివిడెండ్ను ప్రకటించింది. ఈ డివిడెండ్లకు రికార్డు తేది మార్చి 4గా నిర్ణయించారు. మార్చి4న నాటికి కలిగి ఉన్న ప్రతీ ఏస్ ఫండ్ యూనిట్పై రూ.1, అదే గ్రోత్ ఫండ్పై రూ.1.50 డివిడెండ్ లభిస్తుంది. -
ఇంకాస్త దిగొచ్చిన రిటైల్ ధరలు
న్యూఢిల్లీ: రిటైల్ ధరల వేగం వరుసగా రెండవ నెల జనవరిలో కూడా తగ్గింది. నవంబర్లో 11.16 శాతం ఉన్న రేటు- డిసెంబర్లో 9.87 శాతానికి పడగా, తాజాగా జనవరిలో మరింత కిందకు దిగి 8.79 శాతంగా నమోదయ్యింది. అంటే వార్షిక ప్రాతిపదికన ఆయా నెలల్లో ధరల పెరుగుదల రేటు కిందకు తగ్గుతూ వచ్చిందన్నమాట. జనవరి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయి. మొత్తంగా చూస్తే- ఆహారం, ఆల్కాహాలేతర పానీయాల ధరలు 9.9 శాతం పెరిగాయి. ఇంధనం, లైట్ విభాగానికి సంబంధించి ద్రవ్యోల్బణం 6.54 శాతంగా నమోదయ్యింది. దుస్తులు, పాదరక్షలు, బెడ్డింగ్ కేటగిరీలో ఈ పెరుగుదల రేటు 9.18 శాతంగా ఉంది. నిత్యావసర వస్తువుల్లో చమురు, కొవ్వు పదార్థాలు (-0.35 శాతం), చక్కెర (-5.51 శాతం) మినహా దాదాపు అన్ని విభాగాల్లో రేట్లు పెరిగాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో... కాగా జనవరిలో పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 9.43 శాతంగా నమోదుకాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 8.09 శాతంగా ఉంది. డిసెంబర్లో ఈ రేట్లు వరుసగా 10.49 శాతం, 9.11 శాతంగా ఉన్నాయి. ఇదిలావుండగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు రేపు (14వ తేదీ శుక్రవారం) విడుదలయ్యే అవకాశం ఉంది.