districts
-
AP: జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం
సాక్షి, విజయవాడ: జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 26 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది.జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు వీరే..శ్రీకాకుళం జిల్లా- కొండపల్లి శ్రీనివాస్పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు- కింజరాపు అచ్చెన్నాయుడువిజయనగరం జిల్లా- వంగలపూడి అనితవిశాఖ జిల్లా- డోలా బాలవీరాంజనేయస్వామిఅల్లూరి సీతారామరాజు జిల్లా- గుమ్మడి సంధ్యారాణిఅనకాపల్లి జిల్లా- కొల్లు రవీంద్రకాకినాడ జిల్లా- పొంగూరు నారాయణతూర్పుగోదావరి జిల్లా- నిమ్మల రామానాయుడుఏలూరు జిల్లా- నాదెండ్ల మనోహర్పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలు- గొట్టిపాటి రవికుమార్ఎన్టీఆర్ జిల్లా- సత్యకుమార్ యాదవ్కృష్ణా జిల్లా- వాసంశెట్టి సుభాష్గుంటూరు జిల్లా- కందుల దుర్గేష్బాపట్ల జిల్లా- కొలుసు పార్థసారథిప్రకాశం జిల్లా- ఆనం రామనారాయణరెడ్డినెల్లూరు జిల్లా- ఎన్ఎండీ ఫరూఖ్నంద్యాల జిల్లా- పయ్యావుల కేశవ్అనంతపురం జిల్లా- టీజీ భరత్శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలు- అనగాని సత్యప్రసాద్వైఎస్సార్ జిల్లా- ఎస్.సవితఅన్నమయ్య జిల్లా- బీసీ జనార్దన్రెడ్డిచిత్తూరు జిల్లా- మండిపల్లి రాంప్రసాద్రెడ్డి -
‘తెలంగాణ’ జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
TG: పలు జిల్లాలకు భారీ వర్షసూచన
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం(జులై 19) నాలుగు జిల్లాలకు భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక శనివారం(జులై 20) ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపెల్లి జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాల్లో ఒక్కసారిగా వరదలు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాయుగుండం ప్రభావంతో.. బంగాళాఖాతలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుండటంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు పరిసర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది. -
ఆ ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్.. కారణమిదే?
నాగాలాండ్లోని ఆరు తూర్పు జిల్లాల్లో పోలింగ్ స్టేషన్ల వద్ద సిబ్బంది తొమ్మిది గంటల పాటు వేచి ఉన్నప్పటికీ ఒక్క ఓటరు కూడా ఓటు వేయలేదు. ‘ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ’ (ఎఫ్ఎన్టీ) బంద్ పిలుపుతో ఈ ప్రాంతంలోని నాలుగు లక్షల మంది ఓటర్లలో ఎవరూ ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్పీఓ)ఎఫ్ఎన్టీ డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమస్య లేదని ముఖ్యమంత్రి నీఫియు రియో వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతానికి స్వయంప్రతిపత్త అధికారాలను సిఫారసు చేశారన్నారు. కాగా 20 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన ప్రాంతంలోని 738 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సిబ్బంది ఉన్నారని నాగాలాండ్ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవ లోరింగ్ తెలిపారు. అయినప్పటికీ ఓటు వేసేందుకు ఎవరూ రాలేదని సీఈవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. నాగాలాండ్లోని 13.25 లక్షల మంది ఓటర్లలో తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో 4,00,632 మంది ఓటర్లు ఉన్నారు. కాగా తౌఫెమాలో ఓటు వేసిన అనంతరం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ, ఎఫ్ఎన్టీకి సంబంధించిన ‘డ్రాఫ్ట్ వర్కింగ్ పేపర్’ను కేంద్ర హోంమంత్రికి అందజేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి విషయంలో ఈ ప్రాంతాన్ని విస్మరించాయని ఆరోపిస్తూ ఈఎన్పీవో ఆరు జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తోంది. నాగాలాండ్లో లోక్సభ ఎన్నికలు ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఈఎన్పీవో గురువారం సాయంత్రం 6 గంటల నుండి రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో నిరవధిక బంద్ను ప్రకటించింది. -
దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలున్నాయి?
‘ఈ దేశంలో ఉంటూ.. ఈ దేశానికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకోకపోతే ఎలా?’ అని చాలామంది అంటుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల వివరాలు తెలుసుకోవడం ఎవరికైనా తప్పనిసరి. అందుకే మన దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో వైశాల్యం పరంగా రాజస్థాన్ను అతిపెద్ద రాష్ట్రంగా పరిగణిస్తారు. జనాభా కోణంలో చూస్తే ఈ టైటిల్ ఉత్తరప్రదేశ్కు దక్కుతుంది. అయితే మన దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలు ఉన్నాయి? అవి ఎన్ని? అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో అత్యధిక జిల్లాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 75. ఇవి 2,40,928 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ జిల్లాలను 18 డివిజన్లుగా విభజించారు. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 822 కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాకులు, 350 తహసీల్లు కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని అతిపెద్ద జిల్లా లఖింపూర్ ఖేరీ. ఇది దాదాపు 10.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. లఖింపూర్ ఖేరీ పొరుగు దేశం నేపాల్తో సరిహద్దును పంచుకుంటుంది. ఈ జిల్లాలో గోమతి, శారద, కథన తదితర నదులు ప్రవహిస్తున్నాయి. యూపీలోని అతి చిన్న జిల్లా హాపూర్. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో జిల్లాలు కలిగిన రెండవ రాష్ట్రం మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రంలో మొత్తం 52 జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా చింద్వారా. ఈ జాబితాలో మూడవ స్థానంలో బీహార్ ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 38 జిల్లాలున్నాయి. 101 సబ్ డివిజన్లు, 534 సిడి బ్లాక్లు ఉన్నాయి. బీహార్లోని అతిపెద్ద జిల్లా పట్నా. ఇది బీహార్ రాజధాని. పట్నా పలు ప్రత్యేకతలు కలిగిన ప్రాంతం. -
AP: ‘ఐబీ’ సిలబస్ శిక్షణ ఇదిగో
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి గత నెల 31వతేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఐబీ సంస్థతో ఏపీ ఎస్సీఈఆర్టీ ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 15 రోజుల వ్యవధిలో ఐబీ ప్రతినిధులు ఏపీలో విద్యా విధానం, సంస్కరణల అమలు, ఉపాధ్యాయ శిక్షణ తదితర అంశాలను పరిశీలించారు. ఒప్పందం జరిగిన వెంటనే విజయవాడలోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఐబీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సంస్థ ప్రతినిధులు కార్యకలాపాలు ప్రారంభించారు. ఈనెల 26వతేదీ నుంచి 9 రోజుల పాటు ఐబీ అధికారుల బృందం జిల్లాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా, మండల, మున్సిపల్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర మేనేజ్మెంట్ పాఠశాలను బృందం పరిశీలిస్తుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు, ఉపాధ్యాయుల సామర్థ్యాలను అంచనా వేయనున్నారు. – సాక్షి, అమరావతి తొలుత విజయవాడలో టీచర్లకు శిక్షణ ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ బోధనపై మార్చి నుంచి విజయవాడలో మాస్టర్ ట్రైనర్స్గా తొలుత కొందరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నారు. మెక్సికోకు చెందిన ఐబీ ప్రతినిధి ఆల్డో ఇటీవల ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను స్వయంగా పరిశీలించారు. సదుపాయాలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల వినియోగం, బోధనా విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్ల పనితీరును అడిగి తెలుసుకోవడంతో పాటు వారితో సంభాషించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ‘జగనన్న గోరుముద్ద’ను సైతం రుచి చూశారు. పాఠశాలల్లో భౌతిక, జీవశాస్త్ర ప్రయోగశాలలు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్లను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. ఐబీకి చెందిన మరో ప్రతినిధి ఆశిష్ రెండు రోజులు విద్యాశాఖ అధికారులతో సమావేశమై పాఠశాలల్లో ఐటీ, ఆన్లైన్ సేవలను తెలుసుకున్నారు. ఏపీ విద్యా విధానాలు ఐబీకి దాదాపు దగ్గరగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి.. ఐబీ అమలుపై 2024–25 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఉపాధ్యాయులతోపాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డు సిబ్బంది వీరిలో ఉంటారు. వీరికి దశలవారీగా ‘ఐబీ’పై అవగాహన, నైపుణ్యం, సామర్థ్యాల పెంపుపై శిక్షణ ఇచ్చి ఐబీ సర్టిఫికెట్లు అందచేస్తారు. దీంతో వీరంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్వర్క్లో భాగమవుతారు. అనంతరం 2025 జూన్లో ప్రారంభమయ్యే 2025–26 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతితో ఐబీ విద్యాబోధన ప్రారంభం అవుతుంది. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ వెళతారు. విద్యార్థులు 2035 నాటికి పదో తరగతి, 2037లో ప్లస్ 2లో ఐబీ సిలబస్లో పరీక్షలు రాస్తారు. విద్యార్థులకు ఐబీ, ఏపీ ఎస్సీఈఆర్టీ కలిసి అందించే జాయింట్ సర్టిఫికేషన్కు అంతర్జాతీయ గుర్తింపు ఉంటుంది. రూ.73 వేల కోట్లతో సంస్కరణలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేద పిల్లలు అధికంగా చదువుకునే పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థులు ఉన్నతంగా ఎదిగి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రాథమిక స్థాయి నుంచి ప్రణాళికలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద తదితర విప్లవాత్మక కార్యక్రమాలను ప్రవేశపెట్టి విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసింది. 2019 జూన్ నుంచి 2024 జనవరి వరకు విద్యా రంగ సంస్కరణల కోసం ఏకంగా రూ.73,293.68 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు ఐబీ బోధనను సైతం ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులోకి తెస్తోంది. అత్యధిక ఐబీ స్కూళ్లు ఏపీలోనే.. ప్రాథమిక విద్యా బోధనలో ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాలను ఫిన్ల్యాండ్ అమలు చేస్తోంది. పాలనలో పారదర్శకత, మానవ వనరుల వినియోగం, ప్రణాళికలో ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తోంది. ప్రస్తుతం ఐబీ బోర్డు డైరెక్టర్ జనరల్గా ఉన్న ఓలి పెక్కా హీనోనెన్ ఫిన్ల్యాండ్ జాతీయ విద్యాశాఖకు డైరెక్టర్ జనరల్గా సేవలందించారు. ఆయనే స్వయంగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విధానాలను పర్యవేక్షిస్తుండడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల వరకు ఐబీ స్కూళ్లు ఉండగా 2025 జూన్లో ప్రపంచంలోనే అత్యధిక ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలువనుంది. ఏపీలో దాదాపు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ (ప్రాథమిక, ప్రాథమికోన్నత) స్కూళ్లు 39 వేల వరకు ఉన్నాయి. ఈ స్కూళ్లలో 2025 జూన్లో ఒకటో తరగతితో ఐబీ బోధన ప్రారంభం కానుంది. అంతర్జాతీయంగా పేరున్న ఐబీ బోర్డుకు ప్రపంచంలోనే అతి పెద్ద నెట్వర్క్ మన రాష్ట్రంలోనే ఉండడం విశేషం. -
జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించింది. కేబినెట్ లోని మంత్రులందరికీ ఉమ్మడి పది జిల్లాలవారీగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మినహా మిగతా 10 మంది మంత్రులను తలా ఓ జిల్లాకు ఇన్చార్జిగా ప్రభుత్వం నియమించింది. కేబినెట్లో ప్రాతిని ధ్యం దక్కని హైదరాబాద్కు పొన్నం ప్రభాకర్, ఆదిలా బాద్కు సీతక్క, నిజామాబాద్కు జూపల్లి కృష్ణా రావు, రంగారెడ్డికి దుద్దిళ్ల శ్రీధర్బాబులను ఇన్చార్జి మంత్రులుగా బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ) లను కూడా పునరుద్ధరించనున్నట్టు తెలుస్తోంది. ఈ మండళ్ల పునరుద్ధరణ ద్వారా ప్రతి మూడు నెలలకోసారి ఆయా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఇన్చార్జి మంత్రుల నేతృత్వంలో సమీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం. అయితే, ఇన్చార్జి మంత్రులను ప్రజాపాలన కార్యక్రమాల అమలును సమన్వయం చేసేందుకు నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. -
రిజర్వుడ్లో ఖమ్మం టాప్
సాక్షి, ఖమ్మం డెస్్క: తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 31 రిజర్వుడ్ నియోజవర్గాలు. వీటిల్లో 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయి. 2009లో చేపట్టిన డీ లిమిటేషన్ సందర్భంలో జనాభా ఆధారంగా వీటిని ఖరారు చేశారు. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఎక్కువగా రిజర్వుడ్ నియోజకవర్గాలు ఖమ్మంలోనే ఉన్నాయి. ఇక్కడ పది స్థానాలకు గాను ఏడు రిజర్వుడ్ స్థానాలే. ఇందులో ఐదు ఎస్టీ, రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే.... కరీంనగర్, మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం కూడా లేదు. ఎస్టీ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉమ్మడి ఖమ్మం : పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, వైరా ఉమ్మడి ఆదిలాబాద్ : ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్ ఉమ్మడి వరంగల్ : డోర్నకల్, మహబూబాబాద్, ములుగు ఉమ్మడి నల్లగొండ : దేవరకొండ ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉమ్మడి కరీంనగర్ : ధర్మపురి, చొప్పదండి, మానకొండూరు ఉమ్మడి ఖమ్మం : మధిర, సత్తుపల్లి ఉమ్మడి మహబూబ్నగర్ : అచ్చంపేట, అలంపూర్ ఉమ్మడి ఆదిలాబాద్ : చెన్నూరు, బెల్లంపల్లి ఉమ్మడి నల్లగొండ : నకిరేకల్, తుంగతుర్తి ఉమ్మడి వరంగల్ : స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట ఉమ్మడి రంగారెడ్డి : చేవెళ్ల, వికారాబాద్ ఉమ్మడి మెదక్ : జహీరాబాద్, అందోల్ హైదరాబాద్ : కంటోన్మెంట్ ఉమ్మడి నిజామాబాద్ : జుక్కల్ -
70 శాతానికిపైగా భూభాగంలో కరువు పరిస్థితులు
న్యూఢిల్లీ: భారత్లోని 718 జిల్లాలకుగాను 500కుపైగా జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని డౌన్ టు ఎర్త్ అనే సంస్థ అంచనావేసింది. భారత్లో పర్యావరణ సంబంధ రాజకీయాలు, అభివృద్ధిపై ఈ సంస్థ పరిశోధన చేస్తోంది. భారత్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై డౌన్ టు ఎర్త్ సంస్థ ఒక నివేదిక విడుదలచేసింది. నివేదిక ప్రకారం.. ► 718 జిల్లాలకుగాను 500 జిల్లాల్లో అంటే 70శాతానికిపైగా భూభాగంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. ► ఈశాన్య భారతం, తూర్పుభారతంలో కొన్ని ప్రాంతాలు, జమ్మూ కశీ్మర్తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కోస్తాతీరం సహా దక్షిణ భారతంలోని చాలా ప్రాంతాల్లో మధ్యస్థ/తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ► ‘ఈసారి రుతుపవనకాలంలో ఆగస్టులో ప్రతి రోజూ కురవాల్సిన వర్షాలు ఆగి ఆగి కొద్దిరోజులు విరామాలు ఇస్తూ పడ్డాయి. ఇలా ‘బ్రేక్’లు ఇస్తూ పడిన వర్షాలే భారత్లో కరువుకు 70 శాతం కారణం’ అని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ చెప్పారు. ► 53 శాతం జిల్లాల్లో మధ్యస్థ కరువు పరిస్థితులు ఉన్నాయి. ► ఈ ఏడాది ఆగస్టులో ఎక్కువ రోజులు వర్షాలు పడనేలేదు. ఏడో తేదీ నుంచి 18వ తేదీ వరకు పొడి వాతావరణం నెలకొంది. ఈనెలలో ఇన్ని రోజులపాటు వర్షాలు లేకపోవడం అనేది 21వ శతాబ్దిలో మూడో అతిపెద్ద విరామంగా రికార్డులకెక్కింది. గత 123 సంవత్సరాల చరిత్రలో ఆగస్టులో ఇంతటి పొడివాతావరణం నెలకొనడమూ ఇదే తొలిసారి. ► ‘2022 ఏడాదిలో పోలిస్తే 2023లో సాగు విస్తీర్ణం 33 శాతం పెరిగినా.. తగ్గిన వర్షాల కారణంగా దిగుబడి పెరుగుతుందో, తగ్గుతుందో చెప్పలేని పరిస్థితి’ అని క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్ పేర్కొంది. ► ప్రతిఏటా ‘సాధారణ వర్షపాతం’ కేటగిరీ కింద ఉండే దాదాపు 20 రాష్ట్రాల్లో ఈసారి సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవడం గమనార్హం. ► 1971–2020 సుదీర్ఘకాలం నుంచి చూస్తే ఈసారి వర్షపాతంలో లోటు ఐదు శాతం కనిపిస్తోంది. -
80 శాతం సైబర్ నేరాలు 10 జిల్లాల నుంచే..
