devineni avinash
-
కక్షతోనే వంశీ అరెస్ట్: Devineni Avinash
-
కూటమి అరాచకాలు.. ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నేతల అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్, ఇతర ఎన్నికల్లో టీడీపీ, జనసేన అరాచకాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. కూటమి దౌర్జన్యాలపై ఈసీకి దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి ఫిర్యాదు చేశారు.అనంతరం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ..‘తిరుపతిలో టీడీపీ, జనసేన గుండాలు రెచ్చిపోయారు. సిగ్గు లేకుండా కార్పొరేటర్లు, మహిళలపై దాడులు చేశారు. కూటమి ప్రభుత్వం లో దాడులు, దౌర్జన్యం పెరిగాయి. మేము నిన్ననే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. సిగ్గు లేకుండా కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లను బెదిరించి, భయపెట్టి, ప్రలోభ పెట్టి లాక్కుంటున్నారు. అక్రమంగా నిర్వహించిన ఎన్నికలను రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడింది. నిన్ననే మేము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాం. కానీ, పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి రక్షణ కవచంగా మారారు. పోలీసుల సమక్షంలోనే కార్పొరేటర్లపై దాడి చేసి ఎత్తుకుని వెళ్లారు. టెంపుల్ సిటీలో ఇలాంటి అరాచకానికి దిగడం దారుణం. నూజివీడులో మంత్రి పార్థసారథి ఎనిమిది మంది కౌన్సిలర్లను లాక్కున్నారు. ఎందుకు అధికార పార్టీ ఇంతగా భయపడుతోంది. ఈ ప్రభుత్వం వైఎస్ జగన్ను చూస్తే వణికిపోతోంది. అందుకే ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలాంటి దమన కాండే జరుగుతుందన్నారు. ఈ అరాచకాలపై పోరాటం చేస్తామని తెలిపారు.మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి పార్టీలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. తిరుపతిలో మహిళా మేయర్, ఎంపీ, ఎమ్మెల్సీ ఉండగా దాడి చేశారు. కార్పొరేటర్లను బస్సుపై దాడి చేసి ఎత్తుకుపోయారు. ఎస్పీ ఉండగానే ఇంత విధ్వంసం సృష్టించారు. వెంకటేశ్వర స్వామి చూస్తుండగానే ఈ అరాచకానికి పాల్పడ్డారు. మా పార్టీ కార్పొరేటర్లకి భద్రత కావాలని మేము నిన్ననే అడిగాం. పోలీసులు పూర్తిగా టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారు. ఇలాంటి విధ్వంసం ఏనాడు జరగలేదు. ఏమాత్రం సిగ్గు ఉన్న టీడీపీ నేతలు ఇలా వ్యవహరించరు. ప్రజలే కూటమి నాయకులకు తగిన బుద్ధి చెప్పడం ఖాయం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
పేద విద్యార్థులకు చదువును దూరం చేశారు
-
లోకేష్ కోసమే బాబు దావోస్ పర్యటన: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: మంత్రి నారా లోకేష్ను ప్రమోట్ చేయడానికే చంద్రబాబు దావోస్ వెళ్లారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు దేవినేని అవినాష్. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రచారం చేస్తున్నారు. ప్రజాధనంతో దావోస్లో ఎంజాయ్ చేస్తాం అంటే చూస్తూ ఊరుకోము అంటూ హెచ్చరించారు.తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీలో 29 అనుబంధ సంఘాలకు అధ్యక్షులు నియామకం జరిగింది. అధ్యక్షులుగా నియమితులైన వారిని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అభినందించారు. ఈ క్రమంలో చంద్రబాబు , లోకేష్ దావోస్ పర్యటనపై దేవినేని అవినాష్ స్పందించారు. ఈ సందర్బంగా అవినాష్ మాట్లాడుతూ..‘చంద్రబాబు ఆయన కొడుకు 100 కోట్ల ప్రజాధనంతో దావోస్ పర్యటనకు వెళ్లారు. రూపాయి పెట్టుబడి తీసుకురాలేని దావోస్ పర్యటన వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగిందేమిటి?. నారా లోకేష్ను ప్రమోట్ చేయడానికే చంద్రబాబు దావోస్ వెళ్లాడు. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రచారం చేస్తున్నారు.దావోస్ పర్యటన వల్ల ఏయే పెట్టుబడులు వచ్చాయో ప్రజలకు చెప్పాలి. మహారాష్ట్ర, తెలంగాణ వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. చంద్రబాబు ఐదు సార్లు దావోస్ వెళ్లినా.. వైఎస్ జగన్ ఒక్కసారి వెళ్లిన పర్యటనతో సమానం. వైఎస్ జగన్ దావోస్ పర్యటనలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు తెచ్చారు. రాష్ట్రాన్ని వైఎస్ జగన్ అన్ని విధాలా అభివృద్ధి చేశారని మేం గర్వంగా చెప్పగలం. చంద్రబాబు, లోకేష్కి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు తేవాలి. ప్రజాధనంతో ఎంజాయ్ చేస్తాం అంటే చూస్తూ ఊరుకోం. ప్రజల్లోకి వెళ్తే పథకాలు గురించి నిలదీస్తారని వెళ్లడమే మానేశారు. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన మధ్య వార్ జరుగుతోంది. తూర్పు బైపాస్పై ప్రకటనలు ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేశారు. కూటమి నేతలు ఎందుకని ఇక్కడి ప్రజల మీద కక్ష కట్టారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, బెజవాడ ఎంపీ కలిసి కేంద్ర పెద్దలతో మాట్లాడి తూర్పు బైపాస్కి ఒప్పించాలి. కూటమి నేతలు ప్రతీ పనిలో కలెక్షన్లు వెతుక్కుంటున్నారు. కమీషన్, కరప్షన్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. జగ్గయ్యపేటలో దొరికిన గంజాయిపై కూటమి నేతలు మాట్లాడాలి. గంజాయి నిర్మూలన చేస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో తేల్చాలి. చంద్రబాబు హయంలో కాలనాగులు మళ్లీ పడగ విప్పుతున్నారు. పేద వారిని దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పేదల పక్షాన వైఎస్సార్సీపీ నిలబడుతుంది’ అని కామెంట్స్ ఇచ్చారు. -
ఎన్టీఆర్ జిల్లా గోపాలపురంలో YSRCP నేతల పర్యటన
-
కోడి పందెం ముసుగులో గొడవ.. వైఎస్సార్సీపీ నాయకుడి హత్య!
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో కూటమి పాలనలో వైఎస్సార్సీపీ యువనేత మణితేజ అనుమానస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రశాంతంగా ఉన్న నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో టీడీపీ చిచ్చు పెడుతోంది. కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను పచ్చ గూండాలే హత్య చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇక, మణితేజ మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు.మణితేజ మృతి విషయం తెలుసుకుని నందిగామలోని ఆసుపత్రి వద్దకు వైస్సార్సీపీ నాయకులు చేరుకున్నారు. మణితేజ మృతదేహాన్ని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు సహా పలువురు పరిశీలించారు.అనంతరం, దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మణితేజది ముమ్మాటికీ రాజకీయ హత్యే. మణితేజ మృతిపై మాకు అనేక అనుమానాలున్నాయి. మణితేజ కుటుంబం వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటోంది. వారంతా పార్టీలో యాక్టివ్గా ఉండటం టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ చిచ్చు పెడుతోంది. కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను పొట్టనపెట్టుకున్నారు. మణితేజ హత్యను టీడీపీ, పోలీసులు ప్రమాదంగా చిత్రీకరించేయత్నం చేస్తున్నారు. మణితేజ మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి.ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి వారిపై మర్డర్ కేసు నమోదు చేయాలి. మణితేజ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. మణితేజ మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులదే. ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మూడు సంక్రాంతులే. మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారు. తప్పుచేసిన వారికి చట్టపరంగా కచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం. మణితేజ కుటుంబానికి చంద్రబాబు, పవన్, లోకేష్ సమాధానం చెప్పాలి. రెడ్ బుక్ ఇంకా తెరిచే ఉంది ముగిసిపోలేదని లోకేష్ అంటున్నాడు. మనుషుల ప్రాణాలు తీయడమేనా రెడ్ బుక్ అంటే అని ప్రశ్నించారు.అనంతరం, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. మణితేజ మృతిని ప్రమాదంగా చిత్రీకరించారు. తలపై బలంగా కొట్టినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మణితేజ మృతిపై మాకు అనేక అనుమానాలున్నాయి. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు చేసినందుకు మణితేజను పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కోడిపందాల వద్ద గొడవ తర్వాత మణితేజ చనిపోయాడు. మణితేజ మృతిని హత్య కోణంలోనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరావు మాట్లాడుతూ.. మణితేజది ముమ్మాటికీ హత్యే. మణితేజ మృతిని హత్య కేసుగానే నమోదు చేయాలి. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. జై జగన్ అంటే కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చించి తిరిగి మా పార్టీ కార్యకర్తలపైనే కేసు నమోదు చేస్తున్నారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులను బెదిరిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
YSRCP పోరుబాట.. బాబుకు దేవినేని ఓపెన్ ఛాలెంజ్..
