dry fruits
-
2 నిమిషాల్లో ఖాళీ..
-
హెల్త్ ఫ్యాక్ట్: నాన్వెజ్ తిన్నాక బాదం తినండి... ఎందుకంటే..?
మాంసాహారం తిన్న తర్వాత కొన్ని బాదం పలుకులు తినడం వల్ల ఓ ప్రయోజనం ఉంది. కొవ్వుల కారణంగా జరిగే అనర్థాల్ని తగ్గించడం ద్వారా అవి కరోనరీ గుండెజబ్బులనూ నివారిస్తాయి.బాదంలోని ఒమెగా–3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. ఆ మాటకొస్తే మామూలు సమయాల్లో బాదం తినడం వల్ల కూడా చాలా మేలు కలుగుతుంది. వీటిలోని క్యాల్షియమ్ ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు... ఆహారనాళాన్నీ ఆరోగ్యంగా ఉంచడం లో బాదం తోడ్పడుతుంది. గుండెకూ మేలు చేస్తుంది.ఇవి చదవండి: ‘ఆరుద్ర’ను చూస్తే అనువైన వరుడు.. -
డ్రైఫ్రూట్స్ ఎపుడు, ఎలా తిన్నా మంచిదే.. కానీ!
మంచి ఆరోగ్యం కోసం ఆహారం అనగానే గుర్తొచ్చే ప్రధాన వాటిల్లో డ్రైఫ్రూట్స్ ఒకటి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభించే డ్రైఫ్రూట్స్ వల్ల మంచి శక్తి లభిస్తుంది. రోజూ కాసిన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే డ్రైఫ్రూట్స్ తినడానికి సరైన సమయం ఏది? ఉదయమే తినాలా? భోజనానికి ముందు తీసుకోవాలా? తర్వాత తీసుకోవాలా? రాత్రి తినడం మంచిదా? ఇలాంటి సందేహాలుంటాయి చాలామందికి. డ్రైఫ్రూట్స్ని ఎపుడు,ఎలా తిన్నా మంచిదే. కొంతమంది నానబెట్టుకుని కూడా తింటారు. మన ఆహారంలో డ్రైఫ్రూట్స్ని చేర్చుకుంటే రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, హృదయ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్స్ లో విటమిన్స్, మినరల్స్, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్,ఫైబర్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. వాస్తవానికి ఎపుడు తీసుకున్నా మంచిదే. అయితే ఉదయం అల్పాహారంగానీ, మధ్యాహ్నం భోజనం తరువాత గానీ, సాయంత్నం చిరుతిండిగా కానీ తీసు కోవచ్చు. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అని అవసరాన్ని బట్టి మితంగా తీసుకోవాలి అనేది గమనించాలి.ఉదయాన్నే పరగడుపున డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వలన ఆ రోజంతా కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన శక్తి అనేది లభిస్తుంది.బాదం పప్పులను రాత్రి నానబెట్టుకుని ఉదయం లేవగానే తీసుకుంటే మంచిది. పోషకాలతో పాటు, మంచి గ్లోకూడా వస్తుంది. వర్కవుట్కు ముందు డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవల్స్ను పెంచి, ఫిట్నెస్ లక్ష్య సాధనలో తోడ్పడుతుంది. డ్రైఫ్రూట్స్లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. కనుక వ్యాయామం తరువాత కూడా తీసుకోవచ్చు. జీడిపప్పు వాల్నట్స్ను మితంగా తీసుకుంటే గుండె సమస్యలను నియంత్రించవచ్చు. మధ్యాహ్న ఆకలిని అరికట్టడానిక , శరీరానికి బూస్ట్ అందించడానికి డ్రై ఫ్రూట్స్ సరైన పరిష్కారం. డైటరీ ఫైబర్ ఉంటే ఎండు ద్రాక్ష అంజిర్, ఖర్జూరం తీసుకొంటే మంచిది. రక్తహీనత రాకుండా కాపాడుతాయి. ఎండు ద్రాక్షలో పొటాషియం కంటెంట్ అధికంగా ఉంటుంది.ఈవినింగ్ సాక్స్లాగా వేయించిన జీడిపప్పు తీసుకోవచ్చు. వీటిల్లో కొలెస్ట్రాల్ అనేది అసలు ఉండదు. దీంతో గుండె పనితీరును పెంచేందుకు ఎంతో సహాయం చేస్తాయి. నిద్రవేళ స్నాక్స్కు అద్భుతమైన ఎంపిక డ్రైఫ్రూట్స్. ఎండిన ఆప్రికాట్లు లేదా చెర్రీస్తో పాటు బాదం లేదా వాల్నట్ లాంటి డ్రై ఫ్రూట్స్లో ఉండే పోషకాలు విశ్రాంతినిస్తాయి. వీటిల్లోని మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేస్తుంది. ప్రశాంతంగా నిద్ర పట్టేలా చేస్తుంది. -
నీరు వర్సెస్ పాలు: డ్రై ఫ్రూట్స్ని ఎందులో నానబెట్టి తీసుకుంటే మంచిది?
డ్రై ఫ్రూట్స్ మన ఆహారంలో అంతర్భాగం. ప్రతిరోజు ఒక పిడికెడు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఈ గుప్పెడు గింజలు ఎన్నో పోషకాలను విటమిన్లను, ఖనిజాలను అందిస్తాయి. సాధారణంగా డ్రై ఫ్రూట్స్ను నానబెట్టి తీసుకుంటాం. వీటిని కొన్ని గంటల ముందు నానబెట్టడం వల్ల సులభంగా జీర్ణమవ్వడమే గాక శరీరం కూడా ఈజీగా పోషకాలను గ్రహించగలుగుతుంది. అయితే ఈ డ్రైఫ్రూట్స్ని నీరు వర్సెస్ పాలు మధ్య వేటిలో నానబెడితే ఆరోగ్యకరం అనే విషయానికి వస్తే రుచి, ఆహార ప్రాధాన్యతలను ఆధారంగా చేసుకుని చెప్పాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు.డ్రై ఫ్రూట్స్ను నానబెట్టడం వల్ల వాటి ఆకృతిని పెరుగడమే గాక మృదువుగా ఉండి తినేందుకు వీలుగా ఉంటుంది. ముఖ్యంగా దంత సమస్యలు లేదా జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇటా నానబెట్టడం వల్ల దానిలోని సహజ చక్కెరలు, రుచులను విడుదలై తినేందుకు రుచిగా ఉంటాయి కూడా. అలాగే నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయని చెబుతున్నారు నిపుణులు. ఇది సలాడ్ల నుంచి డెజర్ట్ల వరకు వివిధ వంటకాలలో ఉపయోగించేందుకు వీలుగా ఉంటుంది. నీటిలో నానబెడితే..నీటిలో నానబెట్టడం వల్ల ఆకృతితోపాటు రచి కూడా పెరుగుతుంది. అదనపు కొవ్వు నివారించాలనుకునే వారికి ఇలా నీటిలో నానబెట్టినవి తీసుకోవడం మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అదీగాక నీటిలో నానబెట్టడం వల్ల అదనపు కేలరీలు లేదా కొవ్వును జోడించదు. పైగా మనకు వాటి సహజ రుచిని పరిచయం చేస్తుంది. కేలరీ కాన్షియస్ డైట్ అనుసరించాలనుకునే వారికి, బరువుని అదుపులో ఉంచాలనుకునేవారికి ఈ పద్ధతిలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమం. పాలల్లో నానబెడితే..పాలల్లో డ్రై ఫ్రూట్స్ నానబెట్టడం వల్ల వాటికి మంచి విభిన్న ప్రయోజనాలను పొందొచ్చు. పాలు వాటికి మంచి ఆకృతి, రుచిని అందిస్తాయి. ఇక్కడ పాలు, డ్రైఫ్రూట్స్ కలయిక రుచిని మెరుగుపరచడమే గాక ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, వంటి అదనపు పోషకాలను అందిస్తుంది. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలనుకునే వారికి పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్లో ప్రోటీన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాలు పనితీరుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. వీటిని పిల్లలు, అథ్లెట్లు, నిర్దిష్ట ఆహార అవసరాలు ఉన్న వ్యక్తులు తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఏది బెస్ట్ అంటే..జీర్ణక్రియ ప్రభావాన్ని పరిగణలోనికి తీసుకుంటే..నీటిలో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. అలాగే లాక్టోస్ అసహనం లేదా పాలంటే పడనివారికి ఇలా తీసుకోవడమే మంచిది. పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ కంటే నీటిలో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ జీర్ణమవ్వడం సులభం. అసౌకర్యాన్ని కలిగించే అవకాశం తక్కువ కూడా. చెప్పాలంటే పాలల్లో నానబెట్టిన వాటిల్లో లాక్టోస్, కొవ్వుల ఉనికి కారణంగా పొట్టలో భారంగా ఉంటుంది. అలాగే ఎలాంటి జీర్ణ సమస్యలు లేనివాళ్లు సమతుల్య ఆహారంలో భాగంగా పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండుద. అంతేగాదు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మధుమేహాన్ని నిర్వహించడం తదిర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆయా ఆరోగ్య లక్ష్యాలకు అనుగుణంగా డ్రైఫ్రూట్స్ని నీళ్లు లేదా పాల్లలో నానబెట్టి తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. (చదవండి: నటి జాస్మిన్ బాస్మిన్ ఘటన: కాంటాక్ట్ లెన్స్ వల్ల కళ్లకు ప్రమాదమా?) -
డ్రై ఫ్రూట్స్, ఇతర గింజల్ని నానబెట్టి తింటున్నారా? అయితే ..!
ఆయుర్వేదం ప్రకారం, డ్రై ఫ్రూట్స్, ఇతర కొన్ని రకాల గింజలను తినే ముందు రాత్రిపూట నీటిలో నానబెట్టడం మంచిది తద్వారా వాటిల్లోని జీవపదార్థం ద్విగుణీ కృతమవుతుందని తినడానికి సులభంగా ఉంటుందని చెబుతారు. నానబెట్టడం వల్ల నట్స్ , డ్రై ఫ్రూట్స్లో ఉండే పోషకాల లభ్యతను పెరుగుతుంది. రాత్రంతా నానబెట్టిన గింజలు, డ్రైఫ్రూట్స్ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు మరెన్నో లాభాలుంటాయి.నానబెట్టడం వలన కలిగే ప్రయోజనాలు నానబెట్టిన గింజల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలతో కూడిన అద్భుతమైన మూలాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించి, వ్యాధులను నివారించడానికి, శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.నానబెట్టినపుడు గింజల రుచి, ఆకృతి రెండూ పెరుగుతాయి. అజీర్ణానికి కారణమయ్యే ఫైటిక్ యాసిడ్ తొలగి పోతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే టానిన్ లేదా (ఆమా) గణనీయంగా తగ్గిస్తుంది. గట్ దీంతో గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.మానవ శరీరాన్ని నియంత్రించే మూడు వాత, పిత్త , కఫ దోషాలు రాకుండా ఉంటాయి. వీటి వల్ల బాడీలో అసమతుల్యత, ఇతర అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.మచ్చుకు కొన్నిమెంతులు: రెండు చెంచాల మెంతుల్ని త్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఉనాలి. ఆ నీటిని తాగాలి. రోజూ ఇలా చేయడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి. వీటిలో పీచు అధికంగా ఉంటుంది. ఇది పేగులను శుభ్రపరిచి మలబద్ధకం లేకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులూ తగ్గుతాయి.అవిసె గింజలు: వీటిలో పీచు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-బి, ఇనుము, మాంసకృత్తులు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ చెంచా నాన బె ట్టిన గింజలను తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.అంజీరా: ఇది పోషకాల గని. దీంట్లో ఏ, బీ విటమిన్లు, క్యాల్షియం, ఇనుము, మాంగనీస్, సోడియం, పొటాషియం, పీచు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.ఇది మహిళల ఆరోగ్యానికి చాలామంచిది. గుమ్మడి విత్తనాలు: వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ వీటిని తినడం వల్ల స్త్రీలకు రొమ్ము క్యాన్సర్, పురుషులకు ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మలబద్దకం సమస్యకు కూడా మంచి పరిష్కారం. చెడు కొలెస్ట్రాల్ కరుగుతంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అలాగే మెగ్నీషియం రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. పురుషులలో వీర్య కణాల నాణ్యత కూడా పెరుగుతుంది. నిద్రలేమితో బాధపడే వా ప్రశాంతమైన నిద్ర కావాలంటే వీటిని తీసుకుంటే ఫలితం ఉంటుంది.నోట్: రోజువారీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్ , గింజలను చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిది. కానీ ఏదైనా అనారోగ్య సమస్యలను ఎందుర్కొంటున్నా, ఏదైనా ఇతర సమస్యలున్నా, వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. -
బాదంతో.. ఒక మసాలా కర్రీ... ఓ సీఖా... మరో టిక్కా!
బాదం ఆరోగ్యానికి మంచిది. నిజమే... రోజూ పది బాదం పప్పులు తినాలి. అదీ నిజమే... కానీ మర్చిపోతుంటాం. బాదం ఖీర్... బాదం మిల్క్ తాగడమూ మంచిదే. రోజూ తియ్యగా తాగలేం. మరేం చేద్దాం? బాదం రుచిని కొంచెం కారంగా ఎంజాయ్ చేస్తే! చాలా బాగుంటుంది. ఒక మసాలా కర్రీ... ఓ సీఖా...మరో టిక్కా! మన వంటింట్లో ఈ వారం ఇలా ట్రై చేద్దాం. ‘బాదం ధర తెలుసా’ అని అడక్కండి. మటన్ ధర కంటే తక్కువే. పైగా మనం వీటికోసం వాడేది కిలోల్లో కాదు... గ్రాముల్లోనే.చనా మసాలా ఆల్మండ్..కావలసినవి..బాదం పప్పులు– 50 గ్రాములు (నానబెట్టి పొట్టు తీయాలి);ఉల్లిపాయ –1 (తరగాలి);అల్లం – అంగుళం ముక్క (సన్నగా తరగాలి);పచ్చిమిర్చి తరుగు – టీ స్పూన్;ఆలివ్ ఆయిల్ – టేబుల్ స్పూన్;దాల్చిన చెక్క – అర అంగుళం ముక్క;చనా మసాలా – టేబుల్ స్పూన్ ;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి.తయారీ..బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి వేయాలి.అవి వేగేటప్పుడు దాల్చిన చెక్క, చనా మసాలా, ఉప్పు వేసి కలుపుతూ వేయించాలి.చివరగా బాదంపప్పులు వేసి కలిపి వేడెక్కి వేగుతుండగా స్టవ్ ఆపేయాలి.ఇది రోటీలోకి రుచిగా ఉంటుంది. గ్రేవీ కావాలంటే చివరగా అర కప్పు నీటిని పోసి, చిటికెడు ఉప్పు కలపాలి.కూర ఉడకడం మొదలైన తర్వాత చిక్కదనం చూసుకుని దించేయాలి.నద్రు ఔర్ బాదం కీ సీఖా, పనీర్ బాదమ్ టిక్కీనద్రు ఔర్ బాదం కీ సీఖా..కావలసినవి..బాదం పప్పులు– 80 గ్రాములు (పలుచగా తరగాలి);తామర తూడు – 300 గ్రాములు;పచ్చిమిర్చి – 4;అల్లం – 5 గ్రాములు;వెల్లుల్లి – 10 గ్రాములు;శనగపిండి – 30 గ్రాములు;ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి;బంగాళదుంప– 1 (మీడియం సైజు);చీజ్ – 50 గ్రాములు (తురమాలి);యాలకుల పొడి – పావు టీ స్పూన్;జాపత్రి – పావు టీ స్పూన్ ;ఉల్లిపాయలు – 2 (తరగాలి) ;కోవా – టేబుల్ స్పూన్ ;కుంకుమ పువ్వు – ఆరు రేకలు;నూనె – 2 టేబుల్ స్పూన్లుతయారీ..తామర తూడును శుభ్రంగా కడిగి తరిగి మరుగుతున్న నీటిలో వేసి నాలుగైదు నిమిషాల తర్వాత తీసి నీరు కారిపోయేటట్లు చిల్లుల పాత్రలో వేసి పక్కన పెట్టాలిబంగాళదుంపను ఉడికించి పొట్టు వలిచి, చిదిమి పక్కన పెట్టాలికుంకుమ పువ్వును పావు కప్పు గోరువెచ్చటి నీటిలో నానబెట్టాలిఅల్లం, వెల్లుల్లిని సన్నగా తరిగి పక్కన పెట్టాలిశనగపిండి నూనె లేని బాణలిలో పచ్చి వాసన పోయే వరకు వేయించి పక్కన పెట్టాలిఇప్పుడు బాణలిలో టేబుల్ స్పూన్ నూనె వేసి తామర తూడులను గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలిఒక పాత్రలో చీజ్ తురుము, ఉడికించిన బంగాళదుంప, ఉప్పు, యాలకుల పొడి, జాపత్రి పొడి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, శనగపిండి, కుంకుమ పువ్వు కలిపిన నీటిని వేయాలి. బంగాళదుంప, కోవా, ఉల్లిపాయ ముక్కలు వేయాలితామర తూడు ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పై దినుసులున్న పాత్రలో వేసి అన్నీ సమంగా కలిసేటట్లు ముద్దగా కలపాలిఈ మిశ్రమాన్ని పెద్ద గోళీలుగా చేసుకుని అరచేతిలో వేసి పొడవుగా చేయాలి. మనకు కావల్సిన సైజులో కబాబ్లుగా కట్ చేసుకోవాలిబాదం పలుకులను ఒక ప్లేట్లో వేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక్కో కబాబ్ని బాదం పలుకులలో అద్ది పక్కన పెట్టాలి.ఇలా అంతటినీ చేసుకోవాలి.. పైన తామర తూడు వేయించిన బాణలిలోనే మరో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఒక్కో కబాబ్ని పెట్టి మీడియం కంటే తక్కువ మంట మీద ఉంచాలి.కొంతసేపటికి కబాబ్ ఒకవైపు కాలి గోధుమరంగులోకి మారుతుంది.అప్పుడు జాగ్రత్తగా తిప్పుతూ అన్నివైపులా దోరగా కాలేవరకు ఉంచాలి. ఇలాగే అన్నింటినీ కాల్చుకోవాలి. వీటికి పుదీన చట్నీ మంచి కాంబినేషన్.పనీర్ బాదమ్ టిక్కీ..కావలసినవి..పనీర్– 2 కప్పులు;బాదం పలుకులు – అర కప్పు;ఉడికించిన బంగాళదుంప – అర కప్పు;నూనె– 2 టేబుల్ స్పూన్లు;జీలకర్ర– టీ స్పూన్;పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్లు;అల్లం తరుగు – 2 టీ స్పూన్లు;పసుపు – అర టీ స్పూన్;మిరపొ్పడి– అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు;కార్న్ఫ్లోర్ – టేబుల్ స్పూన్;ఉప్పు – టీ స్పూన్తయారీ..పనీర్ను ఒక పాత్రలో వేసి పొడిపొడిగా చిదమాలి. ఇందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి సమంగా కలిసేటట్లు చిదమాలిబాణలిలో టీ స్పూన్ నూనె వేసి అందులో జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసి వేగిన తర్వాత పైన పనీర్, బంగాళదుంప మిశ్రమంలో వేయాలి.అదే బాణలిలో మిగిలిన నూనెలో మిరపొ్పడి, ఉప్పు వేసి వేడెక్కిన తర్వాత స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత అందులో మొక్కజొన్న పిండి, కొత్తిమీర తరుగు వేయాలి.ఇందులో పనీర్ మిశ్రమాన్ని వేసి కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని పెద్ద గోళీలుగా చేసుకుని అరచేతిలో వేసి ఫొటోలో కనిపిస్తున్నట్లు ప్యాటీలుగా వత్తాలి.వత్తిన ప్యాటీలను బాదం పలుకులున్న ప్లేట్లో అద్దాలిఅడుగు వెడల్పుగా ఉన్న బాణలిలో మిగిలిన నూనె వేడి చేసి ఒక్కో ప్యాటీని ఒకదాని పక్కన ఒకటిగా అమర్చాలి.ఒకవైపు కాలిన తర్వాత జాగ్రత్తగా తిరగేసి రెండవ వైపు కూడా కాలనివ్వాలి.లోపల చక్కగా ఉడికి పైన కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.వీటిని వేడిగా ఉండగానే కెచప్ లేదా సాస్తో తింటే చాలా రుచిగా ఉంటాయి.ఇవి చదవండి: International Day of Yoga 2024: యోగా... మరింత సౌకర్యంగా! -
డ్రై ఫ్రూట్స్ ఎన్ని... ఎలా... తింటున్నారు?
డ్రై ఫ్రూట్స్! ఇవి ఆరోగ్యానికి మంచిదని చాలా మంది సూచిస్తారు.ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఇవన్నీ ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి కావాల్సినవి. వీటన్నింటిని ΄పోందడానికి డ్రై ఫ్రూట్స్ ఒక ఆప్షన్. అయితే ఇవి ఆరోగ్యానికి మంచిది కదా అని.. ఇష్టమొచ్చినట్టు తినకూడదు. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. అయితే ఎంత పరిమాణంలో తినాలి. ఏ డ్రై ఫ్రూట్స్ ఎన్ని తింటే ఆరోగ్యకరం? డ్రైఫ్రూట్స్ను తినడానికి ముందు ఎందుకు నానబెట్టాలి? లాభాలేంటి..?డ్రై ఫ్రూట్స్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే.. షుగర్స్, క్యాలరీ లు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని 20 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. అలాగే నేరుగా తినడం కూడా మంచిది కాదు. కాబట్టి.. డ్రై ఫ్రూట్స్ తినే విధానం, ఏ నట్స్ ఎంత పరిమాణంలో తినాలో తెలుసుకుందాం.బాదం... బాదం పప్పులో మోనో శ్యాచురేటెడ్ యాసిడ్స్ ఎక్కువ గా ఉంటాయి. ఇవి గుండెకి, మెదడుకి, చర్మ ఆరోగ్యానికి మంచిది. అలాగే ఆల్మండ్స్ లో విటమిన్ ఈ, మెగ్నీషియం, ΄పోటాషియం ఉంటాయి. ఇవి రక్తప్రరణ సక్రమంగా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహకరిస్తాయి. రోజుకి 4 నుంచి 7 బాదం పప్పులు తినడం వల్ల అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ΄పోందవచ్చు.వాల్ నట్స్... వాల్ నట్స్ పైన ఉండే పెంకు తీయగానే.. ఉండే పప్పు అంత రుచిగా ఉండదు. కానీ.. 90 శాతం యాంటీ ఆక్సిడెంట్స్, ఫెనోలిక్ యాసిడ్స్, టాన్నిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఈ స్కిన్ లోనే ఉంటాయట. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా సమర్థంగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని రోజుకి 3 నుంచి 4 తీసుకోవచ్చు.కర్జూరం... ఇందులో ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫ్రాక్టోజ్ ఇందులో రిచ్ గా ఉంటుంది. మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండటానికి కర్జూరం ఉపయోగపడుతుంది. వీటిని రోజుకి మీడియం సైజులో ఉండే 1 లేదా రెండు తీసుకుంటే సరి΄ోతతుంది.పిస్తా... పిస్తా వెల్ నెస్ కి చిహ్నం. ఇవి బలానికి, ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో మిగిలిన డ్రైఫ్రూట్స్ లో కంటే ్రపోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు.జీడిపప్పు... కమ్మటి రుచిలో ఉండే జీడిపప్పును రెగ్యులర్ గా తినడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజుకు నాలుగు జీడిపప్పులను తినడం ఆరోగ్యకరమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.ఎండుద్రాక్ష... ఎండుద్రాక్షను ఎక్కువ మోతాదులో తిన్నా ఎలాంటి సమస్యా లేదు. ఇందులో విటమిన్ బి, ΄పోటాషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకి గుప్పెడు ఎండుద్రాక్ష తినవచ్చు. అయితే మహిళలు రోజుకి ఒకటిన్నర కప్పు, మగవాళ్లు 2 కప్పుల ఎండుద్రాక్ష తినాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఖర్జూరతో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా!
నిగనిగ మెరిసిపోతూ.. ఖర్జూరాలు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. రుచికి కూడా బాగుంటాయి. అందుకే అందరూ వీటిని అందరూ ఇష్టపడతారు. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో వీటిని ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. రోజూ కొద్ది మొత్తంలో ఖర్జూరం పండ్లు తింటే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం..ఖర్జూరాల వల్ల కలిగే ప్రయోజనాలను పొందాలంటే... కనీసం ఒక వారం లేదా పదిరోజులపాటు క్రమం తప్పకుండా నాలుగయిదు తినాలి. డయాబెటిస్ ఉన్న వారు మాత్రం వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి.గుండెకు బలం..ఖర్జూరాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ధమని కణాల నుంచి కొలెస్ట్రాల్ను తొలగించడంలో సహాయపడతాయి. ఖర్జూరం తినటం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెపోటు, హైపర్టెన్షన్ , స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఖర్జూలంలో ΄÷టాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హార్ట్ బీట్, బీపీని నార్మల్గా ఉంచుతుంది.కండరాలు బలంగా ఉంటాయి..ఖర్జూరంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. ఖర్జూరంలో ఉండే. ΄÷టాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, కాపర్, మాంగనీస్ వంటివి ఎముకలు గుల్లబారటం, కీళ్లు అరగటం వంటి ఎముకల సమస్యలు రాకుండా రక్షిస్తాయి.సంతానోత్పత్తి సామర్థ్యం..మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెంచడానికి ఖర్జూరాలు సహాయపడతాయి. ఖర్జూరం తింటే స్పెర్మ్ నాణ్యత పెరుగుతుంది.మెరుగైన జ్ఞాపకశక్తి..ఖర్జూరాల్లో ఉండే విటమిన్ ‘బి6’ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెదడును ఒత్తిడి, వాపు నుంచి రక్షించవచ్చు. ఖర్జూరాలను రోజూ తింటే.. నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే.. న్యూరో డీ జెనరేటివ్ వ్యాధి నుంచి దూరంగా ఉండొచ్చు. ఖర్జూరం తింటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఖర్జూరంలో ఉండే ఫైబర్ కడుపులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ను అడ్డుకుంటాయి. పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది.జీర్ణ సమస్యలు దూరం..ఖర్జూరంలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేసి, మలబద్ధకం దరి చేరదు.ఇవి చదవండి: కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఇలా చేయండి! -
Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
ప్రస్తుత ఆహార అలవాట్లు, జీవన శైలి మార్పులు కారణంగా చాలామంది చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో అధిక బరువు. అధిక బరువు అనేక ఆరోగ్యసమస్యలకు మూలం. అందుకే బరువు తగ్గించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇవ్నీ కావు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చేస్తున్నారు. వీటితోపాటు కొన్ని రకాల సింపుల్ చిట్కాలతో వెయిట్ లాస్ కావచ్చు అని నిపుణులు అంటున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి. ఎండు ద్రాక్ష నీరు ఎంతో మేలు చేస్తుంది. ఈ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఎండు ద్రాక్షను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని, ద్రాక్షతోకలిపి తీసుకోవడంతో వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నమ్ముతారు. ప్రధానంగా ఎండుద్రాక్షలో ఉండే పోషకాలు , యాంటీఆక్సిడెంట్లు అందుతాయి.ఎండు ద్రాక్ష వాటర్, ప్రయోజనాలు శరీరంలోని మలినాలు బయటకు వెళ్తాయి. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. శరీరం ఫ్రీ రాడికల్సతో పోరాడే శక్తినిస్తుంది. బరువు పెరగడం, నిద్రలేమి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.మెరుగైన జీర్ణక్రియ: ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సాధారణ ప్రేగు కదలికలను మెరుగుపర్చి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. తద్వారా జీర్ణ ప్రక్రియలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి: విటమిన్ సీ, బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఫినాలిక్ సమ్మేళనాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. రక్తపోటు,గుండెపోటు: బీపీ, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎండుద్రాక్షలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది సోడియం స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ను తగ్గించే డైటరీ ఫైబర్ పాలీఫెనాల్స్ను కూడా ఇందులో లభిస్తాయి.చర్మ,నోటి సమస్యలు : ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. రక్తహీనతకు ఇది చాలామంది. ఎండుద్రాక్షలో కాల్షియం, బోరాన్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చర్మ ఆరోగ్యానికి కీలకమైన విటమమిన్ ఏ, ఈ ఇందులో లభిస్తాయి. రెగ్యులర్గా వీటిని తీసుకుంటే ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. వృద్ధాప్య ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ కావిటీస్ , చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే నోటి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి.ఈ ఎండు ద్రాక్ష నీటిలో పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఉన్న ద్రవాల స్థాయిలను అందుపులో ఉంచుతాయి. ముఖ్యంగా ఈ వేసవిలో చెమట కారణంగా కోల్పోయిన శక్తి తిరిగి లభిస్తుంది. -
వీకెండ్ స్పెషల్: ఈ టిప్స్ ఎపుడైనా ట్రై చేశారా..?
