drought conditions
-
రాష్ట్రంలో కరువు పరిస్థితులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని.. ఏడాదిగా సరైన వర్షపాతం లేక రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని, దీనిని అంతా కలసికట్టుగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. కరువు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. బుధవారం రేవంత్రెడ్డి తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వివిధ జిల్లాల రైతులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తాము పండిస్తున్న పంటలు, అనుభవాలను వివరించారు. ఈ సందర్భంగా రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో కరువు పరిస్థి తులు ఉన్నాయి. వచ్చే ఎండాకాలంలో తాగునీటికి కష్టా లు రాకుండా చూడాల్సిన అవ సరముంది. అందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. రిజర్వాయర్ల నుంచి నీళ్లను విడుదల చేయాలంటూ కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ ప్రాంతాల్లో రైతులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రైతులందరూ పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులతో కలిసి భవిష్యత్ కార్యక్రమాలు ప్రతి సీజన్లో రైతులు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఎప్పటికప్పుడు వాళ్లకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు రైతు నేస్తం ఉపయోగపడు తుంది. రైతులు నేరుగా వ్యవసాయ నిపుణులతో మాట్లాడేందుకు వీలు కలుగుతుంది. ఎప్పుడూ ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లాలి. అందులో భాగంగానే రైతుల సమస్యలను తెలుసుకోవాలనే ఆలోచనతో వ్యవసాయ శాఖ ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని చేపట్టింది. మా ప్రభుత్వం రైతుల తో కలిసిమెలిసి భవిష్యత్ కార్యక్రమాలను చేపడు తుంది. విత్తనాలు, ఎరువుల సరఫరా, ఏ పంట వేయాలనేది మొదలు పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకు నేంత వరకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కాకుండా లాభసాటి ధర రావాలనే ఆలోచనతో మా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రైతుభరోసా, రుణమాఫీ, విత్తనాలు అందుబాటులోకి తీసుకురావటం, ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డుల ద్వారా పంట ఉత్పత్తుల కొనుగోలు వంటి కార్యక్రమాలన్నీ చేపడుతోంది. పంట మార్పిడితో అధిక దిగుబడులు రాష్ట్రంలో దాదాపు 26 రకాల పంటలు పండటానికి అనుకూలమైన భూములు, వాతావరణం ఉన్నా యి. రైతులు కేవలం వరి, పత్తి, మిర్చి పంటలకే పరిమితం కావొద్దు. ఇతర పంటలు సాగు చేయాలి. పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడి, ఎక్కువ లా భాలు వచ్చేలా పంటల ప్రణాళికను రూపొందించుకోవాలి. వ్యవసాయ శాఖ చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసు కోవాలి. దీనిద్వారా తమ సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకురావొచ్చు. ప్రస్తుతం 110 సెంటర్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్ర మాన్ని భవిష్యత్తులో అన్ని గ్రామాలకు విస్తరిస్తాం. రైతులు ధైర్యం కోల్పోవద్దు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన సూచనలతో ప్రభుత్వం ఇటీవలే పంటల బీమా పథకాన్ని అమ ల్లోకి తెచ్చింది. రైతులు ఏదైనా ఆపదతో చనిపోతే ఆ కుటుంబాన్ని రైతు బీమా పథకం ఆదుకుంటే.. రైతులు ధీమాగా బతికేందుకు పంటల బీమా పనిచేస్తుంది. పంట వేసినప్పటి నుంచి కరువు వచ్చినా, వరద వచ్చినా నష్టపరిహారం అందుతుంది. రైతులు పెట్టిన పెట్టుబడి అయినా తిరిగి వస్తుంది. వారు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఉండదు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులు ధైర్యం కోల్పోవద్దు. ప్రభుత్వం అండగా ఉంటుంది..’’అని సీఎం రేవంత్ చెప్పారు. ‘రైతు నేస్తం’ ఏమిటి? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,601 రైతువేదికలను వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం చేసి.. నేరుగా రైతుల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని చేపట్టింది. తొలి విడతగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రూ.97 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులు, వ్యవసాయ నిపుణులు గ్రామాల్లోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారు. తగిన సలహాలు ఇవ్వడంతోపాటు పంటల సాగులో అధునాతన మెలకువలను సూచిస్తారు. ఆదర్శ రైతులు తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకునేందుకు కూడా ఈ కార్యక్రమం వీలు కల్పిస్తుంది. -
కరువును తట్టుకునే గోధుమ
లండన్: వాతావరణ మార్పుల కారణంగా వచ్చే కరువు పరిస్థితులను తట్టుకుని నిలదొక్కుకునే గోధుమ వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇవి నీటిని కూడా పొదుపుగా వాడుకునేలా జన్యు మార్పులు చేశారు. బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ సరికొత్త గోధుమ వంగడాలను రూపొందించారు. కొత్త వంగడాల్లో తక్కువ పత్ర రంధ్రాలు ఉండేలా జన్యు మార్పులు చేశారు. దీంతో తక్కువ నీటిని వినియోగించుకోవడంతో పాటు మంచి దిగుబడులు కూడా వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం కోసం 80 నుంచి 90 శాతం మంచి నీరు అవసరం అవుతోంది. ఒక కిలో గోధుమ ఉత్పత్తి చేసేందుకు ఏకంగా 1,800 లీటర్ల నీరు అవసరం పడుతోంది. వాతావరణ పరిస్థితులు మారుతుండటంతో నీటి ఎద్దడి ఎక్కువవుతున్న నేపథ్యంలో ఇలాంటి వంగడాలు ఎంతో అవసరమని, పైగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా ఆహారపు అవసరాల కోసం రైతులు మరింత ఉత్పత్తి చేయాలని పరిశోధకులు అంటున్నారు. అన్ని మొక్కల్లాగే గోధుమ మొక్కలు కూడా నీటి ఆవిరిని నియంత్రిస్తుంటాయి. నీరు ఎక్కువగా ఉన్నప్పుడు పత్ర రంధ్రాలు తెరుచుకుని ఆవిరి బయటికి వెళ్తుంది. అదే కరువు పరిస్థితుల్లో పత్రరంధ్రాలు మూసుకుపోయి నీరు బయటికి వెళ్లకుండా నియంత్రించుకుంటాయి. అదే పత్ర రంధ్రాలు తక్కువగా ఉంటే నీటిని జాగ్రత్తగా వాడుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
కరువు రక్కసి@బొల్లాపల్లి తండాలు
సాక్షి , బొల్లాపల్లి(గుంటూరు) : బొల్లాపల్లి మండల తండాల్లో పేదరికం విసిరిన బతుకులు వలసదారుల్లో తరలిపోతున్నాయి. పండుగలాంటి పల్లె వాకిట పస్తుల తోరణాలు వేలాడుతున్నాయి. కరువు రక్కసి నోట చిక్కిన ఇళ్లు.. తాళం బుర్రలు కప్పుకుని కన్నీరొలుకుతున్నాయి. వానజాడ లేక, సాగర్ నీళ్లు రాక తడారిన పంట పొలాలు నెర్రెలిచ్చి ఘొల్లుమంటున్నాయి. మెతుకు దొరికే తావు చూపండయ్యా అంటూ ఏకరువు పెడుతున్నాయి. ప్రకాశం జిల్లా సరిహద్దు నల్లమల అటవీ ప్రాంతానికి ముఖ ద్వారంగా ఉన్న బొల్లాపల్లి ప్రాంతం జిల్లాలోనే వెనుకబడినదిగా గుర్తింపు పొందింది. ఏళ్ల తరబడి అభివృద్ధికి దూరమైంది తీవ్ర పంట నష్టం.. మండలంలో సుమారు 12 వేలకు పైగా హెక్టార్లలో మాగాణి, మెట్ట భూమి ఉంది. ఇక్కడ చిన్నా.. సన్నకారు రైతులు మిరప, పత్తి, పొగాకు, కంది పంటలు సాగు చేస్తుంటారు. గత ఐదేళ్లుగా తీవ్ర వర్షాభావం.. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్ల నుంచి కూడా నీళ్లు రాకపోవడంతో పంటలు దెబ్బతిన్నాయి. చెరువులు ఎండమావులను తలపిస్తున్నాయి. దీనికి తోడు గిట్టుబాటు ధరలు లేకపోవడం కూడా అన్నదాతలను కుంగదీసింది. ఖరీఫ్, రబీ పూర్తిగా నష్టపోవాల్సి వచ్చింది. వాణిజ్య పంటలైన మిరప, పత్తి సుమారు 4,500 హెక్టార్లలో సాగు చేస్తే 3,200 హెక్టార్లలో, పత్తి 3 వేల హెక్టార్లలో సాగుచేస్తే 2,700 హెక్టార్లలో దెబ్బతింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు, రైతు కూలీలు పొట్ట చేతపట్టుకొని సొంత గ్రామాన్ని, పొలాలను వదిలి వేరే ప్రాంతాలకు వలసబాట పట్టారు. గొంతు తడవని పరిస్థితి ప్రస్తుతం మండల గ్రామాలను తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. రేమిడిచర్ల, రావులాపురం, గండిగనుమల, దొమల గుండం, గుమ్మనంపాడు, గరికపాడు, పమిడిపాడు, జయంతిరామపురం, మర్రిపాలెం, బండ్లమోటు, అయ్యన్నపాలెం, గుట్లపల్లి పంచాయతీల్లో తాగునీటికి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. బోర్లు అడుగంటడంతో.. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మారుమూల తండాల్లోని ప్రజలు ట్యాంకులు వచ్చేంత వరకూ ఎదురుచూడాల్సిన పరిస్థితి. గతంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు వాటర్ గ్రిడ్ పథకాన్ని ఏర్పాటు చేస్తామని హామీ గుప్పించారు. ఆ తర్వాత దానిని విస్మరించారు. ప్రస్తుతం వేసవి సమీపిస్తున్న తరుణంలో నీటి కష్టాలు మరింత పెరగనున్నాయి. ఇంకా పూరి గుడిసెల్లోనే! ప్రభుత్వం అందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేశామంటూ ఊదరగొతుంది. కానీ, మండలంలోని మారు మూల తండాల్లో ప్రజలు చాలా వరకు పూరిగుడెసెల్లోనే జీవనం సాగిస్తున్నారు. కొంత మంది ప్రభుత్వం మాట నమ్మి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో భాగంగా ఉన్న ఇంటిని తొలగించి దాని స్థానంలో కొత్త ఇంటి నిర్మాణానికి పునాదులు వేశారు. అంతే నిధులు మంజూరు కాకపోవడంతో ఆ నిర్మాణాలు అక్కడితోనే నిలిచిపోయాయి. కరువుకు తార్కాణం మండలంలో నల్లమలకు ఆనుకుని 30కి పైగా గిరిజన తండాలున్నాయి. కరువు రక్కసి ధాటికి విలవిల్లాడుతున్నాయి. మన్నేపల్లితండా, గండిగనుమలపైతండా, దొమల గుండం తండా చక్రాయపాలెం, గంగుపల్లి తండా, లింగంగుంట తండా, చెంచుకుంట తండాల నుంచి సుమారు 2 వేల కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి వలస బాటపట్టాయి. అయినా ప్రభుత్వం కరువు పరిస్థితిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బండ్లమోటు వద్ద 1969లో ఏర్పాటు చేసిన హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ మైనింగ్ 2002లో మూతపడింది. ఫ్యాక్టరీపై ఆధారపడి జీవనం సాగించిన 1500 కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఆ తర్వాత సరైన ఉపాధి లభించక వేరే వేరే ప్రాంతాలకు వలసబాట పట్టాయి. ఎప్పటికైనా ఆశ తీరకపోతుందా అని.. గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని నాలుగు మండలాల కరువు నియంత్రణకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు సమీపంలో దొమ్మర్లగొంది ప్రాజెక్టు పూర్తి చేస్తే చెరువులు నిండి కరువు చాయలు దరిచేరవని ఈ ప్రాంత వాసుల ఆశ. గుంటూరు జిల్లా వెల్దుర్తితో పాటు దుర్గి, బొల్లాపల్లి, ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలాలకు తాగునీటితో పాటు సాగు నీరందిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుంది. చెరువులు నిండటం వలన భూగర్భ జలాలు పెరిగి సాగు విస్తీర్ణం కూడా పెరుగుతుంది. వైద్యం దైన్యం.. విద్య దూరం ఎస్టీ, ఎస్సీ, బీసీలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో విద్య, వైద్య ఖర్చులు సైతం భరించలేని దయనీయ స్థితిలో ప్రజలున్నారు. పదో తరగతి తర్వాత పై స్థాయి విద్యకు విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. కేవలం రెండు బాలుర గిరిజన వసతి గృహాలు మాత్రమే ఉన్నాయి. బాలికా విద్యకు సరైన పోత్సాహం లేదు. వెనుకబడిన ప్రాంతంలో కనీసం ఇంటర్పై స్థాయితో పాటు సాంకేతిక కళాశాలలు ఏర్పాటు చేస్తే బాలికల విద్యాశాతంపెరుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఆశ్రమ పాఠశాల మంజూరైనా నిర్మాణానికి నోచుకోలేదు. మండల కేంద్రంలో పేరుకే 24 గంటల ఆరు పడకల ఆస్పత్రి ఉంది. గతేడాది వరకు పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది నియామకం చేపట్టలేదు. ప్రస్తుతం వైద్యులు ఉన్నా..సమయానికి అందుబాటులో ఉండని దుస్థితి. ఐదేళ్ల కిందట నిర్మించిన వెల్లటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేటికీ వైద్యులులేరు. గతంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుతో పాటు అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు సీహెచ్సీని ప్రారంభించి వదిలేశారు. అంతా మోసం.. మండలాభివృద్ధికి కేటాయించిన నిధులను టీడీపీ నాయకులు పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. అదే విధంగా కరువు మండలం కింద నిధుల మంజూరైతే వాటిని వేరే మండలానికి మళ్లించారు. పంచాయతీ నిధులను తాగునీటికి వెచ్చించాలని ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ సుమారు రూ 1.50 కోట్లను ఆయా పంచాయతీల్లో సిమెంట్ రోడ్లుకు కేటాయించి, ఆ పనుల్లోనూ చేతివాటం చూపించారు. నీరు– చెట్టు కింద సుమారు రూ 3.50 కోట్లు చెరువు పూడిక తీత, చెక్ డ్వామ్ల నిర్మాణాల పేరుతో జేబుల్లో వేసుకున్నారు. ఇదంతా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల అండదండలతో కింది స్థాయి టీడీపీ నాయకులు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అధ్వానంగా రవాణా సౌకర్యం గ్రామాలను కలుపుతూ ఉండే లింకు రోడ్లు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. కనుమల చెర్వు పంచాయతీ శివారు నెహ్రునగర్ తండాకు వెళ్లాలంటే అటవీ మార్గంలో సుమారు 5 కిలోమీటర్లు వెళ్లాలి. అయితే నాగార్జునసాగర్ కుడి కాలువ పై బ్రిడ్జి నిర్మిస్తే ఆ ప్రాంతాన్ని చేరుకోవడం సులభమవుతుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మాణానికి పలుసార్లు శంకుస్థాపనలు చేశారు గానీ, పనులు మొదలుపెట్టలేదు. నిమ్మలసుబ్బయ్య కుంట తండాకు రోడ్డు సౌకర్యం లేదు. బస్సులు రావు, అత్యవసర సమయాల్లో నానా ఇబ్బందులు పడాలి. పంచాయతీ కేంద్రం గుమ్మనంపాడుకు అటవీ ప్రాంతం నుంచి 7 కిలోమీటర్లు దూరం నడవాలి. పంచాయతీలు : 23 జనాభా : 58 వేలు వలస కుటుంబాలు : 2 వేలు గిరిజన తండాలు : 30 సాగు భూమి : 12వేల హెక్టార్లు అటవీ ప్రాంతం : 33వేల చదరపు హెక్టార్లు -
వరి సాగుపై నీలి నీడలు
‘మెతుకు’ సీమలో భిన్నమైన పరిస్థితి గణనీయంగా పడిపోతున్న సాగు విస్తీర్ణం రెండేళ్లుగా మరింత దయనీయం తీవ్ర వర్షాభావ పరిస్థితులతో... భూగర్భజలమట్టం పడిపోవటమే కారణం భారంగా మారి.. సాగుకు రైతన్న దూరం గజ్వేల్ఃవిస్తారమైన వరి సాగుతో ‘మెతుకుసీమ’గా ఖ్యాతి గడించిన మెదక్ జిల్లాలో నేడు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలమట్టం పడిపోవటంతో బోరుబావుల ఆధారంగా సాగవుతున్న ‘వరి’ గణనీయంగా తగ్గుతున్నది. మరోవైపు రిజర్వాయర్లు, ఆనకట్టలు వెలవెలబోతుండగా...వాటి పరిధిలోని వేల ఎకరాల వరి పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. రెండేళ్లుగా మరింత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ‘వరి’పై నీలినీడలు కమ్ముకోడంతో దాని స్థానంలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కథనం... జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కరిస్తే..ఏటా 5.5లక్షల హెక్టార్ల పంటలు సాగులోకి వస్తుంటాయి. గత పదేళ్ల క్రితం వరకు ఇందులో ‘వరి’దే అగ్రస్థానం. మిగితా పంటలన్నీ 60శాతం మాత్రమే ఉండేవి. ఇదే క్రమంలో మెదక్ జిల్లా ‘మెతుకుసీమ’గా ఖ్యాతి గడించింది. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలమట్టం గణనీయంగా పడిపోతున్నది. ఫలితంగా బోరుబావులు వట్టిపోయి...‘వరి’ సాగు ముందుకు సాగటం లేదు. జిల్లాలో ఈసారి 82206 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగానూ వరి ఇప్పటివరకు కేవలం సుమారుగా 10వేల హెక్టార్లలో మాత్రమే సాగులోకి వచ్చింది. సీజన్ ముగిసేవరకు మరో 20హెక్టార్లలోకి సాగులోకి రావచ్చని వ్యవసాయశాఖ భావిస్తున్నది. జూన్లో 125.6 మి.మీల వర్షపాతానికిగానూ 136.9మి.మీలు నమోదు కాగా...జూలై నెలలో ఇప్పటివరకు 183.6మి.మీల వర్షపాతానికి ఇప్పటివరకు 155.7మి.మీల వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, కంది, పెసర, మినుములు లాంటి ఆరుతడి పంటలు ఇప్పటివరకు 3లక్షల హెక్టార్లలో సాగులోకి వచ్చాయి. ‘వరి’ సాగు దారుణంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. బోర్ల సాయంతో ఒకవేళ...వరి సాగు చేసినా..వర్షాభావం అలుముకుంటే నీరు తగ్గిపోయి పంటలు కళ్లముంగిటే ఎండిపోతుంటే విలవిల్లాడాలని గమనించిన రైతులు ఆ సాగును తగ్గించుకోవడానికి మరో కారణం. కొన్నేళ్లుగా జరుగుతున్నదిదే. గతేడాది సీజన్ మొత్తంలో 61512 హెక్టార్లలో సాగులోకి వచ్చింది. 2014లోనూ ‘వరి’ 50వేల హెక్టార్లకు మించలేదు. అంతకుముందు కూడా అదే పరిస్థితి. ఘనపురం ఆనకట్ట వెలవెల... జిల్లాలో వరి సాగుకు ఘనపురం ఆనకట్ట ప్రసిద్ధి. 0.2 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ఆనకట్ట నిండితే....ఆనకట్టకు చెందిన మహబూబ్నహర్, ఫతేనహర్ కాల్వల సాయంతో ఖరీఫ్లో 30వేల హెక్టార్లకుపైగా వరి సాగులోకి వస్తుంది. నిజానికి 30వేల ఎకరాల వరి సాగుకు సీజన్ మొత్తానికి 2టీఎంసీల నీరు అవసరముంటుంది. సమృద్ధిగా వర్షాలు కురిస్తే...ఆనకట్టకు వర్షం ద్వారా వరద నీరు వచ్చి వరి ఢోకా ఉండదు. కానీ రెండేళ్లుగా ఆనకట్ట వెలవెలబోతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ 3వేల ఎకరాలకు మించి ‘వరి’ సాగులోకి వచ్చే పరిస్థితి లేదు. జిల్లాలోని పలు రిజర్వాయర్లకు చెందిన ఆయకట్టు సైతం వెలవెలబోతున్నది. ఇదీ ఉదాహరణలు... దౌల్తాబాద్ మండలం వీరానగర్కు చెందిన ఉప్పరి రాజయ్య గ్రామంలో తనకున్న సుమారు మూడెకరాల భూమిలో బోర్లు వేసినా నీరు రాకపోవడంతో దానిని ఇతరులకు కౌలుకు ఇచ్చాడు. ఈ క్రమంలో తన భార్యాపిల్లలతో కలిసి గజ్వేల్ పట్టణానికి వచ్చి స్థిరపడ్డాడు. రాజయ్యకు భార్య రాజమణితో పాటు కొడుకులు కరుణాకర్(డిగ్రీ పూరై్త... ఓపెన్లో పీజీ) తండ్రికి చేదోడు వాదోడుగా వ్యవసాయ పనుల్లో సహాయపడుతున్నాడు. రెండో కొడుకు మధు డిగ్రీ చదువుతున్నాడు. అయితే గత ఆరేళ్లుగా గజ్వేల్ పట్టణ శివారులో 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా...వర్షాలు సరిగ కురియకపోవడంతో 3ఎకరాలలో మాత్రమే వరిసాగు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఈసారి మాత్రం 4ఎకరాలలో మొక్కజొన్న, ఎకరన్నరలో పత్తి సాగు చేయగా ప్రస్తుతం వరిని మాత్రం ఎకరంన్నరకూ పరిమితం చేయాలని నిర్ణయించుకున్నాడు.. వానలు సక్కగ పడతలేవ్వు...అందుకనే వరిని తగ్గించిన...అంటూ పేర్కొన్నాడు. - ఇదిలావుంటే జగదేవ్పూర్కు చెందిన రైతు చంద్రయ్యకు రెండు ఎకరాల భూమి ఉంది. బోరుబావి సాయంతో ఏటా వరి సాగు చేస్తున్నాడు. కానీ ఈసారి వానల్లేక బోరులో నీరు తగ్గింది. ఈ సారి ఎకరంలోనే వరి సాగు చేయడానికి ఆ రైతు సమాయత్తమవుతున్నాడు. రెండేళ్ల నుండి వరి పంట వల్ల నష్టలు వచ్చినాయ్. ఎకరానికి 20 వేల వరకు నష్టపోయిన అంటూ ఆ రైతు వాపోయాడు. వర్షం తగ్గితే...‘వరి’ని తగ్గించుకోవడమే మంచిది -జేడీఏ మాధవీ శ్రీలత గజ్వేల్ జిల్లాలో ఇప్పటివరకు వర్షపాతం తక్కువగానే ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే..‘వరి’కి దూరంగా ఉండటమే మేలు. జిల్లాలో 24వేల హెక్టార్ల సాగుకు అవసరమైన వరి నారు సిద్ధంగా ఉంది. ఒకవేళ..వర్షాలు భారీగా కురిస్తే మాత్రం రైతులు వరిని సాగు చేస్తారు. లేని పక్షంలో తగ్గుతుందని భావిస్తున్నాం. రెండేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో భూగర్భజలమట్టం తగ్గి..జిల్లాలో ‘వరి’ సాగుకు ప్రతికూల పరిస్థితులేర్పడ్డాయి. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్ గొల్లపల్లి : రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్ అన్నారు. గొల్లపల్లిలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి దశ, దిశ లేదన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఉంటే.. ఎవరి కోసం ఈ సంబరాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో పోతుందన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దళితులకు మూడెకరాల పంపిణీ, డబుల్బెడ్రూమ్ ఇళ్లు, కేజీ టు పీజీ విద్య అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతుందన్నారు. -