-
గద్దె రామ్మోహన్ పై దేవినేని అవినాష్ ఫైర్
-
మాజీ మంత్రి పేర్ని నానికి YSRCP నేతల పరామర్శ
-
పాపం ఇద్దరు పిల్లలున్నారు చిత్రహింసలు పెట్టి..
-
అన్నదాతకు అండగా.. దేవినేని అవినాష్ అరెస్ట్..
-
రైతుల కోసం 13న జరగబోయే కార్యక్రమంపై దేవినేని అవినాష్
-
‘రైతులను ముంచేసిన కూటమి సర్కార్’
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ముంచేసిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. ఈ నెల 13వ తేదీన రైతుల సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం అందిస్తామని తెలిపారు. ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం.. ‘అన్నదాతకు అండగా’ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, వైఎస్ జగన్ రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు పెట్టుబడి సాయం అందించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆర్బీకే సెంటర్లు లేకుండా పోయాయి. రైతుల కోసం బడ్జెట్లో ప్రస్తావించకుండా కూటమి సర్కార్ మోసం చేసింది. సూపర్ సిక్స్లో చెప్పిన పెట్టుబడి సాయం గురించి కూటమి నేతలు మాట్లాడటం లేదు. కనీస మద్దతు ధర కూడా రైతుకు దక్కకుండా చేస్తున్నారు’’అని అవినాష్ నిలదీశారు.దయనీయ స్థితిలో రైతులుతన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ, రైతులకు కనీసం గోనె సంచులు కూడా అందించడం లేదని మండిపడ్డారు. ధాన్యం రవాణాకు జీపీఎస్ ఉన్న వాహనాలు ఉండాలని నిబంధన పెట్టారు. గతంలో సబ్సిడీపై రైతులకు టార్పాలిన్ పట్టాలిచ్చేవారు. ఈ కూటమి ప్రభుత్వం టార్పాలిన్ పట్టాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది. రైతులు దయనీయమైన స్థితిలో దళారులకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుంది’’ అని మండిపడ్డారు.రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపువిజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, కళ్లాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే ఉంది. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ధాన్యం రంగుమారిపోతున్నా కొనడం లేదు. రైతులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే. రైతులను మోసం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది’’ అని ఆమె ధ్వజమెత్తారు. -
జమిలి ఎన్నికలు వస్తే కూటమి ప్రభుత్వం ఇంటికే
-
టీడీపీకి దేవినేని అవినాష్ వార్నింగ్
-
ఫోటోల కోసం ఫోజులు ఇవ్వడం కాదు.. చంద్రబాబుకి దేవినేని అవినాష్ సవాల్
-
ఏపీలో స్మార్ట్ మీటర్ల పేరుతో మరో డ్రామా: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: ఏపీలో స్మార్ట్ మీటర్ల పేరుతో మరో డ్రామాకు తెర లేపారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకుడు దేవినేని అవినాష్. ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చాక పథకాలను అమలు చేయడంలేదన్నారు. ఇది శంకుస్థాపనల ప్రభుత్వమే కానీ.. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కాదంటూ తీవ్ర విమర్శలు చేశారు.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన ఏ హామీ అమలు కాలేదు. వైఎస్సార్సీపీ హయాంలో కార్పొరేషన్లలో మంజూరైన పనులకు శంకుస్థాపనలు చేస్తూ కూటమి నేతలు కాలక్షేపం చేస్తున్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరు నెలల కాలంలో చేసిందేమీ లేదు. రోడ్లు, డ్రైనేజీ, ఇతర సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. ఇది శంకుస్థాపనల ప్రభుత్వమే కానీ.. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కాదు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రారంభించి చివరి దశలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలి. లేనిపక్షంలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఏపీలో కూటమి నేతలు స్మార్ట్ మీటర్ల పేరుతో మరో డ్రామాకు తెర లేపారు. గతంలో వైఎస్ జగన్పై కూటమి నేతలు నిందలు వేశారు. దానికి ఇప్పుడు ఏ సమాధానం చెబుతారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చారు. ఆ పథకాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి?. ఎన్నికల ముందు ఉదయం అవ్వగానే పథకాల గురించి ఫోన్లు చేసి వివరించారు. పథకాలు ఎవరెవరికి అందాయి ఇప్పుడు ఫోన్లు చేసి కనుక్కోండి. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఏమైపోయాయి. మీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చి నిజాయితీ నిరూపించుకోండి. లయోలా కాలేజీ వాకర్స్ కు గద్దె రామ్మోహన్ పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. వాళ్లని రెచ్చగొట్టి ఇప్పుడు కేసుల్లో ఇరికించారు. లయోలా కాలేజ్ యాజమాన్యానికి వాకర్స్ని అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రజలను నమ్మించారు. వారికి న్యాయం చేయండి. ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం’ అని చెప్పారు. -
సోషల్ మీడియా సైనికులను కేసులతో భయపెట్టలేరు: వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులపై పోలీస్ కమిషనరేట్లో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్.. పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల ఇంఛార్జ్లు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు.. డీసీపీకి వినతిపత్రం అందించారు.కూటమి ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోంది: దేవినేని అవినాష్ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో పోలీసుల తీరు సరిగాలేదు. నందిగామ నియోజకవర్గం పెండ్యాలలో 150 మందికి నోటీసులిచ్చారు. అక్రమ కేసులు బనాయించి కూటమి ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోంది. సోషల్ మీడియా కార్యకర్తలకు మేం అండగా ఉంటాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా మేం తోడుగా ఉంటాం.తక్షణమే అక్రమ కేసులు, దాడులు ఆపాలి: వెల్లంపల్లి శ్రీనివాస్ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని సోషల్ మీడియా కార్యకర్తల పై అక్రమంగా కేసులు పెట్టారు. వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టినా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నోటీసులిచ్చి.. అరెస్టులు చేస్తున్నారు. ప్రశ్నించే గొంతుక ఉండకూడదని అక్రమంగా కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. తప్పుడు కేసులను ప్రోత్సహించొద్దని పోలీసులను కోరుతున్నాం. కేసుల పేరుతో పూటకో స్టేషన్ మార్చి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ప్రశ్నించే గొంతుకను అణచివేస్తే తిరగబడే రోజు కచ్చితంగా వస్తుందిఅన్యాయంపై ప్రశ్నిస్తే తప్పా: మల్లాది విష్ణుప్రతిపక్షం గొంతు నొక్కాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై టీడీపీ అనేక అబద్ధపు ప్రచారాలు చేసింది. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి విజయవాడలో కేసులు పెడుతున్నారు. 90 మంది మహిళలకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే తప్పా. ఇచ్చిన హామీలు నెరవేర్చమని కోరడం తప్పా. కూటమి ప్రభుత్వం తీరు మారకపోతే ఛలో అసెంబ్లీ చేపడతాం. హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా?కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్: దొడ్డా అంజిరెడ్డికూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. తిరువూరులో ఇద్దరు విద్యార్థులపై అక్రమంగా కేసులు పెట్టారు. దివ్యాంగులను కూడా వదలడం లేదు. సోషల్ మీడియా సైనికులను కేసులతో భయపెట్టలేరు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ పూర్తిగా అండగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం తప్పిదాలను ఎండగడతాం -
మరింత బలోపేతం చేద్దాం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకెళ్లాలని.. ప్రజలు, కిందిస్థాయి కార్యకర్తల ఆలోచనలకు దగ్గరగా మన పనితీరు ఉండాలని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సూచించారు. ఏమైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించుకుందామన్నారు. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం విజయవాడలోని శేషసాయి కళ్యాణ మండపంలో జరిగింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులుగా దేవినేని అవినాష్ బాధ్యతలు స్వీకరించారు.అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని విస్మరించి అరాచకాలతో బిహార్లా మారుస్తున్నారని.. సూపర్సిక్స్కు బొందపెట్టారని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నేతలను సమన్వయం చేసుకోవాలని.. జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశముందని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. మన మధ్య ఎలాంటి తారతమ్యాలు లేకుండా పార్టీ కోసం పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. జనసేన శ్రేణులు టీడీపీ పల్లకీ మోస్తున్నారు : పేర్ని నానిమాజీమంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మాట్లాడుతూ.. వైఎస్ జగన్ను ఓడిస్తే తమకు మంచి జరుగుతుందని జనసేన కార్యకర్తలు భ్రమపడ్డారని.. కానీ, ఇప్పుడేమో వారు టీడీపీ పల్లకీలు మోస్తున్నారని ఎద్దేవా చేశారు. మానసికంగా వారంతా చచ్చి బతుకుతున్నారని, వాళ్ల పరిస్థితి పగోడికి కూడా రాకూడదన్నారు. వైఎస్సార్సీపీకి ఆధారం, మూలం, బలం కార్యకర్తలేనన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్కళ్యాణ్ ప్రజలను మోసంచేశారని ఆరోపించారు.వాళ్లు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారని.. కేసులు పెట్టారని, రోడ్ల మీద కొట్టి దౌర్జన్యాలు చేశారని మండిపడ్డారు. ఇలా ఓవరాక్షన్ చేసిన వారెవరినీ వదిలిపెట్టబోమని, వాళ్లని పరిగెత్తించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. అధికార మదంతో వైఎస్సార్సీపీని అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. ఇక మూడు పార్టీలు కాదు.. 30 పార్టీలు కలిసొచ్చినా వైఎస్సార్సీపీకి ఏమీకాదని, తాము తగ్గేదేలేదని పేర్ని నాని స్పష్టంచేశారు. ఎవరూ అధైర్యపడొద్దని.. తాము అండగా ఉంటామని పార్టీ శ్రేణులకు పేర్ని భరోసా ఇచ్చారు.ప్రజలకు కష్టమొస్తే జగన్ను తలుచుకుంటున్నారు : అవినాష్దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని తలుచుకుంటున్నారని.. ఆయన ఉంటే ఇలా జరిగేది కాదని గుర్తు చేసుకుంటున్నట్లు చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలుచేయడమే అందుకు కారణమన్నారు. టీడీపీ సోషల్ మీడియా, వారి అనుకూల మీడియా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు. జిల్లాలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని.. మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షునిగా దేవినేని అవినాష్ ప్రమాణ స్వీకారం
-
గవర్నర్ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు..