వీకెండ్ వచ్చిందంటే లేట్గా నిద్ర లేవడం, లేజీగా ఉండటం, ఎక్కువ ఫుడ్ లాగించేయడంకాకుండా, రోజంతా సరదాగా సంతోషంగా గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. స్నేహితులు, సన్నిహితులతో ఉత్సాహంగా గడపాలి. దీంతో రాబోయే వారమంతా చురుగ్గా ఉండే శక్తి వస్తుంది. పచ్చని ప్రకృతిలో ఎంజాయ్ చేయాలి. కాలుష్యానికి తావులేని పార్క్లకు వెళితే, మంచి ఆక్సిజన్ లభిస్తుంది. మన చుట్టుపక్కల చిన్నపిల్లలతో గడిపినా, కలిసి పెయింటింగ్ వేసినా, ఆటలాడినా భలే ఉత్సాహం వస్తుంది. అలాగే రాబోయే వారమంతా యాక్టివ్గా ఉండేలా కొన్ని ఆరోగ్య చిట్కాలు ఇవిగో.. ♦ వేసవి కాలం వచ్చేసింది.. ఫ్రిజ్ నీరు కంటే కుండ వాటర్ బెటర్. మరీ ఎక్కువ చల్లని పదార్థాలు, డ్రింక్స్కు దూరంగా ఉండాలి. ♦ పిల్లలకు ఇంట్లో తయారు చేసిన ఐస్ క్రీ పెడితేమంచిది. ఎక్కువ నీళ్లు తాగేలా జాగ్రత్త పడాలి. ♦ నడక, యోగా లాంటి వ్యాయామాలు, అలాగే బ్మాడ్మింటన్ లాంటి ఔటర్ గేమ్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ♦ రోజూ నిద్రపోయే ముందు నానబెట్టిన బాదం, డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటే ఆరోగ్యకరమైన కొవ్వులు ,ఇతర పోషకాలు లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్లో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ , డైటరీ ఫైబర్ కూడా అధికం. ♦ కొన్ని ఎండు ద్రాక్ష కొన్ని ధనియాలు నీరు పోసి మరిగించి చల్లార్చి ఆ కషాయాన్ని ఉదయం, సాయంకాలం తాగాలి. కీళ్ల వాపులు తగ్గి పోతాయి. ♦ రొటీన్కి టీ కి బదులుగా అల్లం టీ తాగితే మంచి ఉత్సాహం వస్తుంది. అలాగే దంత సమస్యలు ఉన్నవారు.. నోటి దుర్వాసనతో బాధపడుతున్న వారు.. అల్లాన్ని ఎండబెట్టి పొడి చేసి దాంట్లో కాస్త నీరు కలిపి పేస్ట్లా చేసి దానితో పళ్లు తోముకుంటే చిగుళ్లు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. ♦ సీజనల్ వ్యాధులను తగ్గించడంలో అల్లం బాగా పనిచేస్తుంది. కాస్త అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని పూటకు ఒక కప్పు మోతాదులో తాగుతుంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ♦ అల్లం , కీరా, నిమ్మకాయ రసం కలిపిన మిశ్రమాన్ని ప్రతి రోజు ఉదయం పూట తాగాలి. నొప్పులు, వాపులు తగ్గి పోతాయి. -
వావ్!..వాట్ ఏ డ్రై ఫ్రూట్ జ్యువెలరీ!
ఎన్నో రకాల జ్యువెలరీలు చూసుంటారు. ఇలాంటి జ్యువెలరీని చూసే అవకాశమే లేదు. ముఖ్యంగా మహిళలు అందరికంటే విక్షణమైన డిజైన్తో కూడిన నగలు ధరించేందుకే ఇష్టపడతారు. చాక్లెట్లు, దీపావళి టపాసులతోటి విభిన్న అలంకరణాలు చూసుంటారు. ఇలా డ్రైఫ్రూట్స్తో జ్యువెలరీని మాత్రం చూసి ఉండరు. కానీ ఇది చూడటానికి అద్బుతంః అన్నంత రేంజ్లో ఉన్నాయి ఆ డ్రైఫ్రూట్ నగలు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో మహిళ ధరించిన నగల్లో.. చెవికి పెట్టుకునే జుంకాల దగ్గర నుంచి వడ్డాణం వరకు అన్నింటిలో బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ కనిపిస్తాయి. జ్యువెలరీ కూడా భలే వెరైటీగా చూడముచ్చటగా ఉంది. కాకపోతే అమ్మో డ్రై ప్రూట్స్ని అలా వేస్ట్ అయిపోతున్నాయే! అని చివుక్కుమంటోంది మనసు. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు కూడా ఇలానే ఫీల్ అవ్వతూ.. సదరు మహిళపై మండిపడుతున్నారు. ఆహారాన్ని వృధా చేస్తోదంటూ తిట్టిపోశారు. అయినా ఈ రోజుల్లో డ్రై ఫ్రూట్స్ బంగారంతో సమానం అలాంటి వాటిని ఇలా అలంకరణకు ఉపయోగిస్తావా? అంటూ తిట్ట దండకం మొదటు పెట్టారు. ఏదీఏమైనా వెరైటీగా ఉండేందుకుక ట్రై చేయడంలో తప్పులేదు. అయితే అది సమంజసంగా ఉందా లేదా అనేది కూడా చెక్ చేయాలి లేదంటే విమర్శల పాలవ్వక తప్పదు. View this post on Instagram A post shared by Vasudhaa Makeover (@vasudhaa_makeover) (చదవండి: పెళ్లిని ఇలా పర్వెక్ట్గా ప్లాన్తో చేస్తే..సూపర్గా ఉంటుంది!) -
వెయిట్ లాస్ జర్నీలో.. ఈ డ్రైఫ్రూట్స్ పని అద్భుతం!
బరువు తగ్గడం అనే ప్రక్రియలో జీవనశైలి మార్పులు, ఆహార అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే చాలామంది వెయిట్లాస్ కోసం నట్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి డైట్లో చేర్చుకుంటారు. కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల పోషకాలు అందడంతోపాటు బరువు తగ్గే పనిని వేగవంతం చేస్తాయి. అవేంటో ఒకసారి చూద్దాం! తక్కువ క్యాలరీలు.. ఎక్కువ పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్ బెస్ట్ ఆప్షన్ వీటిలో అన్నిరకాల విటమిన్లు, మినరల్స్ , ఫైబర్, ఇతర సూక్ష్మపోషకాలుంటాయి. క్రమం తప్పకుండా నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ను తినడం ద్వారా ఈజీగా బరువు తగ్గుతారు. అలాగే ఎముకల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, జుట్టు, చర్మం ఆరోగ్యంతోపాటు, కేన్సర్ నివారణకు కూడా ఉపయోగపడతాయి.క్యాన్సర్ నివారణకు కూడా ఉపయోగపడతాయి. మెదడును పనితీరును మెరుగుపరుస్తాయి. బాదం: ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. రోజూ ఓ పది బాదం పప్పులను ఆరు గంటల సేపు నానబెట్టిన తరువాత తీసుకుంటే శరీరానికి కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్ లభిస్తాయి. ఎండు ద్రాక్ష: ఇది తక్షణ శక్తినివ్వడంతో పాటు ఆకలి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మెదడు ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. అంజీర్: ఎండిన అంజీరలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది డైజెషన్ను ఇంప్రూవ్ చేస్తుంది. గుండె జబ్బులకు, క్యాన్సర్కు, వెయిట్ లాస్కు ఇది బాగా పనిచేస్తుంది.ముఖ్యంగా ఆడవారికి చాలామంచిది. ఖర్జూరం(మితంగా): వీటినే డేట్స్ అంటారు. వీటి ద్వారా తక్షణ శక్తి వస్తుంది. అన్ని రకాల మినరల్స్ ఇందులో లభిస్తాయి. ఎండు ఖర్జూరంతో రక్తపోటు తగ్గుతుంది. అంతేకాదు, మలబద్దకానికి మంచి మందు. వీటిని నానబెట్టి తింటే ఇంకా మంచిది. ఆప్రికాట్లు కూడా బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆకలిని నియంత్రించి అతిగా తినడానికి చెక్ చెబుతాయి. చియాసీడ్స్: వీటినీ నానబెట్టి తినాలి. ఇవి నీళ్లో వేయగానే చక్కగా ఉబ్బి, ట్రాన్సపరెంట్గా మారిపోతాయి. ఇవి జీర్ణక్రియకు సాయపడతాయి. బరువు తగ్గించే విషయంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం. గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తాయి. సీవీడ్ స్నాక్స్: తక్కువ కేలరీలు ,పోషకాలు అధికంగా ఉంటాయి, సీవీడ్ స్నాక్స్ అవసరమైన ఖనిజాలను అందించడంతోపాటు, బరువు నిర్వహణకు బాగా హెల్ప్ చేస్తాయి. జీడిపప్పు (మితంగా): జీడిపప్పులో ప్రొటీన్స్ ఎక్కువ. మినరల్స్, విటమిన్స్తో నిండిన జీడిపప్పు ఇమ్యూనిటీని పెంచుతుంది. బీపీని తగ్గిస్తుంది. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అందుకే వెయిట్ లాస్ కోసం ఇది కూడా మంచి ఆప్షన్. నోట్: ఏదైనా మితంగా తినడం ఉత్తమం. అందులోనూ షుగర్,బీపీ ఇతర జబ్బులు ఉన్న వాళ్లు వెయిట్ తగ్గాలి అనుకున్నపుడు నిపుణుల సలహా మేరకు కేలరీలు, పోషకాలను అంచనా వేసుకుని మన డైట్లో చేర్చుకుంటే ఫలితం అద్బుతంగా ఉంటుంది. -
దీపావళికి దీన్ని గిఫ్ట్గా ఇస్తున్నారా? అలాంటివి కొనేటప్పుడూ..
ఇటీవల కాలంలో ఇతరులకు గిఫ్ట్ ఇవ్వడంలో ట్రెండ్ మారిందనే చెప్పాలి. చాలా విభిన్నంగా ఇవ్వాలనే చూస్తున్నారు. అందులోనూ ఆరోగ్య దృష్ట్యా మంచివి ఖరీదైన వాటిని ఇచ్చేందుకు చూస్తుంటారు కొందరూ. ఇటీవల పండుగకి స్వీట్స్ బదులు ఆరోగ్యానికి ఎంతో మంచివైన డ్రై ఫ్రూట్స్ వంటివి గిఫ్ట్గా ఇచ్చే ట్రెండ్ బాగా వచ్చింది. ఈసారి దీపావళి పండుగకి డ్రై ఫ్రూట్స్ని గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే కచ్చితంగా ఇవి గుర్తుంచుకోండి. డ్రైఫ్రూట్స్ను కొనేటప్పుడు కచ్చితంగా ఇవి గమనించాలి.. నట్స్ రంగు ఎలా ఉందో చూడాలి. సహజంగా ఉండాల్సిన దానికంటే మరింత ముదురు రంగులో ఉంటే అవి పాడైనట్టు. రుచిగా కూడా ఉండవు కాబట్టి కొనకపోవడమే మంచిది. వీలైతే ఒకటి రెండు నట్స్ను నీటిలో వేసి, పదినిమిషాల తరువాత కొరికి చూడాలి. నానిన తరువాత కూడా గట్టిగా ఉంటే అవి చాలా పాతవి. ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి తీసుకోకూడదు. చాలా షాపులు తినడానికి శాంపిల్స్ ఇవ్వవు. ఇలాంటప్పుడు ఆ డ్రైఫ్రూట్స్ను తక్కువ పరిమాణంలో కొనుక్కుని పరిశీలించాలి నట్స్ని వాసన చూడాలి. ఘాటైన వాసన వస్తే అవి చాలా పాతవి. వీటికి కొద్దిగా తేమ తగిలితే వెంటనే బూజు పట్టి త్వరగా పాడవుతాయి. ఇవి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు నట్స్ ప్యాకెట్ మీద ఎఫ్ఎస్ఎస్ఏఐ ముద్ర, నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో చూడాలి. ఎప్పుడు ప్యాకింగ్ అయ్యింది? ఎప్పటిలోగా తినాలో సూచించే డేట్స్ను సరిగా చూసుకోవాలి. ఈ డేట్స్ ముద్రించని ప్యాకెట్స్ను కొనకూడదు ప్యాకెట్ మీద ముద్రించిన సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలి. ప్రిజర్వేటివ్లు కలిపిన నట్స్ను కొనకపోవడమే మంచిది. (చదవండి: ఆపరేషన్ బ్యూటీ! అందం కోసం తీసుకునే ఇంజక్షన్లు మంచివేనా!) -
చాక్లెట్ ట్రఫెల్స్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
చాక్లెట్ ట్రఫెల్స్ తయారీకి కావల్సినవి: బాదం పప్పు – కప్పు; ఎండు కొబ్బరి తురుము – ముప్పావు కప్పు; కర్జూరాలు – పదిహేను; బాదం బటర్ – ము΄్పావు కప్పు; డార్క్ చాక్లెట్ ముక్కలు – పావు కప్పు; కొబ్బరి నూనె – అరటీస్పూను; బరకగా దంచిన పిస్తా పలుకులు – పావు కప్పు; బాదం పలుకులు – పావు కప్పు; నల్లని పొరతీసి తురిమిన ఎండు కొబ్బరి – పావు కప్పు; స్ట్రాబెరీ పొడి – పావు కప్పు. తయారీ విధానమిలా: ►కర్జూరాలను ఒకసారి కడిగి పదిహేను నిమిషాల పాటు వేడినీటిలో నానబెట్టుకోవాలి ∙బాదం పప్పు, ఎండు కొబ్బరి తురుముని దోరగా వేయించి మిక్సీజార్లో వేయాలి. ► నానబెట్టిన కర్జూరాలను నీరు లేకుండా తీసి మిక్సీజార్లో వేసి గ్రైండ్ చేయాలి ∙సగం నలిగిన మిశ్రమంలో బాదం బటర్ వేసి గ్రైండ్ చేయాలి. ► అవసరాన్ని బట్టి రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙ఇప్పుడు గ్రైండ్ అయిన మిశ్రమాన్ని బయటకు తీసిన నచ్చిన పరిమాణంలో లడ్డుల్లా చుట్టుకోవాలి. ► బాదం, పిస్తా పలుకులను పొడిచేసి పక్కన పెట్టుకోవాలి ∙చాక్లెట్ముక్కల్లో కొబ్బరి నూనెవేసి అవెన్లో 45 సెకన్లు ఉంచాలి. చాక్లెట్ కరిగిన తరువాత పక్కన పెట్టుకోవాలి. ► ఇప్పుడు ముందుగా చేసుకున్న లడ్డులాను ఒక్కోక్కటి ఎండుకొబ్బరి తురుము, పిస్తా, బాదం, స్ట్రాబెరీ పొడులు, చాక్లెట్ మిశ్రమంలో ముంచి అద్దుకుంటే ట్రఫెల్స్ రెడీ. రిఫ్రిజిరేటర్లో నిల్వచేసుకుంటే ఇవి పదిరోజుల పాటు తాజాగా ఉంటాయి. -
డ్రైఫ్రూట్స్తో ఎనర్జీ బాల్స్.. బోలెడు పోషకాలు
ఎనర్జీ బాల్స్ తయారీకి కావల్సినవి: రాగిపిండి – అరకప్పు మునగ ఆకు పొడి – ముప్పావు కప్పు ఎండిన అంజీర పండ్లు – ఆరు కర్జూరం – పన్నెండు కిస్మిస్ –పావు కప్పు, జీడిపప్పు – పావు కప్పు బాదం – పావు కప్పు, పిస్తా – పావు కప్పు ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు,బెల్లం పొడి – పావు కప్పు యాలకుల పొడి – టీస్పూను; నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు; ఎండు కొబ్బరి పొడి – రెండు టేబుల్ స్పూన్లు (గార్నిష్కు సరిపడా). ఎనర్జీ బాల్స్ తయారీ విధానమిలా.. అంజీర పండ్లు, కర్జూరం విత్తనాలు తీసేసి వేడినీటిలో పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి. బాణలిలో టేబుల్ స్పూను నెయ్యి వేసి రాగిపిండి వేసి వేయించాలి. రాగిపిండి మంచి వాసన వస్తున్నప్పుడు మునగాకు పొడి వేసి ఐదు నిమిషాలు వేయించి తీసేయాలి. ఇదే బాణలిలో డ్రైఫ్రూట్స్ అన్నింటిని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. చివరగా ఎండు కొబ్బరిని కూడా వేయించుకోవాలి. వేయించిన డ్రైఫ్రూట్స్ను మిక్సీజార్లో వేసి పొడిచేసుకోవాలి. నానబెట్టిన కర్జూరం, అంజీరను పేస్టులా గ్రైండ్ చేయాలి. బాణలిలో మరో టేబుల్ స్పూను నెయ్యివేసి అంజీర పేస్టుని వేసి సన్నని మంట మీద నెయ్యి పైకి తేలేంత వరకు వేయించాలి. వేగాక డ్రైఫ్రూట్స్ పొడి, రాగి, మునగాకు, యాలక్కాయ బెల్లం పొడులు వేసి కలపాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత పిండి మిశ్రమాన్ని లడ్డులా చుట్టుకుని కొబ్బరి పొడిలో అద్దుకుంటే ఎనర్జీ బాల్స్ రెడీ. గాలిచొరబడని డబ్బాలో నిల్వచేస్తే పదిహేను రోజులపాటు తాజాగా ఉంటాయి. -
అంజీర సాగు..లాభాల బాటలో అనంతపురం రైతు
-
డ్రై ఫ్రూట్స్ తరచుగా తినే అలవాటుందా? అయితే అంతే సంగతులు!
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. దీన్ని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలా అని వాటిని అతిగా తీసుకుంటే శరీరంపై తీవ్ర దుష్ప్రభావాలు చూపించడమే గాక లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు న్యూట్రీషియన్లు. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువు, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, అతిసారం లేదా అపానవాయువుని పెంచడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇవి ఎలాంటి దుష్ప్రభావాలు చూపిస్తాయో ఒక్కసారి చూద్దాం. అలెర్జీ: డ్రై ఫ్రూట్స్ కొన్నిసార్లు అలెర్జీకి కారణమవుతాయి. దీందో శరీరంపై దురద, ఊపిరాడకపోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలర్జీలు ఉన్నవారు డ్రైఫ్రూట్స్ తినకపోవడమే మంచిదని ఆహార నిపుణలు చెబుతున్నారు. బరువు పెరుగుట: కొన్ని డ్రై ఫ్రూట్స్లో మంచి కొలస్ట్రాల్ ఉంటుంది. దీంతో వీటిని ఎక్కువగా తీసుకుంటే తొందరగా బరువు పెరిగి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓ మోస్తారుగా బ్యాలెన్స్డ్గా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కిడ్నీ స్టోన్: జీడిపప్పుడ, బాదంపప్పు, వేరశేనగలో ఆక్సలేట్లు ఉంటాయి. దీంతో కిడ్నీలో రాళ్ల సమస్య పెరగుతుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు: జీర్ణశక్తి సరిగా లేనివారు ఇవి తీసుకుంటే లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. జీడిపప్పులో ఉండే ఫ్యాట్, ఫైబరే దీనికి కారణం. (చదవండి: స్నానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు.. నీరు లేకుండా స్నానం చేయొచ్చని తెలుసా!) -
రాత్రిపూట అంజీర్ తింటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
అంజీర్.. వీటినే అత్తిపండ్లు(ఫిగ్స్)అని అంటారు. డైఫ్రూట్స్ రూపంలోనూ లభించే అంజీర్ మార్కెట్లో విరివిగా లభిస్తుంటాయి. తినడానికి రుచిగా ఉండడమే కాదు.. అద్భుతమైన పోషకాలు కూడా వీటిలో ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం,ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలను బలపరిచేందుకు సహాయపడతాయి. ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అంజీర్లో ఉన్న విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-కె వల్ల ఆరోగ్యంతో పాటు అందమూ మెరుగవుతుంది. అధిక రక్తపోటు, అధిక చక్కెర ఉన్నవారు అంజీర్ పండ్లను తీసుకుంటే చాలా మంచిది. ఆయుర్వేదంలో అంజీర్ పండ్లకు ప్రత్యేకమైన స్థానముంది. వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. వంద గ్రాముల అంజీర్లో ఉండే పోషకాలివే క్యాలరీలు – 74 ప్రొటీన్లు – 0.75 గ్రాములు కొవ్వులు – 0.30 గ్రాములు పిండి పదార్థాలు – 19.8 గ్రాములు పీచు పదార్థం (ఫైబర్) – 1 గ్రా. కాపర్ – రోజులో కావల్సిన దానిలో 3 శాతం మెగ్నిషియం – రోజులో కావల్సిన దానిలో 2 శాతం పొటాషియం – 2 శాతం విటమిన్ బి6 – 8.60 శాతం విటమిన్ సి – 2 శాతం గుండె ఆరోగ్యానికి.. అంజీర్ పండ్లు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇవి గుండె సమస్యలను అదుపులో ఉంచుతుంది. అందువల్ల కొలెస్ట్రాల్ తగ్గాలనుకునేవారు ఈ పండ్లను ప్రతిరోజూ తీసుకోవాలి. అధిక బరువు నియంత్రణలో.. బరువు తగ్గడంలో అంజీర్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇందులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సమయం వరకు ఆకలి వేయదు. ఫలితంగా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీని ద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. మలబద్దకం దూరం.. అంజీర్ పండ్లలో అధిక స్థాయిలో పీచు పదార్థం కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా మలబద్దకం సమస్య తగ్గుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు ప్రతిరోజూ తమ ఆహారంలో రెండు అంజీరాలను తప్పకుండా తీసుకోవాలి. షుగర్ పేషెంట్స్ తినొచ్చా? చక్కెరను అదుపులో ఉంచడంలో అంజీర్ పండ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు అంజీర్ పండ్లను రోజూ తింటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అంజీర్లో ఉండే ఫైబర్, విటమిన్-E, ఫ్యాటీ యాసిడ్లు వంటి పోషకాలు చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. డయాబెటిస్ ఉన్న వారు డ్రై అంజీర్ పండ్లను తినరాదు. ఇవి పండ్లతో పోలిస్తే 2-3 శాతం వరకు అధికంగా చక్కెర కలిగి ఉంటుంది. రక్తహీనత నుంచి దూరం రక్తహీనత నేడు చాలామందిని బాధిస్తుంది. అలాంటి వారు నిత్యం కనీసం రెండు అంజీర్ పండ్లను తినాలి. వీటివల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు బాగా పెరిగి రక్తం బాగా వృద్ధి చెందుతుంది. దీనిలోని పొటిషియం, ఐరన్ వల్ల రక్తహీనత దూరమవుతుంది. నిద్రలేమి నుంచి ఉపశమనం అంజీర్ పండ్లను రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో మూడు- నాలుగు నానబెట్టి మరుసటి రోజు పరగడుపునే తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. లేదా రాత్రి పూట అంజీర్ పండ్లను నేరుగా తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగితే నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుందట. -
గుంటూరు కారం కథ తెలుసా అసలు.?
బంగాళాదుంప , మొక్క జొన్న , వేరుశెనగ , పైన్ ఆపిల్ , నారింజ , పొగాకు , బాదం , బెండకాయ , సపోటా , బొప్పాయి , మిరపకాయ , జీడిపప్పు, .. ఇవి లేని జీవితాన్ని ఊహించండి ! అంటే … మసాలా దోస , మిర్చి బజ్జి , వేరుశనిగ చట్నీ , బెండకాయ పులుసు , జీడీ పప్పు ఉప్మా … ఇవన్నీ ఉండవన్న మాటే కదా ! “ అహో ఆంధ్ర భోజా ! .. శ్రీకృష్ణ దేవా రాయా ! శిలలపై శిల్పాలు చెక్కించావు .. కానీ గుంటూరు కారం రుచి చూడలేదు .. ఉడిపి మసాలా దోస రుచి తెలియదు. ఏంటి ప్రభు? అని టైం మెషిన్ లో వెనక్కు వెళ్లి అడిగితే .." నేనేమి చేసేది మా కాలానికి ఈ పంటలు లేవు అంటాడు. ఎందుకంటే ఈ పంటలను , అటు పై పోర్చుగీస్ వారు, లాటినా అమెరికా దేశాలనుంచి సేకరించి మన దేశంలో ప్రవేశపెట్టారు. మరి ఆ రోజుల్లో మనాళ్ళు మసాలా దినుసులుగా ఏమి వాడేవారు? అల్లం , పసుపు , ఆవాలు , దాల్చిన చెక్క , ఏలకులు , లవంగాలు, ధనియాలు, ఇంగువ , మెంతులు ... ఇవన్నీ మన పంటలే . వీటిని మసాలా దినుసులుగా వాడేవారు ! అదండీ గుంటూరు కారం కథ ! కేవలం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర . నల్ల మిరియాలు అనాదిగా ఇండియా లో పండించేవారు. దాన్ని పోర్చుగీస్ వారు ఎగుమతి చేసుకున్నారు. ఇప్పుడు రాజ్యమేలుతున్న ఎన్నో వంటకాలు మనవి కాదు, కానీ తొందరగానే మన జీవితాలను పెనవేసుకుపోయాయి. మార్పు సహజం .. కానీ కొత్తొక వింత కాదు . పాతొక రోత కాదు. ఏది మంచి ? ఏది చెడు అని- నా వక్తిగత అభిప్రాయం కాకుండా సామజిక శాస్త్రం - మానవ శాస్త్రం - జీవ శాస్త్రం కోణం నుంచి శాస్త్రీయ విశ్లేషణలు చేస్తున్నా. వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక శాస్త్ర విశ్లేషకులు, ప్రముఖ విద్యావేత్త -
ఆమె నిన్నటి మేటి హీరోయిన్.. కళ్ళతోనే నటించేది! ఇప్పుడు ఎందుకిలా?