నోయిడా: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెచ్చరిల్లుతున్నాయి. దేశంలో ఇలాంటి నేరాల్లో 80 శాతం నేరాలు కేవలం 10 జిల్లాల నుంచే జరుగుతున్నట్లు ఐఐటీ–కాన్పూర్కు చెందిన ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్(ఎఫ్సీఆర్ఎఫ్) అనే స్టార్టప్ కంపెనీ అధ్యయనంలో వెల్లడయ్యింది. రాజస్తాన్లోని భరత్పూర్, ఉత్తరప్రదేశ్లోని మధుర, జార్ఖండ్లోని జామ్తారా, హరియాణాలోని నూహ్ జిల్లాల్లో సైబర్ నేరగాళ్లు అధికంగా తిష్ట వేశారని అధ్యయనం తెలియజేసింది. ప్రధానంగా భరత్పూర్, మధుర జిల్లాలు కేటుగాళ్లకు హాట్స్పాట్లుగా మారాయని పేర్కొంది. భరత్పూర్ నుంచి 18 శాతం, మధుర నుంచి 12 శాతం సైబర్ నేరాలు జరగుతున్నట్లు వెల్లడించింది. వీటితోపాటు దేవగఢ్, గురుగ్రామ్, అల్వార్, బొకారో, కర్మాటాండ్, గిరిదీ జిల్లాల నుంచి సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇవన్నీ ప్రధాన నగరాలకు సమీపంలో ఉన్నాయని, ఆయా జిల్లాల్లో సైబర్ సెక్యూరిటీ మౌలిక సదుపాయాలు పెద్దగా లేవని ఎఫ్సీఆర్ఎఫ్ వ్యవస్థాపకుడు హర్షవర్దన్ సింగ్ చెప్పారు. -
వర్షం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయం, పశువుల గ్రాసం తదితర అంశాలపై ఆయన శనివారం వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్షించారు. ఆరు జిల్లాల్లోని 130 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, ఈ జిల్లాల్లో ఆగస్టులో కూడా వర్షాలు తక్కువ ఉంటే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. అధిక వర్షాల కారణంగా వరి నారు దెబ్బతిన్న రైతులకు స్వల్పకాలంలో దిగుబడినిచ్చే విత్తనాలు సరఫరా చేయాలని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయంపై వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఖరీఫ్ లో మొత్తం 34.39 లక్షల హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 9.22 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేశారని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణంకంటే 20 నుండి 50 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. కృష్ణా జిల్లాలో 60 శాతం పైగా అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. అంబేడ్కర్ కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 20 నుండి 59 మిల్లీ మీటర్ల తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వర్షపాతం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల కోసం సుమారు 10 వేల క్వింటాళ్ల మినుము, పెసర, కంది, ఉలవ, జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ తదితర విత్తనాలను ఏపీ సీడ్స్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. అధిక వర్షాలతో వరి నారు మడులు దెబ్బతిన్న రైతులకు స్వల్ప కాలంలో పంట దిగుబడినిచ్చే ఎంటీయూ 1010, 1121,1153, బీపీటీ 5204, ఎన్ఎల్ఆర్ 34449 వరి విత్తనాలను సుమారు 30 వేల క్వింటాళ్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ హరికిరణ్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బి.ఆర్.అంబేద్కర్, పశు సంవర్థక శాఖ సంచాలకులు అమరేంద్ర కుమార్, ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబు, మత్స్య శాఖ అదనపు సంచాలకులు డా. అంజలి, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు బాలాజీ నాయక్, వెంకటేశ్వర్లు తదితర అధికారులుపాల్గొన్నారు. -
కోవిడ్ కూడబెట్టిన బంగారం! పసిడి పొదుపుపై ఆసక్తికర అధ్యయనం
బంగారంపై భారతీయులకు ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. దాన్ని కేవలం ఆభరణాలుగానే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా చూస్తారు. ఇదంతా తెలిసిందే. అయితే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అల్లాడిస్తున్న సమయంలో భారతీయుల ఆర్థిక కార్యకలాపాలు, పొదుపు, బంగారు కొనుగోలు వంటి అంశాలపై ఓ ఆసక్తికర అధ్యయనం వెల్లడైంది. కోవిడ్ మహమ్మారి సమయంలో దేశంలోని ఇతర జిల్లాలతో పోల్చితే కోవిడ్ ప్రభావిత జిల్లాల్లోని కుటుంబాలే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - అహమ్మదాబాద్ (ఐఐఎంఏ) చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. ‘గోల్డ్ ఇన్ హౌస్హోల్డ్ పోర్ట్ఫోలియోస్ డూరింగ్ ఎ ప్యాండమిక్: ఎవిడెన్స్ ఫ్రం ఎమర్జెన్సీ ఎకానమీ’ పేరుతో రూపొందించిన అధ్యయన పత్రాన్ని ఐఐఎంఏ ఇటీవల తమ వెబ్సైట్లో ప్రచురించింది. ప్రతి 1000 జనాభాకు నమోదైన కోవిడ్ కేసులతోపాటు మరో సూచిక ఆధారంగా ఈ అధ్యయనం సంక్షోభ తీవ్రతలోని వైవిధ్యాన్ని సంగ్రహించింది. ఆభరణాల రూపంలో బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం. ఒక సగటు భారతీయ కుటుంబం తన మొత్తం హోల్డింగ్లలో 11 శాతాన్ని బంగారంపై పెట్టుబడి పెడుతున్నట్లు ఈ అధ్యయన పత్రం పేర్కొంది. దీని ప్రకారం.. ఇతర జిల్లాలతో పోల్చితే కోవిడ్ ప్రభావిత జిల్లాల్లోని కుటుంబాల పొదుపు పోర్ట్ఫోలియోలలో బంగారం వాటా గణనీయంగా 6.9 శాతం ఎక్కువగా ఉంది. ఆయా కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు కోవిడ్కి ముందు కంటే మహమ్మారి సమయంలో గణనీయంగా పెరిగాయి. ఇదీ చదవండి ➤ రూ.2,000 నోటు ఉపసంహరణ ఎఫెక్ట్: ఆరేళ్ల గరిష్టానికి బ్యాంక్ డిపాజిట్లు 2020-21 ఆర్థిక సంవత్సరం కోవిడ్ సమయంలో ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ (IGPC), పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ (PRICE) ద్వారా నిర్వహించిన గోల్డ్ వినియోగానికి సంబంధించిన గృహ సర్వే ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టారు. దేశంలోని 23 రాష్ట్రాల్లో 160 జిల్లాల్లోని 40,427 కుటుంబాలతో ఈ సర్వే నిర్వహించారు. ఆ డేటా ఆధారంగా దేశంలో 21 రాష్ట్రాల్లోని 142 జిల్లాల్లోని 21,611 కుటుంబాలను శాంపిల్గా తీసుకుని అంచనాలను రూపొందించారు. ఆయా కుటుంబాల్లో బంగారంపై పొదుపులో వచ్చిన మార్పులను పోల్చడానికి 2015-16 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ‘ప్రైస్’ ముందస్తు ప్రతినిధి సర్వేను ఉపయోగించారు. ఇక జిల్లా స్థాయిలో కోవిడ్ కేసుల సంఖ్యను డెవలప్మెంట్ డేటా ల్యాబ్కు చెందిన సోషియో ఎకనామిక్ హై-రిజల్యూషన్ రూరల్-అర్బన్ జియోగ్రాఫిక్ ప్లాట్ఫాం ఫర్ ఇండియా (SHRUG) డేటాబేస్ నుంచి తీసుకున్నారు. -
నిండా ముంచిన అకాల వర్షాలు.. 16 జిల్లాలపై ప్రభావం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంలోని 16 జిల్లాలపై ప్రభావాన్ని చూపాయి. నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, విజయనగరం, వైఎస్సార్, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, గుంటూరు, చిత్తూరు, పార్వతీపురం మన్యం, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ఏలూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని 119 మండలాల పరిధిలో 372 గ్రామాల్లో భారీ వర్షాల వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాగా వర్షాలు, పిడుగులకు 951 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం.. సుమారు 20 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికార యంత్రాంగం తేల్చింది. పలుచోట్ల విద్యుత్ లైన్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. పిడుగులు పడే అవకాశం కాగా మరో మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అంతర్గత తమిళనాడు నుంచి మధ్య ఛత్తీస్గఢ్ వరకు కర్ణాటక, రాయలసీమ, తెలంగాణల మీదుగా సముద్రమట్టానికి 0.9 కి.మీ.ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులకు ఆస్కారం ఉందని పేర్కొంది. కాగా సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. -
AP: జీవవైవిధ్యం ఉట్టిపడేలా.. ప్రతి ఉమ్మడి జిల్లాలో బయోడైవర్సిటీ పార్కు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక జీవవైవిధ్య (బయోడైవర్సిటీ) పార్కు ఏర్పాటు కానుంది. తద్వారా ప్రజల్లో పర్యావరణం పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కడపలో నాలుగు పార్కుల్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర జీవవైవిధ్య మండలి ప్రణాళిక రూపొందించింది. చదవండి: AP: హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక పర్యవేక్షణ వీటి ఏర్పాటుకు ఇప్పటికే ఆమోదం లభించింది. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్లో 6 ఎకరాలు, కాకినాడలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్లో 7.5 ఎకరాలు, తిరుపతిలోని తుడా పరిధిలో ఉన్న వెంకటాపురంలో 6 ఎకరాలు, కడప నగరంలో ఏపీఐఐసీకి చెందిన 6 ఎకరాలను ఇప్పటికే పార్కుల కోసం కేటాయించారు. ఆ భూములను త్వరలో జీవవైవిధ్య మండలికి అప్పగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భూమి అప్పగించిన వెంటనే పార్కుతోపాటు మ్యూజియం ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పార్కుకు రూ.కోటి, మ్యూజియానికి రూ.50 లక్షల చొప్పున జీవవైవిధ్య మండలి మంజూరు చేయనుంది. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ పర్యవేక్షణలో వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ పార్కులు, మ్యూజియంల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించాలని జీవవైవిధ్య మండలి ఇప్పటికే కోరింది. కర్నూలు, అమరావతి, అనంతపురం జిల్లాల్లోనూ త్వరలో భూమిని కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
అస్సాంలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు...ముగ్గురు మృతి
Assam Floods Nearly 25,000 people affected: దేశంలో అనేక రాష్ట్రలలోని ప్రజలు భయంకరమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే అస్సాం మాత్రం అకాల వర్షాలతో వరదల్లో చిక్కుకుంది. అసోంలోని దిమా హసావో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏఎస్డీఎంఏ) తెలిపింది. కొండ జిల్లా ఆకస్మిక వరదలు కారణంగా కొండ చరియలు విరిగిపడటంతో అనేక ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. కొండచరియలు విరిగిపడటంతో జటింగా-హరంగాజావో, మహూర్-ఫైడింగ్ వద్ద రైల్వే లైన్ నిలిచిపోయింది. గెరెమ్లాంబ్రా గ్రామం వద్ద మైబాంగ్ సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడటం వల్ల రహదారి బ్లాక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల వర్షాల కారణంగా సుమారు ఐదు జిల్లాలోని దాదాపు 25000 మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. వరదలు సృష్టించిని విధ్వంసం: న్యూ కుంజంగ్, ఫియాంగ్పుయ్, మౌల్హోయ్, నమ్జురాంగ్, సౌత్ బగేటార్, మహాదేవ్ తిల్లా, కలిబారి, నార్త్ బాగేటార్, జియోన్, లోడి పాంగ్మౌల్ గ్రామాలలో కొండచరియలు విరిగిపడడంతో దాదాపు 80 ఇళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఏఎస్డీఎంఏ తెలిపింది. అస్సాంలోని ఇప్పటి వరకు కాచర్, దేమాజీ, హోజాయ్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, నాగావ్, కమ్రూవ్ ఈ ఆరు జిల్లాలు వరదల వల్ల ప్రభావితమయ్యాయి. ఆరు జిల్లాలో 94 గ్రామాలకు చెందిన 24,681 మంది వరద బారిన పడ్డారు. ఒక్క కాచర్ జిల్లాలోనే 21,000 మంది వరద బారిన పడ్డారు. ఆ తర్వాతి స్థానంలో కర్బీ ఆంగ్లోంగ్ వెస్ట్ దాదాపు 2,000 మంది బాధితులు, ధేమాజీలో 600 మందికి పైగా ప్రజలు ప్రళయం బారిన పడ్డారు. ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ అడ్మినిస్ట్రేషన్తో సహా క్యాచర్, హోజాయ్ జిల్లాలకు చెందిన శిక్షణ పొందిన వాలంటీర్లు దాదాపు 2,200 మందిని రక్షించారు. #WATCH Roads, bridges and agricultural land were inundated in Hojai, Assam yesterday due to floods following incessant rain in the region pic.twitter.com/DitKiMbb6O — ANI (@ANI) May 15, 2022 (చదవండి: పెదవుల పై ముద్దు పెట్టుకోవడం అసహజ నేరం కాదు) -
కొత్త జిల్లాలు..మిన్నంటిన సంబరాలు
సాక్షి నెట్వర్క్: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాలు రెట్టింపు అవడంపై వాడవాడలా సంబరాలు మిన్నంటాయి. అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లు ఉన్నతాధికారుల బాధ్యతల స్వీకారంతో సందడిగా మారాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలుచేస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. వాడవాడలా భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. దశాబ్దాల కల నెరవేరినందుకు ప్రజలు సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. ► విశాఖపట్నం జిల్లాను మూడు జిల్లాలుగా విభజించడంతో కొత్త జిల్లాలైన అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొత్త పాలనా యంత్రాంగం కొలువుదీరింది. అనకాపల్లి జిల్లా ఏర్పాటుతో ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లో తొలిరోజునే స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజెన్సీలోని మండలాల్ని కలుపుతూ పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటుచేయడంతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఏర్పాటుతో హుషారుగా ప్రదర్శనలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ► శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా పలాస రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఇచ్ఛాపురంలో జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఆ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్లు సోమవారం ర్యాలీ నిర్వహించి సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ► విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సోమవారం ‘కొత్త’ సందడి కనిపించింది. మన్యం జిల్లాలో కలెక్టరేట్తో పాటు వివిధ విభాగాలను డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణితో పాటు ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, జోగారావు, కళావతి, కలెక్టర్, ఎస్పీలు ప్రారంభించారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి ఆర్డీఓ కార్యాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు గరివిడి మండలం నుంచి చీపురుపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. ► ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలు ఏర్పాటుతో ప్రజలు కేరింతలు కొట్టారు. పాతికేళ్లుగా ఎదురుచూస్తున్న కోనసీమ జిల్లా కల నెరవేరడంతో కోనసీమ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. జిల్లా కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయాల భవనాలు అందంగా అలంకరించారు. జాతీయ జెండాలు ఎగరవేశారు. మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక కాకినాడ జిల్లా కేంద్రం ఆవిష్కరణ సందర్భంగా ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా భారీ ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా ప్రారంభోత్సవం సందర్భంగా బొమ్మూరులో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నిడదవోలు నుంచి గోదావరి వంతెన మీదుగా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వరకు మోటర్సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్రామ్, ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాసనాయుడు, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. ► పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో నూతన జిల్లా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారీ ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నిర్వహించారు. తణుకులో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నేతృత్వంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎలీజా, దూలం నాగేశ్వరరావు, మేకా ప్రతాప్ అప్పారావు, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పాల్గొన్నారు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించారు. ► ఉమ్మడి కృష్ణా జిల్లాను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలుగా మార్చడంతో మచిలీపట్నం, విజయవాడ కలెక్టరేట్లలో సందడి వాతావరణం జరిగింది. మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడిన కృష్ణాజిల్లాకు కలెక్టర్గా రంజిత్ బాషా, విజయవాడ కేంద్రంగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాకు కలెక్టర్గా ఢిల్లీరావు బాధ్యతలు స్వీకరించారు. పెడన, ఉయ్యూరు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ భారీ ర్యాలీలు జరిగాయి. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ సీఎం జగన్ చిత్రపటానికి పూలతో అభిషేకం చేశారు. ► ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీగా సభలు నిర్వహించారు. గుంటూరు లాడ్జి సెంటర్ నుంచి శంకర్ విలాస్ వరకు అభినందన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, మహమ్మద్ ముస్తఫా, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, మిర్చి యార్డ్ చైర్మన్ ఏసురత్నం, ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. ► ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం సోమవారం జనసంద్రమైంది. కొత్తగా కనిగిరి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేయడంతో పెద్దఎత్తున సంబరాలు జరిపారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ భారీ ర్యాలీ నిర్వహించారు. జై జగన్ నినాదాలతో పట్టణమంతా మార్మోగింది. ఒంగోలు పట్టణంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించి సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ► సర్వేపల్లి నియోజకవర్గాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే కొనసాగించినందుకు సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్రెడ్డి వెంకటాచలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, పార్టీ శ్రేణుల నినాదాలతో ర్యాలీ హోరెత్తింది. సీఎం చిత్రపటానికి కాకాణి క్షీరాభిషేకం చేశారు. ► ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో అన్నమయ్య జిల్లా ఆవిర్భావం సందర్భంగా జిల్లా కేంద్రమైన రాయచోటిలో సోమవారం సంబరాలు మిన్నంటాయి. ప్రభుత్వ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల వేషధారణలు, బాణాసంచా, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, చెక్కభజనలు, కీలు గుర్రాలతో ర్యాలీ హోరెత్తింది. గడికోట, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియాఖానమ్, కలెక్టర్ గిరీషా, జేసీ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్రాజులు ఊరేగింపుగా పాల్గొన్నారు. పెద్దఎత్తున అన్నదానం చేశారు. ► గత పాలకులు సాధించలేనిది మూడేళ్లలో జగనన్న సాయంతో సాధించామని తిరుపతి జిల్లాలో ఏర్పాటైన శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి అన్నారు. పట్టణంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ఎంపీ గురుమూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. శ్రీకాళహస్తి ప్రజల కల నెరవేరిందన్నారు. అంతకుముందు.. పార్టీ మహిళా నేత బియ్యపు పవిత్రారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ‘థ్యాంక్యూ సీఎం సర్’ అంటూ ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ► ఉమ్మడి అనంతపురం జిల్లాలో పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు సందర్భంగా సంబరాలు మిన్నంటాయి. నూతన జిల్లా ప్రారంభోత్సవంలో మంత్రి శంకరనారాయణ, పుట్టపర్తి ఎమ్మెల్యేలు శ్రీధర్రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పీవీ సిద్ధారెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాల్, ఎంపీ గోరంట్ల మాధవ్, కలెక్టర్ బసంత్కుమార్, ఎస్పీ రాహుల్దేవ్ సింగ్ పాల్గొన్నారు. ప్రజలు, విద్యార్థులు, బాబా భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పుట్టపర్తి వీధులన్నీ సందడిగా మారాయి. మడకశిర, కదిరిలోనూ సంబరాలు చేసుకున్నారు. ► నంద్యాల జిల్లా ప్రారంభోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్రెడ్డి, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు ఇసాక్బాషా, భగీరథరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, కాటసాని రామిరెడ్డి, తొగురు ఆర్థర్, గంగుల బిజేంద్రనాథరెడ్డి, ఎస్పీ రఘువీరారెడ్డి, జేసీ నారపురెడ్డి మౌర్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు: సీఎం వైఎస్ జగన్ కొత్త జిల్లాలను ప్రారంభిస్తూ ప్రకటన చేయగానే గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మరింత మెరుగ్గా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేరువ చేసేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చరిత్రాత్మక ఘటన అని అభివర్ణించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని సీఎం జగన్ నెరవేర్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నవరత్నాల అమలు ప్రోగ్రామ్ వైస్ చైర్మన్ ఎ.నారాయణమూర్తి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పద్మజ, విజయవాడ సిటీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (చదవండి: లక్ష మందికి నైపుణ్య శిక్షణ) -
సరికొత్త చరిత్ర ... ‘సీమ’కు సముద్రం