సాక్షి, విజయవాడ: ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో వరద బాధితులకు జరిగిన అన్యాయం మీద గవర్నర్కు వైఎస్సార్సీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. గవర్నర్ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్,వెస్ట్ నియోజకవర్గ ఇంఛార్జి ,మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు,సెంట్రల్ నియోజకవర్గ ఇంఛార్జి మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా,మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లందుర్గ, వైఎస్సార్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి ఉన్నారు. -
అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులా?.. దేవినేని అవినాష్ ఫైర్
-
‘అక్షయపాత్ర’ రోజూ పంపిన లక్ష భోజనాలు ఏమయ్యాయి?
సాక్షి, అమరావతి: వరద బాధితుల భోజనాలపై కూటమి ప్రభుత్వం రూ.368 కోట్లు ఖర్చు చేస్తే.. అక్షయపాత్ర ఫౌండేషన్ రోజూ లక్ష మందికి అందించిన భోజనాలు ఏమయ్యాయని, ఇతర స్వచ్ఛంద సంస్థలు చేసిన సాయం మాటేమిటని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నిలదీశారు. సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి తప్పుడు లెక్కలతో రూ.534 కోట్లను కూటమి నేతలు దోచేశారని ధ్వజమెత్తారు. ఒక్క పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేయకుండా రూ.1.39 కోట్లు,మంచినీళ్ల బాటిళ్లకు రూ.26 కోట్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపిందన్నారు. ఏ కాంట్రాక్టర్ ద్వారా ఆ ఏర్పాట్లు చేశారో ప్రభుత్వంవివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.బాధితులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? ప్రభుత్వం నిజంగా బాధితులకు సాయం చేసి ఉంటే.. ఇప్పుడు కలెక్టరేట్ వద్దకు వేలా దిమంది ఎందుకు పోటెత్తుతున్నా రని అవినాష్, భాగ్యలక్ష్మి ప్రశ్నించారు. పారిశుధ్య కార్మికులకు రూ.51 కోట్లు ఇచ్చామంటున్న ప్రభుత్వం ఎవరి ద్వారా అవి చెల్లించారో చెప్పాలన్నారు. ఆహారం పంపిణీ కోసం 412 డ్రోన్లు ఉపయోగించి, అందుకోసం రూ.2 కోట్లు చెల్లించినట్లు చెబుతున్నారని, నిజానికి అప్పుడు కనీసం 10 డ్రోన్లు కూడా కనపడలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూ.534 కోట్లకు సరైన లెక్కలు చెప్పే వరకు ఊరుకోబోమని, వరద బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వారు ప్రకటించారు. -
చంద్రబాబును నమ్మి మోసపోయామని వరద బాధితులు గగ్గోలు పెడుతున్నారు
-
లబ్బిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవినేని అవినాష్ పూజలు
-
ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన దేవినేని అవినాష్
-
బాబు,పవన్ పై దేవినేని అవినాష్ ఫైర్
-
వైఎస్సార్సీపీ నేతలకు సుప్రీంకోర్టు రక్షణ
సాక్షి,అమరావతి : టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించిన నమోదైన కేసులో తమకు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన వైఎస్సార్సీపీ నేతలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. అరెస్ట్ నుంచి వారికి రక్షణ కల్పించింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంతో పాటు దేవినేని అవినాష్, న్యాయవాది ఒగ్గు గవాస్కర్లపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.దర్యాప్తునకు సహకరించాలని అప్పిరెడ్డి తదితరులను ఆదేశించింది. 48 గంటల్లో పిటిషనర్లందరూ తమ పాస్పోర్ట్లను దర్యాప్తు అధికారి వద్ద జమ చేయాలంది. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుధాన్షు దూలియా, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, పొన్నవోలు సుధాకర్రెడ్డి, న్యాయవాది అల్లంకి రమేష్ తమ తమ వాదనలను వినిపించారు. జోగి రమేష్పైనా కఠిన చర్యలొద్దుఅలాగే చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన గొడవకు సంబంధించి నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్కు సైతం సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. రమేష్పై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ముందస్తు బెయిల్ కొట్టేసిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
నాకు పారిపోవాల్సిన అవసరం లేదు.. చంద్రబాబుకి దేవినేని అవినాష్ వార్నింగ్
-
టీడీపీ నేతల్లా పారిపోయే రకం కాదు: దేవినేని అవినాష్
విజయవాడ, సాక్షి: తనపై తెలుగు దేశం పార్టీ, దాని అనుకూల మీడియా చేస్తున్న ఉత్త ప్రచారంపై వైఎస్సార్సీపీ నేత, ఆ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం తనకు లేదంటూ ఓ వీడియో విడుదల చేశారాయన.‘‘నేను విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించానని వచ్చిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం నాకు లేదు. నా నియోజకవర్గ ప్రజలకు , కార్యకర్తలకు 24 గంటలూ అందుబాటులోనే ఉన్నా. పనీపాటా లేని కొన్ని మీడియా సంస్థలు , టీడీపీ సామాజిక మాధ్యమాల్లో నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. నేను దేనికి పారిపోవాలి...ఎందుకు పారిపోవాలి?.... నేను తప్పుచేశానని కోర్టు భావిస్తే.. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా దమ్ముగా స్వీకరిస్తాం. తప్పుడు కేసులకు భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదు. సమస్యలొస్తే టీడీపీ నేతల్లా నేను పారిపోయేరకం కాదు. నా తండ్రి నాకు జన్మనివ్వడంతో పాటు ధైర్యాన్ని కూడా ఇచ్చారు. మా నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మా పార్టీ వైఎస్సార్సీపీ పార్టీ. వైసీపీ కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటాం. మరోసారి చెబుతున్నా.. టీడీపీ , ఎల్లో మీడియా చేసే తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దు అంటూ ఆ వీడియో సందేశంలో కోరారాయన.టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పలువురు వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. అందులో దేవినేని అవినాష్ పేరు కూడా ఉంది. మొన్నీమధ్యే వల్లభనేని వంశీ విషయంలోనూ అతి ప్రదర్శించిన ఎల్లో మీడియా.. ఇప్పుడు దేవినేని అవినాష్ విషయంలోనూ తప్పుడు రాతలతో అలాగే ప్రవర్తించింది. -
టీడీపీకి అవినాష్ వార్నింగ్
-
దేవినేని అవినాష్ గూస్ బంప్స్ స్పీచ్
-
ఓట్ హక్కు వినియోగించుకున్న విజయ్ సాయి రెడ్డి, దేవినేని అవినాష్
-
చంద్రబాబు మేనిఫెస్టో చూసి మోడీకే చిరాకు పుట్టింది.. అందుకే..