ఆమె నిన్నటి మేటి హీరోయిన్. కళ్ళతోనే నటించేది. ఆకాశంలో ఆశల హరివిల్లు కట్టుకొంది. ఇప్పుడు మెమరీ లాస్తో బాధపడుతోంది. స్టెప్స్ మర్చిపోయింది. డాన్స్కు దూరం అయ్యింది. డాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచన కూడా విరమించుకొంది. డైలాగులు కూడా గుర్తు చేసుకోలేక సీరియల్స్కు కూడా దూరం అయ్యింది. తన భర్త మరణించిన తరువాత ఇలా మెమరీ లాస్ అయ్యిందని అనుకొంటోంది. ఏది.. ఏ కారణం చేత జరిగిందో తెలుసుకోలేని దౌర్భాగ్యపు సమాజంలో మనం ఉన్నాము. మీకందరికీ పరిచయం ఉన్న నలుగురు మహిళా టీవీ యాంకర్లకు ఇదే సమస్య ఎదురయ్యింది. ఏం చేయాలి? 1 . రోజుకు నాలుగైదు వాల్ నట్స్ తినాలి. అదే విధంగా పిస్తా, బాదం చెరి నాలుగైదు తినాలి . 2 . మాంసాహారులైతే సముద్రపు చేపలు అప్పుడప్పుడు తినాలి. 3 . కార్బ్స్ తగ్గించాలి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు మూడు నాలుగు లీటర్ల మంచి నీరు తాగాలి. 4 . పనిలో ఎప్పుడు బిజీగా ఉండేలా చూసుకోవాలి. వీలైనంత ఎక్కువగా మాట్లాడాలి. ఇది అన్నిటికంటే ముఖ్యం. ఒంటరి జీవనం కూడదు. 5 . అవిశె, గుమ్మడి ... గింజెలు, ఆకుకూరలు, కాయగూరలు, తాజా పళ్ళు తరచూ తీసుకోవాలి . 6 . బాగా నిద్ర పోవాలి. లేదంటే డెమెన్షియా! ఇలా చేస్తే ఆమెకైనా, మెమరీ లాస్ అవుతున్న ఎవరికైనా తిరిగీ కొత్తగా రెక్కలు వస్తాయి. లేదంటే డెమెన్షియా. అది ఏ స్థాయిలో ఉంటుందంటే తన పేరు, ఇంటి అడ్రెస్స్ మరచిపోయి ఏదో ఆలోచనలతో ఇంటినుంచి వెళ్లి పోయి తిరిగి రాలేక ఫుట్ పాత్ ల పై అనాథలా బతికి.... తనువు చాల్సించాల్సి వస్తుంది. భయంకరం... చెబితే కొంతమంది ఏడుస్తారు కానీ అండీ ... 78 ఏళ్ళు వచ్చినా ఆరోగ్యం గా ఒక బృందావనం అంటూ జీవిస్తోన్న ఆ మధుర గాయని ఉన్నట్టుండి కళ్ళుతిరిగి డ్రెస్సింగ్ టేబుల్ పై పడి మరణించడానికి కారణం ఏంటని ఎవరైనా చెప్పారా ? రక్తంలో క్లోట్స్ ఉంటే అది మెదడు పోటుకు దారి తీయొచ్చు. ముందుగా కళ్ళు తిరుగుతాయి. మమూలుగా కళ్ళు తిరగడానికి ఇలా రక్తంలో క్లోట్స్ వల్ల వచ్చిన దానికి తేడా ఉంటుంది. అందుకే ఆమె అంత బలంగా పడిపోయింది. రక్తంలో క్లోట్స్ ఎందుకు వచ్చాయి? వయసు అయిపొయింది .. వాతావరణ మార్పులు .. చెన్నై చలి .. చెన్నై ఎండలు .. నీరు తాగడం వల్ల.. ఉపవాసం ఉండడం వల్ల .. జింకు పోవడం వల్ల .. చెన్నై పక్కనే సముద్రం ఉండడం వల్ల ..... ఇలా సోది కారణాలు ఎన్నైనా చెబుతారు జనాలు. అది అంతే ! -వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, పాఠశాల విద్య పరిశోధకులు (వ్యాసకర్త వ్యక్తిగతానుభవసారం ఇచ్చిన కథనం) - ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను మొమరీ లాస్తో బాధపడుతున్నట్లు సీనియర్ నటి భానుప్రియ చెప్పిన విషయం తెలిసిందే! -
Blood Count: టాబ్లెట్లు అక్కర్లేదు! రోజుకు కప్పు బూడిద గుమ్మడి రసం తాగితే
కొంతమంది కొన్ని విటమిన్ల లోపం వల్ల రక్తలేమితో బాధపడుతుంటారు. రక్తలేమి వల్ల నీరసం, శ్వాస ఆడకపోవడం, కళ్లు తిరగటం, నిస్సత్తువగా ఉండటంతోపాటు అనేకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వృద్ధులకు, గర్భిణులకు రక్తహీనత సమస్య ఎక్కువగా ఎదురయ్యే సమస్య. సాధారణంగా రక్తలేమికి కొన్ని విటమిన్ టాబ్లెట్లు వాడమని వైద్యులు సూచిస్తుంటారు. అయితే అలా మందులు వాడటం వల్ల కొన్ని దుష్ఫలితాలు తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల సహజంగానే రక్తం పట్టే ఆహారం తీసుకోమని కూడా చెబుతారు. అలాంటి వాటిలో కొన్ని చిట్కాలు మీకోసం... ►సపోటా జ్యూస్ తాగటం లేదా సపోటా పండ్లు తినడం వల్ల శరీరానికి తొందరగా రక్తం పడుతుంది. ►దానిమ్మ రసం తాగడం, దానిమ్మ పండ్లు తినడం కూడా చాలా మంచిది. బూడిద గుమ్మడి రసం తాగితే.. ►బూడిద గుమ్మడి శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు కప్పు బూడిద గుమ్మడి రసాన్ని తాగుతూ ఉంటే శరీరంలో మంచి రక్తం వృద్ధి అవుతుంది. బూడిద గుమ్మడి కాయ గుజ్జు తీసి దానిని దళసరి గుడ్డలో వేసి బాగా పిండితే వచ్చే రసాన్ని కప్పులో పోసుకుని తాగాలి. నెలలోనే రక్తం వృద్ధి! ►కిస్మిస్ లేదా ద్రాక్షపండ్లు బాగా తింటూ ఉంటే రక్తం వృద్ధి అవుతుంది. పచ్చివి దొరకనప్పుడు ఎండువి తినవచ్చు. రాత్రులు గుప్పెడు ఎండు ద్రాక్ష పళ్ళు గ్లాసెడు నీటిలో నానవేసి ఉదయం వాటిని బాగా పిసికి ఆ పిప్పిని పారవేసి ఆ నీటిని తాగాలి. అలా రోజూ తాగుతుంటే ఒక నెలలోనే రక్తం వృద్ధి అవుతుంది. లేత కొబ్బరి తింటే కూడా! ►ఎండు ఖర్జూరాలతో కూడా పైన చెప్పిన విధంగా చేసి ఆ నీటిని తాగుతుంటే రక్తం వృద్ధి అవుతుంది. ►రాత్రిపూట గుప్పెడు శనగలు నీటిలో నానవేసి ఉదయం తింటూ ఉంటే రక్తం వృద్ధి అయ్యి శరీరం పుష్టిగా అవుతుంది. వ్యాయామం చేసేవారికి ఈ విధానం చాలా మంచిది. ►అంజీర్ పండ్లు తింటున్నా రక్తం వృద్ధి అవుతుంది. ►లేత కొబ్బరి నీరు, లేత కొబ్బరి తింటూ ఉంటే శరీరంలో రక్తం బాగా వృద్ధి అవుతుంది. నోట్: వీటిలో మీ శరీర తత్త్వాన్ని, మీకున్న ఇతర ఆరోగ్య సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకుని మీకు ఏవి బాగా సరిపడతాయో, ఏది సులభమో వాటిని అనుసరిస్తే సరి. ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. చదవండి: తులసి ఆకులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఉదయం ఖాళీ కడుపుతో నమిలితే.. ప్లాస్టిక్ కవర్లలో వేడి వేడి ఛాయ్! పొట్ట కింద ‘టైర్లు’!.. అలారం మోగుతోంది.. వినబడుతోందా? -
Health: ప్రతి రోజూ ఓట్స్ తింటున్నారా? గుండెకు సంబంధించి ఈ విషయాలు తెలిస్తే
Heart Healthy Foods- Diet Tips In Telugu: అప్పటిదాకా నచ్చిన రుచులన్నీ కడుపునిండా తిన్న వారికి ఏ డయాబెటిస్సో, గుండెజబ్బో, కొలెస్టరాలో వచ్చిందంటే పాపం! వారి బాధ చెప్పనలవి కాదు. ఎందుకంటే అటు నోరుకట్టుకోనూలేరు, ఇటు ఇష్టం వచ్చినవన్నీ తినడానికీ లేదు. అలాగని పూర్తిగా చప్పిడి తిండే తినమంటే మరీ నీరసించి పోతారు. ఇంతకీ మీరు చెప్పేదేమిటీ అనుకుంటున్నారా? కాస్త ఓపిక పట్టండి మరి! నోటికి రుచికరంగా ఉంటూనే, గుండెకు బలం చేకూరేలా, ఆరోగ్యానికి ఏమాత్రం హాని కలగకుండా కాపాడుకునేలా కొన్ని రకాలైన ఆహార పదార్థాలను సూచిస్తున్నారు వైద్యులూ, పోషకాహారనిపుణులూ. అవేమిటో తెలుసుకుందామా? ఆకుపచ్చని కూరలు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలన్నీ గుండెకు బలాన్నిఇస్తాయి. ముఖ్యంగా బచ్చలి కూర గుండెకు చాలా మంచిది. బచ్చలికూరతో పప్పు వండుకోవచ్చు. సెనగపప్పు వేసి పప్పు కూర చేసుకోవచ్చు. పచ్చడి కూడా చేసుకోవచ్చు. అయితే నూనె, ఉప్పు, కారం పరిమితంగానే వాడాలి. టొమాటల్లోని లైకోపిన్ వల్ల టొమాటోలలో ఉండే లైకోపిన్ అనే పోషకం గుండెకు చాలా మంచిది. టొమాటోలలో రక్తపోటును నియంత్రించే పొటాషియం కూడా ఉంటుంది. కాబట్టి పుల్లపుల్లగా, తియ తియ్యగా ఉండే టొమాటోలను విరివిగా తినచ్చు. చేపలు తింటే చేపలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. సాల్మన్ ఫిష్ లాంటివి మరింత ఆరోగ్యకరం. గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్నూ తగ్గించే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో ఎక్కువ. అందుకే వారానికి కనీసం రెండు సార్లయినా చేపలు తింటే మేలు అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది. స్ట్రా బెర్రీలతో స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక అధ్యయనంలో తేలింది. డ్రై ఫ్రూట్స్ కిస్మిస్, బాదం, ఎండు ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ గుప్పెడు తింటే గుండెకు చాలా మంచిది. అలాగే ద్రాక్షపండ్లు కూడా గుండెకు సత్తువనిస్తాయి. అయితే ద్రాక్షను రసం తీసి కాకుండా నేరుగా తినడం మేలు. ఎందుకంటే ద్రాక్షరసంలో చక్కెర కలుపుకోవడం అనివార్యం కదా! డార్క్ చాక్లెట్లు తింటే డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు. కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన డార్క్ చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు తగ్గడంతో పాటు రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీ బార్ల వల్ల మాత్రం గుండెకు మేలు చేకూరకపోగా ముప్పే. అలాగని డార్క్ చాక్లెట్లను కూడా మితిమీరి తినకూడదు. గుండెకు మేలు చేసే 5 ఆహార పదార్థాలు వేరుశెనగ గుండెకు వేరుశెనగ ఎంతో మంచిది. మంచి కొవ్వును కలిగి ఉన్న వేరుశెనగలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయి. అవి గుండె భేషుగ్గా ఉండటానికి సహకరిస్తాయి. అలాగే వేరుశెనగలో ఉండే ఖనిజాలు గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడతాయి. నారింజ గుండె ఆరోగ్యానికి నారింజ పండు చాలా మంచిది. పొటాషియం అధికంగా ఉండే నారింజలో ఎలక్ట్రోలైట్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లు కూడా గుండె జబ్బులను నివారించడంలో తోడ్పడతాయి. అవకాడో విటమిన్–ఈతో పాటు అనేక ఇతర పోషకాలు అవకాడోలో సమృద్ధిగా లభిస్తాయి. దీనికితోడు మోనో అన్ –శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఈ పండు గుండెకు చాలా మంచిది. అవకాడోను రోజూ తినడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండెపోటుతో సహా గుండె సంబంధిత వ్యాధులు నుంచి బయటపడవచ్చు. వాల్నట్స్ రోజూ క్రమం తప్పకుండా కాసిని వాల్నట్స్ను తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్కు చెక్ పెట్టొచ్చు. అలాగే గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే వాల్నట్స్ హృదయ సంబంధిత వ్యాధులను నివారించడంతోపాటు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఓట్స్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఓట్స్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఓట్స్లో ఒమేగా 3 ఆమ్లాలు కూడా ఉన్నాయి, ఇవి గుండెకు చాలా ప్రయోజనకరం. ప్రతీ రోజూ ఓట్స్ తినడం గుండెకు ఆరోగ్యాన్నిస్తుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సరైన పరిష్కారం పొందవచ్చు. చదవండి: Lady Finger Health Benefits: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా మెదడు.. Cinnamon Health Benefits: దాల్చిన చెక్క పొడి పాలల్లో వేసుకుని తాగుతున్నారా? అయితే Health Tips: రక్తం పీల్చే జలగలతో వైద్యం! పైల్స్, షుగర్ పేషంట్లకు ఉపశమనం.. ఇంకా.. -
Recipe: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి
శీతాకాలం పగలు తక్కువ.. రాత్రి ఎక్కువ. రాత్రి వేళల్లో చలి ఎక్కువ. భోజనం బరువుగా ఉండకూడదు. అలాగని తక్కువ తింటే పోషకాలందవు. కొద్దిగా తిన్నా సరే... అది సమతులంగా ఉండాలి. ఆహారాన్ని దేహం వెచ్చగా ఒంటబట్టించుకోవాలి. అందుకే... ఇది ట్రై చేసి చూడండి. పాంజిరి కావలసినవి: ►సన్నగా తరిగిన బాదం – కప్పు ►యాలకుల పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు ►దోస గింజలు – పావు కప్పు ►తర్బూజ గింజలు – పావు కప్పు ►పిస్తా పప్పు – పావు కప్పు (తరగాలి) ►వాము – అర టీ స్పూన్ ►ఎండు కొబ్బరి తురుము – కప్పు ►అల్లం తరుగు లేదా శొంఠి పొడి– 2 టేబుల్ స్పూన్లు ►జీడిపప్పు– కప్పు (చిన్న పలుకులు) ►తామరగింజలు – కప్పు ►వాల్నట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు ►కిస్మిస్ – 3 టేబుల్ స్పూన్లు ►నెయ్యి– 3 టేబుల్ స్పూన్లు. ప్రధానమైన పదార్థాలు: ►సూజీ రవ్వ – కప్పు ►నెయ్యి – ఒకటిన్నర కప్పు ►గోధుమ పిండి – రెండున్నర కప్పులు ►బెల్లం పొడి – ఒకటిన్నర కప్పు. తయారీ: ►మందంగా ఉన్న బాణలిలో నెయ్యి వేడి చేసి తామర గింజలు (మఖానియా) వేయించాలి. ►వాటిని తీసి పక్కన పెట్టుకుని అదే బాణలిలో జీడిపప్పు, వాల్నట్, బాదం, తర్బూజ, దోసగింజలు, పిస్తా, కొబ్బరి తురుము, కిస్మిస్ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ►ఇందులో అల్లం తరుగు లేదా శొంఠి, వాము, యాలకుల పొడి కలిపి పక్కన ఉంచాలి. ►ఇప్పుడు ప్రధాన దినుసులను వేయించాలి. ►మరొక బాణలిలో నెయ్యి వేడి చేసి గోధుమ పిండి వేసి సన్నమంట మీద వేయించాలి. ►గోధుమ పిండి వేగి మంచి వాసన వస్తున్న సమయంలో సూజీ రవ్వ వేసి కలుపుతూ వేయించాలి. ►రవ్వ కూడా దోరగా వేగిన తర్వాత బెల్లం పొడి వేసి కలపాలి. ►ఇందులో ముందుగా వేయించి సిద్ధంగా ఉంచిన గింజల మిశ్రమాన్ని వేసి కలిపితే పాంజిరి రెడీ. ►దీనిని కప్పులో వేసుకుని పొడిగా స్పూన్తో తినవచ్చు. పాలిచ్చే తల్లులకు ప్రయోజనకరం ►పిల్లలు కింద పోసుకోకుండా మొత్తం తినాలంటే మరికొంత నెయ్యి వేసుకుని లడ్డు చేయాలి. ►ఇది ఉత్తరభారతదేశంలో బాలింతకు తప్పనిసరిగా పెట్టే స్వీట్. ►పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం. చదవండి: Kismis Doughnuts: మైదాపిండి, పంచదార.. కిస్మిస్ డోనట్స్ తయారు చేసుకోండిలా! Amla Candy: ఆరోగ్య లాభాలెన్నో.. ఇంట్లోనే ఇలా ఆమ్ల క్యాండీ తయారీ Nuvvula Annam: చిన్నా పెద్దా లొట్టలేసుకుంటూ తినేలా నువ్వుల అన్నం తయారీ ఇలా -
Health Tips: ఇవి తరచూ తింటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది! అంతేకాదు..
పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, దానిమ్మ పండ్లు, డ్రై ఫ్రూట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం.. పాలకూర, బచ్చలి కూర తింటే ►పాలకూర, బచ్చలికూర లాంటి ఆకు కూరలు మీ కంటి చూపును మెరుగుపరుస్తాయి. ►పాలకూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ►ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలపై పోరాడటంతో ప్రముఖపాత్ర పోషిస్తాయి. ►ఆకుకూరలు.. మాక్యులర్ డీజెనరేషన్, కంటిశుక్లం లాంటి సమస్యల నుంచి రక్షించి కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతాయి. దానిమ్మ ►దానిమ్మ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ►రక్తహీనతతో బాధపడేవారిని దానిమ్మ తినమని సలహా ఇస్తారు. ►ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తికి పెంచుతాయి. ►అంతేనా దానిమ్మని రెగ్యులర్గా తింటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది. ►కాబట్టి ప్లేట్లెట్స్ని పెంచుకునేందుకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. డ్రై ఫ్రూట్స్ ►డ్రై ఫ్రూట్స్... శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. ►దీంతోపాటు కంటిచూపును మెరుగు పర్చి నేత్ర సంబంధ సమస్యలను దూరం చేస్తాయి. ►వీటి లో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. చదవండి: Antibiotic Overuse: యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా..? పొంచి ఉన్న మరో ముప్పు..! -
డ్రై ఫ్రూట్స్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారా? జర జాగ్రత్త!
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని చాలా మంది సూచిస్తారు. ప్రొటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఇవన్నీ ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి కావాల్సినవి. వీటన్నింటిని పొందడానికి డ్రై ఫ్రూట్స్ ఒక ఆప్షన్. అయితే ఇవి రుచిగా ఉంటాయి కదా... ఆరోగ్యానికి మంచిది కదా అని.. ఇష్టమొచ్చినట్టు తినకూడదు. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. అయితే ఎంత పరిమాణంలో తినాలి. ఏ డ్రై ఫ్రూట్స్ ఎన్ని తింటే ఆరోగ్యకరం? డ్రైఫ్రూట్స్ తినడం వల్ల కలిగే లాభాలేంటి..? అనే విషయాలను తెలుసుకుందాం... డ్రై ఫ్రూట్స్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే.. షుగర్స్, క్యాలరీ లు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని 20 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. అలాగే నేరుగా తినడం కూడా మంచిది కాదు. కాబట్టి.. డ్రై ఫ్రూట్స్ తినే విధానం, ఏ నట్స్ ఎంత పరిమాణంలో తినాలి అనేది ఇప్పుడు చూద్దాం.. బాదం బాదం పప్పులో మోనో శ్యాచురేటెడ్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకి, మెదడుకి, చర్మ ఆరోగ్యానికి మంచిది. అలాగే ఆల్మండ్స్లో విటమిన్ ఈ, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి రక్తప్రసరణ సక్రమంగా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహకరిస్తాయి. రోజుకి 4 నుంచి 7 బాదం పప్పు తినడం వల్ల వీటిని నుంచి అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వాల్ నట్స్ వాల్ నట్స్ పైన ఉండే పెంకు తీయగానే.. ఉండే పప్పు అంత రుచిగా ఉండదు. కానీ.. 90 శాతం యాంటీ ఆక్సిడెంట్స్, ఫెనోలిక్ యాసిడ్స్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఈ స్కిన్లోనే ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా సమర్థంగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని రోజుకి 3 నుంచి 4 తీసుకోవచ్చు. కర్జూరం ఇందులో ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫ్రాక్టోజ్ ఇందులో రిచ్గా ఉంటుంది. మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండటానికి కర్జూరం ఉపయోగపడుతుంది. వీటిని రోజుకి మీడియం సైజులో ఉండే 1 లేదా రెండు తీసుకుంటే సరిపోతుంది. పిస్తా పిస్తా వెల్నెస్ కి చిహ్నం. ఇవి బలానికి, ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో మిగిలిన డ్రైఫ్రూట్స్ లో కంటే ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. జీడిపప్పు కమ్మటి రుచిలో ఉండే జీడిపప్పును రెగ్యులర్ గా తినడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజుకు నాలుగు జీడిపప్పులను తినడం ఆరోగ్యకరమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. ఎండుద్రాక్ష తియ తియ్యగా పుల్లపుల్లగా ఉండే ఎండుద్రాక్షను ఎక్కువ మోతాదులో తిన్నా ఎలాంటి సమస్యా లేదు. ఇందులో విటమిన్ బి, పొటాషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకి గుప్పెడు ఎండుద్రాక్ష తినవచ్చు. 50 ఎండుద్రాక్షలు తినవచ్చు. అయితే మహిళలు రోజుకి ఒకటిన్నర కప్పు, మగవాళ్లు 2 కప్పుల ఎండుద్రాక్ష తినాలని నిపుణులు సూచిస్తున్నారు. -
Fish Haleem: ఇంట్లోనే ఫిష్ హలీమ్ తయారీ ఇలా!
Recipes In Telugu- బలవర్థక ఆహారంలో హలీమ్ కూడా ఒకటి. అనేక పోషకాలతో నిండిన హలీమ్ను చాలా మంది ఇష్టంగా తింటారు. మరి మసాలా ఘాటు, ఢ్రై ఫ్రూట్స్తో ఘుమఘులాడే ఫిష్ హలీమ్ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం! ఫిష్ హలీమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చేప ముక్కలు – అరకేజీ, గోధుమ రవ్వ – కప్పు(రాత్రంతా నానబెట్టుకోవాలి), పచ్చిశనగపప్పు – పావు కప్పు (మూడుగంటలపాటు నానబెట్టుకోవాలి), పెసరపప్పు – పావు కప్పు (దోరగా వేయించి మూడు గంటలపాటు నానబెట్టుకోవాలి), మినపప్పు – పావు కప్పు (మూడు గంటపాటు నానబెట్టుకోవాలి), అల్లం పేస్టు – టేబుల్ స్పూను, వెల్లుల్లి పేస్టు – ముప్పావు టేబుల్ స్పూను, పచ్చిమిర్చి – రెండు, బిర్యానీ ఆకు – ఒకటి, ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరుక్కోవాలి) పెరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి – అరటేబుల్ స్పూను, గరం మసాలా – టేబుల్ స్పూను, మిరియాలపొడి – టేబుల్ స్పూను, వేయించిన జీలకర్ర పొడి – పావు టేబుల్ స్పూను, యాలకులు – రెండు, లవంగాలు – రెండు, దాల్చిన చెక్క – ఒకటి, ఉప్పు – రుచికి సరిపడా, నెయ్యి – అరకప్పు, నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు, సన్నని నిమ్మచెక్కలు – రెండు మూడు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, పుదీనా తరుగు – పావు కప్పు, వేయించిన జీడిపప్పు – టేబుల్ స్పూను. తయారీ: ►చేప ముక్కలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, అరటేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టులు, కారం వేసి కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి ∙నానబెట్టిన చేపల్లో ముక్కలు మునిగేన్ని నీళ్లు పోసి ఉడికించి దించేయాలి ∙ఉడికిన చేపముక్కలను ఖీమాలా రుబ్బుకోవాలి. ►పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాలను పేస్టుచేసుకోవాలి. ►కుకర్లో పప్పులన్నింటిని వేసి మెత్తగా ఉడికించి, రుబ్బుకోవాలి. ►ఇప్పుడు కుకర్ గిన్నెలో రాత్రంతా నానబెట్టుకున్న గోధుమరవ్వ, రబ్బుకున్న పప్పు మిశ్రమం, పెరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్టు, మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్టు, ►మిరియాలపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలాలో వేసి కలుపుకోవాలి. ►ఇప్పుడు మెత్తగా చేసి పెట్టుకున్న చేపమిశ్రమాన్నివేసి రెండు కప్పుల నీళ్లు పోసి అరగంటపాటు సన్నని మంటమీద ఉడికించాలి. ►మందపాటి పాత్రను స్టమీద పెట్టుకుని నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయను సన్నగా తరిగి వేయాలి. ►ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక తీసి, ఉడికిన చేప మిశ్రమంలో వేయాలి. నిమ్మరసం, కొత్తిమీర తరుగు, నెయ్యి, నిమ్మ చెక్కల, జీడిపప్పుతో గార్నిష్ చేస్తే ఫిష్ హలీమ్ రెడీ. చదవండి👉🏾Haleem Recipe In Telugu: రంజాన్ స్పెషల్.. ఎవరైనా సింపుల్గా చేసుకోగలిగే మటన్ హలీమ్ -
ఆల్ రౌండర్ ఆల్మండ్ ..ఈ విషయాలు తెలిస్తే..
-
Health Tips: ఉడికించిన శనగలు, బొబ్బర్లు తిన్నారంటే.. ఇక
టీనేజర్లు ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారు కాబట్టి రోజుకి కనీసం గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినేలా చూసుకోవాలి. ఉదయం, సాయంత్రం కలిపి కనీసం అర లీటరు పాలు తాగేలా చూసుకోవాలి. ఉడికించిన సెనగలు, బొబ్బర్లు ఎక్కువ సమయంపాటు శక్తినిస్తాయి. కాబట్టి బాస్కెట్బాల్, క్రికెట్లాంటి ఆటల్లో పాల్గొనే పిల్లలకు వీటిని స్నాక్స్గా ఇస్తూ ఉండాలి. ఫైబర్ ఉండే ఏ ఆహారమైనా బరువు తగ్గిస్తుంది. చిలగడదుంపను తింటే ఇక ఆకలి వెయ్యదు. చాలా సేపు అలాగే ఉంటుంది. కాబట్టి ఇంకేవీ తినబుద్ధి కాదు. ఫలితంగా బరువు తగ్గుతారు. ఉడకబెట్టి తింటే ఎక్కువ మేలుంటుంది. నారింజ, బత్తాయి వంటి నిమ్మజాతి పండ్లు తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సీ వల్ల ఫ్లూ, జలుబు, ఫీవర్ తగ్గుతుంది. రోజులో కనీసం అరగంట యోగా చేయడం మూలంగా, శరీరంలోని అనేక విషతుల్య మలినాలు తొలగుతాయి. ముఖ్యంగా ప్రాణాయామం, సూర్య నమస్కారాలు వంటి శ్వాస సంబంధిత ప్రక్రియలు ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని పెంచగలవు. యోగా ఊపిరితిత్తులను బలపరచడమే కాకుండా, వాటిని శుభ్రపరుస్తుంది. అంతేకాదు, ఒత్తిడికి కూడా దూరంగా ఉండవచ్చు. చదవండి: Sabja Seeds Health Tips: సబ్జా గింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? -
సిటీపై సీతమ్మ చిన్నచూపు .. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే!
సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ నగర ప్రజలను నిరాశపర్చింది. కరోనా నేపథ్యంలో మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి జనం ఇప్పటికే ఆర్థిక పరిస్థితులు బాగా లేక సతమతమవుతున్నారు. కేంద్ర బడ్జెట్పై గ్రేటర్ జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రత్యేకంగా వేతన జీవులకు ఎలాంటి ఊరట కల్పించలేదు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. ఈ బడ్జెట్తో ధరలు మరింత పెరుగుతాయని నగర వ్యాపారుల అంచనా. డ్రైఫ్రూట్స్పై తగ్గని జీఎస్టీ ఇప్పటీకే కరోనా ప్రభావంతో గ్రేటర్లోని అన్ని వర్గాల ప్రజలు ఇమ్యూనిటీ కోసం ఎక్కువగా డ్రైఫ్రూట్స్ వాడుతున్నారు. గతంలో పోలిస్తే కరోనాతో డ్రైఫ్రూట్స్ వాడకం దాదాపు 60 శాతం పెరిగింది. ఈ బడ్జెట్లో ఇప్పటికే డ్రైఫ్రూట్స్పై కొనసాగుతున్న 12 శాతం జీఎస్టీ నుంచి 5 శాతానికి కేంద్రం తగ్గిస్తుందని భావించారు. కానీ తగ్గించకపోవడంతో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. తగ్గేవి ఇవే.. వస్త్రాలు, తోలు వస్తువులు, చెప్పులు, స్టీల్ స్క్రాప్స్ చవక అవుతాయి. వ్యవసాయ పరికరాల ధరలు, మొబైల్ ఫోన్స్, మొబైల్ చార్జర్ల ధరలు దిగివస్తాయి. పెరిగేవి ఇవే.. మూలధన వస్తువులు, ముడి ఇంధనం, రోల్డ్ గోల్డ్ ఆభరణాల ధరలు మరింత పెరిగాయి. ప్లాస్టిక్ ఐటమ్స్, ఫర్టిలైజర్స్, ఐరన్, స్టీల్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్గానిక్ కెమికల్స్ ధరలు పెరగనున్నాయి. (చదవండి: సొంత వాహనాల్లోనూ మాస్క్ తప్పనిసరి.. లేకుంటే ఛలానా? అర్థం ఉందా?) -
సంక్రాంతి బరిలో తగ్గేదేలే...
సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్), ద్వారకాతిరుమల: సంక్రాంతి బరికి సై అంటూ పందెంకోళ్లు కాలు దువ్వుతున్నా యి. పండుగ దగ్గర పడుతున్న కొద్దీ సమరోత్సాహంతో కదం తొక్కు తున్నాయి. ప్రత్యేక శిక్షణ శిబిరాల్లో నిరంతర సాధనతో రాటుదేలుతూ ఈ సంక్రాంతికి నువ్వా నేనా అన్న రీతిలో సిద్ధమవుతున్నాయి. ఎలాగైనా పందెం కొట్టాలన్న కసితో పందెంరాయుళ్లు కూడా పందెం నీదా.. నాదా అంటూ ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. పందెంకోళ్ల వైభోగం చూసి ఒకపక్క జనం నోరెళ్లబెడుతుంటే.. మరోవైపు వాటి యజమానులు మాత్రం మురిసిపోతున్నారు. పందేల్లో పైచేయి కోసం తహతహలాడిపోతున్నారు. కోడి పందేలంటేనే గోదావరి జిల్లాలు.. ఇక భీమవరం, మెట్ట ప్రాంతాల్లో పండుగ మూడు రోజులు పందెం బరులు తిరునాళ్లను తలపిస్తాయి. భారీ ఎత్తున పందేలు నిర్వహిస్తారు. కోడి పందేలను వీక్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచే కాదు, దేశ విదేశాల నుంచి ఎన్నారైలు గోదావరి జిల్లాలకు తరలివస్తారు. పందేల్లో డబ్బు సంపాదించాలని కొందరు, తమ సత్తా చాటాలని మరికొందరు పుంజులను బరుల్లోకి దింపుతారు. ఈ ఏడాది కూడా పందేలు భారీ ఎత్తున నిర్వహించేందుకు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, గణపవరం, వీరవాసరం, ఐ.భీమవరం, ద్వారకాతిరుమల, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, ఉంగుటూరు, భీమడోలు తదితర ప్రాంతాల్లోని పందెంరాయుళ్లు సిద్ధమవుతున్నారు. పండుగకు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఏడాది ముందు నుంచే కసరత్తులు ఎలాగైనా పందెం కొట్టాలనే లక్ష్యంతో సరైన పుంజును బరిలోకి దింపేందుకు పందెంరాయుళ్లు వాటి శిక్షణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. పుంజును పోటీలకు సిద్ధం చేసేందుకు దాదాపు ఏడాది ముందు నుంచే కసరత్తు ప్రారంభిస్తారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పందెం కోళ్ల శిక్షణ, పోషణకు యజమానులు సమయాన్ని వెచ్చిస్తున్నారు. ముందుగా వాటి గొంతులో నీటిని పోసి, కపం పోయేలా కళ్లి కొట్టడం, నోట్లో నీరు పోసి ఊదడం, ఒంట్లో కొవ్వు కరిగించేందుకు పొయ్యిపై అట్లపెనం పెట్టి, దానిపై నీరు చల్లి, ఆ నీటిని గుడ్డతో కోడి శరీరానికి రాయడం వంటివి చేస్తారు. కత్తిపోట్లు తట్టుకోవడానికి, ఒళ్లు గట్టిపడడానికి పసుపు, పిప్పళ్లు, వట్టివేర్లు, ఉక్కిసాయిలం, జామాయిల్ సీస, కుంకుళ్లు తదితర 20 రకాల ఆకులతో మరగబెట్టిన నీటిని పోత పోస్తున్నారు. నీటిలో ఈదించడం, వాకింగ్ చేయించడం వంటివి చేస్తారు. పుంజు బరిలో దిగినప్పుడు ఆవేశ పడకుండా ఢీకొట్టేందుకు ఈత కొట్టిస్తామని యజమానులు చెబుతున్నారు. రూ. 15 వేల నుంచి రూ.లక్ష వరకూ ధర జిల్లాలో ఏటా సంక్రాంతికి పందెం పుంజుల అమ్మకాలపై సుమారు రూ.10 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. పుంజు ధర సుమారు రూ.15 వేల నుంచి సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. నెమలి, కాకి నెమలి, పచ్చకాకి, సేతువ, పర్ల, డేగ, నెమలి డేగ, రసంగి, మైలా, ఫింగలా, పెట్టమర్రు తదితర రకాల పుంజులు ఉన్నాయి. గత మూడేళ్లుగా పెరూవియన్ జాతిని అభివృద్ధి చేస్తున్నారు. పెరూ దేశానికి చెందిన ఈ జాతి పుంజులు అమిత వేగంతో దెబ్బలాడతాయి. అవి చిన్నగా ఉండటం వల్ల స్వదేశీ కోళ్లతో సంకరం చేసి, వాటి ద్వారా వచ్చిన సెకండ్, థర్డ్ జనరేషన్ బ్రీడ్లను ప్రస్తుతం పందాలకు సిద్ధం చేస్తున్నారు. బలానికి డ్రై ఫ్రూట్ లడ్డూ, మటన్ కైమా బలం కోసం బాదం, పిస్తా, డ్రైఫ్రూట్ లడ్డూ, మటన్ కైమా, కోడిగుడ్లు పెడుతున్నారు. ఆహారంగా సోళ్లు, గంట్లు, మెరికలు అందిస్తున్నారు. పుంజును తరచూ పశువైద్యులకు చూపించి వారి సలహాల మేరకు విటమిన్ మాత్రలు అందిస్తారు. పుంజు సామర్థ్యం తెలుసుకునేందుకు తరుచూ ట్రయల్ పందాలు వేస్తారు. పుంజులపై భారీగా పెట్టుబడులు పెట్టి సంక్రాంతి పండుగకు రాబట్టుకోవాలని కొందరు, ప్రతిష్ట కోసం మరికొందరు శ్రమిస్తున్నారు. పందానికి పుంజును సిద్ధం చేసేందుకు సుమారు ఏడాది పాటు పెంచుతారు. ఒక్కొక్క పుంజుపై రూ.10 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు చేస్తున్నారు. ముందుగా పుంజుల పెంపకం కోసం స్థలం లీజుకు తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఒక్కో శిబిరంలో 20 నుంచి 200 పుంజుల వరకు పెంచుతారు. వారి స్థాయిని బట్టి పుంజుల పెంపకం కోసం ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.కోటి వరకూ ఖర్చు చేస్తున్నారు. -
Health Tips: పిల్లలకు గుడ్డు, పెరుగు, బాదం, వాల్నట్స్ ఎక్కువగా తినిపిస్తున్నారా..
