Crore
-
Mahakumbh: మహారికార్డు.. ఐదు కోట్లు దాటిన పవిత్ర స్నానాలు
ప్రయాగ్రాజ్: యూపీలోని తీర్థరాజం ప్రయాగ్రాజ్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. దీనిలో ఇప్పుడు కొత్త రికార్డులు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసినవారి సంఖ్య 50 కోట్లు దాటింది. గతంలో కుంభమేళా స్నానాలపై ఉన్న అంచనాలను ఈ రికార్డు దాటేసింది.అమెరికా సెన్సస్ బ్యూరో నివేదిక అందించిన వివరాల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ (జనాభా 34,20,34,432), ఇండోనేషియా (జనాభా 28,35,87,097), పాకిస్తాన్ (జనాభా 25,70,47,044), నైజీరియా (జనాభా 24,27,94,751), బ్రెజిల్ (జనాభా 22,13,59,387), బంగ్లాదేశ్ (జనాభా 17,01,83,916), రష్యా (జనాభా 14,01,34,279), మెక్సికో (జనాభా 13,17,41,347)లలోని జనాభాను దాటినంతమంది కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు.మహా కుంభమేళకు ముందు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించిన అంచనాలను మించిన రీతిలో కుంభమేళాలో సరికొత్త రికార్డు నమోదయ్యింది. ప్రారంభంలో 45 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్కు వస్తారనే అంచనాలున్నాయి. ఫిబ్రవరి 11 నాటికి ఆ అంచనా నిజమని రుజువైంది. శుక్రవారం (ఫిబ్రవరి 14) నాటికి ఈ సంఖ్య 50 కోట్లను దాటింది. మహా కుంభమేళాలో ఇంకా 12 రోజులు మాత్రమే మిగిలివున్నాయి. మరొక స్నాన ఉత్సవం ఫిబ్రవరి 26న శివరాత్ర సందర్భంగా ఉంది. అప్పటికి పుణ్యస్నానాలు చేసే వారి సంఖ్య 55 నుంచి 60 కోట్లు దాటవచ్చనే కొత్త అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటివరకు స్నానం చేసిన మొత్తం భక్తుల సంఖ్యను విశ్లేషిస్తే మౌని అమావాస్య నాడు గరిష్టంగా 8 కోట్లు మంది భక్తులు స్నానం చేయగా, మకర సంక్రాంతినాడు 3.5 కోట్ల మంది భక్తులు అమృత స్నానం చేశారు. ఫిబ్రవరి ఒకటి, జనవరి 30 తేదీలలో రెండు కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. పుష్య పూర్ణిమ నాడు 1.7 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. వసంత పంచమి నాడు 2.57 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. మాఘ పూర్ణిమ నాడు కూడా రెండు కోట్లకు పైగా భక్తులు పవిత్ర సంగమంలో స్నానాలు ఆచరించారు.ఇది కూడా చదవండి: అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా -
ఐదు గంటల్లో కోటీశ్వరుడైన 9వ తరగతి విద్యార్ధి.. అసలేం జరిగిందంటే?
బీహార్లోని ముజఫర్పూర్లో ఒక విద్యార్థి తన బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్ను చెక్ చేసినప్పుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే తన బ్యాండ్ బ్యాలెన్స్ ఏకంగా రూ.87.63 కోట్లుగా చూపించింది. దీంతో ఐదు గంటల పాటు ఆ విద్యార్ధి కోటీశ్వరుడయ్యాడు.బీహార్కు చెందిన 9వ తరగతి విద్యార్థి 'సైఫ్ అలీ' రూ.500 విత్డ్రా చేసుకోవడానికి ఏటీఎంకు వెళ్ళాడు, ఆ సమయంలో తన బ్యాంకు బ్యాలెస్ చెక్ చేస్తే.. రూ.87.65 కోట్లు ఉన్నట్లు చూపించింది. స్క్రీన్పైన కనిపించే బ్యాంక్ బ్యాలెన్స్ అతన్ని ఒక్కసారిగి ఆశ్చర్యపరిచింది. సైఫ్ వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లితో ఈ విషయాన్ని పంచుకున్నాడు.సైఫ్ ఖాతాలో రూ.87.63 కోట్లు ఉన్న విషయం ఆ ఊరు మొత్తం తెలిసిపోయింది. మళ్ళీ అతడు బ్యాంక్ స్టేట్మెంట్ కోసం కస్టమర్ సర్వీస్ పాయింట్కు వెళ్లి చెక్ చేసాడు. అప్పుడు అతని ఖాతాలో కేవలం 532 రూపాయలు మాత్రమే ఉన్నట్లు చూపించింది. అంతే కాకుండా అతని బ్యాంక్ అకౌంట్ కూడా కొంత సేపు స్తంభించింది.ఈ వింత సంఘటన కేవలం ఐదు గంటలు మాత్రమే కొనసాగింది. తనకు తెలియకుండానే వచ్చిన అదృష్టం.. తనకు తెలియకుండానే అదృశ్యమైంది. నార్త్ బీహార్ గ్రామీణ బ్యాంక్.. సైఫ్ ఖాతాలో పొరపాటున ఇంత పెద్ద మొత్తం ఎలా జమ అయ్యిందో తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించింది. ఈ తప్పిదం ఎలా జరిగిందన్న దానిపై బ్యాంకు అధికారులు ఇంకా స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.ఇదీ చదవండి: అంబానీ, అదానీ కంటే సంపన్నుడు: ఇప్పుడు నిలువ నీడ లేక..ఇలాంటి సంఘటనలు మొదటిసారి కాదుఅనుకోకుండా బ్యాంక్ ఖాతాలో కోట్ల రూపాయలు జమ అయిన సంఘటనలు గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ తరువాత వచ్చిన డబ్బు వచ్చినట్లే వెనక్కి వెళ్లాయి. కొంతమంది తమకు తెలిసిన వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయడం వంటివి కూడా చేశారు. కానీ ఆ డబ్బును కూడా అధికారులు మళ్ళీ కట్టించుకున్నారు. అయితే సైఫ్ ఖాతాలో పడ్డ డబ్బు, ఐదు గంటల తరువాత మాయమైంది. -
15X15X15 ఫార్ములా.. కోటీశ్వరులు అవ్వడానికి ఉత్తమ మార్గం!
డబ్బు సంపాదించాలని, కోటీశ్వరులవ్వాలని అందరికీ ఉంటుంది. అయితే ఆలోచన ఒక్కటి ఉంటే సరిపోదు, ఆచరణ కూడా అవసరం. ఈ కథనంలో 15 సంవత్సరాల్లో కోటీశ్వరులు ఎలా అవ్వాలో అనే విషయాన్ని.. 15X15X15 ఫార్ములా ద్వారా తెలుసుకుందాం.తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే.. దానికి అత్యుత్తమ మార్గం ఇన్వెస్టిమెంట్ అనే చెప్పాలి. అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? అనే విషయాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి.ఇక 15X15X15 ఫార్ములా విషయానికి వస్తే, 15 సంవత్సరాల్లో నెలకు రూ. 15వేలు ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలు అవుతుందనేదే.. ఈ ఫార్ములా సందేశం. అంటే మీరు 15 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్స్లో నెలకు 15,000 ఇన్వెస్ట్ చేసి 15 శాతం వార్షిక రిటర్న్స్ ఆశించాలి. ● పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 15,000 ● వ్యవధి: 15 సంవత్సరాలు ● వడ్డీ రేటు: 15 శాతంపైన చెప్పిన దాని ప్రకారం నెలకు 15,000 రూపాయలు పెట్టుబడి పెడితే.. 15 సంవత్సరాలకు అసలు రూ. 27 లక్షలు అవుతాయి. వడ్డీ రేటు 15 శాతం (రూ. 73 లక్షలు), కాబట్టి ఇలా మీరు కోటి రూపాయలు సంపాదించవచ్చు.ఇదీ చదవండి: 26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా ఆయన చెప్పినట్లే జరిగింది!15X15X15 ఫార్ములా ద్వారా కోటీశ్వరులవ్వాలంటే.. త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. మీరు 25 సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. 40 ఏళ్లకే మీకు కోటి రూపాయలు వస్తాయి. 30 ఏళ్లకు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే 45 సంవత్సరాలకు మీ చేతికి డబ్బులు వస్తాయి. కాబట్టి దీన్ని బట్టి చూస్తే.. మీరు ఎంత తొందరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే, అంత త్వరగా కోటీశ్వరులు అవ్వొచ్చన్నమాట. -
అక్కడ ఒక్కో ఇల్లు రూ. 100 కోట్లు.. అదిరిపోయే ప్రత్యేకతలు
న్యూఢిల్లీ: జీవితంలో ఓ సొంతిల్లు కొనుక్కోవాలని ఎవరికైనా ఉంటుంది. ఇందుకోసం పైసాపైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్న వారు లేదా కొనుక్కున్న వారు ఉంటారు. ఈ క్రమంలో సామాన్యులు తమ తాహతుకు మించే ఖర్చు చేస్తారు. అయితే మన దేశంలో వంద కోట్ల ఖరీదు చేసే ఫ్లాట్లు ఉన్నాయంటే మీరు నమ్ముతారా?లగ్జరీ రియల్ ఎస్టేట్కు కొత్త నిర్వచనంన్యూఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్లో లీడింగ్ రియల్ ఎస్టేట్ డెవరపర్స్(డీఎల్ఎఫ్) సంస్థ ‘ది కామెల్లియాస్’ పేరుతో అత్యంత ఖరీదైన లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మిస్తోంది. ఇది భారతదేశంలో లగ్జరీ రియల్ ఎస్టేట్కు కొత్త నిర్వచనాన్ని అందించే విధంగా ఉందనే మాట వినిపిస్తోంది. ‘ది కామెలియాస్’లో ఒక్కో అపార్ట్ మెంట్ ధర రూ.100 కోట్ల వరకు ఉంది. దేశంలోని అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు, సీఈఓలు, అత్యంత ధనవంతులకోసం ‘ది కామెల్లియాస్’ నిర్మితమయ్యింది. ఈ ప్రాజెక్ట్ విలాసవంతమైన ఇంటీరియర్స్, సాటిలేని విసాలవంతమైన సౌకర్యాలకు నెలవుగా ఉంది.పదేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన ఇళ్ల ధరలు2014లో ‘ది కామెలియాస్’ ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు చదరపు అడుగు ధర రూ.22,500. కానీ నేడు దాని ధర చదరపు అడుగు రూ.85,000కు పైగానే పలుకుతోంది. అంటే పదేళ్లలో 4 రెట్లు పెరిగింది. గతంలో దాదాపు రూ.25-30 కోట్లకు అమ్ముడుపోయిన ఇక్కడి ఫ్లాట్ ధర నేడు రూ.100 కోట్లకు చేరుకుంది. ఢిల్లీలోని అత్యంత పాష్ ఏరియాలు, గురుగ్రామ్లోని పాష్ ఏరియాల మధ్య ధరల వ్యత్యాసం ఇప్పుడు తగ్గుతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. ఇటీవల, టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్పై ఒక నివేదికను అందించింది.బాల్కనీలోంచి చూస్తే..డీఎల్ఎఫ్ ది కామెల్లియాస్లోని ఫ్లాట్లో 72 అడుగుల గాజు బాల్కనీ ఉంటుంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి అతిథులు కోసం మరొకటి ఆ ఫ్లాట్లోని వారి కోసం రూపొందించారు. ఈ బాల్కనీ వినోదాలకు కేంద్రంగా ఉంటుంది. దీనిలో డైనింగ్ ఏరియా, ఫార్మల్ సీటింగ్, ఫ్యామిలీ మీటింగ్స్ కోసం ప్రత్యేక కార్నర్లు ఉన్నాయి. ఈ బాల్కనీలోంచి చూస్తే బయటనున్న స్విమ్మింగ్ పూల్, పచ్చని చెట్లు కనిపిస్తాయి.లగ్జరీ లివింగ్లో కొత్త బెంచ్మార్క్ఫ్లాట్ ఇంటీరియర్ డిజైన్లో సింపుల్గా ఉంటుంది. క్లాస్సి, స్పెషల్ ఫర్నిషింగ్ను ఇందుకోసం వినియోగించారు. డీఎల్ఎఫ్కు చెందిన ఐకానిక్ ప్రాజెక్ట్లు ‘ది అరాలియాస్’, ‘ది మాగ్నోలియాస్’ మాదిరిగా ఈ ప్రాజెక్ట్ కూడా ఢిల్లీ- ఎన్సీఆర్లో అల్ట్రా-లగ్జరీ లివింగ్ కోసం కొత్త బెంచ్మార్క్ను సెట్ చేసింది. కాగా ది కామెల్లియాస్కు మించిన పెద్ద ప్రాజెక్ట్ను త్వరలో ప్రారంభించేందుకు డీఎల్ఎఫ్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.కొత్త ప్రాజెక్టులో..డీఎల్ఎఫ్ దహ్లియాస్ పేరుతో నిర్మితమవుతున్న ఈ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ గోల్ఫ్ కోర్స్ రోడ్, గురుగ్రామ్లో నిర్మింతం కానుంది. సగటున ఒక అపార్ట్మెంట్కు దాదాపు రూ.100 కోట్లు ఖర్చుకానుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ. 34,000 కోట్లుగా అంచనా. ఇందులో 9,500 చదరపు అడుగుల నుండి 16,000 చదరపు అడుగుల వరకు నివాస స్థలాలు ఉంటాయి. దహ్లియాస్లో 2,00,000-చదరపు అడుగుల క్లబ్హౌస్ ఏర్పాటు కానుంది. ఇది కామెల్లియాస్లోని క్లబ్హౌస్ కంటే చాలా పెద్దదిగా ఉండనుంది. ఇది లగ్జరీ మార్కెట్లో మరింత ఆకర్షణీయంగా మారనుంది.ఇది కూడా చదవండి: నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు -
రూ. 23 కోట్ల దున్న.. నెలకు రూ. 5 లక్షల ఆదాయం
కొందరు ఎవరినైనా తిట్టేటప్పుడు దున్నపోతులా ఉన్నావ్ అంటూ ఎగతాళి చేస్తుంటారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే దున్నపోతు గురించి తెలిస్తే ఇకపై అలాంటి మాట అనరు. ఎందుకంటే ఈ దున్నపోతు ధర, అది తినే తిండి, అంతకు మించి దీని ద్వారా వచ్చే ఆదాయం గురించి తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.ఆ దున్నపోతు ఖరీదు రూ.23 కోట్లు అని చెబితే ఎవరైనా నమ్ముతారా? అవును.. ఇది అక్షరాలా నిజం. అయితే దాని వలన వచ్చే ఆదాయం గురించి తెలిస్తే అంత ధర ఉండటంతో తప్పులేదంటాం. ఇప్పుడు ఆ దున్నపోతు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ దున్నపోతు వీర్యాన్ని అమ్మడంతో పాటు ఇతర మార్గాల ద్వారా దాని యజమాని నెలకు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకూ సంపాదిస్తుండటం విశేషం. హర్యానాకు చెందిన ఆ దున్నపోతు పేరు అన్మోల్.హర్యానాలోని సిర్సాలో ఉంటున్న పల్వీందర్ సింగ్ అనే రైతు ఈ అన్మోల్ను పెంచుతున్నాడు. దాని వయసు ఎనిమిదేళ్లు. బరువు 1500 కిలోలు. ఈ దున్నపోతును రూ.23 కోట్లు ఇస్తానన్నా పల్వీందర్ సింగ్ ఎవరికీ అమ్మబోనని తెగేసి చెబుతున్నాడు. ఉత్తరాదిన జరిగే పుష్కర్ మేళా, ఆల్ ఇండియా ఫార్మర్స్ ఫెయిర్ వంటి ప్రదర్శనల్లో ఈ అన్మోల్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంటుంది. దీని భారీ ఆకారం ఎవరినైనా ఇట్టే కంగుతినేలా చేస్తుంది.ఇక ఈ అన్మోల్ ఎంత తిండి తింటుందో తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోకమానరు. ఇది అధిక కేలరీలు కలిగిన ఆహార పదార్థాలు, డ్రైఫ్రూట్స్ను తింటుంది. దాని తిండి కోసం యజమాని రోజూ రూ.1,500 ఖర్చు చేస్తుంటాడు. అంటే నెలకు దానిని మేపడానికి రూ.45 వేల వరకు ఖర్చవుతుందన్నమాట. అది ప్రతి రోజూ 250 గ్రాముల బాదాం, నాలుగు కిలోల దానిమ్మలు, 30 అరటిపండ్లు, ఐదు లీటర్ల పాలు, 20 గుడ్లను తింటుంది. వీటితోపాటు అది ఆయిల్ కేక్, పచ్చి గడ్డి, దేశీ నెయ్యి, సోయాబీన్, మొక్కజొన్నలను కూడా తింటుంది. అన్మోల్ దున్నపోతుకు దాని యజమాని పల్వీందర్ సింగ్ రోజూ స్నానం చేయిస్తుంటాడు. ఇందుకోసం బాదాం నూనె, ఆవ నూనెలను కూడా వినియోగించడం విశేషం.ఇది కూడా చదవండి: Pakistan: ఊపిరాడక వేల మంది ఆస్పత్రులకు పరుగులు -
కోటి రెమ్యూనరేషన్ అందుకున్న ఇండియన్ తొలి హీరో ఎవరు.. ఏ సినిమాకు? (ఫోటోలు)
-
కోటి మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్
ఇబ్బందికరమైన కాలర్లు, మోసాలకు పాల్పడుతున్న మొబైల్ కనెక్షన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్, టెలికాం డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఇలాంటి కోటికిపైగా మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించాయి. అలాగే సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు 2.27 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లను టెలికాం శాఖ బ్లాక్ చేసింది."ఇప్పటి వరకు, సంచారసాథి సహాయంతో 1 కోటికి పైగా మోసపూరిత మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్ చేశాం. అలాగే సైబర్ క్రైమ్/ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు 2.27 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లు బ్లాక్ చేశాం" అని ప్రకటన పేర్కొంది. స్పామ్ కాల్స్ కోసం రోబోకాల్స్, ప్రీ-రికార్డ్ కాల్స్తో సహా బల్క్ కనెక్షన్లను ఉపయోగిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది.వాటి కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసి బ్లాక్లిస్ట్ చేయాలని సూచించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ 4జీ కోసం 5జీ ఫోన్ కొనాలా?"గడిచిన 15 రోజుల్లో అటువంటి 3.5 లక్షల నంబర్లు డిస్కనెక్ట్ చేశాం. 50 సంస్థలను బ్లాక్లిస్ట్ చేశాం. అలాగే దాదాపు 3.5 లక్షల ఉపయోగించని, ధ్రువీకరించని ఎస్ఎంఎస్ హెడర్లు, 12 లక్షల కంటెంట్ టెంప్లేట్లను బ్లాక్ చేశాం" అని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చర్యలతో పాటు నాణ్యతా సేవా నిబంధనలను ట్రాయ్ సవరించింది. ఇవి అక్టోబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి. ఏప్రిల్ 1 నుండి మొబైల్ సర్వీస్ క్యూఓఎస్ పనితీరు సమీక్ష త్రైమాసిక ప్రాతిపదికన కాకుండా నెలవారీగా నిర్వహించనున్నట్లు కూడా ప్రకటనలో వెల్లడించారు. -
‘ఇన్ఫ్రా’లో కోటి కొలువులు!
మౌలిక రంగం భారీ ఉపాధి అవకాశాలకు వేదిక కానుంది. మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు కేంద్ర సర్కారు ప్రాధాన్యం ఇస్తుండడంతో ఈ రంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కోటి ఉద్యోగాలు కొత్తగా ఏర్పడతాయని ఉద్యోగ నియామక సేవలు అందించే ‘టీమ్లీజ్ సర్వీసెస్’ అంచనా వేసింది. కేంద్రంలో మూడోసారి కొలువు దీరిన మోదీ సర్కారు రహదారులు, రైళ్లు, విమానాశ్రయాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ రంగంలో అసలు నైపుణ్యాలు లేని వారితోపాటు, స్వల్ప నైపుణ్యాలు, పూర్తి నైపుణ్యాలు కలిగిన వారికి పెద్ద ఎత్తున ఉపాధి లభించనున్నట్టు టీమ్లీజ్ సరీ్వసెస్ అంచనా. ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో 98 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కొత్తగా వస్తాయని తన తాజా నివేదికలో తెలిపింది. ‘కొత్త ప్రభుత్వం ఈ రంగానికి ప్రాధాన్యతను కొనసాగిస్తుందని భావిస్తున్నాం. దేశ అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి ఇది తప్పనిసరి. వ్యూహాత్మక పెట్టుబడులు ఉపాధి అవకాశాలతోపాటు, అన్ని ప్రాంతాలు సమానాభివృద్ధికి వీలు కలి్పస్తాయి’అని టీమ్లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పి. సుబ్రమణియమ్ తెలిపారు. రవాణా రంగంపైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలతో ఉన్నట్టు చెప్పారు. విమానాశ్రయాల సంఖ్యను 220కి పెంచడం, 2025 చివరికి జాతీయ రహదారుల నిడివిని 2 లక్షల కిలోమీటర్లకు చేర్చే దిశగా పనిచేస్తున్నట్టు గుర్తు చేశారు. అలాగే, 2030 నాటికి 23 జల రవాణా మార్గాల అభివృద్ధితోపాటు, 35 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ల అభివృద్ధిని సైతం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. భారీగా వ్యయాలు.. ‘మౌలిక రంగంలోని పలు ఉప విభాగాల మధ్య ప్రాధాన్యతల్లో మార్పు ఉండొచ్చు. మౌలిక రంగానికి సంబంధించిన ప్రభుత్వ మూలధన వ్యయాలు ఆరోగ్యకరమైన వృద్ధితో కొనసాగుతాయి. ఈ రంగంలో రైల్వే, రహదారులు, నీటి ప్రాజెక్టులకు ప్రభుత్వ కేటాయింపులు పెరుగుతాయి. ఇది ఉపాధి అవకాశాల కల్పనకు మద్దతునిస్తుంది’ అని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా జూన్లో విడుదల చేసిన నివేదిక సైతం ఈ రంగంలో వృద్ధి అవకాశాలను తెలియజేస్తోంది. మౌలిక రంగం, సామాజికాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం.. పట్టణీకరణ పెరగడం, రహదారుల అనుసంధానత ఇవన్నీ ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల అభివృద్ధికి దోహదం చేస్తాయని జీఐ గ్రూప్ హోల్డింగ్ కంపెనీస్ కంట్రీ మేనేజర్ సోనాల్ అరోరా తెలిపారు. పెద్ద, భారీ కాంట్రాక్టులు వస్తుండడంతో తాము నియామకాలను పెంచినట్టు ఎల్అండ్టీ గ్రూప్ హెచ్ఆర్ చీఫ్ ఆఫీసర్ సి.జయకుమార్ తెలిపారు.కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలు.. విమానాశ్రయాల విస్తరణ.. 2202025 నాటికి జాతీయ రహదారుల నిర్మాణం 2,00,000 కిలోమీటర్లు2030 నాటికి జలరవాణా మార్గాల ఏర్పాటు 23 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ 35 పార్క్ల నిర్మాణం -
ఒక్క ఫోన్ కాల్.. భారీగా దొరికిన నగదు
చెన్నై, సాక్షి: తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఎత్తరై గ్రామంలోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రూ. 1 కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో లోక్సభకు పోలింగ్కు ముందు ఒకే ఇంట్లో అదీ కూడా ఓ గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం గమనార్హం. తిరుచిరాపల్లిలోని ఎత్తరై గ్రామంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఓ ఇంట్లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించారని, ఒక బ్యాగ్లో నింపిన మొత్తం రూ.1 కోటి కరెన్సీ నోట్లు దొరికాయని జిల్లా కలెక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. తిరుచ్చి జిల్లా కలెక్టరేట్లోని ఎలక్షన్ కంట్రోల్ రూంకి ఫోన్ కాల్ వచ్చిందని, ఫలితంగా నగదు రికవరీ అయ్యిందని ఆయన చెప్పారు. ఓ ఇంట్లో కరెన్సీ నోట్లు భద్రపర్చినట్లు సమాచారం అందడంతో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు గ్రామానికి వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో నగదును ఇంట్లో ఎవరు ఉంచారు.. ఎన్నికలలో ఓటర్లకు పంచేందుకే ఈ డబ్బును సిద్ధం చేశారా అనే కోణంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ జరుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
ఉత్తరకాశీ సొరంగం శిథిలాల తొలగింపునకు రూ. 20 కోట్ల ఖర్చు!