కరువు జిల్లాను ఆదుకోండి
► ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను ► కోరిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ► ఏడేళ్ల ప్రాజెక్టు ద్వారా ఉపశమనం కల్గిస్తాం : ఐప్యాడ్ ప్రతినిధి వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులున్నాయని ప్రపంచ బ్యాంకు ద్వారా జిల్లాను ఆదుకోవాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక.. డ్రాఫ్ట్ ఐఎఫ్ఏడీ(ఐప్యాడ్) ప్రతినిధులను కోరారు. శనివారం రాత్రి స్టేట్ గెస్ట్హౌస్లో ప్రపంచ బ్యాంకు తరఫున వచ్చిన ఐప్యాడ్ ప్రతినిధులతో ఎంపీ సమావేశమై జిల్లా కరువు పరిస్థితులను వివరించారు. ఇటలీకి చెందిన ఐప్యాడ్ ప్రతినిధులు అండ్రీనెప్యూడి ఐసాటూర్ , ఆ సంస్థ ఇండియా ప్రతినిధులు విన్సెం ట్ డార్లాంగ్, సన్ప్రీత్ కౌర్.. గురు, శుక్రవారాల్లో ఓర్వకల్లు, ఆళ్లగడ్డ, డోన్ మండలాల్లో కరువు పరిస్థితులను, ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించారు. ప్రపంచ బ్యాంకు తరపున ఈ బృందం జిల్లాలో పర్యటిస్తోంది. శనివారం స్టేట్ గెస్ట్హౌస్కు చేరుకుంది. ముందుగా జిల్లాకలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ను ఆయన ఛాంబర్లో కలిశా రు. కలెక్టర్ జిల్లాలోని కరువు పరిస్థితులను ఐప్యాడ్ ప్రతినిధులకు వివరించారు. అనంతరం స్టేట్ గెస్ట్హౌస్లో సమావేశమైన ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ.. జిల్లాలో వరుసగా కరువు వస్తుండటం వల్ల రైతు లు తీవ్రమైన కష్టాల్లో మునిగి తేలుతున్నారని తెలిపారు. ముఖ్యంగా ఆదోని, కర్నూలు డివిజన్లలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని వివరించారు. జిల్లా మ్యాపు ద్వారా కరువు ప్రాంతాలను చూపించా రు. ప్రపంచ బ్యాంకు ద్వారా కరువు జిల్లాకు చేయూతనివ్వాలని సూచించా రు. డ్రాఫ్ట్ ఐప్యాడ్ టీమ్ లీడర్ అండ్రి నెఫ్యూడి మాట్లాడుతూ తొలి విడతలో రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించి కరువు పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. మరో టీమ్ జూన్ నెల 5వ తేదీన జిల్లాకు వచ్చి కరువు పరిస్థితులను మరోసారి పరిశీలి స్తుందని తెలిపారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాాశం జిల్లాలో ప్రపంచ బ్యాంకు నిధులతో ఏడేళ్ల ప్రాజెక్టు ద్వారా ఉపశమనం కల్గిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీడీఏ గణపతి, ఏడీఏ వెంకటేశ్వరరెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనరేట్ అధికారి రమణ తదితరులు పాల్గొన్నారు. ఐప్యాడ్ ప్రతినిధులు జిల్లా పర్యటన ముగించుకుని ఆదివారం తిరిగి వెళ్లనున్నారు. -
కరువు జిల్లాగా ప్రకటించాలి
► తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి ► వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అక్కినపల్లి కుమార్ డిమాండ్ కరీంనగర్ కల్చరల్ : వర్షాభావ పరిస్థితులతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయూరని, కరీంనగర్ను కరువు జిల్లాగా ప్రకటించి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కినపల్లి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేద్రంలోని కెమిస్ట్ భవన్లో వైఎస్సార్సీపీ జిల్లాస్థారుు విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ... జిల్లాలోని 57 మండలాలకు గాను 40 మండలాల్లో కరువున్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించినప్పటికీ 19 కరువు మండలాలనే ప్రకటించడం శోచనీయమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడుతామన్నారు. ఇప్పటికైనా కరువుపై ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజుల్లో ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేష్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నేరవేర్చడంలో విఫలమైందన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హామీలుగానే మిగిలిపోయాయన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబపాలన సాగుతోందన్నారు. రైతులు కరువు బారినపడి కన్నీరు పెడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగాఉద్యమాలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సెగ్గెం రాజేష్ మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేస్తామని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు. జిల్లా మాజీ అధికార ప్రతినిధి వరాల శ్రీను మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లాలోని కరువు పరిస్థితులపై అవగాహన లేకపోవడం సిగ్గుచేటాన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామన్నారు. ఈ సమావేశంలో నాయకులు ముస్కు వెంకట్రెడ్డి, సందమల్ల నరేష్, ఎస్కే.జావీద్, సిరి రవి, పిండి ఎల్లారెడ్డి, వేణుమాధవరావు, బోగె పద్మ, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కరువుపై చర్చకు అసెంబ్లీని సమావేశపర్చాలి
సీఎంకు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ప్రభుత్వపరంగా చేపట్టే సహాయ చర్యలపై చర్చిం చేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్కు టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. కరువుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, నీటి ఎద్దడి, పశుగ్రాసం కొర త నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రం నుంచి కరువు సహాయం కింద రూ.10వేల గ్రాంట్ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. పంట నష్టపోయి న రైతులకు తక్షణ సహాయగా ఎకరాకు రూ.10వేల కోట్ల చొప్పున పరిహారం చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ద్వారా ఉల్లి క్వింటాల్ రూ.1500 చొప్పున, మార్క్ఫెడ్ ద్వారా పసుపు క్వింటాల్కు రూ.12వేలు చొప్పున, చెరకు టన్నుకు రూ.1,000 చొప్పున ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని కోరారు. -
‘కరువు’పై గవర్నర్ నివేదిక సరికాదు: చాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో తీవ్ర కరు వు పరిస్థితులుంటే ముమ్మరంగా కరువు సహాయక చర్యలను చేపడుతున్నట్లు కేం ద్రానికి గవర్నర్ నివేదిక ఇవ్వడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. ప్రజలకు కరువు సహాయం అందడం లేదని, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె చేస్తుంటే నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. సోమవారం మఖ్దూం భవన్లో మాట్లాడుతూ... రాష్ర్టం నాలుగు వందల స్కూళ్లు మూసివేయాలని చూడడం సరికాదన్నారు. పాలేరు ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ రకరకాల వాగ్దానాలతో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డిందనీ.. అయితే సానుభూతి పనిచేయడంవల్ల కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయన్నారు. -
పదవి కాపాడుకునేందుకే సీఎం మంత్రి వర్గ విస్తరణ: యడ్యూరప్ప
సాక్షి,బెంగళూరు: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినా పట్టించుకోని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవిని కాపాడుకోవడానికి మంత్రిమండలి విస్తరణ చేపడుతున్నారని విపక్ష భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప విమర్శించారు. పార్టీ తరఫున ఏర్పాటు చేసిన బృందంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిపిన కరువు పర్యటనలో వెలుగుచూసిన వివరాలతోకూడిన నివేదికను పార్టీ ముఖ్యనాయకులైన కే.ఎస్ ఈశ్వరప్ప, ఆర్.అశోక్ తదితరులతో కలిసి ఆయన గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాకు మంగళవారం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకూ కరువు పరిస్థితుల నేపథ్యంలో మంత్రి మండలి విస్తరణను వాయిదా వేస్తు వచ్చిన సీఎం సిద్ధరామయ్య హఠాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకుని ఈనెల చివరన ఆ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పడం సరికాదన్నారు. కేవలం పదవిని కాపాడుకోవడానికే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో నలభై ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కరువు ఏర్పడిన నేపథ్యంలో ప్రజల కష్టాలను తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఆయన మంత్రి మండలి సభ్యుల నిర్లక్ష్యధోరణే ఇందుకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కరువు కాటకాలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంటే సీఎం సిద్ధరామయ్య, ఆయన మంత్రిమండలి సభ్యులు అధికారుల బదిలీ విషయం పై దృష్టి సారించడం పలు అనుమానాలకు దారితీస్తోందన్నారు. ఇది ఒక పెద్ద ‘దందా’గా సాగుతోందని యడ్యూరప్ప ఘాటు వాఖ్యలు చేశారు. సీఎం సిద్ధరామయ్య ప్రతిపక్షాల సలహాలు తీసుకోవడానికి ఇష్టపడటం లేదన్నారు. అందువల్లే తాము రాష్ట్రంలో ఏర్పడిన కరువు, ప్రభుత్వ వైఫల్యం, కరువు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర విషయాల పై గవర్నర్కు పూర్తి స్థాని నివేదిక అందజేశామని యడ్యూరప్ప తెలిపారు. -
సీఎంకు వినతుల వెల్లువ
చెళ్లకెరె రూరల్ : కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చిన ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు శుక్రవారం పట్టణంలోని నెహ్రూ సర్కిల్ వద్ద రైతు సంఘం పదాధికారులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం ప్రముఖుడు భూతయ్య మాట్లాడుతూ... తాలూకాలో ఎలాంటి శాశ్వత నీటి పారుదల సౌలభ్యాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చెరువులకు నీటిని అందించే భద్రా ఎత్తిపోతల పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండు చేశారు. 2015లో రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లించినా బీమా మొత్తాన్ని రైతులకు చెల్లించలేదని, వెంటనే రైతుల పంటల బీమా మొత్తాన్ని చెల్లించాలని బ్యాంకు అధికారులకు ఆదేశించాలని కోరారు. పురసభ మాజీ సభ్యుడు ఆర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... తాలూకాలో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయన్నారు. దీంతో తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని తాలూకాకు తాగునీటి కోసం ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని కోరారు. వినతి పత్రం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి తాలూకాలోని దొడ్డ ఉళ్లార్తి గ్రామానికి వెళ్లి గ్రామంలోని గోశాలను పరిశీలించారు. తాలూకాలోని హీరేహళ్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. కూలి కార్మికుల సమస్యలను వినకుండా వెళుతున్న ముఖ్యమంత్రిపై ఉపాధి హామి కూలీ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఉపాధి హామీ కూలీ బకాయిలను అధికారులు చెల్లించలేదని కూలీ కార్మికుడు తిప్పేశ్ ముఖ్యమంత్రికి ఆరోపించారు. -
తాగునీటి ప్రాజెక్టు పనులు ప్రారంభం
► అడ్డుకున్న లచ్చన్నపాలెం గ్రామస్తులు ► పోలీసుల సాయంతో కొనసాగుతున్న పనులు లచ్చన్నపాలెం(మాకవరపాలెం) : ఎట్టకేలకు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులను స్థానికులు మళ్లీ అడ్డుకోగా పోలీసుల రంగ ప్రవేశంతో కాంట్రాక్టర్ పనులను కొనసాగిస్తున్నారు. మండలంలోని లచ్చన్నపాలెం సర్పానదిలో రూ.ఏడు కోట్ల వ్యయంతో భారీ తాగునీటి ప్రాజెక్టును నిర్మించతలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు వల్ల తమ ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడుతుందని భావించిన గ్రామస్తులు దానిని వ్యతిరేకిస్తున్నారు. మూడు రోజుల క్రితం ప్రారంభించిన ఈ పనులను అడ్డుకున్నారు. దీంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడంతో మళ్లీ గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్కడకు చేరుకున్న పోలీసులకు గ్రామస్తులకు మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. ఈ పనులను అడ్డుకుంటే కేసులు తప్పవని ఎస్ఐ రమేష్ హెచ్చరించడంతో చేసేదిలేక వారు అడ్డుతొలగారు. దీంతో పనులు యథావిధిగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నదిలో ట్యాంకు నిర్మాణానికి తీసిన ప్రాంతంలో ఉన్న నీటిని తొలగించే పనులు చేపట్టారు. ఈ పనులను ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజేష్ పర్యవేక్షిస్తున్నారు. కోర్టును ఆశ్రయించేందుకు సన్నాహాలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంతంలో సాగు, తాగునీటితోపాటు పాడిపరిశ్రమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని లచ్చన్నపాలెం గ్రామస్తులు అనేక సార్లు పనులు అడ్డుగించారు. ఇక్కడ ప్రాజెక్టు వద్దని స్పష్టం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించేందుకు సన్నద్ధమవుతున్నారని తెలిసింది. -
కరువుపై కన్నెర్ర
► వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ► ఖాళీ బిందెలతో ప్రదర్శనలు, ధర్నాలు ► ప్రభుత్వ వైఫల్యంపై ఆగ్రహం సాక్షి, విజయవాడ/ విజయవాడ (గాంధీనగర్) : కేవలం రెండేళ్లలో అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం చంద్రబాబుదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో సోమవారం ప్రదర్శన, ధర్నా చేపట్టారు. విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి న్యూఇండియా హోటల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. న్యూఇండియా హోటల్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఖాళీ బిందెలతో మహిళలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సారథి మాట్లాడుతూ పోలవరం, ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేయడంలో ఉన్న శ్రద్ధ కరువు సమస్యల నుంచి ప్రజలను బయటవేయడంలో లేదన్నారు. కరువు వల్ల డెల్టాలో దాదాపు 40 శాతం సాగు జరగలేదన్నారు. కరువు, వరదలకు సంబంధించి ప్రభుత్వం నిర్ధారించిన ఇన్పుట్ సబ్సిడీ మొత్తాలు కూడా రైతులకు చేరవేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్రం నుంచి హక్కులు సాధించుకోవడంలోనూ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సారథి విమర్శించారు. సిగ్గులేని ప్రభుత్వం... పోలవరం విషయంలో సాక్షాత్తూ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్ని.. ‘మేం నమ్మం. దీనిలో అవినీతి జరిగింది. మీరిచ్చిన లెక్కల్ని మేం స్క్రూట్నీ చేయాలి’ అని కేంద్ర ప్రభుత్వం పక్కన పడేసిందంటే.. అంతకంటే సిగ్గుచేటైన విషయం ప్రజాస్వామ్య దేశంలో ఇంకొకటి ఉండదని సారథి ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులను అడ్డుకోవడం లేదు... కృష్ణానదిపై పక్క రాష్ట్రమైన తెలంగాణ అనుమతులు లేకుండా అనేక ప్రాజెక్టులు కడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం మాట కూడా మాట్లాడటం లేదన్నారు. దీనివల్ల కృష్ణా డెల్టా ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి తన విలాసాలు, ఆర్భాటాలు, బూటకపు ప్రచారాలు మాని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. డెప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్కుమార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కాలే పుల్లారావు, తంగిరాల రామిరెడ్డి, జానారెడ్డి, అవుతు శ్రీనివాసరెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా, నగర అధ్యక్షులు మాదు శివరామకృష్ణ, విశ్వనాథ రవి, వాణిజ్య విభాగం పట్టణ అధ్యక్షుడు రమేష్, కార్పొరేటర్లు ఆసీఫ్, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అంతటా వెల్లువెత్తిన నిరసనలు ►పామర్రులో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన నేతృత్వంలో ఖాళీ బిందెలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. తోట్లవల్లూరు, పెదపారుపూడి, పమిడిముక్కల, మొవ్వ మండలాల్లోనూ నిరసనలు జరిగాయి. ►నూజివీడులో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టాయి. కార్యక్రమంలో నూజివీడు మున్సిపల్ చైర్పర్సన్ బసవా రేవతి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ►గుడివాడ పట్టణంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. నియోజకవర్గంలోని నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ► తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి నేతృత్వంలో విస్సన్నపేట మండలంలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలోని గంపలగూడెం, తిరువూరు, ఎ.కొండూరు మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ► జగ్గయ్యపేటలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, సమన్వయకర్త సామినేని ఉదయభాను నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. ► ఇబ్రహీంపట్నంలో పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. జి.కొండూరు, రెడ్డిగూడెం, మైలవరంలో ధర్నాలు నిర్వహించారు. ► అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ, కోడూరు, మోపిదేవి మండలాల్లో జరిగిన నిరసన ర్యాలీలు, ధర్నాల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్బాబు, పార్టీ నేత కడవకొల్లు నరసింహారావు తదితరలు పాల్గొన్నారు. కైకలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేసి మట్టి కుండలను ధ్వంసం చేశారు. మంత్రి కామినేని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ► పెడన నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. పెడన, బంటుమిల్లి, గూడూరు మండలాల్లో ఆందోళనలు జరిగాయి. ► గన్నవరం నియోజకవర్గంలో సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు నేతృత్వంలో గన్నవరం, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు జ్ఞానమణి పాల్గొన్నారు. ► మచిలీపట్నంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సలార్ దాదా నేతృత్వంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ► కంచికచర్లలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త మొండితోక జగన్మోహన్రావు, నందిగామ పట్టణంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొండితోక ఆరుణ్కుమార్ పాల్గొన్నారు. ► పెనమలూరులో పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి, పార్టీ నాయకులు వంగవీటి శ్రీనివాస ప్రసాద్ పాల్గొన్నారు. పేదల కష్టాలు పట్టని ప్రభుత్వం : జోగి రమేష్ ఇబ్రహీంపట్నం : రాష్ట్రంలో కరువుకాటకాలు రాజ్యమేలుతుంటే ప్రభుత్వ పాలకులు ధనార్జనే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ విమర్శించారు. పేదల ఓట్లతో పదవులు అనుభవిస్తున్న నేతలకు వారి కష్టాలు మాత్రం పట్టడం లేదని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ నాగేశ్వర్ అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీపుల్స్ ఫోరం ఫర్ ఇన్ఫర్మేషన్(పిఎఫ్ఐ) ఆధ్వర్యంలో ‘కరువు-నీరుపై’ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 459 మండలాలకుగాను 232 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించడం దారుణమన్నారు. వాస్తవానికి జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం 368 మండలాలు కరువుకాటుతో అల్లాడుతున్నాయన్నారు. ప్రభుత్వం అన్ని చేస్తున్నుట్లుగా ప్రకటిస్తుందే తప్ప ఏమీ చేయటం లేదని, కరువు భారిన పడిన ప్రజలను ఆదుకునేందుకు కనీస చర్యలు చేపట్టడం లేదన్నారు. రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ 1972 తర్వాత ఇంతటి కరువు చూడలేదని, ఆదాయ మార్గాలు లేక గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలకు వలస వెళ్లుతున్నార న్నారు. కరువు నివారణ చర్యలు తీసుకోకుండా ప్రజలు జీవించే హక్కును దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. నీటి సమస్యను పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రతి గ్రామానికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని, అక్రమ నీటి వ్యాపారాన్ని అరికట్టాలని, పశుగ్రాసాన్ని పంపిణీ చేయాలని, ఉపాధి హామీ పనులను ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించాలన్నారు. వలసలను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వడదెబ్బతో మరణించిన కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్గ్రేషియో ఇవ్వాలని, మండల, గ్రామ స్థాయిల్లో కరువు సహాయక కమిటీలు వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఎఫ్ఐ అధ్యక్షులు వి.యాదయ్య, ఉపాధ్యక్షులు జె.వెంకటేష్, ప్రధాన కార్యదర్శి పార్ధపారథి, మాజీ ఎమ్మెల్యే నంధ్యాల నర్సింహారెడ్డి, డిజి.నర్సింహారావు, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు ,ఎం.శ్రీనివాస్, జి.నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
కరువును ఎదుర్కోవడంలో సర్కార్ విఫలం
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప తుమకూరు : రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొనడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప ఆరోపించారు. కరువును అధ్యయనం చేయడంలో భాగంగా ఆదివారం ఆయన తుమకూరు జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర సరి హద్దు ప్రాంతమైన గౌడగెరె గ్రామాన్ని సందర్శించిన బీఎస్వై అక్కడి రైతులను, గ్రామస్తులను కలిసి వారి సమస్యలను అడిగి తెలసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు తాగేందుకు నీళ్లు లేని పరిస్థితులు నెలకొన్నాయని, గ్రాసం లేక పశువులు బక్కచిక్కిపోతున్నాయన్నారు. అయినప్పటికీ సీఎం సిద్దరామయ్య కరువు సమస్యను పట్టించుకోకుండ కేవలం కేంద్రాన్ని తిట్టడంలోనే కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. కరువు నివారణ చర్యలకు కేంద్రం రాష్ట్రానికి రూ. 2575 కోట్లు కేటాయించిందన్నారు. అయితే ఆ నిధులు ప్రజలకు చేరవేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సొగడు శివణ్ణ, ఎమ్మెల్యే సురేష్గౌడ పాల్గొన్నారు. -
నేడు బళ్లారి జిల్లాకు సీఎం సిద్ధరామయ్య రాక
► కరువు ప్రాంతాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు ► బళ్లారి నగరంలో గట్టి బందోబస్తు సాక్షి, బళ్లారి : ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం బళ్లారి జిల్లాకు రానున్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఏర్పడిన కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి, స్వయంగా కరువు ప్రాంతాలను పర్యటించేందుకు సీఎం సోమవారం బళ్లారి జిల్లాకు రానున్న నేపథ్యంలో బళ్లారి నగరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బళ్లారి తాలూకాలోని పలు గ్రామాల్లో సీఎం పర్యటించి, రైతులతో సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. దీంతో బళ్లారి జిల్లా అధికారులు సీఎం రాక కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బళ్లారి నగరంలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సీఎం ఉంటున్న సందర్భంగా ఆయా గ్రామాలతో బళ్లారి నగరంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చే స్తున్నారు. జిల్లాలో కరువు పరిస్థితులను స్వయంగా తిలకించేందుకు సీఎం విచ్చేస్తున్న నేపథ్యంలో రైతులు ఆశలు పెట్టుకున్నారు. సీఎం రైతులపై ఏమైనా వరాల జల్లు కురిస్తారా?లేదా? ఇలా వచ్చి అలా వెళ్లి పోతారా? అని రైతుల్లో సంశయం నెలకొంది. జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినప్పటికీ దాదాపు 20 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికి ప్రభుత్వం తూతూమంత్రంగా స్పందించింది. జిల్లా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా కరువు నివారణ, రైతులను ఆదుకోవడంలో చొరవ చూపలేదు. అయితే సీఎం జిల్లాకు రానున్న సందర్భంగా రైతుల్లో హర్షం వ్యక్తం అవుతున్నప్పటికీ ఏ మేరకు తమను ఆదుకుంటారన్నది రైతులు ఎదురు చూస్తున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా పాల్గొంటున్నారు. నేడు పలు రోడ్లలో ట్రాఫిక్ మళ్లింపు బళ్లారి టౌన్ : ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం బళ్లారి నగరానికి రానున్నందున పలు రోడ్ల ట్రాఫిక్ను స్తంభింపజేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నగరంలోని కౌలుబజార్ రోడ్డు మొదటి గేటు, సుధా క్రాస్, రేడియో పార్కు, ఎస్పీ సర్కిల్, మోతీ సర్కిల్, ఇందిరా సర్కిల్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలగనుందని, ప్రజలు ఈ విషయం గమనించి సహకరించాలని తెలిపారు. -
సర్కారుపై సమరం
► ప్రభుత్వ చేతకానితనం వల్లే కరువు ► సర్కారు తీరుకు నిరసనగా నేడు ఖాళీ బిందెలతో ప్రదర్శన ► వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కేపీ సారథి వెల్లడి. విజయవాడ (మధురానగర్) : రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనం వల్లే నేడు రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి తెలిపారు. కరువు నివారణకు సర్కారు తీసుకున్న చర్యలు శూన్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం ఖాళీ బిందెలతో ప్రదర్శన, ధర్నా నిర్వహించనున్నట్టు చెప్పారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, విజయవాడ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ప్రదర్శన కొనసాగుతుందని చెప్పారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమను కోనసీమగా మారుస్తామంటూ ప్రకటనలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఉభయ గోదావరి, కృష్ణా తదితర ప్రాంతాలు ఎడారిగా మారుతున్నా పట్టించుకోకపోవటం విచారకరమన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఒక్కసారి కూడా కంటింజెన్సీ ప్లాన్ చేయకపోవటం, కనీసం మంత్రివర్గం చర్చించకపోవటం ప్రజలపై ప్రభుత్వానికి ఉన్న చులకనభావాన్ని తెలియజేస్తోందన్నారు. కరువు, తాగునీరు, సాగునీటి సమస్యలపై కనీసం చర్చించని ప్రభుత్వం ఇసుక, పారిశ్రామిక వేత్తలకు భూములు కట్టబెట్టే వ్యవహారాలపై మాత్రం పలుమార్లు చర్చించటం గమనార్హమన్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు స్పందించి రాష్ట్రంలో నెలకొన్న కరువుపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ కలిసి రావాలి... రాష్ట్రంలో కరువు పరిస్థితులపై వైఎస్సార్సీపీ చేస్తున్న రాష్ట్రవ్యాప్త పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని సారథి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రదర్శన ప్రారంభించనున్నట్లు చెప్పారు. అర్బన్ తహశీల్దారు కార్యాలయానికి చేరుకున్న అనంతరం అక్కడ ధర్నా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి... వైఎస్సార్సీపీ నగర పరిశీలకుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రెండో తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామా దేవరాజు, తలశిల రఘురామ్, కార్పొరేటర్లు కె.కాశి, వీరమాచినేని లలిత, పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శివరామకృష్ణ, నగర అధ్యక్షుడు విశ్వనాథ రవి, యువజన విభాగం నాయకుడు కాజ రాజ్కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షులు కాలే పుల్లారావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూదాల శ్రీనివాస్, నగర వాణిజ్య విభాగం క న్వీనర్ కొణిజేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
అంబలి కేంద్రాల ఏర్పాటు ప్రభుత్వానికి కనువిప్పు కావాలి
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. ముషీరాబాద్: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నదని, వడదెబ్బతో 400మంది చనిపోయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. శనివారం రాంనగర్ మీ-సేవా సమీపంలో హరేకృష్ణా మూవ్మెంట్, భోజనామృత్, దత్తాత్రేయ చొరవతో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశుగ్రాసం లేక పశువులు కబేళాలకు తరలిపోతున్నాయని, వాటిని రక్షించేందుకు ప్రభుత్వం నీటి తొట్టిలను కూడా ఏర్పాటు చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కరువు నివారణకు రూ.385కోట్లు విడుదల చేసిందని రెండవ విడతగా మరో రూ.350కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలన్నారు. మంత్రులు జిల్లాల్లో పర్యటించి రైతలకు భరోసా కల్పించాలన్నారు. కార్యక్రమంలో హరేకృష్ణ మూమెంట్ ఉపాధ్యక్షులు మాధవదాస, ఆపరేషన్స్ ఇన్చార్జి కౌంతయ్య దాస, బీజేపీ నాయకులు మాధవ్, విన్ను ముదిరాజ్, శ్రీనివాస్, రాజేశ్వరరావు, ఓం ప్రకాష్, మోహన్, రమేష్, గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
మీ నాన్న లేని జీవితం మనకొద్దమ్మా
► భర్త ఆత్మహత్య తాళలేక ... ► తన ఇద్దరు కుమార్తెలపై కిరోసిన్ పోసి...ఓ తల్లి అఘాయిత్యం ► చామరాజనగర్ జిల్లాలో ► రైతు కుటుంబంలో విషాదం ► ఉసురు తీసిన అప్పులు తరచూ సరదాగా గడచిపోయే ఆదివారమే వారి జీవితాల్లో చివరి రోజు అని భావించి ఉండరు. తన ఇద్దరి పిల్లలకు ఉదయమే పాలు తాపి రాత్రి పొలం కాపలాకు వెళ్లిన భర్తకు టీ తీసుకుని బయలుదేరిన ఆ మహిళకు భర్త నిర్జీవంగా కనిపించడంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆ ఇల్లాలు ఇంటికి చేరుకుని తన ఇద్దరి చిన్నారులపై కిరోసిన్ పోసి తాను పోసుకుని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బెంగళూరు (బనశంకరి) : అన్నదాత ఆత్మహత్యలు కన్నడ నాట సర్వసాధారణమైపోతున్నాయి. కరువు పరిస్థితుల నేపథ్యంలో పంటలు పండక, అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అప్పుల బాధతో ఓ రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చామరాజనగర జిల్లాలోని హొన్నళ్లిలో చోటుచేసుకుంది. వివరాలు... హొన్నళ్లి గ్రామానికి చెందిన సిద్దప్ప కుమారుడు రైతు శివనప్ప (38) శనివారం రాత్రి తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం భర్త కోసం పొలం వద్దకు టీ తీసుకు వచ్చిన శివనప్ప భార్య కన్యా (35) భర్త ఉరి వేసుకుని ఉండటం చూసి నిర్ఘంతపోయింది. ఆ షాక్ నుంచి తేరుకున్న ఆమె ఇంటికి చేరుకుని కిరోసిన్ తీసుకుని తన ఇద్దరు పిల్లలు ప్రీతి (6), ప్రియ (4)పై పోసి అనంతరం తనపై కూడా పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే కాలిపోయారు. మృతుడు శివనప్ప సహకార బ్యాంక్లో రుణంతో పాటు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు చేసినట్లు తెలిసింది. అంతేగాక ఇటీవల పొలంలో బోరు వేసిన నీరు లభించకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక, కుటుంబ బాధ్యతలు తలుచుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటనలో గ్రామంలో విషాదం నెలకొంది. బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కరెంట్ స్తంభానికి కట్టేశాడు!
వికారాబాద్లో రైతన్నపై పశువుల వ్యాపారి దాష్టీకం వికారాబాద్: రంగారెడ్డి జిల్లాలో రూ.10 వేల బాకీ ఇవ్వలేదని పశువుల వ్యాపారి ఓ రైతును విద్యుత్ స్తంభానికి కట్టేశాడు. వికారాబాద్ మండల పరిధిలోని ధన్నారం గ్రామానికి చెందిన వడ్డే యాదయ్య (38) రెండేళ్ల కిందట ధారూరు మండల కేంద్రానికి చెందిన ఓ పశువుల వ్యాపారి వద్ద కాడెద్దులు కొనుగోలు చేశాడు. వీటి ధర రూ. 27 వేలు. ఇందులో రూ. 17 వేలు రెండు విడతల్లో తీర్చాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన రూ.10 వేలు చెల్లించలేకపోయాడు. ఆదివారం మిత్రుడి కోరిక మేరకు వికారాబాద్ పశువుల సంతకు వచ్చిన యాదయ్య.. సదరు వ్యాపారికి తారసపడ్డాడు. అంతే.. మరో ఆలోచన లేకుండా రైతును తాడుతో అక్కడే ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టేశాడు. ‘రెండేళ్లుగా.. నీ కోసమే ఎదురు చూస్తున్నా.. అప్పు తీర్చమని మీ ఇంటికి వస్తే.. ఇబ్బందుల పాల్జేశావు. నిన్ను ఎవరు విడిపిస్తారో చూస్తా..’ అంటూ వ్యాపారి హెచ్చరించాడు. కరువు పరిస్థితుల్లో తీసుకున్న అప్పు తీర్చులేకపోయానని, పనిచేసి అయినా.. అప్పు తీరుస్తానని, కొంత సమయం కావాలని వ్యాపారిని రైతు అభ్యర్థించాడు. కానీ, వ్యాపారి కనికరిం చకుండా స్థానిక పోలీస్స్టేషన్కు తరలించాడు. పోలీసులు విచారణ చేపట్టారు. -
సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం
ఆదిలాబాద్ అర్బన్ : కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని 2016-17 సెలవుల్లోనూ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని సంయుక్త కలెక్టర్ సుందర్ అబ్నార్ జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో విద్యా శాఖఅధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ పాల్గొని మధ్యాహ్న భోజనం ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటి నుంచి పదో తరగతి వరకు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గురువారం నుంచి మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు. సమావేశంలో డీఈవో సత్యనారాయణరెడ్డి, డిప్యూటీ డీఈవో శ్యాం పాల్గొన్నారు. -
మొక్కుబడి భోజనం!