Immunity Booster Foods For Kids: పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేలా సరైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ముఖ్యంగా కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలంటే... గుడ్డు కోడిగుడ్డులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి. కండరాలు, చర్మం, గుండె ఆరోగ్యానికి గుడ్డు మంచిది. పిల్లల ఎదుగుదలకు అవసరమైన విటమిన్ ఎ, బి2 (రైబోఫ్లేవిన్) కోడిగుడ్డులో లభిస్తాయి. ఆకుకూరలు ఆకుకూరలు, మునగకాడలు, కొత్తిమీర, పాలకూర వంటివి ఎక్కువగా పెట్టాలి. వీటిలో ఫైబర్తోపాటు ఐరన్, జింక్, మినరల్స్ లభిస్తాయి. పెరుగు పెరుగులో ప్రోబయోటిక్స్, విటమిన్ బి12 లభిస్తాయి. ఇది పొట్టలో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేలా ఫ్రూట్ యోగర్ట్, వెజిటబుల్స్ రైతా, బూందీ రైతా రూపంలో ఇవ్వొచ్చు. పసుపు పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. పిల్లలకు రోజూ ఇచ్చే ఆహారంలో పసుపును చేర్చడం వల్ల ఆస్తమా, అలర్జీకి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పాలల్లో పసుపు వేసి తాగించడం అలవాటు చేయవచ్చు. డ్రైఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్నట్స్, అప్రికాట్స్ వంటివి ఎక్కువగా తినిపించడం వల్ల మెదడు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభించడంతో పాటు పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. స్వీట్స్ వద్దు పిల్లలకు స్వీట్స్, పంచదార ఎక్కువగా ఉండే ఇతర పదార్థాలైన ఫ్రూట్జ్యూస్లు, చాక్లెట్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్ను ఎక్కువగా తినిపించకూడదు. ఇవి ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. సరిపడా నిద్ర ముఖ్యంగా పిల్లలు రోజూ తగినంత నిద్రపోయేలా చూడాలి. ఉదయం ఒక గంటసేపైనా ఎండలో ఆడుకునేలా ప్రోత్సహించాలి. చదవండి: Health Tips: షుగర్, రేచీకటి ఉన్నవాళ్లు.. దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను తింటే... -
జీడిపప్పు, బాదం పప్పు, వాల్ నట్స్ రోజూ తింటే
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఐరన్ ఒక ముఖ్యమైన అంశం. ఐరన్ లోపం వల్ల శరీరంలో రక్తహీనత వస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ చాలా అవసరం. వాస్తవానికి, హిమోగ్లోబిన్ రక్త కణాలలో ఉండే ఐరన్ అధికంగా ఉండే ప్రోటీన్, ఇది శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ను అందించడానికి పనిచేస్తుంది. ఈ ప్రక్రియకు అంతరాయం ఏర్పడితే, చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది సజావుగా పనిచేయాలంటే, ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం, ఐరన్ అధికంగా ఉండే పదార్థాలను ఆహారం లో చేర్చడం చాలా ముఖ్యం. నాన్–వెజ్, సీఫుడ్, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ హిమోగ్లోబిన్ పెంచడానికి మంచి వనరులు. అవి మీ శరీరంలోని ఐరన్ లోపాన్ని పూరిస్తాయి. శరీరంలో హిమోగ్లోబిన్ వేగంగా పెరిగే డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం.. ఐరన్ అధికంగా ఉండే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు: ఐరన్ అధికంగా ఉంటుంది. మీరు రోజూ కొన్ని జీడిపప్పులను తీసుకుంటే, అది శరీరంలో 1.89 మి.గ్రా ఐరన్ను సరఫరా చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, స్నాక్స్ తినాలని అనిపించినప్పుడల్లా, మీరు కొన్ని జీడిపప్పు తినాలి. బాదం పప్పు రోజూ పొద్దున్నే నానబెట్టిన బాదంపప్పును తీసుకుంటే, అది మీ శరీరంలో రక్తం లేకపోవడాన్ని నయం చేస్తుంది. కొన్ని బాదంపప్పులో 1.05 మి.గ్రా ఐరన్ ఉంటుంది, ఇది ఒక రోజులో శరీర అవసరాన్ని తీర్చగలదు. అందువల్ల, మీ ఆహారంలో బాదంపప్పును చేర్చండి. వాల్ నట్స్: మామూలు గా మెదడుకు పదును పెట్టడానికి అక్రోట్లను తినమని సలహా ఇస్తారు, అయితే ఇది హిమోగ్లోబిన్ లోపాన్ని కూడా తీర్చగలదు. రోజూ కొన్ని అక్రోట్లను తీసుకుంటే, 0.82 మి.గ్రా ఐరన్ శరీరానికి అందుతుంది. పిస్తా సాధారణంగా పిసా ్తపప్పులను స్వీట్ల రుచి, అందాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు, కాని ఇది ఐరన్తో సమృద్ధిగా ఉందని మీకు తెలియజేయండి, శరీరంలో ఐరన్ కొరత ఉన్నప్పుడు సులభంగా సరఫరా చేయగలదు. మీరు రోజూ కొన్ని పిస్తాపప్పులు తింటుంటే, శరీరానికి 1.11 మి.గ్రా ఐరన్ లభిస్తుంది. -
Health Tips: రోజూ నిమ్మకాయ పులిహోర తింటున్నారా! అయితే..
These Amazing Foods In Your Diet Help Fight Deficiency Of Anemia: భారతీయ మహిళను వేధిస్తున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య ఎనీమియా. రక్తహీనతను అనారోగ్యంగా పరిగణించకుండా అజాగ్రత్తగా రోజులు గడిపేస్తుంటారు కూడా. నిజానికి ఇది అనేక రకాలుగా ప్రాణాపాయానికి కారణమవుతుందని గమనించాలి. ఎప్పుడూ అలసటగా అనిపించడం, చర్మం నిర్జీవంగా, తెల్లగా పాలిపోవడం, జుట్టు విపరీతంగా రాలిపోవడం, నిస్సత్తువ, గుండె వేగం ఉన్నట్లుండి పెరిగిపోవడం, శ్వాస దీర్ఘంగా తీసుకోలేకపోవడం, దేని మీదా ఆసక్తి లేకుండా నిరాసక్తంగా ఉండడం... ఇవన్నీ రక్తహీనత కారణంగా కనిపించే ప్రధాన లక్షణాలు. రక్తహీనత ఉన్నప్పుడు దేహంలో వ్యాధి నిరోధక శక్తి క్షీణించి తరచుగా అంటువ్యాధులు దాడి చేస్తుంటాయి. రక్తహీనత అంటే రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం. ఐరన్లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఐరన్ సమృద్ధిగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. ►‘సి’ విటమిన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ►నిమ్మ, నారింజ, బత్తాయి రసాలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ►రోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగాలి. నిమ్మకాయ పులిహోర వంటి వంటకాలను డైలీ మెనూలో చేర్చుకోవాలి. ►సీ విటమిన్ తగినంత లేకపోతే ఆహారంలో తీసుకున్న ఐరన్ను దేహం గ్రహించలేదు. కాబట్టి ఆకు కూరల్లో నిమ్మరసం కలుపుకుని తినడం మంచిది. ►రక్తహీనతతోపాటు కఫం తో కూడిన దగ్గు కూడా ఉంటే రోజూ ఉదయం సాయంత్రం కప్పు పెరుగును టీ స్పూన్ స్వచ్ఛమైన పసుపుతో కలిపి తీసుకోవాలి. ►దానిమ్మ, బీట్రూట్లు రక్తవృద్ధితోపాటు రక్తశుద్ధిని కూడా చేస్తాయి. వీటిని అలాగే తినడం లేదా రసం తాగడం వల్ల ఓ వారంలోనే మంచి ఫలితాలు కలుగుతాయి. ►నువ్వులను ఏదో ఒక రూపంలో రోజూ తీసుకోవాలి. ►నువ్వులను రెండు–మూడు గంటల సేపు నానబెట్టి మెత్తగా పేస్ట్ చేసుకుని అందులో తేనె కలుపుకుని తినవచ్చు. ►నువ్వులు– బెల్లంతో చేసిన లడ్డు తినవచ్చు. నువ్వుల పొడి చేసుకుని కూరల్లో, అన్నంలో కలుపుకోవచ్చు. ►రోజూ గుప్పెడు ఎండుద్రాక్ష, రెండు ఎండు ఖర్జూరాలు తింటే చాలు. రక్తహీనత నుంచి సులువుగా బయటపడవచ్చు. -
Winter: నువ్వుండలు, ఎండిన ఫలాలు.. పిల్లలకు ఇవి తినిపిస్తే
Winter Season: Avoid Giving These Foods To Kids What To Eat What Not Telugu: పిల్లలకు ఈ సీజన్లో ఇవ్వాల్సిన ఆహారంపై కూడా దృష్టిపెట్టాలి. ఉప్పు, పులుపు, మసాలాలు, కారాలను గణనీయంగా తగ్గిస్తూ, పోషకవిలువలను సమృద్ధిగా ఉండే ఆహారం ఇవ్వాలి. ►ముఖ్యంగా పీచుపదార్థాలు అధికంగా ఉండే శాకాహారం, ఆకుకూరలు, తాజాఫలాలు, ఎండిన ఫలాలు ప్రతినిత్యం వారికి తినిపించాలి. ►నూనెలను మరిగించడం ద్వారా తయారు చేసే వంటకాలను దూరం చేయాలి. ►ఐస్క్రీమ్స్, కూల్డ్రింక్స్, చాక్లెట్లు, పిజ్జాల వంటి పదార్థాలకు బదులుగా ప్రకృతి సిద్ధమైన ఆహారాలను అలవాటు చేయడం మంచిది. ►ఉదాహరణకు కొబ్బరినీళ్లు, చెరకురసం, వెజిటబుల్ జ్యూసులు, ఖర్జూరం, పాలు, పెరుగు వంటివి. మొత్తంమీద రోజూ 3 లీటర్ల వరకు ద్రవపదార్థాలు తాగాలి. ►ప్రధానంగా నీరు, మజ్జిగ, బార్లీ మొదలైనవి. ►పిల్లలకు క్యాల్షియమ్ సమృద్ధిగా లభించాలంటే ప్రతిరోజూ ఉదయం అర చెంచా, సాయంత్రం అర చెంచా నువ్వులను నమిలి తినేలా అలవాటు చేయాలి. లేదంటే నువ్వుండలు తిన్నా మంచిదే. ►అలాగే మొలకెత్తే దినుసులను తినిపించడం అలవాటు చేయాలి. చదవండి: Betel Leaves: తమలపాకులు నములుతున్నారా.. అయితే మీరు... -
నోరూరించే రుచులు.. కిస్మిస్–అంజీరా బర్ఫీ, సందేష్ తయారీ ఇలా..
స్వీట్స్ అంటే నాలుక కోసుకునేవారు ఈ కొత్త రుచులను కూడా ప్రయత్నించండి. కిస్మిస్–అంజీరా బర్ఫీ సందేష్ కావల్సిన పదార్ధాలు అంజీరా – 4 (నానబెట్టి, ముక్కలు కట్ చేసుకుని, గుజ్జులా మిక్సీ పట్టుకోవాలి) కిస్మిస్ – పావు కప్పు (నానబెట్టి, మిక్సీ పట్టుకుని, గుజ్జు చేసుకోవాలి) కొబ్బరి పాలు – 4 టేబుల్ స్పూన్లు తేనె – 2 టేబుల్ స్పూన్లు నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు కొబ్బరి కోరు – అర కప్పు నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు తయారీ విధానం ముందుగా నేతిలో నువ్వులు, కొబ్బరి కోరు వేసుకుని దోరగా వేయించుకోవాలి. అందులో కిస్మిస్ గుజ్జు, అంజీరా గుజ్జు, కొబ్బరి పాలు, తేనె వేసుకుని తిప్పుతూ ముద్దలా చేసుకోవాలి. అనంతరం ఉండలు లేదా బిట్స్లా నచ్చిన షేప్లో తయారు చేసుకుని సర్వ్ చేసుకోవాలి. సందేష్ కావల్సిన పదార్ధాలు క్రీమ్ మిల్క్ – రెండు లీటర్లు నిమ్మరసం – మూడు టేబుల్ స్పూన్లు పంచదార పొడి – అరకప్పు యాలకుల పొడి – పావు టీస్పూను ట్యూటీ ఫ్రూటీ – మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►ముందుగా మందపాటి గిన్నెలో పాలుపోసి మరిగించాలి. ►పాలు కాగాక నిమ్మరసం వేసి కలపాలి. ►ఇప్పుడు పాలు విరిగినట్లు అవుతాయి. వీటిని బట్టలో వడగట్టి, చల్లటి నీరుపోసి మరోసారి వడకట్టుకోవాలి. ►నీళ్లు తీసేసిన పాల మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకుని పంచదార పొడి వేసి మెత్తగా కలపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని బాణలిలో వేసి తేమ పోయేంతరకు వేయించాలి. దించే ముందు యాలకులపొడి వేసి తిప్పాలి ►ఐదునిమిషాలు ఆరాక చిన్నచిన్న ఉండలుగా చేసి మధ్యలో గుంటలా వత్తుకుని ట్యూటీప్రూటీలతో గార్నిష్ చేస్తే తియ్యటి సందేష్ రెడీ. -
Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!!
పండగంటే పెద్దగా ఉండాలి. గిఫ్ట్ ఇస్తే గుర్తుండిపోవాలి. అందునా దీపావళి ప్రతిఒక్కరికీ ప్రత్యేకమైనది. మీ సన్నిహితులకు ఈ గిఫ్ట్లు ఇచ్చారంటే మీ మధుర స్నేహం చిరకాలం నిలిచిపోతుంది. పైగా వాటిని అస్సలు కాదనరు కూడా. డ్రై ఫ్రూట్స్ బాస్కెట్ మీ లైఫ్లో ప్రత్యేక వ్యక్తులకు ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలంటే డ్రై ఫ్రూట్స్ బాస్కెట్ బెస్ట్! ఇదేకాకుండా బిస్కెట్లు, చాక్లెట్లు, టోఫీలు, కప్కేక్లు వంటి ఇతర తినగలిగిన వస్తువులు ఉన్న బాస్కెట్లను కూడా గిఫ్ట్లుగా ఇవ్వొచ్చు. కుకీస్ గిఫ్ట్ కుకీస్లను బహుమతిగా ఇవ్వవడం మంచి ఎంపిక. టీ, కాఫీలతో తినడానికి ఇవి ఉత్తమమైనవి. ఈ రోజుల్లో, చోకో చిప్, జీడిపప్పు బాదం, తాజా పండ్లు వంటి అనేక రకాల కుకీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని మీ ప్రియమైన వ్యక్తులకు ఇస్తే అస్సలు వద్దనరు. చదవండి: Millet Snacks: చిరుధాన్యాలతో చిరుతిళ్ల వ్యాపారం!.. కోట్లలో లాభం.. ఫ్రూట్ బాస్కెట్ మీ స్నేహితులకు ఇష్టమైన పండ్లను కొనుగోలు చేసి ప్రత్యేకంగా తయారుచేసిన బుట్టలో అందంగా సర్ది కూడా గిఫ్టులుగా ఇవ్వొచ్చు. స్నాక్స్ మీరు ఏదైనా విభిన్నంగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే.. అల్పాహారంగా తినగలిగే స్నాక్స్ ఐటమ్స్ మిక్స్ చేసిన గిఫ్ట్ బాక్స్ను తయారు చేసి ఇవ్వొచ్చు. ఇందులో పోహా, ఓట్స్ మ్యాగీ, ఇడ్లీ దోస పిండి, రవ్వ ఇడ్లీ పిండి, చాక్లెట్లు, టోఫీ పెట్టుకోవచ్చు. టెట్రా జ్యూస్ ప్యాక్ మిక్స్ విభిన్న రుచుల్లో ఉండో టెట్రా జ్యూస్ ప్యాక్లతో కూడా గిఫ్ట్ బాక్స్లను తయారు చేయవచ్చు. వీటిని కూడా మీ ప్రియమైన వారికి ప్రత్యేకంగా అందించవచ్చు. చదవండి: Pink Cafe: చాయ్తోపాటు.. మీ సమస్యలకు పరిష్కారం కూడా.. -
భలే రుచులు.. బనానా రైస్ కేక్, డ్రైఫ్రూట్స్ బన్స్ ఎప్పుడైనా ట్రై చేశారా?
ఇంటి వంటలో ఉండే రుచి, ఆరోగ్యం మరి దేనిలోనూ దొరకదు. ఈ కింది స్పెషల్ రెసిపీలతో మీ కుంటుంబానికి కొత్త రుచులను పరిచయం చేయండి. బనానా రైస్ కేక్ కావలసిన పదార్థాలు కొబ్బరి పాలు – పావు లీటర్ అరటిపండు గుజ్జు – అర కప్పు అన్నం – 2 కప్పులు పంచదార – 1 కప్పు నెయ్యి – 1 లేదా 2 టీ స్పూన్లు అరటిపండు ముక్కలు, దాల్చిన చెక్కపొడి – గార్నిష్కి సరిపడా తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో కొబ్బరిపాలు, పంచదార వేసి, పంచదార కరిగేవరకు తిప్పుతూ మరిగించాలి. ఆ మిశ్రమంలో అరటిపండు గుజ్జు వేసి మరోసారి కలుపుకోవాలి. చివరిగా అన్నం వేసి బాగా తిప్పి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం నచ్చిన షేప్ బౌల్స్ తీసుకుని, వాటికి నూనె లేదా నెయ్యి రాసి.. ఆ మిశ్రమాన్ని అందులో వేసుకుని చల్లారనివ్వాలి. దానిపైన అరటిపండు ముక్కలు, దాల్చిన చెక్క పొడివేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్తోనా.. డ్రైఫ్రూట్స్ బన్స్ కావలసిన పదార్థాలు మైదా పిండి – 500 గ్రా. ఉప్పు – అర టీ స్పూన్ పంచదార – 3 టేబుల్ స్పూన్లు బటర్ – 100 గ్రా. పాలు – 300 గ్రా. గుడ్డు – 1 ఈస్ట్ – 1 టేబుల్ స్పూన్ (పావు కప్పు వేడినీటిలో వేసి జ్యూస్లా చేసుకోవాలి) దాల్చిన చెక్కపొడి – కొద్దిగా నూనె – కొద్దిగా తయారీ విధానం ముందు ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పంచదారతో పాటు.. ఈస్ట్ జ్యూస్, 50 గ్రాముల బటర్, గుడ్డు, పాలు పోసుకుని ముద్దలా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు బాగా కలిపి చపాతీ ముద్దలా చేసుకుని, కొద్దిగా నూనె పూసి, 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. అది పొంగుతుంది. అనంతరం మరో పది నిమిషాలు ముద్దను మరింతగా కలిపి.. కొద్దిగా మైదా పిండి చల్లుకుంటూ అప్పడాల కర్రతో పొడవుగా వెడల్పుగా ఒత్తుకుని దానిపైన మిగిలిన బటర్ రాసి.. 2 టేబుల్ స్పూన్ల పంచదార, దాల్చిన చెక్కపొడి ఒకదాని తర్వాత ఒకటి జల్లి.. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, బాదం ముక్కలు వంటివన్నీ మొత్తం జల్లి ఓ వైపు నుంచి చుట్టుకోవాలి. తర్వాత గుండ్రంగా కట్ చేసుకుని బేకింగ్ ప్లేట్లో పెట్టుకోవాలి. అనంతరం ఒక గుడ్డు, 2 టేబుల్ స్పూన్ల చిక్కటి పాలు పోసుకుని బాగా కలిపి.. బ్రష్తో బన్స్కి ఆ మిశ్రమాన్ని పూసి ఓవెన్లో బేక్ చేసుకోవాలి. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
సామాన్యుడి ముసుగులో ఉగ్రదందా!
మనం రోజూ పండ్లు కొనే వ్యక్తి పచి్చనెత్తురు తాగే ఉగ్రవాదని, మనకు రోజూ ఎదురయ్యే ఎంబీఏ నిరుద్యోగి ఎంతకైనా తెగించే టెర్రరిస్టని ఎవరైనా ఊహించగలరా! సరిగ్గా ఈ పాయింటును పట్టుకొని పాక్ ఐఎస్ఐ కుటిల కుట్రకు పాల్పడింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారతీయ సమాజంలో సాధారణ జీవనం గడపమని పంపింది, అవకాశం చూసి విధ్వంసాలకు పాల్పడేలా ప్లాన్ చేసింది. ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీసుల పుణ్యమా అని ఈ ఉగ్ర కుట్ర భగ్నమైంది. నవరాత్రి, రామ్లీలా ఉత్సవాల సందర్భంగా భారీ విధ్వంసాలకు ప్రణాళిక రచించిన ఉగ్రవాదులను అరెస్టు చేసిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు తెలుస్తున్నాయి. అరెస్టయిన వారంతా కరడు కట్టిన టెర్రరిస్టులమని వారి ఇరుగుపొరుగు కూడా తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకోసం సాధారణ జీవనం గడుపుతూ సమాజంలో కలిసిపోయారు. అదును చూసి పెట్రేగాలని ఆలోచించారు కానీ చివరకు దొరికిపోయారు. వీరిలో యూపీకి చెందిన జీషన్ ఖమర్ ఎంబీఏ గ్రాడ్యుయేట్. దుబాయ్లో అకౌంటెంట్గా పనిచేశాడు. కరోనా లాక్డౌన్ సందర్భంగా భారత్కు తిరిగివచ్చి ఖర్జూరాలమ్మే వ్యాపారం ఆరంభించాడు. లక్నోకు చెందిన మొహ్మద్ అమీర్ జావెద్, జీషన్కు దగ్గర చుట్టం. జెడ్డాలో చాలా సంవత్సరాలు గడిపాడు. భారత్కు వచ్చాక మతబోధకుడి అవతారం ఎత్తాడు. అబూ బకర్ సైతం జెడ్డా నుంచి భారత్కు వచ్చి స్థిరపడ్డాడు. దీయోబంద్లోని ఒక మదర్సాలో చదువుకున్నాడు. కుట్రలో కీలకమైన మూల్చంద్ అలియాస్ లాలాకు డీ కంపెనీ (దావూద్ ఇబ్రహీం దందా)తో దగ్గర సంబంధాలున్నాయి. కానీ బయటకు మాత్రం రైతుగా కనిపించేవాడు. ఇక ఒసామా సమీ కుటుంబం డ్రైఫ్రూట్ బిజినెస్లో ఉంది. ఇతను చాలాసార్లు మధ్యాసియా దేశాలకు వెళ్లి వచ్చాడు. మస్కట్ నుంచి పాకిస్తాన్కు జలమార్గంలో చేరుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన జాన్ మహ్మద్ షేక్ అలియాస్ సమీర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సెంట్రల్ ముంబైలో నివశిస్తున్న ఇతనికి ఇద్దరు కూతుర్లున్నారు. పోలీసులు అరెస్టు చేసేవరకు వీరి గురించి పక్కింటివారికి కూడా తెలియదంటే ఎంత పకడ్బందిగా వ్యవహరించారో అర్ధం అవుతోంది. డీ కంపెనీతో లింకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నిర్వహించే ముఠాతో అరెస్టయిన వారికి దగ్గర సంబంధాలున్నాయి. వీరిలో ఒసామా, ఖమర్లు ఐఎస్ఐ వద్ద శిక్షణ పొందిన ఉగ్రవాదులు కాగా, దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీంకు సమీర్ దగ్గరవాడు. అంటే వీరికి డీ కంపెనీతో పాటు పాక్ అండదండలు కూడా ఉన్నట్లు అర్థమవుతోందని పోలీసులు చెప్పారు. పాక్లో ఉంటున్న అనీస్ ఆదేశాల ప్రకారం సమీర్ పేలుడు పదార్ధాలను, ఆధునిక ఆయుధాలను, గ్రెనేడ్లను భారత్లోని వివిధ ప్రాంతాల్లోని టెర్రరిస్టులకు అందించాలని ప్లాన్ చేశారు. గతేడాది ముంబై పోలీసులు ఫజుల్ రహమన్ ఖాన్ అలియాస్ ముజ్జుతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ ముంబైలోని ఒక వ్యాపారవేత్తను చంపమని వీరికి అనీస్ ఆదేశాలిచ్చాడు. దావూద్ అనుచరుడు ఫహీమ్ మాచ్మచ్కు ముజ్జు సన్నిహితుడు. అతనితో పనిచేసేవారు, కిరాయి హంతకుల గురించిన సమాచారాన్ని పోలీసులు మజ్జు నుంచి రాబట్టారు. ఇతని విచారణలోనే జాన్ మహ్మద్ పేరు బయటపడింది. అప్పటినుంచి ఇతని కదలికలపై పోలీసులు కన్నేసి ఉంచారు. కానీ జాన్ సాధారణ డ్రైవర్గా గడుపుతున్నట్లు నటించడంతో ఎలాంటి ఉగ్రకుట్ర గురించి తొలుత బయటపడలేదు. గతనెల ఫహీమ్ మరణించిన తర్వాత అనీస్ ఇతనికి నేరుగా ఆదేశాలు ఇవ్వడం ఆరంభించాడు. దీంతో ఇతని గుట్టు రట్టయింది, అప్పటివరకు ముంబైలో స్లీపర్ సెల్గా జాన్ పనిచేస్తున్నాడని, గ్యాంగుకు ఆయుధాలు సరఫరా చేసేవాడని తెలిసింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో మొత్తం ఉగ్ర కుట్ర బయటపడింది. యూపీపై కన్ను యూపీలో వరుస పేలుళ్లను జరిపాలని ప్లాన్ చేశారు. ప్రయాగ్ రాజ్లో ఒక ఐఈడీ(పేలుడు పదార్ధం)ని టెర్రరిస్టులు అమర్చారని పోలీసులకు తెలిసింది. కచ్చితంగా ఎక్కడ ఈ బాంబు పెట్టారో తెలియకపోవడంతో ఆందోళన అధికమైంది. దీనికితోడు యూపీలో వీఐపీల రాకపోకలు అధికంగా ఉండడంతో సోదాలు నిర్వహించడం, దర్యాప్తు చేయడం ఎంతో కష్టమయ్యాయని పోలీసులు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల వేడితో రాష్ట్రంలో హడావుడి పెరిగింది. ఈ నేపథ్యంలో బాంబున్న ప్రదేశాన్ని కనుగొనడం సముద్రంలో సూదిని వెతికినట్లయింది. దీనికితోడు టెర్రరిస్టులు తప్పించుకోవడానికి అనువుగా నేపాల్ బోర్డర్ను ఆనుకొనే యూపీ ఉంది. కానీ ముమ్మర సోదాలు, లోతైన విచారణతో ఎట్టకేలకు బాంబు లొకేషన్ కనుగొని దాన్ని నిర్వీర్యం చేశారు. ఆపరేషన్ తొలిదశలోనే ఉగ్రవాదులు పట్టుబడడంతో ఎంతో ప్రాణనష్టాన్ని నివారించినట్లయింది. అయితే పాక్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఇదే చివరిసారి కాదని, అప్రమత్తతే దేశానికి రక్ష అని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. –నేషనల్ డెస్క్, సాక్షి -
‘డ్రై ఫ్రూట్స్’పై తాలిబన్ ఎఫెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ నుంచి డ్రై ప్రూట్స్ సహా అనేక వస్తువులను భారత్తో పాటు అనేక దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో దేశంలో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఆఫ్గానిస్తాన్ సరిహద్దులను తాలిబన్లు మూసివే యడంతో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపో యాయి. ఈ ప్రభావం అన్నింటికంటే ఎక్కువగా భారత్లోని డ్రైప్రూట్స్ వ్యాపారంపై పడింది. కళ తప్పిన ఢిల్లీలోని కరీబాబ్లీ డ్రైఫ్రూట్స్ మార్కెట్ ఏటా భారత్లో అమ్ముడవుతున్న డ్రై ప్రూట్స్లో 80% అఫ్గాన్ నుంచే దిగుమతి అవుతుంటాయి. ఇందులో ఎండుద్రాక్ష, బాదం, అంజీర్, వాల్నట్స్, పిస్తా, కాజు వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు అఫ్గానిస్తాన్ నుంచి మన దేశానికి సరుకు రాకపోవడంతో వీటి ధరలకు రెక్కలొచ్చాయి. పది రోజుల వ్యవధిలోనే దేశంలోని అతిపెద్ద డ్రై ప్రూట్స్ హోల్సేల్ మార్కెట్ అయిన ఢిల్లీ చాందినీ చౌక్ కరీబాబ్లీ డ్రైఫ్రూట్స్ మార్కెట్లో 30% నుంచి 40% వరకు ధరల్లో పెరుగుదల నమోదైందని వ్యాపారులు తెలిపారు. ఒక్కొక్క డ్రైఫ్రూట్ ధర కిలోకు రూ.100 నుంచి రూ.400 వరకు పెరిగాయి. 10 రోజుల్లో ఎంత మార్పు?: ఒకవైపు దేశంలో పండుగల సీజన్ ప్రారంభం కావడం, మరోవైపు డ్రైఫ్రూట్స్ వినియోగంతో సాధారణ ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆరోగ్య నిఫుణులు తెలపడం కారణంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో వాటి వినియోగం ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు అఫ్గాన్ పరిణామాల నేపథ్యంలో ధరల పెరుగుదల తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని డ్రైఫ్రూట్స్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు చాందినీ చౌక్ కరీబాబ్లీ డ్రైఫ్రూట్స్ మార్కెట్లో అడుగుపెట్టడానికి స్థలం ఉండని పరిస్థితి నుంచి నేడు చాలా తక్కువ మంది షాపింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. దేశంలోని చాలా ప్రాంతాలకు ఈ హోల్సేల్ మార్కెట్ నుంచే డ్రైఫ్రూట్స్ సరఫరా అవుతుంటాయి. 10 రోజుల క్రితం వరకు కిలో రూ.700 చొప్పున అమ్ముడైన క్వాలిటీ బాదం ఇప్పుడు రూ.1000–1200కి అమ్ముడవుతోంది. అఫ్గానిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే అంజీర్ ధర గతంలో కిలోకు రూ.800–1000 వరకు ఉండగా, తాజా పరిణామాలతో ఒక్కసారిగా రూ.1100–1200 వరకు చేరింది. ప్రస్తుతానికి సరిపడ నిల్వలు బాదం, ఎండు ద్రాక్ష, అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ ధర ఒక్కసారిగా పెరిగిపోవడంతో కొనుగోలుదారులు ఆశ్చర్యపోతున్నారని డ్రై ఫ్రూట్ రిటైల్ వ్యాపారి బల్వీర్ సింగ్ అన్నారు. అయితే ప్రస్తుతానికి తమ వద్ద నిల్వలు సరిపడా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం హోల్సేల్ వ్యాపారులు తమ వద్ద ఉన్న పరిమిత స్టాక్ ధరను నెమ్మదిగా పెంచి విక్రయిస్తున్నారని, రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని వారు చెబుతున్నారని సింగ్ తెలిపారు. అఫ్గానిస్తాన్లో పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి చేరిన తర్వాత ధరల్లో స్థిరత్వం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపారుల ముందు జాగ్రత్త రానున్న రోజుల్లో దిగుమతులు జరగకపోవడం కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున అనేకమంది వ్యాపారులు తమ వద్ద ఉన్న సరుకును నిల్వ చేయడం ప్రారంభించారు. రాబోయే రోజుల్లో డ్రై ఫ్రూట్స్ ధరలు తాము ఏ రేటుకు పొందుతామనే భయం వ్యాపారుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు తక్కువ ధరలో ఎందుకు విక్రయించాలని కొందరు భావిస్తున్నారు. ప్రభుత్వం పరిష్కారం కనుక్కోవాలి రాబోయే కొద్ది రోజుల్లో అఫ్గానిస్తాన్ నుండి కొత్త సరుకు వస్తుందని డ్రైప్రూట్స్ వ్యాపారి గౌరవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. గతంలోనే తమకు రావాల్సిన స్టాక్కు సంబంధించిన అక్కడి వ్యాపారులకు ముందుగానే చెల్లించామని, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని గౌరవ్ తెలిపారు. అంతేగాక అఫ్గానిస్తాన్లోని వ్యాపారులతో ఎలాంటి కమ్యూనికేషన్ లేదని, ఈ వ్యాపారంలో తమ కోట్లాది రూపాయలు ప్రమాదంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏదో ఒక మార్గాన్ని కనుగొనాలని, లేకపోతే డ్రైఫ్రూట్స్ వ్యాపారులు తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. దేశంలో 80 శాతం డ్రై ఫ్రూట్స్ అఫ్గానిస్తాన్ నుంచి వచ్చినవే ఉంటాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. ప్రస్తుత పరిణామాల ప్రభావం డ్రైఫ్రూట్స్ వ్యాపారాన్ని ప్రభావితం చేసిందని, దీని కారణంగా ధరలు పెరగడం సహజమని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కసరత్తు చేస్తోందని, త్వరలోనే పరిష్కారాన్ని కనుగొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దుబాయ్ నుంచి డ్రైఫ్రూట్స్ ఉత్పత్తుల దిగుమతులకు ఎలాంటి ఆటంకాలు లేవన్నారు. -
Afghanistan Crisis: భారీగా పెరిగిన డ్రైఫ్రూట్స్ ధరలు
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. చాలామంది పౌష్టికాహారంగా డ్రైఫ్రూట్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వీటికి గిరాకీ పెరిగింది. డ్రైఫ్రూట్స్లో బాదం, అంజీర, మనక్క, పిస్తా, ఆలూబుకార, ఖుర్బానీ..వంటివి అఫ్గానిస్తాన్ దేశం నుంచే మనకు దిగుమతి అవుతాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. అక్కడ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా వీటి రవాణా నిలిచిందని తద్వారా ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. రూ.50 నుంచి రూ.200 వరకు... అఫ్గానిస్తాన్లో తాలిబన్ల రాకతో అక్కడి వారి మాటేమో గానీ, అక్కడి నుంచి మన దేశానికి దిగుమతి అయ్యే డ్రైఫ్రూట్స్ ధరలపై మాత్రం ప్రభావం పడిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మనకు పెద్దమొత్తంలో డ్రైఫ్రూట్స్ అక్కడి నుంచే దిగుమతి అవుతాయి. ముందుగా ఢిల్లీ, ముంబయి, తదితర ప్రాంతాలకు వస్తాయి. అక్కడి నుంచి హైదరాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్కు దిగుమతి అవుతుంటాయి. అక్కడి నుంచి జిల్లాకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకువస్తుంటారు. అఫ్గాన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా రవాణా నిలిచిపోయింది. ఫలితంగా ఇక్కడ ధరలపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం డ్రై ఫ్రూట్స్ ధరలు పక్షం రోజుల క్రితంతో పోల్చితే కిలోకు రూ.50 నుంచి రూ.200 వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: చక్కెర ఎగుమతులపై తాలిబన్ ఎఫెక్ట్ ? -
హైదరాబాద్ బిర్యానీపై తాలిబన్ ఎఫెక్ట్!