-
పవన్ కళ్యాణ్ ని వదిలి 1000 మంది వైఎస్ఆర్ సీపీలోకి జనసేన నాయకులు
-
భారీ ర్యాలీతో దేవినేని అవినాష్ నామినేషన్
-
చంద్రబాబు, టీడీపీ నేతలకి దేవినేని అవినాష్ మాస్ వార్నింగ్
-
చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవరు: అవినాష్
-
దేవినేని నెహ్రు పేదల కోసం పనిచేశారు..
-
సీఎం జగన్ కు వస్తున్న ఆదరణ తట్టుకోలేకే కుట్రలు: దేవినేని అవినాష్
-
10 వస్తాయా.. 20 వస్తాయా..అనే భయంలో కూటమి ఉంది
-
నిమ్మగడ్డ రమేష్ కి దేవినేని అవినాష్ స్ట్రాంగ్ వార్నింగ్
-
జయప్రకాశ్ నారాయణ్ కు దేవినేని అవినాష్ కౌంటర్
-
చంద్రబాబుది మోసం చేసే నైజం: దేవినేని అవినాష్
-
కేశినేని నాని ఎంపీగా,నేను ఎమ్మెల్యే గా గెలిచి వైఎస్ఆర్ సీపీ జెండా ఎగరేస్తాం
-
70 ఏళ్ల గద్దె రామ్మోహన్...35 ఏళ్ల అవినాష్ కి వణుకుతున్నాడు...
-
కళ్లెదుటే అభివృద్ధి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కళ్లెదుటే ఇంత అభివృద్ధి కనిపిస్తున్నా రాష్ట్రంలో కొంతమంది మాత్రం ఒప్పుకోవట్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. విజయవాడను గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.వందల కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ఏకంగా రూ.400 కోట్లతో అంబేడ్కర్ పార్కును మీ కళ్లెదుటే ప్రారంభించి పూర్తి చేశామని గుర్తు చేశారు. గత సర్కారు హయాంలో బెజవాడలో ఓ ఫ్లైఓవర్ కూడా పూర్తి కాని దుస్థితి నెలకొనగా మనందరి ప్రభుత్వం వచ్చాక దాన్ని పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లైఓవర్లు నిర్మించామని చెప్పారు. మంగళవారం విజయవాడలో పర్యటించిన సీఎం జగన్ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, కృష్ణా రివర్ ఫ్రంట్ పార్కు (కృష్ణ జలవిహార్)లను ప్రారంభించారు. రూ.239 కోట్లతో నగరంలో ఐదు చోట్ల నిర్మించే మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు. õవిజయవాడ పురపాలక సంస్థ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్ధలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పత్రాలు అందజేశారు. కొందరు లబ్ధిదారులకు సీఎం జగన్ స్వయంగా వీటిని అందించారు. తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారంటే.. లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పత్రాలను అందజేస్తున్న సీఎం జగన్, వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న ముఖ్యమంత్రి 31,866 పట్టాల రెగ్యులరైజ్... ఈరోజు విజయవాడలో వివిధ కేటగిరీలకు సంబంధించి 31,866 పట్టాలను రెగ్యులరైజ్ చేసి ఆయా కుటుంబాలకు సంపూర్ణ హక్కులు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 22 ఏ కింద చేర్చడంతో హక్కులు లేక, రిజిస్ట్రేషన్ జరగక ఇబ్బంది పడుతున్న దాదాపు 21 వేల మంది వీరిలో ఉన్నారు. ఈ దుస్థితిని తొలగిస్తూ విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్లో 16 కాలనీల వాసులకు మంచి చేస్తున్నాం. భ్రమరాంబపురంలో ఇళ్లు కట్టుకుని దశాబ్దాలుగా జీవిస్తున్న నిరుపేద కుటుంబాలు రెగ్యులరైజ్ కాకపోవడంతో అమ్ముకునే స్వేచ్ఛ లేక ఇబ్బంది పడుతున్నట్లు అవినాష్ నా దృష్టికి తెచ్చాడు. వీటన్నింటికీ పరిష్కారం చూపుతూ రెగ్యులరైజ్ జరుగుతోంది. ఎలాంటి వివాదాలు లేని 9,125 పట్టాలను కూడా రెగ్యులరైజ్ చేస్తున్నాం. రూ.400 కోట్లతో అంబేడ్కర్ పార్కు విజయవాడలో మీ బిడ్డ ప్రభుత్వం రూ.400 కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టి అంబేడ్కర్ పార్కుకు అందరి కళ్లెదుటే పునాది రాయి వేయడంతోపాటు ప్రారంభించటాన్ని కూడా చూశారు. గతంలో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలంటే ఒక్క ఫ్లై ఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి 58 నెలల వ్యవధిలో పెండింగ్ ఫ్లై ఓవర్ను పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లై ఓవర్లు అదే రోడ్డులో నిర్మించాం. కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ కూడా కలిపితే ఇంకో ఫ్లై ఓవర్ కూడా సాకారమైంది. ఇవన్నీ మన కళ్ల ఎదుటే యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యాయి. బెజవాడ ట్రాఫిక్ కష్టాలకు విముక్తి గుంటూరు నుంచి ట్రాఫిక్ విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్ కష్టాలకు విముక్తి కల్పిస్తూ కాజ నుంచి చిన్న అవుటపల్లి వైపు వెళ్లేలా చేపట్టిన ఔటర్ పనుల ప్రాజెక్టు పూర్తి కావచ్చింది. మరో రెండు నెలల్లో దీన్ని ప్రారంభించేలా పనులు జరుగుతున్నాయి. 58 నెలలుగా మన ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ మంచి చేస్తూ ప్రతి అడుగూ అభివృద్ధి దిశగా వేస్తున్నాం. మనందరి ప్రభుత్వంలో స్కూళ్లు, హాస్పటళ్లు బాగుపడ్డాయి. గ్రామీణ స్థాయిలో వ్యవసాయం బాగుపడింది. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థల ద్వారా ఎప్పుడూ చూడని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక్క రూపాయి లంచం లేకుండా వివక్షకు తావులేకుండా అర్హులందరికీ పారదర్శకంగా మేలు చేస్తున్నాం. కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, కల్పలతారెడ్డి, మొండితోక అరుణకుమార్, రుహూల్లా ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి ఆసిఫ్, డీసీఎంఎస్ చైర్మన్ పడమట స్నిగ్థ, నీటి పారుదల, మున్సిపల్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శశిభూషణ్, శ్రీలక్ష్మి, సీసీఎల్ఏ సాయిప్రసాద్, జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి.సంపత్కుమార్, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో భవాని శంకర్, డిప్యూటీ మేయర్లు అవుతు శైలజారెడ్డి, బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు. రూ.500 కోట్లతో కరకట్ట గోడలు.. కృష్ణా నదికి వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా దాదాపు రూ.500 కోట్లతో కరకట్ట గోడలు నిర్మించాం. గతంలో వరద వస్తే కృష్ణలంక ప్రాంతం నీట మునిగేది. గత పాలకులు మాటలకే పరిమితమయ్యారు. ఇలా గోడ కట్టాలని ఆలోచన చేసిన పాపాన పోలేదు. కృష్ణలంక ప్రాంతంలో అక్కచెల్లెమ్మలు, పిల్లలు, అవ్వలు, తాతలు సాయంత్రం పూట ఆహ్లాదకరంగా గడిపేందుకు పార్కు సుందరీకరణ పనులు చేపట్టాం. చిత్తశుద్ధితో నిర్మించారు వరద వచ్చినప్పుడల్లా మా ప్రాంతంలోని ఇళ్లు ముంపునకు గురయ్యేవి. దీన్ని పరిష్కరించేందుకు ఎంతో మంది నాయకులు హామీ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం రిటైనింగ్ వాల్ నిర్మించారు. వారధి దిగువనే కాకుండా, ఎగువన కూడా నిర్మించారు. ఎగువ ప్రాంతంలో పార్కు అభివృద్ధి చేస్తాననడం సంతోషంగా ఉంది. – కసగోని జ్యోతి, రణదివెనగర్ శాశ్వత పరిష్కారం లభించింది రాణిగారితోట తారకరామనగర్ కరకట్ట దిగువన కూలీ పనులు చేసుకుంటూ కుటుంబంతో జీవిస్తున్నాం. తుపానులు వచ్చినప్పుడల్లా తట్టాబుట్టా సర్దుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లం. వరద ముంపునకు గురైన మా ప్రాంతాన్ని సీఎం జగన్ కళ్లారా చూసి చలించిపోయి గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గోడ నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభించింది. – ఏలూరి వినయ్, తారకరామనగర్ సీఎం జగన్కు రుణపడి ఉంటాం మేం 45 ఏళ్లుగా విజయవాడ నందమూరినగర్లో ఉంటున్నాం. కూలి పనులు చేసుకుంటూ అక్కడే ఒక బీ–ఫారం పట్టా ఉన్న ఇల్లు కొనుక్కున్నాను. అయితే ఎప్పుడు ఎవరొచ్చి ఖాళీ చేయమంటారోనని నిత్యం భయంతో కాలం వెళ్లదీశాను. కంటి నిండా నిద్ర ఉండేది కాదు. ఒక్కోసారి తిండి ఉండేది కాదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి... పోయాయి. ఎప్పటి నుంచో అధికారులు, నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను. కానీ ఫలితం లేకుండా పోయింది. బీ–ఫారం పట్టాకు సంపూర్ణ భూ హక్కు పత్రాలను ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. జీవితాంతం సీఎం జగన్కు రుణపడి ఉంటాం. – చోడవరపు దుర్గ, నందమూరినగర్, విజయవాడ -