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్ ప్రమాదం జరిగి చాలా కాలం గడిచింది. ఈ ప్రమాదాన్ని ఎవరూ మరిచిపోలేరు. త్వరలో ఈ సొరంగంలో శిథిలాల తొలగింపు పనులు ప్రారంభం కానున్నాయి. దీనికి ఎంత ఖర్చు అవుతుందనే దానిపై ఒక నివేదిక వచ్చింది. ఉత్తరకాశీ సొరంగం నిర్మాణ సమయంలో కొండచరియలు విరిగిపడటంతో కూలిపోయింది. ఆ సమయంలో సొరంగంలో పనిచేస్తున్న 43 మంది కూలీలు లోపల చిక్కకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారుల తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు కార్మికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ టన్నెల్ శిథిలాల తొలగింపు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ పనులకు రూ.20 కోట్లు వెచ్చించనున్నట్లు స్విస్ కంపెనీ వెల్లడించింది. ఈ శిథిలాలను సిల్క్యారాలోని డంపింగ్ గ్రౌండ్కు తరలించనున్నారు. మూడు, నాలుగు రోజుల్లో ఈ పనులు ప్రారంభించనున్నామని స్విస్ కంపెనీ తెలిపింది. -
రూ.లక్ష కోట్లకు పైగా విరాళం - ఈమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవుతారు!
చాలా మంది ధనవంతులు డబ్బు కూడబెట్టే కొద్దీ ఇంకా పోగు చేయాలి, ఇంకా గొప్పవాళ్ళైపోవాలి అని ఆలోచించడం సర్వ సాధారణం. అయితే కొందరు మాత్రమే వారికున్నదాంట్లో చాలా వరకు పేదలకు లేదా మంచి పనులను భారీగా విరాళం అందిస్తారు. ఇలాంటి కోవకు చెందిన అతి తక్కువ మందిలో 'మెకెంజీ స్కాట్' (MacKenzie Scott) ఒకరు. ఇంతకీ ఈమె ఎవరు? ఇప్పటి వరకు ఎంత దానం ఇచ్చింది? బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. అమెరికాకు చెందిన ప్రముఖ నవలా రచయిత్రి అయిన 'మెకెంజీ స్కాట్' ఇప్పటి వరకు సుమారు రూ.1,19,522 కోట్లకుపైగా విరాళంగా ఇచ్చింది. అంతే కాకుండా తాను బ్రతికి ఉండే వరకు, తనకు వచ్చే ఆదాయంలో సగానికి పైగా విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ కూడా చేసినట్లు సమాచారం. నిజానికి ఈమె (మెకెంజీ స్కాట్) అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య. 1993లో ఈమె జెఫ్ బెజోస్ను పెళ్లి చేసుకుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల 2019లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు భరణంగా అందిన డబ్బు కారణంగానే ప్రపంచంలోని అత్యంత ధనిక మహిళలలో ఒకరుగా నిలిచారు. 1907లో కాలిఫోర్నియాలో జన్మించిన మెకెంజీ స్కాట్ ఆరు సంవత్సరాల వయసులోనే కథలు రాయడం మొదలుపెట్టింది. చిన్నతనంలోనే 'ది బుక్ వార్మ్' అనే 142 పేజీల బుక్ రాసినట్లు, అది వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం. స్కాట్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (ఇంగ్లీష్) పూర్తి చేసింది. అంతే కాకుండా ఈమె సాహిత్యంలో నోబెల్ గ్రహీత 'టోని మోరిసన్' వద్ద చదువుకుంది. మెకెంజీ స్కాట్ చదువు పూర్తయిన తరువాత న్యూయార్క్ నగరంలోని ఓ కంపెనీలో పనిచేసింది, ఆ సంస్థలోనే జెఫ్ బెజోస్ కూడా పనిచేశారు. ఆ సమయంలో ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారి 1993లో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత అమెజాన్ స్థాపించి ఇద్దరూ దానిని బాగా అభివృద్ధి చేసారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి 2019లో మెకెంజీ స్కాట్, జెఫ్ బెజోస్తో విడాకులు తీసుకున్న తరువాత రూ. 2,53,600 కోట్ల విలువైన స్టాక్స్ అందుకుంది. ప్రస్తుతం ఈమె విద్య, ఆరోగ్యం, సామజిక న్యాయం, పర్యావరణం వంటి వివిధ అంశాలకు మద్దతు పలుకుతూ వేలకోట్ల రూపాయలు విరాళంగా అందిస్తూ ప్రపంచంలో ఎక్కువ విరాళాలు అందించినవారి జాబితాలో ఒకరుగా నిలిచింది. -
ఏకంగా రూ. 1 కోటి వార్షిక వేతనం అందుకుంటున్న భారత విద్యార్థి!
అతను ఐఐఎం, ఐఐటీలు వంటవి ఏం చెయ్యలేదు. కానీ వేతనంగా ఏకంగా కోటి రూపాయల వార్షిక ప్యాకేజిని అందుకుంటున్నాడు. మరీ అంత వేతనం ఎలా? అని అనుకుంటున్నారా!.. పనిచేసే అంకితభావం, మంచి నైపుణ్యం ఉంటే పెద్ద పెద్ద డిగ్రీలు చేయాల్సిన పని లేదు అని నిరూపించాడు ఈ భారతీయ విద్యార్థి. వివరాల్లోకెళ్తే..భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండే బార్మర్ అనే చిన్న జిల్లాలో నివసించే మహిపాల్ సేజు అనే భారత విద్యార్థి ఓ జపాన్ కంపెనీ నుంచి కోటి రూపాయల వార్షిక ప్యాకేజీని అందుకుని రికార్డు సృష్టించాడు. అయితే అతను ఏమి ఐఐఎం, ఐఐటీ స్టూడెంట్ కాదు. అందరిలానే బీటెక్ డిగ్రీ పూర్తి చేసి ఇంత పెద్ద మొత్తంలో వేతనం అందుకుని ఆశ్చర్యపరిచాడు. కేవలం పట్టదల, అంకితభావం, మంచి నైపుణ్యం ఉంటే.. పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వారితో సమానంగా వేతనం తీసుకోవచ్చని ప్రూవ్ చేశాడు. మహిపాల్ జోథ్పూర్లోని బార్మర్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఢిల్లీలో బీటెక్ పూర్తిచేశాడు. అయితే బీటెక్ చదువుతుండగానే 2019లో ఓ ప్లేస్మెంట్ ఏజెన్సీ ద్వారా జపాన్లో నగోయాలోని ఒక కంపెనీలో రూ. 30 లక్షల ప్యాకేజీతో మొదటి ఉద్యోగాన్ని సంపాదించాడు. మళ్లీ మూడేళ్ల తర్వాత జపాన్లోని టోక్యోలో మరో కంపెనీతో ఏకంగా రూ. 1 కోటి వార్షిక ప్యాకేజ్ ఆఫర్ అందుకుని రికార్డు సృష్టించాడు. మహిపాల్ ప్రస్తుతం జపాన్లోని టోక్యోలో మెకానికా కార్పొరేషన్ అనే కంపెనీకి ఐటీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు. పెద్ద పెద చదువులు చదవలేదని బాధపడాల్సిన పనిలేదు ప్రస్తుత పరిస్థితులకు అవసరమయ్యే స్కిల్స్ సంపాదించుకుంటే పెద్ద మొత్తంలో వేతనాలు అందుకోవచ్చని మహిపాల్ చేసి చూపించాడు. నిజం చెప్పాలంటే ఫోకస్ కరెక్ట్గా ఉండి, పనిపై అంకితా భావం ఉంటే ఏ నేపథ్యం నుంచి వచ్చినా కోట్లలో వేతనం అందుకోగలమని చాటి చెప్పాడు, పైగా అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు మహిపాల్ సేజు. (చదవండి: ఇందిరా గాంధీ బ్రేక్ ఫాస్ట్గా కోసం ఓ చెఫ్ పడ్డ పాట్లు! కానీ చివరికి..) -
కేబీసీలో చిచ్చరపిడుగుకు కోటి రూపాయలు
ప్రముఖ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్పతి’(కేబీసీ) సీజన్ 15లో ప్రస్తుతం ‘కేబీసీ జూనియర్స్ వీక్’ జరుగుతోంది. చివరి ఎపిసోడ్లో హర్యానాలోని మహేంద్రగఢ్ నివాసి మయాంక్ హాట్సీట్పై కూర్చున్నాడు. ఈ 12 ఏళ్ల కంటెస్టెంట్తో హోస్ట్ బిగ్ బీ అమితాబ్ పలు విషయాలను ముచ్చటించారు. అమితాబ్ బచ్చన్ ఈ ఎపిసోడ్లోని మొదటి ప్రశ్నను అడిగారు. దీనికి సమాధానం చెబితే రూ. 6,40,000 గెలుచుకోవచ్చు. 2023లో వాషింగ్టన్ డీసీలో ప్రారంభించిన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ఎవరి పేరు మీద ఉంది? అని అడిగారు. దీనికి మయాంక్ సరైన సమాధానం ఇస్తూ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని చెప్పాడు. తరువాతి ప్రశ్నలకు మయాంక్ సరైన సమాధానాలు చెబుతూ వచ్చాడు. గేమ్ సమయంలో మయాంక్ తాను పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నదీ ఇంకా తనకు తెలియడం లేదని చెప్పాడు. తరువాత మాయాంక్ ‘మీరు చిన్నప్పుడు ఏం కావాలని అనుకున్నారు?’ అని అడిగాడు. అందుకు అమితాబ్ బదులిస్తూ ‘చిన్నప్పుడు ఎక్కువగా గిల్లీ దందా ఆడేవాళ్లం. అది తప్ప మరేదీ మా మనసులోకి రాలేదు’ అని చెప్పారు. తరువాత అమితాబ్.. మయాంక్ను కోటి రూపాయల ప్రశ్న అడిగాడు. కొత్తగా కనుగొన్న ఖండానికి ‘అమెరికా’ అని పేరు పెట్టిన ఘనత ఏ యూరోపియన్ కార్టోగ్రాఫర్కు దక్కుతుంది? అడి అడిగారు. దీనికి సమాధానం చెప్పేందుకు మయాంక్ ఒక ఒక నిపుణుడి సహాయం తీసుకుని ‘మార్టిన్ వాల్డ్సీముల్లర్’అని సరైన సమాధానం చెప్పాడు. సీజన్ 15లో భారీ మొత్తాన్ని గెలుచుకున్న తొలి జూనియర్ కోటీశ్వరుడు మయాంక్. ఈ విషయాన్ని అమితాబ్ షోలో ప్రకటించారు. ఆ సమయంలో మయాంక్ తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. తరువాత అమితాబ్.. మయాంక్ను రూ. 7 కోట్ల ప్రశ్న అడిగారు. దీనికి మయాంక్ సమాధానం చెప్పలేక గేమ్ ముగించి, కోటి రూపాయలు తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ఇప్పుడు దీపావళి చేసుకుంటాం: ఉత్తరకాశీ కార్మికులు -
వామ్మో.. వీళ్ల పెళ్లి ఖర్చు రూ.491 కోట్లా? ప్రత్యేకతలివే!
ఒకప్పుడు రాజుల కాలంలో ఐదు రోజులు ఆడంబరంగా పెళ్లి చేసుకునే వారని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ కంప్యూటర్ యుగంలో కూడా కొంత మంది ధనవంతులు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇటీవల సౌత్ ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి తన కూతురు పెళ్ళికి వందల కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సౌత్ ఫ్లోరిడాకు చెందిన ఒక కార్ డీలర్షిప్ తన కూతురు 'మడేలైన్ బ్రాక్వే' పెళ్లి ఐదు రోజులు ఘనంగా చేసాడు. దీనికైన ఖర్చు 59 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.491 కోట్లు కంటే ఎక్కువ. ఈ వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. 26 ఏళ్ల మడేలైన్ బ్రాక్వే.. తన ప్రియుడు 'జాకబ్ లాగ్రోన్'తో జరిగిన ఐదు రోజుల పెళ్ళికి సంబంధించి ఒక డాక్యుమెంటరీ తీసింది. కచేరీ ప్రారంభం నుంచి వేర్సైల్లెస్ ప్యాలెస్లో రాత్రిపూట బస చేసే వరకు అన్నింటికీ సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలైస్ గార్నియర్లో రిహార్సల్ డిన్నర్, వెర్సైల్లెస్ ప్యాలెస్లో రాత్రిపూట బస, ప్రైవేట్ లంచ్, ఉటాలోని ఫైవ్ స్టార్ లగ్జరీ రిసార్ట్లో బ్యాచిలొరెట్ వీక్ వంటి అన్ని వీడియో రికార్డ్ చేసుకున్నారు. వివాహ వేదిక ఎక్కడో స్పష్టంగా వెల్లడించలేదు, కానీ ఈఫిల్ టవర్ ఉద్యానవనంలో వేడుకలు పెద్ద ఎత్తున జరిగినట్లు, బహుశా అదే ప్రాంతంలో పెళ్లి కూడా జరిగి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఈ జంట 2020 మార్చిలో డేటింగ్ ప్రారంభించారు. లాగ్రోన్ లింక్డ్ఇన్ అకౌంట్ ప్రకారం, అతను కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్లో టాలెంట్ కోఆర్డినేటర్గా, కంట్రీ సింగర్ జాసన్ ఆల్డియన్కు ప్రొడక్షన్ అసిస్టెంట్గా కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. పెళ్ళికి కొన్ని రోజుల ముందే ఈ జంట, వారి స్నేహితులు పారిస్కు వెళ్లారు. వీరు బస చేసిన హోటల్ గదుల ఖరీదు రోజుకి 2400 డాలర్లని సమాచారం. ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే.. కోట్లు ఖర్చు పెట్టి వివాహాలు చేసుకున్న ఘటనలు ఇప్పటికే కూడా చాలా వెలుగులోకి వచ్చాయి. గతంలో కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి తన కూతురు పెళ్ళికి రూ. 500 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిసింది. పెళ్ళిలో వధువు ధరించిన చీర ఖరీదే రూ. 17 కోట్లు కాగా, ఆమె వేసుకున్న బంగారు ఆభరణాల ఖరీదు రూ. 90 కోట్లు, మేకప్ కోసం మాత్రమే రూ. 30 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by The Lake Como Wedding Planner (@lakecomoweddings) -
కోట్లు పలికే ‘రంగురాయి’ ఏది? బంగారం, ప్లాటినం ఎందుకు దిగదుడుపు?
ఎవరైనా ఏదైనా ఖరీదైన వస్తువు గురించి మాట్లాడినప్పుడు ముందుగా బంగారాన్ని ప్రస్తావిస్తారు. నిజానికి ఒక గ్రాము బంగారం కొనాలన్నా కూడా చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్లాటినం దాని కంటే ఖరీదైనదిగా పరిగణిస్తారు. అయితే బంగారం, ప్లాటినం మాత్రమే అత్యంత ఖరీదైన ఖనిజాలు కాదు. దీనికంటే ఖరీదైన ఖనిజాలు భూమిపై చాలా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఖనిజం ఏది? దాని ధర ఎంత అనేది తెలుసుకుందాం. బంగారం కంటే ఖరీదైన ఖనిజాల ప్రస్తావన వచ్చినప్పుడు ఈ జాబితాలో అనేకమైనవి కనిపిస్తాయి. వాటిలో మనం ఉపయోగించే వాటి విషయానికొస్తే రోథియం, పల్లాడియం, ఇరిడియం, జాడైట్ మొదలైనవి ఉన్నాయి. ఇవేకాకుండా మనం నేరుగా ఉపయోగించని అనేక ఖనిజాలు కూడా ఉన్నాయి. అవి బంగారం కంటే చాలా ఖరీదైనవి. వీటిలో లిథియం లాంటి అనేక పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు అత్యంత ఖరీదైన ఖనిజం ఏమిటో తెలుసుకుందాం. అత్యంత ఖరీదైన ఖనిజం విషయంలో అనేక వాదనలు వినిపిస్తాయి. దానికి సంబంధించిన అనేక నివేదికలు కనిపిస్తాయి. ఆ నివేదికల ప్రకారం చూస్తే రోథియం అత్యంత ఖరీదైనది. మరికొందరు శాస్త్రవేత్తలు జాడైట్ ఖనిజం అత్యంత ఖరీదైనదిగా చెబుతారు. జాడైట్ ఒక రకమైన రాయి. అది లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనిని ఖరీదైన ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. దీని ధర క్యారెట్లలో ఉంటుంది. డైమండ్ మాదిరిగా ఇది క్యారెట్ల లెక్కన లభిస్తుంది. జాడైట్ క్యారెట్ ధర చాలా అధికం. ఒక క్యారెట్ జాడైట్ ధర 3 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అని చెబుతారు. అంటే ఒక్క జాడైట్ రాయి కోసం కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో బిచ్చగాళ్లు అధికం? -
రూ. 400 కోట్ల సమీకరణలో ముత్తూట్ ఫిన్కార్ప్
హైదరాబాద్: ముత్తూట్ ఫిన్కార్ప్ సంస్థ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్సీడీ) ద్వారా రూ. 400 కోట్ల వరకు సమీకరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రూ. 300 కోట్ల వరకు గ్రీన్ షూ ఆప్షన్ కింద అట్టే పెట్టుకునే వెసులుబాటుతో రూ. 100 కోట్ల ఎన్సీడీలను జారీ చేసినట్లు సంస్థ తెలిపింది. రూ. 1,000 ముఖ విలువ ఉండే ఎన్సీడీలు సెప్టెంబర్ 14 వరకు అందుబాటులో ఉంటాయి. 24 నెలల నుంచి 96 నెలల వరకు కాలావధి ఉండే ఈ వీటిపై రాబడి రేటు 8.65 శాతం – 9.43 శాతం దాకా ఉంటుందని కంపెనీ సీఈవో షాజీ వర్గీస్ తెలిపారు. రూ. 1,100 కోట్ల వరకు గరిష్ట సమీకరణ పరిమితికి లోబడి తొలి విడతగా ఈ ఎన్సీడీలను జారీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
నిమిషానికి రూ.కోటి రెమ్యునరేషన్.. నటి రియాక్షన్ అదిరిపోయింది!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా పరిచయం అక్కర్లేని పేరు. బాస్ పార్టీ అంటూ మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రంలోనూ ప్రత్యేక సాంగ్లో మెరిసింది. ఇటీవలే ఫ్రాన్స్లోని పారిస్లో ఈఫిట్ టవర్ను వన్డే వరల్డ్ కప్ను ఆవిష్కరించిన ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇలాంటి అరుదైన అవకాశం దక్కించుకున్న ఏకైక నటిగా స్థానం దక్కించుకుంది. అయితే తాజాగా ఒక్క నిమిషానికి రూ. కోటి రూపాయల రెమ్యునరేషన్ వసూలు చేస్తోందని గత కొద్ది రోజులుగా ఆమెపై రూమర్స్ వస్తున్నాయి. అంతే కాదు ఆమెపై నెటిజన్స్ సైతం ట్రోల్స్ కూడా చేశారు. (ఇది చదవండి: స్టార్ హీరో కేసులో హైకోర్టు కీలక తీర్పు.. ఆ డబ్బు!) ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన ఊర్వశికి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. మీరు ఒక నిమిషానికి రూ. కోటి రూపాయలు వసూలు చేస్తున్నారు? దీనిపై మీరేమంటారని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. నాలాంటి సెల్ఫ్ మేడ్ నటులు ఎవరైనా సరే ఇలాంటి విజయాలు సాధించాలని కోరుకుంటున్నా అంటూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో చాలాసార్లు ఇందతా అబద్ధమంటూ నెటిజన్స్ ఆమెపై ట్రోల్స్ చేశారు. ఊర్వశి రౌతేలా సాబ్ ది గ్రేట్ మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆమె సన్నీ డియోల్ సరసన నటించింది. ఆ తర్వాత సనమ్ రే, హేట్ స్టోరీ- 4, పాగల్పంటి వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం వినీత్ కుమార్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్లతో కలిసి దిల్ హై గ్రేలో నటించనుంది. అలాగే మరో తెలుగు సినిమాలో కూడా కనిపించనుంది. (ఇది చదవండి: కేవలం రూ.7 కోట్ల సినిమా.. బాక్సాఫీస్ను షేక్ చేసేసింది!) View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) -
తారక్ చేతికున్న వాచ్ ధరెంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!
Jr NTR Patek Philippe Watch: తెలుగు చలన చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న 'జూనియర్ ఎన్టీఆర్' గురించి పరిచయమే అవసరం లేదు. మంచి నటనా నైపుణ్యంతో ప్రేక్షులకు హృదయాలను దోచుకున్న ఈ నటుడు అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇందులో భాగంగానే లగ్జరీ కార్లు, ఖరీదైన వస్తువులు వినియోగిస్తారు. ఇటీవల ఆయన చేతికి పెట్టుకున్న వాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల నందమూరి సుహాసిని తనయుడు హర్ష వివాహానికి హాజరైన జూ. ఎన్టీఆర్ సుమారు రూ. 2.45 కోట్లు విలువైన వాచ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇది 'పాటక్ ఫిలిప్' అనే స్విజర్ల్యాండ్ బ్రాండ్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో జూ. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో కూడా మరో పాటక్ ఫిలిప్ వాచ్ పెట్టుకుని కనిపించాడు. దీని ధర రూ. 1.56 కోట్లు కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇంకా ఈయన వద్ద రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్, బృందావనం పేరుతో ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉందని సమాచారం. ఇదీ చదవండి: రూ. 76000 మ్యాక్బుక్ ఆర్డర్ చేస్తే.. వచ్చింది ఇదా? ఖంగుతిన్న కస్టమర్! ఇక కార్ల విషయానికి వస్తే.. ఈయన వద్ద లంబోర్ఘిని ఉరుస్ గ్రాపైట్ క్యాప్స్యూల్, రేంజ్ రోవర్ రోగ్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే మూవీ చేస్తున్నారు. ఇది 2024లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Jr NTR Universe ™ (@ntr.universe) -
అంకిత భావానికి రూ. 3.5 కోట్లు ప్రతిఫలం! ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
అంకిత భావంతో చేసే పని నలుగురిచే గుర్తించేలా చేస్తుందన్న మాటలు మళ్ళీ ఋజువయ్యాయి. లాస్ వెగాస్లోని బర్గర్ కింగ్లోని మెక్కారన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యాషియర్ అండ్ కుక్గా పనిచేస్తున్న 'కెవిన్ ఫోర్డ్' 27 సంవత్సరాలు ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పని చేస్తే ఆ సంస్థ అతనికి మిఠాయిలు, పెన్నులు, స్టార్బక్స్ కప్ వంటి వాటితో కూడిన మంచి బ్యాగ్ని అందుకున్నాడు. అన్ని సంవత్సరాలు ఎంతో నిబద్దతతో పనిచేస్తే సరైన గుర్తింపు లభించలేదని, దానికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఆ తర్వాత అతని కుమార్తె సెరీనా GoFundMe పేజీ స్టార్ట్ చేసింది. దీనికి అతి తక్కువ కాలంలోనే అన్యూహ్య స్పందన లభించింది. దీని ద్వారా ఏకంగా నాలుగు లక్షల డాలర్లు.. అంటే సుమారు రూ. 3.48 కోట్లు విరాళాలుగా సమకూరాయి. కెవిన్ ఫోర్డ్ అంకిత భావం, చిత్త శుద్ధి ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాయి. దీనివల్లే ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రాగలిగాయి. కుటుంబం పోషణ కోసం గత కొన్ని సంవత్సరాలుగా పని చేస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవల లభించిన విరాళాలు వారికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇదీ చదవండి: సిమ్ కార్డ్ డీలర్లకు కొత్త రూల్స్.. అతిక్రమిస్తే రూ. 10 లక్షలు జరిమానా! పదవి విరమణ వయసు వచ్చినప్పటికీ ఆర్థికపరమైన కారణాల వల్ల పనిచేస్తూనే ఉన్నాడు. భారీగా విరాళాలు పొందిన ఫోర్డ్.. ప్రపంచంలో చాలామంది దాతృత్వం కలిగి ఉన్నారు. ఇప్పుడు వచ్చిన డబ్బు నా పిల్లలు మనవళ్ల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తానన్నట్లు సమాచారం. -
ఆ దేశం పీతలను అంతం చేసేందుకు ఏకంగా రూ. 26 కోట్లు..!
ప్రతి దేశం తన బడ్జెట్ ప్రకారం ఆయా రంగాల అభివృద్ధికి కొంత కేటాయించడం కామన్. అన్ని దేశాల్లోనూ జరిగేదే. కానీ కేవలం ఒక సీ ఫుడ్ కోసం కోట్లు కేటాయించడం విన్నారా!. అది కూడా పీతలను తొలగించేందుకు దాదాపు 26 కోట్లు కేటాయించాలని ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏంటీ వింత నిర్ణయం అనిపిస్తుంది కదా!. అసలు ఎందుకు ఇటలీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాటి కోసం ప్రత్యేకంగా అంత డబ్బు ఎందుకంటే.. అసలేం జరిగిందంటే..ఇటలీలో నీలిరంగు పీతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంతలా అంటే ప్రఖ్యాతి గాంచిన నత్తల జాతిని అంతం చేసేలా పెరిగిపోతున్నాయి. నిజానికి ఈ నీలరంగు పీతను పశ్చిమ అట్లాంటిక్కు చెందినవి. తొలినాళ్లలో ఒకటో రెండు నీలి పీతలను గుర్తించారు ఇటలీ వాసులు. ఆ తర్వాత క్రమంగా వాటి సంఖ్య పెరిగిపోవడమే గాక వాటి కారణంగా నత్తలు మాయం అవ్వుతున్నాయి. దీంతో పాటు షెల్ఫిష్, ఫిఫ్ రో వంటి ఇతర జలచరాలు చనిపోవడం జరిగింది. ఇటలీ వాసులు మొలస్కా జాతికి చెందిన నత్తలను బాగా తింటారు. అందుకు సంబంధించి ఆక్వా కల్చర్ ఇటలీలో బాగా ప్రఖ్యాతి గాంచింది. అలాంటి ఆక్వాకల్చర్ ఇప్పుడు ఈ నీలిపీతల కారణంగా చాల నష్టాలను చవి చూస్తోంది. ఈ నీలిపీతలు సముద్ర జాతికి చెందని కొన్ని మొక్కలు, ఇతర జలచర జంతువులను తినేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉత్తర ఇటలీలో ఉన్న పో రివర్ వ్యాలీ డెల్టాలో ఉన్న ఆక్వాఫార్మ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. సముద్ర జీవశాస్త్రవేత్తలు ఈ నీలి పీతలు ఈ ప్రాంతంలో ఉండే నత్తలను దాదాపు 90% వరకు తినేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఇటలీ ప్రభుత్వం ఆ నీలిపీతల ఉధృతికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇటాలియన్ వ్యవసాయం మంత్రి ఫ్రాన్సిస్కో లోలోబ్రిగిడా పో నది డెల్టాను సందర్శించిన తదనంతరమే ఈ పీతల నిర్మూలన కోసం నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పెద్ద ఎత్తున ఆ పీతలను వేటాడి అంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు వీలైనంత ఎక్కువ పీతలను పట్టి వాటిని చంపేయాలని సూచించారు. అందుకు కోసం దాదాపు రూ. 26,51,00,000 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. వీలైనంత తర్విత గతిన ఈ నీలిపీతల సంఖ్యను తగ్గించకపోతే పరిస్థితి తీవ్రమై పర్యావరణ ప్రభావాలకు లోనవ్వాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరించారు. అంతేగాదు యూఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం, చైనా, దక్షిణ కొరియా తర్వాత ఇటలీనే ఎక్కువగా నత్తలను పెంచే మూడొవ అతిపెద్ద ఉత్పత్తిదారు. (చదవండి: ఇష్టం అంటే మరీ ఇలానా! ఈ 'స్ట్రేంజ్ అడిక్షన్' వింటే షాకవ్వాల్సిందే!) -
60 ఏళ్లనాటి పాత బుక్ కోటీశ్వరున్ని చేసింది - ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
జీవితం ఎప్పుడు, ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. కుబేరుడు బిచ్చగాడు కావచ్చు, బిచ్చగాడు కుబేరుడు కావచ్చు. కొన్ని సందర్భాల్లో కటిక పేదరికంలో ఉన్నవాళ్లు కూడా ఒక్క రోజులోనే ధనవంతులుగా మారిగా సందర్భాలు గతంలో కోకొల్లలు. ఇలాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. చిలీ ప్రాంతానికి చెందిన 'ఎక్సెక్వియెల్ హినోజోసా' (Exequiel Hinojosa) జీవితంలో ఇదే జరిగింది. ఇతడు ఇంటిని శుభ్రపరుస్తున్న సమయంలో ఒక పాత పుస్తకం కనిపించింది. మొదట ఇదేదో పనికిరాని బుక్ అనుకున్నాడు. ఆ తరువాత క్షణ్ణంగా పరిశీలించగా.. అతని అతని తండ్రికి చెందిన ఒక బ్యాంక్ పాస్బుక్ అని అర్థమైంది. బ్యాంక్ పాస్బుక్.. నిజానికి ఆ బ్యాంక్ పాస్బుక్ అతని తండ్రికి తప్పా ఇంకెవరికీ తెలియకపోవడం గమనార్హం. ఆ పాస్బుక్ 1960-70 కాలానికి చెందినట్లు గుర్తించాడు. అందులో అప్పట్లోనే సుమారు 1.40 లక్షల చిలియన్ పెసోస్ (Chilean pesos) డిపాజిట్ చేసినట్లు తెలిసింది. ఆ డబ్బు విలువ ఇప్పుడు కోట్ల రూపాయలకు సమానం. ఆ డబ్బుని ఎక్సెక్వియెల్ హినోజోసా విత్డ్రా చేసుకోవాలనుకున్నారు. అయితే అతని ఎంక్వైరీలో ఆ అకౌంట్ చాలా రోజులకు ముంచు క్లోజ్ అయినట్లు తెలిసింది. అంతలో అతని ఆశలు ఆవిరపోయాయి. మొత్తం మీద డబ్బు తిరిగి పొందటం కష్టమని చాలామంది వెల్లడించారు. కానీ అతని పట్టు వదలకుండా ప్రయత్నించాడు. ఇదీ చదవండి: ఫుడ్ ఆర్డర్ బిల్ చూసి ఖంగుతిన్న మహిళ - జొమాటో రిప్లై ఇలా.. స్టేట్ గ్యారెంటీడ్.. ఆ బ్యాంకు పాస్బుక్లో స్టేట్ గ్యారెంటీడ్ అని ఉండటం గమనించాడు. అంటే డబ్బుని బ్యాంకు ఇవ్వని పక్షంలో, కస్టమర్కి ఆ డబ్బు తిరిగి అందేలా ప్రభుత్వం సహాయం చేస్తుందని అర్థం. కానీ ప్రభుత్వం కూడా ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడకపోవడం గమనార్హం. చివరికి చేసేదిలేక కోర్టుని ఆశ్రయించాడు. ఇదీ చదవండి: ఇలా చేస్తే ఏడాదికి 60 లక్షల ఆదాయం! 10 ఏళ్ల వరకు గ్యారెంటీ! ఆ డబ్బు తన తండ్రి డిపాజిట్ చేసయినట్లు, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వాదించి.. చివరకు 1 బిలియన్ చిలీ పెసోస్ ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే ఇది 1.2 మిలియన్ డాలర్లకు సమానం (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 10 కోట్లు). దీంతో దెబ్బకు ఇతడు కోటీశ్వరుడయ్యాడు. -
కోటీశ్వరులు పెరిగారు.. లక్షాధికారులు తగ్గారు!
I-T returns filed for income above Rs 1 crore: దేశంలో కోటీశ్వరుల సంఖ్య భారీగా పెరిగింది. ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ డేటా ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఆర్జించినట్లు 2.69 లక్షల మందికి పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. ఇది కోవిడ్ మహమ్మారి సంక్షోభం 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 49.4 శాతం పెరిగింది. మరోవైపు అదే కాలానికి రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ కేవలం 1.4 శాతం మాత్రమే పెరిగాయి. ఆర్థిక సంవత్సరాల వారీగా చూస్తే.. రూ.కోటి పైగా ఆదాయానికి దాఖలైన ట్యాక్స్ రిటర్న్స్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2.69 లక్షలు, 2021-22 ఏడాదికి 1.93 లక్షలు, 2018-19 ఆర్థిక సంవత్సరానికి 1.80 లక్షలు ఉన్నాయి. అల్పాదాయ వర్గాలపై కోవిడ్ దెబ్బ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ట్యాక్స్ ఫైలర్లు దాఖలు చేసిన ఐటీ రిటర్న్ల సంఖ్య 2019-20తో పోల్చితే 41.5 శాతం పెరిగింది. కానీ రూ. 5 లక్షలు, ఆలోపు ఆదాయ విభాగంలో కేవలం 0.6 శాతం పెరిగింది. కోవిడ్ మహమ్మారి సంక్షోభం దెబ్బ వివిధ ఆదాయ వర్గాలపై ఎలా ఉందో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షల వరకు ఆదాయ వర్గం మినహా, ఇతర అన్ని ఆదాయ వర్గాల ట్యాక్స్ రిటర్న్స్ సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షల వరకు ఆదాయానికి దాఖలు చేసిన ఐటీ రిటర్న్లు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 4.94 కోట్ల నుంచి 5.68 కోట్లకు పెరిగాయి. అయితే, ఇతర ఆదాయ వర్గాల రిటర్న్లలో తగ్గుదల కనిపించింది. రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయానికి దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ల సంఖ్య క్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న 1.90 లక్షల నుంచి 1.46 లక్షలకు పడిపోయింది. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ఆదాయానికి ఐటీఆర్ల సంఖ్య 2.83 లక్షల నుంచి 2.25 లక్షలకు తగ్గాయి. రూ. 5 లక్షల-10 లక్షల మధ్య ఆదాయానికి ఫైల్ చేసిన ట్యాక్స్ రిటర్న్స్ 1.05 కోట్ల నుంచి 99.36 లక్షలకు తగ్గాయి. -
పాన్ కార్డ్ స్కాం: టీచర్ చనిపోయిన పదేళ్లకు రూ.7 కోట్ల ట్యాక్స్ నోటీసు..
భోపాల్: మధ్యప్రదేశ్లో ఓ కుటుంబానికి విచిత్రమైన సంఘటన ఎదురైంది. ఆ కుటుంబానికి చెందిన స్కూల్ టీచర్ పేరిట రూ.7 కోట్ల ట్యాక్సీ నోటీసు వచ్చింది. అయితే.. ఆ టీచర్ చనిపోయిన పదేళ్ల తర్వాత ఈ నోటీసులు రావడం గమనార్హం. 2013లో ఆ టీచర్ చనిపోగా.. 2017-18 ఏడాదికి గాను ఆమె పేరిట ఇంత మొత్తంలో పన్ను వసూలు నోటీసులు వచ్చాయి. ఉషా సోని మధ్యప్రదేశ్లోని పట్కేటా గ్రామంలో టీచర్గా పనిచేస్తున్నారు. జులై 26న ఆమె పేరిట రూ.7.55 కోట్ల ట్యాక్సీ వసూలుకు చెందిన ఆదేశాలు ఇన్కమ్టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి. ఈ ఘటనపై స్పందించిన ఆమె కుమారుడు పవన్ సోనీ.. మాట్లాడుతూ..' 2013 నవంబర్ 16న మా తల్లి చనిపోయింది. న్యాచురల్ కాస్టింగ్ సంస్థ పేరుపై ముడి సరుకులు కొనుగోలుకు సంబంధించి ఈ ట్యాక్స్ చెల్లించాలని నోటీసులో ఉంది. కేసు నమోదు చేశాము. మా అమ్మ పాన్ కార్డులను ఎవరో దుర్వినియోగం చేస్తున్నారు. ఎవరో మాకు తెలియదు.' అని అన్నారు. మధ్యప్రదేశ్లో ఈ ఒక్క కుటుంబమే కాదు. అనేక కుటుంబాలకు ఇలాంటి ఘటనలే ఎదురవుతున్నాయి. గిరిజన ప్రాంతాలైన బేతూల్ జిల్లాలో దాదాపుగా 44 మందికి ఇలాంటి నోటీసులు వచ్చాయి. దాదాపు రూ.1 కోటి నుంచి రూ.10 కోట్ల వరకు నోటీసులు వచ్చాయి. నితిన్ జైన్ అనే మరోవ్యక్తికి కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. నెలకు రూ.5 నుంచి 7 వేల వరకు సంపాదించే సామర్థ్యం గల ఇతనిపై రూ.1.26కోట్ల పన్ను వసూలుకు సంబంధించిన నోటీసులు వచ్చాయి. తమిళనాడులోని కోర్టల్లమ్లో తన పేరుపై ఓ అకౌంట్ ఉంది. ఈ పేరును ఇదే మొదటిసారి వినడమని నితిన్ తెలిపారు. 2014-15 మధ్య తన పేరుపై అకౌంట్ ఓపెన్ అయినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ ఘటనలపై బేతూల్ ఎస్పీ సిద్ధార్ద చౌదరి స్పందించారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: జైపూర్ కాల్పుల ఘటన.. ఆ రోజు రాత్రి రైలులో ఏం జరిగింది..? -
లాలూ ఫ్యామిలీకి ఈడీ షాక్.. రూ.6 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్..