ఆఫ్గనిస్తాన్లో కొనసాగుతున్న పరిస్థితులు ఇలాగే మరికొంత కాలం కొనసాగితే బిర్యానీ రేట్లు పెంచక తప్పదంటున్నారు హైదరాబాద్ హోటళ్ల నిర్వాహకులు. తాలిబన్ల వల్ల చెలరేగిన అల్లకల్లోలం త్వరగా సద్దుమణగకపోతే బిర్యానీ భారం కావడం ఖాయం అంటున్నారు. నోరూరించే బిర్యానీ కమ్మని నోరూరించే హైదరాబాద్ బిర్యానీపై తాలిబన్ ప్రభావం పడనుంది. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికే వన్నె తెచ్చిన బిర్యానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది. జిల్లా కేంద్రాలతో పాటు ఓ మోస్తరు పట్టణాల్లో సైతం బిర్యానీ సెంటర్లు వెలిశాయి. సెలవు రోజులు వస్తే ఇళ్లలో సైతం బిర్యాణీ ఘుమఘుమలాడుతోంది. అయితే త్వరలో బిర్యానీ ధర పెరగడంతో లేక రుచిలో తేడా కావడంతో తప్పదంటున్నారు హోటల్ నిర్వహాకులు. రుచి కోసం డ్రై ఫ్రూట్స్ బిర్యానీ తయారీలో మాంసం, బాస్మతి రైస్లే ప్రధానమైనా ఆ వంటకు అద్భుతమైన రుచి తేవడంలో డ్రై ఫ్రూట్స్ది కీలక పాత్ర. ఎండుద్రాక్ష, ఆల్మండ్, అత్తి, జీడిపప్పు, పిస్తాపప్పులను బిర్యానీ తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఈ డ్రై ఫ్రూట్స్లో సింహభాగం అఫ్గనిస్తాన్ నుంచే దిగుమతి అవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో పేరున్న పెద్ద హోటళ్లు బిర్యానీ తయారీలో సగటున యాభై కేజీల వరకు బాదం పప్పును వినియోగిస్తున్నాయి. ఇదే స్థాయిలో మిగిలిన డ్రై ఫ్రూట్స్ అయిన జీడిపప్పు, కిస్మిస్ల వినియోగం కూడా ఉంటోంది. హాట్ న్యూస్ : కొండెక్కిన కోడి ఇప్పటికైతే ఓకే హైదరాబాద్లో బిర్యానీకి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొందరు అఫ్గన్ వ్యాపారులు హైదరాబాద్లోనే ఉంటూ ఎండు పళ్ల వ్యాపారం నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున ఎండు పళ్లను అఫ్గన్ నుంచి తెప్పించి ఇక్కడి హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు డ్రై ఫ్రూట్ నిల్వలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అయితే ప్రస్తుతం ఇక్కడి వ్యాపారులకు అఫ్గన్లోని ఎగుమతి దారులతో సంబంధాలు తెగిపోయాయి. తాలిబన్ల రాకతో అక్కడ అశాంతి నెలకొంది. రవాణా వ్యవస్థ స్థంభించి పోయింది. ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే డ్రై ఫ్రూట్స్ కొరత ఎదుర్కొక తప్పదని ఎండు పళ్ల వ్యాపారులు అంటున్నారు. పన్నులు పెరిగే ఛాన్స్ ఇప్పటి వరకు ఇండియా, ఆఫ్గన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగుండేవని, పన్నులు కూడా తక్కువగా ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. తాలిబన్ల పాలనలోకి వచ్చాక డ్రై ఫ్రూట్స్ ఎగుమతులపై ఆంక్షలు పెట్టినా, పన్నులు పెంచినా ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇక జిల్లా కేంద్రాల్లో ఉన్న బిర్యానీ సెంటర్లకు సైతం డ్రై ఫ్రూట్ ఇబ్బందులు తప్పేలా లేవు. ధర పెంచడమే మార్గం కోవిడ్ ఆంక్షల కారణంగా బిర్యానీ వినియోగం తగ్గిపోయిందని, ఇప్పుడిప్పుడే మార్కెట్ కోలుకుంటుండగా ఆఫ్గన్ సంక్షోభం వచ్చిపడందంటున్నారు హోటల్ నిర్వాహకులు. డ్రై ఫ్రూట్ ధరలు పెంచితే బిర్యానీ ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఫేమస్ అయిన హోటల్ నిర్వాహకులు పేర్కొంటుండగా... ఎండు పళ్ల వాడకం తగ్గించేస్తామంటున్నారు చిన్న బిర్యానీ సెంటర్ల నిర్వాహకులు -సాక్షి, వెబ్డెస్క్ -
Dry Fruits: కరోనా కాలం.. బండ్లపై రోజూ 15 లక్షల వ్యాపారం!
కడప కల్చరల్: శత్రువుతో పోరాడాలంటే మనకు అతనికి మించిన శక్తి కావాలి. ఆయుధాలు లేకపోయినా ఎదుటివాడి దాడిని అడ్డుకునే ఆత్మవిశ్వాసం కావాలి. ప్రస్తుతం కోవిడ్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జనం రోగ నిరోధక శక్తి(ఇమ్యూనిటీ)ని పెంచుకోవాలని, అందుకు పోషకాహారం తీసుకోవాలని భావిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని పెంచుకోవడం డ్రై ఫ్రూట్స్ తీసుకోవడంతోనే సాధ్యమంటున్నారు. కరోనా కట్టడిలో భాగంగా రోగ నిరోధకశక్తి పెంచుకోవాలని వైద్యులు సైతం సూచించడంతో జనం వాటిపై మొగ్గు చూపుతున్నారు. ఉపాధి దెబ్బతిన్నా.. కరోనాతో 95 శాతం పనులు నిలిచిపోయాయి. వ్యాపారాలు కూడా కుదేలయ్యాయి. ఈ నేపత్యంలో డ్రై ఫ్రూట్స్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకున్నా ప్రాణం కంటే ఎక్కువ కాదు గనుక దిగువ మధ్య తరగతి ప్రజలు కూడా వాడుతున్నారు. దీంతో డ్రై ఫ్రూట్స్ వ్యాపారాలు మాత్రం ఇంతకు ముందెన్నడూ కనివినీ ఎరుగని స్థాయిలో జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. కేవలం కడప నగరంలోనే 30కి పైగా డ్రై ఫ్రూట్స్ విక్రయించే తోపుడు బండ్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 150కి పైగా ఉన్నాయి. పట్టణాలు, మండలాల్లో కూడా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇందులో ప్రధానంగా జీడిపప్పు, బాదంపప్పు, ఎండుద్రాక్ష, ఎండు, పండు ఖర్జూరాలు, వాల్నట్స్, దోస, పుచ్చ గింజలు తదితరాలు విక్రయిస్తున్నారు. ఇవి తింటే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని, కరోనా వచ్చినా ధీటుగా ఎదుర్కొవచ్చని ప్రజల్లో నమ్మకం బాగా పెరిగింది. అందుకే విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కోట్లలో వ్యాపారం కరోనా రానంత వరకు జీడిపప్పు, బాదంపప్పు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం తదితరాలను తక్కువగా వాడేవారు. ఈ వైరస్ను కట్టడి చేయడానికి డ్రై ఫ్రూట్స్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయని వైద్యులు చెప్పడంతో వాటిని వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వినియోగం పెరగడంతో ధరలు కూడా 20–30 శాతం పెరిగాయి. కరోనా రాకముందు రోజూ కేవలం 2–4 వేల రూపాయల వ్యాపారం మాత్రమే జరిగేది. ఇప్పుడు రోజూ కనిష్ఠంగా రూ. 10 వేల వ్యాపారం జరుగుతోందని వ్యాపారులు పేర్కొంటున్నారు. జిల్లా అంతటా తోపుడు బండ్లపైనే రోజూ రూ. 15 లక్షల వ్యాపారం జరుగుతోందని కిరాణా, మసాల దినుసులు, ఇతర దుకాణాల ద్వారా మరో రూ. 15 లక్షల వ్యాపారం జరుగుతోందని వ్యాపారుల అంచనా. జిల్లా వ్యాప్తంగా తోపుడుబండ్లు, దుకాణాల్లో నెలకు రూ. 9–10 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. -
కరోనా సమయంలో పెరిగిన ఆరోగ్య జాగ్రత్తలు
-
పవిత్రమాసం.. నగరానికి పోటేత్తిన ఖర్జూరాలు!
సాక్షి, సిటీబ్యూరో: రంజాన్ అనగానే గుర్తుకుచ్చేది ఖర్జూరం. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ప్రతిరోజూ ఈ పండు తిననివారు ఉండరంటే అతిశయోక్తికాదు. ఉపవాస దీక్షలు పాటించే ముస్లింలు.. ఖర్జూరం పండుతోనే దీక్ష విరమణ చేస్తారు. అలాంటి ఈ పండ్లకు నగరం కేరాఫ్గా నిలుస్తోంది. మరో వారం రోజుల్లో రంజాన్ సీజన్ మొదలు కానుండటంతో ఖర్జూరం పండ్ల స్టాక్ నగరానికి పోటెత్తింది. విదేశాల నుంచి దిగుమతి అయిన ఈ పండ్ల వ్యాపారం కేవలం వారం రోజుల్లో నగరంలోనే సుమారు రూ.500 కోట్ల మేర సాగిందంటే ఈ పండ్లకు ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. గతేడాది కరోనా, లాక్డౌన్తో ఖర్జూరం విక్రయాలు అంతగా సాగలేదు. ఈ ఏడాది పండ్ల వ్యాపారం ఊపందుకుంటుందని భావిస్తున్న తరుణంలో మరోసారి కరోనా పంజా విసురుతుండటం ఒకింత ఆందోళన కలిగిస్తున్నా.. మునుపటిలా వ్యాపారం పడిపోదనే ధీమా వ్యాపార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వివిధ దేశాల నుంచి దిగుమతి అరబ్బు దేశాలైన ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, తూనిషీయా, అల్జిరీయా తదితర దేశాల ఖర్జూరాలకు డిమాండ్ ఉంటుంది. ఇరానీ కప్కప్, ఇరానీ ఫనాకజర్, బాందా ఖర్జూర్ ప్రసుత్తం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఖర్జూరం కిలో రూ.150 నుంచి రూ.650 వరకు విలువ చేసే రకాలు మార్కెట్లో ఉన్నాయి. ధరలు అందుబాటులో.. కరోనా కాలంలో దాదాపు అన్ని రకాల వస్తువుల ధరలు భారీగా పెరిగినా పదేళ్ల నుంచి ఖర్జూరం ధరలు పెరగలేదు. ఇతర ఆహార, ఎండు పండ్ల రేట్లను పరిశీస్తే వాటి ధరలు పదేళ్లలో 50–70 శాతం పెరిగాయి. – రాజ్కుమార్ టండన్, కశ్మీర్ హౌస్ నిర్వాహకుడు, బేగంబజార్ -
హార్మోన్ల బ్యాలెన్స్కు ఇలా తినండి
పురుషులతో పోలిస్తే మహిళల్లో స్రవించే హార్మోన్లు చాలా ఎక్కువ. వారిలోని అనేక జీవక్రియలను నిర్వహించేందుకు నిత్యం అనేక హార్మోను స్రవిస్తుంటాయి. వాటి మధ్య ఏమాత్రం సమతౌల్యత తప్పినా ఎన్నో సమస్యలు వస్తాయి. పైగా వాటిని సరిచేయడానికి మరికొన్ని హార్మోన్లను పైనుంచి ఇస్తే మిగతావి కూడా బ్యాలెన్స్ తప్పే అవకాశాలూ ఉండవచ్చు. మహిళల్లో హార్మోన్ల అసమతౌల్యత వల్ల యాంగై్జటీ, త్వరగా కోపం రావడం, త్వరత్వరగా మూడ్స్ మారిపోవడం, నిద్రలేమి వంటి సమస్యలు కనిపించడం చాలా సాధారణం. తాము రోజూ తీసుకునే ఆహారంతోనే మహిళలు తమకు కావలసిన హార్మోన్లను తగిన పాళ్లలో పొందడం ఎలాగో తెలుసుకోండి. అందుకు తీసుకోవాల్సిన ఆహారపదార్థాలివి... ప్రోజెస్టెరాన్: గర్భధారణకు, మెనోపాజ్ సమయంతో పాటు మహిళల సంపూర్ణారోగ్యానికీ ఉపయోగపడే హార్మోన్ ఇది. ఈ హార్మోన్ లోపిస్తే బరువు పెరగడం, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీసుకోవాల్సినవి: విటమిన్ బి6, పీచు, జింక్, మెగ్నీషియమ్ ఉండే ఆహారాలు తీసుకుంటే ఈ హార్మోన్ స్వాభావికంగానే సమకూరుతుంది. ఇందుకోసం చిక్కుళ్లు (బీన్స్), బ్రోకలీ, క్యాబేజీ, కాలిఫ్లవర్, గుమ్మడి, పాలకూర, నట్స్ వంటివి తీసుకోవాలి. ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఎఫ్ఎస్హెచ్): ఇది కూడా మహిళల్లో చాలా కీలకమైన హార్మోన్. మహిళల్లో మెనోపాజ్ వయసు దగ్గర పడుతున్నకొద్దీ దీని స్రావాలు ఎక్కువ. థైరాయిడ్: థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్లు ఎంతగా అవసరమో అందరికీ తెలిసిందే. దీని మోతాదు కాస్త ఎక్కువైతే హైపర్ థైరాయిడిజమ్, తక్కువైతే హైపో థైరాయిడిజమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మహిళలతో పాటు పురుషులకు అవసరమైన హార్మోన్లను కూడా థైరాయిడ్ గ్రంథి స్రవిస్తుంది. తీసుకోవాల్సినవి: ఎఫ్ఎస్హెచ్ కోసం, థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేయడానికి ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. చేపలు (సాల్మన్, సార్డిన్, కొరమీను వంటివి), అవిశగింజలు, వాల్నట్, కిడ్నీబీన్స్, పాలకూర వంటి ఆకుకూరల్లో ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కేవలం పైన పేర్కొన్న హార్మోన్లనే గాక... హైపో పిట్యుటరిజమ్, హైపోగొనాడిజమ్ వంటి హార్మోనుల అసమతౌల్యతను ఏర్పరచే కండిషన్లను కూడా నివారిస్తాయి. ల్యూటినైజింగ్ హార్మోన్ (ఎల్హెచ్): ఇది కూడా మహిళలకు అవసరమైన చాలా ప్రధానమైన హార్మోన్. పురుషుల్లో కూడా కొద్దిపాళ్లలో అవసరమే. ఇది మహిళల్లో అవసరమైన ఇతర హార్మోన్లను స్రవించేలా చేస్తుంది. తీసుకోవాల్సినవి: ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ లభ్యమయ్యే ప్రధాన ఆహారాలను తీసుకోవడం ద్వారా దీన్ని స్వాభావికంగానే పొందవచ్చు. వాటితోపాటు పొట్టుతీయని గింజధాన్యాలు (హోల్గ్రెయిన్స్), పప్పుధాన్యాలు (పల్సెస్)తీసుకోవడం ద్వారా ఎల్హెచ్ను స్వాభావికంగా పొందవచ్చు. టెస్టోస్టెరాన్: ఈ హార్మోన్ ప్రధానంగా పురుషులకు అవసరమైనది. అయితే కొద్దిపాళ్లలో మహిళల్లోనూ ఇది అవసరం. మహిళల్లో ఎముకలు, కండరాల బలం కోసం, కొవ్వు సమంగా విస్తరించడంతో పాటు రక్తకణాల ఉత్పత్తి కోసం ఈ హార్మోన్ అవసరం. తీసుకోవాల్సినవి: ఇది జింక్ వంటి ఖనిజ లవణాలు, విటమిన్–డి లభించే పదార్థాలతో లభ్యమవుతుంది. కొరమీను, సాల్మన్ వంటి చేపలు, వేటమాంసం... అందునా ప్రత్యేకంగా కాలేయం వంటి మాంసాహారాలతో పాటు గుడ్లు, బీన్స్ల ద్వారా కూడా సమకూరుతుంది. పండ్లలో దానిమ్మ ద్వారా ఇది స్వాభావికంగా దొరుకుతుంది. ఆక్సిటోసిస్: ఇది హైపోథలామస్ ద్వారా ఉత్పత్తి అయి, పిట్యుటరీ గ్రంథి ద్వారా విడుదల అవుతుంది. ఇది మన సామాజిక ప్రవర్తనను ప్రభావితం చేయడంతో పాటు, సంతానసాఫల్యానికి, బిడ్డపుట్టాక మళ్లీ పీరియడ్స్ క్రమంగా రావడానికి ఉపయోగపడుతుంది. తీసుకోవాల్సినవి: విటమిన్–డి ఎక్కువగా ఉండే ఆహారాలైన గుడ్లు, చికెన్, పాలు, తృణధాన్యాలతో పాటు విటమిన్–సి పుష్కలంగా ఉండే ఉసిరి, జామ, బెర్రీపండ్లు, టోమాటో, నిమ్మలలో లభ్యమవుతుంది. అంతేగాక బాదం, అవకాడో, డార్క్చాక్లెట్లు, అరటిపండ్లు, పెరుగు, బ్రాకలీలలో దొరుకుతుంది. గ్లూకోజ్ మెటబాలిజమ్: మహిళల్లో గ్లూకోజ్ మెటబాలిజమ్ సక్రమంగా జరగడం అవసరం. దాని వల్ల డయాబెటిస్ నివారితమవుతుంది. తీసుకోవాల్సినవి: మెంతులు, మెంతికూర వంటివి తీసుకోవడం ద్వారా ‘డియోస్జెనిన్’ అనే ఒక రకం ఈస్ట్రోజెన్ లభ్యమవుతుంది. దీని వల్ల గ్లూకోజ్ మెటబాలిజమ్ సక్రమంగా జరుగుతుంది. అలాగే బాదం నుంచి ‘ఎడిపోన్సెటిన్’ అనే స్వాభావిక ప్రోటీన్ లభ్యం కావడం వల్ల కూడా గ్లూకోజ్ మెటబాలిజమ్ సక్రమంగా జరుగుతుంది. ఎస్ట్రాడియాల్: ఇది మహిళలకు అవసరమైన హార్మోన్. దీన్నే ఈస్ట్రోజెన్ అని వ్యవహరిస్తుంటారు. ఇది తగ్గడం వల్ల యోని సంబంధమైన రుగ్మతలు కనిపిస్తాయి. తీసుకోవాల్సిన ఆహారాలు: అవిశగింజలు, సోయా ఉత్పాదనలు, తాజాపండ్లు, నట్స్, డ్రైఫ్రూట్స్ వంటి వాటి ద్వారా ఈస్ట్రోజెన్ స్వాభావికంగా సమకూరుతుంది.సుజాతా స్టీఫెన్చీఫ్ న్యూట్రిషనిస్ట్యశోద హాస్పిటల్స్,మలక్పేట, హైదరాబాద్ -
రోజూ ఇవి తింటే బరువెక్కరు!
ఊబకాయం వచ్చేస్తోందని బాధపడుతున్నా రా? అయితే రోజూ బాదం, జీడిపప్పు, వంటి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే సరి అంటోంది బ్రిటిష్ మెడికల్ జర్నల్. శుద్ధి చేసిన మాంసం, చిప్స్, ఫ్రై లలో సగం మోతాదును ఈ ఆరోగ్యకరమైన గింజలు, పప్పులతో భర్తీ చేసినా బరువు పెరగడం తగ్గుతారని పరిశోధకులు అధ్యయన పూర్వకంగా చెబుతున్నారు. వీటిల్లో అసంతృప్త కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం ఎక్కువగా కేలరీలు మాత్రం తక్కువగా ఉండటం ఇందుకు కారణమని వివరిస్తున్నారు. మరీ ఎక్కువగా కాకపోయినా కనీసం 14 గ్రాముల గింజలు, పప్పులు అధికంగా తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తాయన్నది వీరి అంచనా. మొత్తం మూడు వర్గాల వారిని దీర్ఘ కాలం పాటు పరిశీలించిన తర్వాత ఈ అంచనాకొచ్చారు. సుమారు 51, 529 మంది (40–75 మధ్య వయస్కులు) పురుషులు, 1,21,700 మంది నర్సుల (35–55 మధ్య వయస్సు)తో పాటు సుమారు 1.16 లక్షల మంది యువ నర్సులపై ఇరవై ఏళ్ల పాటు బరువు, ఆహారం, వ్యాయామం వంటి వివరాలను సేకరించి మరీ ఈ అధ్యయనం చేశారు. నాలుగేళ్లకోసారి బరువును ప్రకటించడంతో పాటు అంతకు ముందు సంవత్సరంలో ఎంత తరచుగా గింజలు, పప్పులు తిన్నారో కూడా తెలిపేలా అధ్యయనం జరిగింది. పప్పులు, గింజల్లో దేని వాడకం ఎక్కువైనాసరే.. దీర్ఘకాలంలో బరువు పెరగడం తగ్గినట్లుగా తెలిసింది. -
డ్రైఫ్రూట్ కిళ్లీ@ చీరాల
సాక్షి, చీరాల(ప్రకాశం) : రుచికరమైన ఆహారాన్ని తృప్తిగా తిన్న తర్వాత ఒక కిళ్లీ వేసుకుంటే ఆ కిక్కే వేరు.! ఏ శుభకార్యమైనా భోజనం తర్వాత స్వీట్, సాదా కిళ్లీ వేయడం సహజం. అయితే కిళ్లీల్లో కూడా వెరైటీలు ఉన్నాయి. అందులో డ్రైఫ్రూట్ కిళ్లీ ప్రత్యేకమైనది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ప్రాచుర్యం ఉన్న ఈ డ్రైఫ్రూట్ కిళ్లీ జిల్లాలు దాటి చీరాలకు వచ్చింది. స్థానిక స్టేషన్ రోడ్లోని తాజ్ కిళ్లీ దుకాణంలో డ్రైఫ్రూట్ కిళ్లీని ప్రత్యేకంగా అందిస్తున్నారు. చీరాలలో స్వీట్ సమోసా, పుల్లయ్య బజ్జీలు, పట్టాభి స్వీట్లు ఫేమస్. వీటి కోసం రోజూ ప్రజలు ఎదురుచూస్తారు కూడా. వాటి సరసన ఇప్పుడు డ్రైఫ్రూట్ కిళ్లీ కూడా చేరింది. ఎలా వచ్చిందంటే.. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువగా వినియోగించే డ్రైఫ్రూట్ కిళ్లీని చీరాల వాసులకు కూడా రుచి చూపించాలని భావించాడు పాన్షాపు నిర్వాహకుడు బ్రహ్మం. డ్రైప్రూట్ కిళ్లీలో ఏం వాడతారో తెలుసుకుని వాటిని చీరాల తెప్పించాడు. హైదరాబాద్ నుంచి పలు రకాల ఫ్లేవర్లు కూడా తీసుకొచ్చాడు. స్వీట్ కిళ్లీలో సున్నం, వక్కతోపాటు పలు రకాల సుగంధ ద్రవ్యాలు వేస్తుంటారు. అదే డ్రైప్రూట్ కిళ్లీకి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. సున్నం, వక్కతో పాటు కిస్మిస్, బాదం, జీడిపప్పు, కర్జూరం, తేనె, కొబ్బరిపొడి, బాదం పొడి, పలు రకాల ఫ్లేవర్లు వేస్తారు. సుగంధ ద్రవ్యాలతో పాటు డ్రైఫ్రూట్స్ను అందంగా అలంకరించడం ప్రత్యేక ఆకర్షణ. డ్రైఫ్రూట్ కిళ్లీ తయారీకి రూ.20 వరకు ఖర్చవుతుండగా రూ.25కు విక్రయిస్తున్నారు. కిళ్లీ రుచి చూసిన పలువురు శుభకార్యాలకు ఆర్డర్లు ఇస్తున్నారని షాప్ నిర్వాహకుడు బ్రహ్మం సంతోషంగా చెబుతున్నాడు. -
ఢ్రై ఫ్రూట్స్ తింటే లావెక్కుతారా?