మీరు సీఎం జగన్ కాలి మీద వెంట్రుక కూడా పీకలేరు
-
ఎల్లో మీడియాకి దేవినేని అవినాష్ సీరియస్ వార్నింగ్
-
టీడీపీని చిత్తు చిత్తుగా ఓడిస్తాం
-
దేవినేని అవినాష్ పై కేశినేని ప్రశంసలు
-
నాడు ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చుపెట్టి పార్టీని లాక్కున్నారు: దేవినేని అవినాష్
-
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై దేవినేని అవినాష్ ప్రశంసలు
-
టీడీపీ, జనసేనకు సిగ్గుంటే.. గద్దె రామ్మోహన్ కి ఇదే నా వార్నింగ్
-
విజయవాడలో కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్
టాలీవుడ్ సూపర్ స్టార్ దివంగత నటుడు కృష్ణ విగ్రహాన్ని ప్రముఖ నటుడు కమల్హాసన్ ఆవిష్కరించారు. విజయవాడలోని గురునానక్ కాలనీ కేడీజీవో పార్కులో ఏర్పాటుచేసిన నటశేఖరుడి విగ్రహాన్ని అభిమానుల సమక్షంలో ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్,విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ పాల్గొన్నారు. ఆయన ప్రిన్స్ మహేశ్ బాబు- కృష్ణ అభిమానుల ఆహ్వానం మేరకు కమల్ హాసన్ అక్కడకు హాజరయ్యారు. గత రెండురోజులుగా ఇండియన్-2 చిత్రం షూటింగ్ విజయవాడలో జరుగుతుంది. సూపర్ స్టార్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై కమల్ ఆనందం వ్యక్తం చేశారు. పదిరోజుల వ్యవధిలోనే కృష్ణ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి గారికి కృష్ణ కుటుంబ సభ్యులు తరపున దేవినేని ఆవినాష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో కృష్ణ -మహేశ్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరి అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు దేవినేని అవినాష్. అయన నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన మహేష్ బాబు అటు సినీరంగంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటు ప్రజలకు సేవ చేస్తూ.. కృష్ణ గారి గౌరవాన్ని నిలబెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. నగర ప్రజల తరపునే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానుల తరపున కమల్ హాసన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
నిజం గెలిస్తే బాబుకు శాశ్వత జైలు: దేవినేని అవినాష్ కౌంటర్
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ నిరసనలు, ఆందోళనలకు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ కౌంటరిచ్చారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైలులో ఉన్నారని అన్నారు. యాత్రల పేరుతో టీడీపీ నేతలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అంటూ కామెంట్స్ చేశారు. కాగా, దేవినేని అవినాష్ శుక్రవారం విజయవాడలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. నిజం గెలిస్తే చంద్రబాబు శాశ్వతంగా జైలులోనే ఉంటారు. ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు ఇస్తామని నారా లోకేష్ చెప్పాడు. లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ నేతలు పనిగట్టుకుని ఆందోళనలు చేస్తున్నారు. యాత్రల పేరుతో ఎన్ని అస్యత ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తోంది. పేద, వృద్ధులకు జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ఒక వరం. ప్రజల వద్దకే వైద్యం ద్వారా సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. 14 సంవత్సరాల సీఎం, 43ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా టీడీపీ నాయకులకు మంచి మనసు లేదు. గతంలో టీడీపీ జెండా మోసిన వారికే పథకాలు అందేవి. అదే సీఎం జగన్ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలవుతున్నాయి. ఇంటి వద్దకే ఆరోగ్యం, సంక్షేమం, పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మాది. అభివృద్ధి అంటే గ్రాఫిక్స్ కాదు ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తేవటం అని అన్నారు. ఇది కూడా చదవండి: సీఎం జగన్ పాలనలో సామాజిక విప్లవం: వైఎస్సార్సీపీ నేతలు -
ABN రాధాకృష్ణకు అవినాష్ స్ట్రాంగ్ వార్నింగ్
-
నోటీసులు తీసుకోవడానికి లోకేష్ ఎందుకు భయపడుతున్నాడు: దేవినేని
-
సీఎం జగన్కు మరోసారి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధం: అవినాష్
-
చంద్రబాబుకు దేవినేని అవినాష్ స్ట్రాంగ్ కౌంటర్
-
అదో విఫల గళం
సాక్షి, అమరావతి: నారా లోకేశ్ పాదయాత్రకు బాహుబలి స్థాయిలో బిల్డప్లు ఇచ్చేందుకు చంద్రబాబు, ఎల్లో మీడియా ఎంత ప్రయత్నించినా ప్రజలు జోకర్గానే భావిస్తున్నారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ సమన్వయకర్త(విజయవాడ తూర్పు) దేవినేని అవినాశ్ వ్యాఖ్యానించారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. పాదయాత్రకు ప్రజా స్పందన లేకపోవడంతో చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్ను రంగంలోకి దించారని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ సైకోల్లా ప్రవర్తిస్తుండటం వల్లే వారిని ప్రజలు ఆదరించడం లేదన్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో ప్రజలు మెచ్చేలా పరిపాలిస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రభంజనంలో ఆ ముగ్గురూ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ఆ ముగ్గురూ ద్రోహులే: వెలంపల్లి శ్రీనివాస్ అధికారంలో ఉండగా విజయవాడ, గుంటూరు ప్రాంతాలను ఏమాత్రం అభివృద్ధి చేయకుండా చంద్రబాబు, లోకేశ్ ద్రోహం చేశారు. టీడీపీ సర్కార్కు మద్దతిచ్చిన పవన్కళ్యాణ్ కూడా ద్రోహే. ఆ ముగ్గురూ కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో 45 దేవాలయాలను కూల్చేసిన హిందూ ద్రోహులు. మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు విగ్రహాలను సైతం ధ్వంసం చేసిన ద్రోహులు. కుల మతాలు, పార్టీలకు అతీతంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. వాటిని పొందిన వారిలో టీడీపీ నేతలు వర్ల రామయ్య, బుద్దా వెంకన్న కూడా ఉన్నారు. లోకేశ్ పాదయాత్రకు టీడీపీ నేతలు కూడా స్పందించడం లేదు. టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీల్లో కేశినేని నాని, గల్లా జయదేవ్.. లోకేశ్ పాదయాత్రను బహిష్కరించారు. లోకేశ్ పాదయాత్రపై చంద్రబాబుకు నమ్మకం ఉంటే 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీకి పెట్టే దమ్ము పవన్కు ఉందా? రాజకీయాల్లో జీరో అయిన పవన్ ఇప్పుడు సినిమాల్లో కూడా జీరో అయిపోయారు. ఆ ముగ్గురూ సన్నాసులు కాబట్టే కలసి పోటీ చేసి జగన్ను ఎదుర్కోవాలని ప్రయత్నిస్తున్నారు. విదేశీ విద్య పథకం ద్వారా ఆర్య వైశ్యుల పిల్లలను కూడా విదేశాలకు పంపిన ఘనత సీఎం జగన్ది. పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం ఫలితంగా నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరిస్తే రాష్ట్ర అవతరణ దినాన్ని జూన్ 2కు మార్చింది చంద్రబాబే. దాన్ని మళ్లీ మార్చి నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవాన్ని సీఎం జగన్ నిర్వహిస్తున్నారు. బ్యారేజ్పై ఫొటో షూట్కు రూ.5 కోట్లు: మల్లాది విష్ణు టీడీపీ హయాంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రకాశం బ్యారేజీ మీదుగా వెళ్తామంటే అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారు. నల్ల బెలూన్లతో నిరసన తెలిపి పసుపు నీళ్లతో కడిగే స్థాయికి దిగజారిపోయారు. ఇప్పుడు లోకేశ్ పాదయాత్రను మేం ఎక్కడన్నా అడ్డుకునే ప్రయత్నం చేశామా? డబ్బులు, మద్యాన్ని పంచి పెయిడ్ వర్కర్లతో ప్రకాశం బ్యారేజ్పై ఈవెనింగ్ వాక్ చేసిన లోకేశ్ ఫొటో షూట్కు రూ.5 కోట్లు ఖర్చు పెట్టారు. విజయవాడ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన రూ.500 కోట్లను దారి మళ్లించి ద్రోహం చేసింది చంద్రబాబే. దొంగ టీడీఆర్ బాండ్లను తయారు చేసి అమ్మిన పార్టీ టీడీపీ. అమ్మవారి దేవాలయంలో క్షుద్ర పూజలు చేసిన వ్యక్తి లోకేశ్. బ్రాహ్మణ వీధిలో గోశాలను కూలగొట్టి గోవులకు నిలువ నీడ లేకుండా చేశారు. నదీ తీరంలో పురోహితులకు చోటు లేకుండా చేసిన ఘనత కూడా టీడీపీదే. మేం 11 అంశాలతో రూపొందించిన చార్జ్షిట్కు లోకేశ్, చంద్రబాబు సమాధానం చెప్పాలి. జగనన్న కాలనీల ద్వారా విజయవాడలో 90 వేల మందికి ఇళ్ల స్థలాలు అందించిన ఘనత సీఎం జగన్ది. టీడీపీ పాలనలో వైశ్యులు, ముస్లింలు, బ్రాహ్మణులకు ఏం చేశారో లోకేశ్ చెప్పాలి. ఆర్–5 జోన్లో విజయవాడకు చెందిన 30 వేల మందికి సీఎం జగన్ ఇళ్ల పట్టాలిస్తుంటే వాటిని రద్దు చేస్తానని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబు, లోకేశ్, పవన్ ముగ్గురూ సైకోలే. విజయవాడ నగరం వైఎస్సార్సీపీ అడ్డా. ఎర్ర పుస్తకం పట్టుకుని సైకోలా: దేవినేని అవినాశ్ పెయిడ్ వర్కర్లతో ఈవెనింగ్ వాక్ చేస్తున్న లోకేశ్కు 2014–19 మధ్య ప్రజలకు ఏం చేశారో చెప్పే దమ్ముందా? ఎర్ర పుస్తకం పట్టుకుని సైకోలా ఊగిపోతున్నాడు. లోకేశ్ యాత్ర వల్ల చంద్రబాబు సీఎం కాలేరు. లోకేశ్ ఎమ్మెల్యే కాలేడు. చంద్రబాబూ? ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది. గత నాలుగేళ్లలో సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో విజయవాడ నగరం మౌలిక సదుపాయాల కల్పనతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిటైనింగ్ వాల్, ఫ్లైఓవర్లు వంటి అనేక నిర్మాణాలు పూర్తి చేశారు. పాదయాత్రలో లోకేశ్ వాటిని చూడాలి. టీడీపీ హయాంలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ను సింగపూర్ కంపెనీకి కట్టబెట్టాలని చూస్తే ఇప్పుడు సీఎం జగన్ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. -
లోకేష్ది ఈవెనింగ్ వాక్: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: లోకేష్ది పాదయాత్ర కాదని.. ఈవెనింగ్ వాక్ అంటూ విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. విజయవాడకు టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధిని లోకేష్ చూడాలని, అందుకోసమైనా రావాల్సిందేనని అవినాష్ పేర్కొన్నారు. టీడీపీలో జోకర్లకు నా సూటి ప్రశ్న దేవినేని అవినాష్ శనివారం సాక్షి మీడియాతో మాట్లాడుతూ, విజయవాడ ప్రజలకు, కనకదుర్గమ్మ అమ్మవారికి టీడీపీ తరపున నారా లోకేష్ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిన తర్వాతే లోకేష్ విజయవాడలో నడవాలన్నారు. దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయించిన పార్టీ టీడీపీ. బెజవాడ టీడీపీలో బఫూన్లు.. జోకర్లకు నా సూటి ప్రశ్న. సిగ్గుంటే మీ హయాంలో రిటైనింగ్ వాల్ ఎందుకు కట్టలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. పాదయాత్ర అట్టర్ ప్లాప్.. ‘‘వరదలొస్తే ప్రజలకు ఇబ్బందుల పడకుండా రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన గొప్ప నాయకుడు సీఎం జగన్. లోకేష్ పాదయాత్ర గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే జాకీలేసి లోకేష్ను లేపాలని చూస్తున్నారు. పాదయాత్ర అట్టర్ ప్లాప్ అవ్వడంతో నీచపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. వాళ్లలో వాళ్లే గొడవలు పడి బ్యానర్లు చించేస్తున్నారని మా పై బురద జల్లుతున్నారు. పాదయాత్ర పేరు చెబితేనే టీడీపీ నేతలు భయపడిపోతున్నారు. ఖర్చు తట్టుకోలేక.. జనాన్ని తీసుకురాలేక... తలలు పట్టుకుంటున్నారు’’ అంటూ దేవినేని అవినాష్ చురకలు అంటించారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి చూడు.. ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంకి, నారా లోకేష్ పాదయాత్రకు తేడాలేదు. లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాల్సిన అవసరం లేదు. లోకేష్ విజయవాడ నగరమంతా నడవాలని కోరుకుంటున్నా.. సీఎం జగన్ చేసిన అభివృద్ధిని చూడాలని కోరుతున్నానని అవినాష్ అన్నారు. బుద్ధావెంకన్న వ్యాఖ్యలకు అవినాష్ స్ట్రాంగ్ కౌంటర్: బుద్ధావెంకన్న వ్యాఖ్యలకు దేవినేని అవినాష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ మా ఇంటికొస్తే రాజకీయం చేస్తున్నారు. బుద్ధా వెంకన్న ఓ బఫూన్...కాల్ మనీ నేరస్తుడు...నెత్తిమీద పైసా పెట్టిన అమ్ముడుపోడు. వాళ్ల జీవితంలో ఏనాయకుడైనా వాళ్ల ఇంటి వైపు చూశాడా. సీఎం మా ఇంటికొచ్చి నాలుగు మంచి మాటలు చెబితే టీడీపీ నేతలు నీచపు రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. రిటైనింగ్ వాల్, కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ల వద్ద లోకేష్ సెల్ఫీ దిగాలంటూ నారా లోకేష్కు దేవినేని అవినాష్ సవాల్ విసిరారు. -
‘వారిపై కేసులు పెట్టాల్సిన అవసరం మాకు లేదు’
సాక్షి, విజయవాడ: ఆంధ్రజ్యోతి పత్రికలో అవాస్తవాలు రాస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే రాధాకృష్ణ పిచ్చి రాతలు రాస్తున్నారన్నారు. శనివారం ‘సాక్షి’తో మాట్లాడిన దేవినేని అవినాష్..‘ రిపీటెడ్ అఫెన్స్ చేసేవారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.తూర్పు నియోజకవర్గ టీడీపీ నేతల దొంగతనాలకు పాల్పడ్డారు. చట్టప్రకారమే నేరస్తులను శిక్షిస్తున్నారు.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎవరిపైనా కేసులు పెట్టలేదు. టీడీపీ, జనసేనలపై కేసులు పెట్టి వారిని తొక్కాల్సిన అవసరం మాకు లేదు. తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది’ అని తెలిపారు. -
చంద్రబాబు, పవన్ పై దేవినేని అవినాష్ ఫైర్
-
టీడీపీ, ఎల్లో మీడియాకు నిద్రపట్టడం లేదు: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: దివంగత ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు విజయవాడలో నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పాల్గొంటారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కాగా, దేవినేని అవినాష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు రేపు ఘనంగా నిర్వహిస్తున్నాం. మేమూ ఎన్టీఆర్ అభిమానులమే. ఎన్టీఆర్కు బ్యానర్లు కట్టే హక్కు మాకుంది. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి ఎవరూ రాసివ్వలేదు. టీడీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావన రాకుండా చేసేవారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన మనసున్న నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎన్టీఆర్ పేరును చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయేలా చేశారు సీఎం జగన్. కనీవినీ ఎరుగని రీతిలో నిన్న అమరావతిలో జరిగిన ఇళ్ల పట్టాల పండుగకు లబ్ధిదారులు తరలివచ్చారు. చంద్రబాబు సభలకు జనం రావాలంటే డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి. కానీ, సీఎం జగన్ మీటింగ్కు సంతోషంతో లబ్ధిదారులు తరలివచ్చారు. టీడీపీ నేతలు మూడేళ్లు పేదలకు ఇళ్లు రాకుండా వ్యవస్థల ద్వారా అడ్డుకున్నారు. అమరావతిలో తన పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వ్యక్తులు మాత్రమే ఉండాలని చంద్రబాబు అనుకున్నాడు. దమ్మున్న నాయకుడిగా సీఎం జగన్ పేదల తరపున పోరాడారు. ఇళ్ల పట్టాల పండుగను చూసి టీడీపీ నేతలకు, ఎల్లో మీడియాకు నిద్రపట్టడం లేదు. పేదల సొంతింటి కల నెరవేరుతుంటే చూసిఓర్వలేకపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇళ్ల పట్టాలను రద్దుచేస్తామంటున్న టీడీపీ నేతలకు సిగ్గుందా?. సెంటు స్థలంపై విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు తలలెక్కడ పెట్టుకుంటారు. సీఎం జగన్ సభను చూసిన తర్వాత టీడీపీ నేతలకు దిమ్మతిరిగింది. ఇది కూడా చదవండి: వివేకా కేసు: చంద్రబాబు దుర్మార్గం ఏ స్థాయికి చేరిందంటే.. -
పాలనపై ప్రజాభిప్రాయం సేకరణ సర్వే చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే
-
గతంలో ఏ ప్రభుత్వం చేయలేని దమ్మున్న పనిని సీఎం జగన్ చేసి చూపించారు
-
చంద్రబాబూ.. ఆ మోసాన్ని గుర్తు తెచ్చుకో: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: రాణిగారితోటలో నిన్నటి చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేతకు 200 మంది కార్యకర్తలు కూడా రాలేదని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గద్దె రామ్మోహన్, చంద్రబాబు అందరూ కట్టకట్టుకుని కృష్ణా నదిలో దూకాలంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘గత ఐదేళ్లలో కృష్ణలంక, రాణీగారి తోట ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. నిన్నటి సభ చూసైనా చంద్రబాబు ఈ ప్రాంతానికి చేసిన మోసాన్ని గుర్తు తెచ్చుకోవాలి. తూర్పు నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. సీఎం జగన్ ప్రభుత్వంలోనే రాణిగారితోట ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇంటింటికీ కుళాయిలు అందించాం. చంద్రబాబు మీటింగ్ పెట్టుకున్న సభకు ఎదురుగా ఉన్న కమ్యూనిటీ హాల్ మేం నిర్మించిందే. రిటైనింగ్ వాల్ నిర్మించింది కూడా సీఎం జగన్ ప్రభుత్వమే’’ అని దేవినేని అవినాష్ అన్నారు. చదవండి: చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ సెగ.. ఈడ్చిపడేయాలంటూ ఆదేశాలు ‘‘సైకిల్ పోవాలని.. చంద్రబాబే తన మనసులో మాట బయటపెట్టాడు. బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం మేం ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటి ఆలోచన నీకెప్పుడైనా వచ్చిందా చంద్రబాబు. గద్దె రామ్మోహన్ రాసిచ్చిన పేపర్ చదివి మమ్మల్ని విమర్శించావ్. రాణిగారితోట ప్రాంతంలో ముస్లిం మహిళలను రెచ్చగొట్టింది గద్దె రామ్మోహన్. టీడీపీలో కొందరు నారా లోకేష్ను ఫాలో అవుతున్నారు. వార్డు మెంబర్గా గెలవలేని వాళ్లను పార్టీలో చేర్చుకునే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయాడు’’ అని అవినాష్ దుయ్యబట్టారు. -
అవసరానికో అబద్ధం
త్రిగున్, రుబాల్ షేక్ రావత్ జంటగా ఆయాన్ బొమ్మాళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అవసరానికో అబద్ధం’’. ఝాన్సీ, శ్రీ కృష్ణమూర్తి యలమంచిలి సమర్పణలో డా. శివకుమార్ చికిన సహకారంతో డా. జై జగదీశ్ బాబు యలమంచిలి నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ కొట్టారు. మరో నిర్మాత సురేష్బాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఆయాన్ బొమ్మాళి, కృష్ణమూర్తి, డా. జై జగదీశ్బాబు మాట్లాడుతూ– ‘‘మనిషి జీవితంలో నిజానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అబద్ధానికి కూడా అంతే ప్రాధాన్యత ఉందని చెప్పే సందేశంతో మా చిత్రం రూ΄పొందుతోంది’’ అన్నారు. ఈ ప్రారంప్రాత్సవంలో విజయవాడ తూర్పు వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ , తెలంగాణ పో లీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ కోలేటి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సీహెచ్ మోహన్ చారి. -
పథకం ప్రకారమే మాపై టీడీపీ దాడికి దిగింది: దేవినేని అవినాష్
-
కుట్రల్ని తిప్పికొడతాం.. వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మహిళలపై పథకం ప్రకారం టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్నారు. సీఎం జగన్కు వస్తున్న ఆదరణను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతల్లా మాయమాటలు చెప్పడం లేదని అన్నారు. ఇంత చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ, ఎల్లోమీడియా విషప్రచారం చేస్తున్నాయి అని మండిపడ్డారు. ఈమేరకు అవినాష్ మీడియాతో మాట్లాడుతూ.. 'నిజాన్ని బయటకి రానీయకుండా నిన్నటి నుంచి ఎల్లో మీడియా అబద్దపు ప్రచారాలు చేస్తోంది. ప్రజల్లోకి అబద్దాలు తీసుకెళ్లాలని టిడిపి నేతలు ప్రయత్నించారు. ప్లాన్ ప్రకారమే వాలంటీర్పై టిడిపి నేతలు దాడి చేశారు. సీఎం వైఎస్ జగన్ తూర్పు నియోజకవర్గ నేతలతో సమావేశమై దేవినేని అవినాష్ని గెలిపించాలని అన్నప్పటి నుంచి వారి కుట్రలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలయ్యేదాకా కుట్రలకు పాల్పడుతారు. వాటన్నింటినీ తిప్పికొట్టి తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం' అని దేవినేని అవినాష్ చెప్పారు. చదవండి: (సీఎం జగన్ను కలిసిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు) -
చాలా రంగాల్లో టీడీపీ వాళ్లే పాతుకుపోయారు: బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి
-
సమష్టిగా నడుద్దాం.. క్లీన్ స్వీప్ చేద్దాం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో అంతా సమష్టిగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో అన్ని శాసనసభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం తథ్యమని విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. సంక్షేమ పథకాల ద్వారా బటన్ నొక్కి డీబీటీ(ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో 88 శాతం కుటుంబాలకు మంచి చేశామని.. విద్య, వ్యవసాయ, వైద్య రంగాలలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చామని.. వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన అందిస్తున్నామని వివరించారు. దాంతో ప్రజల్లో మార్పు ప్రస్ఫుటంగా కన్పిస్తోందన్నారు. గడప గడపకూ వెళ్లి.. ప్రజలతో మమేకమై.. చేస్తున్న మంచిని చెప్పి.. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరాలని ఉద్బోధించారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకురావాలని మార్గనిర్దేశం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం వైఎస్ జగన్ విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం ఏమన్నారంటే.. ప్రజలతో మమేకమవ్వండి ► నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తుండటానికి ప్రధాన కారణం.. ఒకటి కార్యకర్తలను కలుసుకోవడం, రెండు మరో 14–15 నెలల్లో జరగనున్న ఎన్నికలకు సమాయత్తం చేయడం. సచివాలయాల వారీగా కన్వీనర్లు, అలాగే ప్రతి 50 – 70 ఇళ్లకు గృహసారథులను పార్టీ నుంచి నియమిస్తున్నాం. పార్టీ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యులను చేసుకుంటూ ముందుకు వెళ్దాం. గృహ సారథుల్లో ఒకరు కచ్చితంగా మహిళ అయి ఉండాలి. ► గడపగడపకూ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమవ్వండి. మూడున్నరేళ్లుగా చేస్తున్న మంచిని అక్కాచెల్లెమ్మలకు వివరించండి. వారి ఆశీర్వాదం తీసుకోండి. ఏ ఒక్కరికైనా ఏ చిన్న సమస్య ఉన్నా, అర్హత ఉండి మిస్ అయిపోతే దాన్ని పరిష్కరించి మంచి చేయాలి. అర్హులెవ్వరూ మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో ఇంత ధ్యాస పెడుతున్నాం. గతంలో ఎవ్వరూ, ఎప్పుడూ ఇంత ధ్యాస పెట్టలేదు. ఏడాదిలో రెండుసార్లు అలాంటి వారికి అన్నీ మంజూరు చేస్తున్నాం. ప్రస్ఫుటంగా రాజకీయ మార్పు ► రాష్ట్రంలో 88% ఇళ్లకు మంచి చేశాం. ప్రతి అక్క, చెల్లెమ్మ పేర్లతో సహా చేసిన మంచిని పారదర్శకంగా చెప్పగలం. అందుకనే రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రాజకీయ మార్పు జరుగుతోంది. కుప్పంలాంటి చోట్ల మున్సిపాల్టీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇలా అన్ని ఎన్నికల్లో 80%కి పైగా క్లీన్ స్వీప్ చేయగలిగాం. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూడా 21 డివిజన్లలో 14 చోట్ల గెలిచాం. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నచోట కూడా మనం అధికంగా వార్డులు గెలవగలిగాం. మార్పు అనేది కనిపిస్తోంది. దీనికి నిదర్శనమే కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు. టార్గెట్ 152 కాదు.. 175 ► వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 175 కు 175 సీట్లు మనం గెలవాలి. అలాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఏ వార్డులోకి వెళ్లినా, గ్రామంలోకి వెళ్లినా.. ప్రతి ఇంట్లో కూడా సంతోషం కనిపిస్తోంది. ► మన ప్రాంతంలో స్కూళ్లు మారుతున్నాయి.. చదువులు మారుతున్నాయి.. ఆస్పత్రులు మారుతున్నాయి. ఆర్బీకేల ద్వారా వ్యవసాయం మారుతోంది. ఇంత మార్పు అన్నది ఎప్పుడూ జరగలేదు. వచ్చే ఉగాది నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో వస్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో మనం తీసుకొచ్చిన మార్పులన్నీ పూర్తి స్థాయిలో ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఈ ఎన్నికలకు మనం అంతా కలిసికట్టుగా పని చేయాలి. ఎలాంటి విభేదాలున్నా పక్కన పెట్టాలి. ► వచ్చే ఎన్నికలను సీరియస్గా తీసుకుందాం. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించాం. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 152 కాదు.. 175 స్థానాల్లో గెలవడమే మన టార్గెట్. ఈసారి గెలిస్తే.. మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం. 30 ఏళ్లపాటు మంచి పరిపాలన ప్రజలకు అందిస్తాం. ► నాకు ఎన్ని కష్టాలు ఉన్నాసరే.. బటన్ నొక్కే కార్యక్రమాన్ని చేస్తున్నాను. మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి. ఒకరికొకరు కలిసి ఈ ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలి. ప్రతి ఇంటికీ వెళ్లి.. వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. మనకు ఓటు వేయని వారి ఇళ్లకు కూడా మనం వెళ్లాలి. చేసిన మంచిని వారికి వివరిస్తే.. కచ్చితంగా వారిలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. మనం వెళ్లకపోతే తప్పు చేసినట్టు అవుతుంది. అందుకనే ప్రతి ఇంటికీ వెళ్లాలి. అందరి ఆశీర్వాదాలు కోరాలి. మంచితనంతో మన ప్రయత్నం మనం చేయాలి. ► విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బోండా ఉమపై దేవినేని అవినాష్ ఫైర్
-
‘బోండా ఉమ ఒక చిల్లర వ్యక్తి.. బజారు మనిషి’
విజయవాడ: చంద్రబాబు నాయుడు, బోండా ఉమాపై విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. బోండా ఉమ లాంటి ఒక లోఫర్ను చంద్రబాబు తప్ప ఎవరూ ప్రోత్సహించరని అవినాష్ మండిపడ్డారు.బెజవాడకు గంజాయి అలవాటు చేసిన వ్యక్తి బోండా ఉమ అని, బైక్ కార్ రేసులతో పాటు రేవ్ పార్టీ కల్చర్ను నగరానికి తెచ్చింది కూడా బోండా ఉమనేనని అన్నారు అవినాష్. ‘బోండా ఉమ ఒక చిల్లర వ్యక్తి, బజారు మనిషి. బోండా ఉమ కుటుంబం గురించి చెప్పాలంటే చాలా ఉంది. తిరుపతిలో సారా వ్యాపారం చేసిన వ్యక్తి బోండా ఉమ. కోగంటి సత్యం, ఐలాపురం వెంకయ్య దగ్గర డ్రైవర్గా పని చేసి వారినే మోసం చేసిన వ్యక్తి బోండా ఉమ. గతంలో టీడీపీ ప్రభుత్వమే బోండా ఉమ అక్రమాలపై విచారణ చేసింది.చంద్రబాబు కాళ్లు పట్టుకొని బోండా ఉమ బయటపడ్డాడు. బైక్, కార్ రేసులు, రేవ్ పార్టీ కల్చర్ నగరానికి తెచ్చిందే బోండా ఉమ. మంత్రి పదవి కోసం చంద్రబాబును బోండా బ్లాక్ మెయిల్ చేస్తే, భూ కబ్జాలపై బోండా ఉమకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. బోండా ఉమ లాంటి లోఫర్ చంద్రబాబు తప్ప ఎవరూ ప్రోత్సహించరు’ అని అవినాష్ విమర్శలు గుప్పించారు. -
సాధారణ తనిఖీల్లో భాగంగానే ఐటీ అధికారులు వచ్చారు : దేవినేని అవినాష్
-
కాల్మనీ రాకెట్లో టీడీపీ నేతలు పాత్రధారులు: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబును.. సొంత పార్టీ నేతలే తిడతారు. విజయవాడలో టీడీపీ భూ స్థాపితం అయిపోయిందని వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గం ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను విమర్శిస్తే సహించేదిలేదని టీడీపీకి వార్నింగ్ ఇచ్చారు. దేవినేని అవినాష్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ సమావేశం ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిగింది. చంద్రబాబు టీడీపీ నేతల్ని పిలిపించి సమావేశం పెట్టమన్నాడు. కొడాలి నాని, వంశీ, అవినాష్ల మీద శపథాలు చేయండి.. తొడలు కొట్టండి అని చెప్పాడు. అలా చేసిన టీడీపీ నేతల చీకటి బ్రతుకులు నాకు తెలుసు. ఇప్పుడు తొడలు కొట్టిన వారే.. ఉదయం చంద్రబాబును పొగుడుతారు.. మళ్లీ వారే రాత్రి అయితే వెదవ అని తిడతారు. వైఎస్సార్సీపీ నేతల కన్నా.. టీడీపీ నాయకులే చంద్రబాబును ఎక్కువగా తిడతారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలిచింది కాబట్టే.. ఏమీ చేయలేక కవ్వింపు రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు కాల్మనీ రాకెట్లో పాత్రధారులు. టీడీపీ విజయవాడలో ఎప్పుడో భూ స్థాపితం అయిపోయింది. దేవినేని ఉమకు మైలవరంలోనే గతిలేదు. ఇంకా జిల్లాలో టీడీపీనేం గెలిపిస్తాడు?. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయం అని అన్నారు. ఇది కూడా చదవండి: ఉత్తరాంధ్ర నాశనాన్ని కోరతారా? -
చిరువ్యాపారుల గురించి లోకేష్ అసత్యాలు మాట్లాడారు: దేవినేని అవినాష్
-
టీడీపీ తప్పుడు ప్రచారం :దేవినేని అవినాష్
-
ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అవినాష్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు పెద్ద పీట వేశారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుపరిపాలన అందిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్నారు. రాష్ట్రంలో అర్హులైన వారికి ఉచితంగా ఇల్లు ఇస్తున్నారన్నారు. మహిళల పేర్లతో ఇళ్ల పట్టాలిస్తున్నామని తెలిపారు. ఆదివారం ఆయన యనమాలకుదురులో మెగా టౌన్షిప్లో అర్హులైన మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 634 మందికి టిడ్కో ఇళ్ల పత్రాలు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దమ్మున్న నాయకుడు సీఎం జగన్ పేద ప్రజలకు అండగా ఉన్నారని అభయమిచ్చారు. సీఎం జగన్ 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చారని తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు హామీలకే పరిమితమైతే సీఎం జగన్ పాదయాత్రలో చెప్పిన హామీలు నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. ఇక తూర్పు నియోజకవర్గంలో 30 వేల మందికి అమ్మ ఒడి వస్తుందన్నారు. (చదవండి: ప్రధాని ప్రశంసలు సైతం దక్కాయి: దేవినేని అవినాష్)