పాట్నా: ల్యాండ్ ఫర్ జాబ్ స్కాంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు చిక్కెదురైంది. ఈ మేరకు లాలూ కుటుంబానికి సంబంధించిన రూ.6కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 2004 నుంచి 2009 మధ్య లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీ దేవీని ఈడీ గత మేలోనే ప్రశ్నించింది. ఆమెతో పాటు వరుసగా బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ ఎంపీలు మిసా భారతి, చండ యాదవ్, రాగిని యాదవ్ల నుంచి కూడా సమాచారాన్ని ఈడీ రాబట్టింది. ఈ కేసులో గత జులైలోనే దాదాపు 18 మందిపై సీబీఐ ఛార్జ్షీటును దాఖలు చేసింది. 2004 నుంచి 2009 మధ్య రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు లాలూ ప్రసాద్ రైల్వేలో గ్రూప్ డీ ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. బిహార్కు చెందిన అభ్యర్థులకు ఉద్యోగాలను అక్రమంగా కేటాయించారని, బదులుగా ఉద్యోగం పొందిన అభ్యర్థులు తమ భూములను లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి రాసి ఇచ్చారనేది ఆరోపణ. దీనిపై కొన్నేళ్లుగా దర్యాప్తు నడుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో లాలూకు చెందిన రూ.6 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: జైపూర్ ఎక్స్ప్రెస్ ఘటన: చేతన్ షార్ట్ టెంపర్.. అందుకే ఈ ఘోరం! -
జూనియర్ ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి పెళ్లి.. ఆమె ధరించిన చీర ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్గా మారిపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం 'దేవర'. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే తాజాగా ఎన్టీఆర్ సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. జూనియర్ 2011లో వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త నార్నె శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు. మే 5వతేదీన 2011లో జరిగిన వీరి వివాహాం అత్యంత వైభవంగా జరిగింది. కాగా.. ఈ జంటకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే కుమారులు జన్మించారు. (ఇది చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. 'కల్కి' ఇప్పట్లో రావడం కష్టమే!) అయితే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పెళ్లిలో కట్టుకున్న చీరపై నెట్టింట చర్చ నడుస్తోంది. ఆమె ధరించిన బంగారు వర్ణం గల చీర ధర దాదాపు కోటి రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. అంతే కాకుండా ఎన్టీఆర్ పెళ్లి వేడుకల కోసం దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి చీర ప్రత్యేకతలు ఎన్టీఆర్ భార్ ప్రణతి ధరించిన అంత భారీ ధర పలకడానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పెళ్లి రోజు బంగారు వర్ణంలో ఉన్న చీరను తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ధరించింది. లక్ష్మీ ప్రణతి కంజీవరం చీరలో స్వచ్చమైన బంగారం, వెండితో నేసినట్లుగా సమాచారం. ఆమె చీరకు తగినట్లుగానే బంగారు, వజ్రాల నెక్లెస్, మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నారు. వాటితో పాటు ఒక జత డైమండ్ ఇయర్ రింగ్స్ కూడా ధరించింది. జూనియర్ ఎన్టీఆర్ సంప్రదాయమైన తెల్లని కుర్తా, ధోతీతో మెరిసిపోయారు. అప్పట్లోనే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి కళ్యాణ మండపం విలువ రూ. 18 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో 3 వేల మంది అతిథులు, దాదాపు 12,000 మంది అభిమానులు హాజరయ్యారు. కాగా.. ఈ జంటకు 2014లో తమ మొదట అభయ్ రామ్ జన్మించగా.. 2019లో భార్గవరామ్ను స్వాగతించారు. ఈ ఏడాది మార్చిలో ప్రణతి తన 30 బర్త్డేను కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. భార్య 30వ బర్త్డేను మరింత స్పెషల్గా చేస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి బర్త్డే పార్టీ ఇచ్చారు తారక్. (ఇది చదవండి: ఆ సీన్లో ఎలాంటి తప్పులేదు.. మహాభారత్ నటుడు షాకింగ్ కామెంట్స్!) -
ఏడు కంపెనీలకు షాక్ - దెబ్బకు రూ. 469 కోట్లు వెనక్కి!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా ఉన్న సంగతి తెలిసిందే. కావున వాహన తయారీ సంస్థలు ఇలాంటి వెహికల్స్ తయారు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి ఫేమ్ 2 పథకం కింద ప్రయోజనాలను అందిస్తోంది. దీనిని అదనుగా తీసుకున్న చాలా కంపెనీలు నిబంధనలను పాటించలేదని గుర్తించి మొత్తం రికవరీ చేయాలనీ కేంద్రం ఆదేశించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఫేమ్ 2 నియమాలను అదనుగా తీసుకున్న 7 కంపెనీలు రూ. 469 కోట్లు క్లెయిమ్ చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మోసాన్ని గుర్తించిన కేంద్రం ఫేమ్ 2 కింద పొందిన మొత్తం డబ్బుని తిరిగి వెనక్కి ఇవ్వాలని వెల్లడించింది. మరో 7 నుంచి 10 రోజులలోపు మొత్తం డబ్బుని తిరిగి ఇవ్వని యెడల ఈ స్కీమ్ నుంచి కంపెనీని తొలగించనున్నట్లు పేర్కొంది. (ఇదీ చదవండి: నోట్ల ఉపసంహరణ గడువుపై కేంద్రం కీలక ప్రకటన - తప్పక తెలుసుకోవాల్సిందే!) మన దేశంలో తయారైన విడి భాగాలను ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసిన కంపెనీలకు మాత్రమే ప్రోత్సాహకాలు అందించాలని ఫేమ్ 2 నిబంధలు చెబుతున్నాయి. అయితే హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో వంటి కంపెనీలు చైనా విడి భాగాలతో వాహనాలను తయారు చేస్తున్నట్లు తెలిసింది. (ఇదీ చదవండి: ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకొచ్చింది, ఎవరు ప్రారంభించారో తెలిస్తే అవాక్కవుతారు!) ఫేమ్ 2 నిబంధనలను అనుగుణంగా నడుచుకుంటున్నట్లు హీరో ఎలక్ట్రిక్, ప్రభుత్వానికి వివరణాత్మకంగా సమాచారం అందిస్తామని యాంపియర్, మాకు ఇప్పటి వరకు ఎటువంటి నోటీసు అందలేదని లోహియా కంపెనీలు వెల్లడించాయి. కాగా దీనిపైన స్పందించడానికి ఒకినావా & రివోల్ట్ నిరాకరించినట్లు సమాచారం. మొత్తం మీద విదేశాల నుంచి ముడి భాగాలను దిగుమతి చేసుకుని వాహనాలను తయారు చేసినట్లు రుజువైతే ఇప్పటి వరకు ప్రోత్సాహకాల కింద అందుకున్న మొత్తం డబ్బు తిరిగి ఇచ్చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. -
మూడు కోట్లు దాటిన ఐటీఆర్లు
న్యూఢిల్లీ: గడువు సమీపిస్తుండడంతో ఆదాయపన్ను రిటర్నులు అధిక సంఖ్యలో దాఖలవుతున్నాయి. పన్ను చెల్లింపుదారులు ఈ నెల 18 నాటికి 3.06 కోట్ల రిటర్నులు ఫైల్ చేసినట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. ఇందులో 91 శాతం మంది (2.81 కోట్లు) తమ రిటర్నులను ఎలక్ట్రానిక్ రూపంలో ధ్రువీకరించినట్టు తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ధ్రువీకరించిన 2.81 కోట్ల ఐటీఆర్లలో 1.50 కోట్ల పత్రాలను ఇప్పటికే ప్రాసెస్ చేయడం కూడా పూర్తయినట్టు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే మూడు కోట్ల రిటర్నుల నమోదు ఏడు రోజులు ముందుగానే నమోదైనట్టు తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నులు నమోదు చేయడానికి గడువు జూలై 31తో ముగియనుంది. ఆడిట్ అవసరం లేని వారందరికీ ఇదే గడువు వర్తిస్తుంది. ఈ ఏడాది గడువు పొడిగించే అవకాశం లేదని ఇప్పటికే ఆదాయపన్ను శాఖ స్పష్టం చేయడం గమనార్హం. -
భార్యాపిల్లలపై ప్రేమ.. రూ. 90 కోట్ల అదృష్టం తెచ్చిపెట్టింది!
అతను ఉద్యోగ రీత్యా భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నాడు. దీంతో తరచూ అతనికి భార్యాపిల్లలు గుర్తుకురాసాగారు. ఈ నేపధ్యంలో అతను చేసిన ఒకపని అతనిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. అదికూడా ఒకటో రెండో కాదు.. ఏకంగా 90 కోట్లకు యజమానిగా మారిపోయాడు. ఈ విషయాన్ని అతను కుటుంబ సభ్యులు అతనికి తెలియజేసినప్పుడు వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఉదంతం చైనాలోని హాంగ్ఝూలో చోటుచేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం 30 ఏళ్ల ఈ వ్యక్తి ఇంటికి దూరంగా ఉంటూ జాబ్ చేస్తుంటాడు. అతను ఇంటికి రావడం కూడా తక్కువే. దీంతో అతనికి భార్యాపిల్లలు తరచూ గుర్తుకొస్తుంటారు. ఈ నేపధ్యంలో అతను తన భార్యాపిల్లల డేట్ ఆఫ్ బర్త్ నంబర్లతో లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసేవాడు. ఈ వ్యవహారం చాలా రోజులుగా నడుస్తుండేది. అయితే ఇప్పుడు అతనికి అదృష్టం తన్నుకుంటూ వచ్చింది. ఆయన కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్ ఇప్పుడు కోట్లు కొల్లగొట్టింది. ఆ అదృష్టవంతుని పేరు వెల్లడికానప్పటికీ హాంగ్ఝూకు చెందిన ఆ వ్యక్తి తన భార్యాపిల్లల డేట్ ఆఫ్ బర్త్ నంబరుతో కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్ సిరీస్.. 77 మిలియన్ల యువాన్లు(రూ. 90 కోట్లకు పైగా మొత్తం) గెలుచుకుంది. ఆ వ్యక్తి ఈ నెల మొదట్లో రూ. 300 వెచ్చించి 15 లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేశాడు. 11న లాటరీ ఫలితాలు వెలువడగా, అతను 77.1 మిలియన్ల యువాన్లు గెలుచుకున్నాడు. ఈ ఉదంతానికి సంబంధించిన పోస్టు చూసిన నెటిజన్లు అదృష్టం ఎప్ప్పుడు, ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరన్నారు. ఇది కూడా చదవండి: ఆ నీలి కళ్ల చాయ్వాలా.. మోడలింగ్ తర్వాత లండన్లో మొదలెడుతున్న పని ఇదే.. -
ఇది కదా లక్ అంటే.. గంటలో కోటి!
Nagaland State Lottery: ఏదో అదృష్టం కలిసి వస్తుందని చాలామంది లాటరీలు కొంటారు. మరికొందరైతే ఏళ్ల తరబడి లాటరీ టికెట్లు కొంటూనే ఉంటారు. ఆ బంపర్ఎ ప్రైజ్ తమకు ఎప్పుడు తగులుతుందా అని ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ లాటరీ టిక్కెట్ కొన్న గంటకే కోటి రూపాయలు గెలుచుకోవడం గురించి విన్నారా? పంజాబ్లో ఒక వ్యక్తికి ఇలాంటి జాక్పాట్ తగిలింది. ఈ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి కావడం అతని వంతైంది. వివరాలను పరిశీలిస్తే.. పంజాబ్, గురుదాస్పూర్ జిల్లాకు చెందిన రూపీందర్జిత్ సింగ్ అగ్రికల్చర్ డెవలెప్మెంట్ బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తున్నాడు. అందరిలాగారే ఈయన కూడా గత ఏడాది కాలంగా లాటరీ టిక్కెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు కానీ ఇంత తొందరగా లక్ష్మీ దేవి తన ఇంటికి నడిచి వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు. (ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్తో భారీ డీల్!) ఎప్పటిలాగే రూపీందర్జిత్ సింగ్ శనివారం మధ్యాహ్నం నాగాల్యాండ్ లాటరీ టిక్కెట్లు రూ.6 పెట్టి 25 టికెట్లను కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఆఫీసుకెళ్లి తన పనిలో నిమగ్నమైపోయాడు. ఇంతలో దాదాపు గంట తరువాత లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ఏకం రూ. కోటి గెలుచుకున్నట్టు సమాచారం అందించడంతో ఎగిరి గంతేశాడు రూపిందర్. ఇన్నళ్లకి తన కల నెలవేరిందని, ఈ డబ్బును తన పిల్లలు, కుటుంబం భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానన్నారు. అంతేకాదు ఆపదలో ఉన్న పేదలకు కూడా సాయం చేస్తానని చెప్పాడు రూపీందర్ కొండంత సంబరంతో. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం?) తన అలవాటే తనను కోటీశ్వరుడిని చేసిందని రూపిందర్జిత్ చెప్పాడు. లాటరీని గెలుచుకున్నందుకు బ్యాంకు సిబ్బంది అభినందించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫోన్లు చేశారు. కాగా గతంలో ఇదే ప్రాంతంలో కిరాణా దుకాణం యజమానికి రూ.2.5 కోట్ల లాటరీ బంపర్ ప్రైజ్ వచ్చింది. మరోసారి బంపర్ ప్రైజ్ గెలవడంతో డేరా బాబా నానక్ టౌన్ పేరు మరోసారి మారుమోగింది. ( -
టొమాటో రైతుకు జాక్పాట్: నెల రోజుల్లో కోటిన్నర
Tomato Tukaram Bhagoji Gayakar earns 1.5 crore: ఇపుడు ఏ నలుగురు కలిసినా ఒకటే టాపిక్.. టొమాటో ధరల మంట. అయితే ఈ డిమాండ్ -సప్లయ్ సంక్షోభంలో సాధారణంగా రైతులకు జరిగే మేలు జరిగే సందర్బాలు చాలా తక్కువ. కానీ మహారాష్ట్రలోని పూణె జిల్లాకు చెందిన రైతు తుకారాం భాగోజీ గయాకర్ అలాంటి అదృష్టం వరించింది. 30 రోజుల్లో కోటిన్నర రూపాయలు సంపాదించడం విశేషంగా నిలిచింది. (Koushik Chatterjee: కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం) దేశంలోని పలు ప్రాంతాల్లో టొమాటో ధర మండిపోతున్న సంగతి తెలిసిందే. 12 ఎకరాల భూమిలో టొమాటో సాగు చేస్తున్న సమయంలో తనకు ఇంత అదృష్టం క లిసి వస్తుందని బహుశా తుకారాం అసలు ఊహించి ఉండరు.ఇండియా టుడే నివేదిక ప్రకారం తుకారాం భాగోజీ గయాకర్ టొమాటో సాగు చేశాడు. మంచి దిగుబడి వచ్చింది. నారాయణగంజ్లో తన పంటను విక్రయించడం ద్వారా రైతు రోజుకి రూ.2,100 సంపాదించాడు. దీనికితోడు శుక్రవారం ఒక్కరోజే 900 డబ్బాలను విక్రయించి ఒక్కరోజులోనే రూ.18 లక్షలు సంపాదించాడు. మొత్తంగా నెల రోజుల్లో అతని సంపాదన 1.5 కోట్ల రూపాయలకు చేరింది. (తక్కువ ధరలో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్) తుకారాం తన కుమారుడు ఈశ్వర్ గయాకర్, కోడలు సోనాలి సహాయంతో నెలలో 13,000 టమోటా డబ్బాలను విక్రయించాడు. 18 ఎకరాల వ్యవసాయ భూమిలో 12 ఎకరాల్లో టమాట సాగు చేశాడు. ఎరువులు , పురుగుమందులపై అవగాహన, సస్యరక్షణపై అవగాహనతో నాణ్యమైన టమోటాలు పండించామని తుకారాం కుటుంబం చెబుతోంది. ముఖ్యంగా తుకారాం కోడలు సోనాలి మొక్కలు నాటడం, పంట కోయడం, ప్యాకింగ్ చేయడం వంటి పనులను నిర్వహిస్తుండగా, కుమారుడు ఈశ్వర్ సేల్స్, మేనేజ్మెంట్ , ఫైనాన్షియల్ ప్లానింగ్ను నిర్వహిస్తుండగా. గత మూడు నెలలుగా పడిన కష్టానికి తగిన ఫలితం దక్కిందని తుకారం కుటుంబం సంబరపడుతోంది. అంతేకాదు ఈ ప్రాంతంలో తుకారం కుటుంబం మాత్రమే కాకుండా చాలామంది రైతులు కోటీశ్వరులైనట్టు తెలుస్తోంది. జున్నార్ వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీ ద్వారా 100 మంది మహిళలు, 2 నెలల్లో 80 కోట్ల రూపాయల టొమాటో విక్రయించారట. కాగా నారాయణగంజ్లో, జున్ను వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ మార్కెట్లో, నాణ్యమైన (20 కిలోలు)టొమాటో గరిష్టంగా రూ.2,500 పలుకుతోంది. అంటే కిలో రూ.125. ఇది ఇలా ఉంటే కేంద్రం శుక్రవారం టొమాటో కిలో రూ. 90 చొప్పున ప్రజలకు విక్రయించడం ప్రారంభించింది, వాటిని వ్యవసాయ కేంద్రాల నుండి ఢిల్లీ-ఎన్సిఆర్ , లక్నో వంటి నగరాలకు రవాణా చేసింది. -
జలప్రళయం.. హిమాచల్ కకావికలం
సిమ్లా: ఎడతెరిపిలేని వర్షాలు హిమాచల్ ప్రదేశ్ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్రమంతటా రోడ్లు కొట్టుకుపోయిన కారణంగా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. విద్యుత్ వ్యవస్థ నిలిచిపోయింది. వరద నీటితో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గత నాలుగు రోజుల్లో వర్షాల ధాటికి 80 మంది మృతి చెందారు. రూ.4000 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 1300 రోడ్లు బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఛండీగఢ్-మనాలీ, సిమ్లా-కాల్కా జాతీయ రహదారులను మూసివేసినట్లు వెల్లడించారు. మనాలీలో చిక్కిన 1000 మంది పర్యటకుల వాహనాలను తరలించడానికి అర్ధరాత్రి పూట వన్వే ట్రాఫిక్ను తెరిచినట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో పర్యటకులు చిక్కుకుపోయినట్లు పేర్కొన్నారు. More Scary visuals from Thunag area of Mandi, Himachal#Thunag #Mandi #HimachalPradesh #Manali #Kullu pic.twitter.com/qtyyo3OHcD — Anil Thakur (@Ani_iTV) July 9, 2023 ఇప్పటివరకు రాష్ట్రంలో 40 వంతెనలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. జులై 5 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 20,000లకు పైనే ప్రజలను పునరావాస ప్రదేశాలకు తరలించినట్లు వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడి, వరదలతో భారీ నష్టం జరిగిన కులూ ప్రాంతాల్లో రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుకూ పర్యటించారు. పరిస్థితిని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకువచ్చామని తెలిపారు. నష్టాన్ని పూరించడానికి చేయాల్సిన పని చాలా ఉందని అన్నారు. This is Temple in Sirmaur Himachal Pradesh under flood pic.twitter.com/PI3IIibmzp — Go Himachal (@GoHimachal_) July 11, 2023 గత నాలుగు రోజులుగా ఉత్తర భారతం భారీ వర్షాలతో వణికిపోతోంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. వర్షాల ధాటికి వరద నీటితో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు సంభవిస్తుండగా.. హిమాచల్ ప్రదేశ్లో భారీ నష్టం వాటిల్లింది. 80 Killed, ₹ 3,000 Crore Damage: Himachal Rain Devastation In Numbers https://t.co/7xnflWjHa5 pic.twitter.com/FFgvfMddRA — NDTV (@ndtv) July 12, 2023 కాగా.. రానున్న 24 గంటల్లో భారీ స్థాయిలో వర్షాలు రానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో 23 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఉత్తరాఖండ్లో రెడ్ అలర్ట్ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇదీ చదవండి: Yamuna Rivar: డేంజర్ మార్క్ దాటి మహోగ్రంగా ప్రవహిస్తున్న యమునా.. ఢిల్లీ హై అలర్ట్.. -
మూడేళ్ల పరిచయానికి రూ.900 కోట్లు ఇచ్చేశాడు..!
బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీ గత నెలలో మరణించిన సంగతి తెలిసిందే. చనిపోయే ముందు ఆయన తన గార్ల్ఫ్రెండ్ మార్టా ఫాసినా(33)కి రూ.900 కోట్ల రూపాయలను ఇచ్చారు. ఈ మేరకు ఆస్పత్రి బెడ్పైనే వీలునామా రాసి సంతకం చేశారు. బ్రిటన్కు మూడు సార్లు ప్రధానిగా ఉన్న ఆయన ఆస్తి మొత్తం ఆరు బిలియన్లకు పైనే ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించింది. మార్టా ఫాసినాతో బెర్లుస్కోనికి 2020 నుంచి గత మూడేళ్లుగా పరిచయం ఏర్పడింది. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఫాసినా ఇటలీ పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు. బెర్లుస్కోనీ స్థాపించిన ఫోర్జా ఇటాలియా పార్టీలో సభ్యురాలుగా కూడా ఉన్నారు. ఇరువురి మధ్య స్నేహం తర్వాత మరింత దగ్గరయ్యారు. అయితే.. బెర్లుస్కోనీ వ్యాపారాన్ని ఆయన ఇద్దరు పిల్లలు మెరీనా, పీర్ సిల్వియోలు చూసుకుంటున్నారు. వ్యాపార వాటాలో 53 శాతం కుటుంబంపై ఉంది. వీలునామాలో తన సోదరుడు పాలోకు 100 మీలియన్ల యూరోలను కేటాయించారు బెర్లుస్కోనీ. మాఫియాతో సహవాసం చేసి, జైలు శిక్ష అనుభవించిన తన పార్టీ మాజీ సెనేటర్ మార్సెల్లో డెల్ ఉట్రీకి 30 మీలియన్ల యూరోలను ఇచ్చారు. ఉన్న ఆస్తిలో పిల్లలు మెరీనా, పియర్ సిల్వియోలకు సమాన భాగాలుగా పంచి ఇస్తున్నట్లు వీలునామా రాసిన బెర్లుస్కోనీ.. మిగిలిన ఆస్థిని ఐదుగురు పిల్లలు మెరీనా, పీర్ సిల్వియో, బార్బరా, ఎలియోనోరా, లుయిగికి సమాన భాగాలుగా ఇస్తున్నట్లు రాశారు. మార్టా ఫాసినాను అధికారికంగా పెళ్లి చేసుకోకున్నప్పటికీ వీలునామాలో మాత్రం భార్యగా పేర్కొని ఆస్తిని కేటాయించారు. ల్యుకేమియాతో బాధపడుతున్న బెర్లుస్కోనీ 86 ఏళ్ల వయసులో జూన్ 12న మరణించారు. వ్యాపార వేత్తగా, ప్రధానిగా రాణించిన ఆయనపై పలు కేసులు కూడా ఉన్నాయి. పన్నుల ఎగవేతకు సంబంధించిన కేసులో ఆరేళ్ల పాటు రాజకీయం నుంచి నిషేధానికి కూడా గురయ్యారు. ఇదీ చదవండి: దయా హృదయం-మహా ఖరీదు.. అస్థికలు భద్రపరిచేందుకు అద్దె రూ.63 లక్షలు, ఫ్యామిలీ ప్యాక్ కూడా! -
మాములు 'పిల్లులు' కావు! తీసుకునేందుకు ఎగబడుతున్న జనం!
మనం పిల్లిని పొద్దుపొద్దున్నే చూసేందుకు కూడా ఇష్టపడం. కానీ విదేశీయులకు అవంటే వారికి అమితమైన ప్రేమ. వాటి కోసం కోట్ల కోట్ల ఆస్తులు కూడా రాస్తారు. అచ్చం అలానే ఒక మహిళ తను పెంచుకుంటున్న ఏడు పిల్లులకు ఓ రేంజ్లో ఆస్తి అప్పజెప్పింది. అవి చనిపోయేంత వరకు చూసుకునేలా కొన్ని షరతులు కూడా విధించింది. ఈ విచిత్ర ఘటన యూఎస్లోని ఫోరిడాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఫ్లోరిడాలోని టంపాకు చెందిన నాన్సీ సాయర్ ఏడు పిల్లులను ఎంతో ప్రేమగా పెంచుకుంటోంది. ఐతే ఆమె 84 ఏళ్ల వయసులో మరణించింది. చనిపోతూ తాను పెంచుకుంటున ఏడు పర్షియన్ పిల్లులకు సుమారు రూ. 2.4 కోట్ల ఆస్తిని రాసింది. అవి చనిపోయేంత వరకు తన ఇంట్లోనే నివశించేలా రూ. 2.4 కోట్ల విలువ చేసే తన ఎస్టేట్ని వాటి పేర రాసింది. వాటిని పర్యవేక్షించే సంరక్షకులు సరిగా విధులు నిర్వర్తించలేకపోవడంతో వాటిని చూసుకునేందుకు సిల్క్ హ్యూమన్ సోసైటీ ఆఫ్ టంపా బే ముందుకు వచ్చింది. ఆ పిల్లుల పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. అవి వరుసగా మిడ్నైట్, స్నోబాల్, గోల్డ్ ఫింగర్, లియో, స్క్వీకీ, క్లియోపాత్రా,నెపోలియన్ అనే పిల్లులు. ఈ మేరకు హ్యుమన్ పొసైటీ ఆఫ్ టంపా బే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షెర్రీ సిల్క్ మాట్లాడుతూ..సాయర్ వాటి సంరక్షణ కోంస కోట్ల విలువ చేసే ఎస్టేట్ను రాసిచ్చారు. వాటి బాగోగులను ప్రస్తుతం తాము చూసుకుంటున్నామని. ప్రస్తుతం ఈ పిల్లులను మేం దత్తత తీసుకుంటాం అంటూ తమ సోసైటీకి దరఖాస్తులు వెల్లువలా వస్తున్నట్లు తెలిపారు. ఈ పిల్లుల దత్తత కోర్టు పర్యవేక్షణలో జరుగుతాయని. వాటి సంరక్షణకు సంబంధించిన నివేదికి ప్రతి రెండు నెలలకోసారి కోర్టుకి సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఈ పిల్లులను ఆయా వ్యక్తులకు అందిస్తామని చెప్పారు. (చదవండి: ఎవ్వరూ మాట్లాడని కేరళ కథ! యావత్ సమాజం సేవ చేసేలా..!) -
బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..!
జీవితాన్ని సౌకర్యవంతంగా గడపడానికి ఉద్యోగం తప్పనిసరి. ఏ ఉద్యోగం చేసినా పదో పాతికో సంపాదించగలం. బాగా శ్రమిస్తే కొందరైతే లక్షల వరకు చేరుకోగలరు. కానీ కేవలం బల్బులను మార్చుతూ కోట్లు సంపాదించగలరా? ఏ సంస్థ అయినా లైట్లు మార్చితే కోట్ల రూపాయల జీతం ఇస్తుందా? అవును ఇస్తుంది. కేవలం టవర్కు ఉండే లైట్లను మార్చితే కోట్ల రూపాయల జీతం సంపాదించవచ్చు. కాకపోతే.. ఆ టవర్ల ఎత్తు మామూలుగా ఉండదు మరి..! మామూలు టవర్లు కావు.. వందల మీటర్లు ఉండే ఎత్తైన సిగ్నల్ టవర్లపై పని చేయాలి. పైకి వెళ్లగానే కళ్లు తిరుగకుండా, ధైర్యంగా సన్నని కడ్డీలపై తిరుగాల్సి ఉంటుంది. బయట కనిపించే టవర్ల లాంటివి కావు ఇవి. ఎత్తుకు పోయేకొలది సన్నగా ఉంటాయి. చివరకు కేవలం సన్నని కడ్డీ మాత్రమే ఉంటుంది. ఈ టవర్లపై ఎక్కి లైట్లను మార్చాలి అంటే..భయంతో కూడిన పని. కేవలం ఒక తాడు మాత్రమే రక్షణగా ఉంటుంది. ఇలాంటి పనులు అందరూ చేయలేరు. ఇందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. శారీరకంగా దృఢంగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి టవర్లపై పనిచేయగలిగే వారికి చాలా డిమాండ్ అంటుందట. కోట్లలో జీతాలు.. టవర్ ఎత్తు, అనుభవం, నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగికి జీతం ఉంటుందట. కొందరికి గంటల చొప్పున ఉంటుంది. ఎంత తక్కువలో అయినా ఒక టవర్ ఎక్కి దిగడానికి కనీసం ఆరుగంటలైన పడుతుంది. 1500 మీటర్ల టవర్ను ఎక్కగలిగేవారికి దాదాపు 1 కోటి రూపాయలపైనే ఉంటుంది. ఉద్యోగంలో కొత్తగా చేరినవారికే గంటకు సరాసరిగా 17డాలర్ల వరకు ఇస్తారు. అయితే.. ప్రతీ ఆరునెలలకు ఒకసారి ఈ లైట్లను మారుస్తారట. అమెరికాలోని డకోటా నగరానికి చెందిన ఓ ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. Every six months this man in South Dakota climbs this communication tower to change the light bulb. He is paid $20,000 per climb. pic.twitter.com/z9xmGqyUDd — Historic Vids (@historyinmemes) December 2, 2022 ఇదీ చదవండి:యూఎస్కి 17 ఏళ్ల పాటు చుక్కలు చూపించిన గణిత మేధావి మృతి -
ప్రభుత్వ కార్యాలయంలో రూ. 2 కోట్లకు పైగా నగదు, కిలో బంగారం..
ఓ ప్రభుత్వ కార్యాలయంలో రూ. 2 కోట్లకు పైగా నగదు, కిలో బంగారం బయట పడటం తీవ్ర కలకలం రేపింది. అదీకూడా దేశంలో రెండు వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న వేళ ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన రాజస్తాన్లో జైపూర్లోని యోజన భవన్లో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కార్యాలయం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డీజీపీ, పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ్లతో కలిసి మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. రాజస్తాన్ ప్రభుత్వాధికారుల ప్రభుత్వ భవనమైన యోజన భవన్లో బేస్మెంట్లో లెక్కల్లోకిరాని ఈ నగదు, బంగారాన్ని గుర్తించారు పోలీసులు. భవనం బేస్మెంట్లోని అల్మార్్లో ఉంచిన బ్యాగులో ఈ నగదు, బంగారం ఉన్నట్లు వెల్లడించారు. అందులో సుమారు రూ. 2.31 కోట్లకు పైగా నగదు, ఒక కిలో బంగారం బిస్కెట్లు ఉన్నాయని తెలిపారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేయడమే గాక ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ మేరకు పోలీసుల కమిషనర్ ఆనంద్ కుమార్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ..సమీపంలోని సీసీఫుటేజ్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. సీఎం అశోక్ గెహ్లాట్కు కూడా ఇదే విషయమే సమాచారం అందించామని శ్రీ వాస్తవ చెప్పారు. #WATCH | Jaipur, Rajasthan: Around Rs 2.31 crores of cash and 1 kg of gold biscuits have been found in a bag kept in a cupboard at the basement of the Government Office Yojana Bhawan. Police have seized these notes and further investigation has been started. CCTV footage is being… pic.twitter.com/xanN2NQhi7 — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 19, 2023 (చదవండి: పేరుకే ఎమ్మెల్యేని.. వీఏఓ కూడా పట్టించుకోవడం లేదు!) -
ఎన్నికల వేళ కర్ణాటకలో హవాలా డబ్బు కలకలం
-
ఈ స్కీంలో నెలకు రూ. 12,500 పెట్టుబడి పెడితే.. కోటి రూపాయలు
సాక్షి,ముంబై: ప్రభుత్వ పథకాల ద్వారా లభించే వడ్డీతో ఇన్వెస్టర్లు గణనీయమైన లాభాలను దక్కించుకోవచ్చు. ముఖ్యంగా పన్ను రహిత ప్రభుత్వ పథకంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు. రిస్క్ లేని ప్రభుత్వ పథకాల్లో చిన్న పెట్టుబడులే మంచి రాబడిని అందిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం. ఈ పథంలో పెట్టుబడి ద్వారా రూ. 1 కోటి రూపాయల వరకు లబ్ధి పొందవచ్చు. అయితే 25 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. అంతేకాదు రూ. 65 లక్షల కంటే ఎక్కువ వడ్డీ మనకు దక్కుతుంది. సంవత్సరానికి ఒకసారి లేదా, నెలకు ఒకసారి చొప్పున పెట్టుబడి పెడితే దానికి కాంపౌండ్ వడ్డీ లబిస్తుంది. వార్షిక రాబడి రేటు 7.1 శాతం. ఈ పథకం కింద అనుమతించబడిన అత్యధిక పెట్టుబడి కనిష్టం రూ.500 గా ఉంటే, రూ. 1.5 లక్షలు. ఇది కూడా పన్ను రహితమే కావడం గమనార్హం. అంతేకాదు ప్రతి మూడు నెలలకోసారి మూల్యాంకనం చేయడం ద్వారా ప్రభుత్వం ఈ పథకం కింద వడ్డీ రేటును పెంచుతుంది. ఏ పోస్టాఫీసులోనైనా పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతాలు 15 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటాయి, అయితే వాటిని అదనంగా ఐదు సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు. పీపీఎఫ్లో డబ్బును ఎలా డిపాజిట్ చేయాలి పీపీఎఫ్ కాలిక్యులేటర్ ప్రకారం, పెట్టుబడిదారుడు పీపీఎఫ్ పథకంలో నెలకు రూ. 12,500 లేదా సంవత్సరానికి రూ. 1.50 లక్షలు పెడితే 15 సంవత్సరాలలో మొత్తం రాబడి రూ. 40.68 లక్షలు అవుతుంది. అంటే 22.50 లక్షల రూపాయలు పెట్టుబడిపై ర. 18.18 లక్షలు వడ్డీగా చెల్లిస్తారు. ఆ తర్వాత దీన్ని ఐదేళ్ల పాటు పొడిగించి, మరో ఐదేళ్లకు ఒకసారి మళ్లీ పెట్టుబడి పెడితే, మొత్తం మెచ్యూరిటీ 25 ఏళ్లు అవుతుంది. తద్వారా రూ. 1 కోటి 03 లక్షల 08 వేలు డిపాజిట్ అవుతుంది. మొత్తంగా25 సంవత్సరాల తర్వాత పెట్టుబడి రూ. 37.50 లక్షలు. అయితే రూ. 65 లక్షల 58 వేలు వడ్డీగా లభిస్తుందన్నమాట. -
వారికి భారీ ఊరట: రెండేళ్లలో కోటి ఉద్యోగాలు
న్యూఢిల్లీ: డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఎలక్ట్రానిక్స్, స్టార్టప్లు, ఐటీ-ఐటీ ఆధారిత సర్వీసుల రంగాల్లో వచ్చే రెండేళ్ల కాలంలో కోటి ఉద్యోగాల కల్పన మైలురాయిని సాధించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు టెలికం మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. ఈఎస్సీ-ఎస్టీపీఐ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఎలక్ట్రానిక్స్ తయారీ, ఐటీ-ఐటీఈఎస్, స్టార్టప్లు మూడు ముఖ్య స్తంభాలుగా అభివర్ణించారు. ఈ రంగాలు ఇప్పటికే 88-90 లక్షల మందికి కొత్తగా ఉపాధి కల్పించి నట్టు మంత్రి చెప్పారు. (జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం) వచ్చే రెండేళ్లలో ఇది సులభంగానే కోటి దాటుతుందన్నారు. ‘‘లోగడ స్టార్టప్లకు సంబంధించి కొన్ని పట్టణాల పేర్లే వినిపించేవి. కానీ, ఇప్పుడు గ్రామాల్లో పాఠశాలలను సందర్శించినప్పుడు అక్కడి పిల్లలు స్థానికంగానే స్టార్టప్లను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు చెబుతున్నారు’’అని మంత్రి వెల్లడించారు. భారత్ టెక్నాలజీ వినియోగదారు నుంచి టెక్నాలజీ ఉత్పత్తిదారుగా మారినట్టు చెప్పారు. (జోరుగా ప్యాసింజర్ వాహన విక్రయాలు, టాప్లో ఆ రెండు) స్టార్టప్లను ఏర్పాటు చేసుకునేందుకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) ప్లగ్ అండ్ ప్లే (వచ్చి వెంటనే పనిచేసుకునే ఏర్పాట్లు) సదుపాయాలను కల్పిస్తున్నట్టు మంత్రి వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా 64 పట్టణాల్లో స్టార్టప్ల కోసం ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలను ఆఫర్ చేస్తున్నట్టు ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్ ఇదే కార్యక్రమంలో తెలిపారు. ఇందులో 53 కేంద్రాలు టైర్ 2, 3 పట్టణాల్లో ఉన్నట్టు చెప్పారు. రూ.5-10 లక్షల సీడ్ ఫండింగ్ కూడా సమకూరుస్తున్నట్టు తెలిపారు. ఇవీ చదవండి: వినియోగదారులకు శుభవార్త: దిగిరానున్న వంట గ్యాస్ ధర శాంసంగ్ గుడ్ న్యూస్: భారీ ఉద్యోగాలు -
వ్యాపారవేత్తకు భారీ షాక్: రూ. కోటి ఖాళీ, ఏం జరిగిందంటే?
సాక్షి, ముంబై: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు హద్దే లేకుండా రోజురోజుకు మితిమీరుతున్నాయి. టెక్నాలజీ తెలియని అమాయక ప్రజలనే మాత్రమే కాదు, వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ కోట్లను దోచేస్తున్నారు. తాజాగా ఒక వ్యాపారవత్త మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి కోటి రూపాయలను మాయం చేసిన ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలోని థానే నగరంలో వ్యాపారవేత్త ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొబైల్ ఫోన్ను హ్యాకింగ్ గురైందనీ, ఆ తరువాత రూ. 99.50 లక్షలు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు పోలీసు అధికారి గురువారం తెలిపారు. ఈ నెల 6-7 తేదీల మధ్య వ్యాపారవేత్త ఫోన్ హ్యాక్ చేసి మరీ, బ్యాంకు ఖాతాలోని సొమ్మును నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇతర ఖాతాలకు తరలించారని వాగ్లే ఎస్టేట్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఐటీ యాక్ట్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. -
ఆనంద్ మహీంద్ర అద్భుత రికార్డ్, అదిరిపోయే చమక్కు
సాక్షి,ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్, పాపులర్ పారిశ్రామికవేత్త, ఆనంద్ మహీంద్రా రికార్డ్ సాధించారు. సోషల్ మీడియాలోఎపుడు చురుకుగా ఉండే ఆయన ట్విటర్లో ఏకంగా కోటి మంది ఫాలోయర్లను సాధించారు. అంతేకాదు ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేస్తూ, తనదైన శైలిలో చమత్కరించడం విశేషం. దీంతో పలువురు ఫ్యాన్స్ ఆయనను అభినందనల్లో ముంచెత్తుతున్నారు ‘‘ఇంత పెద్ద కుటుంబం.. నమ్మలేకపోతున్నాను. ఇది స్పష్టంగా కుటుంబ నియంత్రణ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అవుతుంది. మీ ఆసక్తి, నా పట్ల మీరు చూపిస్తున్న నమ్మకానికి అందరికీ బిగ్ థ్యాంక్స్..ఇకపై నాతో కలసే ఉండండి’’ అంటూ మహీంద్రా ట్వీట్ చేశారు. అలాగే ఒక జిఫ్ను షేర్ చేయడంతో నెటిజన్లు ఉత్సాహంగా తమ స్పందన తెలియజేస్తున్నారు. (మెటాలో వేల మందికి ఉద్వాసన: హెచ్1బీ వీసా హోల్డర్లలో కలవరం) కాగా ఆనంద్ మహీంద్ర అంటే బిజినెస్ వర్గాల్లోనే కాదు, ట్వీపుల్లో బాగా పాపులర్ అయిన పేరు. ఎందుకంటే వింతలు, విజ్ఞానం, సైన్స్, లేటెస్ట్టెక్నాలజీ అంశాలతో పాటు సామాజిక అవగాహన కల్పించే అంశాలను, వీడియోను ట్విటర్లో షేర్ చేయడం ఆయనకు అలవాటు. ఆ స్పెషాలిటీనే కోటి మంది అభిమానులకు చేరువ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. My reaction when I saw this milestone in the number of followers. Hard to believe I have a family this large. (Clearly violating Family Planning guidelines!) A huge thank you to all for your interest and your belief in me. Let’s stay connected. 🙏🏽🙏🏽🙏🏽 pic.twitter.com/NEIKAlKh5I — anand mahindra (@anandmahindra) November 10, 2022 -
ఇన్స్టంట్ లోన్ ముఠా గుట్టు రట్టు... నిర్వహించేది చైనావాళ్లే!
న్యూఢిల్లీ: ఇన్స్టంట్ లోన్ దోపిడి మాయను బట్టబయలు చేశారు ఢిల్లీ పోలీసులు. సుమారు రెండు నెలలపాటు సాగిన ఈ గ్యాంగ్ అపరేషన్ పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ నెట్వర్క్ విస్తరించి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....లక్నోలోని కాల్ సెంటర్లలో ఉన్న ఈ ముఠా తొలుత చిన్నమొత్తాల్లో రుణం అందించడానికి దరఖాస్తులు కోరుతుంది. ఆ తర్వాత యూజర్ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసి యాప్కు అనుమతులు మంజూరు చేసిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే వారి ఖాతాలో రుణం జమ అవుతుంది. అంతేకాదు ఫేక్ ఐడీలపై సేకరించిన వివిధ నంబర్ల నుంచి వినియోగదారులకు ఫోన్ చేసి ఒత్తిడి చేయడం మొదలు పెడతాయి. ఒకవేళ పట్టించుకోకపోతే వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని బెదిరింపులకు దిగుతుంది. దీంతో బాధితులు భయంతో అధిక మొత్తంలో డబ్బులు చెల్లించడం జరుగుతోంది. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఆ ముఠా హవాల ద్వారా లేదా క్రిప్టోకరెన్సీలను కొనుగోలు చేసి చైనాకు పంపిస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రతి ఖాతాకు కోటి రూపాయాల పైనే డబ్బులు జమ అవుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు దాదాపు 500 కోట్ల ఇన్స్టంట్ లోన్ దోపిడి రాకెట్తో ప్రమేయం ఉన్న సుమారు 22 మందిని అరెస్టు చేశారు. అంతేకాదు ఈ దందా కోసం ఆ ముఠా దాదాపు వంద లోన్యాప్లను ఉపయోగించనట్లు వెల్లడించారు. నిందుతుల నుంచి 51 మొబైల్ ఫోన్లు, 25 హార్డ్ డిస్క్లు, తొమ్మిది ల్యాప్టాప్లు, 19 డెబిట్ కార్డ్లు/క్రెడిట్ కార్డ్లు, మూడు కార్లు, సుమారు రూ. 4 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చైనా జాతీయులు సూచనల మేరకే ఈ రాకెట్ని తాము నిర్వహిస్తున్నామని నిందితులు చెప్పనట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసుల చైనాకు చెందిన కొంతమంది దుండగులను గుర్తించామని, వారి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. -
క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.కోటి ఖాళీ
హిమాయత్నగర్: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే రూ.కోట్లు సంపాదించవచ్చునని ఎరవేసిన సైబర్ నేరగాళ్లు ఐదుగురి వ్యక్తుల నుంచి సుమారు రూ.కోటికి పైగా కొట్టేసిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. సిటీ సైబర్క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కవాడిగూడకు చెందిన శ్రీనివాస్ను ఇటీవల ఓ వ్యక్తి టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేశాడు. సదరు గ్రూప్లో నిత్యం క్రిప్టో కరెన్సీపైనే చర్చ జరుగుతుండేది. కొద్దిరోజుల తర్వాత శ్రీనివాస్తో మాటలు కలిపిన సైబర్ నేరగాడు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించాడు. ‘కేకాయిన్’ అనే యాప్ను శ్రీనివాస్ మొబైల్లో డౌన్లోడ్ చేయించి పెట్టుబడి పెట్టించాడు. పలు దఫాలుగా రూ.73లక్షలు పెట్టుబడి పెట్టాడు. రూ.73లక్షలకు గాను అతడి సైట్లో ఇతని పేరుపై రూ.4కోట్లు ఉన్నట్లు చూపిస్తుంది. అయితే ఈ మొత్తాన్ని మార్చుకునేందుకు, డ్రా చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో శ్రీనివాస్ అతడిని నిలదీశాడు. మరింత పెట్టుబడి పెడితే ఒకేసారి రూ.కోట్లు తీసుకోవచ్చని చెప్పాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు గురువారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంబర్పేటకు చెందిన రాజు ఇతని స్నేహితులు మరో ముగ్గురు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు. రాజుకు తెలిసిన వ్యక్తి సహకారంతో రూ.28లక్షలు పెట్టుబడి పెట్టారు. లాభాలు చూపించకపోగా ఇచ్చిన సొమ్మును వెనక్కి ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. (చదవండి: పెళ్లి పేరుతో వంచన...పరారైన ప్రియుడు) -
భారీ భూకబ్జా.. అంతా సాఫీగా సాగింది.. కానీ బయటకు పొక్కిందిలా..
జిల్లా కేంద్రంలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూమిపై ఓ కీలక ప్రజాప్రతినిధి కన్ను పడింది. ఇంకేం కబ్జాకు శ్రీకారం చుట్టేశారు. పథక రచన చేసి ముప్పై ఏళ్ల క్రితం నాటి మాస్టర్ ప్లాన్లో ఉన్న రోడ్డును కుదింపు చేశారు. అనుచరులను రంగంలోకి దించి అక్కడ కొంతభాగంలో ఆక్యుపెన్సీలో ఉన్న వారితో చర్చలు జరిపారు. వారున్న 20 శాతం ఆక్యుపెన్సీలో 50 శాతం వాటాకు ఒప్పందం కుదిరింది. మిగతా 80 శాతం ప్రభుత్వ భూమి స్వాధీనానికి ప్రయత్నాల్లో ఉన్నారు. సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని ఎల్ల మ్మగుట్ట ప్రాంతంలో ప్రధాన రహదారికి ఆనుకుని 60 నుంచి 90 వరకు ఉన్న సర్వే నంబర్లలో సుమారు 15 ఎకరాల పైగా ప్రభుత్వ భూమి ఉంది. వాస్తవానికి ఈ భూమి ఇనాం, వక్ఫ్ బోర్డు పేరిట రికార్డులో ఉన్నట్లు సమాచారం. 30 ఏళ్ల కిత్రం ఈ భూమిని ఆర్టీసీ డిపో–2 కోసం అప్పటి తహసీల్దారు కేటాయించారు. అయితే కొందరు ఆ సర్వే నంబర్లలో తమ భూమి ఉందంటూ కోర్టుకు వెళ్లా రు. దీంతో ఆర్టీసీ డిపో–2కు న్యాల్కల్ రోడ్లో మరోచోట భూమిని కేటాయించారు. ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో 100 ఫీట్ల రోడ్డు వస్తుందని అప్పటి మాస్టర్ప్లాన్ ప్రకారం అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటించారు. దీంతో ఆ సర్వే నంబర్లలో తమకు ఉన్న కొద్ది భూమిలో 100 అడుగుల రోడ్డు వేస్తే మిగిలే భూమి నామమాత్రమేనని, కోర్టుకు వెళ్లిన వ్యక్తులు తర్వాత పట్టించుకోకుండా ఉండిపోయారు. ఈ భూమికి అప్పట్లో పెద్దగా విలువ లేకపోవడంతో అంతగా దృష్టి పెట్టలేదు. కోర్టుకు వెళ్లిన వారికి సర్వే నంబర్లలోని 20 శాతం భూమికి సంబంధించి ఇటీవలే క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చింది. మిగిలిన 80 శాతం ప్రభుత్వ భూమి. ప్రస్తుతం దీని విలువ సుమారు రూ. 300 కోట్లు ఉంటుంది. బయటకు పొక్కిందిలా.. మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి 25 సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ప్లాన్ మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ భూమిపై కన్నేసిన కీలక ప్రజాప్రతినిధి ఈ భూమి కోసం ప్రణాళికలు రచించారు. ఇక్కడ ప్రభుత్వ భూమితో పాటు కొంతమంది ఎల్లమ్మగుట్టకు చెందినవారి భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ కలిగి ఉన్న పట్టాదారులెవరూ లేరని, ఎల్లమ్మగుట్టకు చెందిన కొందరు కబ్జాలో ఉన్నట్లు తెలిసింది. అయితే 100 అడుగుల రోడ్డు రద్దు అయ్యిందని, 40 అడుగుల రోడ్డు వేయిస్తున్నామని మీ భూమిని మాకు ఇవ్వాలంటూ రహస్యంగా తన అనుచరుల ద్వారా కబ్జాలోని వ్యక్తులతో సంప్రదింపులు జరిపారు. అవసరమైతే భూమిని డెవలప్ చేసి ఫిఫ్టీ–ఫిఫ్టీ ప్రాతిపదికన (200 గజాలు ఉంటే 100 గజాలు ఇచ్చేలా) ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిదే ఈ తతంగం నడిపించడంతో సదరు వ్యక్తులు భయపడి ఆఫర్కు అంగీకరించినట్లు సమాచారం. అయితే మిగిలిన 80 శాతం ప్రభుత్వ భూమికి ఏవిధంగా రికార్డులు సృష్టించారో తెలియాల్సి ఉంది. సంబంధిత అధికారులను నయానో, భయానో ఒప్పించి ఈ తతంగం నడిపిస్తున్నట్లు విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. చదవండి: పుట్టుకతోనే మూగ, చెవుడు.. అవేవి అతన్ని ఆపలేకపోయాయి -
మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు
న్యూఢిల్లీ: భారత్ మొబైల్ ఫోన్ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (2021–22, ఏప్రిల్–జూన్)లో మూడు రెట్లు పెరిగింది. రూ.4,300 కోట్లుగా నమోదయ్యింది. 2020 ఇదే కాలంలో ఎగుమతుల విలువ దాదాపు రూ.1,300 కోట్లు. ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ఒక నివేదికలో ఈ విషయాలను తెలిపింది. ఈ రంగంలో రికవరీ, వృద్ధి అంశాలను తాజా గణాంకాలు సూచిస్తున్నట్లు నివేదిక వివరించింది. నివేదికలో ముఖ్యాంశాలు ►మొబైల్ హ్యాండ్సెట్ తయారీ పరిశ్రమ నిరంతరం వృద్ధి పథంలో కొనసాగుతోంది. కోవిడ్–19 సెకండ్వేవ్లోనూ ఫలితాలను నమోదుచేసుకుంది. ►ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు సైతం మొదటి త్రైమాసికంలో 100 శాతం పెరిగి విలువలో రూ.20,000 కోట్లను అధిగమించింది. ►ఇక ఇదే కాలంలో మొబైల్ ఫోన్ల దిగుమతుల విలువ భారీగా తగ్గి రూ.3,100 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పతనమైంది. 2014–15 అల్టైమ్ కనిష్ట స్థాయి ఇది. ►కాగా ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్ల దిగుమతుల విలువ మాత్రం మొదటి త్రైమాసికంలో 50 శాతంపైగా పెరిగి రూ.6,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు ఎగసింది. మరింత పురోగతికి చర్యలు... మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగంలో మరింత పురోగతి సాధించడానికి కృషి చేస్తున్నాం. ఇందుకు తగిన విధాన కల్పనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. భారీగా ఈ విభాగాల్లో ఉత్పత్తులను పెంచాలన్నది ప్రధాన లక్ష్యం. ప్రపంచ దేశాల్లో అవసరాల్లో 25 శాతం భారత్ వాటా కావాలన్నది సంకల్పం. – పంకజ్ మొహింద్రూ, ఐసీఈఏ చైర్మన్ చదవండి : ఏడాదిలో మరింత పెరగనున్న ఇళ్ల ధరలు! -
పంజాబ్ ఆటగాళ్లకు భారీ నజరానా
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో విజయ దుందుభి మోగించిన టీమిండియా హాకీ జట్టులో తమ ఆటగాళ్లకు పంజాబ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. జర్మనీతో జరిగిన పురుషుల హాకీ మ్యాచ్లో విజయంతో కాంస్య పతకం సాధించిన జట్టులో రాష్ట్రానికి చెందిన హాకీ జట్టు ఆటగాళ్లకు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ఇవ్వనున్నట్టు సర్కార్ వెల్లడించింది. పంజాబ్ క్రీడా మంత్రి రాణా గుర్మిత్ సింగ్ సోధి ఈ ప్రకటన చేశారు. ఇండియన్ హాకికి ఇదొక చారిత్రాత్మక రోజని ఆయన ట్వీట్ చేశారు. మరింత ఉన్నతమైన గోల్డ్ మెడల్తో తిరిగి రావాలని ఎదురుచూస్తున్నామన్నారు. మరోవైపు భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్, కోచ్ గ్రాహం రీడ్, సహాయక కోచ్ పియూష్ దుబేలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీఫోన్లో సంభాషించారు. ఈ సందర్బంగా జట్టులోని సభ్యులందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు మోదీ. కాగా టోక్యో ఒలింపక్స్ జర్మనీతో గురువారం జరిగిన మ్యాచ్ భారత్ టీం 5-4 తేడాతో విజయం సాదించింది. తద్వారా కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోవడంతోపాటు, 41 ఏళ్ల తరువాత తొలిసారి ఒలింపిక్ పతకాన్ని సాధించిన ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. On this historic day for #IndianHockey I am delighted to announce a cash award of Rs 1crore each to players 4m #Punjab We await ur return to celebrate the much deserving medal in #Olympics #Cheer4India #Tokyo2020 #IndvsGer #Hockey #IndianHockeyTeam@capt_amarinder @Media_SAI https://t.co/VJ8eiMu1up — Rana Gurmit S Sodhi (@iranasodhi) August 5, 2021 #WATCH | PM Narendra Modi speaks to the India Hockey team Captain Manpreet Singh, coach Graham Reid and assistant coach Piyush Dubey after the team won #Bronze medal in men's hockey match against Germany#TokyoOlympics pic.twitter.com/NguuwSISsV — ANI (@ANI) August 5, 2021 -
హెచ్డీఎఫ్సీ లాభం రూ.3,001 కోట్లు
ముంబై: ప్రయివేట్ రంగ మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ ఈ ఏడాది (2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 31% జంప్చేసి రూ. 5,311 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 4,059 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. క్యూ1లో స్టాండెలోన్ నికర లాభం స్వల్పంగా తగ్గి రూ. 3,001 కోట్లకు పరిమితమైంది. గత క్యూ1లో రూ. 3,052 కోట్లు ఆర్జించింది. అయితే గత కాలపు నికర లాభంలో పెట్టుబడుల విక్రయం ద్వారా లభించిన రూ. 1,241 కోట్లు కలసి ఉన్నట్లు కంపెనీ ప్రస్తావించింది. తాజా సమీక్షా కాలంలో ఈ పద్దుకింద రూ. 263 కోట్లు మాత్రమే లభించినట్లు తెలియజేసింది. దీంతో ఫలితాలు పోల్చతగదని వివరించింది. క్యూ1లో హెచ్డీఎఫ్సీ నికర వడ్డీ ఆదాయం 22% పుంజుకుని రూ. 4,147 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.6% బలపడి 3.7%కి చేరాయి. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 5,31,186 కోట్ల నుంచి రూ. 5,74,136 కోట్లకు ఎగశాయి. ఫలితాల విడుదల నేపథ్యంలో షేరు 1 శాతం బలపడి రూ. 2,463 వద్ద ముగిసింది. -
ఒప్పో దూకుడు: ఆరేళ్లలో కోటి స్మార్ట్ఫోన్లు
సాక్షి న్యూఢిల్లీ: స్మార్ట్ డివైస్ బ్రాండ్ ఒప్పో ఎఫ్ సిరీస్లో ఒక కోటికిపైగా ఫోన్లను విక్రయించింది. ఆరేళ్లలోనే ఈ ఘనతను సాధించినట్టు కంపెనీ తెలిపింది. డ్యూయల్ సెల్ఫీ కెమెరా, 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, స్లీక్ డిజైన్ మోడళ్లను తొలిసారిగా స్మార్ట్ఫోన్ రంగంలో ఎఫ్ సిరీస్లో అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించింది. ఇటీవల ప్రారంభించిన ఎఫ్ 19 ప్రో సిరీస్ ఎఫ్-సిరీస్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలపై బలమైన ప్రభావాన్ని చూపించిందని ఒప్పో ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దమయంత్ సింగ్ ఖానోరియా వెల్లడించారు. ఎఫ్ 19 ప్రో సిరీస్ లాంచ్ అయిన మూడు రోజుల్లోనే 230 కోట్ల రూపాయల విలువైన రికార్డు అమ్మకాలను నమోదు చేసిందన్నారు. ఇటీవలే కంపెనీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్లీక్ మోడల్ ఎఫ్-19ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
ఇంటి దొంగే.. రూ.10 కోట్లు డిమాండ్
ఘజియబాద్కు చెందిన ఒక 11 సంవత్సరాల బాలుడు యూట్యూబ్లో హ్యాకింగ్ టిప్స్ నేర్చుకున్నాడు. బయట ఎక్కడో ఎందుకు... తాను నేర్చుకున్న విద్యకు ఇంట్లోనే తగిన న్యాయం చేయాలనుకున్నాడు. వెంటనే తండ్రి ఇమెయిల్ అకౌంట్ను హ్యాక్ చేశాడు. దాని పాస్వర్డ్ మార్చేశాడు. తండ్రికి ఫోన్ చేసి 10 కోట్లు డిమాండ్ చేశాడు. ‘నేను హ్యాకర్ని. పదికోట్లు ఇవ్వకపోతే మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం, అభ్యంతకరమైన ఫోటోలు ఆన్లైన్లో పెడతాను’ అని బెదిరించాడు. తండ్రిలబోదిబో అంటూ పోలీస్స్టేషన్కు పరుగెత్తాడు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారికి ఒక విషయం అర్థమైంది....హ్యాకర్ ఎవరో కాదు ఇంటిదొంగే... అని. కుటుంబసభ్యులను విచారించిన తరువాత హ్యాకర్ పిల్లాడు దొరికిపోయాడు. చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ‘లాక్డౌన్ టైమ్లో హ్యాకింగ్ ట్రిక్స్, సైబర్నేరాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూసేవాడిని’ అని రక్షకభటులకు చెప్పాడు 5వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు. ‘ఏదోలే మీ పిల్లాడే కదా’ అని వదిలేయకుండా ఐపీసీలోని రకరకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. -
జ్వరం మింగిన మాత్రలు ఏడున్నర కోట్లు
సాక్షి, హైదరాబాద్: డెంగీ, చికున్ గున్యా, ఇతర విష జ్వరాల దెబ్బకు ఆసుపత్రుల్లో మందులు అవసరానికి మించి వినియోగమయ్యాయి. కీలకమైన మూడు నెలల కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఏకంగా ఏడున్నర కోట్ల జ్వరం మాత్రలు వాడేశారు. సాధారణంగా ఈ కాలంలో రెండున్నర కోట్లు అవసరం కాగా, ఈసారి అదనంగా ఐదు కోట్లు వినియోగించారని తెలంగాణ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) వర్గాలు వెల్లడించాయి. అవన్నీ కూడా పారాసిటమాల్, డోలో వంటి మాత్రలే కావడం గమనార్హం. వాటితోపాటు జ్వరాన్ని తగ్గించే యాంటి పైరేటిక్స్, యాంటి బయాటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్నూ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. డెంగీ నిర్దారణ కిట్లు కూడా దాదాపు మూడు రెట్ల మేరకు పెరిగినట్లు అంచనా వేశామని వారు చెబుతున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు వంటివి కూడా అదేస్థాయిలో వినియోగమయ్యాయి. ప్రధానంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో డెంగీ, సీజనల్ జ్వరాలు విజృంభించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారమే రాష్ట్రంలో 10 వేల మందికి డెంగీ సోకినట్లు నిర్ధారణ జరిగింది. దేశంలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్కారు లెక్కలకు రెండింతలు పైగా డెంగీ కేసులు నమోదైనట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మూడు నెలలకే ఖతం... రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులన్నీ కలిపి 1,056 ఉన్నాయి. ఈ ఏడాది ఆయా ఆసుపత్రులకు అవసరమైన మందులు కొనుగోలు చేయడానికి రూ.226 కోట్లు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. ఆ నిధులతో టీఎస్ఎంఎస్ఐడీసీ మందులు కొనుగోలు చేసి పంపిస్తుంది. ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో ఆసుపత్రుల సూపరింటెండెంట్లు అత్యవసరమైనప్పుడు కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకోసం టీఎస్ఎంఎస్ఐడీసీకి ఇచ్చిన బడ్జెట్లో 20 శాతం ఆసుపత్రులకు కేటాయిస్తారు. జ్వరాల తీవ్రత పెరగడంతో ఆసుపత్రులకు కేటాయించిన ప్రత్యేక నిధులను కూడా వాటికే వినియోగించారు. 200 ఆసుపత్రుల పరిధిలో ఏడాదికి మందుల కొనుగోలుకు కేటాయించిన సొమ్ము మూడు నెలలకే ఖర్చు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ ఆసుపత్రులకు మిగిలిన ఆర్థిక సంవత్సరానికి అవసరమైన మందులను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు టీఎస్ఎంఎస్ఐడీసీకి నిధుల సమస్య ఏర్పడింది. పెద్ద ఎత్తున జ్వరం మాత్రలు కొనుగోలు చేశాం సీజన్ మూడు నెలల కాలంలో పెద్ద ఎత్తున జ్వరాలు విజృంభించిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో జ్వరానికి సంబంధించిన మందుల వినియోగం భారీగా పెరిగింది. గతేడాది కంటే ఈసారి జ్వరం మాత్రల వినియోగం రెండింతలు అదనంగా పెరిగిందని తేలింది. డెంగీ కిట్లు కూడా భారీగానే వినియోగించాం. ఏడాది బడ్జెట్కు అదనంగా మరో రూ.50 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. – చంద్రశేఖర్రెడ్డి, ఎండీ, టీఎస్ఎంఎస్ఐడీసీ -
రూ.కోటి ఆదాయం దాటిన వారెంతమందో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : 2018-19 సంవత్సరానికి గాను వార్షిక ఆదాయం కోటి రూపాయలు దాటిన వారి సంఖ్య 1.5 లక్షల మందిగా నమోదయ్యారు. డైరెక్ట్ టాక్స్ సెంట్రల్ బోర్డ్ (సిబిడిటి) చైర్మన్ సుశీల్ చంద్ర అసోచామ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఈ వివరాలను విడుదల చేశారు. 125కోట్ల జనాభా ఉన్న దేశంలో ఆర్ధికవృద్ధి 7.5శాతంగా ఉందని, కేవలం 1.5 లక్షల రిటర్నులు మాత్రమే కోటి రూపాయలకు పైబడిన ఆదాయం ఉన్నట్లు చూపిస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ లాంటి విస్తృతమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఈ సంఖ్య ఇంకా తక్కువగానే ఉందన్నారు. జీడీపి, వినియోగం పెరుగుతున్న దశలో కేవలం 1.5 లక్షలమంది మాత్రమే రిటర్నులు దాఖలుచేయడం శోచనీయమన్నారు. 2014-15లో 69వేలు మాత్రమే ఉందని, ఆ సంఖ్య ఇపుడు 1.5 లక్షలకు చేరిందని పేర్కొన్నారు. ఇందులో ఎక్కువగా వేతనజీవులే వున్నారనీ, సంస్థలు, కార్పొరేట్ సంస్థల్లోని వారి ఆదాయం వివరాలు నమోదు కాలేదని తెలిపారు. ఏప్రిల్, జనవరి మధ్య ఈ ఏడాది కేవలం రూ.6.31 కోట్ల ఆదాయం పన్నురిటర్న్ దాఖలు అయ్యాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం పోలిస్తే.. ఇది 37 శాతం ఎక్కువ. అలాగే 95 లక్షల మంది మొదటిసారిగా ఆదాయ వివరాలను నమోదు చేసినట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1.25 కోట్ల అదనపు పన్ను చెల్లింపుదారులను ఆశిస్తే 1.06 కోట్ల కొత్త పన్ను చెల్లింపుదారులు మాత్రమే నమోదయ్యారని సీబీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. -
రూ 1.50 కోట్లు కడలి పాలు
- అమీనాబాద్ తీరంలో డ్రెడ్జింగ్ పనుల తీరు - నెల తిరక్కుండానే మూసుకుపోయిన ఉప్పుటేరు - బోట్లు ధ్వంసమవుతున్నాయని మత్స్యకారుల ఆందోళన పిఠాపురం: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా తయారయింది ఉప్పుటేరులో డ్రెడ్జింగ్ పనులు. ఇసుక మేటలు వేసి బోట్లు వెళ్లడానికి వీలు లేదని దాన్ని లోతు చేయడానికి చేసిన పనులు కొత్త సమస్యను తెచ్చిపెట్టాయని మత్స్యకారులు వాపోతున్నారు. సముద్రంలో చేపల వేటకోసం వెళ్లే బోట్లు ఒడ్డుకు రావడానికి ఉప్పుటేరు అనువుగా లేకపోవడంతో లోతు చేసే పనులు చేపట్టారు. రూ.1.50 కోట్లు వెచ్చించిన ఈ పనుల ఆనవాళ్లు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. కేవలం 40 రోజుల్లోనే మళ్లీ పరిస్థితి మొదటికొచ్చిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి మండలం అమీనాబాద్ శివారు సాగరతీరంలో మినీ హార్భర్ కోసం కేటాయించిన ప్రాంతంలో కొత్తపల్లి, తొండంగి మండలాలకు చెందిన వందలాది మత్స్యకార బోట్లు నిలుపుతుంటారు. ఇక్కడ నిత్యం చేపల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. కాకినాడ హార్భర్లో ఇతర బోట్లను నిలపడానికి నిరాకరించిన నాటి నుంచి సుమారు పదేళ్లుగా రెండు మండలాలకు చెందిన మత్స్యకారుల బోట్లు ఇక్కడే నిలుపుతున్నారు. ఇక్కడ ఉన్న ఉప్పుటేరు సాగరతీరానికి మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉండడంతో బోట్లు ఒడ్డుకు చేరడానికి అనువుగా ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలో మినీ హార్బర్ నిర్మాణానికి గత పదేళ్ల కిందటే 50 ఎకరాల భూమిని సేకరించి రూ.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనంతరం ప్రభుత్వాలు మారడంతో ఇది నిర్మాణానికి నోచుకోకపోవడంతో ప్రస్తుతం నిర్మాణం వ్యయం రూ. 200 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో తమ బోట్లు ఒడ్డుకు తీసుకువచ్చే సమయంలో ఉప్పుటేరు మూసుకుపోవడం వల్ల బోట్లు పాడైపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య ఇలా ప్రారంభం... దీంతో ఉప్పుటేరులో మట్టిని తొలగించి లోతు చేయడానికి కార్పొరేషన్ సోషల్ రెస్పాన్స్బిలిటీ కింద నిధులు రూ. 1.50 కోట్లు వ్యయంతో డ్రెడ్జింగ్ పనులు గత మార్చి 17వ తేదీన ప్రారంభించారు. ఓషన్ స్పార్కల్ లిమిటెడ్ కంపెనీ ఈ పనులను నిర్వహించగా ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రారంభించారు. డ్రెడ్జింగ్ యంత్రంతో ఉప్పుటేరులో ఉన్న ఇసుక మట్టిని తీసి పక్కనే వేశారు. అయితే కేవలం ఇసుకను తీయడం తప్ప గట్లు పటిష్టం చేయకపోవడంతో ఇటీవల సముద్ర ఉథృతికి డ్రెడ్జింగ్ చేసిన ప్రాంతమంతా తిరిగి ఇసుకతో మూసుకు పోవడంతోపాటు గట్లు అండలు జారి ఉప్పుటేరులో కలిసిపోవడంతో బోట్లు బయటకు తీయడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడిందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు పూర్తయిన పది రోజులు కూడా వినియోగించకుండానే నిరుపయోగంగా మారడంతో పనులు తూతూమంత్రంగా సాగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక మట్టితో ఉప్పుటేరు మూసుకు పోవడంతో తిరిగి వేట ప్రారంభమయ్యేనాటికి బోట్లు సముద్రంలోకి వెళ్లే పరిస్థితి లేదని మత్స్యకారులు వాపోతున్నారు. వెంటనే మూసుకు పోయింది బోట్లు వెళ్లడానికి వీలు లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తే ఇసుక తొలగించామన్నారు. కానీ వెంటనే మూసుకు పోయింది ఇప్పుడు బోట్లు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకు చేశారో తెలియడం లేదు. ఏకంగా రూ.1.50 కోట్లు వృథాగా పోయినట్లే వంకా నాగేశ్వరరావు , మత్స్యకారుడు, అమీనాబాద్. బోట్లు దెబ్బతింటున్నాయి.. డ్రెడ్జింగ్ చేశామని చెబుతున్న ప్రాంతంలో బోట్లు వెళ్లే పరిస్థితి లేదు. వేట నిషేధం అమలులో ఉండగా బోట్లు మరమ్మతుల కోసం బయటకు తీద్దామంటే కదిలే పరిస్థితి లేదు. గతంలోనే బాగుండేది ఇప్పుడు ఉప్పుటేరు పూర్తిగా మూసుఉపోయి బోట్ల ఫ్యాన్లు విరిగిపోతున్నాయి. బోట్లు దెబ్బతింటున్నాయి. కంబాల జగన్నాధం,, మత్స్యకారుడు, అమీనాబాద్ -
కోటి 40 లక్షల మందికి ఏర్పాట్లు
మట్టపల్లి (మఠంపల్లి) : కృష్ణా పుష్కరాల్లో జిల్లా వ్యాప్తంగా కోటి 40 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు వీలుగా స్నాన ఘాట్లు నిర్మిస్తున్న ఐబీ చీఫ్ ఇంజినీర్ సిరివోలు సునీల్ తెలిపారు. మంగళవారం ఆయన మట్టపల్లి వద్ద కృష్ణానదిలో రూ.4 కోట్లతో నిర్మిస్తున్న బాలాజీ, ప్రహ్లాద హైలెవల్ వంతెన కుడి, ఎడమ ఘాట్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ 2004 పుష్కరాల్లో జిల్లా వ్యాప్తంగా 0.55 కిలో మీటర్ల పొడవునా ఘాట్లు నిర్మించగా సుమారు 40 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారన్నారు. అయితే ఈ సారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తున్నందున సుమారు కోటి 40 లక్షల మంది పుణ్య స్నానాలు చేసేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని మట్టపల్లి, మేళ్లచెరువు, వాడపల్లి, సాగర్, చందంపేట మండలాల పరిధిలో 2.6 కిలోమీటర్ల పొడవున 28 ఘాట్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పుష్కర ఘాట్ల నిర్మాణం ఇప్పటి వరకు 95 శాతం పూర్తయిందని, వచ్చే నెల 5వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో నిర్మాణాలు పూర్తి రంగులు వేసి ప్రారంభానికి సిద్ధం చేస్తామన్నారు. ఆయన వెంట ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరు మట్టపల్లి రావు, ఐబీ ఎస్ఈ ధర్మానాయక్, ఈఈ సంజీవరెడ్డి, డీఈ స్వామి, ఏఈలు పిచ్చయ్య, భిక్షం, ఈఓ ఎం.పి లక్ష్మణరావు పాల్గొన్నారు. -
1.14 కోట్ల మొక్కలు నాటాం
వీసీలో జిల్లా కలెక్టర్ లోకేష్కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1.14 కోట్ల మొక్కలు నాటామని కలెక్టర్ లోకేష్కుమార్ తెలిపారు. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ ‘హరితహారం’ పథకం అమలుపై జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏయే ప్రభుత్వశాఖ ఎన్ని మొక్కలు వేయాలో ముందుగానే నిర్దేశించామని తెలిపారు. లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్అండ్బీ రహదారులకు ఇరువైపులా క్రమపద్ధతిలో మొక్కలు నాటేలా సోషల్ ఫారెస్ట్ అధికారులకు బాధ్యత ఇచ్చామన్నారు. జిల్లాలో అదనంగా 3.50 లక్షల మామిడి మొక్కలు అవసరం ఉన్నాయన్నారు. ఈ మేరకు సీఎస్ మామిడి మొక్కలను సరఫరా చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. 22వ తేదీన బండ్ ప్లాంటేషన్ నిర్వహిస్తామన్నారు. పోలీసుశాఖ ద్వారా 3 లక్షల మొక్కలు నాటాలని ప్రణాళికలు రూపొందించామని ఎస్పీ షానవాజ్ఖాసీం తెలిపారు. నిర్దేశించిన లక్ష్యానికి మించి 2 లక్షల మొక్కలు అదనంగా నాటేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా హోంగార్డు నుంచి ఇతర అధికారుల వరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఈ వీసీలో హరితహారం ప్రత్యేక అధికారి రఘువీర్, జేసీ దివ్య, అటవీశాఖ అధికారి నర్సయ్య, సీఈఓ నాగేశ్ పాల్గొన్నారు. -
ముంబై మెట్రోకు 300 కోట్లు నష్టం!
ముంబై ః దేశ ఆర్థికనగరంలో మెట్రో రైలు కష్టాలను ఎదుర్కొంటోంది. ప్రయాణీకుల వృద్ధి పదిశాతం పెరిగినప్పటికీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. వందల కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయినట్లు తాజా నివేదికలో పేర్కొంది. ముంబైలో ప్రవేశ పెట్టిన మెట్రో రైలు కు సుమారు రెండేళ్ళలో రూ. 300 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. ప్రారంభంలో కేవలం రూ. 10 లతో ప్రయాణీకులు ఎక్కడికి కావాలంటే అక్కడకు వెళ్ళేలా మెట్రో అనుమతి కల్పించింది. రైలును ప్రారంభించిన మొదటి రెండు మూడు నెలల్లో ప్రయాణీకుల శాతం భారీగా పెరగడంతో పాటు శని, ఆదివారాల్లో ఆ సంఖ్య రెట్టింపు అవుతుండటంతో రద్దీకి అనుగుణంగా స్మార్ట్ కార్డులు, సీజన్ పాస్ లు వంటి ప్రత్యేక సౌకర్యాలను కల్పించింది. అయితే అనంతరం నిర్వహణ భారం, సిబ్బంది ఖర్చుల భారంతో పాటు.. భవన వ్యయం కూడ తీవ్రంగా పెరగడంతో మెట్రో భారీ నష్టాన్ని చవి చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా ప్రారంభంలో రూ.2,847 కోట్లుగా ఉన్న భవన వ్యయం.. రూ. 4,026 కు పెరిగిపోవడంతో మెట్రో రూ. 300 కోట్ల రూపాయల నష్టాన్ని చూడాల్సి వచ్చిందని తాజా నివేదికలో వెల్లడించింది. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన మెట్రో నిర్మాణ ఖర్చు రాయితీ తీవ్ర జాప్యం కావడంతోనే భారీగా వ్యయం పెరగడంతోపాటు తీవ్ర నష్టాలకు చేరుకున్నట్లు నివేదిక ఆధారంగా తెలుస్తోంది. -
ఫ్లిప్ కార్ట్ సీఈవో ఇంటి ఖరీదు 32 కోట్లు!
బెంగళూరు నగరంలో ఇటీవల అతిపెద్ద నివాస ఒప్పందం జరిగింది. పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ గృహాన్ని 32 కోట్ల రూపాయలతో కొనేందుకు ఫ్లిప్ కార్ట్ సీఈవో బిన్నీ బన్సాల్ ముందుకొచ్చారు. నగరంలోని ఫ్లిప్ కార్ట్ కార్యాలయానికి అతి దగ్గరలో ఉన్న ఆ ఇంటిని కొనేందుకు ఆయన భారీగా రుణం తీసుకున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఐటీ కంపెనీలకు నెలవు, ఇండియాలోనే సుందర నగరంగా పేరొందిన బెంగళూరులో నివాస గృహాలకూ భారీ డిమాండ్ పెరిగిపోయినట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. నగరంలో ఫ్లిప్ కార్ట్ సీఈవో బిన్నీ బన్సాల్ ఇటీవల అతిపెద్ద నివాస గృహాన్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. 10,000 అడుగుల విస్తీర్ణంలో ఉన్న నివాస గృహాన్ని బిన్నీ బన్సాల్ సుమారు 32 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ఆ నివాసం స్థానిక ఫ్లిప్ కార్ట్ కార్యాలయానికి అతి సమీపంలోనే ఉన్నట్లు రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. నందన్ నీలేకని, క్రిస్ గోపాలకృష్ణన్, రాజీవ్ చంద్రశేఖర్ నివాసాలు బిన్నీ ఇంటికి పొరుగున ఉన్నాయని, బిన్నీ ఆ ఇంటిని కొనేందుకు భారీగానే రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఒకేరోజు 2 కోట్ల మొక్కలు..
పర్యావరణాన్ని సంరక్షించడం, ప్రజల్లో అవగాహన పెంచడంలో భాగంగా మహరాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నం ప్రారంభించింది. జూలై 1న 450 జాతులకు చెందిన రెండు కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా ప్రజా భాగస్వామ్యాన్ని కోరుతూ ప్రకటన చేసింది. తాము చేపట్టిన ప్లాంటేషన్ డ్రైవ్ లో ప్రజలంతా భాగస్వాములై, తమకిష్టమైన ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చింది. ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు, వాతావరణాన్ని రక్షించే ప్రత్యేక కార్యక్రమాన్ని మహరాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం ఇదే మొదటిసారి అని తెలిపిన అటవీశాఖ మంత్రి సుధీర్ ముంగన్ తివార్.. కార్యక్రమానికి ప్రధానమంత్రికి ప్రత్యేక ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో భాగంగా 450 జాతులకు చెందిన 2 కోట్ల మొక్కలను రాష్ట్రవ్యాప్తంగా నాటుతున్నామని, ప్రజలంతా భాగస్వాములయ్యేందుకు వీలుగా వేదికను, సమయాన్ని త్వరలో ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. 2014 అక్టోబర్ లో తాను మంత్రి అయిన సందర్భంలో ప్రజలు తనకు ప్రశంసాపూర్వకంగా పూలదండలు, బొకేలు తెచ్చిచ్చారని, అలా డబ్బు వృధా చేసే బదులు వారంతా మొక్కలు ఇచ్చి ఉంటే బాగుండేదన్న తన భార్య సలహానే తాను ఈ కార్యక్రమం చేపట్టేందుకు మార్గమైందని ముంగన్ తివార్ తెలిపారు. కార్యక్రమం మొత్తాన్ని ప్రజల భాగస్వామ్యంతోనే నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే మొక్కలను పాతేందుకు 1.75 కోట్ల గుంతలను తీసి సిద్ధం చేశామన్నా ఆయన.. కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయడంలో రెండు ప్రత్యేకమైన కారణాలున్నాయని, ముఖ్యంగా తమ సిబ్బంది తక్కువగా ఉండటం ఒకటైతే, వాతావరణ పరిరక్షణలో ప్రజలు తమతో కలసి పనిచేయాలన్నది రెండో ఉద్దేశ్యమని మంత్రి తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్రంలోని 36 జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఓ లక్ష్యాన్నిసిద్ధం చేసిన అటవీశాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు కూడ ఈ డ్రైవ్ లో చేరాలని కోరింది. దీనికి తోడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, పంతంజలి యోగ పీఠ్, రైల్వే కలసి డ్రైవ్ లో పాల్గొంటున్నట్లు తెలిపింది. మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణా బాధ్యతలను చేపట్టేందుకు ఓ శాశ్వత కమిటీని కూడ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, మొక్కలు పాడైతే కమిటీదే బాధ్యత అని, వాటి శ్రద్ధ వహించేందుకు మహిళా స్వయం సహాయక బృందాలకు కూడ 70 శాతం బాధ్యత అప్పగించే యోచనలో ఉన్నట్లు మంత్రి ముంగన్ తివార్ తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో మొక్కల పెరుగుదలను బట్టి కమిటీ సభ్యులకు చెల్లించే వేతనం ఉండాలని, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ పర్ దేశీ సూచించారు. మూడు సంవత్సరాల్లో కనీసం 80 శాతం మొక్కలు పెరిగేట్లుగా ఉండాలని, వాటికి సంరక్షకులే జవాబుదారీగా ఉండాలని లేదంటే విషయాన్ని వారు సీరియస్ గా తీసుకునే అవకాశం ఉండదని ప్రవీణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్ సహకారంతో కరువు ప్రాంతమైన మారాఠ్వాడా లోనూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని రక్షణ మంత్రిత్వ శాఖ సైతం రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. గ్రీన్ బెటాలియన్ పేరిట మొక్కలు నాటేందుకు అనుకూలమైన ప్రాంతాలను ఎంచి వారికి కేటాయిస్తామని తెలిపింది. -
బొమ్మల వెనుక బాగోతం
-
ది ఫోర్త్ ఎస్టేట్: ఓట్లు, కోట్లు, చట్టాలు
-
సీటు కోటిపైనే..!
- ప్రత్యేక ఎంసెట్కు ముందే యాజమాన్య కోటా సీట్ల అమ్మకం - 500 ఎంబీబీఎస్ సీట్లు హాంఫట్! - ప్రైవేటు మెడికల్ కాలేజీల బరితెగింపు - సీట్లు కొన్నవారికి పేపర్ లీక్! - ‘దోపిడీ’కి సర్కారు వెసులుబాటు... ఇంకా ఎంసెట్ ఫలితాలు రాలేదు... ‘బి’ కేటగిరీ వైద్య సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష జరగనే లేదు... కానీ ఈలోపే రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు బరితెగించాయి. యథేచ్ఛగా సీట్ల దందా సాగించాయి. ఎంబీబీఎస్కు ఉన్న డిమాండ్ను సొమ్ము చేసుకుంటూ యాజమాన్య కోటాలోని సీట్లను ఫిబ్రవరి నుంచే భర్తీ చేసేసుకున్నాయి! కాలేజీని, ప్రాంతాన్నిబట్టి ఒక్కో సీటుకు రూ. 1.10 కోట్ల నుంచి 1.25 కోట్లు దండుకున్నాయి! హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం 2,950 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా వాటిలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 2,100 సీట్లు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్నాయి. 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ‘ఎ’ కేటగిరీలోని 50 శాతం (1,050) సీట్లు, ‘బి’ కేటగిరీలోని 10 శాతం (210) సీట్లను ఎంసెట్ మెరిట్ ద్వారానే ప్రభుత్వం భర్తీ చేసేది. మిగిలిన 40 శాతంలో (25 శాతం యాజమాన్య, 15 శాతం ప్రవాస భారతీయ) సీట్లను ప్రైవేటు కళాశాలలే తమకు నచ్చినట్లు సీట్లు భర్తీ చేసుకునేవి. అయితే ఈ ఏడాది ప్రభుత్వం ఆ విధానాన్ని మార్చింది. బీ కేటగిరీలోని 35 శాతం సీట్లను యాజమాన్య కోటాలో కలిపేస్తూ రెండ్రోజుల క్రితం ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ‘ఎ’ కేటగిరీలో 50 శాతం సీట్లు 1,050 ఉంటాయి. అవన్నీ ఎంసెట్ కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. బీ కేటగిరీలో 35 శాతం సీట్లు (735) ఉన్నాయి. వీటికి ప్రస్తుత ఎంసెట్ ర్యాంకుతో సంబంధం లేకుండా ప్రైవేటు వైద్య కళాశాలల ఆధ్వర్యంలోనే ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించుకొని వారే భర్తీ చేసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వచ్చే నెల మొదటి వారంలో ప్రత్యేక ప్రవేశ పరీక్షకు ప్రైవేటు కళాశాలలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. వారే కన్వీనర్ను నియమించుకొని త్వరలో ప్రత్యేక పరీక్షకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మిగిలిన 15 శాతం కోటాలో 315 సీట్లున్నాయి. ఇప్పుడు ఈ మొత్తం సీట్లతోపాటు బి కేటగిరిలో 200 దాకా సీట్లను కూడా యాజమాన్యాలు అమ్మేసుకున్నాయి. ‘దోపిడీ’కి సర్కారు వెసులుబాటు... యాజమాన్య కోటా సీట్లలో ప్రైవేట్ వారి దోపిడీ చాలదన్నట్లు సర్కారు మరో మార్గం కూడా చూపింది. కాలేజీలకు అనుకూలంగా రెండ్రోజుల కిందట మార్గదర్శకాలు జారీ చేసింది. బి కేటగిరిలో 35 శాతం సీట్లకు రూ. 9 లక్షలుగా ఫీజును నిర్ధారించింది. ప్రైవేటు వారు నిర్వహించే ప్రవేశ పరీక్ష రాసి ర్యాంక్ సాధించినా ఏటా రూ. 9 లక్షలు చెల్లించడానికి స్థోమత లేక ఆ సీటు భర్తీ కాకపోతే యాజమాన్యాలు ఆ సీటును భర్తీ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటును అడ్డంపెట్టుకునే కాలేజీలు ప్రవేశ పరీక్ష కూడా పెట్టకుండానే బి కేటగిరిలో దాదాపు 200 సీట్లను అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీట్లు కొన్నవారికి పేపర్ లీక్! యాజమాన్య కోటా 15 శాతం కంటే అధికంగా సీట్లు తెగనమ్ముకున్న కాలేజీలు బి కేటగిరిలో 35 శాతం సీట్లకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాన్ని సీట్లు కొన్నవారికి ముందే లీక్ చేసే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంబీబీఎస్ సీటు కావాలంటూ దక్షిణ తెలంగాణలోని ఓ వైద్య కళాశాలను సంప్రదించిన ఓ తండ్రికి ఆ కాలేజీ యాజమాన్యం ఇదే మాట చెప్పింది. ‘మీరు ముందే రూ.1.25 కోట్లు చెల్లించండి. మీ అమ్మాయికి ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం ముందే లీక్ అయ్యేట్టు చూస్తాం’ అని హామీ ఇచ్చింది. దీనిపై ఆయన సాక్షి కార్యాలయానికి ఫోన్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ర్యాంకు రాకుంటే డబ్బు వాపస్ కాలేజీలు ఒకవేళ సీట్లన్నీ ముందే భర్తీ చేసుకున్నా ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా వచ్చే ర్యాంకుల బట్టే ప్రైవేటు వైద్య కళాశాలలు యాజమాన్య సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ర్యాంకు రాని వారుంటే విద్యార్థుల నుంచి ముందే తీసుకున్న సొమ్మును వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది. మొదటిసారి కాబట్టి కొంత గందరగోళం సాధారణం. మున్ముందు ఈ పరిస్థితి మారనుంది. - లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి -
కో అంటే కోటి అంటున్న హీరోయిన్లు
-
మంత్రులు, అధికారులు యోగా కెళ్తే..
సాక్షి, హైదరాబాద్: మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులందరికీ యోగా లో అధికారికంగా శిక్షణ ఇప్పించాలన్న సీఎం చంద్రబాబు నిర్ణయంతో రాష్ట్రంలో పాలన 3 రోజులపాటు పడకేయనుంది. గురువారం నుంచి ఈ నెల 31 వరకు సచివాలయంతో పాటు శాఖాధిపతుల కార్యాలయాలూ వెలవెలబోనున్నాయి. అయితే దీనికి రూ. 2 కోట్లు వ్యయం చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఒకపక్క పైసలు లేవంటూ.. ఆర్థిక పొదుపు చర్యలు పాటించాలంటూ జారీ చేసిన జీవోను పక్కనబెడుతూ.. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యోగ శిక్షణకు సంబంధించి ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ను పెంచేందుకు ఈషా ఫౌండేషన్ ద్వారా ‘ఇన్నర్ ఇంజనీరింగ్ ఫర్ జాయ్ఫుల్ లివింగ్’ అనే అంశంపై 3 రోజులు శిక్షణ ఇప్పిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. తొలి దశలో మంత్రులకు, ఉన్నతాధికారులకు శిక్షణ ఇప్పిస్తున్నామని, మలి దశలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు శిక్షణ ఇప్పిస్తామని తెలిపింది. -
ఎన్పీడీసీఎల్ ఆదాయూనికి గండి !
రూ.120 కోట్లకు బ్రేక్ స్పాట్ బిల్లింగ్ వర్కర్ల సమ్మె ఎఫెక్ట్ నిలిచిపోనున్న బిల్లుల వసూళ్లు గత నెల బిల్లుల ఆధారంగా వసూళ్లకు సిద్ధమైన ఉన్నతాధికారులు హన్మకొండ సిటీ : కొనసాగుతున్న స్పాట్ బిల్లింగ్ వర్కర్ల సమ్మెతో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నెలవారీ ఆదాయానికి గండి పడనుంది. ఎన్పీడీసీఎల్ పరిధిలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో స్పాట్ బిల్లింగ్ వర్కర్లు ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో గృహ వినియోగదారుల బిల్లులు తీసేవారు లేకుండా పోయూరు. గృహవినియోగదారుల ఇళ్లలో బిల్లులు తీసే స్పాట్ బిల్లింగ్ వర్కర్లు ఐదుజిల్లాల పరిధిలో సుమారు 12 వేల మంది ఉన్నారు. వీరు నెలకు 30 లక్షల మంది వినియోగదారుల మీటర్ రీడింగ్ తీసి బిల్లులు అందజేస్తారు. ఈ బిల్లుల ఆధారంగా వినియోగదారులు ప్రతి నెలా బిల్లు చెల్లించేవారు. ఇలా గృహవినియోగదారుల ఇళ్లలో స్పాట్ బిల్లింగ్ వర్కర్లు తీస్తున్న బిల్లుల ద్వారా ప్రతి నెల రూ.120 కోట్ల ఆదాయం సంస్థకు సమకూరుతుంది. అయితే స్పాట్ బిల్లింగ్ వర్కర్లు తమ సమస్యల సాధనకు ఈ నెల ఒకటో తేదీ నుంచి నిరవధిక సమ్మె చెస్తున్నారు. దీంతో ఐదు జిల్లాల పరిధిలో బిల్లులు తీయడం నిలిచిపోరుుంది. ఫలితంగా విద్యుత్ సంస్థపై ఆర్థికలోటు ప్రభావం పడనుంది. మెట్టు దిగడం లేదు... ఈ నెల ఒకటో తేదీ నుంచి సమ్మెకు వెళ్లిన స్పాట్ బిల్లింగ్ వర్కర్లు అదే రోజు అధికారులతో చర్చలు జరిపినా... ఎలాంటి అంగీకారానికి రాలేకపోయారు. మరోసారి చర్చలకు కూర్చుందామని చెప్పిన అధికారులు ఆరు రోజులుగా మొహం చాటేశారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, ఎన్పీడీసీఎల్ యాజమాన్యం స్పాట్ బిల్లింగ్ వర్కర్లపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిన్నాయని, సమస్యలు పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మండిపడుతున్నారు. సోమవారం నుంచి సమ్మెతోపాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆదివారం ఐదు జిల్లాలకు చెందిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు, స్పాట్ బిల్లింగ్ వర్కర్ల ప్రతినిధులు హన్మకొండలో సమావేశం కానున్నారు. ఇందులో పోరాటాన్ని ఉధృతం చేసే నిర్ణయాలు తీసుకోనున్నట్లు యూనియన్ ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు సికిందర్ చెప్పారు. దీన్నిబట్టి స్పాట్ బిల్లింగ్ వర్కర్ల సమ్మె ఇప్పట్లో ముగిసేలా లేదని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో బిల్లుల చెల్లింపులు నిలిచిపోకుండా... పూర్తిస్థారుులో వసూళ్లు చేసేందుకు ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత నెల బిల్లు ప్రకారం ప్రస్తుత బిల్లులు చెల్లించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
బడ్జెట్ సంక్లిప్తంగా (రూ. కోట్లలో)
బడ్జెట్ సంక్లిప్తంగా (రూ. కోట్లలో) -
నిధులు సరే..అభివృద్ధేది?
అసంపూర్తిగా కారిడార్ పనులు తీరు మారని పురాతన ఆలయాలు అలంకారప్రాయంగా అతిథి భవనాలు శ్రీకాళహస్తి, న్యూస్లైన్: భారతీయ సంస్కృతిని ప్రతిభిం భించే పురాతన ఆలయాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు కుమ్మరించినా ఫలితం మాత్రం కని పించడం లేదు. పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి 2008లో మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి సూచనతో అప్పటి కేంద్ర టూరిజం శా ఖ నడుం బిగించింది. తిరుపతి నుంచి నెల్లూరు జిల్లా వరకు ఒక జోనుగా గుర్తించి అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకంకు వచ్చే భక్తులు సమీపంలోని పురాతన ఆలయాలను సందర్శించేలా అభివృద్ధి చేసేందుకు చిత్తూరు జిల్లాకు రూ.21 కోట్లు కేటాయించింది. టూరి జం కారిడార్ పేరిట శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నాలుగు పురాతన ఆలయాలను అభివృద్ధి చేసేందుకు రూ.7.55 కోట్లు కేటాయించింది. కొద్ది రోజులకే వై ఎస్ మరణించడం, ఆ తర్వాత వచ్చిన పాలకులు పట్టించుకోకపోవడంతో ఆరే ళ్లు గడిచినా పనులు అతీగతి లేదు. ఈ పథకం కింద నిర్మించిన అతిథి భవనాలు ప్రారంభానికి నోచుకోక అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. తొండమనాడుకు రూ.2.53 కోట్లు శ్రీకాళహస్తి మండలం తొండమనాడుకు సమీపంలోని ఎగువవీధి శ్రీప్రసన్న వెం కటేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి రూ. 2.53 కోట్లు కేటాయించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన ప్రసన్న వెంకటేశ్వరస్వామి కూర్చుని ఉండడం ఈ ఆల యం ప్రత్యేకత. ప్రహరీ గోడ నిర్మాణం, పిల్లల పార్కు, మరుగుదొడ్లు, వసతి సముదాయం, స్వాగత తోరణం, కోనే రు పునర్ నిర్మాణం, మంచినీటి సదుపాయం తదితర పనులు చేయాల్సి ఉన్నా అసంపూర్తిగా ఆగిపోయాయి. బొక్కసంపాళెంకు రూ.2.02కోట్లు శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాళెం లోని శ్రీకోదండరామేశ్వరస్వామి ఆల యాన్ని రూ.2.02 కోట్లతో అభివృద్ధి చేయాల్సి ఉంది. శ్రీరాముడే స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణగాథ. అందుకే కోదండరామేశ్వరస్వామి ఆలయంగా పిలుస్తారు. కోనేరు, ఆలయ ప్రాంగణం అడుగుభాగంలో చలువరాళ్ల ఏర్పాటు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. శ్రీకాళహస్తీశ్వరాలయాభివృద్ధికి రూ.1.07 కోట్లు శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్తులకు అవసరమైన సదుపాయాలను కల్పించడానికి టూరిజం శాఖ రూ.1.07 కోట్లు కేటాయిం చింది. ఈ నిధులతో మరుగుదొడ్లు, వస తి కేంద్రం, సమాచార కేంద్రం ఏర్పా టు, మంచినీటి సదుపాయం వంటి ప నులను నామమాత్రంగా పూర్తి చేశారు. గుడిమల్లంకు రూ.1.92 కోట్లు ఏర్పేడు మండలం గుడిమల్లంలో వెల సిన శ్రీపరశురామేశ్వరాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.1.92 కోట్లు కేటాయించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లు ఒకే లింగంలో ఉండడం ఇక్కడ ప్ర త్యేకత. ప్రహరీ గోడ నిర్మాణం, పిల్లల పార్కు, మరుగుదొడ్లు, యాత్రికుల విశ్రాంతి భవనం, సమాచార కేంద్రం, స్వాగత తోరణం, కోనేరు పునర్ నిర్మా ణం, మంచినీటి సౌకర్యం తదితర పను లు చేయాల్సి ఉంది. ఈ ఆలయం పురావస్తు శాఖ ఆధీనంలో ఉండడం, వారి నుంచి అనుమతులు రాకపోవడంతో అభివృద్ధి పనుల ఊసేలేదు. పురాతన దేవాలయాల పరిరక్షణ బాధ్యతను భుజాన వేసుకున్న కేంద్ర ప్రభుత్వం పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారులను అడిగితే నిధుల కొరత వల్లే పనులు ఆగిపోయాయని సమాధానం చెబుతున్నారు. -
కాయ్ రాజా కాయ్!
జిల్లాలో జూదగాళ్ల జోరు పండగ వేళ పందాల హోరు పేకాట, కోడిపందాల నిర్వహణకు యత్నం కోట్లలో చేతులు మారే అవకాశం ఈ ఏడాది ముందే రంగం సిద్ధం లోపాయికారీ ఒప్పందాలు, కళ్లు మూసుకుంటున్న పోలీసులు శివారు ప్రాంతాలు తోటలే వేదికలు మూడు జిల్లాల ఘనులే నిర్వాహకులు సాక్షి, విశాఖపట్నం : సంక్రాంతి వచ్చిందంటే భారీ ఎత్తున జూదానికి తెర తొలగిందన్నమాటే. పండగ ముం దు, వెనుక రోజుల్లో పేకాట, కోడిపందాలు జిల్లాలో శ్రుతి మించిపోతాయన్న సంగతి తెలిసిందే. పండగ వేళ కోడిపందాలు, పేకాట డెన్లతో పాటు పొట్టేళ్ల పందాల స్థావరాలు లెక్కకు మించి సిద్ధమవుతాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. ఇందుకోసం పొరుగు జిల్లాల నుంచి బడాబాబులు వస్తుంటారు. మూడేళ్లుగా వీరు జోరు కొనసాగిస్తున్నారు. జూదం సాఫీగా సాగడానికి లక్షల్లో ముట్టజెబుతూ ఉండడంతో స్థానికులు కూడా సహకరిస్తున్నారు. అవసరమైతే జిల్లా స్థాయిలోనో, లేదా రాజధాని స్థాయిలోనో ఒత్తిడి తెచ్చి వీటిని కొనసాగిస్తున్నారు. సాధారణంగా సంక్రాంతికి చేరువలో ఏర్పాట్లు చేసేవారు. ఈసారి వారం ముందే రంగంలోకి దిగారు. విశాఖతో పాటు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో అప్పుడే తిష్టవేసి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల శివారు ప్రాంతాలు, వాటికి సమీపంలోని తోటలను వేదికగా చేసుకుంటున్నారు. ఆ మధ్య పేకాడుతున్న 34మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారంతా విజయనగరం వాసులే. రేబాకలో పోలీసులు దాడుల చేయగా 20కార్లు వదిలేసి జూదగాళ్లు పరారయ్యారు. డొంకాడ కొత్తూరులోనైతే కొందరు పోలీసులపై తిరగబడ్డారు. ఏటా వీరి జోరు కొనసాగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని, చర్యలు తీసుకోకుండా వీరిపై రకరకాల ఒత్తిళ్లు వస్తున్నాయని ఆరోపణలు వినవస్తున్నాయి. ఇవీ వేదికలు నర్సీపట్నం నియోజకవర్గం ఆక్షాయపేట, టి.కొత్తపల్లి, గొలుగొండ, జోగంపేట, జగ్గంపేట పాయకరావుటపేట నియోజకవర్గం ఎస్.రాయవరం, రేబాక, సీతారాంపురం పోలవరం గట్టు, చినదొడ్డిగల్లు, ఉపమాక, చందనాడ, లింగరాజుపాలెం, గుడివాడ, నామవరం, కొరుప్రోలు, పెద గుమ్ములూరు, వేంపాడు,డొంకాడ కొత్తూరు,చందనాడ,ఉపమాక యలమంచిలి, రాంబిల్లి,ముగనపాక మండలాల్లోని పలు గ్రామాలు, చోడవరం, వి.మాడుగుల నియోజకవర్గాల పరిధిలో కొన్ని.. అనకాపల్లి నియోజకవర్గం తీడ, కన్నూరుపాలెం, భీమవరం, తాళ్లపాలెం, కూండ్రం, గోపాలపురం పాడేరు నియోజకవర్గం మత్స్యపురం, నగిసిపల్లె, గుత్తలపుట్టు, డి.కింతలివీధి అనంతగిరి మండలం గుమ్మకోట సమీప ప్రాంతంలో పెద్ద ఎత్తున పేకాట డెన్ ఏర్పాటుకు సన్నాహాలు. -
కేసుల పురో‘గతి’ ఏది?
= నేరాలు తగ్గాయి.. దర్యాప్తు జోరూ తగ్గింది = జిల్లాలో పోలీస్ దర్యాప్తులోనే మగ్గుతున్న కేసులు = జాప్యంతో బాధితులకు న్యాయం జరిగేనా? జిల్లాలో నేరాల సంఖ్య తగ్గిందని పోలీసు అధికారులు గర్వంగా చెప్పుకొంటున్నారు. గత 11 నెలలుగా నేరాల అదుపులో తాము చేసిన కృషిని ప్రస్తుతించుకుంటూ సమీక్షలకు సైతం సిద్ధమయ్యారు. నేరాల సంఖ్య కాస్త తగ్గింది సరే.. నమోదైన కేసుల్లో అత్యధికం దర్యాప్తులోనే ఉన్నట్టు తేటతెల్లమవుతోంది. వాటి పరిస్థితి ఏమిటనేది అధికారులే తేల్చాలి. సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో ఈ ఏడాది నమోదైన కేసులను పరిశీలిస్తే దర్యాప్తు నత్తనడకగానే సాగుతున్నట్టు చెప్పకతప్పదు. గత మూడేళ్లలో కేసుల తీరును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. గత ఏడాదితో పోల్చితే నేరాల సంఖ్య కాస్త తగ్గినా.. దర్యాప్తు మాత్రం సాగదీత ధోరణిలో సాగుతోందని తెలుస్తోంది. 2011లో కేసుల తీరు ఇదీ... జిల్లాలో 2011లో 894 కేసులు నమోదయ్యాయి. వాటిలో 111 కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయి. 213 కేసుల్లో నేర నిరూపణ కాలేదు. 267 కేసులు విచారణ దశలో ఉన్నాయి. రూ.3 కోట్ల 78 లక్షల 31 వేల 173 విలువైన సొత్తు చోరీకి గురికాగా వాటిలో రికవరీ అయింది కోటీ 78 లక్షల 90 వేల 194 రూపాయలు మాత్రమే. రెండేళ్లు గడుస్తున్నా ఇంకా దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన సొత్తు రికవరీ కాలేదు. 2012లో ఇలా... జిల్లాలో 2012లో 987 కేసులు నమోదయ్యాయి. 108 కేసుల్లో నిందితులకు శిక్ష పడింది. 149 కేసుల్లో నేర నిరుపణ కాలేదు. కోర్టులో 393 కేసులపై విచారణ జరుగుతోంది. గత ఏడాదికి సంబంధించిన 119 కేసుల్లో ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. రూ.5 కోట్ల 49 లక్షల 41 వేల 109 విలువైన సొత్తు చోరీకి గురికాగా, రూ.3 కోట్ల 50 లక్షల 10 వేల 008 మాత్రమే రికవరీ చేశారు. ఇంకా దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు రికవరీ లేదు. ఈ ఏడాది విచారణలో 584 కేసులు... ఈ ఏడాది నవంబర్ 30 వరకు జిల్లాలో 855 కేసులు నమోదయ్యాయి. వాటిలో 29 కేసుల్లో నిందితులకు శిక్ష పడింది. 54 కేసుల్లో నేర నిరూపణ కాలేదు. కోర్టు పరిధిలో విచారణ జరుగుతున్నవి 170 కేసులు. పోలీసుల విచారణలో ఉన్నవి 584. గత 11 నెలల కాలంలో రూ.3 కోట్ల 13 లక్షల 21 వేల 322 మేర సొత్తు చోరీకాగా, కోటీ 32 లక్షల 99 వేల 713 రూపాయలు మాత్రమే రికవరీ చేయగలిగారు. ఇంకా రూ.1.70 కోట్ల మేర సొత్తు రికవరీ కావాల్సి ఉంది. తగ్గిన అత్యాచారాలు, అపహరణలు... ఈ ఏడాది నమోదైన కేసుల వివరాలు పరిశీలిస్తే అత్యాచారాలు, అపహరణలు తగ్గినట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 51 అత్యాచార, 47 అపహరణ కేసులు నమోదయ్యాయి. హత్య కేసులు 49 నమోదు కాగా 38 ఇంకా దర్యాప్తు దశలోనే ఉన్నాయి. హత్య చేసి సొత్తు దొంగిలించిన కేసులు 6 నమోదు కాగా 5 విచారణలో ఉన్నాయి. దోపిడీలు 16 నమోదు కాగా, 12 కేసుల్లో విచారణ సాగుతోంది. పగటి పూట ఇళ్ల చోరీలు 59 నమోదు కాగా వాటిలో మూడు కేసుల్లో శిక్ష పడింది. 45 కేసుల్లో విచారణ సాగుతోంది. రాత్రిపూట ఇళ్లలో చోరీ కేసులు 219 నమోదు కాగా వాటిలో 9 కేసుల్లో శిక్ష పడగా 41 కేసులు దర్యాప్తులోను, 164 కేసులు కోర్టు విచారణలో ఉన్నాయి. మెడలో గోలుసు చోరీలు 49 నమోదు కాగా 39 విచారణలో ఉన్నాయి. సైకిల్ దొంగతనాలపై 15, జేబు దొంగతనాలపై 9, సాధారణ దొంగతనాలపై 408, గేదెల దొంగతనాలపై 25 కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల్లో పెద్దవి 349 నమోదవగా, స్వల్ప గాయాల కేసులు 972 ఉన్నాయి. జిల్లాలో ఘర్షణలపై 1331 కేసులు నమోదైనట్టు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. -
పిండేస్తున్నారు
=టమాట రైతుకు దళారుల టోకరా =జాక్పాట్ పేరుతో దోపిడీ =అధికారుల ప్రేక్షకపాత్ర టమాట రైతుల కష్టాన్ని దళారులు నిలువునా దోచుకుంటున్నారు . రాష్ట్రంలో అతిపెద్దదిగా పేరొందిన మదనపల్లె టమాట మార్కెట్లో దళారులు చెప్పిందే వేదం. అధికారులు సైతం వారికే వంత పాడుతున్నారు. ఆరుగాలం కష్టించిన రైతుకు దక్కే ప్రతిఫలం కంటే దళారులకే ఎక్కువ ఆదాయం వస్తోంది. అధికారుల అండదండలతో ఒక వైపు ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తూ మరో వైపు రైతన్నను దోచుకుంటున్న వైనంపై ప్రత్యేక కథనం. మదనపల్లె, న్యూస్లైన్: మదనపల్లె టమాట మార్కెట్కు చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి సుమారు 300మంది రైతులు వస్తారు. సీజన్లో రోజు కు కోటి రూపాయల వరకూ వ్యాపారం జరుగుతుంది. ఒక్కోరైతు 25 నుంచి 30 క్రేట్ల (క్రేట్=30 కేజీలు) టమాటాలను తీసుకువస్తారు. రైతులు తీసుకువచ్చిన సరుకును నేరుగా విక్రయించే అవకాశం లేదు. కమీషన్ ఏజెంటు ద్వారానే విక్రయించాల్సి ఉంటుంది. ఏజెంట్లు ముందుగానే వ్యాపారులతో లావాదేవీలు జరిపి ఒప్పందం కుదుర్చుకుంటారు. రైతుకి, వ్యాపారికి మధ్యవర్తిగా వ్యవహరించి ట మాటాల వేలం నిర్వహిస్తారు. ఇలా వేలం నిర్వహించినందుకు రైతు పది క్రేట్లకు గాను ఒక క్రేట్ను ఏజెంటుకు జాక్ పాట్ కింద ఉచితంగా ఇవ్వాలి. ఇలా 30 క్రేట్లు తెచ్చిన రైతు నుంచి జాక్పాట్ పేరుతో 3 క్రేట్ల టమాటాలను అప్పనంగా తీసుకుంటారు. అంతే కాకుండా క్రేట్ను రూ.500లకు విక్రయిస్తే అందులో కూడా పదిశాతం తగ్గించి రైతుకు నగదు ఇస్తారు. నిబంధ నల ప్రకారం నాలుగుశాతం మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా ఏజెంట్లు పదిశాతం వసూలు చేస్తున్నారు. ఇలా అన్ని దశల్లోనూ దళారులు రైతన్నను దోచుకుంటున్నారు. అధికారులు అండదండలు ఉండడంతో దోపిడీకి అంతే లేకుండా ఉంది. ప్రభుత్వానికీ టోకరా! మార్కెట్లో రైతులను దోచుకుంటున్న దళారులు అధికారుల సహకారంతో ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. మార్కెట్లో దాదాపు 50 వరకూ మండీలు ఉన్నాయి. ఒక కమీషన్ ఏజెంట్ నెలకు సరాసరి రూ. 50 లక్షలు వ్యాపారం చేస్తే అధికారిక లెక్కల్లో మాత్రం పదిలక్షలుగానే చూపిస్తూ ప్రభుత్వాదాయానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రస్తుతం అధికారులు చూపుతున్న లెక్కల ప్రకారం సెస్, కమీషన్ ద్వారా మార్కెట్ యార్డుకు సరాసరి రూ. 1.5 కోట్లు ఆదాయం వస్తోంది. అధికారులు నిక్కచ్చిగా వ్యవహరిస్తే యార్డు ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి రైతులు నిలువుదోపిడీకి గురికాకుండా చూడాల్సి ఉంది. జాక్పాట్ లేకుండా చేస్తా.. మార్కెట్యార్డులో జాట్పాట్ పద్ధతి లేకుండా చేస్తా. ఇందు కోసం టమాటా రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తా. రైతులకు న్యాయం చేసేలా చేసేలా చర్యలు తీసుకుంటా. ఇందుకు రైతులు కూడా సహకరించాలి. అధిక కమీషన్ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. -శ్రీరామ్ చినబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్, మదనపల్లె. -
పేరూరులో మంత్రి అనుచరుల భూదందా
తిరుపతి రూరల్, న్యూస్లైన్: కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను మంత్రి అనుచరులు హరించేస్తున్నారు. తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీలోని హరిపురంకాలనీ సమీపంలో ము రుగునీరు, వరదనీరు ప్రవహించేలా 40 అడుగుల వెడల్పుతో పెద్దకాలువ ఉంది. ఇది పోరంబోకు స్థలమే కదా అన్న ధీమాతో మంత్రి అనుచరులు కొందరు కన్నేశారు. కోట్ల విలువ చేసే ఈ స్థలాన్ని ఏకంగా కిలోమీటర్ మేర ఆక్రమించేశారు. ఇంటి నిర్మాణాలు చేపడుతున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. అధికార పార్టీకి చెందిన గంగయ్య, చంద్రశేఖర్(బాబు) ఈ భూదందాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వారిని చూసి చుట్టుపక్కల ఉన్నవారు కూడా కాలువ పోరంబోకు స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు. నాలుగేళ్లలో ఈ పంచాయతీలో రూ.50 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. కాలువలు మాయం.. పేరూరు పంచాయతీలో ప్రభుత్వ భూమి అధికంగా ఉంది. అదే స్థాయిలో ఆక్రమణలు జరుగుతున్నాయి. సప్తగిరుల నుంచి వ్యవసాయ కళాశాల మీదుగా వచ్చే 30 అడుగుల కా లువ, భారతంమిట్ట నుంచి వచ్చే లోతట్టు కాలువలు కిలోమీటర్ మేర 90 శాతం ఆక్రమణలకు గురయ్యాయి. వ్యవసాయ కళాశాల నుంచి వచ్చే 40 అడుగుల కాలువ హ రిపురం కాలనీకి వచ్చే సరికి కేవలం 5 అడుగులు కూడా ఉం డడం లేదు. 530/1, 529, 543, 482, 541, 482సర్వే నెంబర్లలో భారీ ఆక్రమణలు జరిగాయి. అదను చూసుకుని.. రెవెన్యూ సిబ్బంది సమైక్య ఉద్యమంలో ఉన్నారు. ఇదే అదనుగా భూ ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. నాయుడుపేట- బెంగళూరు బైపాస్ రోడ్డుకు ఆనుకుని సర్వే నెంబర్ 80లో 1.7 ఎకరాల స్థలం(సుమారు నాలుగు కోట్లు విలువ) ఆక్రమణకు గురైంది. రెడ్డిగుంటలోని సర్వేనెంబర్ 482లో రూ. 2 కోట్లు విలువ చేసే భూమి ఆక్రమణకు గురైంది. 20 రోజుల్లో పేరూరు పంచాయతీలో రూ.6 కోట్లు విలువచేసే భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి అనుచరుల జోలికి వెళ్లడానికి భయపడుతున్నారు. కాలువను సర్వే చేయిస్తా పది రోజుల క్రితం ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాం. మళ్లీ ఆక్రమించారనే సమాచారం లేదు. పూర్తి స్థా యిలో సర్వే చేయిస్తాం. ఆక్రమణలు జరిగి ఉంటే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదు. నేను తహశీల్దార్గా వచ్చిన ఈ ఏడాదిలో పేరూరు కాలువ ఆక్రమణ జరగలేదు. -వెంకట్రమణ, తహశీల్దార్, తిరుపతి రూరల్