కొవ్వులెక్కువగా ఉన్నాయి కాబట్టి డ్రైఫ్రూట్స్ తింటే లావెక్కుతారని అనుకోవడం అపోహ మాత్రమేనని అంటున్నారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. కాకపోతే వీటిని మరీ ఎక్కువ మోతాదులో తినడం సరికాదని సూచిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్లో ఉండే కొవ్వులు శరీరానికి మేలు చేసేవేనని... శరీరం శోషించుకోగల కొవ్వులు కూడా వీటిలో ఉండటం వల్ల వీటితో మేలేగానీ కీడు లేదని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. సాధారణంగా ప్రతిరోజూ 30గ్రాముల వరకూ డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మేలన్నది అంచనా. కానీ.. వీటిల్లోని కొవ్వుల మోతాదు వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జీడిపప్పు, పిస్తాల్లో కొవ్వుల శాతం దాదాపు 50 గ్రాముల వరకూ ఉంటే కొన్ని ఇతర డ్రైఫ్రూట్స్లో 70 శాతం వరకూ ఉంటుంది. అయితే ఈ కొవ్వులు మోనోశాచురేటెడ్, పాలీ అన్శాచురేటెడ్ కొవ్వులు. కొలెస్ట్రాల్ మోతాదులను తగ్గించడం ద్వారా ఇవి శరీరానికి మేలు చేస్తాయి. కేలరీలు, కొవ్వులు ఎక్కువగా ఉన్నప్పటికీ డ్రైఫ్రూట్స్ను తినడం ఆపాల్సిన అవసరం లేదని ఇప్పటికే పలు అధ్యయనాలు రుజువు చేశాయని, రోజూ వీటిని తిన్నవారు దీర్ఘకాలంలో బరువు పెరగడం చాలా తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. తాము మొత్త 30 అధ్యయనాలను సమీక్షించామని అన్నింటిలోనూ డ్రైఫ్రూట్స్ తినడానికి బరువు పెరగడానికి మధ్య సంబంధం లేదని స్పష్టం చేశాయని.. ఒక అధ్యయనంలో ఒక పద్ధతి ప్రకారం డ్రైఫ్రూట్స్ తిన్న వారు బరువు తగ్గినట్లు తెలిసిందని ఒక శాస్త్రవేత్త వివరించారు. -
కలపకండి కలుసుకోండి
వనభోజనాలంటేనే ప్రకృతితో ఏకమవ్వడం... అన్నం పెట్టిన చెట్టుకు దండం పెట్టుకోవడం...కుటుంబంలో తను ఒక సభ్యులని గుర్తు చేసుకోవడం...తనతోపాటు కలిసి భోజనం చేయడం... వనభోజనం కృతజ్ఞతల ఘనభోజనం...ప్రకృతి మాత పిల్లలకు ముద్దలు చేసి పెడితే ఎంత బాగుంటుందో అనుకుంటున్నారు కదా!అందుకే ఈ వారం అన్నీ కలిపిన వంటలే... ముద్దలు చేసుకుని తినడం మాత్రమే!కలపకండి... కలుసుకోండి. క్యారట్ దద్ధ్యోదనం కావలసినవి: బియ్యం – ఒక కప్పు; పెరుగు – 3 కప్పులు; మిరియాలు – ఒక టీ స్పూను; క్యారట్ తురుము – ఒక కప్పు; జీడి పప్పులు – 15; కిస్మిస్ – గుప్పెడు; దానిమ్మ గింజలు – అర కప్పు; పాలు – 2 టేబుల్ స్పూన్లు; మీగడ – పావు కప్పు ; ఉప్పు – తగినంత పోపు కోసం: పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5 ; పచ్చి మిర్చి – 5; కరివేపాకు – 2 రెమ్మలు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙బియ్యం శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి పక్కన ఉంచాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగించాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, మిరియాలు, కరివేపాకు వరుసగా వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి ∙అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి కాగాక జీడి పప్పులు, కిస్మిస్ వేసి వేయించి తీసేయాలి ∙మరి కాస్త నెయ్యి వేసి కరిగాక క్యారట్ తురుము వేసి దోరగా వేయించి తీసేయాలి ∙ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి పల్చగా పరవాలి ∙వేయించి ఉంచుకున్న పోపు, జీడిపప్పులు, కిస్మిస్, క్యారట్, ఉప్పు వేసి బాగా కలపాలి. పెరుగు, పాలు, మీగడ జత చేసి కింద నుంచి పైకి కలియబెట్టాలి ∙దానిమ్మ గింజలు వేసి మరోమారు కలపాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించి అందించాలి. ఉసిరి రైస్ కావలసినవి బాస్మతి బియ్యం – ఒక కేజీ; పెద్ద ఉసిరి కాయల తురుము – అర కప్పు; పచ్చి సెనగ పప్పు – పావు కప్పు; మినప్పప్పు – పావు కప్పు; ఆవాలు – రెండు టీ స్పూన్లు; జీలకర్ర – రెండు టీ స్పూన్లు; ఎండు మిర్చి – 15; పచ్చి మిర్చి – 6; బెల్లం పొడి – ఒక టీ స్పూను; ఇంగువ – తగినంత; కరివేపాకు – 3 రెమ్మలు; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; జీడి పప్పులు – 50 గ్రా.; వేయించిన పల్లీలు – 100 గ్రా.; నువ్వుల నూనె/ నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ∙ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి వెంటనే పెద్ద పళ్లెంలోకి తీసి ఆరబోయాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి ∙ఆవాలు, జీలకర్ర , పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఇంగువ వరుసగా వేసి బాగా కలపాలి ∙దోరగా వేగిన తరవాత ఉసిరి కాయ తురుము జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙కరివేపాకు జత చేసి బాగా కలపాలి ∙చివరగా జీడి పప్పులు, వేయించిన పల్లీలు వేసి మరో సారి వేయించి దింపేయాలి ∙పళ్లెంలో ఉన్న అన్నం మీద ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి ∙వేయించి ఉంచుకున్న ఉసిరి + పోపు మిశ్రమం, బెల్లం పొడి చివరగా వేసి బాగా కలియబెట్టాలి ∙సుమారు గంట సేపు ఊరిన తరవాత దేవుడికి నివేదన చేసి సేవించాలి ∙వనభోజనాలలో ఉసిరి తప్పనిసరిగా తినాలంటారు కనుక, విడిగా ఉసిరి తినవలసిన అవసరం లేకుండా ఉసిరి రైస్ సిద్ధం చేసుకుంటే సరి. డ్రై ఫ్రూట్స్ క్షీరాన్నం కావలసినవి బియ్యం – ఒక కప్పు; చిక్కటి పాలు – 4 కప్పులు; బెల్లం పొడి – 2 కప్పులు; నెయ్యి – ఒక కప్పు; జీడి పప్పులు – 25 గ్రా.; కిస్మిస్ – 25 గ్రా.; పిస్తా – 25 గ్రా.; ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూను; గింజలు లేని ఖర్జూరాలు – 5; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు తయారీ: ∙ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో నానబెట్టాలి ∙చిక్కటి పాలను బాగా మరిగించాలి ∙బియ్యంలోని నీళ్లను ఒంపేసి పాలలో వేసి కలియబెట్టాలి ∙బాగా మెత్తగా ఉడికేవరకు అడుగు అంటకుండా కలుపుతూ ఉడికించాలి (పాలు చాలకపోతే మరిన్ని పాలు కాని నీళ్లు కాని జత చేయాలి) ∙ఒక చెంచాడు నెయ్యి వేసి కలియబెట్టాలి ∙బెల్లం తురుము వేసి మరోమారు బాగా కలిపి దింపేయాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిçపప్పులు, కిస్ మిస్, ఎండు కొబ్బరి ముక్కలు, పిస్తాలను విడివిడిగా వేయించి తీసి చక్ర పొంగలిలో వేసి కలపాలి ∙ఖర్జూరాలను కూడా జత చేసి మరోమారు కలపాలి ∙చివరగా కుంకుమపువ్వు వేసి కలియబెట్టాలి ∙క్షీరాన్నం బాగా చల్లారాక అందించాలి. నేతి బీరకాయ బజ్జీ కావలసినవి: నేతి బీరకాయలు – 2; సెనగ పిండి – అర కేజీ; బియ్యప్పిండి – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి పేస్ట్ – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; తినే సోడా–చిటికెడు; నూనె – వేయించడానికి తగినంత తయారీ: ∙ముందుగా నేతి బీరకాయలను శుభ్రంగా కడిగి, సన్నగా చక్రాల్లా తరిగి పక్కన ఉంచాలి ∙ఒక పెద్ద గిన్నెలో సెనగ పిండి, బియ్యప్పిండి, ఉప్పు, మిరప కారం, అల్లం తురుము, పచ్చి మిర్చి పేస్ట్, ధనియాల పొడి, జీల కర్ర పొడి, చిటికెడు సోడా వేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి బజ్జీల పిండి మాదిరిగా కలుపుకుని పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, నేతి బీర కాయ చక్రాలను ఒక్కటొక్కటిగా నూనెలో వేసి, రెండు వైపులా దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙కొబ్బరి చట్నీతో కాని, గ్రీన్ చట్నీతో కాని తింటే రుచిగా ఉంటాయి. బిసిబేళ బాత్ కావలసినవి: ధనియాలు – 4 టీ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – 4 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; ఏలకులు – 4; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 4; ఎండు కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; గసగసాలు – 2 టీ æస్పూన్లు; నువ్వులు – ఒక టీ స్పూను; నూనె – ఒక టీ స్పూను; కాశ్మీరీ ఎండు మిర్చి – 12; కరివేపాకు – మూడు రెమ్మలు; ఇంగువ – చిటికెడు; క్యారట్ – 1 (చిన్నది); బీన్స్ – 5; పచ్చి బఠాణీ – 2 టేబుల్ స్పూన్లు; బంగాళదుంప – అర చెక్క (ముక్కలు చేయాలి); పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – 2 కప్పులు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; చింతపండు రసం – ముప్పావు కప్పు (కొంచెం చిక్కగా ఉండాలి); బెల్లం పొడి – అర టీ స్పూను; ఉల్లి పాయ – అర చెక్క (ముక్కలు చేయాలి); ఉడికించిన కంది పప్పు – ఒక కప్పు; అన్నం – రెండున్నర కప్పులు; నీళ్లు – ఒక కప్పు; నెయ్యి – ఒక టేబుల్ స్పూను పోపు కోసం: నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; జీడిపప్పులు – 10 తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో కూరగాయ ముక్కలు, పల్లీలు, నీళ్లు, పసుపు, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తపడే వరకు ఉడికించాలి ∙ముక్కలు బాగా ఉడికిన తరవాత చింతపండు రసం, బెల్లంపొడి, ఉల్లి తరుగు వేసి సుమారు పదినిమిషాల పాటు ఉడికించాలి ∙ఉడికించిన పప్పు, అన్నం జతచేసి బాగా కలిపి మరో కప్పు నీళ్లు పోసి కలియబెట్టి, మూత పెట్టాలి ∙çకొద్దిసేపటి తరవాత 4 టీ స్పూన్ల బిసిబేళబాత్ మసాలా వేసి సన్నని మంట మీద 20 నిమిషాల పాటు ఉడికించి దింపేయాలి ∙చిన్న బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక నెయ్యి లేదా నూనె వేసి కాగాక పోపు కోసం తీసుకున్న సరుకులను వేసి వేయించి, సిద్ధం చేసుకున్న బిసిబేళబాత్ మీద వేసి బాగా కలిపి, వేడివేడిగా అందించాలి. -
ఈవారం స్పెషల్ : ‘ఆది’మానవుల మెనూ!
సాగు లేనప్పుడు ఏం తినేవాళ్లం?వేటాడి చంపిందైనా...చెట్లెక్కి తెంపిందైనా..!ఇప్పుడు సాగు వచ్చింది కాబట్టి..చావు వచ్చింది.ఇప్పుడు ఏదైనా సాగుతుంది..ఒళ్లు కూడా!ఊబకాలమ్ సిరీస్లో ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఇస్తున్న సమాచారంలో భాగంగాఈ గురువారం నుంచి వివిధ డైట్ప్లాన్లను పరిచయం చేస్తున్నాం. ఈవారం స్పెషల్‘ఆది’మానవుల మెనూ.కొవ్వు పేల్చేసే ‘పేలియో డైట్’!ఇదీ... అదీ తినకుండా ఆది డైట్ తినండి. పేలియో అంటే పురాతనమైన అని అర్థం. అంటే మన పూర్వికులు అనుసరించిన పద్ధతి అన్నమాట. మనం వ్యావసాయిక సమాజంలోకి రాకముందు వేటాడుతూ, పండ్లూ ఫలాలను సేకరిస్తూ, దొరికిన వాటిని తిన్న విధానమిది. అయితే ఆ రోజుల్లో ఆదిమ మానవుడు కనీసం 6000 క్యాలరీలు సైతం తినగలిగేవాడూ... వేట ప్రక్రియలో భాగంగా చేసే శ్రమంలో అన్ని క్యాలరీలను దహించగలిగేవాడు. (ఈరోజుల్లో వ్యాయామం లేకుండా ఎలాంటి శారీరక శ్రమ చేయని వ్యక్తి రోజులో దహించేది సగటున కేవలం 1620 క్యాలరీలు మాత్రమే. అదే శారీరక శ్రమ చేసే వ్యక్తి దహించేది దాదాపు 2000 – 2200 క్యాలరీలు మాత్రమే). ఓ ఆదిమ మానవుడి ఆదిమజీవనశైలిలో ఆహార సముపార్జన కోసం వేట, ఆహార సేకరణకు చేసే శ్రమ వల్ల అతడికి ఇప్పటి ఆధునిక వ్యాధులైన డయాబెటిస్, గుండెజబ్బులు వచ్చేవి కావు. అలాగే ఊబకాయమూ వచ్చేది కాదు. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివసించిన అప్పటి ఆదిమ మానవులు ఎలాంటి ఆహారం తీసుకునేవారంటూ చేసిన విస్తృత పరిశోధనల ద్వారా ఈ ఆహార ప్రక్రియను నిపుణులు నిర్ణయించారు. ఆ పరిశోధనల ఆధారంగా నిర్ణయించిన ఈ డైట్ ప్లాన్ ఎలా ఉంటుందో చూద్దాం. దీనిలో తినడానికి నిర్ణీతంగా ఒక పద్ధతి అంటూ లేకపోవడం కూడా ఈ ప్రక్రియలోని ప్రత్యేకత అనుకోవచ్చు. ఎందుకంటే అడవిలో లభ్యమయ్యే ఆహారాల్లో అతడికి ఎప్పుడు ఏది దొరికితే అది తినేవాడు కదా. అలా ఇందులో కొందరు చాలా తక్కువ పిండిపదార్థాలు తీసుకుంటే... మరికొందరు మరీ ఎక్కువ పిండిపదార్థాలూ తీసుకుంటారు. స్థూలంగా ఇది ఎలా ఉంటుందంటే... ఈ పద్ధతిని అనుసరించేవారు తీసుకునే ఆహారాలు: మాంసాహారం, చేపలు, గుడ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, శుష్కఫలాలు (డ్రైఫ్రూట్స్), గింజలు, కొన్ని సుగంధ ద్రవ్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, నూనెలు... ఇవి మాత్రమే తీసుకోవాలి. వివరంగా చెప్పాలంటే... ►ధాన్యాలలో: కేవలం పొట్టుతీయని / ఎలాంటి ప్రాసెసింగ్కు లోనుకాని ధాన్యాలు. ►మాంసాహారంలో: పొట్టేలు, చికెన్తో పాటు అనేక రకాల గుడ్లు (గుడ్లలో ఒమెగా –3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నవి మేలు). ►చేపల్లో: సాల్మన్, ట్రౌట్, హెడ్డాక్, రొయ్యలు (ష్రింప్), షెల్ఫిష్ వంటివి. ►కూరగాయలు/ ఆకుకూరల్లో: బ్రాకలీ, ఉల్లి, క్యారెట్, టొమాటోలు. ►పండ్లు: ఆపిల్స్, అరటిపండ్లు, నారింజ, అవకాడో, స్ట్రాబెర్రీలు, నేరేడు పండ్లు ► దుంపల్లో: బంగాళదుంప (ఆలూ), చిలగడదుంప, కంద, టర్నిప్ ► శుష్కఫలాలు / గింజల్లో: బాదం, వాల్నట్, హేజెల్ నట్, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడిగింజల్లాంటి ఇతర ఆరోగ్యకరమైన గింజలు. ►ఆరోగ్యకరమైన కొవ్వుల్లో: ఆలివ్నూనె, కొబ్బరినూనె, అవకాడో నూనె. ► ఉప్పు / సుగంధద్రవ్యాల్లో: సముద్రపు ఉప్పు, వెల్లుల్లి, పసుపు, రోజ్మేరీ. ధాన్యాలను కూడా స్వాభావికమైన ఎరువు వేస్తూ పండించిన ఆర్గానిక్ ధాన్యాలనే వాడాలి. ఎలాంటి ప్రాసెసింగ్ చేసినా అది పేలియోడైట్లోకి వచ్చేందుకు అవకాశం లేదు. అది వీలుకానప్పుడు ఆ ప్రాసెసింగ్ అన్నది వీలైనంత పరిమితంగా ఉండాలి. తీసుకోకూడని పదార్థాలు: పొట్టు తీసిన ధాన్యాలతో వండిన ఆహారాలు, చక్కెర, శీతల పానియాలు, ధాన్యాలు, పాల ఉత్పాదనలు, బఠాణీల వంటి లెగ్యూమ్లు, కృత్రిమంగా తయారుచేసే తీపి పదార్థాలు (ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్), వెజిటబుల్ ఆయిల్స్, మార్జరిన్ వంటి కొవ్వు పదార్థాలు/ట్రాన్స్ఫ్యాట్స్. తీసుకోకూడని వాటిని కాస్త వివరంగా చెప్పుకుంటే... ►చక్కెరల్లో భాగంగా శీతల పానీయాలు, పండ్లరసాలు, క్యాండీలు, చాక్లెట్లు, పేస్ట్రీలు, ఐస్క్రీములను ఎప్పుడూ తీసుకోకూడదు. ►ధాన్యాలతో తయారయ్యే బ్రెడ్స్, పాస్తా, గోధుమలు, బార్లీ, రే వంటివి. ►లెగ్యూమ్స్లో: బఠాణీలు, బీన్స్ వంటివి. ►పాల ఉత్పత్తుల్లో: పాలు, వెన్న, చీజ్తో పాటు అన్ని పాల ఉత్పాదనలు. ►కొవ్వులు / ట్రాన్స్ఫ్యాట్లలో: ఆహారాన్ని దీర్ఘకాలం నిల్వ ఉంచడానికి తోడ్పడే మార్జరిన్ వంటి కృత్రిమ నెయ్యి, పూర్తిగా లేదా పాక్షికంగా హేడ్రోజనేట్ చేసిన నూనెలు. ►కృత్రిమ తీపిపదార్థాలు : యాస్పర్టేమ్, సుక్రోలేజ్, సైక్లమేట్, శాకరిన్, ఏస్సల్ఫేమ్ వంటివి. ►బాగా ప్రాసెస్ చేసిన పదార్థాలని పిలిచే లో–ఫ్యాట్ ఉత్పాదనలు. చాలా చాలా పరిమితంగా తీసుకోవాల్సినవి : డార్క్ చాక్లెట్లు, పరిమితంగా టీ, గ్రీన్ టీ. చాలా పరిమితంగా కాఫీ (ఇవి కేవలం కొన్ని యాంటీఆక్సిడెంట్స్ కోసం మాత్రమే). ఇక నీళ్లు మాత్రం వారి వీలును బట్టి తాగవచ్చు. పేలియో డైట్ అంటేనే ఆదిమ ఆహారం కాబట్టి దీనికి నిర్దిష్టంగా ఇన్ని వేళలు, ఇంత పరిమాణం అంటూ ఉండదు. అయితే పొట్టు తీయని కొంత ధాన్యంతో పాటు ప్రధానంగా ఇందులో ఆదిమ ఆహారంగా పరిగణించే మాంసాహారం, చేపలు, గుడ్లు వంటివి ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి ఆదిమమానవుల్లాగా తీవ్రమైన శ్రమ చేయాలి. అంటే ఆధునిక కాలంలో చెప్పాలంటే తిన్నది జీర్ణమయ్యేంతగా చాలా ఎక్కువగా వ్యాయామం చేయాలి. ఒక పరిశోధనఒక్క మాత్రతో బరువు... ఉఫ్! ఊబకాయాన్ని తగ్గించేందుకు ఓ మాత్రను సిద్ధం చేస్తున్నారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. వినేందుకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తున్నా.. మన శరీరం బరువు పెరిగేందుకు ఒక ప్రొటీన్ కూడా కారణమని స్పష్టమైన నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఈ ప్రొటీన్ ఉత్పత్తిని నియంత్రించేందుకు ఓ మందు సిద్ధం చేస్తున్నారు. సెరమైడ్ సింధేస్ 1 (సెర్ఎస్1) అని పిలిచే ఈ ప్రొటీన్ ఎంజైమ్ను పనిచేయకుండా చేసినప్పుడు ఎలుకలు పొట్టపగిలేలా తిన్నా సన్నగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు.. ఈ ఎలుకల రక్తంలోని చక్కెరల మోతాదుపై ఎలాంటి ప్రభావం చూపలేదు సరికదా.. కొవ్వులను అడ్డుకుంది. ఇంకోలా చెప్పాలంటే కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్ను నియంత్రించిందన్నమాట. ఈ నేపథ్యంలో తాము సెర్ఎస్1ను నియంత్రించేందుకు పీవో53 అనే మందును సిద్ధం చేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త నిజెల్ టర్నర్ తెలిపారు. ఎలుకలపై పీవో53ని ప్రయోగించినప్పుడు శరీరం మొత్తం కొవ్వులు ఖర్చవడం బాగా పెరిగిందని, ఇన్సులిన్ నిరోధకతపై మాత్రం ప్రభావం చూపలేదని టర్నర్ చెప్పారు. అయితే మనుషుల్లోనూ ఈ ప్రొటీన్ ఇలాంటి ప్రభావమే చూపుతుందా? అన్నది తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరముందని ఆ తరువాతగానీ దీన్ని మానవ వినియోగానికి అందుబాటులోకి తేలేమని ఆయన వివరించారు. ఒక వాస్తవం: వాస్తవానికి ముప్పూటలా తినడం వల్లనే బరువెక్కకుండా ఉండవచ్చు. ఎందుకంటే ఓ పూట తిండి మానేస్తే శరీర జీవక్రియల వేగం తగ్గిపోతుంది. రోజువారి పనులకు అవసరమైన శక్తిని నిల్వ ఉంచుకునేందుకు శరీరం ప్రయత్నిస్తుంది. దీనివల్ల మిగిలిన రెండు పూట్ల అవసరానికి మించి తినేస్తాం. బరువు తగ్గడం మంచిదేగానీ.. వేగంగా తగ్గడం అంత క్షేమకరం కూడా కాదు. ఒక అపోహ: రోజుకో పూట తిండి తినడం మానేస్తే బరువు తగ్గుతారు ఏయే పనులతో ఎన్ని క్యాలరీలు ఖర్చు మనం ఖర్చు చేయగల క్యాలరీలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అయితే సగటున భారతీయ పురుషుడి ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు, బరువు 70 కిలోలు అనుకుంటే; మహిళ ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు, 55 కిలోల బరువు అనుకుంటే వారికి రోజుకు అవసరమైన క్యాలరీలు. ఎవరెవరు... ఎన్నెన్ని క్యాలరీలు... ఒకేచోట కూర్చుని పనిచేసేవారికి... పురుషులకు ... 2,300 క్యాలరీలు మహిళలకు... 1,800 క్యాలరీలు ఒక మోస్తరు శ్రమ చేసేవారికి... పురుషులకు ... 2,400 క్యాలరీలు మహిళలకు .... 2,000 క్యాలరీలు చాలా ఎక్కువ శారీరక శ్రమ చేసేవారికి... పురుషులకు... 2,800 క్యాలరీలు మహిళలకు... 2,200 క్యాలరీలు ఇప్పుడు వేర్వేరు పనులకు అనేక ఉపకరణాలు అందుబాటులోకి రావడంతో అందరికీ శారీరక శ్రమ బాగా తగ్గింది. అందుకే వైద్యనిపుణులు / న్యూట్రిషనిస్టులు ఉజ్జాయింపుగా ఈ కింద పేర్కొన్న విధంగా క్యాలరీలు తీసుకోవచ్చంటూ సిఫార్సు చేస్తున్నారు. అదేమిటంటే... తమ ఎత్తుకు ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు ఉన్నవారు రోజుకు 2,200 కిలో క్యాలరీలూ; ఎత్తుకు తగినంత బరువు ఉన్నవారు 1800 క్యాలరీలు, స్థూలకాయంతో ఉన్నవారు 1500 క్యాలరీలు విడుదలయ్యేంత ఆహారం తీసుకోవడం మంచిది. బరువు తగ్గడానికి ఎలాగూ ఆదిమానవుల (పేలియో) డైట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారా? అయితే అప్పటి డైట్నే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి. అంటే అప్పటిలాగా పచ్చిమాంసాలో, కందమూలాలు తినలేరు కదా. ఇక నట్స్లో జీడిపప్పుల వంటివి కాల్చకుండానో, ప్రాసెస్ చేయకుండానో అంటే కుదరదు కాబట్టి అప్పటి ఆహారంలోనే కొన్ని కొన్ని మార్పులతో అంటే ధాన్యాలను పొట్టు ఉండేలా తీసుకోవడం, పొట్టుతో తినగలిగే పండ్లను అలాగే తినడం, కాస్త ఆరోగ్యకరమైన రీతిలో వండుకోవడం చేయాలి. ఎలాగూ ఆదిమానవులు వేటలోనూ, ఆహార సముపార్జనలోనూ లేదా పండ్లను కోయడానిక చెట్లు ఎక్కడం వంటి పనుల్లోనూ పాలుపంచుకోలేం. కాబట్టి మన రోజువారీ పనుల్లోనే కాస్త క్యాలరీలు ఎక్కువగా ఖర్చయ్యేలా చూసుకోవాలి. వాటిల్లో ఏయే పనులకు ఎన్నెన్ని క్యాలరీలు దహనం అవుతాయో చూద్దాం. శారీరక కదలికలు ఏమాత్రం లేకుండా ఉండే... జస్ట్ అలా కూర్చుని ఉండటం, చదవడం, టీవీ చూడటం, రేడియో వినడం ... గంటకు... 80 నుంచి 100 క్యాలరీలు చాలా స్వల్పమైన శారీరక కదలికలు ఉండే... నిలబడి వంట చేయడం, సింక్లో పాత్రలు కడగడం, ఇస్త్రీ చేయడం, మెల్లగా నడవడం గంటకు... 110 – 160 క్యాలరీలు ఓ మోస్తరు శారీరక కదలికలు ఉండే... కాస్తంత వేగంగా నడవడం, ఊడ్చడం, బట్టలు సర్దడం, పక్కబట్టలు పరవడం గంటకు ... 120–240 క్యాలరీలు శరీర కదలికలు ఎక్కువగా ఉండే... కారు కడగడం, గోల్ఫ్ ఆడటం, పరుగెత్తినట్టుగా నడవడం, ఓ మోస్తరు వేగంతో సైకిల్ తొక్కడం గంటకు... 250 – 350 క్యాలరీలు భారీ శరీర కదలికలు అవసరమయ్యే... పరుగెత్తడం, ఈదడం, టెన్నిస్, ఫుట్బాల్ ఆడటం గంటకు... 350 క్యాలరీలు – ఆపైన అవసరమైన క్యాలరీలను ఇచ్చే ఆహారం తీసుకోవడం ఎలా? మనకు అవసరమైన క్యాలరీలను ఇచ్చే ఆహారం తీసుకోవడానికీ ఓ ఉజ్జాయింపు లెక్క ఉంది. అదేమిటంటే... ఒక పూట ఆహారం (అంటే... అన్నం, పప్పు, కూర, పెరుగుతో కూడిన లంచ్/డిన్నర్)తో సుమారు 550 క్యాలరీల శక్తి అందుతుంది. అలాగే ఒక బ్రేక్ఫాస్ట్ లేదా ఓ మోస్తరు టిఫిన్తో 450 క్యాలరీల శక్తి అందుతుంది. దీన్ని బట్టి ఎవరికి వారు తాము సుమారుగా ఎంత ఆహారాన్ని తీసుకోవాలో నిర్ణయించుకోవచ్చు. ఇక్కడ మరో లెక్క కూడా ఉంది... అదేమిటంటే... మీ శరీరం తీరు... తీసుకోవాల్సిన క్యాలరీలు మీరు బాగా సన్నం అయితే... ప్రతిరోజూ మీ బరువు ప్రతి కేజీకి 30 క్యాలరీల చొప్పున మీరు లావు అయితే... ప్రతిరోజూ మీ బరువు ప్రతి కేజీకి 20 క్యాలరీల చొప్పున మీరు సాధారణ బరువుంటే... ప్రతి రోజూ మీ బరువు ప్రతి కేజీకి 25 క్యాలరీల చొప్పున మహిళలు చేసే కొన్ని వ్యాయామాల్లో ఎన్నెన్ని క్యాలరీలు...? మహిళలు చేసే ఏయే వ్యాయామాల వల్ల ఎన్నెన్ని క్యాలరీలు ఖర్చవుతాయనే అంశం అనేక ఇతర విషయాలపై ఆధారపడుతుంది. అయితే దాదాపు 70 కిలోల బరువున్న ఒక మహిళ 30 నిమిషాల పాటు చేసే కొన్ని పనులు/వ్యాయామాలతో ఉజ్జాయింపుగా ఎన్నెన్ని క్యాలరీలు ఖర్చవుతాయో కూడా చూద్దాం. డాక్టర్ సుధీంద్ర ఊటూరి లైఫ్స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
డ్రైఫ్రూట్స్.. విక్రయాలు ఫుల్..