► విద్యార్థుల కోసంఏజెన్సీల నిరీక్షణ ► తొలిరోజు 1,01,082 మంది మాత్రమే.. ► చాలాచోట్ల కనిపించని పర్యవేక్షకులు ► ఉపాధ్యాయులు చొరవచూపితేనే సత్ఫలితం మహబూబ్నగర్ విద్యావిభాగం: కరువు పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి సెలవుల్లో గురువారం ప్రారంభమైన మధ్యాహ్న భోజనానికి విద్యార్థుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. జిల్లాలో 4.37లక్షమంది విద్యార్థులకు గానూ వేసవి సెలవుల్లో కనీసం 2.31లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు హాజరవుతారని ఎంఈఓల రిపోర్టు ప్రకారం జిల్లా ఉన్నతాధికారులు అంచనావేశారు. కానీ తొలిరోజు 1.01లక్షల మంది విద్యార్థులు మాత్రమే వచ్చారు. జిల్లా కేంద్రంలోని పలుపాఠశాలలను పరిశీలించగా చాలా వాటిలో విద్యార్థులు కనిపించలేదు. వంట ఏజెన్సీల మహిళలు వారికోసం వేచిచూడడం కనిపించింది. పర్యవేక్షించాల్సిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కూడా పాఠశాలలకు రాలేదు. బేసిక్ ప్రాక్టిసింగ్ ఉన్నత పాఠశాలలో వంట ఏజెన్సీ వారు వచ్చినప్పటికీ విద్యార్థులు ఒక్కరు కూడా రాకపోవడంతో వారు ఎదురుచూసి వెళ్లిపోయారు. ఉపాధ్యాయులు కూడా అక్కడికి రాలేదు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు రావడంతో వారికి భోజనాలు పెట్టించి పంపించారు. పోలీస్లైన్ ప్రాథమిక, ఉన్నతపాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహణ కనిపించలేదు. ఇలా జిల్లావ్యాప్తంగా ఉన్నత సంకల్పంతో ప్రారంభించిన మధ్యాహ్న భోజనంపై కొంత నిరాసక్తి చూపినట్లు కనిపించింది. గ్రామాల్లో చిన్నారులను ఉపాధ్యాయులు, గ్రామస్తులు, యువకులు పంపించాల్సిన అవసరం ఉంది. అలాగే పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్న ఉపాధ్యాయులు సైతం బాధ్యతాయుతంగా పనిచేస్తేనే భోజనానికి సార్థకత చేకూరుతుందని పలువురు కోరుతున్నారు. పారదర్శకంగా మధ్యాహ్న భోజనం మహబూబ్నగర్ న్యూటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం అమలుచేస్తున్న వేసవిలో మధ్యాహ్న భోజనం పథకాన్ని జిల్లాలో మరింత పారదర్శకంగా అమలుచేయాలని కలెక్టర్ టీకే శ్రీదేవి విద్యాశాఖ అధికారులను గురువారం ఒక ప్రకటనలో ఆదేశించారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈ వేసవిలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈనెల 21 నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు పేర్కొన్నారు. పథకం అమలుతీరును హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని సూచించారు. పాఠశాలలను ఉదయం 8.30 నుంచి 10.30 వరకు నిర్వహించాలని, భోజనం చేసిన తరువాతే వారికి ఇంటికి పంపించాలని కోరారు. మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాకమిటీలు, సర్పంచ్లు, వార్డుసభ్యులు, ఇతర శాఖల సిబ్బంది భాగస్వాములు కావాలని సూచించారు. వేసవి సెలవుల్లో వంట ఏజెన్సీలను నియమించాలని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు డీఈఓకు పంపినట్లు ఆమె తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల వరకు పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను ఎస్ఎంఎస్ ద్వారా డీఈఓకు పంపాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన స్టాక్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్, విద్యార్థుల హాజరురిజిస్టర్లను నిర్వహించడమే కాకుండా కమిటీ సభ్యులు, ఇతర పెద్దలు పాఠశాలలు సందర్శించిన సమయాల్లో సంతకాలను తీసుకోవాలని ఆదేశించారు. -
నీటి సమస్య రానివ్వొద్దు
► ఎన్ని నిధులైనా ఖర్చుచేసేందుకు ప్రభుత్వం సిద్ధం ► పెండింగ్ తాగునీటి పథకాల ప్రతిపాదనలు రెండు రోజుల్లో సమర్పించాలి ► అధికారులతో సమీక్షించిన మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్నగర్ న్యూటౌన్: తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా తాగునీటి సమస్య నివారణకు ప్రభుత్వం జిల్లాకు ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, తాగునీటి పథకాలకు సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలు రెండురోజుల్లో సమర్పించాలని రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో తాగునీరు, ఉపాధిహామీ, పశుగ్రాసం, హరితహారం తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. తాగునీటి కొరత లేకుండా నివారించేందుకు ప్రభుత్వం సీఆర్ఎఫ్ గ్రాంటు కింద రూ.6.6 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరుచేసిందన్నారు. నాన్ సీఆర్ఎఫ్ కింద రూ.47.8కోట్లు మంజూరుచేయగా ఇప్పటివరకు రూ.15.9 కోట్లు మాత్రమే ఖర్చుచేయడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. రెండురోజుల్లో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల బృందం గ్రామాల్లో పర్యటించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. గ్రామాల్లో అవసరాన్ని బట్టి ట్యాంకర్ల ధరలు రీషెడ్యూల్ చేయాలని, రవాణా ద్వారా ఎక్కువ నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, సరఫరా చేసిన ట్రిప్పుల వివరాలు సంబంధిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులకు మెసేజ్ పంపించాలన్నారు. అన్ని మున్సిపాలిటీలు రామన్పాడు తాగునీటిపై ఆధారపడి ఉన్నాయని, త్వరితగతిన నీటిని తరలించే చర్యలు వేగవంతం చేయాలని జేసీని కోరారు. ఉపాధి పనిదినాలను పూర్తిచేయాలని డ్వామా పీడీని ఆదేశించారు. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ జములమ్మ రిజర్వాయర్ ద్వారా గద్వాలకు తాగునీటిని నిరంతరం సరఫరా చేయాలని కోరారు. ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల సంఖ్యను పెంచాలని, ట్యాంకర్లకు ఇచ్చే ధరలను పెంచాలన్నారు. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ తాగునీటికోసం మంజూరైన నిధులను ఈ వేసవిలో ఖర్చుచేస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో తాగునీటి వనరులు లేనందున ఎక్కువ గ్రామాల్లో సరఫరా చేయాలని కోరారు. సమావేశంలో జేసీ రాంకిషన్, గువ్వల బాల్రాజ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ పద్మనాభం, డ్వామా పీడీ దామోదర్రెడ్డి, పశుసంవర్ధక శాఖ జేడీ సుధాకర్ పాల్గొన్నారు. -
ఆయన అలా మాట్లాడటం సరికాదు
బెంగళూరు: కరువు పరిస్థితులు పెద్దగా లేవని కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సహాయం అక్కరలేదని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న సిద్ధరామయ్య పేర్కొనడం సరికాదని భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు విషయంలో కూడా రాజకీయాలు చేయడం వల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతారని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో ఎప్పుడూ లేనంతగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇక్కడ కరువు పరిస్థితులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిపుణులను కర్ణాటకకు పంపించి క్షేత్రస్థాయి అధ్యయనం జరిపించిందన్నారు. అధికారుల నివేదికను అనుసరించి గతంలో ఏ ప్రభుత్వం మంజూరు చేయని నిధులను కరువు నివారణ పనుల నిమిత్తం రాష్ట్రానికి కేటాయించిందని యడ్యూరప్ప ఈ సందర్భంగా గుర్తుచేశారు. కరువు ఉందనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉత్తర కర్ణాటక ప్రాంతంలో పర్యటించలేదా? అని యడ్డీ ప్రశ్నించారు. కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంతో నివారణ పనుల కోసం తమ పార్టీకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని ప్రభుత్వానికి అందజేయనున్నామన్నారు. -
సమస్యలు వినిపించేనా?
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం ► ప్రజాసమస్యలు చర్చకు వచ్చేనా? ► కరువు కోరల్లో పాలమూరు ► గ్రామాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ► గ్రాసం లేక కబేళాలకు పశువులు ► విపక్షసభ్యులు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది.. గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సమస్య సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మేత కోసం మూగజీవాలు అల్లాడుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోయి రైతులు దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. ఈ ఏడాది సరైన వర్షాల్లేక కృష్ణా, తుంగభద్ర నదులు ఎండిపోయాయి. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో ప్రభుత్వం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించింది. కరువు సహాయకచర్యలు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సీజనల్ వ్యాధులతో ఆస్పత్రుల పాలవుతున్నారు.. ఇలా అనేక సమస్యలతో జిల్లా ప్రజలు సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సమస్యల పరిష్కారం కోసం ఏ మేరకు దిశానిర్దేశం చేస్తుందని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. కరువుపై నిలదీయనున్న ప్రతిపక్షాలు జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్రంగా అలుముకున్నాయని ప్రతిపక్ష జెడ్పీటీసీ సభ్యులు చెబుతున్నారు. కరువుపై జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పాలకపక్షాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మికాంత్రెడ్డి చెప్పారు. జిల్లా ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేసిన ఏ తీర్మానాల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని ఆరోపిస్తున్నారు. గ్రామాలు, మండలాల్లో అధికారులు ప్రజాసమస్యలపై స్పందించడం లేదని ఈ అంశంపై సభలో చర్చించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఎంపీపీ కార్యాలయాల్లో జెడ్పీటీలకు ప్రత్యేక చాంబర్ను ఏర్పాటు చేయనున్నట్లు జెడ్పీ సర్వసభ్య సమావేశాలు తీర్మానించినా ఎక్కడా అమలుకాలేదని పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఆరోపిస్తున్నారు. నేడు జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రజాసమస్యలపై చర్చించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. గత సమావేశాల తీరిది.. ప్రస్తుత జెడ్పీ పాలకమండలి 2014 జులై 5న కొలువుదీరింది. ఇప్పటివరకు 8సార్లు సర్వసభ్య సమావేశాలు జరిగాయి. ఈనెల 20న మరోసారి సమావేశం జరగనుంది. గతేడాది ఏప్రిల్ 7న జరిగిన సమావేశంలో ప్రొటోకాల్ వివాదం, జూరాల- పాకాల పథకానికి నిధుల కేటాయింపుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ అధికార కార్యక్రమాలకు అధికారులు తమను ఆహ్వానించడం లేదని అధికార, ప్రతిపక్షాల జెడ్పీటీసీలు సభ్యులు వాకౌట్ చేశారు. తమకు ప్రత్యేకగదిని కేటాయించాలని ఎంపీపీలు డిమాండ్ చేస్తున్నారు. గత మే 23వ తేదీన ప్రత్యేకంగా జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సారి కేవలం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఎలా నిర్వహించాలనే అంశంపైనే చర్చించారు. సెప్టెంబర్ 4న జరిగిన సమావేశం రసాభాసగా మారింది. జనవరి 4న జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల బాల్రాజు, కాంగ్రెస్ ఎంపీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ సమావేశంలో గొడవతోనే సరిపోయింది. జెడ్పీ నిధులను ఎమ్మెల్యేలకు కేటాయించొద్దని జెడ్పీటీసీలు, ఆ నిధులను తమకు కేటాయించాలని ఎంపీపీలు.. ఇలా అనే డిమాండ్లతో సభ గందరగోళంగా మారింది. ఆర్డబ్ల్యూఎస్, డ్వామ్యాపై చర్చించే అవకాశం నేడు జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా తాగునీటి సరఫరా, ఉపాధిహామీ పథకాలపైనే చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎండాకాలంలో గ్రామాల్లో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. దీంతోపాటు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టాలనే ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గత సమావేశంలో కూడా ఆర్డబ్ల్యూఎస్ శాఖపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అప్పట్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం రూ.100కోట్లు మంజూరుచేసిందని మంత్రి ప్రకటించారు. ఆ చర్యలు ఎంతవరకు వచ్చాయని ప్రశ్నించేందుకు సభ్యులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది. ఎజెండాలు సమర్పించని 19 శాఖలు జెడ్పీ సర్వసభ్య సమావేశానికి 19శాఖలు తమ శాఖలో చేపట్టిన పూర్తి వివరాలను ఎజెండాలో సమర్పించలేదు. మొత్తం 64 శాఖలకు గాను 19శాఖలు ఇవ్వలేదు. మత్స్యశాఖ, వికలాంగుల సంక్షేమశాఖ, సివిల్సప్లయి, పశుసంవర్థక శాఖ, ఇరిగేషన్శాఖ వారు తమ ప్రగతి సమాచారాన్ని జెడ్పీ ఎజెండాకు సమర్పించలేదు. నివేదిక సమర్పించని శాఖలను ఎందుకు ప్రశ్నించడం లేదని జెడ్పీటీసీలు నిలదీస్తున్నారు. ఈ సారైన నివేదికలను సమర్పించని శాఖలను ప్రశ్నిస్తారా? లేదా? అన్నది వేచిచూడాల్సి ఉంది. -
రైతుల గోడు పట్టని బాబు
సీపీఐ ఆధ్వర్యంలో ఉగాది దీక్షలు అనంతపురం రూరల్: జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొని రైతులు అల్లాడుతుంటే వారి గోడు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మనువడి పుట్టిన రోజు వేడుకల్లో నిమగ్నమయ్యారని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ విమర్శించారు. శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు కరువు బాధితులకు సంఘీభావంగా సీపీఐ నాయకులు ఉగాది దీక్షలను చేపట్టారు. దీక్షలో జగదీష్ మాట్లాడుతూ 10 ఏళ్లుగా తీవ్ర వర్షాభావం నెలకొని వరుస కరువులతో జిల్లా అతలాకుతలమై గ్రామీణ వ్యవస్థ దెబ్బతిందన్నారు. జిల్లాలో ఉపాధి అవకాశాలు లేక 5 లక్షల మంది కూలీలు, చిన్న, సన్నకారు రైతులు నగరాలకు వలసలు పోయి దుర్భర జీవితాన్ని గడుపుతున్నా ప్రభుత్వం చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే జిల్లాలో 192 మంది రైతులు అప్పులు బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. కరువు జిల్లాగా ప్రకటించడం మినహా సహాయక చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. దీక్షల్లో మానవహక్కుల వేదిక చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు కేవీ రమణ, సీపీఐ నాయకులు కాటమయ్య, జాఫర్, నారాయణస్వామి, ఎంవీ రమణ, రంగారెడ్డి, రాజారెడ్డి, మల్లికార్జున, లింగమయ్య, కేశవరెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే..!
రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న రైతు కుటుంబానికి పరామర్శ బజార్హత్నూర్ : రాష్ట్రంలో కరువుల పరిస్థితుల వల్ల పంట దిగుబడి రాక, అప్పులు పెరి గిపోరుు రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న విమర్శించా రు. మండలంలోని వర్తమన్నూర్ గ్రామానికి చెందిన రైతు కుర్మే అడెల్లు ఈ నెల 11న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సోమవారం అడెల్లు కుటుం బాన్ని బొర్రన్న పరమార్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు తాండవిస్తోం దని తెలిపారు. ప్రభుత్వం ఒకే దఫా రుణమాఫీ చేయకపోవడంతో ప్రైవేటు అప్పులు పెరిగిపోయాయని, అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేసి ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతు కుటుంబంలో ఒకరికి ప్రభు త్వ ఉద్యోగం ఇవ్వాలని, ప్రభుత్వ, ప్రవే టు రుణాలను మాఫీ చేయాలని తెలిపా రు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు దిలీప్రెడ్డి, లక్ష్మణ్, సర్పంచ్ భాస్కర్రెడ్డి, మాజీ సర్పంచ్ అల్లం రాజు పాల్గొన్నారు. -
కరువు ప్రాంతాల్లో తాగునీటికి రూ.179 కోట్లు
గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్య విభాగం ప్రతిపాదనలు హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కరువు పరి స్థితులు నెలకొన్న ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చేపట్టాల్సిన చర్యల నిమిత్తం రూ.179 కోట్లు అవసరమని ప్రకృతి వైపరీత్యాల విభాగం సర్కారుకు నివేదించింది. పల్లెల్లో పరిస్థితులపై గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్డబ్ల్యుఎస్), పట్టణ ప్రాంతాల్లో ఎద్దడి పరిస్థితులపై ప్రజారోగ్య విభాగం, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఇచ్చిన అంచనాల మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు తాజాగా నివేదికను సిద్ధం చేశారు. దాన్ని పరిశీలించి నిధులను విడుదల చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ప్రకృతి వైపరీత్యాల విభాగం సిఫారసు చేసింది. కరువు ప్రాంతాల్లో తాగునీటి కోసం అవసరమైన చోట్ల కొత్త బోర్లను వేయాలని, పనిచేయని స్థితిలో ఉన్న వాటిని మరమ్మతులు చేయించాలంది. గ్రామీణ ప్రాంతాల్లో బావులను కొత్తగా తవ్వించడం, పాతవాటిని లోతు చేయాలంది. ఆయా బావు లకు పవర్ పంపులను అమర్చాలంది. గ్రామాల్లోని చెరువులను కాల్వల ద్వారా వచ్చే నీటితో నింపాలంది.గత్యంతరం లేని స్థితిలోనే అద్దె పద్ధతిన ప్రైవేటు వ్యక్తులకు చెందిన వ్యవసాయ బావుల నుంచి నీటి సరఫరా చేయాలంది. తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయాలు లేని పక్షంలోనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని పేర్కొంది. కరువు మండలాలపై కేంద్రం శీతకన్ను రాష్ట్రంలోని 231 మండలాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సాయం కోరినా ఆశించిన మేరకు సాయం అందలేదు. కరువు ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ.486.16 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, కేంద్రం రూ.88.5 కోట్లు ఇచ్చింది. రూ.310.61 కోట్లు కావాలని ప్రతిపాదనలిచ్చిన గ్రామీణ నీటిసరఫరా విభాగానికి రూ.72.86 కోట్లు, రూ.86.25 కోట్లు అడిగిన ప్రజారోగ్యశాఖకు రూ.9.21 కోట్లు, రూ.83.30 కోట్లను కోరిన హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్కు రూ.6.43 కోట్లు ఇచ్చేందుకే కేంద్రం ఆమోదం తెలిపింది. కరువు మండలాల్లో ప్రస్తుతం నెలకొన్న నీటి ఎద్దడి నివారణకు తక్షణం రూ.179.04 కోట్లు విడుదల చేయాలని ఆయా విభాగాలు కోరాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.55 కోట్లు విడుదల చేయగా, మిగిలిన మొత్తం విడుదలకు సంబంధించిన ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. -
కరువుపై కేంద్ర బృందం పర్యటన
-
రైతు రుణాలకు వడ్డీ మాఫీ
మంత్రి మహదేవప్రసాద్ బెంగళూరు : రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో మధ్య, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలకు సంబంధించి ఈ ఏడాది చెల్లించాల్సిన వడ్డీని మాఫీ చేస్తున్నట్లు రాష్ట్ర సహకారశాఖ మంత్రి హెచ్.ఎస్ మహదేవప్రసాద్ వెల్లడించారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.296.62 కోట్ల భారం పడనుందన్నారు. బెంగళూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన బుధవారం మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల వల్ల కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునే ఉద్దేశంతో ఈ ఏడాదికి సంబంధించిన వడ్డీని మాఫీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా తీసుకున్న రుణంలో ఈ ఏడాదికి చెల్లించాల్సిన అసలు మొత్తాన్ని కూడా వచ్చే ఏడాది చెల్లించే వెసులుబాటు కల్పించనున్నామని మంత్రి వివరించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రుణ మాఫీ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. రైతులకు వ్యవసాయ రుణాలు అందించే విషయంలో రాష్ట్రంలోని వాణిజ్య బ్యాంకులు నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇకపై ‘కావేరి’ ఇవ్వలేము!
బెంగళూరు : రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గతంలో నిర్దేశించిన పరిమాణంలో కావేరి జలాలను ఇవ్వలేమంటూ తమిళనాడు ప్రభుత్వానిక రాష్ట్ర ప్రభుత్వం సోమవారం లేఖ రాసింది. కావేరి జలాల పంపకానికి సంబంధించి ఈ ఏడాది 198 టీఎంసీల నీటిని తమిళనాడుకు వదలాల్సి ఉంది. ఈ నీరు విడుదలలో కర్ణాటక ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ కేంద్రానికి తమిళనాడు ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం గమనార్హం. ఈ నెల 4 వరకు 68 టీఎంసీల నీరు విడుదల చేసినట్లు వర్షాలు పడని కారణంగా ఇకపై నీటిని వదలడం కుదరదంటూ స్పష్టం చేసింది. -
ఇక తాగునీటికీ కటకట
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే అధికారిక కరెంటు కోతలను ఎదుర్కొంటున్న బెంగళూరువాసులు ఇప్పుడిక నీటి కోతలకు కూడా సిద్ధం కావాల్సిన పరిస్థితి తలెత్తనుంది. బెంగళూరు నగర వాసులకు ప్రధాన తాగునీటి వనరు అయిన క్రిష్ణరాజ సాగర్(కేఆర్ఎస్) డ్యామ్లో నీటి లభ్యత అడుగంటడంతో నగరంలో నీటి కోతలకు సన్నద్ధం కావాలని బెంగళూరు వాటర్సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్(బీడబ్ల్యూఎస్ఎస్బీ) అధికారులు నిర్ణయించా రు. ప్రస్తుతం బెంగళూరులో రెండు రోజులకు ఒకసారి తాగునీటిని వదులుతుండగా, నీటి లభ్యతను అనుసరించి మూడు రోజులకు ఓసారి లేదా వారానికి ఓసారి మాత్రమే తాగునీటిని అందజేయాలని భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఇప్పటికే అధికారికంగా రోజుకు నాలుగు నుంచి ఐదు గంటల కరెంటు కోతలను ఎదుర్కొంటున్న బెంగళూరువాసులు ఇక తాగు నీటికి కూడా ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. కేఆర్ఎస్లో అడుగంటిన నీటిమట్టం : బెంగళూరు నగరానికి ప్రధాన తాగునీటి వనరు కృష్ణరాజ సాగర జలాశయం మాత్రమే. ఈ జలాశయం నీటితోనే నగర వాసుల దాహార్తి తీరుతూ వస్తోంది. అయితే రాష్ట్రంలో దాదాపు 40 ఏళ్ల తర్వాత తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కేఆర్ఎస్ జలాశయంలో నీటిమట్టం ప్రస్తుతం (సెప్టెంబర్ 4నాటికి) 25టీఎంసీలు మాత్రమే.(కేఆర్ఎస్ సామర్థ్యం 50టీఎంసీలు). ఈ జలాశయం నుంచి బెంగళూరు, మైసూరు, మండ్యా తదితర ప్రాంతాలకు తాగు, సాగు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే వర్షాభావ పరిస్థితుల్లో మొదట తాగు నీటికి మాత్రమే నీరు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. బెంగళూరుకు తాగునీటి అవసరాల కోసం వచ్చే ఏడాది జూన్ వరకూ సాధారణంగా 20 టీఎంసీలు అవసరం, అయితే ఒక్క బెంగళూరుకే 20 టీఎంసీల నీటిని ఇస్తే మిగిలిన ప్రాంతాలకు కనీసం తాగునీటినైనా అందించగలరా అనేదే ఇక్కడ ప్రధాన సమస్య. ఈ నేపథ్యంలో 20టీఎంసీల నీటిని కేవలం బెంగళూరు వాసుల తాగునీటి అవసరాల కోసం రిజర్వ్ చేసి ఉంచాల్సిందిగా బీడబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు ఇప్పటికే కావేరి నీరావరి నిగమ్ లిమిటెడ్ అధికారులకు లేఖలు రాశారు. అయితే ఈ విషయంపై వారి నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పందన లభించని నేపథ్యంలో బీడబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు నగరంలో నీటి కోతల దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. మూడు రోజులకో లేదా వారానికో..... ఇక ప్రస్తుతం బెంగళూరు నగరంలో రెండు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే కేఆర్ఎస్లో నీటి నిల్వలు అడుగంటిన నేపథ్యంలో మూడు రోజులకో లేదంటే వారానికి ఒకసారో తాగునీటిని సరఫరా చేయాలని భావిస్తున్నట్లు బీడబ్ల్యూఎస్ఎస్బీ చీఫ్ ఇంజనీర్ ఎస్.క్రిష్ణప్ప తెలిపారు. ‘కేఆర్ఎస్లో నీటి నిల్వలు తగ్గిన నేపథ్యంలో కొన్ని మోటార్లను నిలిపేసి నగరంలో నీటి కోతలను విధించాలని భావిస్తున్నాం. ఒకవారం రోజుల్లో కనుక సమృద్ధిగా వర్షాలు కురవకపోతే సెప్టెంబర్ మూడో వారం నుంచే ఈ కోతలు అమల్లోకి వస్తాయి. ఇక ఇదే సందర్భంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవడంపై కూడా బెంగళూరు వాసుల్లో చైతన్యం కల్పించే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం’ అని ఎస్.క్రిష్ణప్ప వెల్లడించారు. -
అధిక ఆదాయం కోసమే వలస పోతున్నారు..
‘జిల్లాలో నిజంగా ప్రజలెవరూ వలస పోవడం లేదు. అధికంగా డబ్బు సంపాదించాలని బెంగళూరుకు వెళ్తున్నారు.. వలసపోయి ప్రతి ఒక్కరూ కొత్త మెటారు సైకిళ్లు తెచ్చుకున్నారు..’ ఈ మాటలన్నది ఎవరో కాదు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి చిన్నరాజప్ప సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నం హనుమంతరాయచౌదరి, బీ.కే పార్థసారథి. జిల్లా కరువు పరిస్థితులను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన రాష్ట్ర డెప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప నిర్వహించిన సమీక్షలోఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఖంగుతిన్నారు. - మోటార్ బైక్లు కొంటున్నారు... - టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నం, బీకే వివాదాస్పద వ్యాఖ్యలు - సమర్థించిన మంత్రి సునీత, ఎమ్మెల్యే వరదాపురం సూరి - పించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విశ్వ,చాంద్బాషా అనంతపురం సెంట్రల్ : జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి చిన్నరాజప్ప శుక్రవారం డ్వామా హాలులో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో సంభవిస్తున్న వ రుస కరువులను రాష్ట్రం, కేంద్రం దృష్టికి తీసుకుపోయి ప్రజలను, రైతులను ఆదుకోవాల్సిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు కరువును తెలుసుకునేందుకు వచ్చిన డెప్యూటీ సీఎం ఎదుట ఈ విధంగా వ్యాఖ్యానించడం అందరినీ ఆవేదనకు గురిచేసింది. సమావేశంలో డ్వామా పీడీ నాగభూషణం మాట్లాడుతూ మహాత్మగాంధీ జా తీయ ఉపాధిహామీ పథకం కింద రోజూ 1.20 వేల మంది పై చిలుకు కూలీలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఇప్పటి నుంచి 150 రోజులు పనిదినాలు కల్పించేందుకు ప్రభుత్వం అనుమతిచిందని వివరించారు. ఈ అంశంపై ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కలుగజేసుకొని ఉపాధిహామీ పథకం అంతా బాగా అమలవుతుండగా ప్రజలు ఎందుకు వలస పోతున్నారని ప్రశ్నిం చారు. వలసలను అడ్డుకునేందుకు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కలుగుజేసుకుంటూ జిల్లాలో ఎవరూ వాస్తవంగా వలస పోవడం లేదన్నార. కేవలం అదనంగా డబ్బు సంపాదనకే వలస పోతున్నారని వ్యాఖ్యానించారు. మరో ఎమ్మెల్యే బీకే పార్థసారథి కలుగజేసుకొని అదనంగా ఆదాయం కోసమే ప్రజలు వలసపోతున్నది ముమ్మాటికి వాస్తవమేనన్నారు. తన నియోజకవర్గంలోని ఓ గ్రామంలో 150 కుటుంబాలు వలస పోయాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ కొత్త మోటారు సైకిళ్లు(ద్విచక్రవాహనాలు) తెచ్చుకున్నారని చెప్పారు. ఎవరైనా తన నియోజకవర్గానికి వస్తే రుజువు చేస్తానన్నారు. వలసలను ఆపడం ఎవరి సాధ్యం కాదన్నారు. వీరికి మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి వంత పాడారు. మంత్రి సునీత మాట్లాడుతూ ప్రతి పక్షంలో ఉన్నారని ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. వరదాపురం సూరి మాట్లాడుతూ... గత పదేళ్ళలో మీ ప్రభుత్వం(కాంగ్రెస్పార్టీని అంట కడుతూ) ఏనాడైనా వలస గురించి పట్టించుకుందా? మేము అధికారం లోకి వచ్చాక కూలీలకు 150 రోజలు చేశాం. మీరు వలస గురించి మాకేం చెప్పాల్సిన అవసరం లేదంటూ ఎదురుదాడికి దిగారు. అధికారపార్టీ ఎమ్మెల్యేల వాఖ్యాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్చాంద్బాషాలు తీవ్రంగా ఆక్షేపించారు. ‘ రండి జిల్లాలోని మా రు మూల గ్రామాలకు వెళ్దాం. కుటుంబంలోని పెద్దలు వలస పోతే ఆ ఇంటికి కాపలా ఉన్న ముసలివాళ్లు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తినేందుకు ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తుంది’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు
మరాఠ్వాడాలో వర్ష బీభత్సం - వరదల్లో చిక్కుకుని ఐదుగురు మృతి - ప్రతికూల వాతావరణంతో సహాయక చర్యలకు అంతరాయం - మరో రెండు రోజులు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ సాక్షి, ముంబై: కొన్నేళ్లుగా కరవు పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న మరాఠ్వాడా ప్రాంతంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. విదర్భలోని వర్ధా, యవత్మాల్, అమరావతి, అకోలా, బుల్డాణ తదితర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. యవత్మాల్ జిల్లాలో వర్ధా నది పొంగి ప్రవహిస్తోంది. నాసిక్, జల్గావ్ జిల్లాల్లోని భుసావల్, ముక్తాయినగర్, రావేర ప్రాంతాల్లో వర్షపు నీరు వరదలై పారుతోంది. యవత్మాల్లో నలుగురు, జల్గావ్లో ఒకరు మృతిచెందారు. వర్షాకాలం ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడచినా చినుకు జాడ లేకపోవడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన గురయ్యారు. ఈ ఏడాది కూడా పంటలు ఎండిపోతాయేమో అని కలవరపడ్డారు. మరాఠ్వాడా రీజియన్లో ఉన్న మొత్తం 76 తాలూకాలకు గాను 72 చోట్ల వర్షాలు ఆశించినంత మేర కురుస్తున్నాయి. దీంతో కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. నలుగురు గల్లంతు తాపీ నది పొంగి పొర్లుతుండటంతో హత్నూర్ డ్యాం 41 గేట్లు ఎత్తివేశారు. దీంతో బుధవారం అర్ధరాత్రి ఆర్వీ-యవత్మాల్ రహదారిపై బిల్దోరి వంతెనపై వెళుతున్న ఆల్టో కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు గురువారం ఉదయం బిల్దోరి వంతెనకు రెండు కి.మీ. దూరంలో కారు, నలుగురి మృతదేహాలు లభించాయి. మృతుల్లో యవత్మాల్లోని ప్రగతి నగర్కు చెందిన సంజయ్, గజానన్, గాయత్రి, శ్రావణి ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. యవత్మాల్ జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి శవాలను బంధువులకు అప్పగించారు. కొట్టుకుపోయిన రహదారులు భారీ వర్షాల ధాటికి పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. వందలాది గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. చెట్లు నేల కూలడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టేందుకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో జలమయమైన గ్రామ ప్రజలకు సహాయం అందించేందుకు ఆలస్యం అవుతోంది. వరదల ధాటికి జల్గావ్ జిల్లాలో పొలానికి వెళ్లిన శ్యామ్బాయి మహాజన్ అనే మహిళ నీటిలో కొట్టుకుపోయింది. గురువారం ఉదయం శవాన్ని వెలికి తీశారు. మరో రెండు, మూడు రోజులు ఇలాగే భారీ వర్షాలు కురుస్తాయని, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. -
వర్షాభావాన్ని అధిగమిస్తాం: కేంద్రం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపే వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్సింగ్ భరోసా ఇచ్చారు. ఈ సీజన్లో వర్షపాత లోటు అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా మంత్రి తన శాఖ ఆధ్వర్యంలో సాధించిన ప్రగతిని బుధవారమిక్కడ విలేకర్లకు వివరించారు. రైతులను ఆదుకునేందుకు కొత్త పంటల బీమా పాలసీని తెచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు. పప్పుధాన్యాల ఉత్పత్తి తగ్గి ధరలపై ప్రభావం పడకుండా దిగుమతులను పెంచుతామని, నిత్యావసరాలకు లోటు రాకుండా చూసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ పరంగా వ్యవసాయ, విద్యుత్తు రంగాల్లో తగు ప్రణాళికలతో ‘వర్షపాత లోటు’ వల్ల ఏర్పడే స్థితినుంచి ఒడ్డెక్కే ప్రయత్నిస్తామన్నారు. వాతావరణ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తాజాగా స్టాక్మార్కెట్పై కూడా ప్రభావం పడడంతో ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు. దేశవ్యాప్తంగా 580 జిల్లాల్లో ప్రత్రామ్నాయ ప్రణాళికలను అవలంబిస్తున్నామన్నారు. -
సాయం కావాలి
కేంద్ర బృందానికి కరువు పరిస్థితులను చెప్పిన జిల్లా అధికారులు జిల్లాలో పశ్చిమ ప్రాంతాన్ని పరిశీలించిన బృందం కరువు నివేదిక సమర్పించిన జిల్లా కలెక్టర్ చిత్తూరు: చిత్తూరు జిల్లాలో కరువు పరిస్థితులను గురువారం కేంద్ర బృందం పరిశీలించింది. తొలుత రామానంద్, వదనాసింఘాల్, శ్రీవాత్సవతో కూడిన బృందం స్థానిక ఆర్అండ్బీ కార్యాలయంలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన కరువుపై ఫొటోప్రదర్శనను తిలకించింది. కలెక్టర్తోపాటు వ్యవసాయ, హార్టికల్చర్, సిరికల్చర్, పశుసంవర్థక, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు ఆయా శాఖల పరిధిలోని కరువు పరిస్థితులను వివరించారు. వర్షాభావంతో భూగర్భజలాలు అడుగంటాయని చెప్పారు. సాధారణ సాగులో సగం కూడా పంటలు సాగు కాలేదని వివరించారు. అరకొరగా వేసిన పంటలు నిలువునా ఎండిపోయాయన్నారు. సాగునీరుతోపాటు తాగునీరు అందక ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. పశువులకు తాగునీటితోపాటు గ్రాసం అందే పరిస్థితి లేదన్నారు. 2వేల గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. పనులు లేక రైతులు, వ్యవసాయ కూలీలు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారని వివరించారు. ఈ పరిస్థితుల్లో సాయం అందేలా చూడాలని వారు కేంద్ర బృందాన్ని కోరారు. అనంతరం కరువు బృందం జిల్లాలోని పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు ప్రాంతాల్లో పర్యటించి అడుగంటిన భూగర్భ జలాలు, ఒట్టిపోయిన బోరుబావులు, ఎండిపోయిన పంటలు, తాగునీటి ఇబ్బందులు పరిశీలించారు. ప్రజలతో స్వయంగా మాట్లాడి కరువు పరిస్థితులను తెలుసుకున్నారు. కరువు పరిస్థితిపై కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్జైన్ నివేదిక సమర్పించారు. కరువు నివేదిక ఇదే : తీవ్రవర్షాభావం: జిల్లాలో సాధారణ వర్షపాతం 933.9 మిల్లీమీటర్లు కాగా ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 640.1 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. 2014-15కు గాను జిల్లాలో 42 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. తగ్గిన పంటల సాగు: గత ఖరీఫ్లో జిల్లాలో 2,15,358 హెక్టార్లలో వివిధ పంటలు సాగు కావాల్సిఉండ గా, కరువు పుణ్యమా అని 1,91,629 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు అయ్యాయి. ఈ లెక్కన 23,729 హెక్టార్లు సాగుకు నోచుకోలేదు. రబీ సీజన్లో 50 శాతం విస్తీర్ణంలో కూడా పంటలు సాగు కాలేదు. తాగునీటి కష్టాలు: జిల్లాలో 18,776 చేతిపంపులు ఉండగా, 3,179 సీజనల్గా మారాయి. 8,441 పీడబ్ల్యూఎస్ పథకాలుండగా, 1483 సీజనల్గా మా రాయి. తీవ్ర వర్షాభావం నేపథ్యంలో భూగర్భ జలాలు 1500 అడుగుల లోతుకు చేరాయి. 90శాతం తాగునీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. ఇప్పటికే 2,061 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా, 318 గ్రామాలకు టైఅప్ బోర్ల ద్వారా ప్రభుత్వమే నీటిని సరఫరా చేస్తోంది. రాబోయే కాలంలో మరో 500 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాల్సి రావొచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క నీటి సరఫరాకే నెలకు రూ.4 నుంచి 5 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక జిల్లాలోని దాదాపు 9లక్షల పశువులకు సైతం తాగునీటి సరఫరా చేయాల్సి వస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అటుగంటిన భూగర్భజలాలు: జిల్లాలో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటాయి. రోజురోజుకూ మరింతగా తగ్గిపోతున్నాయి. కుప్పం, మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు ప్రాంతాల్లో పడమటి మండలాల్లో 1500 అడుగుల లోతుకు బోరుబావులు తవ్వినా నీళ్లుపడే పరిస్థితి లేదు. పెరిగిన వలసలు: వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు పొట్టచేతపట్టుకుని వలసలు వెళ్లాల్సి వస్తోంది. కుప్పం, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు ప్రాంతాలతోపాటు జిల్లా వ్యాప్తంగా ప్రజలు బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు పనుల కోసం వలసలు వెళుతున్నారు. కుప్పం, తంబళ్లపల్లె, మదనపల్లె ప్రాంతాల్లో వలసలు పెరిగాయి. కేంద్ర సాయం అందించాలని కోరాం: సిద్ధార్థ్జైన్, కలెక్టర్ కరువు తీవ్రత నేపథ్యంలో జిల్లాలో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రసాయం అందేలా చూడాలని కరువు బృందాన్ని కోరినట్లు కలెక్టర్ సిద్ధార్థ్జైన్ విలేకరులకు వివరించారు. గురువారం ఉదయం స్థానిక రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదైందన్నారు. ఖరీఫ్తో పాటు రబీలోనూ పంటల సాగు పూర్తిగా తగ్గిందని, 42 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన విషయాన్ని కరువు బృందానికి తెలిపినట్లు చెప్పారు. ఇప్పటికే 2వేల గ్రామాలకు తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోందనే విషయాన్ని కరువు బృందానికి వివరించినట్లు తెలిపారు. నీటి సరఫరాకు సంబంధించిన ఓచర్స్ సైతం కరువు బృందానికి చూపామన్నారు. వర్షాభావంతో 50వేల ఎకరాల్లో పంటల సాగు తగ్గిన విషయాన్ని చెప్పామన్నారు. వేరుశెనగ పంట 50 శాతం దిగుబడి కూడా రాలేదన్నారు. జిల్లాలో పశువులకు సైతం తాగునీటితోపాటు గ్రాసం, దాణా అందిస్తున్నామన్నారు. కేంద్ర సాయం అందేలా చూడాలని కరువు బృందాన్ని కోరినట్లు కలెక్టర్ చెప్పారు. -
కరువు కాటు!
- రబీలో భారీగా తగ్గిన పంటల సాగు - వేసిన పంటలూ చేతికొచ్చేది అనుమానమే - జిల్లాలో పడిపోయిన భూగర్భజలాలు - బోర్లలో అడుగంటిన జలాలు - ఎండిపోతున్న పంటలు - కష్టాల ఊబిలోకి అన్నదాతలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: కరువు పరిస్థితులు రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో జిల్లాలోని చెరువులు, కుంటలు ఎండుముఖం పట్టగా.. భూగర్భజలాలు భారీగా పతనమయ్యాయి. దీంతో తాజాగా సాగుచేస్తున్న పంటలు కరువుదాటికి గట్టెక్కుతాయా.. లేదా అని రైతులు సందిగ్ధంలో పడ్డారు. ప్రస్తుత రబీ సీజన్లో జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 43,100 హెక్టార్లుగా వ్యవసాయ శాఖ నిర్ధారించింది. వాస్తవానికి ఈ పాటికే సాధారణ విస్తీర్ణంకంటే ఎక్కువ స్థాయిలో పంటలు సాగవ్వాల్సి ఉంది. కానీ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 32,725 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగయ్యాయి. సాధారణం కంటే తక్కువగా.. రబీ సీజన్లో జిల్లాలో ప్రధానంగా వరి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. కానీ కరెంటు సమస్యతోపాటు భూగర్భజలాలు సైతం పతనమవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది వరిని తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు వేయాల్సిందిగా వ్యవసాయ శాఖ రైతులకు సూచించింది. ఈ క్రమంలో ప్రస్తుతసీజన్లో 16,269 హెక్టార్లలో వరి సాగవుతుందని అధికారులు ప్రణాళిక తయారు చేశారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులతో జిల్లాలో వరిసాగు ముందుకు కదలలేదు. దీంతో కేవలం సాగు 12,312 హెక్టార్లకే పరిమితమైంది. నిర్దేశించిన విస్తీర్ణంలో 25 శాతం తగ్గడం గమనార్హం. అదేవిధంగా జొన్న, మొక్కజొన్న, వేరుశనగ పంటలు సైతం సాధారణ విస్తీర్ణం కంటే తక్కువగా సాగయ్యాయి. గట్టెక్కేదెలా..! జిల్లాలో సాగుకు కీలకమైన భూగర్భజలాలు ఈ ఏడు భారీగా పతనమయ్యాయి. గతేడాది జనవరిలో జిల్లాలో భూగర్భజల సగటు నీటిమట్టం 9.41 మీటర్లుగా ఉంది. ఈ ఏడాది జనవరికి నీటి మట్టంలో భారీ తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం జిల్లాలో 13.30 మీటర్లకు పడిపోయినట్లు భూగర్భ జలవనరుల శాఖ నివే దికలు చెబుతున్నాయి. నీటి మట్టంతగ్గడంతో ఈ ప్రభావం పంటల సాగుపై చూపనుంది. ప్రస్తుతం జిల్లాలో 12,312 హెక్టార్లలో వరి సాగవుతుండగా.. ఈ పంట పూర్తిగా భూగర్భజలాలతోనే సాగవుతోంది. తాజాగా నీటి మట్టం పతనమవడంతోపాటు కరెంటు కోతలు సైతం మొదలవ్వడంతో వరిసాగు రైతులకు కష్టంగా మారింది. రెండువిడతలుగా ఆరుగంటలపాటు కరెంటు సరఫరా చేస్తున్నామని ట్రాన్స్కో చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో నాలుగు గంటలకు మించి కరెంటు అందడం లేదు. సరఫరాలో సమస్యతో పలుమార్లు ఆటంకాలు తలెత్తుతున్నాయని యాచారం మండలం మెండిగౌరెల్లి గ్రామ రైతు నారయ్య ఆవేదన వ్యక్తం చేశారు. -
రూ.32.81 కోట్ల పంట నష్టం
కడప అగ్రికల్చర్ : ఈ ఏడాది ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోయాయి. కరువు పరిస్థితులపై రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు ఆందోళన చేశాయి. దీంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కరువు పరిస్థితులపై నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం డిసెంబరు నెల15వ తేదీ రాత్రి జిల్లాలో 48 మండలాలను కరువు బారిన పడినట్లు ప్రకటించింది. దీనిపై సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం కరువులో దెబ్బతిన్న పంటల తుది జాబితా తయారీకి సిద్ధమైంది. డిసెంబరు నెల 23 నుంచి 31వ తేదీ వరకు నివేదిక తయారు చేసేందుకు ఏఓ, ఏఇఓలు, గ్రామ రెవిన్యూ అధికారుల బృందాలు పంటలను సందర్శించి నివేదికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయశాఖ ఇన్చార్జ్ జేడీ సంబందింత అధికారులను ఆదేశించారు. దీంతో యంత్రాంగం క్షేత్రస్థాయిలో 20 మండలాల్లో ఎలాంటి నష్టంలేదని, మిగతా 28 మండలాల్లో తొమ్మిది రకాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని మంగళవారం క్షేత్రస్థాయి యంత్రాంగం తుది జాబితాను జిల్లా వ్యవసాయశాఖ ఇన్చార్జ్ జేడీకి సమర్పించింది. ఆ నివేదికను కలెక్టర్కు ఇన్చార్జ్ జేడీ సమర్పించారు. జిల్లాలోని 28 మండలాల్లో అత్యధికంగా పంట నష్టాలు జరిగాయని అంచనాలు వేశారు. గతంలోనే రైతులు ఆయా పంటలకు సంబందించి ఫోటోలను తయారు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు. ఆ విధంగా రైతులు తీసుకున్న పంటల ఫోటోలను అధికారులకు సమర్పించారు. ఆ ఫోటోల ఆధారంగా అలాగే గ్రామ రెవిన్యూ అధికారులు ముందుగనే రైతులు సాగు చేసిన పంటలను అడంగళ్లో రాసి ఉన్నారు. ఆయా పంటలను, ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో రెవిన్యూ కార్యాలయాల్లో బృందాలు పరిశీలించి నివేదికలు తయారు చేశాయి. పంటలు విస్తీర్ణం పంట నష్టం బాధిత (హెక్టార్లలో) (రూ.లలో) రైతులు వరి 471.282 47,12,820 1074 వేరుశనగ 13273.026 13,27,30,760 9854 కంది 132.712 8,29,450 309 పత్తి 18619.623 18,61,96,230 18971 నువ్వులు 118.212 5,91,060 167 జొన్న 22.86 1,14,300 28 ఉలవలు 283.78 17,73,625 540 సజ్జ 243.116 12,15,580 404 చెరకు 1.8 8,000 02 మొత్తం 33165.461 32,81,71,825 41349 -
వాడివేడిగా..
జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పాలకవర్గాన్ని నిలదీసిన ప్రతిపక్షం ఉక్కిరిబిక్కిరైన అధికార పక్షం రుణమాఫీపై నీళ్లు నమిలిన వైనం పంచాయతీల విద్యుత్ బిల్లులపై రగడ ఇసుక ధర తగ్గించాలని డిమాండ్ రూ.260 కోట్లతో జెడ్పీ వార్షిక బడ్జెట్ ఆమోదం అజెండా పూర్తి కాకుండానే ముగింపు కర్నూలు(జిల్లా పరిషత్): రైతు రుణమాఫీ, జిల్లాలో కరువు పరిస్థితులు, అధిక ధరకు ఇసుక విక్రయం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా కేంద్ర నిధులు వాడుకోవాలంటూ చెప్పడం వంటి అంశాలతో శనివారం జరిగిన జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. కర్నూలు వైఎస్ఆర్సీపీ ఎంపీ బుట్టా రేణుకతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు సంధించిన ప్రశ్నలకు ఒక దశలో పాలక వర్గం సమాధానం చెప్పలేకపోయింది. కీలకమైన జెడ్పీ వార్షిక బడ్జెట్ను కూడా పూర్తిగా చదవకుండా మధ్యలోనే ముగించి ఆమోదం పొందిందనిపించారు. అజెండా పూర్తి చేయకుండానే మొక్కుబడిగా మూడు గంటల్లో సమావేశాన్ని ముగించి మమ అనిపించారు. మళ్లీ వచ్చే ఫిబ్రవరిలో సమావేశం ఏర్పాటు చేసుకుందామంటూ పాలక వర్గం సభకు ముగింపు పలికింది. కర్నూలు జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్గౌడ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో ఇసుక రీచ్లలో క్యూబిక్ మీటర్కు రూ.500గా విక్రయిస్తున్నారని, ఇది భారంగా ఉందని కర్నూలు ఎంపీపీ రాజావిష్ణువర్దన్రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇదే విషయమై ఎమ్మెల్యేలు, పలువురు జెడ్పీటీసీ సభ్యులు కూడా పట్టుబట్టడంతో జాయింట్ కలెక్టర్ కన్నబాబు కల్పించుకుని రాష్ట్రమంతా ఒకే రేటు ఉందని చెప్పబోయారు. చిత్తూరులో తక్కువ ధరకు ఇస్తున్నారు కదా అని సభ్యులు ప్రశ్నించడంతో, ధర తగ్గించాలని తీర్మానం చేస్తే ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు ముగించారు. అనంతరం రూ.260 కోట్లతో ప్రవేశపెట్టిన జెడ్పీ వార్షిక బడ్జెట్ను ఏవో భాస్కరనాయుడు సభ ముందుంచారు. జెడ్పీకి వచ్చే ఆదాయ, వ్యయాల గురించి చదివి వినిపించారు. విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి ఆలూరు జెడ్పీటీసీ సభ్యుడు రాంభీంనాయుడు మాట్లాడుతూ జెడ్పీటీసీ సభ్యులకు నిధులు కేటాయించకపోవడం వల్ల గ్రామాల్లో తలెత్తుకు తిరగలేకపోతున్నామని అన్నారు. ఈ విషయమై ఇతర సభ్యులు కూడా మద్దతు పలకడంతో జెడ్పీ చైర్మన్ స్పందించి ఒక్కో జెడ్పీటీసీ సభ్యుడికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు కేటాయిస్తామని చెప్పారు. 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం సూచించే అంశంపై సభ్యులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ 13వ ఆర్థిక సంఘం నిధుల కింద జెడ్పీకి రూ.17 కోట్లు వచ్చాయని, అందులో కరెంటు బిల్లులకే రూ.12 కోట్లు పోతాయని, మిగిలిన రూ.5 కోట్లను జెడ్పీటీసీ సభ్యులకు కేటాయిస్తామన్నారు. కరెంటు బిల్లులు పంచాయతీలే చెల్లించాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. దీనిపై డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి స్పందిస్తూ గ్రామాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకుండా కేంద్రం ఇచ్చే నిధులను వాడుకోవాలని చెప్పడం సరికాదన్నారు. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలకు దిక్కులేదు నందికొట్కూరు నియోజకవర్గంలోని అల్లూరు, శాతానికోట, కోళ్లబాపురం గ్రామాల్లోని పాఠశాలల్లో అవసరం లేకున్నా అదనపు తరగతి గదులు నిర్మించాలని ఎవరు చెప్పారని ఎస్ఎస్ఏ పీవోను నందికొట్కూరు ఎంపీపీ ప్రసాద్రెడ్డి ప్రశ్నించారు. స్థానిక ప్రజాప్రతినిదుల ప్రమేయం లేకుండా పనులు చేపడితే ఊరుకోమన్నారు. బేతంచర్లలో స్థానిక ఎంఈవో పెత్తనం చేస్తున్నారని, అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని డోన్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆర్ఎస్ రంగాపురంలో హెచ్ఎంగా పనిచేస్తున్నారని, ఆయన రెండేళ్లుగా పాఠశాలకే వెళ్లకున్నా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్లు లేకున్నా.. అవసరం లేకున్నా అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు. కోడుమూరు నియోజకవర్గంలో నిర్మించిన కేజీబీవీ స్కూల్కు వర్షం వస్తే వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యే మణిగాంధి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులుండి కూడా పాఠశాలల్లో మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మించకపోవడం దారుణమని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. రహదారులు బాగా లేకపోవడం వల్ల పిల్లలు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని చెప్పారు. ఎస్ఎస్ఏ ఇచ్చిన నిధులు కేవలం అదనపు తరగతి గదులకే కేటాయించాలని, కిటికిలు, వాకిళ్లకు కాదని కలెక్టర్ విజయమోహన్ అన్నారు. నిధులు మళ్లించే అధికారం తనకు లేదని, ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. నిధుల వినియోగంలో జిల్లా కలెక్టర్లకు విస్తృత అధికారాలు ఇవ్వాలని, అప్పుడే పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు సమకూరుతాయని శాసనమండలి చైర్మన్ చక్రపాణి యాదవ్ అభిప్రాయపడ్డారు. మరుగుదొడ్లు నిర్మిస్తారు సరే.. వాటిని ఎవరు శుభ్రం చేస్తారని ఎమ్మెల్సీ సుధాకర్బాబు ప్రశ్నించారు. ఇందుకోసం ప్రతి పాఠశాలకు నిధులు కేటాయించామని కలెక్టర్ సమాధానమిచ్చారు. బాత్రూములు లేకపోవడం వల్ల చాలా మంది బాలికలు చదువు మానేస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అభిప్రాయపడ్డారు. పాడుబడిన స్కూళ్ల స్థానంలో కొత్త భవనాలు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఆసుపత్రుల్లో కనిపించని డాక్టర్లు మిడుతూరు మండలం తలముడిపి పీహెచ్సీ సంవత్సరం క్రితం నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ ప్రారంభం కాలేదని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య చెప్పారు. కడుమూరు పీహెచ్సీకి ఫర్నిచర్ ఇవ్వలేదని మిడుతూరు జడ్పీటీసీ సభ్యుడు యుగంధర్రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యసేవ పథకంపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు సభ్యులు కోరారు. ఆదోని ఆసుపత్రిలో సిటి స్కాన్ పరికరం ఏర్పాటు చేయాలని, 50 నుంచి 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని కోరారు. పగిడిరాయి పీహెచ్సీల్లో రెగ్యులర్ డాక్టర్ను నియమించాలని సభ్యులు కోరారు. ఉలిందకొండ పీహెచ్సీలో పడకలు లేకపోవడం వల్ల కాన్పు అయిన వారు నేలపైనే పడుకుంటున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గానికొక సదరం క్యాంపు ఏర్పాటు చేస్తామని డీఎంహెచ్వో డాక్టర్ నిరుపమ చెప్పారు. డాక్టర్ల కొరత ఉన్నందున రెండు పీహెచ్సీలకు ఒక డాక్టర్ ఉన్నారని ఆమె చెప్పారు. డాక్టర్లను ఎందుకు నియమించడం లేదని ఎంపీ బుట్టా రేణుక ప్రశ్నించారు. ప్రతి పీహెచ్సీకి ఇద్దరు డాక్టర్లను నియమించాలని సూచించారు. పింఛన్లు ఇచ్చేందుకు బయోమెట్రిక్ పెడుతున్నారని, డాక్టర్ల హాజరు కోసం కూడా ఆ పరికరాన్ని ఉపయోగించాలని చెప్పారు. ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో బయోమెట్రిక్ పరికరం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా త్వరలో అమలు చేస్తామని కలెక్టర్ సమాదానమిచ్చారు. ఒక్క రైతుకు రుణమిస్తే ఒట్టు రూ.50 వేల రుణాన్ని కూడా ఐదు విడతలుగా మాఫీ చేస్తున్నారని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. 10 శాతం వడ్డీని చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోందని, మిగిలిన 4 శాతం ఎవరు చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. పాములపాడులో కోత మిషన్ ఏర్పాటు చేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కోరారు. జిల్లాలో కరువు తాండవిస్తుంటే ప్రభుత్వం కేవలం 12 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత విమర్శించారు. ఏ ఒక్క రైతుకూ బ్యాంకులు రుణాలు ఇవ్వని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రమేనని ఎమ్మెల్సీ సుధాకర్బాబు ఎద్దేవా చేశారు. తన నియోజకవర్గంలో కేటగిరి-3 కింద రూ.1.50 కోట్ల దోపిడి జరిగిందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పునరుద్ఘాటించారు. రుణమాఫీపై అనుమానాలుంటే నివృత్తి చేసేందుకు కమిటీలు వేశామని కలెక్టర్ చెప్పారు. పంటలెండిపోతున్నాయి.. నీళ్లు వదలండి.. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ఎప్పుడు పూర్తవుతుందని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రాయలసీమ ప్రజలు ఒక్క పంటనూ పండించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. కులకుర్తికి నీటిని వదలాలని కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధి డిమాండ్ చేశారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు కేసీకి నీళ్లిచ్చి మిరప రైతులను ఆదుకోవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కోరారు. కేసీకి రెండు రోజుల వరకు 2,530 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, ఇప్పుడు 1,700 క్యూసెక్కుల నీటిని కొనసాగిస్తున్నామని ఇరిగేషన్ ఎస్ఈ చెప్పారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభిస్తారని ఆ ప్రాంత జెడ్పీటీసీ సభ్యులు కోరగా సంక్రాంతి తర్వాత ప్రారంభిస్తామని కలెక్టర్ సమాదానమిచ్చారు. నీటికోసం ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీనివల్ల రానున్న 48 గంటల్లో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కరుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పిందని కలెక్టర్ ముక్తాయించారు. -
సా...గుతున్న రబీ
అనంతపురం అగ్రికల్చర్ : వర్షాభావ పరిస్థితులు వెంటాడటంతో రబీ నిరాశాజనకంగా సాగుతోంది. ఈ రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 1,53,335 హెక్టార్లు కాగా ప్రస్తుతానికి లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగులోకి వచ్చాయి. 90 వేల హెక్టార్లుగా అంచనా వేసిన ప్రధాన పంట పప్పుశెనగ 66 వేల హెక్టార్లకు పరిమితమైంది. మూడు సంవత్సరాలుగా గిట్టుబాటు లేక పెద్ద ఎత్తున పప్పుశెనగ నిల్వలు పేరుకుపోవడం వల్ల సాగు విస్తీర్ణం తగ్గింది. అక్టోబర్ చివరి వారంలో నీలోఫర్ తుపాను వల్ల కొంతవరకు వర్షాలు పడిన ఫలితంగా ఈ మాదిరిగా పంటలు సాగులోకి వచ్చాయి. లేదంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని అధికారులు అంచనా వేస్తున్నారు. వేరుశనగ విత్తుకునే సమయం దాటిపోయినా అనుకున్న విధంగా సాగులోకి రాలేదు. వేరుశనగ మరికొంత విస్తీర్ణం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వరి నాట్లకు సమయం ఉండటంతో రబీ విస్తీర్ణం మరికొంత పెరిగే పరిస్థితి ఉంది. జొన్న, పొద్దుతిరుగుడు పంటల విస్తీర్ణంలో తగ్గుదల ఎక్కువ కనిపిస్తోంది. ఉలవ, పెసర లాంటి పంటల విస్తీర్ణం కాస్తంత పెరిగింది. తెల్లకుసుమ పంట మరోసారి కొంత విస్తీర్ణంలో విత్తుకున్నారు. పప్పుశెనగ తరువాత ప్రధాన పంటలైన వరి, వేరుశనగ విస్తీర్ణం బాగా తగ్గింది. మొత్తమ్మీద ఈ రబీలో 50 వేల హెక్టార్లు బీడు భూములుగా దర్శనమిచ్చే పరిస్థితి నెలకొంది. -
చంద్రబాబు నిలువునా ముంచేశారు
రుణమాఫీ పేరుతో మోసం చేశారు రైతు సాధికార సదస్సుల్లో అధికారులను అడ్డుకున్న రైతులు సమాధానం దాటవేసిన అధికారులు కుప్పం: ‘కరువు పరిస్థితుల్లో బ్యాంకుల్లో తీసుకున్న రుణం మాఫీ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఇప్పుడు రుణం మాఫీ చేయకుండా కనీసం దాని వడ్డీకి సరిపడా డబ్బు కూడా ఇవ్వకుండా పత్రాలు తెచ్చి చేతిలో పెడుతున్నారు. అవి మాకు అవసరం లేదు మీ దగ్గరే పెట్టుకోండి’ అంటూ కుప్పం వుండల పరిధిలోని రైతులు అధికారులపై మండిపడ్డారు. చెక్కునత్తం, వుంకలదొడ్డి, ిపీబీనత్తం, అనిమిగానిపల్లి, వెండుగంపల్లి, గోనుగూరు గ్రామ పంచాయతీల్లో శనివారం నిర్వహించిన రైతు సాధికార సదస్సుల్లో ఈ మేరకు అధికారులను నిలదీశారు. అనిమిగానిపల్లి గ్రామ సభలో సర్పంచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ బ్యాంకుల్లో ఉన్న రుణాలు చెల్లించొద్దని చెప్పారు. ఇప్పుడు వడ్డీతో కలిపి తడిసిమోపెడైంది. ప్రభుత్వం భిక్షమేసినట్టు రూ.500, రూ.1000 బ్యాంకులో వేస్తున్నారు. ఇది ఏ మూలకూ సరిపోదు. ఇదేనా రుణమాఫీ అంటే అని అధికారులను నిలదీశారు. రెండో విడతలో న్యాయం చేస్తామని ఎంపీడీవో వివరణ ఇస్తున్నా వారు పట్టించుకోలేదు. రుణం మాఫీ చేయని, సమాధానం చెప్పని ఇలాంటి సదస్సులు వద్దని రైతులు వెళ్లిపోయారు. -
రూ.10 వేల కోట్ల కరువు ప్యాకేజీ ప్రకటించాలి
మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ డిమాండ్ నాగపూర్: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువుపరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రూ.10 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ డిమాండ్ చేశారు. ఆయన బుధవారం అసెంబ్లీలో ఈ విషయమై మాట్లాడారు. నాగపూర్ విధాన సభలో బుధవారం సమావేశం మొదలవ్వగానే కాంగ్రెస్ పక్ష డిప్యూటీ నాయకుడు విజయ్ వడ్డేటివార్ మాట్లాడుతూ.. కరువు, రైతు ఆత్మహత్యలపై చర్చ జరపాలని కోరారు. కాగా, సదరు అంశాలపై చర్చకు రెవెన్యూ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే అంగీకరించారు. స్పీకర్ అనుమతి ఇచ్చిన అనంతరం పవార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మరాఠ్వాడా, విదర్భల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, అక్కడి సోయ, పాడి రైతులను వెంటనే ఆదుకోవాలని అన్నారు. అలాగే ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల భార్యలకు వితంతు పింఛను మంజూరుచేయాలని డిమాండ్ చేశారు. అలాగే పాడి రైతుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉందని పేర్కొన్నారు. లీటర్ మంచినీళ్లు రూ.20 ఉంటే, లీటర్ పాలు రూ.17 ఉన్నాయని, దీన్ని బట్టే పాడి పరిశ్రమ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. కౌన్సిల్లో గందరగోళం..: కాగా, కరువు, రైతు సమస్యలపై చర్చ జరుగుతున్న సమయంలో విధాన మండలిలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాలు కొన్నిసార్లు వెల్లోకి దూసుకురావడంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. ఈ గందరగోళంలోనే కౌన్సిల్ నాయకుడిగా ఏక్నాథ్ ఖడ్సేను, డిప్యూటీ నాయకుడిగా చంద్రకాంత్ పాటిల్ పేర్లను ప్రకటించారు. అలాగే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం తన మంత్రివర్గ సహచరులను సభకు పరిచయం చేశారు. కాగా, శీతాకాల సమావేశాలు ప్రారంభమై మూడు రోజులైనా ప్రతిపక్ష నేతను ఖ రారుచేయకపోవడంపై షేత్కారీ కాంగార్ పక్ష (ఎస్కేపీ)కి చెందిన ఎమ్మెల్యే జయంత్ పాటిల్ ప్రశ్నించారు. ప్రతిపక్షనేత లేకుండా సభ నడవడం చరిత్రలో ఇదే మొదటిసారని, ఇది సరైన సంప్రదాయం కాదని ఆయన ఆరోపించారు. పాటిల్కు మద్దతుగా కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు నిలిచారు. కాగా, ఒకటి, రెండు రోజుల్లో ప్రతిపక్ష నేతను చైర్మన్ నిర్ణయిస్తారని డిప్యూటీ చైర్పర్సన్ వసంత్రావ్ దావ్ఖరే ప్రక టించారు. కాగా, ప్రతిపక్ష నేతను ఏ విధానంపై నిర్ణయించనున్నారో తెలపాలని ఎన్సీపీ నేత సునీల్ తత్కారే డిమాండ్ చేశారు. తమపార్టీ తరఫున ధనంజయ్ ముండే పేరును ఇప్పటికే ప్రతిపాదించామన్నారు. కాగా, కాంగ్రెస్ నేత మాణిక్రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. మొదట ఎన్సీపీ తన విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ‘గతంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉంటామని ప్రకటించారు.. ఇప్పుడు ప్రతిపక్ష నేత సీటు కావాలంటున్నారు..’ అని వ్యాఖ్యానించారు. కాగా ప్రతిపక్ష నేత పదవి కోసం బీజేపీ నుంచి ధనంజయ్ ముండే, కాంగ్రెస్ నుంచి మాణిక్రావ్ ఠాక్రే పేర్లను ప్రతిపాదిస్తూ తనకు లేఖలు అందినట్లు మండలి చైర్మన్ శివాజీరావ్ దేశ్ముఖ్ ప్రకటించారు. ఓటమి తర్వాతే రైతులు గుర్తుకొచ్చారా..: అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీలకు రైతులు గుర్తుకువస్తున్నారని శివసేన విమర్శించింది. 15 యేళ్లుగా వారే రాష్ట్రాన్ని పాలించారు.. వారి అవినీతి పాలనే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి కారణమని ఆరోపించింది. మూడు రోజులుగా వారు అసెంబ్లీ సమావేశాల్లో డ్రామా నడుపుతున్నారని బుధవారం నాటి సామ్నా సంపాదకీయంలో తీవ్రంగా దుయ్యబట్టింది. -
కరువు తీరా వాన..
అల్పపీడన ద్రోణితో జిల్లాలో భారీ వర్షాలు ►పశ్చిమంలో నిండిన చెరువులు, కుంటలు ►తూర్పు ప్రాంతంలోనూ మోస్తరు వర్షం ►వరదెత్తిన కాగ్నా, మూసీ నదులు ►పొంగిపొర్లిన లఖ్నాపూర్ ప్రాజెక్టు ►తెగిన రోడ్లు, జలదిగ్బంధంలో పలు గ్రామాలు ► పరిగి డివిజన్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు 1 పరిగి మండలంలోని లఖ్నాపూర్ ప్రాజెక్టు అలుగు పొంగిపొర్లి ప్రవహించడంతో తరలివచ్చిన ప్రజలు 2 చేవెళ్ల డివిజన్ పరిధిలోని అమ్డాపూర్ సమీపంలో నీటమునిగిన చామంతి తోట 3 పరిగి మండలం నజీరాబాద్ తండాలో వరదలో కొట్టుకుపోయిన పత్తిపంటను చూపిస్తూ రోదిస్తున్న గిరిజన మహిళ సాక్షి, రంగారెడ్డి జిల్లా: తీవ్ర వర్షాభావంతో కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న జిల్లాను తాజా అల్పపీడనద్రోణి ఆదుకుంది. చినుకుల జాడలేక వాడిపోతున్న పంటలకు భారీ ఊరటనిచ్చింది. ద్రోణి ప్రభావంతో మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ ప్రాంతంలో కురుస్తున్న వానల ప్రభావంతో ఇప్పటికే చెరువులు, కుంటలు నిండి అలుగుపారుతున్నాయి. మరోవైపు తూర్పువైపు సైతం ఆశాజనకంగా కురుస్తున్న వర్షాలతో రైతాంగం ఆనందంలో మునిగింది. భారీ వర్షాల కారణంగా పోటెత్తుతున్న వరదలతో రవాణావ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పశ్చిమ ప్రాంతంలోని పలు గ్రామాల్లో జనావాసాల మధ్య వరదనీరు చేరడంతో స్థానికంగా తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. శంషాబాద్ మండలం కే.బీ.దొడ్డి గ్రామంలోకి వరదనీరు చేరడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. తాండూరు మండలం వీర్శెట్టిపల్లి గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. రెండ్రోజులుగా ఈ గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. సెల్ఫోన్లు సైతం మూగబోవడంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎడతెరపి లేకుండా.. వరుసగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి జిల్లాలోని నదులు వరదెత్తాయి. దీంతో వరద ప్రవాహ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు జలాలతో కళకళలాడుతున్నాయి. యాలాల మండలం అన్నాసాగర్ ఊర చెరువు, అచ్యుతాపూర్ పెద్ద చెరువు, కమాల్పూర్లోని షేక్పుర చెరువులకు గండి పడడంతో నీరంతా పొలాల్లోకి చేరింది. భారీ వర్షాల కారణంగా కాగ్నా నది ఉగ్రరూపం దాల్చింది. మూసీ, ఈసీ వాగులు సైతం రోడ్లెక్కి ప్రవహిస్తుండడంతో రవాణా వ్యవస్థ స్తంభించిందింది. జిల్లాలో పెద్దప్రాజెక్టులైన కోట్పల్లి ప్రాజెక్టుకు వరదనీరు జోరందుకుంది. మరోవైపు పరిగి ప్రాంతంలో సాగునీటికి కీలకమైన లఖ్నాపూర్ ప్రాజెక్టు అలుగు ప్రవహిస్తోంది. మూసీ, ఈసీ వాగుల ప్రవాహం అధికమై జంట జలాశయాలకు పరుగులు పెడుతోంది. కాగ్నా వరద ప్రభావంతో తాండూరు-మహబూబ్నగర్ మార్గం పూర్తిగా దెబ్బతింది. దీంతో కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. కంది-షాద్నగర్, చేవెళ్ల-శంకర్పల్లి మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా పరిగి డివిజన్లో 12 సెంటీమీటర్లు, సరూర్నగర్ డివిజన్లో 2.17, రాజేంద్రనగర్ డివిజన్లో 1.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. నీట మునిగిన పొలాలు.. వర్షాల ధాటికి వాన నీరంతా వరదై ప్రవహిస్తోంది. మరోవైపు చెరువులకు గండ్లు పడడం..ప్రాజెక్టులు పొంగి పొర్లడంతో పలు గ్రామాల్లో వేల హెక్టార్లలో పంటలు జలమయమయ్యాయి. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, పూలు, పండ్ల తోటలు, కూరగాయల పంటలు నీటమునిగాయి. కరువుతో అల్లాడుతూ వానలు కురవాలని కోరుకుంటున్న రైతులను.. తాజా వానలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ వానల వల్ల మెట్టపంటలకు పెద్దగా ముప్పు లేనప్పటికీ.. కూరగాయల పంటలు మాత్రం కొంతమేర దెబ్బతినే అవకాశం ఉంది. ఇదే తరహాలో మరో మూడు రోజులు వరుసగా వర్షాలు కురిస్తే అన్నిరకాల పంటలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు విజయ్కుమార్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. సోమవారానికి వర్షం తెరిపిస్తే కొన్ని పంటలకు మేలు జరిగే అవకాశం ఉందన్నారు. -
కరెంట్కూ కటకట
*వ్యవసాయ విద్యుత్ సరఫరాపై ఆందోళన *వర్షాలు పడక .. కరెంట్ లేక అల్లాడుతున్న రైతులు *మోటార్లు పనిచేయక ఎండుతున్న వరి చేలు *నాట్లు వేసిన ప్రాంతాల్లో నీళ్లు లేక నెర్రెలిచ్చిన వరి పొలాలు *కరెంట్కూ కటకట వేమూరు: వర్షాభావ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్కుగాను గత నెలలో కురిసిన అరకొర వర్షాలు రైతుల్లో ఆశలు చిగురింపచేయడంతో డెల్టాలో అక్కడక్కడా వరి నాట్లు వేశారు. ఈ నెలలో వరుణుడు ముఖం చాటెయ్యటంతో వేసిన నాట్లు నీరు లేక ఎండిపోతున్నాయి. మరి కొందరు దుక్కి చేసిన పొలాల్లో నాట్లు వేసేందుకు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. చేసేది లేక అదనపు భా రాన్ని సైతం భరిస్తూ ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని సమకూర్చుకునే పనిలో పడ్డారు. కనీసం బోర్ల సాయంతోనైనా సాగు చేసేందుకు వ్యవసాయ విద్యుత్ సరఫరా అరకొరగానే ఉందని రైతులు దిగులు పడుతున్నారు. వేమూరు మండలంలో 22 వేల ఎకరాల్లో రైతులు వరిసాగు చేపట్టారు. వీరిలో రైతులు, కౌలు రైతులు ఉన్నారు. ఇక్కడ వ్యవసాయ మోటార్లు వెయ్యి వరకు ఉన్నాయి. మండలంలో ఎ, బి రెండు గ్రూపులుగా వ్యవసాయ విద్యుత్ సరఫరా ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎ గ్రేడ్ విధానంలో రైతులకు ఉదయం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు, రాత్రి పది నుంచి పన్నెండు గంటల వరకు సరఫరానివ్వాలి. అయితే త్రీఫేజ్ సమస్యగా ఉందని రాత్రి వేళ సరఫరా చేయడం లేదు. ఉదయం ఐదు గంటల పాటు ఇవ్వాల్సిన సరఫరాను మూడు గంటలు కూడా ఇవ్వటం లేదు. దీంతో రైతులు నానా తంటాలు పడు తున్నారు. అరకొరగా ఉన్న విద్యుత్ సరఫరాతో మోటార్లు పనిచేయక నాట్లు ఎండిపోతున్నాయి. ఇక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఎకరాకు దాదాపు రూ.25 వేలు కౌలు చెల్లించారు. నీటి కోసం అదనపు ఖర్చుల తో ఇంజన్లు వినియోగిస్తున్నారు. ఇంజన్లు, పైపుల అద్దె, డీజిల్ ఖర్చులు మోయలేని భారంగా ఉన్నాయంటున్నారు. పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నాం.. రైతులకు ఏడు గంటల విద్యుత్ సరఫరా ఇవ్వాల్సి ఉంది. ఉదయం నాలుగు నుంచి తొమ్మిది గంటల వరకు, రాత్రి పది నుంచి 12 వరకు ఇవ్వాలి. అయితే త్రీఫేజ్ సమస్య కారణంగా రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా ఇవ్వలేకపోతున్నాం. ఉదయం ఇస్తున్న సరఫరాలో కూడా కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బంది కారణంగా పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నాం. - శివప్రసాదు, విద్యుత్ ఏఈ, వేమూరు అలుగురాజుపల్లి రైతుల రాస్తారోకో మాచర్లటౌన్ :వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ కోతలు విధిస్తూ విద్యుత్ శాఖ సిబ్బంది తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండలంలోని అలుగురాజుపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహంతో సోమవారం గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ద్వారకాపురి విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం చాన్నాళ్ల కిందటే పూర్తయినా ప్రజా ప్రతినిధులు ప్రారంభించే వరకు చార్జి చేయకుండా ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈలోగా వేసిన పంటలకు కరెంటు కోత వల్ల నీరులేక ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. గ్రామస్తులు రాస్తారోకో చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న విజయపురిసౌత్ ఎస్ఐ నిస్సార్బాషా ఫోన్ ద్వారా రైతులతో సంప్రదింపులు జరిపారు. విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి సమస్య పరిష్కారం అయ్యేటట్టు చర్యలు తీసుకుంటానని వారికి తెలిపారు. ఇదే విషయాన్ని రూరల్ ఏఈ గౌతమ్కు తెలియపర్చారు. దీంతో ఏఈ గౌతమ్ గ్రామ రైతులతో చర్చలు జరిపి మధ్యాహ్నం నుంచి అలుగురాజుపల్లి ఫీడర్కు తాత్కాలికంగా చార్జి చేస్తామని చెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు. జువ్వలపాలెంలో రైతుల ధర్నా ప్రభుత్వం వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ను అందించడంలో విఫలమైందని ఆరోపిస్తూ 11 లంక గ్రామాల రైతులు విద్యుత్ సబ్స్టేష్టన్ను ముట్టడించి మెయిన్ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదంటూ కొల్లూరు మండల పరిధిలోని రైతులు సోమవారం జువ్వలపాలెం విద్యుత్ సబ్స్టేష్టన్ వద్ద ఆందోళన చేశారు. -
ఉరుముతున్న కరువు!
మెతుకుసీమ రైతన్న విలవిల ►ఐదేళ్ల తర్వాత జిల్లాలో అత్యల్ప వర్షపాతం ►29 మండలాల్లో 60 శాతం వర్షాభావం ►ఎండుతున్న పంటలతో ఆందోళన ►లక్ష హెక్టార్లకు పైగా తగ్గిన సాగు సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతులను ఊపిరాడనివ్వటంలేదు. వర్షాభావం వల్ల ఖరీఫ్పై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఐదేళ్ల తర్వాత జిల్లాలో వర్షాభావం 60 శాతానికి చేరుకుంది. ప్రస్తుత సీజన్లో లక్ష హెక్టార్లకుపైగా సాగు విస్తీర్ణం తగ్గింది. ఉన్న పంటలు కూడా ఎండుముఖం పట్టడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలాఖరులోగా వర్షాలు కురవని పక్షంలో దిగుబడిపైనా ప్రభావం పడనుంది. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే జిల్లాలో కరువు తప్పదని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఆశించినస్థాయిలో ఫలితాలు ఇవ్వటంలేదు. వర్షాభావం.. ఉద్యాన పంటల సాగుపైనా ప్రభావం చూపుతోంది. సకాలంలో వర్షాలు కురవకపోవటంతో జిల్లాలో పదివేల హెక్టార్లలో రైతులు ఉద్యాన పంటలను వేయలేకపోయారు. దీంతో కూరగాయల ధరలు పెరిగే అవకాశాలున్నాయి. 199 మిల్లీమీటర్ల వర్షపాతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటినుంచి ఇప్పటివరకు జిల్లాలో 489 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 199 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. జిల్లాలో 60 శాతం వర్షాభావం నెలకొంది. 2009-10లో జిల్లాలో 60 శాతానికిపైగా వర్షాభావం నమోదైంది. ఆ తర్వాత ఇప్పుడు.. వర్షాభావం తీవ్రస్థాయికి చేరుకుంది. 29 మండలాల్లో 60 శాతం, మరో 13 మండలాలు 50 శాతానికి పైగా వర్షాభావం ఉంది. దీంతో ఆయా మండలాల్లో సాగు విస్తీర్ణం తగ్గి.. కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. భారీగా తగ్గిన సాగు.. వర్షాభావం కారణంగా ఖరీఫ్లో పంటల సాగు భారీగా తగ్గింది. ఖరీఫ్లో 4.40 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 3 లక్షల హెక్టార్లలో పంటలు సాగు అయ్యాయి. లక్ష హెక్టార్ల మేర పంట విస్తీర్ణం తగ్గింది. 81 వేల హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 36 వేల హెక్టార్లలో సాగయ్యింది. వర్షాభావానికి తోడు కరెంటు కోతలు తోడయ్యాయి. కోతల వల్ల ఉన్న పంటలు కూడా ఎండుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్లో మొక్కజొన్న 1.10 లక్షల హెక్టార్లకుగాను 81 వేల హెక్టార్లు, పెసర 38 వేల హెక్టార్లకుగాను 23 వేల హెక్టార్లు, 18 వేల హెక్టార్లలో మినుముకు సాగు చేయాల్సి ఉండగా 11 వేల హెక్టార్లలోనే సాగు చేశారు. పత్తి 97 వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంగా ఉండగా 91 వేల హెక్టార్లలో పత్తి వేశారు. గత ఏడాది ఖరీఫ్తో పోలిస్తే ఆరుతడిపంటల సాగు లక్ష హెక్టార్ల మేర తగ్గింది. వర్షాభావం కారణంగా ప్రస్తుతం మొక్కజొన్న, జొన్న, పత్తిపంటలు ఎండిపోతున్నాయి. పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలాఖరు వరకు వర్షాలు కురవని పక్షంలో దిగబడి తగ్గే అవకావం ఉందని అధికారులు చెబుతున్నారు. -
బెట్టను తరిమేద్దామిలా..
ఈ ఏడాది ఖరీఫ్లో వర్షాధారం కింద నాలుగు లక్షలకు పైగా హెక్టార్లలో పంటలు వేశారు. ఇందులో ప్రధానమైనవి పత్తి, వేరుశనగ, కంది, ఆముదం, ఉల్లి, మొక్కజొన్న. జూన్, జూలై నెలల్లో అప్పుడప్పుడు వర్షాలు కురిసినా ఆగస్టు నెలలో మొండికేశాయి. గత 20 రోజులగా చినుకుజాడ కరువైంది. దీంతో పైర్లన్నీ ఎండిపోతున్నాయి. అయితే కొద్దిపాటి శ్రమ తీసుకుంటే బెట్ట నుంచి వీటిని వారం నుంచి పది రోజుల వరకు కాపాడుకోవచ్చని డాట్ సెంటర్ ముఖ్యశాస్త్రవేత్త డాక్టర్ సరళమ్మ తెలిపారు. ఆలోపు వర్షాలు పడితే తిరిగి కోలుకుంటాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో బెట్ట నుంచి పైర్లకు ఉప శమనం కలిగించవచ్చని వివరించారు. నెర్రెలను పూడ్చాలి.. వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటంతో సాగు భూముల్లో నెర్రెలు(పగుళ్లు) వస్తున్నాయి. ఇవి వస్తే భూమిలోని తేమ ఆవిరి రూపంలో బయటికి వెళుతుంది. ఉన్న తేమ కూడా బయటికి పోతే పంటలకు మరింత ప్రమాదకరం. నెర్రెలు వచ్చినప్పుడు రైతులు అంతర కృషి చేయాలి. దీంతో తేమ బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు. అంతర కృషి అంటే సాళ్ల మధ్య గొర్రుతో దున్నాలి. లేదా నాగలితో దున్నవచ్చు. ఇలా చేయడం వల్ల నైలను పూడ్చినట్లు అవుతుంది. ఆవిరి రూపంలో తేమ బయటికి వెళ్లదు. దీంతో పంటలను కొద్ది రోజుల పాటు బెట్ట నుంచి కాపాడుకోవచ్చు. పై పాటుగా రసాయన ఎరువులు పిచికారీ చేయాలి.. ఖరీఫ్లో వర్షాధారం కింద వేసిన పంటలన్నీ ప్రస్తుతం 30 నుంచి 60 రోజుల దశలో ఉన్నాయి. ఇప్పటికే మొక్కజొన్న పూర్తిగా ఎండిపోయింది. కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ రైతులు ప్రయత్నించాలి. రసాయన ఎరువులైన 19:19:19 లేదా 17:17:17 లేదా డీఏపీ పది గ్రాములు లీటరు నీటికి కలిపి ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వర్షాలు పడేంత వరకు వారం నుంచి పది రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. బెట్ట నుంచి పంటలకు ఉపశమనం కల్పించుకోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. పిచికారీ కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో చేసుకోవడం మంచిది. చీడ, పీడలను ఇలా నివారించుకోవాలి... బెట్ట పరిస్థితుల కారణంగా పంటలకు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉంది. వీటిని కూడా నివారించుకోవాలి. డోన్, పత్తికొండ, దేవనకొండ తదితర ప్రాంతాల్లో వేరుశనగ పంటల్లో బెట్ట కారణంగా ఆకుముడుత తెగులు ఎక్కువగా కనిపిస్తోంది. దీనిని నివారణకు క్లోరో ఫైరిపాస్ 2 ఎంఎల్, నువాన్ ఒక ఎంఎల్, లేదా ఎసిపేట్ 1.5 గ్రాములు, నువాన్ 1 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రత్తి, ఆముదం పంటల్లో ఆకు తొలిచే పురుగు కనిపిస్తోంది. దీని నివారణకు క్వినాల్ పాస్ లేదా మోనోక్రోటోఫాస్ 2 ఎంఎల్ లేదా ఎసిపేట్ 1.5 గ్రాములు, వేపనూనె 5 ఎంఎల్ లీటరు నీటికి కలిపి ఎకరాకు 200 ద్రావణాన్ని పిచికారీ చేయాలి బెట్టకారణంగా టమాటలో పూత, పిందె రాలుతోంది. దీని నివారణకు ఫ్లోనోఫిక్స్ 1ఎంఎల్ 4ః5 లీటర్ల నీటికి కలిపి ఐదు రోజులకోసారి పిచికారీ చేయాలి పత్తిలో పిండినల్లి అనే తెగులు కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితుల్లో ఇది వస్తోంది. దీని నివారణకు 2 ఎంఎల్ ప్రొఫినోపాస్, 5 ఎంఎల్ వేపనూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. -
మరఠ్వాడాలో కరువు
సాక్షి, ముంబై: వర్షాలు ముఖం చాటేయడంతో మహారాష్ట్రలో ముఖ్యంగా మరఠ్వాడా రీజియన్లో మళ్లీ కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. మూడేళ్లుగా ఇక్కడ కరువు కరాళ నృత్యం చేస్తుండటంతో ప్రభుత్వం ఇప్పుడు దీన్ని సీరియస్గా తీసుకుంది. మరఠ్వాడా రీజియన్లోని 123 తాలూకాలను కరువు ప్రాంతంగా ప్రకటించాలని నిర్ణయించింది. వర్షా కాలం ప్రారంభమై దాదాపు రెండున్నర నెలలు కావస్తున్నప్పటికీ ఈ రీజియన్లో ఇంతవరకు 50 శాతం వర్షాలు కూడా పడలేదు. దీంతో ఇక్కడ పరిస్థితి మరింత విషమించడంతో కరువు ప్రాంతంగా ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం ఇక్కడి తాలూకాల్లో వ్యవసాయం పనులకు అమర్చుకున్న విద్యుత్ మోటార్ల బిల్లులో 33 శాతం మాఫీ, విద్యార్థుల పరీక్ష ఫీజు చేయాలని నిర్ణయించింది. కరువు ప్రాంతాలను ప్రకటించే ముందు జిల్లాలవారీగా కాకుండా తాలూకాల వారీగా అధ్యయనం చేశారు. ఇందులో 123 తాలూకాల్లో కరువు తీవ్రంగా ఉందని తేలింది. ఆగస్టులో సరాసరి 68.50 శాతం వర్షం కురిసింది. దీంతో జలాశయాల్లో నీటి మట్టం 61 శాతానికి చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో 73 శాతం ఉండేది. మరఠ్వాడా రీజియన్లోని అన్ని డ్యాములు కలిపితే సరాసరి 19 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. ఔరంగాబాద్, లాతూర్, జాల్నా, బీడ్, ఉస్మానాబాద్, నాందేడ్, పర్భణి, హింగోలి, బుల్డాణ, చంద్రాపూర్, యావత్మాల్ ఇలా 11 జిల్లాల్లో 50 శాతానికి కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో ఈ జిల్లాలోని తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ఇదిలాఉండగా ఔరంగాబాద్, జాల్నా, హింగోలి, పర్భణి, ఉస్మానాబాద్, బీడ్, బుల్డాణ, చంద్రాపూర్, యవత్మాల్, లాతూర్, నాందేడ్ జిల్లాల్లో కేవలం 26-50 శాతం పొలం పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. అదేవిధంగా రాయ్గఢ్, నాసిక్, షోలాపూర్, కొల్హాపూర్, అకోలా, వాషిం, నాందుర్బార్, భండారా, గడ్చిరోలి, అహ్మద్నగర్ జిల్లాల్లో రైతులు 51-75 శాతం పనులు మాత్రమే చేపట్టారు. రత్నగిరి, సింధుదుర్గ్, ధుళే, జల్గావ్, అమరావతి, వర్ధా, నాగపూర్, గోండియా జిల్లాల్లో 76-100 శాతం పనులు జరగ్గా పుణే, ఠాణే, సతారా, సాంగ్లీ జిలా ్లల్లో రైతులు వంద శాతానికి పైగా పనులు పూర్తిచేశా రు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కొంత మెరు గ్గా ఉన్నాయి. కాని మరఠ్వాడాలో మాత్రం మూడేళ్ల నుంచి కరవు తాండవిస్తోంది. గత ఏడాది పరిస్థితి మరీ దారుణంగా తయారవ్వడంతో స్థానికులు పనుల్లేక వలసలు వెళ్లిపోయారు. ఉన్న కొద్దిపాటి మంది తాగునీరు లేక విలవిల్లాడారు. ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరా చేసినప్పటికీ అవి ఎటూ సరిపోలేదు. -
వేరుశనగను కాపాడుకోండిలా..
ఆదోని రూరల్: జిల్లాలో పత్తి తరువాత అత్యధికంగా సాగయ్యేది వేరుశనగ. ప్రస్తుతం పంట సాగై నెలరోజులు పైగా కావస్తోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా మొక్కల్లో ఎదుగుదల లోపించింది. కోసిగి మండలం కందకూరు, దిడ్డి, అలాగే ఆదోని మండలం మధిరె గ్రామాల్లో ఆకుముడత తెగులు కనిపిస్తోంది. పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో రసం పీల్చేపురుగు..మిగతా గ్రామాల్లో అక్కడడక్కడ తామర పురుగు ఆశించింది. ఆకుమచ్చ తెగులూ పంటను దెబ్బతీస్తోంది. కొన్ని ప్రాంతాల్లో జింక్ లోపం కారణంగా పైరు పసుపు రంగులోకి మారుతోందని ఆదోని ఏడీఏ చెంగలరాయుడు (8886613938) తెలిపారు. రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటిస్తే తప్ప పంట చేతికొచ్చే పరిస్థితి లేదని వివరించారు. వాతావరణ మార్పులతో ఆకుముడత తెలుగు వస్తోంది. ఆకులు గోధుమరంగులోకి మారి పైరు ఎండిపోతుంది. ఆకులపై బొబ్బలు వచ్చి పొరల మధ్య పురుగు ఉంటుంది. దీని నివారణకు ఫినాల్ఫాస్ 2.5ఎంఎల్, వేపనూనె 3ఎంఎల్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆకుపై ముదురు గోధుమ రంగులో మచ్చలు (ఆకుమచ్చ తెగులు) ఏర్పడితే పైరు ఎండిపోయే ప్రమాదం ఉంది. దీని నివారణకు ఒకలీటరు నీటిలో 3 గ్రాముల డైథేన్ఎం45ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొవ్వకుళ్లు తెగులు వస్తే ఆకులు తెల్లగా మారి ఎండిపోతాయి. మొక్కల ఎగుదల నశించి దిగుబడి తగ్గిపోతుంది. దీని నివారణకు ఒక లీటరు నీటికి మోనోప్రోటాఫాస్ 2ఎంఎల్, వేపనూనె 3ఎంఎల్తో పాటు సర్ఫ్ పొడిని ఎకరాకు 200 లీటర్ల నీటిలో పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగు ఆశిస్తే ఆకులు ఎర్రబడి ముడుచుకుపోతాయి. దీని నివారణకు ఒక లీటరు నీటిలో రోగార్ 2 ఎంఎల్తో పాటు వేపనూనె 5 ఎంఎల్ కలిపి పిచికారీ చేయాలి. పైరు మొక్క దశలో ఉన్నప్పుడు ఎర్ర నేలల్లో 10 రోజులకోసారి వర్షం కురవాలి. లేదంటే పైరు బెట్టకు వస్తుంది. నల్లరేగడి నేలల్లో అయితే 15 రోజుల సమయం పడుతుంది. దీనిని నివారణకు ఒక లీటరు నీటిలో 20 గ్రాముల యూరియాను కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 200 లీటర్ల నీటిని వాడటం మంచిది. జింక్ధాతు లోపం ఉంటే మొక్కలు పసుపు రంగులోకి మారుతాయి. దీని నివారణకు ఒక లీటరు నీటిలో 2గ్రాముల జింక్ సల్ఫేట్ను కలిపి పిచిచారీ చేయాలి. ఇలా వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. -
చినుకు జాడేది?
- ఆవిరవుతున్న రైతన్న ఆశలు - నిండుకుంటున్న జలాశయాలు - తాగునీటికీ తప్పని కటకట - కృత్రిమ వర్షాలపై బీఎంసీ దృష్టి - జూలై రెండోవారంలోనే వర్షాలు - కోతలకు సిద్ధమవుతున్న సర్కార్ పింప్రి, న్యూస్లైన్: వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు దాటుతున్నా చినుకు జాడ లేకపోవడంతో అటు రైతుల్లోనూ, ఇటు నగరవాసుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఎప్పటికంటే ఈ ఏడాది వర్షం తక్కువగా కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు ముందుగానే వెల్లడించిన తక్కువ మాట అటుంచి అసలు చినుకు జాడే లేదని, మరో పక్షం రోజులు ఇలాగే గడిస్తే ఈ సీజన్పై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు. ఆలస్యంగా విత్తినా దిగుబడి ఆశించిన స్థాయిలో రావడం అసాధ్యమంటున్నారు. రాష్ట్రంలోని విదర్భ, మరాఠ్వాడా, కొంకణ్ ఇలా ఏ ప్రాంతమైనా వర్షం కురిసిన జాడే లేదని, దీంతో ఈసారి కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందేనంటున్నారు. మరో పక్షంరోజులు ఇంతే... పుణే వాతావరణ పరిశోధన విభాగం తెలిపిన వివరాల మేరకు.. జూలై మొదటి వారం తర్వాత వర్షాలు కురిసే అవకాశముంది. ఒకవేళ అప్పటికీ వర్షం కురవకపోతే తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవంటున్నారు. ప్రస్తుతం ముంబై, పుణే వంటి పెద్ద నగరాలకు నీటిని సరఫరా చేసే జలాశయాల్లో కొంతమేర నీటి నిల్వలున్నా అవి అవసరాలకు సరిపడా లేవని, జూన్ రెండో వారంలో వర్షాలు కురిసే వరకు సరిపోతాయనే భరోసాతో ఉన్న అధికారులకు ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. నగరవాసులకు నీటి సరఫరాలో 20 శాతం కోత విధించే అంశమై ప్రభుత్వ అధికారులతో చర్చిస్తున్నట్లు రాష్ట్ర సహకారశాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ తెలిపారు. అడుగంటుతున్న జలాశయాలు... పుణే, ముంబై వంటి మహానగరాలకు సరఫరా చేసే మంచి నీటి రిజర్వాయర్లు, డ్యాంలలో నీటినిల్వలు అడుగంటుతున్నాయి. రాబోయే రోజులను ఎదుర్కోవడానికి పక్కా ప్రణాళికలపై అధికారులు దృష్టి సారించారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వీటికితోడు అకాాల వర్షాలు, వడగండ్లతో రాష్ట్ర రైతులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. వీరిని ఆదుకోవడానికి రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు రెండు సంవత్సరాలలో 9 వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాయి. అయితే ఈ ప్యాకేజీలు ఏమూలకు సరిపోవడం లేదు. ఇప్పుడు వరుణుడు ముఖం చాటేయడంతో వరుసగా ఈ ఏడాది కూడా కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 25 నుంచి 30 శాతం వ్యవసాయ పనులు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఇప్పటిదాకా కేవలం 1.5 శాతం మాత్రమే పూర్తయినట్లు చెబుతున్నా వర్షాలు కురవకపోతే అవి కూడా నిష్ర్పయోజనంగా మారే అవకాశముంది. రాష్ర్టంలో ప్రధాన రిజర్వాయర్లలో కేవలం 20 శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆయా నగరాలలోని ప్రజల దాహార్తిని తీర్చడానికి నీటి నిల్వలు ఏమూలకూ సరిపోక పోవడంతో అధికారులలో కూడా ఆందోళన మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు విభాగాల పరిధిని గమనిస్తే నాగ్పూర్లో 46 శాతం, మరాఠ్వాడాలో 20 శాతం, నాసిక్లో 14 శాతం, పుణే విభాగంలో 13 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. మొత్తం ఇప్పుటి వరకు 1,464 గ్రామాలకు, 3,687 వీధులకు 1,454 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. కృత్రిమ వర్షాలతో ప్రయోజనముండదు: పాటిల్ రాష్ర్టంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కృత్రిమ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతుందా? అన్న ప్రశ్నకు.. గ్రామీణాభివృద్ధి మంత్రి జయంత్ పాటిల్.. ‘అలాంటి ఆలోచన లేదు. దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండద’ని సమాధానమిచ్చారు. దీని వల్ల పంటలకు ప్రయోజనంగా ఉంటుందేమో కానీ తాగు నీటి సమస్య తీరదన్నారు. పుణేలో ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మంత్రి జయంత్ పాటిల్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కృత్రిమ వర్షాల వల్ల కేవలం రెండు నుంచి మూడు మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే కురుస్తుందన్నారు. కృత్రిమ వర్షాలపై దృష్టిసారించిన బీఎంసీ వర్షాలు పత్తాలేకుండా పోవడంతో మహానగర పాలక సంస్థ(బీఎంసీ) కృత్రిమ వర్షాలవైపు దృష్టి సారించింది. అందుకు టెండర్లను ఆహ్వానించేందుకు ఈ నెల 17న ప్రకటన జారీచేసింది. టెండర్లు దాఖలు చేయడానికి ఈ నెల 26 వరకు గడువు ఇచ్చారు. ఆ తరువాత 27 నుంచి ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేయడానికి అవకాశముంటుందని బీఎంసీ అదనపు కమిషనర్ రాజీవ్ జలోటా చెప్పారు. కృత్రిమ వర్షం కోసం రూ.15.75 లక్షలు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నాసిక్, ఠాణే పరిసరాల్లోని కార్పొరేషన్ పరిధిలోని జలాశయాలున్న ప్రాంతాల్లో కృత్రిమ వర్షం కోసం ప్రయత్నాలు చేయనున్నట్లు జలోటా చెప్పారు. గతంలో ఇలాంటి ప్రయోగాలు చేసినప్పటికీ అనుకున్నంతమేర ఫలితాలు ఇవ్వలేదు. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నప్పటికీ ఈ ప్రయోగం సఫలీకృతం కాకపోవడంతో నిరాశే మిగిలింది. -
వారంలోగా కరువు నివేదికలు పంపండి: రఘువీరారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్రానికి నివేదిక పంపేందుకు వీలుగా వారం రోజుల్లో కరువు మండలాలకు సంబంధించిన పూర్తి వివరాలను పంపించాలని జిల్లా కలెక్టర్లను రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఆదేశించారు. ఖరీఫ్లో నెలకొన్న కరువు పరిస్థితులు, కరువు మండలాల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలపై జిల్లా కలెక్టర్లతో మంగళవారం రఘువీరా వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ‘సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెతో కరువు మండలాల నివేదిక రూపొందించడం నెల ఆలస్యమైం ది. ఇంకా ఆలస్యమైతే రైతులకు నష్టం జరుగుతుంది. అందువల్ల యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుని వారంలో నివేదిక పంపండి. దానిని క్రోడీకరించి రాష్ట్రప్రభుత్వం నెలాఖరులోగా కేంద్రానికి పంపుతుంది. నివేదికలు అందించడంలో ఆలస్యం వల్ల ఏ ప్రాంతానికైనా అన్యాయం జరిగితే అందుకు కలెక్టర్లనే బాధ్యుల్ని చేస్తాం’ అని తెలిపారు. ‘మనం నివేదిక ఎంత త్వరగా పంపిస్తే కేంద్రం నుంచి కరువు బృందం అంత త్వరగా వస్తుంది. వారు త్వరగా వస్తే ఇక్కడి నష్టాన్ని చూసి ఎక్కువ సాయానికి సిఫార్సు చేయడానికి వీలవుతుంది’ అని అన్నారు. పై-లీన్ తుపాను నష్టానికి సంబంధించిన నివేదికను బుధవారం కేంద్రానికి పంపిస్తామని చెప్పారు.