సాక్షి, అమరావతి: పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు పెంచడంతో సరికొత్త చరిత్ర నమోదవుతోంది. నూతన జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే పలు అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆ వివరాలివీ.. కరువు సీమకు కడలి ఇప్పటివరకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తొమ్మిది కోస్తా జిల్లాలకే తీర ప్రాంతం పరిమితం కాగా కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమకు కూడా ఆ అవకాశం దక్కింది. తాజాగా రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఎనిమిది అవుతున్నాయి. ఇందులో తిరుపతి జిల్లాకు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం ఉన్న సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపారు. సూళ్లూరుపేటతో పాటు సముద్రతీరంలో ఉన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా తిరుపతి జిల్లాలో కలుస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతాన్ని కలిగివున్న గుంటూరు జిల్లా ప్రస్తుతం తీర ప్రాంతం లేని జిల్లాగా నిలుస్తోంది. రెండు గిరిజన జిల్లాలు ఇప్పటిదాకా రాష్ట్రంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా జిల్లాలు లేవు. జిల్లాల పునర్ విభజన తర్వాత గిరిజనుల కోసం రెండు జిల్లాలు ఏర్పాటయ్యాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలను గిరిజనుల కోసం ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పేరును తొలి నోటిఫికేషన్లో మన్యం జిల్లాగా ప్రకటించగా స్థానికుల వినతిమేరకు పార్వతీపురం మన్యం జిల్లాగా మార్చారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో గిరిజన ప్రాంతాలుండగా వీటికోసం సమీకృత గిరిజన అభివృద్ధి ఏజెన్సీలు (ఐటీడీఏ) ఏర్పాటయ్యాయి. ఆంధ్ర కేసరితో ఆరంభం.. ప్రస్తుతం ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు, వైఎస్సార్ కడప జిల్లాలు ప్రముఖుల పేర్లతో ఉండగా జిల్లాల విభజనతో ఇది ఏడుకు పెరిగింది. స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను గుర్తిస్తూ 1972లో తొలిసారిగా ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు పేరును 2008లో నెల్లూరు జిల్లాకు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును 2010లో కడప జిల్లాకు పెట్టారు. బ్రిటీషు వారిని ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో పాడేరు కేంద్రంగా గిరిజన జిల్లా ఏర్పాటైంది. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పేరుతో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైంది. ప్రఖ్యాత వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య పేరుతో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఐదు అత్యధిక వర్షపాత జిల్లాలు.. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా 1,400 మి.మీ సగటు వర్షపాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో తిరుపతి జిల్లా 1,300 మి.మీ, కోనసీమ జిల్లా 1,200 మి.మీ, పార్వతీపురం మన్యం 1150 మి.మీ, విశాఖపట్నం 1,100 మి.మీ వరకు ఉన్నట్లు అంచనా. (చదవండి: కోవిడ్ తర్వాత ఊపందుకున్న స్థిరాస్తి వ్యాపారం... రాష్ట్ర ప్రభుత్వం రికార్డు) -
తెలంగాణ: 33 జిల్లాల సమగ్ర మ్యాప్ ఆవిష్కరణ.. ఇదే ఏకైక మ్యాప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 33 జిల్లాలతో కూడిన సమగ్ర మ్యాప్ అట్లాస్ను రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ మంత్రుల నివాసంలో ఆవిష్కరించారు. విష్ణు మ్యాప్ పబ్లికేషన్స్ సంస్థ ముంద్రించిన ఈ మ్యాప్ను కేంద్ర ప్రభుత్వ సర్వే ఆఫ్ ఇండియా శాఖ ఆమోదించిందని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల తాజా సమాచారంతో ఉన్న ఏకైక మ్యాప్ ఇదేనని తెలిపారు. ప్రజలు. అధికార యంత్రాంగానికి ఈ మ్యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని వినోద్ తెలిపారు. చదవండి: Mahabubnagar: గుట్టలో గుట్టురట్టు -
ఆప్షన్లకు గడువిస్తాం.. స్థానికతపై చెప్పలేం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ మరింత వివాదాస్ప దమవుతోంది. ఈ వ్యవహారంపై అన్ని జిల్లాల్లోనూ తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం జరిపిన సమాలోచనలు కూడా పెద్దగా ఫలితాన్నివ్వలేదు. క్షేత్రస్థాయిలో వస్తున్న వ్యతిరేకతను మంత్రి దృష్టికి తెచ్చేందుకు సంఘాల నేతలు ప్రయత్నించారు. విభజన పద్ధతులు లోపభూయిష్టంగా ఉన్నాయని అన్ని సంఘాలు అభిప్రాయపడ్డాయి. హడావుడిగా ఆప్షన్లు ఇవ్వమనడం సరికాదంటూ, స్థానికతకు ప్రాధాన్యత లేకుండా, సీనియారిటీకే పెద్దపీట వేయడాన్ని సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. యూటీఎఫ్, పీఆర్టీయూ, ఎస్టీయూ సహా 12 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో మంత్రి సబిత విడివిడిగా సంప్రదింపులు జరిపారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సంఘాలు ఇచ్చిన లిఖిత పూర్వక అభ్యంతరాలను మంత్రి పరిశీలించారు. జూనియర్లకు అన్యాయం స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీ పోస్టులు జిల్లా క్యాడర్గా ఉండటం వల్ల ఉపాధ్యాయులకు స్థాన చలనం తప్పడం లేదని, స్థానికతకు ప్రాధాన్యం లేకపోవడం వల్ల స్థిర నివాసం ఏర్పరచుకున్న జూనియర్లకు అన్యాయం జరుగుతుందని యూటీఎఫ్ ప్రతినిధులు కె.జంగయ్య, చావా రవి మంత్రికి తెలిపారు. కొత్త జిల్లాల్లో 80 శాతం పోస్టులు స్థానికులకే ఇవ్వాలన్నారు. మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న ఉద్యోగులు, ఖాళీలను దామాషా పద్ధతిలో కేటాయించాలని సూచించారు. వితంతువులు, మహిళలను ప్రత్యేక కేటగిరీలో చేర్చాలన్నారు. ఒక్కరోజులో ఆప్షన్ల ముగింపా? కేవలం ఒక్క రోజులోనే అప్షన్లు ముగించడం అన్యా యమని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, ప్రధాన కార్యదర్శి పర్వత రెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. స్థానికతను వదిలేయడం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. క్యాడర్ విభజన ఉత్తర్వులే అమలు కాకపోతే కొత్త జిల్లాలకు ఉపా ధ్యాయుల కేటాయింపు ఎలా చేస్తారని ప్రశ్నిం చారు. విభజనకు ముందే వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలకు న్యాయం చేయాలన్నారు. ఉత్తర్వులు సవరించండి టీచర్ల కేటాయింపు ఉత్తర్వులను సవరించాలని పీఆర్టీయూ అధ్యక్షుడు పింగిలి సిరిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు కోరారు. సీనియర్ల ఐచ్ఛికాన్ని పరిశీలిస్తూనే, జూనియర్లకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ప్రధాన డిమాండ్కు లభించని పరిష్కారం విద్యాశాఖ హడావుడిగా ఆప్షన్ల తంతు ముగించిందన్న విమర్శలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు భేటీ అనంతరం సంఘం నేతలు తెలిపారు. ఆప్షన్ల ఎంపికకు మరికొంత గడువు ఇస్తామని భరోసా ఇచ్చినట్టు చెప్పారు. అయితే స్థానికతపై మాత్రం నిర్ణయాన్ని వెల్లడించలేదన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలకు ఒకే విధమైన మార్గదర్శకాలు ఇవ్వడం వల్ల, దీనిపై నిర్ణయం తన చేతుల్లో ఉండదనే అభిప్రాయం మంత్రి వ్యక్తం చేసినట్లు చెప్పారు. స్థానికతను పరిగణలోనికి తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్కు చర్చల్లో ఎలాంటి పరిష్కారం లభించలేదని ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆందోళన ఉధృతం ఉద్యోగుల విభజన అంశంపై ఉపాధ్యాయ వర్గాలో ఆందోళన పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద పలు సంఘాల నేతలు, జూనియర్ ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. పలుచోట్ల ఉపాధ్యాయ సంఘాల నేతలను టీచర్లు నిలదీస్తున్నారు. సంఘాల నేతలు రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉండటం వల్లే సీనియారిటీ అంశాన్ని సమర్థిస్తున్నారని జూనియర్ ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులకు అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలతో లేఖలు వస్తున్నాయి. ఆప్షన్ల ఎంపికలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని టీచర్లు ఆరోపిస్తున్నారు. కొందరు నకిలీ సర్టిఫికెట్లతో తప్పుదారి పట్టిస్తున్నారని వరంగల్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు కార్తికేయ తెలిపారు. -
తెలంగాణ: ఉద్యోగుల విభజనలో సీనియారిటీనే లెక్క
ఉద్యోగుల విభజనలో కీలక నిబంధనలివీ.. ► కొత్త జిల్లా/జోనల్/మల్టీ జోనల్ కేడర్లకు మంజూరు చేసిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు ఉంటాయి. ► రాష్ట్రంలో వేర్వేరు ఉమ్మడి జిల్లాల్లోని ప్రాంతాలతో 8 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఈ జిల్లాల ఉద్యోగులకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఏర్పాటైన కొత్త జిల్లాలతోపాటు ప్రాంతాలు కలిసిన పొరుగు జిల్లాల్లో ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ► అవసరమైన ఉద్యోగుల (వర్కింగ్ స్ట్రెంత్) దామాషా ప్రకారమే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయిస్తారు. ► దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, వితంతువులకు ప్రాధాన్యత ►ప్రస్తుత ఉద్యోగుల కేటాయింపు పూర్తయ్యాకే భార్యాభర్తల (స్పౌజ్ కేటగిరీ) బదిలీలు చేపడతారు. ► ఏ ఉద్యోగిని ఎక్కడైనా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని మార్గదర్శకాల్లో సర్కారు స్పష్టం చేసింది. సాక్షి, హైదరాబాద్: పాత జిల్లాలు, జోనల్ పోస్టుల్లోని ఉద్యోగులంతా.. కొత్త జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్లలో కేటాయింపుల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత నమూనాలో తమ ప్రాథమ్యాలను వరుస క్రమంలో పేర్కొంటూ.. సంబంధిశాఖ జిల్లాధిపతి (జిల్లా కేడర్), విభాగాధిపతి (జోనల్), శాఖ కార్యదర్శి (మల్టీ జోనల్)కు దరఖాస్తులు అందజేయాలని సూచించింది. ఉద్యోగులెవరైనా దరఖాస్తు చేసుకోకుంటే.. సంబంధిత అధికారులే నిబంధనల మేరకు కేటాయింపులు చేస్తారని స్పష్టం చేసింది. ఎక్కడైనా పోస్టుల లభ్యతకు మించి ప్రాథమ్యాలు ఉంటే.. ఉద్యోగుల సీనియా రిటీ ఆధారంగా ఎంపిక జరుగుతుందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు–2018 ప్రకారం.. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను విడుదల చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల కేడర్లను 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీజోన్లుగా పునర్విభజిస్తూ ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఆర్డర్–2018’ను రాష్ట్రపతి జారీ చేసిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోనల్ కేడర్లకు పోస్టుల సంఖ్య (కేడర్ స్ట్రెంత్) విభజన ఇప్పటికే పూర్తయింది. వాటికి అనుగుణంగా ఉద్యోగులను కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగుల ప్రాథమ్యాలను పరిశీలించి కేటాయింపులు చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. ►పరిపాలనా అవసరాలకు అనుగుణంగా కొత్త జిల్లా/జోనల్/మల్లీ జోనల్ పోస్టుల సంఖ్యను విభజించారు. అదే నిష్పత్తిలో అన్ని ప్రభుత్వ శాఖలు ప్రతి లోకల్ కేడర్కు వర్కింగ్ స్ట్రెంత్ను కేటాయించాయి. ► పాత లోకల్ కేడర్లలోని సీనియారిటీ ప్రకారం ఉద్యోగుల జాబితాలను శాఖల అధిపతులు రూపొందిస్తారు. కేటాయింపుల్లో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా సెలవులు, సస్పెన్షన్, శిక్షణ, డిప్యుటేషన్, ఫారిన్ సర్వీస్లో ఉన్న ఉద్యోగులను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. కేటాయింపుల అనంతరం వారు కొత్త లోకల్ కేడర్లలో సెలవులు, సస్పెన్షన్, డిప్యుటేషన్, శిక్షణ, ఫారిన్ సర్వీస్లో కొనసాగుతున్నట్టు పరిగణిస్తారు. జిల్లా కేడర్ ఉద్యోగుల విభజన ఇలా.. ► ఉమ్మడి జిల్లా పరిధిలోని కొత్త జిల్లాల్లో అన్నిపోస్టులకు.. సదరు ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులందరినీ పరిగణనలోకి తీసుకుంటారు. ► హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, సిద్దిపేట, మహబూబ్నగర్, వికారాబాద్, రంగారెడ్డి కొత్త జిల్లాలు ఒకటి కంటే ఎక్కువ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రాంతాల కలయికతో ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి పాత జిల్లాల ఉద్యోగులకు.. ఉమ్మడి జిల్లా పరిధిలోని కొత్త జిల్లాలతోపాటు, ఆ ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రాంతం కలిసిన కొత్త జిల్లాల్లోనూ అవకాశం కల్పిస్తారు. జోనల్ కేడర్ కేటాయింపులు ఇలా.. ► కొత్త జోనల్/మల్టీజోనల్ కేడర్లకు ఖరారైన ఉద్యోగుల సంఖ్యకు లోబడి.. పాత జోనల్ కేడర్లోని ఉద్యోగులందరినీ కేటాయింపుల కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ► పాత 5వ జోన్ ఉద్యోగులను.. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల్లోని 1–4 జోన్లకు (నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలు, ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సిద్దిపేట ప్రాంతంలోని పోస్టులు మినహాయించి), జోన్–5లోని జనగామ జిల్లాలో ఉన్న పోస్టుల్లో కేటాయింపుల కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ► పాత జోన్–6 కేడర్ ఉద్యోగులను.. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల్లోని 5, 6, 7 జోన్లకు (జనగామ జిల్లాలోని పోస్టులు మినహాయించి), జోన్–2లోని నిజామాబాద్ జిల్లాకు, జోన్–3లోని కామారెడ్డి, మెదక్ జిల్లాతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటకు కేటాయించేందుకు పరిగణనలోకి తీసుకుంటారు. మల్టీ జోన్ పోస్టులు ఇలా... ► పాత 5వ జోన్ ఉద్యోగులను.. మల్టీ జోన్–1 (నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్ధిపేట ప్రాంతం మినహాయించి)కు, మల్టీజోన్–2లోని జనగామ జిల్లాలోని పోస్టుల్లో కేటాయింపులకు పరిగణనలోకి తీసుకుంటారు. ► పాత 6వ జోన్ ఉద్యోగులను.. మల్టీ జోన్–2 (జనగామ జిల్లాలోని పోస్టులు మినహాయించి)కు, మల్టీ జోన్–1లోని నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటలోని పోస్టుల్లో కేటాయింపులకు పరిగణనలోకి తీసుకుంటారు. ► రాష్ట్రపతి పాత ఉత్తర్వులు వర్తించని కొన్ని పోస్టులను కొత్త ఉత్తర్వుల్లో మల్టీజోనల్ పోస్టులుగా విభజించారు. అలాంటి పోస్టుల్లో ఉన్న ఉద్యోగులు, పాత మల్టీజోన్ కేడర్ ఉద్యోగులను ఏదైనా ఒక కొత్త మల్టీజోన్కు కేటాయిస్తారు. కొన్ని ప్రత్యేక కేటగిరీలుగా.. కొన్ని ప్రత్యేక అంశాల మేరకు సీనియారిటీతో సంబంధం లేకుండా కొత్త లోకల్ కేడర్లకు కేటాయింపులు చేస్తామని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ ప్రత్యేక కేటగిరీల కింద కేటాయింపు పొందడానికి ఉద్యోగులు తగిన రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. ► 70శాతం, ఆపై వైకల్యంగల వారు, కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన వితంతువులు ప్రత్యేక కేటగిరీ కిందికి వస్తారు. ► మనోవైకల్యంగల పిల్లలున్న ఉద్యోగులకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నచోట పోస్టింగ్ ఇస్తారు. ► కేన్సర్, న్యూరోసర్జరీ, కిడ్నీ/కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన వారిని.. ఇదే క్రమంలో పరిగణనలోకి తీసుకుంటారు. విభజన తర్వాతే ‘స్పౌస్’ బదిలీలు ►ప్రస్తుత కేటాయింపుల్లో జీవిత భాగస్వాములు వేర్వేరు కేడర్లకు పంపబడితే.. కేటా యింపులు పూర్తయ్యాక కేడర్ మార్పిడికి దర ఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. పోస్టుల లభ్యత, పాలన అవసరాలకు లోబడి ఒకే లోకల్ కేడర్లో వారికి స్థానం కల్పిస్తారు. ► కేటాయింపులపై ఉద్యోగులెవరికైనా అభ్యంతరాలుంటే సంబంధిత శాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం పరిశీలించి పరిష్కరిస్తుంది. విభజన తర్వాతే ‘స్పౌస్’ బదిలీలు ► ప్రస్తుత కేటాయింపుల్లో జీవిత భాగస్వాములు వేర్వేరు కేడర్లకు పంపబడితే.. కేటా యింపులు పూర్తయ్యాక కేడర్ మార్పిడికి దర ఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. పోస్టుల లభ్యత, పాలన అవసరాలకు లోబడి ఒకే లోకల్ కేడర్లో వారికి స్థానం కల్పిస్తారు. ►కేటాయింపులపై ఉద్యోగులెవరికైనా అభ్యంతరాలుంటే సంబంధిత శాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం పరిశీలించి పరిష్కరిస్తుంది. -
Covid Test: 14 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ కేంద్రాలు
యాంటీజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చి కరోనా లక్షణాలుంటే ఆ ఫలితాన్ని నమ్మలేం. కచ్చితంగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. కానీ చాలా మంది చేయించుకోవట్లేదు. అందుకే మరిన్ని ఆర్టీపీసీఆర్ కేంద్రాలు. వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, రామగుండం, భువనగిరి, జనగాం, వికారాబాద్ జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు. సాక్షి, హైదరాబాద్: కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణకు కొత్తగా 14 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రాలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో వాటిని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తు న్నారు. ప్రస్తుతం 17 చోట్ల ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా థర్డ్వేవ్ వస్తుందన్న హెచ్చరికలతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. దీనికోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. కరోనా నిర్ధారణకు 2 రకాల పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి ర్యాపిడ్ యాంటిజెన్, రెండోది ఆర్టీపీసీఆర్. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష ద్వారా పావు గంటలోనే ఫలితం వస్తుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే, అది పూర్తిగా కరెక్టే. కానీ నెగటివ్ వచ్చి లక్షణాలుంటే మాత్రం దాని ఫలితాన్ని పూర్తిగా నమ్మలేం. మళ్లీ ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలనేది నిబంధన. చాలామంది యాంటిజెన్ పరీక్ష చేయించుకొని అందులో నెగటివ్ వచ్చి.. లక్షణాలున్నా కూడా సాధారణంగా తిరిగేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడం లేదు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు అంతగా అందుబాటులో లేకపోవడం కూడా దీనికి కారణం. ఇలా అనేక కేసులు మిస్ కావడం, సీరియస్ అవుతుండటంతో పరిస్థితి తీవ్రంగా మారుతోంది. అంతేకాదు రాష్ట్రంలో 90 శాతంపైగా ర్యాపిడ్ పరీక్షలే జరుగుతున్నాయని కేంద్రం ఇటీవల వెల్లడించింది. 10 శాతంలోపే ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయంది. దీంతో ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాలని వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించింది. యాంటిజెన్ పరీక్ష ద్వారా పాజిటివ్ ఉన్న వ్యక్తులను వెంటనే గుర్తించడానికి వీలుంది. ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించాలంటే ఇప్పుడు రెండుమూడు రోజులకు కూడా ఫలితం రావడంలేదు. ఒక్కోసారి వారం సమయం కూడా పడుతోంది. అందుకే వైద్యాధికారులు, ప్రజలు యాంటిజెన్ పరీక్షలకే మొగ్గుచూపుతున్నారు. కొత్తగా ఆర్టీపీసీఆర్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో తక్కువ సమయంలో పరీక్షా ఫలితాలు ఇవ్వడానికి వీలుపడుతుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. -
లాక్డౌన్ ఎత్తేయగానే దోస్తులను కలుస్తాం.. మాల్స్కు పోతాం..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో అన్లాక్ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఈనేపథ్యంలో ఇన్నాళ్లు లాక్డౌన్లో ఉన్న ప్రజలు తాళం తీస్తే స్వేచ్ఛగా తిరిగేందుకు మొగ్గుచూపుతున్నారు. రెస్టారెంట్లు, సినిమాహాళ్లు, మాల్స్కు వెళ్తామంటున్నారు. బంధుమిత్రులను కలుస్తామని చెబుతున్నారు. అయితే, కోవిడ్ మహమ్మారి విషయంలో ప్రజలు నిబంధనలు గాలికొదిలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మళ్లీ మహమ్మారి పంజా విసురుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా 314 జిల్లాల్లో కమ్యూనిటీ లోకల్ మీడియా ప్లాట్ఫామ్ ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా ఆయా జిల్లాల్లోని 48 శాతం మందిని ప్రథమ శ్రేణి నగరాల నుంచి, ద్వితీయశ్రేణి నగరాల నుంచి 25 శాతం, మూడు, నాలుగు శ్రేణి నగరాల నుంచి 27 శాతం మంది నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలు సేకరించారు. -
సర్కార్ దవాఖానాకు మహర్దశ..
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఆధ్వర్యంలోని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ పీజీలో ఎండీ, ఎంఎస్ చేసే విద్యార్థులు రెండో ఏడాది నుంచి జిల్లా ఆసుపత్రుల్లో శిక్షణ పొందాలని తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ (సవరణ) నిబంధనలు–2020’ విడుదల చేసింది. తద్వారా వీరికి క్షేత్రస్థాయి వ్యాధులపై అవగాహన వస్తుందని, శిక్షణ కూడా పొందుతారని తెలిపింది. మరోవైపు జిల్లా ఆసుపత్రుల్లో స్పెషలిస్టుల వైద్య సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేసింది. 100 పడకలకు తక్కువ కాకుండా ఉన్న జిల్లా ఆసుపత్రుల్లో వీరికి శిక్షణ ఇస్తారు. ఈ ఏడాది పీజీలో చేరిన వారికి వచ్చే సంవత్సరం నుంచి ఈ శిక్షణ అమలుకానుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ కరుణాకర్రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు పీజీ పూర్తయిన విద్యార్థులు బోధనాసుపత్రుల్లో శిక్షణ పొందుతున్నారు. జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రామ్: ఎండీ లేదా ఎంఎస్ చేసే పీజీ మెడికల్ విద్యార్థులంతా 3 నెలలకోసారి రొటేషన్ పద్ధతిలో జిల్లా ఆసుపత్రుల్లో లేదా జిల్లా ఆరోగ్య వ్యవస్థల్లో పని చేయాలి. వారి కోర్సులో భాగంగా ఇది ఉం టుంది. 3, 4, 5 సెమిస్టర్లలో ఉన్న పీజీ విద్యార్థులు రొటేషన్ పద్ధతిలో పనిచేస్తారు. దాన్ని జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రామ్(డీఆర్పీ) అంటా రు. సదరు విద్యార్థులను జిల్లా రెసిడెంట్లుగా పిలుస్తారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో వచ్చే వివిధ అనారోగ్య సమస్యలను తెలుసుకోవడం దీని ఉద్దేశాలు. విభిన్నమైన శిక్షణ పొందడం. అలాగే ప్రస్తుతమున్న స్పెషాలిటీ వైద్యులకు తోడుగా పీజీ వైద్య విద్యార్థులతో జిల్లా ఆరోగ్య వ్యవస్థ బలోపేతం కానుంది. ఇన్ పేషెంట్.. ఔట్పేషెంట్ సేవల్లోనూ.. ► జిల్లా రెసిడెంట్లుగా వెళ్లిన పీజీ విద్యార్థులు జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ (డీఆర్పీసీ) పర్యవేక్షణలో పని చేస్తారు. ► ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్, క్యాజువాలిటీ తదితర చోట్ల పనిచేస్తారు. నైట్ డ్యూటీలూ చేయాలి. ► అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీకి చెందిన పీజీ మెడికల్ విద్యార్థులు జిల్లా ఆరోగ్య అధికారి లేదా చీఫ్ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతారు. లేబొరేటరీ, ఫార్మసీ, ఫోరెన్సిక్ విద్యార్థులు సాధారణ క్లినికల్ విధుల్లో పనిచేస్తారు. ► జిల్లా రెసిడెంట్లకు స్టైఫెండ్ ఇస్తారు. వారానికో సెలవుతోపాటు ఇతర సెలవులు ఉంటాయి. ► రాష్ట్రస్థాయిలోనూ స్టీరింగ్ కమిటీ ఉంటుంది. వివిధ కేసులపై చర్చలు, సెమినార్లు వంటి వాటిల్లో పాల్గొనేలా చేయాలి. ► జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ జిల్లా రెసిడెంట్ల శిక్షణకు సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు. వారి పనితీరుపై మెడికల్ కాలేజీకి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ► జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రాంను సమన్వయం లేదా పర్యవేక్షణ చేసేందుకు ప్రతి మెడికల్ కాలేజీ అకడమిక్ సెల్ కమిటీని ఏర్పాటు చేయాలి. ► జిల్లా రెసిడెన్సీ కార్యక్రమం అమలు మొదలైన ఏడాదికి సంబంధిత మెడికల్ కాలేజీ అదనపు పీజీ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని ఎంసీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ► జిల్లా రెసిడెన్సీ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు రాష్ట్రస్థాయిలో నోడల్ ఆఫీసర్ను నియమించాలి. -
హైదరాబాద్లో నిలకడగా.. జిల్లాల్లో దూకుడుగా..
సాక్షి, హైదరాబాద్: మొన్నటివరకు హైదరాబాద్లో ప్రతాపం చూపించిన వైరస్.. ఇప్పుడు జిల్లాల్లో విజృంభిస్తోంది. పట్టణాలు, పల్లెల్లో పంజా విసురుతోంది. వారం రోజుల్లోనే చాలా జిల్లాల్లో రెట్టింపు కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. కొన్ని జిల్లాల్లో మూడు, నాలుగింతలు కూడా రికార్డయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన బులెటిన్ మేరకు.. ఈ నెల 20న జీహెచ్ఎంసీ పరిధిలో 473 కేసులుండగా, 26న 449 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ గత వారం రోజులుగా కేసుల సంఖ్య దాదాపు నిలకడగానే కొనసాగుతోంది. కానీ జిల్లాల్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 20న 21 కేసులు నమోదు కాగా, 26న ఏకంగా 72 కేసులు రికార్డయ్యాయి. అంటే మూడింతలకు మించిన కేసులన్న మాట. భూపాలపల్లి జిల్లాలో 20న 12 కేసులు నమోదు కాగా, 26న 26 కేసులు.. అంటే రెట్టింపునకు మించి నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో వారం క్రితం 79 కేసులు నమోదైతే, ఇప్పుడు 152 కేసులు నమోదయ్యాయి. ఇక మహబూబాబాద్ జిల్లాలోనైతే వారం క్రితం 26 కేసులు నమోదైతే, ఇప్పుడు ఏకంగా 102 కేసులు రికార్డయ్యాయి. మంచిర్యాల జిల్లాలో వారం క్రితం 40 కేసులుంటే, ఇప్పుడు 106 కేసులు రికార్డయ్యాయి. నల్లగొండ జిల్లాలో వారం క్రితం 60 కేసులుంటే, ఇప్పుడు 164 నమోదయ్యాయి. నిజామాబాద్లో ముందు 69 కేసులుంటే, ఇప్పుడు 112 నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో వారం క్రితం 35 కేసులుంటే, ఇప్పుడు 77 నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లాలో వారం క్రితం 49 కేసులుంటే, ఇప్పుడు 113 కేసులు వచ్చాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 20న 18 కేసులుంటే, 26న 39 కేసులు రికార్డయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల వరకు కంటైన్మెంట్ జోన్లున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. పల్లెల్లోనూ వైరస్ వ్యాప్తి చెందడంతో గ్రామాల్లో అలజడి నెలకొంది. వచ్చే నెలాఖరుకు దాదాపు 3 వేల గ్రామాల్లోకి వైరస్ ప్రవేశించే అవకాశముందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరో 2,795 కేసులు.. రాష్ట్రంలో బుధవారం (26వ తేదీన) 60,386 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,795 పాజిటివ్ కేసులు వచ్చాయని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు బులిటెన్లో వెల్లడించారు. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,14,483కి చేరింది. తాజాగా కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 788కి చేరింది. కరోనా బారి నుంచి తాజాగా 872 మంది కోలుకోగా, ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 86,095కి చేరిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27,600 యాక్టివ్ కేసులున్నాయి. అందులో ఇళ్లు, ఇతరత్రా ఐసోలేషన్లలో చికిత్స పొందుతున్నవారు 20,866 మంది ఉన్నారు. ఇక తెలంగాణలో ఇప్పటివరకు 11,42,480 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. -
మండల, జిల్లా, పరిషత్లకు ఊరట
సాక్షి, హైదరాబాద్: మండల, జిల్లా పరిషత్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం తలసరి నిధుల్లో గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్లకు కూడా నిధులను కేటాయించింది. ఈ మేరకు ఇప్పటికే ఖరారు చేసిన నిష్పత్తి ఆధారంగా తొలి త్రైమాసికానికి సంబంధించిన నిధులను రాష్ట్రానికి విడుదల చేయగా.. వాటిని జనాభా ప్రాతిపదికన జిల్లాలకు పంపిణీ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.రఘునందన్రావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ ఏడాది రూ.1,847 కోట్లు ఖరారు చేయగా.. ఇందులో మొదటి విడత (తొలి త్రైమాసికం)గా రూ.308 కోట్లు విడుదల చేసింది. జెడ్పీ 5%, ఎంపీపీలకు 10% నిధులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం.. 2014–15లో అమలు చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది. దీంతో మండల, జిల్లా పరిషత్లకు నిధుల కొరత ఏర్పడింది. కేవలం సీనరేజీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులపైనే ఆధారపడాల్సి వచ్చింది. నిధుల కటకటతో నీరసించిన జెడ్పీ, ఎంపీపీలకు కూడా కొంతమేర కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయడంతో వీటికి ఊరట లభించింది. గ్రామ పంచాయతీలకు 75 శాతం, మండల పరిషత్లకు 10 శాతం, జిల్లా పరిషత్లకు 5 శాతం నిష్పత్తిలో నిధులు పంచాలని నిర్ణయించింది. దీంతో తొలి త్రైమాసికానికి సంబంధించి రూ.461.75 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతి మంజూరు చేసిన కేంద్రం.. టైడ్ గ్రాంట్ కింద రూ.308 కోట్లు విడుదల చేసింది. వీటిలో జిల్లా పరిషత్లకు రూ.1,026.11 లక్షలు, మండల పరిషత్లకు రూ.2,052.20 లక్షలు, గ్రామ పంచాయతీలకు రూ.27,721.67 లక్షలను నిర్దేశించింది. వీటిని సాధారణ, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ల కింద వినియోగించుకోవాలని సూచించింది. ఈ నిధులతో తాగునీటి సౌకర్యాల కల్పన, వాననీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ, డోర్టుడోర్ చెత్త సేకరణ, కంపోస్టు ఎరువుల తయారీ కేంద్రం, ప్లాస్టిక్ సేకరణ, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్రావు ఆదేశించారు. -
జిల్లాల్లోనూ ‘వైరస్’ సైరన్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ రాష్ట్రమంతటా చుట్టబెట్టేస్తోంది. ఇంతకాలం హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొన్ని రోజులుగా జిల్లాల్లో సైతం గణనీయ సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఇప్పటి వరకు వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండగా, వరంగల్ అర్బన్, కరీంనగర్, నల్లగొండ, కామారెడ్డి, మెదక్, సూర్యాపేట, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, భద్రాద్రి–కొత్తగూడెం, నిజామాబాద్,æ మహబూబ్నగర్ జిల్లాల్లోనూ క్రమంగా వ్యాప్తి పెరుగుతోంది. రోజూ జీహెచ్ఎంసీ, రంగారెడ్డి/మేడ్చల్ జిల్లాల పరిధిలో మూడంకెల పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా, దాదాపు మరో 10 జిల్లాల్లో రెండంకెలు, 15 జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు నమోదవుతున్నాయి. క్రమంగా వైరస్ గ్రామీణ జిల్లాలకు సైతం పాకుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వ్యాప్తి నియంత్రణకు మళ్లీ లాక్డౌన్ విధిస్తారంటూ గత నెలాఖరులో వచ్చిన వార్తలతో చాలామంది నగరం నుంచి సొంతూళ్లకు వలసవెళ్లారు. ఇది కూడా కొంత వరకు జిల్లాల్లో పాజిటివ్ కేసులు పెరగడానికి కారణమైందని జిల్లాల్లోని అధికారులు అంటున్నారు. కొత్తగా 6 జిల్లాల్లో ఉధృతి జీహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు ఇప్పటికే హాట్స్పాట్లుగా మారాయి. నల్లగొండ, కరీంనగర్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల్లో సైతం కరోనా పాజిటివ్ కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. గడిచిన పది రోజుల్లో ఈ 6 జిల్లాల్లో వందకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జీహెచ్ఎంసీ మినహాయిస్తే మరో 10 జిల్లాల్లో కరోనా వ్యాప్తి విస్తృతం అవుతోందని గణాంకాలు చెబుతున్నాయి. మాస్కుల్లేవ్.. భౌతికదూరం నిల్ లాక్డౌన్ సడలింపులు అమల్లోకి రావడంతో బహిరంగ ప్రదేశాల్లో జనసంచారం మునుపటి స్థితికి చేరింది. లాక్డౌన్ సడలించి నెలకుపైగా గడిచి పోవడం తో ప్రజలు మళ్లీ సాధారణ జీవనానికి అలవడుతున్నారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడమనే నిబంధనలు గాలికొదిలి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఓవైపు కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్నా తమకేమీ కాదనే ధీమాతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్నారు. ఉదాహరణకు గత వారం రోజులుగా నల్లగొండ జిల్లాలో గణనీయ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నా, స్థానిక ప్రకాశంబజార్ మార్కెట్లో చాలామంది వ్యాపారస్తులు, వర్కర్లు మాస్కుల్లేకుండానే పనిచేస్తున్నారు. కొంతమంది ధరించినా.. వాటిని మూతిపై నుంచి కిందకి లాగి మెడకు వేలాడదీస్తున్నారు. కాగా, బయట కనిపించే వారిలో దాదాపు 50 శాతం మంది మాస్కుల్లేకుండానే తిరుగుతున్నారు. మాస్కులు ధరించకపోతే రూ.1,000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించినా.. కఠినంగా అమలు చేయకపోవడంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. జూలై 1 నుంచి జిల్లాల వారీగా నమోదైన కేసులు జిల్లా కేసులు రంగారెడ్డి 1,042 మేడ్చల్ 718 సంగారెడ్డి 203 నల్లగొండ 155 కరీంనగర్ 122 మహబూబ్నగర్ 110 వరంగల్ అర్బన్ 109 వరంగల్ రూరల్ 108 నిజామాబాద్ 104 మెదక్ 85 కామారెడ్డి 75 సూర్యాపేట 46 కామారెడ్డి 46 మంచిర్యాల 46 భద్రాద్రి కొత్తగూడెం 37 ఆదిలాబాద్ 22 -
భూసార మెంతో తేలుతుందిక..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 711 మినీ భూసార పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయా లని వ్యవసాయశాఖ నిర్ణయించింది. 15 జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో వీటిని నెలకొల్పుతారు. ఎరువుల దుకాణదారులు భూ సార పరీక్షా ఫలితాలు, ఆధార్ కార్డుల ఆధారంగానే ఎరువులు విక్రయించాలన్న మార్గదర్శకాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. భూసార కార్డులను అనుసంధానిత ఎరువుల నిర్వహణ వ్యవస్థ (ఐఎఫ్ఎమ్ఎస్)కు జత చేసేందుకు భూసార వెబ్సైట్లో రైతుల ఆధార్ నంబర్, సర్వే నంబర్లను నమోదు చేస్తారు. ప్రస్తుతం క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులు మట్టి నమూనాలు సేకరించి ఫలితాలను వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. ఇటీవల వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు సర్వే, రైతు సమన్వయ సమితులు వంటి వాటితో పని ఒత్తిడి పెరిగి, మట్టి నమూనాల సేకరణ మందగించిం ది. రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 12, వ్యవసాయ మార్కెటింగ్లలో 28, సంచార భూసార కేంద్రాలు 4, మినీ భూసార పరీక్షా కేంద్రాలు 2,050 ఉన్నాయి. వాటికితోడు గ్రామస్థాయిలో మరిన్ని రాబోతున్నాయి. యువతకు ఉపాధి కేంద్రం గ్రామీణ యువతకు ఉపాధి కల్పించే పథకంలో భాగంగా 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల లోపున్న యువకులకు ఈ కేంద్రాలను మం జూరు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 నుంచి 40 శాతం చొప్పున నిధులు సమకూర్చుతాయి. యువతకు 75 శాతం సబ్సిడీతో మినీ భూసార కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తున్నారు. మిగతా 25 శాతం లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. గ్రామ స్థాయిలో సాగయ్యే భూమిలో ఆరున్నర ఎకరాలకు ఒక మట్టి నమూనాను తీసుకోవాల్సి ఉంటుంది. మినీ భూసార కేంద్రాన్ని ఏర్పా టు చేయాలనుకునే వారు పదో తరగతి పాసై ఉండాలి. రైతులందరికీ భూసార కార్డులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖను ఆదేశించింది. కానీ ఆచరణలో మాత్రం అమలుకావడం లేదన్న ఆరోపణలున్నాయి. 2018–19లో 4,72,987 మట్టి నమూనాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇందులో 4,70,875 ఫలితాల ను పరీక్షించి ఆన్లైన్ చేశారు. మొత్తం 23,91,395 భూసార కార్డులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటి లో 10 లక్షల కార్డులు మాత్రమే రైతులకు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. -
ఆర్మీ వెబ్సైట్లో 33 జిల్లాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కు పెరగడంతో ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లోనూ కొత్త జిల్లాల పేర్లు చేర్చారు. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్కు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ మార్పులను గమనించాలని డిఫెన్స్ పీఆర్ఓ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో 31 జిల్లాలు మాత్రమే ఉండగా, ఇటీవలే మరో రెండు జిల్లాలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో జయశంకర్, ములుగు, మహబూబ్నగర్, నారాయణపేట్ జిల్లాల పరిధిలోని అభ్యర్థులు తమ ప్రస్తుత జిల్లాల పరిధికి అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
వామ్మో.. మాకొద్దీ పోస్టింగ్
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో వరుసగా జరుగుతున్న ఇన్స్పెక్టర్ల సస్పెన్షన్ ఘటనలు డిపార్టుమెంట్లో దిగువ శ్రేణి అధికారులను కలవరానికి గురిచేస్తున్నాయి. శాంతి భద్రతల విభాగంలో పోస్టింగ్ అంటే భారీ స్థాయిలో లాబీయింగ్ చేస్తే గానీ దక్కని పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పోస్టు అంటేనే హడలిపోతున్నారు. హైదరాబాద్ జోన్లో తాజాగా ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్ల సస్పెన్షన్తో ఒక్కసారిగా అధికారులు యూటర్న్ తీసుకుంటున్నారు. వామ్మో.. మాకొద్దు ఈ పోస్టింగ్ అంటూ లూప్లైన్ కోసం ఐజీల వద్ద దరఖాస్తు చేసుకుంటున్నారు. సిటీలో అయితే ఓకే.. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో పెద్దగా పైరవీలు అవసరం లేకుండా పనితీరుతో పోస్టింగ్ పొందవచ్చు. కానీ జిల్లాల్లో అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సిఫార్సు ఉంటేనే పోస్టింగ్స్ ఇస్తారు. దీంతో నాలుగేళ్లుగా చాలా మంది ఇన్స్పెక్టర్లు పక్క పక్క ఉన్న సర్కిళ్లలోనే పనిచేస్తూ వచ్చారు. కానీ ఆరు నెలల నుంచి హైదరాబాద్, వరంగల్ జోన్ల పరిధిలో అక్రమాలకు పాల్పడుతున్న సర్కిల్ ఇన్స్పెక్టర్లపై ఇంటెలిజెన్స్ బృందాలు నివేదికలు ఇస్తుండటంతో వారిలో వణుకు మొదలైంది. ఇటీవల హుజూర్నగర్, తాండూర్ సీఐలను పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఎక్కడెక్కడ ఎంత వసూలు చేశారన్న దానిపై ఆధారాలతో చార్జ్మెమోలో ప్రస్తావిస్తున్నారు. దీంతో మరికొంత మంది సర్కిల్ ఇన్స్పెక్టర్ల జాతకాలు బయటపడే ప్రమాదం ఉండటంతో ముందుగానే జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. దీని లో భాగంగా తాము జిల్లాల్లో దీర్ఘకాలంగా పని చేస్తున్నామని, తమను డెప్యుటేషన్ విభాగాల్లోకి గానీ, హైదరాబాద్ జోన్లో సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్కు బదిలీ చేయాలని దరఖాస్తులు పెట్టు కుంటున్నారు. దీంతో లక్షలు ఖర్చు చేసి తెచ్చుకున్న పోస్టింగ్స్ వదులుకునేందుకు 40 మంది సిద్ధంగా ఉన్నారని తెలిసింది. నార్త్జోన్ నుంచి 16 మంది ఇన్స్పెక్టర్లు తమను లూప్లైన్ అయినా ఇంటెలిజెన్స్, సీఐడీ, ట్రాఫిక్, సీసీఎస్ లేదా విజిలెన్స్లకు పంపా లని వేడుకుంటున్నారు. హైదరాబాద్ జోన్లోని 24 మంది ఇన్స్పెక్టర్లు ఏకంగా తమకు ఏదైనా కమిషనరేట్లో సీసీఎస్లకు పంపాలని కోరుతున్నారు. గందరగోళ పరిస్థితిలో.. ఎమ్మెల్యే సిఫార్సు ద్వారా పోస్టింగ్ తెచ్చుకున్న అధికారి.. ఆయన మనుషులకు సహకరించకపోతే బదిలీ చేయిస్తాడన్న భయం, ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తే ఎస్పీ /కమిషనర్ ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న ఆందోళనతో ఇద్దరి మధ్య విధులు ఎలా నిర్వర్తిం చాలో తెలియక కొంత మంది ఇన్స్పెక్టర్లు గందరగోళంలో పడుతున్నారు. ఇటీవల జరిగిన ఘటనల్లో ఇలాంటి వ్యవహారాలు బయటపడ్డాయి. అయితే ఇక్కడ అధికారులు కూడా అక్రమార్కులతో చేతులు కలపడంతో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావా ల్సి వచ్చింది. మరికొంత మంది ఎమ్మెల్యేలకు సూటిగా విషయం చెప్పి ఎస్పీ/కమిషనర్ ద్వారా చెప్పించాలని సున్నితంగా తిరస్కరిస్తుండటంతో సమస్య ఏర్పడుతోంది. దీంతో మరో ఇన్స్పెక్టర్ కోసం సంబంధిత ఎమ్మెల్యే ప్రయత్నాలు చేయడంతో అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ఏం చేయాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ప్రతి జిల్లాలో ‘ఐఐటీ’ కోచింగ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ఐటీలు వంటి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో సీట్లు సాధించగలిగేలా, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా ప్రత్యేక శిక్షణ అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఒక్కో కొత్త జిల్లాలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ని ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) నిర్ణయించింది. అలాగే తగిన వసతులు, సౌకర్యాలు ఉన్న గురుకులాలను సీవోఈలుగా అప్గ్రేడ్ చేసేలా కార్యాచరణ రూపొందించింది. ఇప్పుడున్నవి రెండే.. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు మాత్రమే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒకటి, రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలో మరొకటి ఉంది. గురుకుల కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న వారిలో ప్రతిభావంతులను ఎంపిక చేసి.. ఈ సీవోఈల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అక్కడ ఇంటర్ తరగతులతోపాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన మెటీరియల్ను కూడా అందిస్తారు. ఎంసెట్తో పాటు ఐఐటీ, ట్రిపుల్ఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు కీలకమైన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలకు సంబంధించి నిపుణులతో తరగతులు నిర్వహిస్తారు. మెడిసిన్ చదవాలనుకున్న వారిని నీట్ పరీక్షకు సన్నద్ధం చేస్తారు. కీలక విద్యా సంస్థలతో అవగాహన.. సీవోఈలలో ఫ్యాకల్టీని నియమించే అంశంపై గురుకుల సొసైటీ తర్జనభర్జన పడుతోంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ తరగతులు బోధించే వారున్నప్పటికీ.. ఎంసెట్, జేఈఈ, నీట్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేకంగా సిబ్బంది అవసరం. ఈ నేపథ్యంలో ప్రముఖ శిక్షణా సంస్థలతో అవగాహన కుదుర్చుకోవాలని గురుకుల సొసైటీ నిర్ణయించింది. ఈ ఏడాదే ప్రారంభం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించిన గురుకుల సొసైటీ.. ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది. అతి త్వరలో వీటికి ఆమోదం లభించే అవకాశముందని.. ఆ వెంటనే తగిన వసతులు, సౌకర్యాలున్న గురుకులాల్లో ప్రత్యేకంగా సీవోఈలను ప్రారంభిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. -
జిల్లాల పర్యటనకు డీజీపీ..
హైదరాబాద్: మంచిర్యాల, రామగుండం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్లలో డీజీపీ అనురాగ్ శర్మ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. శుక్రవారం, శనివారం సాగే ఈ పర్యటనలో కొత్త జిల్లాల పోలీసింగ్, శాంతి భద్రతల పటిష్టత, నేరాల నియంత్రణ, గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు వాటి భద్రత తదితర అంశాలకు సంబంధించి అధికారులతో భేటీ కానున్నట్లు తెలిసింది. మావోల నియంత్రణా చర్యలపై కమిషనర్లు, ఎస్పీల కు దిశానిర్దేశం చేయనున్నారని పోలీస్ వర్గాలు తెలిపాయి. కొత్తగా నిర్మించాల్సిన జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్లు, ఆర్మ్డ్ రిజర్వ్ బ్యారక్, పరేడ్ గ్రౌండ్.. తదితర భవనాలకు సంబంధించి స్థలాల పరిశీలనను కూడా డీజీపీ ఆరా తీయనున్నారు. -
టూరిజం హాబ్గా గోదావరి జిల్లాలు
నన్నయ వీసీ ఆచార్య ముత్యాలునాయుడు రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఉభయ గోదావరి జిల్లాలను టూరిజం హాబ్గా తయారు చేసేందుకు అనేక అవకాశాలు, సదుపాయాలు ఉన్నాయని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. ఈ జిల్లాలు అతిథి మర్యాదలకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్నాయి కనుకనే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు అనేకమంది పర్యాటకులు వస్తుంటారన్నారు. ఏపీ టూరిజం సహకారంతో నన్నయ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో క్యాబ్ డ్రైవర్లకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ పర్యాటకరంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలను, సదుపాయాలను, వనరులను తెలియజేశారు. ఒక ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే క్యాబ్ డ్రైవర్ల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. క్యాబ్ డ్రైవర్లు తమ ప్రవర్తనతో పర్యాటకులను ఆకుట్టుకోవాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన యూనివర్సిటీ అకడమిక్ డీన్ ఆచార్య ఎస్.టేకి మాట్లాడుతూ ఒకసారి వచ్చిన ప్రయాణికుడు మళ్లీ వచ్చేందుకు ఆసక్తిని చూపించేలా మీ నడవడిక, ప్రవర్తన ఉండాలన్నారు. క్యాబ్ డ్రైవర్ల ప్రవర్తన నియమావళి, టూరిజం పద్ధతులు, ప్రాథమిక చికిత్స విధానం, కమ్యూనికేషన్, ట్రాఫిక్ రూల్స్ అనే ఐదు అంశాలపై ఈ శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం వారికి కిట్తోపాటు రూ.500 పారితోషికం, స్టిక్కర్లు అందజేశారు. ప్రోగ్రామ్ అధికారి శశాంక్, మేనేజ్మెంట్ అధ్యాపకులు కె.సాయిబాబా, ఐ.ఎస్.ఎస్.రాజు, రాజేంద్రప్రసాద్, పద్మవళ్లి, డాక్టర్ ఎం.రమేష్, జి.అలీస్జాయ్, ఎ.శ్రీనివాస్, జె.రవిశంకర్ పాల్గొన్నారు. -
వెళ్తున్నా..వెళ్తున్నా..
⇔ విశాఖకు తరలిపోయిన పెట్రో యూనివర్శిటీ, అదే బాటలో ఐఐఎఫ్టీ ⇔ రావల్సిన మరో మూడు పరిశ్రమలపైనా నీలినీడలు ⇔ నేతల నిర్లక్ష్యంతో ఇతర జిల్లాలకు తరలింపు ⇔ విశాఖకు ఎగరేసుకుపోయే ప్రయత్నాలు ⇔ ఆపేందుకు ప్రయత్నాలు శూన్యం జిల్లాకు రావల్సినవి కొత్త రెక్కలు కట్టుకొని ఇతర జిల్లాకు తరలిపోతున్నాయి. జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల్లో కొరవడిన చిత్తశుద్ధి ఫలితంగా ఈ పరిస్థితి నెలకుంది. పర్సెంటేజీలు వస్తాయంటే చాలు ఆహ్వానించే నేతలున్న ఈ జిల్లా నేతలు విద్యార్థిలోకానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే సంస్థలు తరలిపోతున్నా కనీసం చీమకుట్టినట్టయినా లేకపోవడం బాధాకరమని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రగతిలో ముందుంటామని గొప్పలకుపోయే పాలకులు అరుదైన అవకాశాలను చేజార్చేస్తున్నారు. ఆర్థికంగా కలిసి వస్తుందంటే చాలు గద్దల్లా వాలిపోయే నేతలు ... తనకు కలిసి రాదంటే కన్నెత్తి కూడా చూడని దుస్థితి. విద్యార్థి లోకానికి ఎంతో ఉపయుక్తంగా ఉండే అరుదైన ఇనిస్టిట్యూట్లు సరిహద్దులు దాటిపోతున్నా చీమకుట్టినట్టయినా లేదు. వీరి నిర్వాకంతో జిల్లాకు వచ్చిన మరో అరుదైన అవకాశం చేజారిపోయేలా కనిపిస్తోంది. విభజన నేపథ్యంలో కేంద్రం జిల్లాకు పలు ఇనిస్టిట్యూట్లను మంజూరు చేసింది. ఇందులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ) ఒకటి. ఆ ఇనిస్టిట్యూట్ను రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దాన్ని అందిపుచ్చుకొని ఈ జిల్లాకు వచ్చేట్టు చేయాల్సిన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. చంద్రబాబు కేబినెట్లో నంబర్-2గా చెప్పుకునే మంత్రి యనమలతోపాటు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కనీసం ఈ సంస్థ ఏర్పాటుపై చేసిన ప్రయత్నం ఏమీ లేదు. విభజన తరువాత ప్రతిష్టాత్మకంగా భావించిన పెట్రో యూనివర్సిటీ జిల్లాకు మంజూరైంది. కృష్ణా గోదావరి బేసిన్లో కీలకమైన కోనసీమలో అపారమైన చమురు, సహజవాయువు నిక్షేపాలు వెలికి తీస్తున్న క్రమంలో పెట్రో యూనివర్సిటీ ఇక్కడ ఏర్పాటైతే జాతీయ స్థాయిలో జిల్లా పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయనుకున్నారు. పెట్రోలియం రంగంలో శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలకు ఒక మార్గదర్శకంగా òపెట్రో యూనివర్సిటీ నిలుస్తుందని విద్యార్థి లోకం ఆశలు పెంచుకుంది. ఎంతో ఉపయోగకరం పెట్రో యూనివర్శిటీ... కొన్ని పరిశ్రమ కోసం ప్రజలు వద్దన్నా ప్రభుత్వమే బలవంతంగా వందల ఎకరాలను సేకరిస్తోంది. తమ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తాయంటే పోలీసులను ఉసిగొల్పి కాలుష్య పరిశ్రమలైనా రప్పించుకుంటున్నాయి. అటువంటిది కేవలం 87 ఎకరాలు భూ సేకరణ చేస్తే సరిపోయే పెట్రో యూనివర్సిటీని గాలికొదిలేశారు. రాజమహేంద్రవరం, కాకినాడ, రాజానగరం, మండపేట తదితర ప్రాంతాల్లో పెట్రో యూనివర్సిటీ ఏర్పాటుకు కమిటీ పరిశీలన జరిపింది. అప్పుడు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమాత్రం చొరవ తీసుకోకపోవడంతోనే ఆ యూనివర్సిటీ విశాఖ జిల్లాకు అక్కడి ప్రజాప్రతినిధులు ఎగరేసుకుపోయారు. అలా ప్రతిష్టాత్మక పెట్రో యూనివర్సిటీని జిల్లా నుంచి చేజారిపోగా, ఇప్పుడు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అదే బాటలో పయనిస్తోంది. ఈ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కేంద్ర పరిశీలన కమిటీ గత ఏడాది రాజమహేంద్రవరం, మండపేట, రాజానగరం పరిసర ప్రాంతాలను పరిశీలించింది. ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రభుత్వ అసైన్ఢ్ భూములు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఐఐఎఫ్టీతోపాటు లాజిస్టిక్ వర్సిటీ, ఇండస్ట్రియల్ పార్కు, కొబ్బరి ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడిపప్పు పరిశ్రమల ఏర్పాటు చేయాలనుకున్నారు. వీటిలో ఐఐఎఫ్టీకి రాజమహేంద్రవరం అనుకూలంగా ఉంటుందని సెర్చ్ కమిటీ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఆ కమిటీని కలిసి ఇనిస్టిట్యూట్ ఏర్పాటుపై కనీసం జిల్లా ప్రజాప్రతినిధులు ఒక్కసారి కూడా చర్చించకపోవడం వారి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది. గతంలో పెట్రో యూనివర్సిటీ విషయంలో నిర్లక్ష్యం వహించిన రీతిలోనే ఇప్పుడు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ విషయాన్ని కూడా పాలకులు గాలికొదిలేశారు. ఆ మంత్రులకున్న చిత్తశుద్ధి వీరికేదీ...? విభజన అనంతరం రాజధానిగా మంగళగిరి ఏర్పాటయ్యాక పారిశ్రామికంగా విశాఖపట్నంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న పలుకుబడిని వినియోగించి ఈ ఇనిస్టిట్యూట్ను విశాఖకు తరలించేందుకు విశాఖ ఎంపీ హరిబాబు, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలియవచ్చింది. ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ముగ్గురు ఎంపీలు మురళీమోహన్, తోట నరసింహం, పండుల రవీంద్ర అధికార పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నా విద్యా సంస్థలు, పరిశ్రమలు తరలిపోకుండా అడ్డుకుంటారనే నమ్మకం జిల్లా ప్రజలకు కలగడం లేదు. వీటి ఏర్పాటుపై నియమితమైన సెర్చ్ కమిటీ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో అనువుగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చింది. సహజంగా రాజమహేంద్రవరం అనే సరికి అక్కడి ఎంపీ మురళీమోహన్ కీలకమైన పాత్ర పోషించాలి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మురళీమోహన్ గట్టి ప్రయత్నం చేస్తే ఐఐఎఫ్టి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోనే ఈ సరికే ఏర్పాటయ్యేది. కాకినాడ ఎంపీ తోట నరసింహం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, పలు స్టాండింగ్ కమిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విద్యాధికుడిగా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కూడా ఆ స్థాయిలో వీటి కోసం ప్రయత్నం చేయడం లేదనే విమర్శలున్నాయి. ఐఐఎఫ్టీ ప్రయోజనాలెన్నో... ఈ ఇనిస్టిట్యూట్ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో 1963లో ఏర్పాటైంది. మానవ వనరుల అభివృద్ధిని విశ్లేషించడం, నిరంతరం పరిశోధనలు నిర్వహించడం ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలనేది సంస్థ ప్రధాన లక్ష్యం. విదేశీ వాణిజ్యం నిర్వహణ, పెరుగుదల, ఎగుమతులను పెంపొందించాలనే లక్ష్యాలు కూడా ఇందులో ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయీకరణకు దోహదపడేలా సరికొత్త ఆలోచనలు, నైపుణ్యాభివృద్ది, కార్పొరేట్, ప్రభుత్వ రంగంలో పరిశోధన ఆధారిత కన్సల్టెన్సీని అందించే సామర్థ్యం కలిగిన ఇనిస్టిట్యూట్ ఇది. నిరంతర పరిశోధన, కన్సల్టెన్సీల ద్వారా ప్రభుత్వం వాణిజ్య, పరిశ్రమ అవసరాల కోసం ఎప్పటికప్పుడు విజ్ఞానం ఆ«ధారంగా సేవలందిస్తుంది. ఇంటర్నేషనల్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, కెరీర్ నిపుణుల ఆకాంక్షలకు అనుగుణంగా కోర్సులు అందిస్తుండటంతో విదేశీ విద్యార్థులు కూడా ఆకర్షితులవుతారు. ‘ఐఐఎఫ్టీకి రాజమహేంద్రవరం అనుకూలం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ) ఏర్పాటుకు అన్ని విధాలా రాజమహేంద్రవరం అనుకూలమైనది. విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతం ఐఐఎఫ్టీతో మరింత ప్రగతిని సాధించడంతోపాటు ఏటా సుమారు రూ. వంద కోట్ల మేరకు వ్యాపార లావేదేవీలు జరగడానికి, సుమారు 300 మందికి ఉద్యోగావకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది. ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థలు కూడా ఇక్కడనే ఉన్నందున ఐఐఎఫ్టీని కూడా రాజమహేంద్రవరంలోనే ఏర్పాటుచేయడం సముచితం. - ఆచార్య ఎస్. టేకి, డీన్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ, రాజానగరం. ఉపాధి అవకాశాలు కోల్పోనున్న స్థానికులు నవ్యాంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లాకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారన్ ట్రేడ్ పరిశ్రమ రావడంపై హర్షం వ్యక్తం చేశాం. ఇప్పటికీ దాని కార్యాచరణ తెలపకపోగా ప్రస్తుతం అది కూడా ఇతర జిల్లాకు తరలిపోతున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా మన జిల్లా నేతలు ఉన్న కారణంగా పరిశ్రమను ఇక్కడే ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని కోరుతున్నాం. జిల్లాలో సాంకేతిక విద్యతోపాటు మేనేజ్మెంట్ కోర్సు చేసిన అభ్యర్థులు వేలాది మంది ఉన్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు వస్తాయి. - బి.ప్రభాకరరావు, జేఎన్టీయుకే రెక్టార్ పరిశ్రమ ఇక్కడే ఏర్పాటు చేయాలి జిల్లాలో సాంకేతిక యూనివర్సిటీ జేఎన్టీయుకేతోపాటు నన్నయ్యవంటి వర్సిటీలు ఉన్న నేపథ్యంలో పరిశ్రమలు కూడా ఏర్పడితే జిల్లా అభివృద్ధితోపాటు పరిశ్రమలకు తగ్గ మ్యాన్ పవర్ను వర్సిటీల నుంచి తీసుకోవచ్చు. గతంలో జిల్లాకు పెట్రోలియం వర్సిటీ మంజూరు కాగా తరగతులను జేఎన్టీయుకేలో నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించగా, పెట్రో యూనివర్సిటీ ఇతర జిల్లాకు తరలించారు. ఈ పరిశ్రమ కూడా అ విధంగా చేజారకుండా చూడాలి. -ఎ.గోపాలకృష్ణ, డిజైన్ ఇన్నోవేషన్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్, జేఎన్టీయుకే ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి... పెట్రోలియం యూనివర్శిటీ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు స్థానికంగా ఏర్పాటైతే మన జిల్లాకు చెందిన యువతకు కొంత వరకు ఉపాధి అవకాశాల ప్రయోజనం ఉంటుంది. స్థానికంగా చమురు సంస్థలు ఉన్నందున ఆయా కంపెనీల్లో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యం యువతకు వస్తే వారి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అటువంటి యూవర్శిటీని జిల్లాకు వచ్చినట్టే వచ్చి పోవడం దురదృష్టకరం. – మట్టపర్తి రవిశంకర్, బీటెక్ , గంగలకుర్రు అగ్రహారం, అంబాజీపేట నేతలకు చిత్తశుద్ధి లేక పోవడం వల్లే... మన జిల్లా నేతలకు అభివృద్ధిపైనా..యువతకు మేలు చేసే యూనివర్శిటీల సాధన, జిల్లా పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై చిత్తశుద్ధి లేదు. ఈ కారణంగానే జిల్లాకు మంజూరైనా పెట్రోలియం యూనివర్శిటీ, డైరెక్టరేట్ ఆఫ్ ఫారన్ ట్రేడింగ్ వంటివి పక్క జిల్లాలకు వెళ్లిపోతున్నాయి. నేతలు ఇప్పటికైనా స్పందించి ఇటువంటివి సాధించడం ద్వారా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. – బండారు రామ్మోహనరావు, ఓయూ పూర్వవిద్యార్థుల సంఘం, అమలాపురం. -
కనీస వేతనాలు చెల్లించాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : వెలుగులో పని చేస్తున్న యానిమేటర్స్లకు కనీస వేతనం రూ 5వేల రూపాయలు చెల్లించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని సీఐటీయు కార్యాలయంలో జిల్లా విసృత స్దాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వెలుగు విఓలకు జాతీయ గ్రామీణ జీవనోపాధి పధకం కింద గ్రామస్దాయిలో పని చేస్తున్న యానిమేటర్స్లకు సంవత్సరాల తరబడి వెట్టి చాకిరి చేయించుకుంటూ వారికి కనీస వేతనాలు చెల్లించక పోవడం దారుణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో యానిమేటర్స్ ప్రభుత్వ గుర్తింపు, వేతనాల కోసం అనేక పోరాటాలు చేస్తే ప్రస్తుత టిడిపి ప్రభుత్వం సెర్ప్ నుండి రూ 2వేల రూపాయలు గౌరవ వేతనం చెల్లించిందన్నారు. టిడిపి ప్రభుత్వం యూనిమేటర్స్పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నప్పటికి వేతనాలు మాత్రం ఇంతవరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ప్ హెల్ప్ గ్రూపుల ట్రైనరీ పేరుతో యానిమేటర్స్ చేసే పనులతో పాటు పొదుపు సంఘాలకు శిక్షణ పేరుతో వీరిని తొలగించే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పదించి యానిమేటర్స్కు గుర్తింపు కార్డులు అందజేసి పనిభారాన్ని తగ్గించాలన్నారు. లేనిపక్షంలో అందోళన బాట పడతామన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు ప్రభుదాస్, శేఖర్, రత్నం, రామాంజులు, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాల పునర్విభజనలో శాస్త్రీయత లేదు : తమ్మినేని
గాంధారి: జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల విభజన శాస్త్రీయంగా జరగలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఫలితంగా అన్ని జిల్లాలలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని పేర్కొ న్నారు. ‘సామాజిక న్యాయం -తెలంగాణ సమగ్రాభివృద్ధి’పేరుతో తమ్మినేని వీరభద్రం చేపట్టిన పాదయాత్ర సోమవారం 50వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు కామారెడ్డి జిల్లా గాంధారిలో కేక్ కట్ చేశారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, టీ-హబ్ల వల్ల కాంట్రాక్టర్లకే లబ్ధి చేకూరుతోందన్నారు. వీటి వల్ల సామా న్యులకు ప్రయోజనం లేద న్నారు. రూ.లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. వాటిని విడతల వారీగా మాఫీ చేస్తున్నారని, దీంతో ఆ డబ్బు వడ్డీలకే సరిపోతోందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఇన్పుట్ సబ్సిడీ రూ. 700 కోట్లు విడుదలైనా.. రైతులకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందన్నారు. పాఠశాలల్లో 13వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రూ. 350 కోట్లు ఫీజు రీరుుంబర్స్మెంట్ బకారుులున్నాయని, వ్యవస్థ ఇలా ఉంటే ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుందని ప్రశ్నించారు. కేసీఆర్పై ప్రజ ల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయన్నారు. ఉపా ధ్యాయ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు. -
జిల్లాలు పెరిగాయి.. నిధులు పెంచండి
కేంద్ర మంత్రులను కోరిన టీఆర్ఎస్ ఎంపీలు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందే నిధులు, ఇతర ప్రయోజనాలను పెంచాలని కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, జేపీ నడ్డా, సృ్మతీ ఇరానీలను టీఆర్ఎస్ ఎంపీలు కోరారు. బుధవారం ఈ మేరకు ఎంపీలు జితేందర్రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, సీతారాం నాయక్, కొత్త ప్రభాకర్ రెడ్డి, పసునూరి దయాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.. కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశమై వినతిపత్రాలను సమర్పించారు. జవదేకర్తో సమావేశమై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేంద్రీయ, నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించి నట్టు టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత జితేందర్రెడ్డి తెలిపారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణలో ఎరుుమ్స్ ఏర్పాటుపై ప్రకటన చేయాలని నడ్డాను కోరినట్టు వివరించారు. స్మృతీ ఇరానీతోనూ సమావేశమై.. మహబూబ్నగర్లో సీసీఐ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. 2026 వరకు అసెంబ్లీ స్థానాల పెంపు కుదరని, పునర్విభజన చట్ట ప్రకారం సీట్ల పెంపు చేయాల్సి వస్తే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేయడంపై ఆయన స్పందిస్తూ.. దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చర్చిస్తున్నామని తెలిపారు. కాగా, పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా చేపడుతోందని ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. ముంపు గ్రామాల్లో ఎలాంటి గ్రామ సభలు నిర్వహించకుండా, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతోందన్నారు. -
ఏ ప్రాతిపదికన జిల్లాలను ఏర్పాటు చేశారు: శ్రీధర్ బాబు
కరీంనగర్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను స్వాగతిస్తున్నామనీ, శాస్త్రీయ పద్దతిలో జిల్లాల ఏర్పాటు జరగలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏ ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు చేసి, ఉద్యోగులను కేటాయిస్తున్నారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. చారిత్రాత్మక కరీంనగర్ జిల్లా ఉనికి కోల్పోయేలా విభజన జరిగిందని ఆరోపించారు. ప్రత్యేక జిల్లాల కోసం పారాడిన వారిపై కేసులను ఎత్తివేసి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఇష్టారాజ్యంగా జిల్లాలు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శకాలు, నిర్దిష్టమైన విధివిధానాల్లేకుండా జిల్లాలను ఇష్టారాజ్యంగా విభజన చేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు బి.బిక్షమయ్య గౌడ్ విమర్శించారు. శుక్రవారం నాడిక్కడ విలేకరులతో వారు మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటుపై హైపవర్ కమిటీని ఏర్పాటుచేసినా, దానికి పవర్ లేకుండా చేశారని ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్లను జిల్లా చేయాలని తాము కోరినట్టుగా మల్లు రవి వెల్లడించారు. దీనికోసం ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, దీనివల్ల రాష్ట్రంలో పేదలు ఇబ్బందులకు గురవుతున్నారని రవి విమర్శించారు. జిల్లాల విభజన విషయంలో సీఎం కేసీఆర్ తీరు పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టుగా మారిందని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు బి.బిక్షమయ్య గౌడ్ విమర్శించారు. -
ముక్కలపై ఉప్పెన
భద్రాచలం కోసం ఆఖరి పోరాటం నేడు డివిజన్ బంద్కు పిలుపు అఖిలపక్షం అత్యవసర సమావేశం భవిష్యత్ కార్యాచరణపై చర్చ సీపీఎం ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం ఏజెన్సీ బంద్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య భద్రాచలం : భద్రాచలం పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, వర్తక, వాణిజ్య సంఘాలన్నీ ఏకమైయ్యాయి. మంగళవారం భద్రాచలంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాయి. సీపీఐ రాష్ట్ర కమిటీ నాయకులు రావుల పల్లి రాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి వైఎస్ఆర్సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ లతో పాటు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు హాజరయ్యారు. నాయకులంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు పాలకుల తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో భద్రాచలం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు. నాడు నాలుగు మండలాలు, నేడు రెండు మండలాలు పోతే ఇక భద్రాచలం డివిజన్లో మిగిలేవి మూడేనని, ఇది భద్రాచలం అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. దీనిపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. బుధవారం భద్రాచలం బంద్కు పిలుపునిస్తున్నట్లుగా ప్రకటించారు. బంద్కు అన్ని వర్గాల ప్రజానీకం మద్దతు తెలుపాలని వారు కోరారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కడియం రామాచారి, గంటా కృష్ణ, టీడీపీకి చెందిన కొమరం ఫణీశ్వరమ్మ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బొలిశెట్టి రంగారావు, బీజేపీ నాయకులు ఆవుల సుబ్బారావు, నాగబాబు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కంభంపాటి సురేష్, చారుగుళ్ల శ్రీనివాస్, టీవీ, నరేష్, సుబ్బారావు, ఉపేంద్రవాసు, దేశప్ప, సురేష్నాయుడు,, కృష్ణ, సాయి, రాజు పాల్గొన్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం వాజేడు, వెంకటాపురం మండలాలను కొత్తగూడెం జిల్లాలో ఉంచాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో మంగళవారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరించటం సరైంది కాదని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ అన్నారు. ఖమ్మంలో భద్రాచలంను మూడో జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నర్సారెడ్డి, నూకరత్నం, శ్రీను, కృష్ణార్జునరావు, రాఘవయ్య, కొండలరావు, ముక్తేశ్వరి, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే రాజయ్య, ఎన్డీ నేత కెచ్చెల రంగారెడ్డి భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ జిల్లాను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సున్నం రాజయ్య, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాలను కలుపుకొని జిల్లాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్తో మంగళవారం చేపట్టిన బంద్లో భాగంగా భద్రాచలంలో ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో ధర్నా చేశారు. ఆదివాసీ ప్రాంతాలను విచ్ఛిన్నం చేయాలని పాలకులు కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్యే రాజయ్య ధ్వజమెత్తారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి భద్రాచలం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. ఆదివాసీ చట్టాల ఉల్లంఘన జరుగుతోందని, భవిష్యత్లో మనుగడ ప్రశ్నార్థకం కాబోతుందని న్యూడెమోక్రసీ నాయకులు కెచ్చెల రంగారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఏజెన్సీ ప్రాంతాలను కలుపుకొని జిల్లాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆదివాసీల స్వయం పాలనతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో కెచ్చెల కల్పన, ప్రసాద్, జోగారావు, ప్రమోద్, జీఎస్పీ నుంచి చలపతి, ప్రకాష్, సత్యనారాయణ, కొండరెడ్ల సంఘం నాయకులు ముర్ల రమేష్ పాల్గొన్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సీపీఎం నాయకులు -
వైఎస్ఆర్సీపీ బలోపేతానికి కృషి
– పార్టీ స్థానిక సంస్థల విభాగం రాష్ట్ర కన్వీనర్ వేమారెడ్డి కర్నూలు(ఓల్డ్సిటీ): ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల విభాగం బలోపేతానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర కన్వీనర్ దొంతిరెడ్డి వేమారెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలు పర్యటించి పార్టీ స్థానిక సంస్థల విభాగానికి కార్యవర్గం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి సమక్షంలో పెద్దకడబూరు ఎంపీపీ డి.రఘురాములు అధ్యక్షుడుగా జిల్లా కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఆదోని జెడ్పీటీసీ సభ్యుడు జి.ఆనంద్, ఎమ్మిగనూరు కౌన్సిలర్ రిజ్వానా బేగం, ఆలూరు ఎంపీటీసీ సభ్యుడు హెచ్.నాగరాజు, పెద్దకడబూరు సర్పంచ్ షేర్ఖాన్ పటేల్లను రాష్ట్ర కమిటీకి ప్రతిపాదించామన్నారు. జిల్లా నుంచి ఈ నలుగురు రాష్ట్ర స్థానిక సంస్థలకు ప్రతినిధులుగా ఉంటారని తెలిపారు. ఈ విభాగం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కోల్పోయిన అధికారాల కోసం పోరాడుతుందన్నారు. విలేకరుల సమావేశంలో గుంటూరు జిల్లా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బళ్లా శ్రీనివాస్ బాబు, తాడేపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఆర్.ఆదం, డైరెక్టర్ పరంధామం, జిల్లా గొర్రెల సంఘం మాజీ ఛైర్మన్, సర్పంచ్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. భయం వల్లనే కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా : గౌరు వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఓటమి భయంతోనే టీడీపీ ప్రభుత్వం కార్పొరేషన్ ఎన్నికల తేదీని ప్రకటించకుండా వాయిదా వేస్తూ వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయారు. కేసుకు భయపడే కేంద్ర ముందు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టారు. ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటమే: కాటసాని రామిరెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్రాలు కలిసి నాటకమాడుతున్నాయి. ప్రత్యేక ప్యాకేజీ మంత్రుల జేబులు నింపుకోడానికే సరిపోతుంది. దాని వల్ల ప్రజలకు ప్రయోజనం ఒనగూడదు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివద్ధి సాధ్యమవుతుంది. సాధించే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదు. -
స్కూళ్లను బట్టి కేటగిరీలుగా జిల్లాలు!
- ‘ఏ’, ‘బీ’లుగా విభజన...డీఈవోలంతా ‘ఏ’ కేటగిరీల్లోనే.. - ఇన్చార్జి డీఈవోలుగా..డిప్యూటీ ఈవో, ఏడీలు - కసరత్తు పూర్తి చేసిన విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాత జిల్లాలతోపాటు త్వరలో ఏర్పాటు కానున్న కొత్త జిల్లాలను విద్యాశాఖ ఏ, బీ కేటగిరీలుగా విభజించింది. స్కూళ్ల సంఖ్య, విద్యార్థుల సంఖ్య, అకడమిక్ మానిటరింగ్ పారామీటర్ తదితర అంశాల ఆధారంగా 27 జిల్లాలను రెండు కేటగిరీలుగా విభజించింది. ‘ఏ’ కేటగిరీలో 9 జిల్లాలను చేర్చింది. అందులో రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, హన్మకొండ, హైదరాబాద్, కొమురంభీమ్ జిల్లాలు ఉన్నాయి. వాటిల్లో ప్రస్తుతం పని చేస్తున్న డీఈవోలనే (డిప్యూటీ డెరైక్టర్ కేడర్) జిల్లా విద్యా శాఖ అధికారులుగా కొనసాగించనుంది. మిగతా 18 జిల్లాలను ‘బీ’ కేటగిరీలో చేర్చింది. అందులో ఆదిలాబాద్, సంగారెడ్డి, కొత్తగూడెం, నిర్మల్, శంషాబాద్, మల్కాజిగిరి, జగిత్యాల, పెద్దపల్లి, వనపర్తి, నాగర్కర్నూల్, సిద్ధిపేట్, మెదక్, సూర్యాపేట, యాదాద్రి, కామారెడ్డి, వరంగల్ , భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఆయా జిల్లాలకు డీఈవోలుగా కొత్తవారిని నియమించనుంది. ప్రస్తుతం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లుగా పని చేస్తున్న 11 మంది, నలుగురు అసిస్టెంట్ డెరైక్టర్లను, ఎస్సీఈఆర్టీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ), కాలే జ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్కు (సీటీఈ) చెందిన ముగ్గురిని ‘బీ’ కేటగిరీ జిల్లాల్లో ఇన్చార్జీ డీఈవోలుగా నియమించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. అంతేకాదు ఆయా జిల్లాల్లో అందించాల్సిన సేవలు, అవసరాల మేరకు ఏయే జిల్లాలు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సినవి, ఏయే జిల్లాలు మధ్యతరహాలో ఉండేవి, ఏయే జిల్లాలకు తక్కువ ప్రాధాన్యం ఉంటుందన్న అంచనాలతో లెక్కలు వేసింది. ఐదు ప్రధాన అంశాల అధారంగా వీటిని నిర్ధారించింది. ఇందులో ఒకటో పారామీటర్లో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లు ఉన్న వాటిని పరిగణలోకి తీసుకుంది. రెండో పారామీటర్ కింద ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలోని విద్యార్థులను తీసుకుంది. మూడో పారామీటర్గా ప్రైవేటు పాఠశాలలు, నాలుగో పారామీటర్గా బడిబయటి పిల్లల సంఖ్య, ఐదో పారామీటర్గా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను పరిగణనలోకి తీసుకొని జిల్లాలను ప్రాధాన్యాల కేటగిరీలో చేర్చింది. ఇవీ జిల్లాల వారీగా ప్రాధాన్యాలు అధిక ప్రాధాన్యం: పెద్దపల్లి, భూపాలపల్లి (జయశంకర్), మెదక్, జగిత్యాల, మహబూబాబాద్, యాదాద్రి, వరంగల్, హన్మకొండ, నిర్మల్. మధ్యస్థ ప్రాధాన్యం: సిద్ధిపేట్, కామారెడ్డి, కరీంనగర్, నాగర్కర్నూల్, సూర్యాపేట, రంగారెడ్డి, కొత్తగూడెం, మల్కాజిగిరి, నిజమాబాద్. తక్కువ ప్రాధాన్యం: సంగారెడ్డి, ఆదిలాబాద్, ఖమ్మం, శంషాబాద్, కొమురంభీమ్, నల్లగొండ, మహబూబ్నగర్, వనపర్తి, హైదరాబాద్. -
అన్ని జిల్లాల్లో స్టేడియంల నిర్మాణం
ఉప ముఖ్యమంత్రి రాజప్ప కొత్తపేటలో రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం కొత్తపేట : రాష్ట్రానికి దేశానికి గుర్తింపు తీసుకువచ్చే క్రీడల అభివృద్ధికి అన్ని జిల్లాల్లో స్టేడియంల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కొత్తపేట రెడ్డి అనసూయమ్మ మెమోరియల్ ఇండోర్ షటిల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2016 అండర్–19 బాలురు, బాలికల పోటీలు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. స్థానిక కాస్మోపాలిటన్ రిక్రియేషన్ సొసైటీ ఫౌండర్ అంyŠ చైర్మన్, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం(ఆర్ఎస్) ఆధ్వర్యంలో జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రారంభం సందర్భంగా జరిగిన సభకు ఎమ్మెల్సీ ఆర్ఎస్ అధ్యక్షత వహించగా హోంమంత్రి రాజప్ప, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సభలో రాజప్ప మాట్లాడుతూ వర్థమాన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, పాత స్టేడియంల ఆధునికీకరణకు, కొత్త స్టేడియంల నిర్మాణాలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మరో మంత్రి సుజాత మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తారని దానిలో భాగంగా 1999లో హైదరాబాద్లో ఏసియన్ గేమ్స్ నిర్వహించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. మరో మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా అవసరమన్నారు. తొలుత మంత్రి సుజాత, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎంపీపీ రెడ్డి అనంతకుమారిలు జ్యోతి వెలిగించారు. ఈ సభలో పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, మండలి విప్ అంగర రామ్మోహనరావు, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, కె.రవికిరణ్వర్మ, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, డీసీఎంఎస్ చైర్మన్ కెవీ సత్యనారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండారు వెంకట సత్తిబాబు, జిల్లా షటిల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బామిరెడ్డి, ఉపాధ్యక్షురాలు కొడాలి తనూజ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం లాంఛనంగా పోటీలను రాజప్ప ప్రారంభించారు. క్వాలిఫై విజేతలు రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి 85 టీమ్లు పోటీలకు హాజరుకాగా గురువారం జరిగే పోటీలకు నాకౌట్ విధానంలో ఎంపికలు జరిగాయి. బాలుర సింగిల్స్ విభాగంలో పి.చంద్రాజ్ పట్నాయక్(విశాఖ), బి.గిరీష్నాయుడు(తూర్పుగోదావరి), కె.ఎం.రవి(విశాఖ), కె.సాయిచరణ్(గుంటూరు), ఎం.సాయికిరణ్, బి.రోహిత్కుమార్, వి.యశ్వంత్(విశాఖ), ఆమన్గౌడ్(తూర్పుగోదావరి) బాలుర డబుల్స్ విభాగంలో పి.ఎస్.ఎన్ సంతోష్, టి.ఎన్.వీ సన్నీ(విశాఖ), చక్రధర్రెడ్డి, కె.విక్రాంత్(ప్రకాశం), ఏ. అరుణేష్, బి.గిరిష్నాయుడు(తూర్పుగోదావరి), డి.నితిన్, కె.హరికృష్ణ(తూర్పుగోదావరి) విజేతలుగా నిలిచారు. -
ఖానాపురంలోకి మూడు గ్రామాలు
ఖానాపురం : జిల్లాల పునర్విభజనలో భాగంగా మండలంలో మూడు గ్రామాలు నూతనంగా చేరనున్నాయి. ఖానాపురం మండలం వరంగల్ రూరల్ జిల్లాలో కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అదనంగా గ్రామాలు చేరనున్నట్లు సమాచారం. నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతున్న మండలంలో తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలోనే చిన్న మండలంగా ఉన్న ఖానాపురంలో చేరేందుకు గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్, సీతానగర్, భూపతిపేట గ్రామాల ప్రజలు గ్రామ పంచాయతీల్లో తీర్మాణాలు చేసి కలెక్టర్ వాకాటి కరుణకు అందజేశారు. దీంతో ప్రజల అభిప్రాయాలు సేకరించి కలెక్టర్ ఆర్డీఓ రామకృష్ణారెడ్డిని ఆదేశించారు. ఈనెల 16న గూడూరు తహసీల్దార్ లక్ష్మి గ్రామ పంచాయతీల తీర్మాణాలు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లోకి వెళ్లి ఇటీవల గ్రామ సభలు సైతం నిర్వహించారు. ఒకరిద్దరు మినహా గ్రామాల్లోని ప్రజలు అధికసంఖ్యలో ఖానాపురంలో మండలంలో కలిసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. గ్రామసభల్లో ప్రజల అభిప్రాయాలు, తీర్మాణ కాపీలను శనివారం ఆర్డీఓకు అందజేసినట్లు తహసీల్దార్ లక్ష్మి తెలిపారు. ఖానాపురం మండలంలో ప్రస్తుతం 9 గ్రామ పంచాయతీలు ఉండగా చిన్న ఎల్లాపూర్, సీతానగర్, భూపతిపేట గ్రామాలు కలిస్తే గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ మూడు గ్రామాల పరిధిలో 7వేల జనాభా ఉండగా 4500 ఓటర్లు ఉన్నారు. -
రాజకీయ లబ్ధికోసమే జిల్లాల పునర్విభజన
మునుగోడు : సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మాటలగారడీతో పాలన కొనసాగిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్నేత ఆరోపించారు. గురువారం మునుగోడులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అన్నిరకాలుగా అభివృద్ధి చెందిన తరువాత జిల్లా విభజన చేయాల్సిన సీఎం, రాజకీయ లబ్ధికోసమే జిల్లాల పునర్విభజన చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఎన్ని ఎత్తులువేసినా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారం చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రైతు రుణాలు మాఫీ చేస్తానని గొప్పలు చేప్పిన సీఎం నేటì కీ పూర్తిస్థాయిలో అమలు చేయకపొవడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా రైతుల రుణాలు పూర్తిగా మాఫీచేసి తిరిగి కొత్త రుణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ కర్నాటి స్వామి, పాలకూరి వెంకన్న, మిర్యాల మధుకర్, ఇటుకలపాటి మధుచౌదరి, యరసాని సైదులు, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫైళ్లు, ఉద్యోగుల వివరాలు ఆన్లైన్లోకి
ఇందూరు: జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఫైళ్ల విభజన ప్రక్రియ దాదాపు ముగిసింది. వాటి స్కానింగ్, ఫైళ్ల అప్పగింత అనంతరం రసీదులు తీసుకునే పని కూడా చకచకా సాగుతోంది. అందులో భాగంగానే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వారీగా ఫైళ్లు, శాఖల వారిగా ఉద్యోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ రవీందర్రెడ్డి సంబంధిత అధికారులు, ఉద్యోగులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ప్రగతిభవన్లో ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులతో సమీక్షించారు. newdistrictformation.telangana.gov.in అనే వెబ్సైట్ను ప్రభుత్వం రూపొందించిందని, ఇందులో వెంటనే వివరాలను నమోదు చేయాలని తెలిపారు. కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఫైళ్లు ఎన్ని పంపించారు..? శాఖల వారీగా పని చేస్తున్న ఉద్యోగుల వివరాలతో పాటు ఖాళీల వివరాలను మొత్తం అందులో నమోదు చేయాలని సూచించారు. శాఖల వారీగా అధికారులకు వారి రాష్ట్ర శాఖల నుంచి పాస్వర్డ్, యూజర్ ఐడీ వస్తుందని, తదనంతరం వివరాలు ఆ వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. ఇంకా ఫైళ్ల విభజన, స్కానింగ్ చేయని శాఖలు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్వో పద్మాకర్, కలెక్టరేట్ ఏవో గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు
-
జిల్లాల విభజన శాస్త్రీయంగా ఉండాలి
చిలుకూరు: జిల్లాల విభజన శాస్త్రీయంగా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బేతవోలు లో జరిగిన సీపీఐ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. విధివిధానాలు ఏమీ ప్రకటించకుండా అఖిలపక్ష నాయకులను పిలవడం సమంజసం కాదన్నారు. మండలంలోని అన్ని గ్రామాలను ఒకే నియోజకవర్గంలో ఉంచాలన్నారు. ఇష్టానుసారంగా విభజన చేశారని విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవంను ప్రభుత్వం అధికారంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట చర్రితను ప్రజలకు తెలియజేసేందుకు సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో బస్సు యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లాలో ఈ నెల 11వ తేదీన యాద్రాది నుంచి ప్రారంభమై ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, చిలుకూరు మీదుగా వెళ్లి హుజూర్నగర్లో రాత్రి ముగుస్తుందన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, జెడ్పీటీసీ భట్టు శివాజీ నాయక్, నాయకులు మండవ వెంకటేశ్వర్లు, నంద్యాల రామిరెడ్డి, బెజవాడ వెంకటేశ్వర్లు, తాళ్లూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు జిల్లాలకు కలిపి డీహెచ్ఓ
మారనున్న డీఎంహెచ్ఓ పోస్టు డీసీహెచ్ఎస్ పోస్టు కనుమరుగు ఎంజీఎం : జిల్లాల పునర్విభజనతో వైద్య ఆరోగ్యశాఖలో మార్పులు భారీ కానున్నాయి. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులను జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలోకి తెచ్చేలా అధికారులు ప్రాతి పాదనలు సిద్ధం చేశారు. దీంతో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పోస్టు కాస్త జిల్లా హెల్త్ ఆఫీసర్ (డీహెచ్ఓ)గా మారనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో వైద్యవిధాన పరిషత్, వైద్యారోగ్యశాఖ ఆస్పత్రులను డీహెచ్ఓ పర్యవేక్షిస్తారని పేర్కొంటున్నారు. ఈమేరకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. భవనాల కోసం కసరత్తు వరంగల్ జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలోనే హన్మకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రాతిపాదనలు చేయడంతోపాటు భూపాలపల్లి వైద్యారోగ్యశాఖ కార్యాలయం కోసం సింగరేణి జీఎంను సంప్రదించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే మహబూబ్బాద్లో ఎలాంటి ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో అద్దె భవనం కోసం ప్రయత్నిస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులను జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి పరిధిలోకి వచ్చేలా ప్రతిపాదనలు చేయడంతో వైద్యావిధాన పరిషత్ కోఆర్డినేటర్ పోస్టు కనుమరుగు కానున్నట్లు తెలుస్తోంది. పీహెచ్సీల విభజన పూర్తి ఓరుగల్లు జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో నాలుగు జిల్లాలకు 69 పీహెచ్సీల కేటాయింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. వరంగల్ జిల్లాలో ఏర్పడే జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో ఉన్న 17 మండలాలకు 18 పీహెచ్సీలతోపాటు నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల కమ్యూనిటీ హెల్త్సెంటర్లు కేటాయించారు. హన్మకొండ జిల్లాకు 19 మండలాల్లోని 22 పీహెచ్సీలతోపాటు స్టేషన్ఘన్పూర్, హుజూ రాబాద్, జమ్మికుంట కమ్యూనిటీ హెల్త్ సెం టర్లు, భూపాలపల్లి పరిధిలో ఉండే 15 మండలాలకు 23 పీహెచ్సీలతోపాటు చిట్యాల, మహాదేవ్పూర్, ములుగు, ఏటూర్నాగారం సీహెచ్సీలు వస్తాయి. మహబూబాబాద్ జిల్లాలోని 12 మండలాలకు 14 పీహెచ్సీలు మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రితోపాటు గుడూ రు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉండేలా విభజన ప్రక్రియ ప్రతిపాదనలు రాష్ట్ర స్థాయి అధికారులు పంపారు. అలాగే జిల్లా వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న 93 మందిని ఈ నాలుగు జిల్లాల వైద్యారోగ్యశాఖ కార్యాలయాలకు కేటాయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
పునర్విభజన లొల్లి
జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్న ఉద్యమాలు సంకట స్థితిలో గులాబీ నేతలు పూలు చల్లిన చోటే రాళ్లు రాజకీయ భవిష్యత్పై నీలినీడలు కరీంనగర్ సిటీ : జిల్లాల పునర్విభజన మంటలు అంతటా రాజుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఆందోళనలు ఉధృతమయ్యాయి. జిల్లా, డివిజన్, మండల సాధన కమిటీలు, జేఏసీలు పుట్టుకొచ్చి అచ్చం తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటాలు నిర్వహిస్తున్నాయి. దీనికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. దీంతో పూలు చల్లిన చోటే రాళ్లు పడుతున్న చందంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు ప్రస్తుత పరిస్థితి సంకటంగా మారింది. భగ్గుమన్న సిరిసిల్ల పునర్విభజనలో భాగంగా కరీంనగర్ జిల్లాను కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతనెల 22న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ముందునుంచి ప్రచారంలో ఉన్నట్లు సిరిసిల్లకు బదులు అనూహ్యంగా పెద్దపల్లి జిల్లా తెరపైకి రావడంతో సిరిసిల్ల ప్రాంతం భగ్గుమన్నది. అప్పటివరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన చోటే దిష్టిబొమ్మల దహనానికి పూనుకున్నారు. హోర్డింగ్ల్లో మంత్రి ఫొటో ఉన్నా ధ్వంసం చేసేంతటి ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సహజంగానే ప్రతిపక్షాలు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. అన్ని పార్టీలు, న్యాయవాదులు, కులసంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి. తెలంగాణ ఉద్యమ తరహాలోనే జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ఆందోళనలను ఉధృతం చేస్తున్నాయి. సిరిసిల్ల జిల్లా సాధన సెగ చివరకు రాష్ట్ర రాజధానికి సైతం తాకింది. మెున్నటి అసెంబ్లీ సమావేశం సందర్భంగా హైదరాబాద్లో జేఏసీ నాయకులను అరెస్ట్ చేయడంతో 48 గంటల బంద్ జరిగింది. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి తట్టుకోలేక, గత్యంతరం లేని పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం జిల్లా సాధన కోసం ప్రత్యక్ష ఉద్యమంలోకి అడుగుపెట్టక తప్పలేదు. జేఏసీతో కలవకుండా వేరుకుంపటి పెట్టి రిలేదీక్షల పేరిట ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు. చివరకు కేసీఆర్ కుటుంబసభ్యులు కూడా ఈ ఆందోళనలకు సంఘీభావం తెలపాల్సిన పరిస్థితి సిరిసిల్లలో నెలకొంది. ఉద్యమ ఉధృతికి ప్రభుత్వం తలొగ్గక తప్పదనే ధీమాతో జేఏసీ ఉండగా, ప్రభుత్వం సైతం పునరాలోచనలో పడిందనే ప్రచారం జరుగుతోంది. తెరపైకి పీవీ జిల్లా.. హన్మకొండను జిల్లా చేయొద్దంటూ ఆందోళనలు కొనసాగుతుండగా, తాజాగా హుజూరాబాద్ జిల్లా తెరపైకి వచ్చింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరిట హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలంటూ గత నాలుగు రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. హన్మకొండ జిల్లాలోకి ప్రతిపాదించిన హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలతో పాటు ప్రస్తుత వరంగల్ జిల్లాలోని పలు మండలాలను కలిపి జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కదులుతున్న కోరుట్ల వచ్చినట్లే వచ్చి చేజారి పోయిన రెవెన్యూ డివిజన్ సాధన కోసం కోరుట్ల ప్రాంత ప్రజలు ఏకమై కదులుతున్నారు. రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేయాలంటూ కోరుట్లలో జరుగుతున్న ఆందోళన ఉధృతమైంది. తమ ప్రాంతానికి సరైన ప్రజాప్రతినిధులు లేకపోవడంతోనే రెవెన్యూ డివిజన్ రాత్రికి రాత్రి మెట్పల్లికి మారిపోయిందని భావిస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డివిజన్ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమిస్తున్నాయి. రాజధాని హైదరాబాద్లోనూ దీక్షలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు. ఇటీవల నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను కలిసి డివిజన్ గురించి విన్నవించారు. రెండు రోజుల పట్టణ బంద్ విజయవంతం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. మెట్పల్లికి చెందిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ల తీరును నిరసిస్తూ వారి దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. – భూపాలపల్లి జిల్లాలోకి పోతున్న కాటారం, మహదేవపూర్, మల్హర్, మహాముత్తారం మండలాలతో కాటారం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన మొదలైంది. చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినపల్లితో పాటు కొత్తగా ఏర్పడే కొత్తపల్లి మండలాన్ని కలుపుకొని చొప్పదండి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్ష నాయకులు రెండు రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. జఠిలంగా హుస్నాబాద్ మూడు ముక్కలైన హుస్నాబాద్ నియోజకర్గంలో పరిస్థితి రోజురోజుకు జఠిలంగా మారుతోంది. నియోజకవర్గంలోని మండలాలు కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల్లోకి పోవడాన్ని జీర్ణించుకోలేని ఆ ప్రాంత వాసులు ప్రజాప్రతినిధులపై మండిపడుతున్నారు. హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. గృహనిర్భంధం చేస్తామంటూ హెచ్చరిస్తూ టీఆర్ఎస్ నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇదే క్రమంలో సిద్దిపేటలో కలిపిన ఇల్లంతకుంట, బెజ్జంకిలను కరీంనగర్లోనే కొనసాగించాలంటూ పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు ఆందోళన చేపట్టారు. జగిత్యాలలో కలిపిన తమను పెద్దపల్లి జిల్లాలో చేర్చాలంటూ వెల్గటూరు మండలం రాజారాంపల్లి గ్రామస్తులు, కాల్వశ్రీరాంపూర్ మండలాన్ని మంథని రెవెన్యూడివిజన్లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత వాసులు ఆందోళన చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న కొత్తపల్లి మండలంలో తమను కలపాలంటూ రామడుగు మండలం వన్నారం, దేశరాజ్పల్లి, కొక్కెరకుంట గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. మండలాల కోసం ఆందోళనలు జిల్లాలో కనీసం పది మండలాలు కొత్తగా ఏర్పడుతాయని ప్రచారం జరిగినా, ప్రభుత్వం కేవలం కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, అంతర్గాం, ఇల్లందకుంట... నాలుగు మండలాలతోనే సరిపెట్టింది. దీంతో మండలాల కోసం ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా రోడ్డెక్కారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి, కమాన్పూర్ మండలం రత్నాపూర్, కోరుట్ల మండలం ఐలాపూర్, ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి, రామగుండం మండలం బసంత్నగర్, జమ్మికుంట మండలం వావిలాల, భీమదేవరపల్లి మండలం కొత్తకొండను కొత్త మండలాలు చేయాలంటూ ఆయా ప్రాంతాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బసంత్నగర్కు చెందిన ఇండోర్ జిల్లా కలెక్టర్ నరహరి ఆందోళనలకు సంఘీభావాన్ని ప్రకటించి, బసంత్నగర్ను మండలంగా ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్ నీతూప్రసాద్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అభ్యంతరాల వెల్లువ డ్రాఫ్ట్ నోటిఫికే షన్లో అభ్యంతరాలు తెలపాలంటూ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఆయా ప్రాంతాల్లోని ఉద్యమకారులు అనుకూలంగా మలుచుకొనే పనిలో పడ్డారు. ఇంటర్నెట్ కేంద్రాల్లో మకాం వేసి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అభ్యంతరాలు పంపించే పనిని కొంతమంది నాయకులకు ప్రత్యేకంగా అప్పగించారు. వేల సంఖ్యలో అభ్యంతరాలు వెళితే ప్రభుత్వం నిర్ణయం మార్చుకొనే అవకాశం ఉందంటూ ప్రచారం చేయడంతో స్వచ్చందంగానూ అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా మెయిల్స్ పంపిస్తున్నారు. అధికార పార్టీకి సంకట స్థితి ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన విధంగా... కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు అధికార టీఆర్ఎస్ పార్టీకి సరికొత్త సంకట స్థితిని తీసుకొంది. రాజకీయంగా జిల్లాలో ఎదురులేకుండా కొనసాగుతున్న టీఆర్ఎస్కు తామే తెచ్చిపెట్టుకున్న పునర్విభజన అంశం రాజకీయ భవిష్యత్పై ప్రభావం చూపే స్థాయికి చేరుకోవడం పార్టీ నేతలను కలవరపరుస్తోంది. మొన్నటి వరకు పూలు చల్లిన చేతులతోనే రాళ్లు వేస్తుండగా, కీర్తిస్తూ పాటలు పాడిన నోళ్లతోనే కించపరుస్తూ పేరడీ పాటలతో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. సిరిసిల్ల ప్రాంతంలో తిరుగులేని శక్తిలా ఎదిగిన రాష్ట్ర మంత్రి కేటీఆర్కు జిల్లా సమస్య తీవ్ర ఇబ్బందికరంగా మారింది. సిరిసిల్ల జిల్లా కాకపోవడంతో కేటీఆర్ను లక్ష్యంగా చేసుకొని ప్రతిపక్షాలు పావులు కదపడంతో నిత్యం దిష్టిబొమ్మలు దగ్ధమవుతున్నాయి. అక్కడక్కడా అధికార పార్టీకి, జేఏసీ ప్రతినిధులకు నడుమ వాగ్వాదాలు చోటుచేసుకొంటున్నాయి. ఒకవేళ ఒత్తిడికి తలొగ్గి సిరిసిల్లను జిల్లాగా చేస్తే పెద్దపల్లి భవిష్యత్ ఏంటనే ప్రశ్న ఉత్కంఠను రేపుతోంది. సిరిసిల్ల జిల్లా అయితే పెద్దపల్లి రద్దవుతుందనే ఊహాగానాలతో అప్పుడే పెద్దపల్లిలో అఖిలపక్షం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హన్మకొండ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండడంతో, పెద్దపల్లి రద్దుకాకుండానే సిరిసిల్ల ఏర్పడుతుందంటూ మరికొంతమంది వాదిస్తున్నారు. -
కొత్త జిల్లాకు కొత్త స్టేషన్లు
ఎస్పీ షానవాజ్ ఖాసీం పాల్వంచ:కొత్తగా ఏర్పడనున్న కొత్తగూడెం జిల్లా లో కొత్తగా ఆరు పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్టు ఎస్పీ షానవాజ్ ఖాసీం చెప్పారు. పాల్వంచ పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లను ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. లక్ష్మిదేవిపల్లి, చుంచుపల్లి, మహిళ, సీసీఎస్ (సిటీ క్రైం స్టేషన్), పాల్వంచ టూ టౌన్, ట్రాఫిక్ స్టేషన్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని వివరించారు. పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ను కిన్నెరసాని స్టేషన్గా పేరు మార్చి అక్కడికి తరలిస్తామన్నారు. కొత్త జిల్లా లో పోలీస్ శాఖకు కల్పించాల్సిన ప్రాథమిక, మౌలిక సదుపాయాలపై ప్రతిపాదనలను డీజీపీకి పంపుతామన్నారు. అన్ని ముఖ్య పట్టణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారిం చామన్నారు. ‘‘చోరీల నివారణ, దొంగల గుర్తిం పు కోసమే కాదు. పోలీస్ సిబ్బంది పని తీరును తెలుసుకునేందుకు; ధర్నాలు, రాస్తారోకోలు, గొడవలు జరుగుతున్న సమయంలో వారు ఎంత అప్రమత్తంగా ఉంటున్నారో గమనించేందుకు.. పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు దోహదపడతాయి’’ అని వివరించారు. తాగుబోతుల వీరంగం, ఈవ్ టీజింగ్, స్పీడ్ డ్రైవింగ్, అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్ తదితరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన చర్యలు తీసుకునేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయన్నారు. ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లిలో సీసీ కెమెరాల ఏర్పాటు సత్ఫలితాలిస్తున్నదని అన్నారు. సమావేశంలో ఓఎస్డీ భాస్కర్, డీఎస్పీ సురేంద్ర రావు, సీఐ షుకూర్, ఎస్ఐలు పి.సత్యనారాయణ రెడ్డి, బి.సత్యనారాయణ, కృష్ణయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే జలగంతో ఎస్పీ భేటీ కొత్తగూడెం: కొత్త జిల్లాలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుపై శనివారం స్థానిక ఇల్లెందు అతిధి గృహంలో ఎమ్మెల్యే జలగం వెంకటరావుతో ఎస్పీ షానవాజ్ ఖాసీం సమావేశమయ్యారు. కొత్త జిల్లాల సరిహద్దులు, ప్రస్తుత పోలీస్ స్టేషన్లు, సర్కిల్స్పై చర్చించారు. టూరిజం హబ్గా కిన్నెరసాని అభివృద్ధవుతున్న నేపథ్యంలో అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని; పోలీస్ శాఖకు ప్రస్తుతమున్న సిబ్బంది, ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపించాలని ఎస్పీకి జలగం సూచించారు. పోలీసు శాఖకు కొత్త భవనాల నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని కూడా ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ బి.సురేందర్రావు పాల్గొన్నారు. -
ఏకపక్షంగా జిల్లాల పునర్విభజన
గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్లో కలపొద్దు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్వంచ: జిల్లాల పునర్విభజనలో సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకోకుండానే జిల్లాల పేర్లను కూడా ప్రకటించారని, సరైన నైసర్గిక స్వరూపాలు లేకుండానే విభజించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఆయన గురువారం ఇక్కడ సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం మండలాలను ప్రకటిత మహబూబాబాద్ జిల్లాలో కలపడం సరికాదన్నారు. కొన్ని నియోజకవర్గాలను మూడు ముక్కలు చేశారని అన్నారు. మోడీ ప్రభుత్వం ఒకవైపు ‘మేక్ ఇన్ ఇండియా’ అని నినదిస్తూనే, మరోవైపు రక్షణ, రైల్వే, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోకి విదేశీ పెట్టుబడులను ప్రొత్సíß స్తోందని.. మున్ముందు వీటిని ప్రైవేటీకరించేందుకు కుట్రలు సాగిస్తోందని విమర్శించారు. ఇప్పటివరకు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు రూ.10లక్షల కోట్లు రాయితీగా ఇచ్చిందన్నారు. అధికారంలోకి వస్తే కార్మికులను ఆదుకుంటామని చెప్పిన బీజేపీ పెద్దలు.. గద్దెనెక్కాక అదే కార్మిక హక్కులను తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. అందుకే, మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మెకు 10 జాతీయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా పిలుపునిచ్చాయన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై స్పందిస్తున్న ప్రతిపక్షాలను జైళ్లల్లో పెడతామని కేసీఆర్ బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. డబ్బు దండుకునేందుకే దుమ్మగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.2,500 కోట్ల నుంచి రూ.8000 కోట్లకు కేసీఆర్ ప్రభుత్వం పెంచిందని విమర్శించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, సహాయ కార్యదర్శి సాబీర్పాషా, కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, బరిగెల సాయిలు, మండే వీరహన్మంతరావు, పూర్ణచందర్రావు, ఆదాం, దుర్గాఅశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాల ఏర్పాటుపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్
-
సా...గుతున్న కసరత్తు!
పెద్దపల్లిలోకి ధర్మారం కరీంనగర్లోనే బెజ్జంకి ముస్తాబాద్పై పునరాలోచన సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాల పునర్విభజన కసరత్తు ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. ఉన్నతాధికారుల నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ డివిజన్లో ఉన్న అన్ని మండలాలు కొత్త జిల్లా పరిధిలోకి వస్తున్నాయా? లేదా? ఒకే రెవెన్యూ డివిజన్లోని మండలాలు రెండేసి జిల్లాల్లో కొనసాగుతున్నాయా? కొత్తగా ఏర్పాటు చేయబోయే రెవెన్యూ డివిజన్లోని అన్ని మండలాలు ఒకే జిల్లాలో పొందుపర్చారా? లేదా? అనే అంశాలపై వివరాలు తెప్పించుకున్న రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు తిరిగి జిల్లా అధికార యంత్రాంగానికి నిరంతరం సూచనలిస్తూనే ఉన్నారు. తెల్లవారితే నోటిఫికేషన్ను విడుదల చేయాల్సి రావడంతో అధికారులు మరింత లోతుగా కసరత్తు చేశారు. స్వల్ప మార్పులు మినహా ముసాయిదా జాబితాలో పెద్దగా మార్పులేమీ చేయలేదని తెలుస్తోంది. జగిత్యాల జిల్లాకు కేటాయించిన ధర్మారం మండలాన్ని తాజాగా పెద్దపల్లి జిల్లాకు మార్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ధర్మారం మండలం పెద్దపల్లి రెవెన్యూ డివిజన్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇదే డివిజన్లో ఉన్న వెల్గటూర్ మండలాన్ని మాత్రం జగిత్యాల జిల్లాకే కేటాయించినట్లు తెలిసింది. మరోవైపు సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండలాన్ని ముసాయిదాలో సిద్దిపేటకు కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపైనా పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. ఈ మండలాన్ని సైతం కరీంనగర్లో కొనసాగించడమే మేలనే భావనతో ఉన్నారు. అట్లాగే బెజ్జంకి మండలంలోని కొన్ని గ్రామాలను సిద్దిపేట జిల్లాలో కలుపుతారని ప్రచారం జరిగినప్పటికీ ప్రస్తుతానికి మాత్రం ఈ మండలాన్ని పూర్తిగా కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించనున్నారు. మండలాల కేటాయింపుల్లో మార్పులు చేర్పుల అంశంపై పూర్తిస్థాయిలో స్పష్టత లేదని, సోమవారం ఉదయానికి జిల్లాల పునర్విభజన ప్రక్రియకు తుదిరూపు వస్తుందని జిల్లా రెవెన్యూ అధికారులు పేర్కొనడం గమనార్హం. -
పాలన సౌలభ్యం కోసమే కొత్తజిల్లాల ఏర్పాటు
రామన్నపేట : రాజకీయ ప్రయోజనాలకు తావులేకుండా ప్రజల సౌకర్యార్థం, పాలన సౌలభ్యం కోసమే కొత్తజిల్లాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. ఆదివారం రామన్నపేటలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, పార్టీ జిల్లాఅధ్యక్షుడు బండ నరేందర్రెడ్డిలతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 17కొత్తవాటితోపాటు, మొత్తం 27జిల్లాల ఏర్పాటు దాదాపు ఖరారయినట్లేనని వివరించారు. అఖిలపక్షభేటీ జిల్లాకు సంబంధించిన విషయంలో ఏకాభిప్రాయానికి రావడం సంతోషకర విషయమన్నారు. చిట్యాల–భువనగిరి, వలిగొండ–భద్రాచలం(వయా తిర్మలగిరి, మహబూబాబాద్)రోడ్లను నాలుగులేన్లుగా విస్తరించి జాతీయ రహదారులుగా గుర్తించాలని ముఖ్యమంత్రిద్వారా కేంద్రమంత్రి గట్కరీకి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రామన్నపేట నియోజకవర్గం తిరిగి పునరుద్ధరించబడుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమావేశంలో జెడ్పీటీసీ మాద యాదగిరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బందెల రాములు, కాల్య శ్రవణ్కుమార్, గంగుల వెంకటరాజిరెడ్డి, బాల్తు నాగయ్య, బొడ్డుపల్లి లింగయ్య, బండ దామోదర్రెడ్డి, మెట్టు శ్రీనివాస్రెడ్డి, ఎండీ.నాజర్, అక్రం, మోటె రమేష్, బండ లింగస్వామి ఉన్నారు. -
ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల ఏర్పాటు
-
ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల ఏర్పాటు
హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ను ఈ నెల 22న ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. జిల్లాల ఏర్పాటును అన్ని పార్టీలు స్వాగతించాయని, ప్రజాభిప్రాయం మేరకే కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేలోపు అవసరమైతే మరో రెండు సార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో సైతం జిల్లాల ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతమున్న ముసాయిదాలో అవసరమైతే మార్పులు, చేర్పులు జరుగుతాయని కేసీఆర్ తెలిపారు. ఏ ప్రాంతం వారికైనా అభ్యంతరాలుంటే తెలియజేయొచ్చని, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ప్రజలకు అనుకూలంగా ఉండేలానే జిల్లాల ఏర్పాటు ఉంటుందని సీఎం తెలిపారు. దసరా నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నట్లు తెలిపారు. కొత్త కోర్టులు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుతమున్న వ్యవస్థ కొనసాగుతుందని కేసీఆర్ తెలిపారు. హైకోర్టు సీజేతో మాట్లాడాక కొత్త కోర్టులు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. సెంప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని, మహారాష్ట్రతో నీటి విషయంలో ఒప్పందం చేసుకోనున్నట్లు వెల్లడించారు. -
ప్రజాభిప్రాయంతోనే జిల్లాలు ఏర్పాటు చేయాలి
న్యూశాయంపేట : ప్రజాభిప్రాయ సేకరణతోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఫోరం ఫర్ బెటర్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్ ప్రభుత్వాన్ని కోరారు. హన్మకొండలోని ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. జిల్లా లు, మండలాల ఏర్పాటుపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగిన తర్వాతే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ప్రజల ఆందోళలను పరిగణనలోకి తీసుకోని జిల్లాల ఏర్పాటు చేయాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ఉద్భవించే రాజ్యాంగ సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత కనిపించడం లేదన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ శాస్త్రీయంగా, చట్టబద్ధంగా, ప్రజాభిప్రాయానికి అ నుగుణంగా చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. ఫోరం నాయకులు దివాక ర్, ఎ.ప్రభాకర్రెడ్డి, పాపిరెడ్డి, యాదగిరి, వీరభద్రుడు, ప్రభాకర్ పాల్గొన్నారు. -
తెలంగాణలో 27 జిల్లాలు ఖరారు
-
27 జిల్లాలు ఖరారు
• 58 డివిజన్లు, 533 మండలాలు • ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం ఆమోదం... • సిరిసిల్ల, సికింద్రాబాద్ ఔట్ • వికారాబాద్, శంషాబాద్, మల్కాజ్గిరి జిల్లాలుగా రంగారెడ్డి విభజన • అనూహ్యంగా పెద్దపల్లి, హన్మకొండలకు చోటు • ఆదిలాబాద్లో నిర్మల్ జిల్లాకు గ్రీన్ సిగ్నల్ 1. ఆదిలాబాద్; 2. మంచిర్యాల; 3. నిర్మల్; 4. కరీంనగర్; 5. పెద్దపల్లి; 6. జగిత్యాల; 7. వరంగల్; 8. హన్మకొండ; 9. మహబూబాబాద్; 10. భూపాలపల్లి; 11. మెదక్; 12. సిద్దిపేట; 13. సంగారెడ్డి; 14. నిజామాబాద్; 15. కామారెడ్డి; 16. నల్లగొండ; 17. సూర్యాపేట; 18. యాదాద్రి; 19. మహబూబ్నగర్; 20. నాగర్కర్నూల్; 21. వనపర్తి; 22. ఖమ్మం; 23. కొత్తగూడెం; 24. హైదరాబాద్ (ఓల్డ్); 25. వికారాబాద్; 26. శంషాబాద్; 27. మల్కాజ్గిరి సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మొత్తం 27 జిల్లాలుండేలా పునర్విభజన చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆమోదం తెలిపారు. కొత్త జిల్లాల స్వరూపం, కొత్త జిల్లాల సంఖ్యపై బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆయన ఆరు గంటల పాటు సుదీర్ఘంగా ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. జిల్లాల విభజనపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీసీఎల్ఏ రేమండ్ పీటర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు, సీఎంవో అధికారులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుత 10 జిల్లాలతో పాటు రాష్ట్రంలో 17 కొత్త జిల్లాల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రెవెన్యూ డివిజన్లను 44 నుంచి 58కు పెంచాలని నిర్ణయించారు. ఇప్పుడున్న 459 మండలాలను 533కు పెంచనున్నారు. ప్రతిపాదిత జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై శనివారం అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తారు. అదే రోజు కేబినేట్లో చర్చించి ఆమోదించిన అనంతరం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. తర్వాత నెల రోజుల వ్యవధిలో ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించి తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. కొత్త జిల్లాలపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను, ప్రజల విజ్ఞప్తులను సమీక్షలో సీఎం క్షుణ్నంగా పరిశీలించారు. సీసీఎల్ఏ, ట్రాక్ రూపొందించిన కొత్త జిల్లాల మ్యాప్లనూ పరిశీలించారు. మొదటగా రెవెన్యూ యంత్రాంగం, సీసీఎల్ఏ సిద్ధం చేసిన ప్రతిపాదనల మేరకు రాష్ట్రాన్ని 24 జిల్లాలుగా పునర్ వ్యవస్థీకరించాలా, జిల్లాల సంఖ్యను అంతకుమించి పెంచాల్సిన అవసరముందా అని లోతుగా చర్చించిన అనంతరం తుది ప్రతిపాదనలను ఖరారు చేశారు. కొత్త జిల్లాలకు జేసీలే కలెక్టర్లు.. ప్రస్తుత జిల్లాలకు పాత కలెక్టర్లను యథాతథంగా కొనసాగించాలని, కొత్తగా ఏర్పడే జిల్లాలకు జాయింట్ కలెక్టర్లను, సబ్ కలెక్టర్లను కలెక్టర్లుగా నియమించాలని అన్ని శాఖల కార్యదర్శులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఇప్పుడు జిల్లా స్థాయిలో ఉన్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ తదితర పోస్టులన్నిటినీ యథాతథంగా కొనసాగించాలని కోరారు. సచివాలయంలో బుధవారం ఉదయం సీఎస్ రాజీవ్శర్మ అన్ని శాఖల కార్యదర్శులతో కొత్త జిల్లాల ముందస్తు సన్నాహాలపై సమావేశమయ్యారు. ఉద్యోగుల విభజన, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాలు, కార్యాలయాల వసతి తదితరాలను ప్రధానంగా చర్చించారు. శాఖలవారీగా అధికారులు, ఉద్యోగుల విభజన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచిం చారు. కొత్త జిల్లాలకు సిబ్బంది పంపిణీలో సీనియారిటీకి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజనకు అనుసరించాల్సిన విధానాన్నే కొత్త జిల్లాల మధ్య ఉద్యోగుల పంపిణీకి కూడా అవలంబించాలని, సీనియర్ అధికారులతో కమిటీ వేయాలని అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సచివాలయంలో సీఎస్ అధ్యర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో మళ్లీ భేటీ జరగనుంది. దీనికి 14 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించారు. జంట జిల్లాలుగా హన్మకొండ, వరంగల్ వరంగల్ జిల్లాలో కొత్తగా హన్మకొండను జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనూహ్యంగా ఆఖరి సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. జనగామను జిల్లా చేయాలని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నందున హన్మకొండను జిల్లా చేసి జనగామను అందులో కొనసాగించాలని సీఎం సూచించినట్లు తెలిసింది. దీంతో వరంగల్ జిల్లా ఏకంగా నాలుగు ముక్కలవనుంది. జిల్లాలో ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న భూపాలపల్లి, మహబూబాబాద్లతో పాటు హన్మకొం డను తుది జాబితాలో చేర్చారు. రంగారెడ్డి మూడు ముక్కలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ముందునుంచీ పేచీ ఉం ది. ఈ రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు ఉపసంఘం ఎదుట భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటంతో వివాదం ముదిరింది. దాంతో తర్జనభర్జనల అనంతరం హైదరాబాద్ జిల్లాను యథాతథంగా కొనసాగించాలని, నగరం చుట్టూరా ఉన్న రంగారెడ్డిని మూడు జిల్లాలుగా చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని వికారాబాద్, శంషాబాద్, మల్కాజ్గిరి కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఖరారు చేశారు. గతంలోని సికింద్రాబాద్ ప్రతిపాదనను విరమించుకున్నారు. సిరిసిల్లకు బదులు పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలో ముందు నుంచీ ప్రతి పాదనల్లో ఉన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు తుది ప్రతిపాదనల్లో చోటు దక్కలేదు. దానికి బదులుగా అనూహ్యంగా పెద్దపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసే నిర్ణయం వెలువడింది. దీంతో కరీంనగర్లో జగి త్యాల, పెద్దపల్లి కొత్త జిల్లాల జాబితాలో ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మంచి ర్యాలతో పాటు కొత్తగా నిర్మల్ జిల్లా ప్రతి పాదనకు సీఎం ఓకే చెప్పారు. -
మంత్రుల నోట.. జిల్లా మాట..
నిర్మల్ టౌన్ : నిర్మల్ జిల్లా త్వరలోనే ఏర్పాటు కానుందని రాష్ట్ర మంత్రులు మహేందర్రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంతోపాటు సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) గ్రామంలో బుధవారం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. త్వరలోనే నిర్మల్ జిల్లా ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. సిరిసిల్లలో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన డ్రై వింగ్ శిక్షణ మాదిరిగా ప్రతీ జిల్లా కేంద్రంలోనూ డ్రై వింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న కారణంగా రూ.1,200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కేటాయించిందన్నారు. ప్రతీ గ్రామంలోనూ రోడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యేలకు లేఖలు రాసినట్లు ఆయన పేర్కొన్నారు. పల్లె వెలుగు బస్సులను నడపడం వల్ల నష్టాలు వస్తున్నప్పటికీ.. వాటిని విస్మరించబోమని ఆయన తెలిపారు. రోడ్డున్న ప్రతీ గ్రామానికి బస్సు నడుపుతామని హామీ ఇచ్చారు. దూర ప్రాంతాలకు ఏసీ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మరో 1200 బస్సుల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషిచేస్తుందన్నారు. -
కొడుకు, అల్లుడి కోసమే కొత్త జిల్లాలు
కరీంనగర్: కొడుకు కే తారకరామారావు, అల్లుడు టీ హరీశ్ రావుల కోసమే సీఎం కే చంద్రశేఖరరావు రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆరోపించారు. స్వార్థం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. బిడ్డ కోసం నిజామాబాద్ ఉంది. ఇప్పుడు కొడుకు కోసం సిరిసిల్ల, అల్లుడి కోసం సిద్ధిపేటలను జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. శాస్త్రీయంగా జిల్లాలను విభజిస్తే తామూ సంతోషిస్తామని, కుటుంబసభ్యుల కోసం చేస్తే ఊరుకోమని అన్నారు. కరీంనగర్ కు చెందిన గంగాధర మండలాన్ని సిరిసిల్లలో కలపడం సీఎం స్వార్ధ రాజకీయాలకు నిదర్శనం అని అన్నారు. ప్రజాభీష్టానికి భిన్నంగా జిల్లాలను ఏర్పాటు చేస్తే సహించబోమని హెచ్చరించారు. -
జిల్లాల వివాదంపై సీఎం ఆరా
కలెక్టర్లతో సమావేశాలు.. 8 జిల్లాల ఏర్పాటు లాంఛనమే సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు ప్రధానంగా మూడు జిల్లాల్లో చిచ్చు పెట్టింది. వరంగల్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రాంతాల వారీగా భిన్నాభిప్రాయాలు నెలకొనటంతో వివాదం ముదురుతోంది. దీంతో ఈ మూడు జిల్లాల్లో వివాదాస్పదంగా మారిన కేంద్రాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రెండు రోజులుగా ఆయా జిల్లాల కలెక్టర్లను హైదరాబాద్కు పిలిపించి వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొత్త జిల్లాలపై కలెక్టర్లు తయారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించటంతో పాటు ప్రజలు, ప్రజా ప్రతినిధుల డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, జనగాం.. మహబూబ్నగర్ జిల్లాలో గద్వాల, వనపర్తి.. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసే కొత్త జిల్లాలపై వెల్లువెత్తిన ఆందోళనలు, అభ్యంతరాలపైనే చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లపై ప్రత్యేక నివేదికను అందించాలని రెవెన్యూ ఉన్నతాధికారులు, సీఎస్కు సీఎం సూచించినట్లు సమాచారం. వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ను జిల్లా కేంద్రంగా మార్చాలనే ఆందోళన తీవ్రమవుతుండటంతో పరిస్థితిని అంచనా వేసేం దుకు సీఎం శుక్రవారం వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను పిలిపించి సమీక్ష జరిపారు. మరోవైపు మహబూబ్నగర్ జిల్లాలో గద్వాల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డి.కె.అరుణ పట్టుబడుతున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల విభజన ప్రక్రియపైనా ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. విపక్ష నేతలతోపాటు సొంత పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు తయారు చేయాలని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఎనిమిది జిల్లాలపై స్పష్టత: వివాదాస్పద కేంద్రాలను మినహాయిస్తే ఎనిమిది కొత్త జిల్లాల ప్రతిపాదనలు దాదాపుగా కొలిక్కి వచ్చాయి. వాటికి సంబంధించిన సరిహద్దులు, మ్యాపులు తయారవుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, మెదక్లో సిద్దిపేట, నల్లగొండలో సూర్యాపేట, వరంగల్లో భూపాలపల్లి, ఖమ్మంలో కొత్తగూడెం, కరీంనగర్లో జగిత్యాల, రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్, మహబూబ్నగర్లో నాగర్కర్నూల్ జిల్లాల ఏర్పాటు దాదాపుగా ఖాయమైంది. వీటిని ప్రకటించటం లాంఛనమేనని, ఏయే ప్రాంతాలను వీటిలో కలపాలనే అంశంపైనే తుది కసరత్తు జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లలను జిల్లాలుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సైతం ప్రభుత్వానికి అందాయి. -
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుసున్నాయి. విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో బుధవారం వేకువజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. నెల్లూరు నగరంలో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, గూడూరు, తడ, ఆత్మకూరు, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. కృష్ణపట్నం పోర్టులో ఒకటవ నంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. అధికారయంత్రాంగం పరిస్థితిని గమనిస్తూ అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, పూతలపట్టు తదితర ప్రాంతాల్లో బారీ వర్షం కురుస్తోంది. ప్రకాశం జిల్లాలోని కందుకూరు, సింగరాయకొండ, ఒంగోలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో జనజీవితానికి ఆటంకం కలిగింది. గుంటూరు జిల్లా బాపట్లలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షం పడుతోంది. గుంటూరు జిల్లా అంతటా బుధవారం ఉదయం నుంచి వానలు పడుతున్నాయి. తీరప్రాంతంలో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో నిజాంపట్నం హార్బర్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సూర్యలంక బీచ్లో అలల ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లటం లేదు. -
పోలీసుల దాడుల్లో నగదు, కోళ్లు స్వాధీనం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో కోడి పందాల స్థావరాలపై శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నగదు, కోళ్లతో పాటు పలువురి పందెంరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాల వారీగా.. విజయనగరం: భోగాపురం మండలం బసవపాలెంలో ఐదుగురు పందెంరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు కోళ్లు, రూ.16 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం: సంతమాగులూరు, బల్లికురవ మండలాల్లో నిర్వహించిన దాడుల్లో 25 కోళ్లు, రూ.15 వేలు నగదుతో పాటు కోడి పందేలు నిర్వహిస్తున్న 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా: ఐరాల మండలం గాజులపల్లెలో కోడి పందెలు నిర్వహిస్తున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. -
రెండో రోజు గోదావరి జిల్లాల్లో కోడిపందాల జోరు
-
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు
-
వరదబాధిత ప్రాంతాల్లో నేడు వైఎస్ జగన్ పర్యటన
-
తెలంగాణలో అన్ని పోలీస్స్టేషన్లలో అప్రమత్తత
-
27 నుంచి జిల్లాల్లో కేటీఆర్ పర్యటనలు
హైదరాబాద్: వాటర్ గ్రిడ్ పనుల పర్యవేక్షణ కోసం తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ను కేటీఆర్ విడుదల చేశారు. 27న మహబూబ్ నగర్ లో, 28న వరంగల్ లో, 29న ఖమ్మంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా..ఫిబ్రవరి 10 వ తేదీలోగా నల్గొండ జిల్లాలో వాటర్ గ్రిడ్ పైలాన్ నిర్మాణం పూర్తి చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. పైలాన్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆవిష్కరిస్తారన్నారు. దీనికి సంబంధించి జిల్లాల వారీగా వాటర్ గ్రిడ్ పథకంపై కేటీఆర్ సమీక్షలు నిర్వహించనున్నారు. వాటర్ గ్రిడ్ పథకంలో జరుగుతున్న పనుల పర్యవేక్షణ కోసం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, జిల్లాల అధికారులందరూ పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని కేటీఆర్ తెలియజేశారు. -
హ్యపీ బర్త్ డే జగనన్న
-
పరిపాలన సౌలభ్యం కోసం మరో 14జిల్లాలు.
-
‘జిల్లా’ జగడం
సాక్షి, ఏలూరు : గిరిజన జిల్లా ఏర్పాటు ప్రతిపాదనపై వివాదం ముదురుతోంది. ఆరు మండలాలకు చెందిన గిరిజనేతరులు సోమవారం భారీ సంఖ్యలో ఏలూరులోని కలెక్టరేట్కు తరలివచ్చారు. కలెక్టర్ కాటమనేని భాస్కర్ను కలిసేం దుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు రంగప్రవేశం చేసి గుంపులుగా ఉన్న గిరిజనేతరులను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. మైదాన మండలాలను గిరిజన జిల్లాలో కలపవద్దని, గిరిజన జిల్లా ఏర్పాటు అనివార్యమైతే గిరిజనేతరులను వేరే మండలంలో కలపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి గిరిజన జిల్లా ఏర్పాటు ఒక ఆలోచన మాత్రమేనని, ప్రజల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు గిరిజనేతరుల ఏజెన్సీలో గిరజనేతరుల తరపున కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆందోళన చెందవద్దు : ఎంపీ ప్రజాభిప్రాయం ప్రకారమే ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని ఏలూరు ఎంపీ మాగంటి బాబు హామీ ఇచ్చారు. క్యాంపు కార్యాలయంలో ఎంపీ బాబును, జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజును జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం గ్రామాలకు చెందిన సుమారు వెయ్యిమంది రైతులు సోమవారం కలిశారు. ఏజెన్సీలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని కోరారు. గిరిజన జిల్లా ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని, ఏజెన్సీలో నివసిస్తున్న 80శాతం గిరిజనేతరుల జీవనం, హక్కుల విషయంలో తగు నిర్ణయం తీసుకుని గిరిజనేతరులకు రక్షణ కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లామని, ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని మాగంటి బాబు చెప్పారు. అనంతరం వారిని తీసుకుని కలెక్టరేట్కు వచ్చారు. అందరి అభిప్రాయాలు తీసుకుంటాం : కలెక్టర్ ఏజెన్సీ మండలాల్లో అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని, ఈ విషయంలో ఎవరూ కూడా ఎటువంటి అపోహలు చెందవద్దని కలెక్టర్ కాటమనేని భాస్కర్ ప్రజాప్రతినిధులు, గిరిజనేతరులతో అన్నారు. జిల్లాలోని ఏజెన్సీ మండలాలను ప్రత్యేక గిరిజన జిల్లాలో కలిపే విషయంలో అటు గిరిజనులకు, ఇటు గిరిజనేతరులకు సమన్యాయం జరిగేలా చూడాలని ఎంపీ మాగంటి బాబు కలెక్టర్ను కోరారు. జీలుగుమిల్లి, బుట్టాయగూడెం ప్రజల తరఫున వినతిపత్రాన్ని కలెక్టర్కు ఎంపీ అందచేశారు. తనకు తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయని బాబు అసహనం వ్యక్తం చేశారు. గిరిజన జిల్లా ఏర్పాటు మంచిదేనని, అయితే గిరిజనేతరుల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా సరైన చట్టాలను రూపొందించి రక్షణ కల్పించాలని కోరారు. -
జిల్లాలు 24
టీఆర్ఎస్ ప్రతిపాదిత కొత్త జిల్లాలు.. 1. సిద్దిపేట, 2. మెదక్, 3. మహబూబ్నగర్, 4. వనపర్తి, 5. నాగర్కర్నూలు, 6. నల్లగొండ, 7. సూర్యాపేట 8. ఖమ్మం, 9. భద్రాచలం, 10. ఆదిలాబాద్, 11. మంచిర్యాల, 12. వరంగల్, 13. జనగాం, 14. ఆచార్య జయశంకర్ జిల్లా(భూపాలపల్లి), 15. జగిత్యాల, 16. కరీంనగర్, 17. నిజామాబాద్, 18. రంగారెడ్డి(జిల్లా కేంద్రం వికారాబాద్), 19. హైదరాబాద్ సెంట్రల్, 20. చార్మినార్, 21. గోల్కొండ, 22. హైదరాబాద్ ఈస్ట్ (జిల్లా కేంద్రం భువనగిరి), 23. సికింద్రాబాద్, 24 సంగారెడ్డి తెలంగాణలో జిల్లాల పెంపుపై టీఆర్ఎస్ కసరత్తు పది జిల్లాలను 24కు పెంచేందుకు ప్రణాళికలు రాజధానిపై ఒత్తిడి తగ్గేలాజిల్లాల పునర్వ్యవస్థీకరణ హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోనే 6 జిల్లా కేంద్రాలు జిల్లాకు 5 నియోజకవర్గాలు, సగటు జనాభా 15 లక్షలు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న టీఆర్ఎస్.. కొత్త రాష్ర్టంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కసరత్తును కూడా పూర్తి చేసింది. నిత్యం కిటకిటలాడే రాజధాని హైదరాబాద్ను వాహనాల రద్దీ నుంచి విముక్తం చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంది. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కృతనిశ్చయంతో ఉన్న టీఆర్ఎస్ నాయకత్వం ఈ అంశంపై నిర్దిష్టమైన అవగాహనకు వచ్చింది. ఏయే కేంద్రాలను జిల్లాలుగా మార్చాలి.. వాటిలో ఏయే నియోజకవర్గాలు ఉండాలనే దానిపై నిపుణులతో పూర్తిస్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసుకుంది. దీని ప్రకారం తెలంగాణలో ఇప్పుడున్న 10 జిల్లాలను 24 జిల్లాలుగా మార్చాలని నిర్ణయించింది. 23 జిల్లాల్లో ఐదేసి నియోజకవర్గాలు, ఆచార్య జయశంకర్ పేరుతో ఏర్పాటయ్యే జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండాలని ప్రతిపాదించింది. జనాభాను, భౌగోళిక స్థితిని బట్టి చార్మినార్, వికారాబాద్, నాగర్కర్నూలు, మహబూబ్నగర్ల పరిధిలో నియోజకవర్గాల సంఖ్యను సర్దుబాటు చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది భవిష్యత్తులో జరిగే నియోజకవర్గాల పునర్విభజన(2019లోగా తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాల్సి ఉంది)ను దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుందనే వాదన కూడా ఉంది. జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదికలివే.. దేశవ్యాప్తంగా జిల్లాల సగటు జనాభా 19 లక్షలుగా ఉంది. ప్రస్తుత ఉమ్మడి రాష్ర్టంలో ఈ సగటు దాదాపు 30 లక్షలు. కొన్ని మండలాల ప్రజలు తమ జిల్లా కేంద్రంకన్నా.. రాష్ట్ర రాజధానికి వెళ్లడమే సులభంగా ఉన్న పరిస్థితి నెలకొంది. విద్య, వైద్యం వంటి అవసరాలకు అన్ని జిల్లాల వారూ హైదరాబాద్కే రావాల్సి వస్తోంది. అందుకని జిల్లాలను పెంచి, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సకల వసతులను ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. హైదరాబాద్ చుట్టూ వంద కిలోమీటర్ల పరిధిలో ఎక్కువ జిల్లా కేంద్రాలను అభివృద్ధి చేయడం ద్వారా నగరంపై ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల ప్రపంచస్థాయి(గ్లోబల్ సిటీ) నగరంగా హైదరాబాద్ రూపుదిద్దుకునే వీలుంటుంది. ఈ ప్రాతిపదికతోనే తెలంగాణలోని జిల్లాలను 15 లక్షల సగటు జనాభాతో ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. జిల్లా కేంద్రాలకు వెయ్యి కోట్లు అవసరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త జిల్లాల ప్రతిపాదనలపై విస్తృత చర్చలు చేపట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను సేకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది. పార్టీ నేతలు చెబుతున్న దాని ప్రకారం 2016 నాటికి జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తవుతుంది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ నిమ్స్ స్థాయి ప్రభుత్వాసుపత్రి, మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, అన్ని సంస్థల సిబ్బందికి క్వార్టర్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున నిధులు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పుడున్న జిల్లా కేంద్రాలకు అదనంగా 14 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే అందుకు రూ. 14 వేల కోట్లు అవసరం. కొత్త జిల్లా కేంద్రాల్లో పాలనా ప్రక్రియ పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి దాదాపుగా రెండు లేదా మూడేళ్లు పడుతుందని అంచనా. -
రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో జట్ పీటీసీ, ఎమ్ పీటీసీ ఎన్నికలు
-
కాకినాడలో బంద్ సంపూర్ణం
-
రెండు జిల్లాల ప్రజల మద్య చిచ్చు పెట్టిన ఇసుక త్రవ్వకాలు
-
కర్నూలు రాజధాని అన్నింటికీ అనికూలం
-
13 జిల్లాల్లో కొనసాగుతున్న ఆందోళనలు
-
గళం విప్పి కదం తొక్కుతాం
కర్నూలు(కల్చరల్), న్యూస్లైన్: సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం జరిగినన్నాళ్లు తాము గళం విప్పి కదం తొక్కుతామని జిల్లా కవులు, కళాకారులు, రచయితలు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన కవులు రచయితలు, కళాకారులు, మేధావుల సదస్సు నిర్వహించారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ పోరాట చరిత్ర కలిగిన కందనవోలులో కళాకారులు గళం విప్పి గర్జిస్తే ఉద్యమం మరింత ఊపందుకుంటుందన్నారు. రాయలసీమలో కర్నూలు జిల్లా పోరాటాల ఖిల్లాగా గుర్తింపు పొందిందన్నారు. నేటి నుంచే కళా రూపాల ప్రదర్శన: బుధవారం సాయంత్రం కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు జేఏసీ ఆధ్వర్యంలో జరిగే సభలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కళా రూపాల ప్రదర్శన ఉంటుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మియ్యా తెలిపారు. కొత్తపాటలతో సరికొత్త వ్యంగ్య నాటికలతో ఉద్యమానికి ఊతమిస్తామన్నారు. గాడిచెర్ల ఫౌండేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ కల్కూరా మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధనకు సాగే ఉద్యమంలో రచయితలు, కవులు, మేధావులు అగ్రభాగంలో ఉండాలన్నారు. కర్నూలు జిల్లా రచయితల సంఘం వ్యవస్తాపక అధ్యక్షుడు హీరాలాల్, నవలా రచయిత ఎస్డీవీ.అజీజ్, రచయితలు కేఎన్ఎస్.రాజు, ఎలమర్తి రమణయ్య, కేజీ జయరామిరెడ్డి, ఏపీడీఐసీ డెరైక్టర్ గంగాధర్రెడ్డి, కథా రచయిత ఇనాయతుల్లా, రిటైర్డ్ ఉపాధ్యాయులు లక్ష్మణమూర్తి, చంద్రశేఖర్ శాస్త్రి, డీవీఎస్.ఛాయామణి, యాగంటీశ్వరప్ప, డాక్టర్ వి.పోతన, రంగస్థల కళాకారులు, హెచ్.చంద్రన్న, రోషన్ అలీ, రంగముని పాల్గొన్నారు.