అబిడ్స్ : రంజాన్ సందడి బేగంబజార్లో జోరుగా కొనసాగుతోంది. పాతబస్తీ బేగంబజార్లో హోల్సేల్ వ్యాపారస్తులు పెద్దఎత్తున డ్రై ఫ్రూట్స్ విక్రయాలు చేస్తున్నారు. రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండే ముస్లింలు ఉపవాసం అనంతరం ఖర్జూరాలతో పాటు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. దీంతో పాతబస్తీతో పాటు నగరంలోని పలు ప్రాంతాల వాసులు పెద్దఎత్తున బేగంబజార్లో ఖర్జూరంతో పాటు డ్రైఫ్రూట్స్ విక్రయాలు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే డ్రై ఫ్రూట్స్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలాసా నుంచి వచ్చే ఖాజూలను పెద్దఎత్తున విక్రయిస్తున్నారు. రంజాన్ మాసం సగం అయినా విక్రయాలు పుంజుకున్నాయి. బేగంబజార్ పరిసర ప్రాంతాల్లో హోల్సెల్ ధరలకే విక్రయిస్తుండటంతో నగరం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి... విదేశాల నుంచి నగరానికి డ్రై ఫ్రూట్స్ దిగుమతి అవుతున్నాయి. ఇరాన్ దేశం నుంచి ఖర్జూరాలు, అమెరికా నుంచి బాదం, పలు అరబ్ దేశాల నుంచి పిస్తా, వాల్నట్స్, అంజూర్, ఎండు ద్రాక్ష, కుర్బానిలాంటి డ్రై ఫ్రూట్స్ న్యూ ఢిల్లీ నుంచి నగరానికి దిగుమతి అవుతున్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువస్తున్నారు. కాజు మాత్రం ఆంధ్రప్రదేశ్లోని పలాసా నుంచి దిగుమతి అవుతోంది. డ్రై ఫ్రూట్స్ ధరలు ఇవే... బేగంబజార్ హోల్సెల్ మార్కెట్లో డ్రైఫ్రూట్స్ ధరలు కిలో చొప్పున ఇలా ఉన్నాయి. ఖాజు కిలో రూ.780 నుంచి రూ.1200 వరకు, ఆలమోండ్స్ కిలో రూ.700 నుంచి రూ.2,800ల వరకు, పిస్తా కిలో రూ.వెయ్యి నుంచి రూ.1,800ల వరకు, ఖర్జూరా కిలో రూ.180 నుంచి రూ.1,600ల వరకు విక్రయాలు చేస్తున్నారు. రెండు సంవత్సరాల నుంచి ఖాజు, బాదం ధరలు కిలోకు 10 నుంచి 20 శాతం పెరిగాయి. హోల్సెల్ ధరలకే రిటైల్ అమ్మకాలు డ్రైఫ్రూట్స్ను హోల్సెల్ ధరలకే రిటైల్గా విక్రయిస్తున్నాం. రంజాన్తో పాటు దసరా, దీపావళి, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రైఫ్రూట్స్ విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. రంజాన్ మాసం కావడంతో ఖర్జూలతో పాటు డ్రైఫ్రూట్స్ విక్రయాలు రెండింతలు పెరిగాయి. 1967లో హోల్సెల్ డ్రైఫ్రూట్ షాపును ప్రారంభించిన తాము రిటైల్ వారికి కూడా ఎలాంటి వ్యత్యాసం లేకుండా హోల్సేల్ ధరలకే విక్రయిస్తున్నాం. డ్రైఫ్రూట్స్తో మనిషి ఆరోగ్యకరంగా ఉంటాడు. ఎన్నో పోషకాలు కూడా లభిస్తాయి. ఈ మధ్య కాలంలో డ్రైఫ్రూట్స్ విక్రయాలు చాలా పెరిగాయి. – రాహుల్ సాంక్ల, శ్రీకిషన్ సత్యనారాయణ సాంక్ల డ్రైఫ్రూట్స్ దుకాణం యజమాని -
జావసత్త్వాలు
జావలను ఇక్కడ ఇచ్చిన పదార్థాలతోనే కాదు... జొన్నలు, కొర్రలు, సజ్జలు వంటి రకరకాల చిరుధాన్యాలతోనూ తయారుచేసుకోవచ్చు. ఇష్టాన్ని బట్టి పాలు, బెల్లం కలిపి తియ్యగాను, మజ్జిగ ఉప్పు కలిపి ఉప్పగానూ తీసుకోవచ్చు. చిన్న పిల్లలకు రుచిగా ఉండటం కోసం వెనిలా, స్ట్రాబెర్రీ, చాకొలేట్ వంటి ఎసెన్స్ జత చేసి అందించవచ్చు. ఎవరికి నచ్చిన డ్రైఫ్రూట్స్ను వారు జావలో జత చేసుకుని తాగవచ్చు. మీ సృజనకు పదునుపెట్టండి. జావ అనగానే జావగారిపోవలసిన అవసరం లేదు. జావలో జీవం ఉంది.జవం... అంటే వయసుకు శక్తినిచ్చే ధాతువు ఉంది. ఎండలలో శరీరానికి గొడుగు పట్టాలంటే జావ తాగాలి.రాగి, సగ్గుబియ్యం, బార్లీ, గోధుమరవ్వ...వీటితో జావ కాచండి, మాట వినకుండా ఆటలలోకి పరుగెత్తే పిల్లలకు ఇవ్వండి.వారిని అదుపుచేయలేక నీరసపడే మీరు కూడా కాస్త పుచ్చుకోండి.ఈ సెలవులు శక్తితో నిండుతాయి. సరదాగా గడుస్తాయి. రాగి జావ(తియ్యగా) కావలసినవి:రాగి పిండి – 4 టేబుల్ స్పూన్లు; పంచదార లేదా బెల్లం పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; పాలు – ఒకటిన్నర కప్పులు; నెయ్యి – నాలుగు చుక్కలు; ఏలకుల పొడి – చిటికెడు; డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా తయారీ:∙ఒక పాత్రలో, పాలు, నీళ్లు, రాగి పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలిపి స్టౌ మీద ఉంచి ఉడికించి, దింపేయాలి ∙పంచదార లేదా »ñ ల్లం పొడి వేసి బాగా కలపాలి ∙నేతిలో డ్రైఫ్రూట్స్ వేయించి జావలో వేసి అందించాలి. గోధుమ రవ్వ జావ కావలసినవి: గోధుమ రవ్వ – అర కప్పు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి, కొత్తిమీర – కొద్దికొద్దిగా; తరిగిన అల్లం – అర టీ స్పూను తయారీ:∙ముందుగా రవ్వను బాణలిలో పొడిగా వేయించుకోవాలి ∙రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. ∙రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి జతచేసి కలిపి దింపేయాలి. ∙చివరగా అల్లం తరుగు, కొత్తిమీర జత చేసి అందించాలి. ∙ఇష్టపడేవారు ఇందులో మజ్జిగ జత చేసుకుని తాగవచ్చు. సగ్గు బియ్యం జావ (తియ్యగా) కావలసినవి:సగ్గు బియ్యం – అర కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; పాలు – 3 కప్పులు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను; జీడి పప్పులు – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను తయారీ:∙సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి సుమారు గంటసేపు నానబెట్టాక, కుకర్లో ఉంచి ఉడికించి, ఒక పాత్రలోకి తీసుకోవాలి. ∙పాలు జత చేసి బాగా ఉడికేవరకు కలుపుతుండాలి. ∙బాగా చిక్కగా అయిన తరవాత బెల్లం పొడి లేదా పంచదార జత చేసి మరోమారు కలపాలి. ∙ఏలకుల పొడి జత చేసి బాగా కలిపి దించేయాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి వేడయ్యాక డ్రైఫ్రూట్స్ వేసి వేయించి తీసేసి, జావలో కలపాలి. బార్లీ జావ కావలసినవి: బార్లీ – ఒక కప్పు; నీళ్లు – ఐదు కప్పులు; నిమ్మ రసం – ఒక టీ స్పూను; తేనె – ఒక టేబుల్ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 2; దాల్చిన చెక్క పొడి – చిటికెడు; అల్లం ముక్క – చిన్నది తయారీ: బార్లీని శుభ్రంగా కడిగి ఐదు కప్పుల నీళ్లు, వెల్లుల్లి రెబ్బ, దాల్చిన చెక్కపొడి జత చేసి, సన్నని మంట మీద సుమారు అరగంట సేపు మూడు వంతులు అయ్యేవరకు మరిగించి, దింపి చల్లారాక వడబోయాలి∙జావను ఫ్రిజ్లో ఉంచి కొద్దిగా చల్లగా తాగవచ్చు లేదా మామూలుగానే చల్లారిన తరవాత నిమ్మరసం, తేనె జత చేసి తీసుకోవచ్చు. రాగి జావ (ఉప్పగా) కావలసినవి: రాగి పిండి – 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; నీళ్లు – ఒక కప్పు; మజ్జిగ – తగినంత; నెయ్యి – నాలుగు చుక్కలు; జీలకర్ర – చిటికెడు; కరివేపాకు – ఒక రెమ్మ; కొత్తిమీర – కొద్దిగా; పచ్చి మిర్చి – 1 (చిన్న చిన్న ముక్కలుగా తరగాలి) తయారీ:ఒక పాత్రలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙ఒక గ్లాసులో కొద్దిగా నీళ్లు పోసి రాగి పిండి వేసి ఉండలు లేకుండా కలిపి, మరుగుతున్న నీళ్లలో పోసి ఉడికించి దింపేయాలి ∙చల్లారాక ఉప్పు, మజ్జిగ జత చేయాలి ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కాగాక, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించి, తయారుచేసి ఉంచుకున్న జావలో వేసి కలపాలి ∙చివరగా కొత్తిమీర జత చేసి బాగా కలిపి అందించాలి. సగ్గు బియ్యం జావ (ఉప్పగా) కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు; ఉప్పు – తగినంత; నిమ్మరసం – టీ స్పూను; మజ్జిగ – రెండు కప్పులు; పుదీనా ఆకులు – కొద్దిగా; నీళ్లు – మూడు కప్పులు తయారీ:సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి సుమారు గంటసేపు నానబెట్టాక, తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి.బాగా చల్లారాక మజ్జిగ, ఉప్పు, నిమ్మరసం జత చేసి మరోమారు కలిపి, పుదీనా ఆకులు వేసి అందించాలి. దూరంగా ఉండాలి పదార్థాలను నూనెలో డీప్ఫ్రై చేసి చాలామంది తింటుంటారు. రెస్టారెంట్లలోను, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోను ఈ ఫ్రైలను విరివిగా తయారుచేస్తారు. నూనెలో వేయించిన పదార్థాలకు రుచి ఎక్కువ. కాని ఇలా తయారయిన వాటిలో క్యాలరీలు, కొవ్వు అధికంగా ఉంటాయి. అందువల్ల రకరకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, ఒబేసిటీ వంటి వ్యాధులు రావడానికి ఆస్కారం మెండుగానే ఉంటుంది. టైప్– 2 డయాబెటిస్ వచ్చే అవకాశం అధికమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వేయించిన పదార్థాలు తప్పనిసరిగా తినాలకునునేవారు... కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, అవొకాడో నూనె వాడుకోవడం కొంతవరకు పరవాలేదు. అవెన్లో వేయించుకోవడం మరో మార్గం. అప్పడాల వంటివి నేరుగా అవెన్లో నూనె లేకుండా వేయించుకోవచ్చు. అలాగే ఎయిర్ ఫ్రయింగ్లో వేయించినా కూడా కొంతవరకు నష్టం తగ్గుతుంది. ఆవిరి మీద ఉడికించిన పదార్థాలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయనే విషయాన్ని మరచిపోకూడదు. ఆరోగ్యాన్ని ప్రసాదించే జావలు మనకి ప్రధాన ఆహారధాన్యాలు ‘వరి, గోధుమ, బార్లీ, కొర్రలు, రాగులు, జొన్నలు’ మొదలైనవి. ఇవి వండేటప్పుడు నీటిని అధికంగా చేర్చి పల్చగా ఉండేలా ఉడికించి, వాటిని మనం ‘జావలు’ అంటాం. ఇలాంటి జావలను రకరకాల పేర్లతో ఆయుర్వేదం అభివర్ణించింది. అసలు ద్రవ్యానికి ఎన్ని రెట్లు నీళ్లు కలిపితే ఎంత పలచగా ఉంటుందీ లేక ఎంత చిక్కగా అవుతుంది అన్న అంశాలను చాలా లోతుగా విశదీకరించింది ఆయుర్వేదం. ఆ పలుచని లేక చిక్కదనాన్ని బట్టి కొన్ని సాంకేతిక పదాలను సూచించింది. ఉదాహరణకు అతి పల్చగా ఉంటే ‘పేయం’ కొంచెం చిక్కగా ఉంటే ‘మండము’ అని స్పష్టీకరించింది. ఇలాంటివే అనేక సాంకేతిక పదాలు ఉన్నాయి. ఈ జావలని ప్రధాన ఆహారధాన్యాలతోనే కాకుండా, కొన్ని పప్పుల (పెసర, మినప) తో కూడా చేసుకోవచ్చు. పాలను ఉపయోగించి చేస్తే, ‘క్షీర కృతములు’ అని, మాంసరసంతో చేస్తే ‘మాంసకృతములు’ అని స్పష్టం చేసింది. కొన్ని శాకాలతో (ముల్లంగి, చిక్కుడు, సొరకాయ, గాజర) కూడా చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో కొన్ని వ్యాధులలో పథ్యంగా కొన్ని ఔషధ ద్రవ్యాల్ని కూడా కలుపుకోవచ్చని ఆయుర్వేదం చెప్పింది. (శొంఠి, పిప్పలి, మిరియాలు, తిప్పతీVð....వంటివి) దానిమ్మ వంటి ఫలాలతో చేసిన జావలని ‘జల’ అని చెబుతారు. కొన్ని ఆకుకూరలు, పేలాలతో కూడా జావలు తయారుచేసుకోవచ్చు. ప్రయోజనాలు తేలికగా జీర్ణమై, అజీర్ణాన్ని పోగొట్టి, నాలుకకు రుచిని కలిగించి, జఠరాగ్నిని ఉత్తేజ పరుస్తుంది. తద్వారా తిన్న ఆహారం పచనానంతరం రక్తంలో చేరి ధాతుపుష్టి కలుగుతుంది. పొట్టలోని వాయువుని (ఆధ్మానం) హరిస్తుంది. పేలాలతో చేసిన జావ దప్పిక, ఎక్కిళ్లను తగ్గిస్తుంది. శొంఠి కలిపిన జావ తాగితే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.క్షీరము (పాలు), శర్కర (పంచదార) కలిపిన వాటిని పాయసం అని సూచించి, ఇది శక్తివర్థకమని స్పష్టం చేసింది ఆయుర్వేదం. జీర్ణశక్తి బాగా ఉన్నప్పుడు మాత్రమే పాయసం సేవించాలి. ఫలాలతో చేసిన జావ తేలికగా జీర్ణమై, బలాన్ని కలిగిస్తుంది. పెసలతో చేసిన జావ గొంతుకను శుద్ధి చేస్తుంది. కంటిచూపుకు మంచిది.మినుములతో చేసిన జావ కృశత్వాన్ని హరిస్తుంది. ఈ విషయాలకు సంబంధించి కాశ్యప సంహిత ఇలా చెబుతోంది – రోచనోదీపనో వృష్యః స్వరవర్ణ బలాగ్నికృత్ప్రస్వేద జననో ముఖ్యః తుష్టి పుష్టి సుసావః – డాక్టర్ వృద్ధుల లక్ష్మీ నరసింహ శాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకు లకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారుచేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జత చేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్.mail : familyvantakalu@gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హెదరాబాద్–34. -
రక్తహీనతను తగ్గించే అంజీర్!
శుష్కఫలాల్లో (డ్రైఫ్రూట్స్లో) అంజీర్ది ప్రత్యేకమైన స్థానం. ఎంతో రుచిగా ఉండే వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని. ♦ వీటిల్లో ఐరన్ చాలా ఎక్కువ. అందుకే రక్తహీనతతో బాధపడేవారికి డాక్టర్లు అంజీర్ను సిఫార్సు చేస్తుంటారు ♦ ఫైబర్ ఎక్కువగా ఉండటంతో పాటు కొవ్వులు చాలా చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారు అంజీర్ తినడం మంచిది. ♦ అంజీర్లో పొటాషియమ్ ఎక్కువ. సోడియమ్ చాలా తక్కువ. అందువల్ల ఇది రక్తపోటును సమర్థంగా నివారిస్తుంది. ♦ అంజీర్లో క్యాల్షియమ్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అవి బలంగా ఉండేలా చూస్తుంది. ♦ అంజీర్లో మంచి పోషకాలు ఉండటం వల్ల ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. -
ఓట్మీల్ బ్రేక్ఫాస్ట్
కావలసినవి: ఓట్స్ – ఆరు టేబుల్స్పూన్లు; నీళ్లు – ఒక కప్పు; సోయా పాలు – అర కప్పు; డ్రై ఫ్రూట్స్ – కావలసినన్ని; ఎండిన కర్బూజ గింజలు – ఒక టేబుల్ స్పూన్; పండు ఖర్జూరాలు – 10 (గింజ తీసి సన్నగా తరగాలి) తయారి: నీళ్లను మరిగించాలి. అందులో ఓట్స్ వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. దీంట్లో ఎండు కర్బూజ గింజలను వేసి స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత సోయాపాలు పోయాలి. ఖర్జూరం, డ్రైఫ్రూట్స్ పలుకులతో గార్నిష్ చేసి వేడిగా ఉన్నప్పుడే ఆరగించాలి. నోట్... దీంట్లో కొవ్వు ఉండదు. ఓట్స్లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ప్రొటీన్లు గుండె ఆరోగ్యానికి బలం చేకూరుస్తాయి. సోయాపాలు అందుబాటులో లేకపోతే డైరీ పాలనే వాడుకోవచ్చు. ఇది ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే అల్పాహారం. -
ఆరట్ల ఆరగింపు
ఓలిగలు.. బొబ్బట్లు.. భక్ష్యాలు.. పోలెలు.. పూరన్ పోలి.. స్టఫ్డ్ పాన్కేక్స్... ఇలా ఈ అట్లకు ఎన్నో పేర్లు. పేరు ఏదైనా అమ్మవారికి ఈ ఆరట్ల ఆరగింపు భక్తితో చేసి దీవెనలు పొందండి. గుమ్మడి బొబ్బట్లు కావలసినవి: గుమ్మడికాయ తురుము – 3 కప్పులు, తురిమిన బెల్లం – 1 1/2 కప్పు, మైదా – 3/4 కప్పు, యాలకుల పొడి – 1 టీ స్పూన్, నెయ్యి – సరిపడ తయారి: ∙మందపాటి బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక గుమ్మడికాయ తురుము వేసి పచ్చి వాసన పోయేలా 5 నిమిషాలు వేయించాలి ∙తరిగిన బెల్లం వేసి సన్నని మంటపై కలుపుతూ ఉండాలి ∙యాలకుల పొడి వేసి మిశ్రమం ఉండలా తయరయ్యేంత వరకు కలిపి స్టౌ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ∙ఒక గిన్నెలో మైదా పిండి, ఒక స్పూన్ నెయ్యి వేసి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ మెత్తని చపాతి పిండిలా కలుపుకోవాలి ∙గిన్నెపై మూతపెట్టి 1 గంట సేపు పిండిని నాననివ్వాలి ∙పిండిని ఒకే సైజులో ఉండేలా ఉండల్లా చేసి పెట్టుకోవాలి ∙అరచేతిలో నెయ్యి రాసుకుని పిండి ముద్దను తీసుకుని మధ్యలో గుమ్మడి తురుము మిశ్రమాన్ని పెట్టి అన్ని వైపులా జాగ్రత్తగా మూసివేయాలి ∙ఇప్పుడు అప్పడాల పీటపైన కొంచెం పిండి చల్లి నెమ్మదిగా చపాతీలా ఒత్తుకోవాలి ∙స్టౌ వెలిగించి, పెనం పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక బొబ్బట్టు వేసి బంగారు రంగు వచ్చేవరకు రెండు వైపులా కాల్చుకోవాలి ∙వేడి వేడి గుమ్మడి బొబ్బట్టుపై నెయ్యి వేసి వేడిగా సర్వ్ చేయాలి. డ్రైఫ్రూట్స్ బొబ్బట్లు కావలసినవి: మైదా పిండి – కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, నెయ్యి – తగినంత, నీళ్లు – తగినంత, జీడిపప్పు పొడి – టేబుల్ స్పూను, పిస్తా పొడి – టేబుల్æస్పూను, బాదం పప్పుల పొడి – టేబుల్ స్పూను, ఏలకుల పొడి – అర టీ స్పూను, కొబ్బరి తురుము – టేబుల్ స్పూను తయారి: ∙ఒక పాత్రలో మైదా, నెయ్యి, బెల్లం తురుము వేసి బాగా కలపాలి ∙కొద్ది కొద్దిగా నీరు జత చేస్తూ చపాతీపిండిలా తయారుచేసి పక్కన ఉంచాలి ∙మిక్సీ జార్లో కొబ్బరి తురుము, డ్రైఫ్రూట్స్, ఏలకుల పొడి వేసి మెత్తగా చేయాలి ∙మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙డ్రైఫ్రూట్స్ మిశ్రమాన్ని కూడా ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙ఒక ప్లాస్టిక్ కవర్ మీద నూనె రాసి, మైదా పిండి ఉంచి చేతితో చపాతీలా ఒత్తి, అందులో డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంచి అన్నివైపులా మూసేసి, మరోమారు చేతితో పల్చగా ఒత్తాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక నెయ్యి వేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న డ్రైఫ్రూట్ బొబ్బట్టును పెనం మీద వేసి రెండు వైపులా గోధుమరంగులోకి వచ్చేవరకు కాల్చి తీసేయాలి. డేట్స్ పాన్ కేక్ కావలసినవి: మైదా పిండి – కప్పు, బేకింగ్ పౌడర్ – కొద్దిగా, ఖర్జూరాలు – కప్పు (గింజలు తీసి ముక్కలు చేయాలి), పాలు – అర కప్పు, వెనిలా ఎసెన్స్ – టీ స్పూను, బటర్ – కొద్దిగా, తేనె – టేబుల్ స్పూను తయారి: ∙ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. మిక్సీలో మైదాపిండి మిశ్రమం, పాలు, ఖర్జూరం ముక్కలు వేసి చిక్కగా అయ్యేలా చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙వెనిలా ఎసెన్స్ జత చేయాలి . స్టౌ మీద పెనం వేడయ్యాక, కొద్దిగా బటర్ వేసి పెనమంతా అంటేలా చేయాలి ∙పెద్ద స్పూనుతో మైదా పిండి, ఖర్జూరం మిశ్రమం వేసి మందంగా ఉండేలా పరచాలి ∙రెండు వైపులా ఎర్రగా కాల్చాలి. (పెద్ద మంట మీద కాల్చకూడదు) ∙ప్లేట్లోకి తీసి, పైన కొద్దిగా తేనె వేసి సర్వ్ చేయాలి. పూర్ణం బొబ్బట్లు కావలసినవి: మైదా పిండి – ముప్పావు కప్పు, గోధుమరవ్వ – టీ స్పూను, ఉప్పు – చిటికెడు, నెయ్యి – అర టీ స్పూను నూనె – అర టేబుల్ స్పూను, నీళ్లు – తగినంత పూర్ణం తయారీకి: సెనగ పప్పు – అర కప్పు, బెల్లం తురుము – అర కప్పు కంటె కొద్దిగా ఎక్కువ, కొబ్బరి తురుము – పావు కప్పు, నీళ్లు – తగినన్ని తయారి: ∙ఒక పాత్రలో మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ, చపాతీ పిండిలా కలపాలి. నూనె జత చేసి బాగా కలిపి మూత పెట్టి సుమారు గంటసేపు నాననివ్వాలి ∙ఒక పాత్రలో సెనగ పప్పు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించి, బయటకు తీసి తడి పోయేవరకు చల్లారనివ్వాలి. ∙మిక్సీలో వేసి పొడి చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఏలకుల పొడి, బెల్లం తురుము, కొబ్బరి తురుము జత చేయాలి ∙చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙నానబెట్టిన మైదా పిండిని కూడా చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙అరిటాకు లేదా ప్లాస్టిక్ కవర్ మీద మైదా పిండి ఉండ ఉంచి చపాతీ మాదిరిగా చేతితో ఒత్తాలి ∙పూర్ణం ఉండ అందులో ఉంచి, మైదాపిండితో మూసేసి మరోమారు చపాతీలా చేతితో ఒత్తాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక నూనె లేదా నెయ్యి వేసి కాగిన తరవాత, ఒత్తి ఉంచుకున్న బొబ్బట్టు జాగ్రత్తగా వేయాలి ∙రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చేవరకు కాల్చి తీసేయాలి. క్యారెట్ బొబ్బట్లు కావలసినవి: గోధుమపిండి – 2 కప్పులు, క్యారెట్ తురుము – 1 కప్పు, తరిగిన బెల్లం – 1 కప్పు, యాలకుల పొడి – 1 స్పూను, నూనె – 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – సరిపడ తయారి: ∙ఒక గిన్నెలో గోధుమపిండి తీసుకుని నీళ్ళు పోసి చపాతి పిండిలా కలుపుకోవాలి. ఈ ముద్దపై కొంచెం నూనె వేసి ఒక గంట సేపు నాననివ్వాలి ∙ఒక మందపాటి బాణలిని స్టౌ మీద పెట్టి, క్యారెట్ తురుము, బెల్లం వేసి కలుపుతూ ఉండాలి ∙ఈ మిశ్రమానికి యాలకుల పొడి, కొంచెం నెయ్యి వేసి సన్న మంటపై కలుపుతూ ఉండాలి ∙ఈ మిశ్రమం కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. బాణలికి అంటుకోకుండా, అంచుల్లో నెయ్యి పక్కకు వస్తున్నప్పుడు స్టౌ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ∙ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న పిండి ముద్దను నూనె రాసిన ప్లాస్టిక్ కవర్పై తీసుకుని చిన్న చపాతీ మాదిరిగా చేతితో ఒత్తుకోవాలి ∙ఈ చపాతీ మధ్యలో క్యారెట్ మిశ్రమాన్ని తీసుకుని అంచులు పూర్తిగా మూసివేసి, కొబ్బరి మిశ్రమం బయటకు రాకుండా చపాతీ మాదిరిగా చేసుకోవాలి ∙వేడిచేసిన పెనంపై నెయ్యి వేసి వేడయ్యాక, రెండువైపులా బాగా కాల్చుకోవాలి. నువ్వులు కొబ్బరి బొబ్బట్లు కావలసినవి: నువ్వులు – అర కప్పు, కొబ్బరి తురుము – అర కప్పు, బెల్లం తురుము – కప్పు, నూనె – టేబుల్ స్పూను, ఏలకుల పొడి – అర టీ స్పూను, మైదా పిండి – రెండు కప్పులు, నీళ్లు – తగినన్ని, ఉప్పు – కొద్దిగా, నెయ్యి – అరకప్పు తయారి: ∙ఒక పాత్రలో మైదా పిండి, చిటికెడు ఉప్పు వేసి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలపాలి ∙కొద్దిగా నూనె జత చేసి మరో మారు కలిపి గంట సేపు పక్కన ఉంచాలి ∙మిక్సీలో నువ్వులు, కొబ్బరి తురుము, బెల్లం తురుము, ఏలకుల పొడి వేసి మెత్తగా చేసి, పాత్రలోకి తీసుకోవాలి ∙నువ్వుల మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేయాలి ∙మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి ∙ప్లాస్టిక్ కవర్ మీద కొద్దిగా నూనె రాసి, మైదా పిండి ఉండ ఉంచి, చేతితో పల్చగా ఒత్తాలి ∙నువ్వుల మిశ్రమం ఉండను ఉంచి, అన్ని వైపులా మూసి, మరోమారు చేతితో పల్చగా ఒత్తాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక తయారుచేసి ఉంచుకున్న బొబ్బట్టు వేసి నేతితో రెండు వైపులా కాల్చి తీసేయాలి. – సేకరణ: డా. వైజయంతి -
ఇంటిప్స్
నిమ్మకాయలు ఎండిపోయి గట్టిపడితే, కొద్దిగా వేడినీళ్లలో అయిదు నిమిషాలు ఉంచి తీస్తే మెత్తగా అవుతాయి. గంటసేపు డ్రై ఫ్రూట్స్ని ఫ్రిడ్జ్లో ఉంచి, చాకుని వేడి నీటిలో ముంచి డ్రై ఫ్రూట్స్ని కట్ చెయ్యాలి.కూరగాయలను ఉడకబెట్టిన నీటిని వంపేయకుండా గ్రేవీలో గాని, సూప్లో గాని, సాంబార్లో జత చేయాలి. ఇలాచేస్తే టేస్ట్తోపాటుగా విటమిన్స్ కూడా అందుతాయి. పాలు కాచే పాత్రలో ఒక స్పూన్ని ఉంచి, చిన్న మంట మీద పాలు కాస్తే పొంగకుండా ఉంటాయి.ఆకు కూరలను నేరుగా కవర్లలో భద్రపరచకుండా న్యూస్ పేపర్లో చుట్టి ఫ్రిజ్లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. పచ్చిమిర్చి తొడిమలు తుంపి, ఫ్రిడ్జ్లో ఉంచితే త్వరగా పాడవ్వకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. -
ఏటంతారేటి!
ఏముందండీ అంటానికి?! నార్త్ కోస్టు ఫుడ్డు. గాలి మళ్లక తప్పదు. చప్పరించినా, లొట్టలేసుకున్నా సికెన్ పీసు, పీతల వేపుడు.. ఆవ చేప.. బలేగుంటాయి. ఏతంటారేటి? కోవా పూరీ కావల్సినవి: కోవా - 200 గ్రా.లు మైదా - అర కేజీ డ్రై ఫ్రూట్స్(బాదం, జీడిపప్పు) పొడి - 30 గ్రా.లు యాలకుల పొడి - టీ స్పూన్ నూనె - వేయించడానికి తగినంత బెల్లం - అర కేజీ నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు తయారీ: ఒక గిన్నెలో మైదా వేసి తగినన్ని నీళ్లు పోసి పూరీ పిండిలా కలిపి, పక్కనుంచాలి. మరో గిన్నెలో కోవా, డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకులపొడి వేసి బాగా కలిపి పక్కనుంచాలి. మైదా పిండిని చిన్న చిన్న ఉండలు తీసుకొని పూరీలా వత్తి, కోవా మిశ్రమాన్ని దాంట్లో కూరాలి. (కజ్జికాయల మాదిరి చేయాలి). బాణలిలో నూనె కాగాక, అందులో వేసి అన్నివైపులా బాగా వేయించి తీయాలి. మరొక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి, బెల్లం వేసి కరిగించాలి. ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. పాకం వచ్చాక యాలకుల పొడి వేసి కలపాలి. ముదురు పాకం వచ్చాక వేయించి సిద్ధంగా పెట్టుకున్న కోవా పూరీలను వేసి, కలిపి, తీయాలి. లక్ష్మీ చారు కావల్సినవి: తరవాణి/కలి నీళ్లు (బియ్యం రెండోసారి కడిగిన 2 కప్పుల నీళ్లు ఒక కుండలో పోసి రెండు రోజుల పాటు ఉంచినవి. దీంట్లో అరకప్పు గంజి కూడా కలపాలి) - కప్పు వెల్లుల్లి - 4 రెబ్బలు వెల్లుల్లి ముద్ద - 1 టీ స్పూన్ కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు కరివేపాకు - 3 రెమ్మలు చింతపండు - నిమ్మపండంత. ఉప్పు - తగినంత పచ్చిమిర్చి - 4 (నిలువుగా చీరాలి) పసుపు - 1/2 టీ స్పూన్ మిరియాల పొడి - అర టీ స్పూన్ ఎండుమిర్చి - 2 జీలకర్ర- ఆవాలు - టీ స్పూన్ నూనె - టేబుల్ స్పూన్ తయారీ: మూకుడులో నూనె వేసి, కాగాక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి+ముద్ద, పసుపు వేసి కలపాలి. చింతపండు రసం, సరిపడా కలి/తరవాణి నీళ్లు పోసి, ఉప్పు వేసి మరిగించాలి. తరువాత మిరియాల పొడి, కొత్తిమీర వేసి దించాలి. ఈ చారు అన్నంలోకి వడ్డించాలి. జీడిపప్పు చికెన్ పలావ్ కావల్సినవి: జీడిపప్పు - 100 గ్రా.లు చికెన్ - 100 గ్రా.లు బియ్యం - 200 గ్రా.లు; కొబ్బరి పాలు - కప్పు ఉప్పు - తగినంత; పచ్చిమిర్చి - 4 అల్లం-వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్ గరం మసాలా (యాలకులు, లవంగాలు, సాజీర, అనాసపువ్వు ) - 2 టీ స్పూన్లు ఉల్లిపాయలు - 4 (2 ఉల్లిపాయలను తరిగి, వేయించి పక్కనుంచాలి) నెయ్యి - 2 టీ స్పూన్లు నూనె - 50 గ్రా.లు; బిర్యానీ ఆకు - 2 కొత్తిమీర - చిన్న కట్ట పుదీనా - కప్పు తయారీ: బియ్యం అరగంట సేపు నానబెట్టాలి. ఒక మందంపాటి గిన్నెను పొయ్యిమీద పెట్టి, నూనె వేసి వేడయ్యాక మసాలా దినుసులు కలపాలి. ఉల్లిపాయ తరుగు వేసి వేగాక అల్లం-వెటల్లుల్లి పేస్ట్ కలపాలి. తరువాత చికెన్ ముక్కలు వేసి ఉప్పు, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పులు వేసి కాస్తవేగనివ్వాలి. దీంట్లో బియ్యానికి సరిపడా నీళ్లు పోసి కొత్తిమీర, పుదీనా వేసి మరిగించాలి. తరువాత నానబెట్టిన బియ్యం వేసి కలపాలి. అన్నం ఉడికి నీళ్లు తగ్గాక నెయ్యి, ఇంకాస్త కొత్తిమీర వేసి కలపాలి. మంట తగ్గించి అన్నం పూర్తిగా ఉడకనిచ్చి దించాలి. దీనికి ఉలవచారు కాంబినేషన్ రుచిగా ఉంటుంది. స్టఫ్డ్ క్రాబ్స్ కావల్సినవి: పీతలు (బోన్లెస్) - 4 పీత మాంసం - 200 గ్రా.లు జీడిపప్పు - 50 గ్రా.లు అల్లం తరుగు - టీ స్పూన్ వెల్లుల్లి తరుగు - టీ స్పూన్ కొత్తిమీర - చిన్న కట్ట; పచ్చిమిర్చి - 4 గుడ్డు - 1; ఉప్పు - సరిపడా నూనె - వేయించడానికి తగినంత మొక్కజొన్న పిండి - టీ స్పూన్ తయారీ: పీతల డిప్పలను తీసి, లోపలి గుజ్జు భాగాన్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. డిప్పలను వేడి నీటితో కడిగి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో క్రాబ్ మీట్, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర, గుడ్డు సొన, ఉప్పు, పచ్చిమిర్చి, మొక్కజొన్న పిండి.. అన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పీతల డొప్పల మధ్యలో పెట్టి, మూసి, కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా వేయించాలి. ఏదైనా సాస్తో వడ్డించాలి. సొరకాయ మటన్ పులుసు కావల్సినవి: చింతపండు - 2 నిమ్మకాయల పరిమాణం అంత (కప్పు గుజ్జు తీయాలి); సోరకాయ - సగ భాగం (పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి) మటన్ - 200 గ్రా.లు; బెంగుళూరు మిర్చి - 100 గ్రా.లు ఉల్లిపాయ - 2 (సన్నగా తరగాలి); కరివేపాకు - 2 రెమ్మలు కొత్తిమీర - చిన్న కట్ట; అల్లం-వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్ వెలుల్లి రెబ్బలు - 4 ; కారం - 2 టీ స్పూన్లు నూనె - 3 టేబుల్ స్పూన్లు; గరం మసాలా - అర టీ స్పూన్ పసుపు - అర టీ స్పూన్; ఉప్పు - తగినంత తయారీ: మటన్లో అర టీ స్పూన్ పసుపు వేసి, కొద్దిగా ఉడికించాలి. మందపాటి గిన్నెను స్టౌ మీద పెట్టి నూనె పోసి మిర్చి తరుగు, సొరకాయ ముక్కలు, ఉల్లిపాయతరుగు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి, కలిపి మగ్గనివ్వాలి. తరువాత మటన్ ముక్కలు, చింతపండు పులుసు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలిపి ఉడికించాలి. ముక్క ఉడికాక దించాలి. బేబీకార్న్ వడలు కావల్సినవి: బేబీ కార్న్ తరుగు - కప్పు మొక్కజొన్న గింజలు - కప్పు (కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి) పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూన్; నూనె - వేయించడానికి తగినంత పుదీనా - చిన్న కట్ట; ఉల్లిపాయలు - 4 (నిలువుగా తరగాలి) ఉప్పు - తగినంత; శనగపిండి - 50 గ్రా.లు బియ్యప్పిండి - 50 గ్రా.లు; అల్లం-వెల్లుల్లి ముక్కలు - అర కప్పు తయారీ: ఒక గిన్నెలో బేబీకార్న్ తరుగు, మొక్కజొన్న గింజల ముద్ద, అల్లం వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, పుదీన, ఉల్లిపాయ తరుగు, శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. పిండి మిశ్రమాన్ని చిన్న ఉండలు చేసి, చేత్తో అదిమి కాగిన నూనెలో వేసి రెండువైపులా బాగా వేయించి, తీయాలి. ఆవకాయ చేప కావల్సినవి: ఆవకాయ - 3 గరిటెలు; చేపలు (బోన్లెస్) - 200 గ్రా.లు నూనె - వేయించడానికి తగినంత; మైదా - కప్పు; మొక్కజొన్న పిండి - కప్పు ఉప్పు - తగినంత; కారం - టీ స్పూన్; మిరియాల పొడి - టీ స్పూన్ కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు (చిన్న కట్ట); పచ్చిమిర్చి - 4; గుడ్డు - 1 అల్లం-వెల్లుల్లి ముద్దు - టీ స్పూన్; అల్లం-వెల్లుల్లి సన్నగా తరిగిన ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి) తయారీ: ముందుగా చేపలను శుభ్రపం చేసి, ఒక గిన్నెలో వేసి అందులో గుడ్డు సొన, ఉప్పు, మిరియాలపొడి, కారం, అల్లం-వెల్లుల్లి ముద్ద, మైదా, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె పోసి కాగాక ఈ చేప ముక్కలను పకోడీల మాదిరి వేయించి తీసి పక్కన పెట్టాలి. తరువాత మరో కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అల్లం-వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవకాయ పచ్చడి వేసి కలపాలి. దీంట్లో వేయించిన చేప ముక్కలను వేసి బాగా కలపాలి. తరువాత కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి. అరటి ఆకు కోడి కావల్సినవి: చికెన్ (బోన్లెస్) - 200 గ్రా.లు; అరటి ఆకు - 1 గరం మసాలా - అర టీ స్పూన్; జీలకర్ర పొడి - అర టీ స్పూన్ ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి); కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు (చిన్న కట్ట) పుదీన - కప్పు (చిన్న కట్ట); కారం - టీ స్పూన్; నూనె - 2 టేబుల్ స్పూన్లు అల్లం-వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్; నిమ్మరసం - టీ స్పూన్; ఉప్పు - తగినంత తయారీ: ముందు చికెన్, గరంమసాలా, జీలకర్ర పొడి, కొద్దిగా అల్లం-వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ తరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, చికెన్ వేసి ఉడికించాలి. దీంట్లో నిమ్మరసం కలపాలి. తరువాత పుదీనా, కారం, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. రసం అంతా ఇంకిపోయేంతవరకు ఉంచి శుభ్రపరిచిన అరటి ఆకులోకి తీసి, అన్నివైపులా మడిచి, నిప్పుల మీద కాల్చి, తీయాలి. లేదంటే ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి మీద కూడా ఉడికించవచ్చు. మునగాకు పప్పు కావల్సినవి: పెసరపప్పు - 100 గ్రా.లు; కందిపప్పు - 100 గ్రా.లు మునగాకు - కప్పు; ఉప్పు - తగినంత; వెల్లుల్లి రెబ్బలు - 6 జీలకర్ర - టీ స్పూన్; కరివేపాకు - 2 రెమ్మలు; పచ్చిమిర్చి - 4 కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు (చిన్న కట్ట); ఉల్లిపాయల- 1(సన్నగా తరగాలి) చింతపండు రసం - 2 టేబుల్ స్పూన్లు; నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - 2 పసుపు - అర టీ స్పూన్ ; ధనియాల పొడి - టీ స్పూన్ తయారీ: కుకర్లో పెసరపప్పు, కందిపప్పు వేసి కడిగి, తగినన్ని నీళ్లు పోసి, పసుపు నూనె వేసి ఉడికించి పక్కనుంచాలి. ఒక కడాయిలో నూనె పోసి, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. పసుపు, చింతపండు రసం పోసి, మునగాకు వేయాలి. ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి ఒక పొంగు వచ్చేవరకు ఉడికించి పప్పులో కలపాలి. చివరగా కొత్తిమీర వేసి, మరికాసేపు ఉడికించి దించాలి. వేడి వేడిగా అన్నం, చపాతీలోకి వడ్డించాలి. -
పరుగుకు ముందు ప్రత్యేక జాగ్రత్తలివి...
రిజర్వ్ ఫుడ్ బిఫోర్ రన్నింగ్ జాగింగ్ చేసేవారు ముందుగా కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే జాగింగ్ చేయడంలో క్యాలరీలు ఖర్చవుతాయి. అవి శరీరంలో అసలే లేకుండా ఉంటే అది మనలోని కొవ్వులను కాల్చే బదులుగా ప్రోటీన్లకు నష్టం జరుగుతుంది. అందుకే జాగింగ్కు అరగంట ముందు చాలా తేలికపాటి ఆహారంగా కొద్దిగా పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు) తీసుకోవడం మేలు. ఇందులోసం ఒక చిలగడదుంప, ఆలూ, కార్న్ఫ్యాక్స్ తీసుకొని కొవ్వు తక్కువగా ఉండే ఒక గ్లాసు పాలు తాగడం మంచిది. ఒక కప్పు పండ్ల ముక్కలూ తీసుకోవచ్చుగానీ... అందులో అరటి, పుచ్చకాయ, సపోటా, డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిది కాదు. ఇక జాగింగ్ సమయంలో ముందుగానే నీళ్లు నింపిపెట్టు కున్న బాటిల్ గానీ లేదా ఓఆర్ఎస్ సొల్యూషన్ గానీ వెంట ఉంచుకోవాలి. అయితే జాగింగ్ చేసిన వెంటనే నీళ్లు/ఓఆర్ఎస్ ద్రావణం తాగకూడదు. కాస్తంత వ్యవధి తర్వాత తెరిపిన పడ్డాకే తాగాలంటున్నారు నిపుణులు. -
చల్లని వేళ చక్కటి ఆహారం
వేరుశనగలు వేరుశనగల్లో విటమిన్ ఇ, బి3 పుష్కలంగా ఉంటాయి. మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. వేరు శన గగింజల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో తేమను పెంచి పొడిబారకుండా కాపాడుతుంది. పాలకూర ఆకు కూరలు చలికాలంలో ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలకూరలో ఇనుము, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. ప్రతి రోజు పాలకూరను ఉడికించి లేదా సూపు, రసం రూపంలో తీస్జుకుంటే ఎంతో మంచిది. ఎముకల పటిష్టానికి దోహదం చేస్తుంది. నువ్వులు నువ్వులు తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి చక్కటి వేడి లభిస్తుంది. నువ్వుల్లో కాల్షియం, ఖనిజ లవణాలు, మాంగనీసు, ఇనుము, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. భోజనం తరువాత నువ్వులతో చేసిన పదార్థాలను తీసుకోవడంవల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. నువ్వులవల్ల చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది. జొన్నలు వారానికి ఒక్క సారైనా జొన్నతో చేసిన ఆహారం తీసుకోవాలి. జొన్నలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కండరాల కదలికలకు బాగా ఉపకరిస్తుంది. జొన్నతో చేసిన పదార్థాలను అల్లం చట్నీతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ. డ్రైఫ్రూట్స్ డ్రైఫ్రూట్స్ను చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. అన్ని రకాల డ్రైఫ్రూట్స్లోనూ పోషకాలు మెండుగా ఉంటాయి. చలికాలంలో కావలసిన శక్తి వీటివల్ల లభిస్తుంది. జీర్ణశక్తిని అధికం చేస్తాయి. రక్తాన్ని బాగా శుద్ధి చేస్తాయి. డ్రైఫ్రూట్స్ సహజంగానైనా, ఆహారంలో భాగంగానైనా తీసుకోవచ్చు. దానిమ్మ సకల పోషకాల నిధి దానిమ్మ. రక్తకణాల వృద్ధికి దోహదం చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, ఫాస్పరస్ కావలసినంత లభిస్తాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచి శరీరం అనారోగ్యం బారినపడకుండా కాపాడుతాయి. చిలగడ దుంపలు చక్కటి పోషకాహారం. ఈ దుంపలు శరీరానికి కావలిసిన వేడిని అందిస్తాయి. పిల్లలు, వయోధికులకు ఇది ఎంతో అవసరం. ఈ దుంపల్లో ఉండే పీచు, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఏ, సీతో పాటు ఖనిజ లవణాల్ని శరీరానికి అందిస్తాయి. చిలగడ దుంపలను ఉడికించి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి జల్లుకొని తింటే ఆ మజాయే వేరు. దీంతో చలికాలంలో ఎదురయ్యే చాలా రకాల సమస్యలను నివారించవచ్చు. -
పండగ వేళ.. ‘పండ్ల’ గోల..!
సాక్షి, ముంబై: రంజాన్ మాసం కావడంతో పండ్ల ధరలు కొండెక్కనున్నాయి. మార్కెట్లో పండ్ల కొరత లేనప్పటికీ పండగ సీజన్ నేపథ్యంలో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో వ్యాపారులు ధరలను అమాంతం పెంచేసినట్లు పలువురు భావిస్తున్నారు. నగరంలోని వాషి ఏపీఎంసీ మార్కెట్ పండ్లతో కళకళలాడుతోంది. రంజాన్ మాసంలో చాలా మంది నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను మాత్రమే ఎంచుకుంటారు. ఈ మేరకు తర్బూజ, పొప్పిడి పండు, పైనాపిల్ పండ్ల ధరలు పెరగనున్నాయి. ఈ సందర్భంగా పండ్ల వ్యాపారుల సంక్షేమ సంఘ ప్రతినిధి విజయ్ బేండే మాట్లాడు తూ.. రంజాన్ మాసంలో పండ్లకు ఎక్కువ డిమాం డ్ ఉంటుందన్నారు. దీంతో ఈ మాసంలో పండ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతాయని తెలిపారు. హోల్సేల్ మార్కెట్లో తర్బూజ, పొప్పిడి, పైనాపిల్ పండ్ల ధరలు కి.లో. రూ. 20 నుంచి 30 వరకు ఉంటుందన్నారు. పండ్ల వ్యాపారి బాబూరావ్ హ్యాండే మాట్లాడుతూ.. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో భారీగా పెరిగే పండ్ల ధరలు మాసాంతంలో ధరలు కూడా తగ్గుతాయని తెలిపారు. మామూలుగా పండ్ల ధర లు వాటి సరఫరాపైన ఆధారపడి ఉంటాయి. కానీ ఇప్పుడు పండగ సీజన్ కావడంతో డిమాండ్ మేర కు ధరలు పెంచుతున్నారని అభిప్రాయపడ్డారు. తర్బూజ, బొప్పాయి కొంతమేరకు రాష్ర్టం లోని వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి అవుతుండగా, ఎక్కువ శాతం ఉత్తర భారత రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. పైనాపిల్ మాత్రం కేరళ రాష్ర్టం నుంచి దిగుమతి అవుతోంది. రంజాన్ మాసంలో నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు 60 నుంచి 70 ట్రక్కుల వరకు వాషిలోని ఏపీఎంసీ మార్కెట్కు చేరుకుంటాయి. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో డ్రైఫ్రూట్స్కు కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుందన్నారు. డ్రైఫ్రూట్స్ వ్యాపారి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పండ్లు, కూరగాయల ధరలు పెరగిపోవడంతో ఇబ్బంది పడుతున్న నగర వాసులు, నిత్యం ఎక్కువ ధర పలుకుతున్న డ్రైఫ్రూట్స్ను కొనుగోలు చేయలేరని విచారం వ్యక్తం చేశారు. ఈసారి తమ వ్యాపారం నడవడం కష్టమేనన్నారు. రంజాన్ సమీపిస్తున్నప్పటికీ తమకు ఇప్పటి దాకా ఎలాంటి ఆదాయం లేదన్నారు. డ్రైఫ్రూట్స్కు డిమాండ్ తక్కువగా ఉండడంతో వీటి ధర కూడా నిలకడగా ఉంటుందని మరో వ్యాపారి తెలిపారు. రంజాన్ మాసంలో హోల్సేల్ మార్కెట్లో ఖర్జూరకు కి.లో రూ.25 నుంచి 60 వరకు ధర పలుకుతోందని మరో డ్రైఫ్రూట్స్ వ్యాపారి పేర్కొన్నారు. ఖాజూ కిలో రూ.640 నుంచి 700 వరకు పలుకుతోంది. బాదామ్ కి.లో. రూ.1,400 నుంచి రూ.2,500 ధర పలుకుతోంది. అంజీర్ కిలో రూ.360 నుంచి 900, వాల్నట్ రూ.860 నుంచి 1,500, పిస్తా రూ.1,400 నుంచి 1,500 వరకు ధర పలుకుతోంది. -
ఆరోగ్యం కోసం ప్లానింగ్ తప్పదు మరి!
ఉద్యోగం పురుష లక్షణం అన్న మాటను ఎప్పుడో చెరిపేశారు మహిళలు. ప్రతి రంగంలోనూ పురుషులతో పోటీపడి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఎంత సమర్థంగా పనిచేసినా మహిళలకు ప్రకృతి పరంగా ఏర్పడిన శారీరక బలహీనతలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సమయానుకూలంగా పని చేయక తప్పదు. టార్గెట్లు అందుకోకా తప్పదు. అలాగని ఈ టెన్షన్లో పడి టైముకు తినకపోవడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మాత్రం తగదు. చాలామంది అంటుంటారు... ఇంత టెన్షన్లో తిండి గురించి ఎక్కడ ఆలోచిస్తాం అని. అది నిజం కావచ్చేమో కానీ సరి మాత్రం కాదు. పనులు ఎన్ని ఉన్నా, అందుకు తగ్గట్టుగానే భోజన వేళలను అడ్జస్ట్ చేసుకోవాలి. రోజును జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మరునాడు ఏయే పనులున్నాయో ఈ రోజు రాత్రి డైరీలో రాసుకోండి. దాన్ని బట్టి తినడానికి ఎప్పుడు టైమ్ దొరుకుతుందో అర్థమవుతుంది. బయట ఏదో ఒకటి తినేద్దాంలే అన్న నిర్లక్ష్యం వద్దు. ఆ అలవాటు ఆరోగ్యాన్ని ఎంత దెబ్బ తీస్తుందో తెలియంది కాదు. అందుకే ఇంట్లో వండి తీసుకెళ్లడమే మంచిది. కాకపోతే మీ సమయాన్ని బట్టి తేలికగా తయారయ్యే వంటకాలను ప్లాన్ చేసుకోండి. తినడానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారా? అయితే ఓ పని చేయవచ్చు. తేలికగా తినేయగల, ఇంకా చెప్పాలంటే పని చేసుకుంటూనే ఆరగించగల ఆహార పదార్థాలు కొన్ని ఉంటాయి. బిస్కట్లు, పండ్లముక్కలు, బ్రెడ్, ఉడికించిన/మొలకెత్తిన గింజలు లాంటివి. వీటిని చిన్న చిన్న డబ్బాల్లో ప్యాక్ చేసుకుని తీసుకుపోండి. అప్పుడప్పుడూ కాస్త కాస్త తింటూ ఉంటే సరిపోతుంది. తినడం అసాధ్యం అనుకున్నప్పుడు తాగడానికి ప్రాధాన్యతనివ్వండి. జ్యూసులు, రాగి/జొన్న/చోడి/సగ్గు జావల్లాంటివి చేసుకుని మూత ఉండే చిన్న చిన్న గ్లాసుల్లో వేసు కుని తీసుకెళ్లండి. ఎంత పనిలో ఉన్నా, ఎంతమంది మధ్య ఉన్నా వాటిని సేవించడం చాలా తేలిక. కొబ్బరినీళ్లు, గ్లూకోజ్ కూడా తీసుకెళ్లవచ్చు.బిజీగా ఉన్నప్పుడు తినడానికి డ్రై ఫ్రూట్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. తక్కువ మోతాదులో తీసుకున్నా, ఎక్కువ శక్తినిస్తాయి. నిజానికి ఇవన్నీ ఆప్షన్స్ మాత్రమే. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్... ఏది ఎప్పుడు చేయాలో అప్పడు చేసి తీరాలి. లేదంటే గ్యాస్ట్రిక్, పేగు సంబంధిత సమస్యలు, ఊబకాయం వంటికి వెతుక్కుంటూ వస్తాయి. కష్టపడి పని చేసేది, సంపాదించేది ఆనందంగా జీవించడానికే కదా! ఆరోగ్యం లేనప్పుడు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది! అందుకే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దాన్ని కాపాడుకోవాలనుకుంటే ఆహారాన్నీ నిర్లక్ష్యం చేయకండి! -
ఆహారమేదీ...!
స్త్రీ..గర్భిణిగా మారిన దగ్గరనుంచీ ఎన్నో జాగ్రత్తలు. పుట్టబోయే పాపాయి ముద్దుగా, బొద్దుగా ఉండాలని అనేక ప్రణాళికలు.దీనికి బలమైన తిండి, పండ్లు, వైద్యుల సహాయం, కుంకుమ పువ్వు , డ్రైఫ్రూట్స్ వగైరా..వగైరా ఇవి ఉన్నవారి లోగిళ్లలోనే. ఏ పూటకాపూట గడవడమే గగనమయ్యే పేద ఇళ్లల్లోని వారికో..ప్రభుత్వం సమకూర్చాలి. లేకుంటే వారే ఏ పాట్లో పడాలి. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ తరగతుల చెందిన కాబోయే అమ్మల పరిస్థితి ఇదే. వారికోసం ఉద్దేశించిన పథకాలు కాగితాల్లోనే కనిపిస్తున్నాయి. ఆచరణలో.. ఆరడుగుల దూరంలో ఉంటోంది. ఇదీ జిల్లాలోని దుస్థితి..యంత్రాంగం పట్టించుకోని తీరు... పాలమూరు, న్యూస్లైన్ : ఇందిరమ్మ అమృత హస్తం పేరిట మహిళలకు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామంటూ అధికారికంగా లెక్కలు చూపుతున్నా.. వాస్తవం భిన్నంగా ఉం ది. జిల్లాలోని చాలా మంది పేద కుటుంబాలకు చెందిన చిన్నారులు పౌష్టికాహార లోపంతో ఎదగాల్సి వస్తోంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో భాగంగా.. ఈ మధ్యే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తె చ్చిన పౌష్టికాహార కేంద్రాల ఊసే లేకుండా పోయింది. మాతా శిశు మరణాల నివారణ చర్యల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ జనాభా 70 శాతం ఉన్న ఆవాస ప్రాంతాల్లో పోషకాహార కేంద్రాలను నెలకొల్పేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో భాగంగా దళిత వాడల్లో జనవరి నుంచి పోషకాహార కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 927 కేంద్రాల్లో అమలు కానున్న ఈ కార్యక్రమంలో రోజుకు రూ. 10 చెల్లిస్తే రెండు పూటలా పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని గర్భిణులకు, బాలింతలకు ఈ కేంద్రాల్లో అందజేస్తారు. ఈ కార్యక్రమం నిర్వహణను డీఆర్డీఏ అధికారులకు అప్పగించారు. మన జిల్లాలో అమృత హస్తం అమలవుతోంది కాబట్టి పోషకాహార కేంద్రాలు ఏమాత్రం అవసరం లేదంటూ.. ఇక్కడి అధికారులు ఎస్సీ, ఎస్టీ పేదలకు పోషకాహారం ప్రాప్తించకుండా చేశారు. ఈ కార్యక్రమం అమలు తీరుపై ఇప్పటికే హైదరాబాద్ సెర్ఫ్ అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో మన జిల్లాను ఎంపిక చేయకపోవడం పట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అచ్చంపేట ప్రాంతంలో..! గతేడాది జనవరి 1న ప్రారంభించిన ఇందిరమ్మ అమృత హస్తం పథకం అమలు ఏడాది గడవక ముందే అథోగతి పాలైంది. జిల్లాలోని 19 ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 4423 అంగన్వాడీ కేంద్రాలు, 605 మినీ అంగన్వాడి కేంద్రాల ద్వారా అమలు జరగాల్సిన ఈ పథకం అధిక సంఖ్యలో చెంచులు, గిరిజనులు నివసించే అచ్చంపేట ఏజెన్సీ ప్రాంతంలో ఏమాత్రం అమలుకు నోచుకోవడం లేదు. ఇక్కడ ప్రభుత్వ పరంగా పౌష్టికాహారం అందించడం అంతంత మాత్రమేనని, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అప్పుడప్పుడు అందిస్తుంటారని, చెంచులు అభిప్రాయపడుతున్నారు. మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార స్థాయిని పెంచేందుకు, తక్కువ బరువు గల పిల్లల జననాలు నిరోధించేందుకు, గర్భిణుల్లో రక్తహీనతను నిర్మూలించడంతోపాటు, మానసిక వైకల్యంతో పుట్టే పిల్లల సంఖ్యను తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ పథకం లక్ష్యాలు చేరడం లేదు. ప్రతీ గర్భిణికి, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతోపాటు ఐఎఫ్ఏ మాత్రలు అందిస్తామని, సంబంధిత విభాగాలు చెబుతున్నప్పటికీ... వారి సేవలు అంతంత మాత్రమేనని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. పథకం అమలుపై నీలి నీడలు ఇందిరమ్మ అమృత హస్తం పథకం అమలుపర్చేందుకు జిల్లాలో 1000 గ్రామాలను ఎంపిక చేశారు. అది పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఎస్సీ, ఎస్టీ మహిళల్లో వెయ్యి మందిలో 18 మంది వంతున ఏటా సుమారు 20,700 మంది తల్లులయ్యే భాగ్యాన్ని పొందుతున్నారని అంచనా.. కానీ వీరికి సరైన పోషకాహారం అందక, అవగాహన లేక నెలకు సుమారు నాలుగుకు తక్కువ కాకుండా ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయి. అలా చూస్తే ఏటా సుమారు 48 మంది బాలింతలు గానీ, గర్భిణులు గానీ మరణిస్తున్నారని తెలుస్తోంది. ఈ సమస్యలను అధిగమించి పౌష్టికాహారాన్ని అందించేందుకు ఎస్సీ, ఎస్టీ జనాభా 70 శాతం దాటిన ప్రాంతాల్లో రూ.10 చెల్లిస్తే పోషకాహారాన్ని అందజేసే విధంగా పౌష్టికాహార కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న నిబంధనను జిల్లాలో అమలుపర్చకపోవడం ఇబ్బందిగా మారింది. కేంద్రాల ఏర్పాటు ఇలా.. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో భాగంగా పౌష్టికాహార కేంద్రాలను జిల్లాలో నడిపే బాధ్యతను డీఆర్డీఏ అధికారులు తీసుకుని.. వారి పర్యవేక్షణలో.. ఆహారం వండివడ్డించే బాధ్యతను పొదుపు సంఘాల మహిళలకు అప్పగించనున్నారు. ఇప్పుడు గిరిజనులు, దళితుల జనాభాతోపాటు మాతాశిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రంలోని.. మన జిల్లాను ఎంపిక చేయకపోవడం ఇబ్బందిగా మారింది. ఈ పథకంలో భాగంగా ఉదయం సమయంలో గుప్పెడు మొలకెత్తిన విత్తనాలు, 200 మిల్లీ లీటర్ల పాలు, ఒక పండు, మధ్యాహ్నం ఆకుకూర, పప్పు, ఇగురుకూర, మజ్జిగతో భోజనం అందిస్తారు. రాత్రి వేళలో అయితే కూర, రసంతో కూడిన భోజనం ఉంటుంది. దీంతోపాటు నెలకోసారి ఉచితంగా వైద్య సేవలు, సలహాలు అందించేందుకు కూడా సిబ్బందిని అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది.