Foxconn
-
ఏడాదిలో రికార్డు స్థాయిలో ఐఫోన్ ఎగుమతులు
దేశంలో తయారవుతున్న ఐఫోన్(iPhone) ఎగుమతుల విలువ 2024 ఏడాదిలో రూ.1.08 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 42% పెరుగుదలను సూచిస్తుంది. ఈ ఎగుమతులు గణనీయంగా పెరగడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(PLI) కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్లో ఐఫోన్ల వాడకం కూడా పెరగడం గమనార్హం. స్థానికంగా గతంలో కంటే వీటి వినియోగం 15-20%కి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.భారతదేశంలో యాపిల్(Apple) ప్రధాన తయారీదారులుగా ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, పెగట్రాన్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలతోపాటు ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. దాంతో వీటి ఉత్పాదకత పెరిగింది. ఆయా కంపెనీల్లో బ్లూకాలర్ ఉద్యోగాలు సైతం గణనీయంగా పెరిగాయి. ఇటీవల కాలంలో ఏడాదిలో 1,85 వేల ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడినట్లు కంపెనీల అధికారులు పేర్కొన్నారు. వీటిలో 70 శాతానికి పైగా మహిళలకే అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.ఇదీ చదవండి: 40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం! ఎలాగో తెలుసా?యాపిల్ 2024లో దేశీయంగా 12.8 బిలియన్ డాలర్లు(రూ.1.08 లక్షల కోట్లు) ఎగుమతుల మార్కును సాధించింది. భవిష్యత్తులో వీటి విలువ ఏటా 30 బిలియన్ డాలర్లకు చేర్చాలనేలా లక్ష్యం పెట్టుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం ఐఫోన్ ఉత్పత్తి ఎకోసిస్టమ్లో భారతదేశం ఉత్పాదక(Productivity) వాటా ప్రస్తుతం 14%గా ఉందని, దాన్ని భవిష్యత్తులో 26%కి పైగా పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
‘పెండింగ్ సబ్సిడీలను విడుదల చేయాలి’
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(PLI) పథకం కింద తమకు రావాల్సిన, పెండింగ్లో ఉన్న సబ్సిడీలను విడుదల చేయాలని ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు ఫాక్స్కాన్(Foxconn), డిక్సన్ టెక్నాలజీస్ ప్రభుత్వాన్ని కోరాయి. ఈ రెండు కంపెనీలు మొత్తం రూ.700 కోట్ల సబ్సిడీలను కోరుతుండగా, ఫాక్స్కాన్ రూ.600 కోట్లు, డిక్సన్కు రూ.100 కోట్లు రావాల్సి ఉంది.భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పీఎల్ఐ పథకం సబ్సిడీలో భాగంగా ప్రభుత్వం రూ.41,000 కోట్లు (4.8 బిలియన్ డాలర్లు) కేటాయించింది. అయితే, కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోకపోవడంతో ఈ మొత్తంలో కొంత భాగం చెల్లించలేదు. ఫాక్స్కాన్, డిక్సన్(Dixon) తమ ఉత్పత్తి పరిమితులను అధిగమించాయని, అందువల్ల కేటాయించని నిధుల్లో తాము వాటా పొందేందుకు అర్హులమని చెబుతున్నాయి.ఇదీ చదవండి: ఎల్ఐసీ బీమా సఖి.. 30 రోజుల్లో 50,000 రిజిస్ట్రేషన్లుదేశంలో యాపిల్ ఉత్పత్తులు తయారు చేస్తూ కంపెనీకి ప్రధాన సరఫరాదారుగా ఉన్న ఫాక్స్కాన్ మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.30,000 కోట్ల విలువైన ఐఫోన్లను ఉత్పత్తి చేసింది. ఇది దాని రూ.20,000 కోట్ల ఉత్పత్తుల తయారీ పరిమితిని అధిగమించింది. అదేవిధంగా, డిక్సన్ టెక్నాలజీస్ మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.8,000 కోట్ల విలువైన స్మార్ట్ఫోన్లను ఉత్పత్తి చేసింది. ఈ రెండు కంపెనీలు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రభుత్వ పోత్సాహకాలు అందాల్సి ఉంది. ఇరు కంపెనీల నుంచి వచ్చిన అభ్యర్థనలను ప్రభుత్వం ప్రస్తుతం సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రోత్సాహకాలు రెండు సంస్థలకు కీలకంగా మారనున్నాయి. ఈ నిధులు ఉత్పత్తిని పెంచడానికి, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, వాటి తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
వివక్షతతో కూడిన ప్రమాణాలు తొలగింపు
భారత్లో యాపిల్ సరఫరాదారుగా ఉన్న ఫాక్స్కాన్ తన ఉద్యోగుల నియామక ఏజెంట్లకు ఆదేశాలు జారీచేసింది. కంపెనీ నియామక పద్ధతుల్లో మార్పులు చేసింది. ఉద్యోగ ప్రకటనల్లో లింగం, వైవాహిక స్థితి, వయసు వంటి వివక్షతతో కూడిన ప్రమాణాలను తొలగించాలని స్పష్టం చేసింది. ఈమేరకు రాయిటర్స్ దర్యాప్తును అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్లోని ఐఫోన్ తయారీ ప్లాంట్లో వివాహిత మహిళలను అసెంబ్లింగ్-లైన్ విభాగంలో పని చేసేందుకు ఫాక్స్కాన్ గతంలో మినహాయించినట్లు రాయిటర్స్ దర్యాప్తులో తేలింది. కానీ హై ప్రోడక్టివిటీ అవసరం అయినప్పుడు మాత్రం వివాహత మహిళలపై ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది. ఈ మేరకు జూన్ 25న రాయిటర్స్ సిద్ధం చేసిన పరిశోధన పత్రాన్ని అనుసరించి కంపెనీ తాజాగా వివక్షతతో కూడిన వివరాలు రిక్రూట్మెంట్ ప్రకటనలో ఉండకూడదని ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారిని లింగం, వయసు, వైవాహిక స్థితిని అనుసరించి వేరు చేయడం సరికాదని తెలిపింది. దాంతో సదరు వివరాలు లేకుండానే చెన్నైలో కొన్ని సంస్థలు ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: నారాయణ మూర్తిని మించిన సేనాపతిఫాక్స్కాన్ ఏజెన్సీ ఇచ్చిన ఓ ప్రకటన ప్రకారం స్మార్ట్ఫోన్ తయారీ యూనిట్లోని మొత్తం అసెంబ్లింగ్ స్థానాలు తెలిపారు. కానీ వయసు, లింగం, వైవాహిక ప్రమాణాల గురించి ప్రస్తావించలేదు. ‘ఎయిర్ కండిషన్డ్ వర్క్ప్లేస్, ఉచిత రవాణా, క్యాంటీన్ సౌకర్యం, ఉచిత హాస్టల్, నెలవారీ జీతం రూ.14,974 లేదా దాదాపు 177 అమెరికన్ డాలర్ల’ వివరాలతో ప్రకటన ఇచ్చారు. -
ఫాక్స్కాన్ను మరింత విస్తరించండి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపార విస్తరణ చేపట్టాలని ప్రముఖ సెల్ఫోన్ల తయారీ కంపెనీ ఫాక్స్కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, లిథియం బ్యాటరీల తయారీకి సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. హైటెక్నాలజీ ఉత్పత్తుల తయారీ, ఆవిష్కరణలకు రాష్ట్రంలో అత్యంత అనుకూల వాతావరణం ఉందని వివరించారు. ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫోర్త్సిటీలో భాగస్వాములు కావాలని కోరారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్బాబుతో కలిసి సోమవారం కొంగరకలాన్లోని ఫాక్స్కాన్ పరిశ్రమను ఆయన సందర్శించారు.గంటకు పైగా అక్కడ గడిపిన ఆయన ఫ్యాక్టరీ ఏర్పాటులో పురోగతిని పరిశీలించారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కంపెనీ ఉత్పత్తులు, నిరుద్యోగ యువతకు కల్పించనున్న ఉపాధి అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కంపెనీ ప్రస్తుత, భవిష్యత్తు కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తోడ్పాటునందిస్తుందన్నారు. ఫాక్స్కాన్ కంపెనీ సీఈఓ, చైర్మన్ సిడ్నీ లూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్టు పురోగతిని సీఎంకు వివరించారు.కంపెనీ నిర్వహణకు సంబంధించిన కొన్ని సమస్యలను ఆయన ప్రస్తావించగా, వాటి సత్వర పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. గ్లోబల్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులకు సరైన గమ్యస్థానంగా రాష్ట్రాన్ని బలోపేతం చేయడంలో భాగంగా సీఎం రేవంత్ ఈ పర్యటనను చేపట్టారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
భారత్లో యాపిల్ నాలుగు స్టోర్లు..? ఎక్కడంటే..
ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్లో తన రిటైల్ స్టోర్లను విస్తరించాలని యోచిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబయిలో రిటైల్ స్టోర్లను ప్రారంభించిన యాపిల్ మరో నాలుగు అవుట్లెట్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. అందుకు అనుగుణంగా ఉత్పాదకతను పెంచేలా కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. దేశీయంగా యాపిల్ ఉత్పత్తుల తయారీ కోసం ఫాక్స్కాన్, టాటా వంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబర్ 20న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో దేశంలోని ముంబయి, ఢిల్లీ స్టోర్ల్లో భారీగా వినియోగదారుల రద్దీ నెలకొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థను ఆసరాగా చేసుకుని కంపెనీ రెవెన్యూ పెంచుకోవాలని ఆశిస్తుంది. దేశంలో కొత్తగా బెంగళూరు, పుణె, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబయిలో రిటైల్ స్టోర్లు ప్రారంభించాలని యోచిస్తోంది. దాంతోపాటు ‘మేడ్ ఇన్ ఇండియా’లో భాగంగా ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ను స్థానికంగా తయారు చేయాలనే ప్రతిపాదనలున్నట్లు కంపెనీ అధికారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: కేంద్రం కొత్త పథకాలు ప్రారంభం.. ఎవరికంటే..ఆపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెయిడ్రే ఓబ్రియన్ మాట్లాడుతూ..‘భారత్లో సంస్థ రిటైల్ స్టోర్లు విస్తరించాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా మెరుగైన టీమ్ను సిద్ధం చేస్తున్నాం. మా కస్టమర్ల సృజనాత్మకత, అభిరుచికి అధిక ప్రాధాన్యం ఇస్తాం. వారి ఇష్టాలకు అనువుగా సరైన ఉత్పత్తులను అందించడం సంస్థ బాధ్యత. స్థానికంగా స్టోర్లను పెంచడం ద్వారా మరింత ఎక్కువ మంది వినియోగదారులకు సేవలందించే అవకాశం ఉంటుంది’ అన్నారు. -
రూ.8,357 కోట్లతో అసెంబ్లింగ్ యూనిట్!
స్మార్ట్ఫోన్ డిస్ప్లే మాడ్యుళ్ల అసెంబ్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఫాక్స్కాన్ సంస్థ యోచిస్తోంది. తమిళనాడులో ప్రారంభించాలనుకుంటున్న ఈ యూనిట్ ఏర్పాటు కోసం సుమారు ఒక బిలియన్ డాలర్లు(రూ.8,357 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు.ఫాక్స్కాన్ ఇప్పటికే తమిళనాడులో యాపిల్ ఐఫోన్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. వీటిని దేశీయంగా వాడడంతోపాటు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తాజాగా ప్రతిపాదించిన యూనిట్ అందుబాటులోకి వస్తే చైనా వంటి దేశాల నుంచి అసెంబ్లింగ్ చేసిన డిస్ప్లే మాడ్యూల్స్ను దిగుమతి చేసుకునే బదులుగా స్థానికంగానే వీటిని ఉత్పత్తి చేయవచ్చు. దాంతో ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు పేర్కొన్నారు. ఈ యూనిట్ ఎలక్ట్రానిక్ అసెంబ్లీ, తయారీలో ఫాక్స్కాన్కు విలువ జోడిస్తుందని తెలిపారు. స్మార్ట్ఫోన్ అసెంబ్లింగ్లో దాదాపు 5 శాతం రెవెన్యూ ఉత్పత్తి అయితే, డిస్ప్లే అసెంబ్లింగ్లో అదనంగా మరో 2-3 శాతం రెవెన్యూ ఉత్పత్తి అవుతుందని నిపుణులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది?ఫాక్స్కాన్ భారత్లో గూగుల్ పిక్సెల్ ఫోన్లను కూడా అసెంబుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈమేరకు ఇరు కంపెనీల మధ్య కొంతకాలంగా చర్యలు సాగుతున్నాయి. డిస్ప్లే మాడ్యూళ్లలో ప్రధానంగా 60-65% విడిభాగాలు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. దక్షిణ కొరియా 20-25% సరఫరా చేస్తోంది. స్థానికంగా డిస్ప్లే అసెంబ్లింగ్ యూనిట్ ప్రారంభమైతే దిగుమతులు తగ్గి స్థానిక అవసరాలు తీర్చుకునే వెసులుబాటు ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
డిజైన్, టెక్నాలజీలో మహిళలకు అగ్రస్థానం
ఐఫోన్ కాంట్రాక్టు తయారీ సంస్థ ఫాక్స్కాన్ తమ భారత విభాగంలో మహిళలకు ప్రాధాన్యమివ్వడంపై మరింతగా దృష్టి పెడుతోంది. మహిళలను కేవలం అసెంబ్లింగ్ విభాగానికే పరిమితం చేయకుండా డిజైన్, టెక్నాలజీ సంబంధ హోదాల్లో సారథ్యం వహించేలా చర్యలు చేపడుతున్నట్లు ఫాక్స్కాన్ ఛైర్మన్ యంగ్ లియు తెలిపారు.మహిళలు తమ కెరియర్లో పురోగతి సాధించేందుకు కంపెనీ మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నట్లు లియు పేర్కొన్నారు. ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో 70 శాతం మంది మహిళలు, 30 శాతం మంది పురుషులు ఉన్నారు. ఫాక్స్కాన్కు సంబంధించి భారత్లో మొత్తం 48,000 మంది ఉద్యోగులు ఉండగా, కొత్తగా రిక్రూట్ చేసుకున్న వారిలో 25 శాతం మంది వివాహిత మహిళలు ఉన్నట్లు లియు వివరించారు. సంస్థ ఇటీవలే చెన్నైకి దగ్గర్లోని శ్రీపెరంబుదూర్లో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ను ఆవిష్కరించింది.ఇదీ చదవండి: ప్రభుత్వ కంపెనీలకు జరిమానా!ఫాక్స్కాన్ రూ.25,000 కోట్లతో కర్ణాటకలో మొబైల్ తయారీ ప్లాంటును నిర్మిస్తోంది. దీనితో 40,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ యూనిట్ ఏర్పాటు కోసం తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. -
ఏడాదిలోనే రూ.2 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం
ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరున్న యాపిల్ భారత్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఇండియాలోనే రూ.2 లక్షల కోట్ల వ్యాపారం సాగించింది. దేశీయంగా ఐఫోన్లు, మ్యాక్బుక్లు, ఐప్యాడ్లు, యాపిల్ వాచ్లకు భారీ గిరాకీ ఏర్పడిందని కంపెనీ తెలిపింది. ఏడాది వ్యవధిలోనే రూ.2 లక్షల కోట్లు వ్యాపార మార్కును సాధించడానికిగల కారణాలను కంపెనీ విశ్లేషించింది.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఎంతో ఉపయోగపడ్డాయి.పాక్స్కాన్తో భాగస్వామ్యం కుదుర్చుకుని తమిళనాడులో ఐఫోన్లను తయారు చేస్తోంది.2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా తయారైన రూ.1.35 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను కంపెనీ ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. స్థానికంగా రూ.68,000 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.అంతర్జాతీయంగా యాపిల్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్కు తగిన విధంగా తయారీ పెంచేందుకు ఫాక్స్కాన్తోపాటు విస్ట్రోన్, పెగాట్రాన్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంది.కర్ణాటకలో యాపిల్ ఐఫోన్ తయారీ ప్లాంట్ ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ను సిద్ధం చేస్తోంది. ఏటా ఆ ప్లాంట్లో దాదాపు 2 కోట్లు యూనిట్లను తయారుచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.దేశీయంగా యాపిల్ ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేకంగా ముంబయి, ఢిల్లీలో అవుట్లెట్లు ఏర్పాటు చేశారు.ఈకామర్స్ ప్లాట్పామ్లతో జతకట్టి యాపిల్ 42 శాతం ఉత్పత్తులను విక్రయిస్తోంది.ఇదీ చదవండి: చిన్న కిటుకుతో సిబిల్ స్కోర్ పెంపుప్రధానంగా యాపిల్ ప్రీమియం ఉత్పత్తులపై ఎక్కువ దృష్టి పెడుతోంది. దానివల్ల మార్జిన్ ఎక్కువగా సమకూరుతుంది.అత్యాధునిక మార్కెటింగ్తో పెరుగుతున్న బ్రాండ్ విలువ కంపెనీకి ఎంతో లాభం చేకూరుస్తోంది. -
భారత్లో ఫాక్స్కాన్ బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్
శ్రీపెరంబదూర్: భారత్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్టు తైవాన్కు చెందిన ఎల్రక్టానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్లీ ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహన విభాగంపై దృష్టితో బ్యాటరీ తయారీ వ్యాపార విస్తరణపై ఫాక్స్కాన్ దృష్టి సారించింది. ఈ సంస్థ ఈ–బస్ల కోసం తైవాన్లో ఇలాంటి ప్లాంట్ ఒకదాన్ని ఇప్పటికే ఏర్పాటు చేయగా, ఈ ఏడాదే ఉత్పత్తి మొదలు కానుంది. ‘‘3ప్లస్3 భవిష్యత్ పరిశ్రమ ఏర్పాటుకు వేచి చూస్తున్నాం. తమిళనాడులో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ఏర్పాటు విషయంలో సహకారం ఎలా అన్నదానిపై పరిశ్రమల మంత్రితో చర్చిస్తున్నా’’ అని యాంగ్లీ తెలిపారు. సోలార్, విండ్ టర్బయిన్ల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ను నిల్వ చేసేందుకు బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు వీలు కలి్పస్తాయి. మన దేశం పెద్ద ఎత్తున పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాధాన్యం ఇస్తుండడం తెలిసిందే. దీంతో ఈ విభాగంలో అవకాశాలను సొంతం చేసుకునేందుకు ఫాక్స్కాన్ ఆసక్తిగా ఉన్నట్టు యాంగ్లీ మాటలను బట్టి తెలుస్తోంది. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిశగా ఫాక్స్కాన్ ప్రణాళికలు అమలు చేస్తోంది. త్వరలోనే ఈవీల తయారీ మొదలవుతుందని యాంగ్లీ తెలిపారు. భారత్లో ఇప్పటివరకు తాము 1.4 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశామని, వ్యాపారం 10 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందినట్లు చెప్పారు. రానున్న ఏడాది కాలంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ప్రస్తుత భారత పర్యటనలో భాగంగా పలు రాష్ట్రాల సీఎంలతో యాంగ్లీ సమావేశం కావడం గమనార్హం. ఎన్నో రాష్ట్రాలను సందర్శించిన తర్వాత భారత్ వృద్ధి పథకంలో ఉందని అర్థమవుతోందంటూ.. ఈ ప్రయాణంలో ఫాక్స్కాన్ సైతం భాగస్వామి కావాలనుకుంటున్నట్టు యాంగ్లీ చెప్పారు. -
‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ విస్తరణపై చర్చలు
ఫాక్స్కాన్ కంపెనీ భవిష్యత్తు విస్తరణ అవకాశాలు ఎలా ఉన్నాయో కర్ణాటక ప్రభుత్వంతో చర్చించింది. ఈమేరకు కంపెనీ సీఈఓ యంగ్ లియు కర్ణాటకలో మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్ ప్రారంభించేందుకు సీఎం సిద్ధరామయ్యతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ పేరుతో ఫాక్స్కాన్ ఐఫోన్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించింది. అనంతరం ఐటీఐఆర్ ఇండస్ట్రీ ఏరియాలో ప్రభుత్వం 300 ఎకరాల భూమిని ఫాక్స్కాన్కు కేటాయించింది. ఈమేరకు భవిష్యత్తు విస్తరణ అవకాశాలు ఎలా ఉన్నాయనే అంశాలపై తాజాగా చర్చలు జరిగాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ..‘ఫాక్స్కాన్తో రాష్ట్ర ప్రభుత్వం జతకట్టడం సంతోషంగా ఉంది. ఈ సహకారంతో స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఈఎస్డీఎం) రంగంలో కర్ణాటక దేశ ఎగుమతుల్లో భాగమైంది. రాష్ట్రంలో సమర్థవంతమైన లాజిస్టిక్స్, విద్యుత్ సరఫరా, నైపుణ్యం కలిగిన వర్క్ఫోర్స్ ఉంది. కంపెనీలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని లాభాలు పొందాలి. దాంతోపాటు రాష్ట్రానికి మేలు చేయాలని భావిస్తున్నాం. ఫాక్స్కాన్ తన ప్రాజెక్ట్లను విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని అన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, భారీ, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: విషపూరిత మందులు.. లక్షల్లో మరణాలు!తమిళనాడులో ఇప్పటికే ఫాక్స్కాన్ ఐఫోన్లను తయారు చేస్తోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా యాపిల్ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుండడంతో తయారీని పెంచాలని కంపెనీ నిర్ణయించింది. దాంతో కర్ణాటకలో ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ పేరుతో భారీ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దొడ్డబల్లాపుర, దేవనహల్లిలో 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.22,000 కోట్లుగా అంచనా వేశారు. దీనివల్ల సుమారు 40,000 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ చెప్పింది. ఈ యూనిట్లో ఏటా రెండు కోట్ల స్మార్ట్ఫోన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫాక్స్కాన్ ఇప్పటికే ‘ప్రాజెక్ట్ చీతా’ పేరుతో ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే మెకానికల్ కాంపోనెంట్ల తయారీ ప్లాంట్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తోంది. -
ఫోర్త్సిటీ ఏర్పాటులో మీ విజన్ అద్భుతం
సాక్షి, న్యూఢిల్లీ: ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లతోపాటు అన్నిరంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్కు ఉందని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్లియూ అన్నారు. త్వరలోనే తన బృందంతో కలిసి నగరాన్ని సందర్శిస్తానని తెలిపారు. యంగ్లియూ నేతృత్వంలోని ఫాక్స్కాన్ ప్రతినిధి బృందం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ఆయన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం సమావేశమైంది. నగరానికి ఉన్న చరిత్ర.. పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను సీఎం రేవంత్ ఫాక్స్కాన్ బృందానికి వివరించారు.430 ఏళ్ల కింద పునాదిరాయి పడిన హైదరాబాద్లో అభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకే తాము ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్టు ఫ్యూచర్ సిటీ పేరుతో నాలుగోనగరానికి (ఫోర్త్ సిటీ) రూపకల్పన చేస్తున్నామని సీఎం రేవంత్ వివరించారు. ఫోర్త్ సిటీలో విద్య. వైద్యం, క్రీడా, ఎలక్ట్రానిక్స్–ఎలక్ట్రికల్, స్కిల్స్..ఇలా బహుముఖంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఫోర్త్ సిటీలో ఫాక్స్కాన్ సంస్థ పరిశ్రమలు పెట్టేందుకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వడంతోపాటు అవసరమైన మద్దతు అందజేస్తామని సీఎం ఫాక్స్కాన్ చైర్మన్కు హామీ ఇచ్చారు. ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు, ఇటీవల సీఎం రేవంత్ నేతృత్వంలో తమ బృందం అమెరికా, దక్షిణకొరియాలో పర్యటించి దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో జరిపిన చర్చలు, చేసుకున్న ఒప్పందాలను మంత్రి శ్రీధర్ బాబు యంగ్లియూకి వివరించారు.ఫోర్త్ సిటీ రూపకల్పనలో ముఖ్యమంత్రి దార్శనికత, పారిశ్రామిక అనుకూల విధానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని యంగ్లియూ రేవంత్ను అభినందించారు. తాను సాధ్యమైనంత త్వరలోనే హైదరాబాద్ను సందర్శిస్తానని.. అంతకుముందే తమ చీఫ్ క్యాంపస్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్యాథీ యాంగ్, సంస్థ భారత దేశ ప్రతినిధి వీలీ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వస్తుందని చెప్పారు.ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన స్కిల్స్ను యువతకు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి ఫాక్స్కాన్ చైర్మన్కు వివరించారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు జయేశ్ రంజన్, డాక్టర్ విష్ణువర్ధన్రెడ్డి , ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డిలతో పాటు డాక్టర్ ఎస్.కే. శర్మ, బాబ్చెన్, జొవూ, సూషొకూ, సైమన్సంగ్ తదితరులు పాల్గొన్నారు. -
భారత్లో ఐప్యాడ్ తయారీ..?
భారత్లో యాపిల్ ఉత్పత్తులను తయారుచేస్తున్న ఫాక్స్కాన్ తన కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తోంది. ప్రస్తుతం తమిళనాడు యూనిట్లో యాపిల్ ఐఫోన్లను తయారుచేస్తున్న కంపెనీ త్వరలో ఐప్యాడ్లను కూడా అసెంబుల్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ మేరకు త్వరలో కంపెనీ నుంచి ప్రకటన విడుదల కావొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు.యాపిల్ భారత్లో మరిన్ని ఉత్పత్తులను తయారుచేసేందుకు ఆసక్తిగా ఉందని గతంలోనే ప్రకటించింది. ఇప్పటికే ముంబయి, దిల్లీలో ప్రత్యేకంగా యాపిల్ అవుట్లెట్లను ప్రారంభించింది. తమిళనాడులో ఫాక్స్కాన్ ద్వారా ఐఫోన్లను తయారు చేస్తోంది. ఆ యూనిట్లోని పరికరాల్లో కొన్నింటిని అప్గ్రేడ్ చేసి ఐప్యాడ్లను తయారు చేయవచ్చని నిపుణులు సూచించినట్లు తెలిసింది. అందుకు సంస్థ కూడా ఆమోదం తెలిపిందని కొందరు అధికారులు చెప్పారు. త్వరలో దీనిపై కంపెనీ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. యాపిల్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి పూర్తిగా చైనాపైనే ఆధారపడకుండా విభిన్న ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా ఐప్యాడ్ తయారీలో కొంత భాగాన్ని గత సంవత్సరం వియత్నాంకు మళ్లించారు.తమిళనాడులో కొత్త యూనిట్ కోసం భారత్కు చెందిన ఓ సంస్థ రూ.1,200 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఫాక్స్కాన్ ఫిబ్రవరిలో ప్రకటించింది. బడ్జెట్ 2024-25లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీను 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. దాంతో దేశీయ తయారీకి ప్రోత్సహం లభించనుంది. యాపిల్ సంస్థ ఫాక్స్కాన్ ద్వారా భారత్లో ఐప్యాడ్ల ఉత్పత్తి ప్రారంభిస్తే స్థానికంగా మరింత మంది ఉపాధి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. దాంతోపాటు అంతర్జాతీయంగా భారత్లో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్ఐ) వల్ల కూడా దేశీయ తయారీని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: భారమవుతున్న విద్యారుణాలు!ట్రెండ్ఫోర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ బోయ్స్ ఫ్యాన్ మాట్లాడుతూ..‘భారత్లో ఐప్యాడ్ ఉత్పత్తిని చేపట్టడం వల్ల సప్లై-చైన్ డిమాండ్ను భర్తీ చేయవచ్చు. దేశీయంగా యాపిల్ ఉత్పతులకు మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఐప్యాడ్ ఎగుమతులు 49 మిలియన్ల(4.9 కోట్లు)కు చేరుకుంటాయని అంచనా’ అని తెలిపారు. -
‘ఓలా అలా కాదు’.. మహిళా నియామకాలపై భవిష్ అగర్వాల్
ఫాక్స్కాన్ నియామక పద్ధతులపై వచ్చిన వార్తలపై ఓలా వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ భవీష్ అగర్వాల్ స్పందించారు. తమ కొత్త కర్మాగారాల్లో వివాహితలతో సహా మహిళల నియామకం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వివాహితలను నియమించుకోవడంపై ఓలాకు ఎటువంటి వ్యతిరేక విధానం లేదని అగర్వాల్ పేర్కొన్నారు.ఇటీవల ఓ మీడియా సమావేశంలో భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. 'మహిళలు ఎక్కువ క్రమశిక్షణ, నైపుణ్యంతో ఉంటారు. మేము మా కర్మాగారాలలో మహిళా శ్రామిక శక్తిని నియమించడం కొనసాగిస్తాం. పెళ్లైన మహిళలను నియమించుకోకూడదనే ఫాక్స్కాన్ లాంటి విధానాలు మా దగ్గర లేవు’ అన్నారు.భారత్లో మహిళా శ్రామిక శక్తి తక్కువగా ఉందని, దీనిని పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం జూనియర్ స్థాయి ఉద్యోగాల్లో మహిళలను ఎక్కువగా నియమించుకుంటున్నామని, సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో కూడా మరింత మంది మహిళలను నియమించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.కాగా మహిళా శ్రామిక శక్తిని పెంపొందించడంపై ఓలా ఎలక్ట్రిక్ గతంలోనే తమ వైఖరిని ప్రకటించింది. "ఈ రోజు, ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీని పూర్తిగా మహిళలే నడుపుతారని ప్రకటించడానికి నేను గర్విస్తున్నాను. ఈ వారం మేము మొదటి బ్యాచ్ ను స్వాగతించాం. పూర్తి సామర్థ్యంతో, ఫ్యూచర్ ఫ్యాక్టరీ 10,000 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తుంది, ఇది మహిళలకు మాత్రమే పనిచేసే ప్రపంచంలోనే అతిపెద్ద కర్మాగారం, ఏకైక మహిళా ఆటోమోటివ్ తయారీ కేంద్రంగా మారుతుంది'' అని బ్లాగ్ పోస్ట్లో భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు.యాపిల్ ఉత్పత్తుల అతిపెద్ద సరఫరాదారు అయిన ఫాక్స్కాన్ భారత్లోని తన ఐఫోన్ కర్మాగారంలో వివాహిత మహిళలను ఉద్యోగాలకు తిరస్కరిస్తున్నట్లు ఇటీవలి పరిశోధనాత్మక నివేదిక బహిర్గతం చేసింది. తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఉన్న ప్రధాన ఐఫోన్ అసెంబ్లింగ్ ఫ్యాక్టరీలో వివాహిత మహిళలను ఉద్యోగావకాశాల నుంచి తప్పించారని నివేదిక ఆరోపించింది. -
తైవాన్ వ్యక్తికి పద్మభూషణ్ - ఎవరీ యంగ్ లియు!
Foxconn CEO Young Liu: 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అవార్డు గ్రహీతలలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ కంపెనీ సీఈఓ 'యంగ్ లియు' (Young Liu) ను కూడా పద్మభూషణ్ వరించింది. 66 ఏళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO).. తైవాన్కు చెందిన హాన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్కాన్) చైర్మన్ 'యంగ్ లియు' నాలుగు దశాబ్దాల కాలంలో మూడు కంపెనీలను స్థాపించారు. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో యంగ్ లియుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది. యంగ్ లియు స్థాపించిన మూడు కంపెనీలలో యంగ్ మైక్రో సిస్టమ్స్ అని పిలువబడే మదర్బోర్డ్ కంపెనీ (1988), నార్త్బ్రిడ్జ్ అండ్ సౌత్బ్రిడ్జ్ ఐసీ డిజైన్ కంపెనీ (1995), ఐటీఈ టెక్ అండ్ ఏడీఎస్ఎల్ ఐసీ డిజైన్ కంపెనీ (1997) ఉన్నాయి. తైవాన్కు చెందిన యంగ్ లియు 1978లో తైవాన్లోని నేషనల్ చియావో తుంగ్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రోఫిజిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, ఆ తరువాత సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. భారతదేశంలో ఫాక్స్కాన్ ఉనికి భారతదేశంలో.. ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో గణనీయమైన పెట్టుబడులు, వెంచర్లతో తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్న కంపెనీల జాబితాలో ఫాక్స్కాన్ ఒకటిగా ఉంది. ఈ సంస్థ తమిళనాడులో ఐఫోన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు 40000 మంది పనిచేస్తున్నారు. ఫాక్స్కాన్ సంస్థ బెంగళూరు శివార్లలో యూనిట్ను నెలకొల్పడానికి కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా సుముఖత చూపిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా కొత్త నిర్మాణ ప్రాజెక్టుల కోసం 1.6 బిలియన్ డాలర్ల గణనీయమైన పెట్టుబడితో భారతదేశంలో తన ఉనికిని విస్తృతం చేయబోతున్నట్లు ఫాక్స్కాన్ సీనియర్ అధికారి గత సంవత్సరం తెలిపారు. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఫాక్స్కాన్ దేశంలో విస్తృత సేవలను అందించనున్నట్లు సమాచారం. పద్మ అవార్డ్స్ 2024 కేంద్రం ప్రకటించిన మొత్తం పద్మ అవార్డులలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు / NRI / PIO / OCI వర్గానికి చెందిన వారు, 9 మంది మరణానంతర అవార్డు గ్రహీతలు ఉన్నారు. విదేశీయులకు పద్మ అవార్డులు ఎందుకిస్తారంటే! కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పద్మ అవార్డ్స్ వెబ్సైట్ ప్రకారం.. ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను కేవలం భారతీయులకు మాత్రమే ఇవ్వాలనే నిబంధన లేదు. దేశంలో కళలు, సాహిత్యం, విద్య, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, క్రీడలు, వైద్యం, పౌర సేవ, వాణిజ్యం, పరిశ్రమలతో సహా అనేక రంగాలలో విశిష్టమైన, అసాధారణమైన సేవలందించిన ఎవరికైనా పద్మ అవార్డులు ప్రకటిస్తారు. ఈ ఏడాది ఈ విభాగంలో 8 మంది ఉన్నట్లు తెలుస్తోంది. -
రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించారు. పారిశ్రామికరంగ అభివృద్ధిలో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు సులభంగా లభించేలా చూస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ సంస్థ ఫాక్స్కాన్కు చెందిన హాన్హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి వీ లీ నేతృత్వంలోని బృందం మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ను కలిసింది. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఫాక్స్కాన్ చేపట్టిన ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా రేవంత్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేస్తామని, అన్ని రంగాలను ప్రోత్సహించేందుకు స్నేహపూర్వక విధానాలు అవలంబిస్తామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. కొంగరకలాన్లో ఫాక్స్కాన్ ఉత్పాదక కేంద్రం నిర్వహణకు, ఫాక్స్కాన్ రాష్ట్రంలో చేపట్టే భవిష్యత్తు ప్రాజెక్టులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. రెండేళ్లలో 25 వేల ఉద్యోగాలు... ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థగా పేరొందిన ఫాక్స్కాన్కు యాపిల్ ఐఫోన్తోపాటు గూగుల్, షియోమీ, అమెజాన్, హ్యూలెట్ పాకర్డ్, అలీబాబా, సిస్కో, ఫేస్బుక్, సోనీ, మైక్రోసాఫ్ట్, నోకియా వంటి దిగ్గజ కంపెనీలు కస్టమర్లుగా ఉన్నాయి. చైనా, వియత్నాం, థాయ్లాండ్, మలేసియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాల్లో ఫాక్స్కాన్ కార్యకలాపాలు సాగిస్తోంది. భారత్లో శ్రీసిటీ (ఏపీ), శ్రీపెరంబదూర్ (తమిళనాడు), బెంగళూరు (కర్ణాటక)తోపాటు తెలంగాణ (కొంగరకలాన్)లో ఉత్పాదక కేంద్రాలు ఉన్నాయి. యాపిల్ ఐఫోన్లకు ఇయర్పాడ్స్ తయారీకి సంబంధించి తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వంతో ఫాక్స్కాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాంటు నిర్మాణం కోసం ఈ ఏడాది మే 15న శంకుస్థాపన చేసింది. కొంగరకలాన్ ప్లాంటు ద్వారా దశలవారీగా లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే రెండేళ్లలో ఫాక్స్కాన్ కొంగరకలాన్ యూనిట్ ద్వారా 25 వేల ఉద్యోగాల కల్పన జరగనుంది. -
దేశంలో నిలిచిన ఐఫోన్ల తయారీ.. కారణం చెప్పిన ఫాక్స్కాన్
ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని చైనా నుంచి ఇండియాకు మార్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో చైనా తర్వాత ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న గ్లోబల్ కంపెనీలకు భారత్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అందువల్లే యాపిల్ సంస్థ దేశంలోని చెన్నైలో తైవాన్ కంపెనీ ఫాక్స్కాన్ ద్వారా ఐఫోన్లు తయారుచేస్తోంది. కానీ ప్రస్తుతం అది నిలిచిపోయింది. అందుకుగల కారణాలు ఎంటో ఈ కథనంలో తెలుసుకుందాం. తైవాన్ టెక్ కంపెనీ ఫాక్స్కాన్ యాపిల్ ఐఫోన్లను మన దేశంలోని చెన్నైలో తయారు చేస్తోంది. అయితే తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కంపెనీ తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. అక్కడి పరిస్థితులు ఇంకా కొలిక్కి రాకపోవటంతో ఐఫోన్ల నిలిపివేత ఇంకా కొనసాగుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక ఉత్పత్తి తిరిగి ప్రారంభిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి. తమిళనాడు వ్యాప్తంగా మిచౌంగ్ తుపాను వల్ల కురుస్తోన్న కుండపోత వర్షాలతో చెన్నైలోని ఫాక్స్కాన్ ప్లాంట్ వరదల్లో మునిగిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఫాక్స్కాన్, పెగాట్రాన్ చెన్నై సమీపంలోని తమ ఫ్యాక్టరీల్లో ఐఫోన్ ఉత్పత్తిని నిలిపివేసాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు చేరుకోవడంతో రవాణాకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇదీ చదవండి: తగ్గిన డీజిల్ అమ్మకాలు.. కారణం ఇదే.. చైనా నుంచి ఐఫోన్ తయారీని మార్చాలనే క్రమంలో యాపిల్ తన ఉత్పత్తిని 2020లో ఇండియాకు షిఫ్ట్ చేసింది. ఇప్పుడు భారతదేశం ఐఫోన్ ఉత్పత్తిలో సుమారు 7 శాతం వాటాను కలిగి ఉంది. అయితే 2025 నాటికి కంపెనీ తన ఉత్పత్తిని 25 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ లక్ష్యాన్ని అందుకునే దిశగా కంపెనీ తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 35,000 ఉద్యోగులు పనిచేస్తున్నారు. గడిచిన రెండో త్రైమాసికం(సెప్టెంబర్)లో 25 లక్షల యూనిట్లను తయారుచేసినట్లు తెలిసింది. -
భారత్లో మరో 1.6 బిలియన్ డాలర్లు
ముంబై: ఐఫోన్ల కాంట్రాక్ట్ తయారీ సంస్థ, తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్కాన్ భారత్లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో 1.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 13 వేల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు తైవాన్లోని స్టాక్ ఎక్స్చేంజీలకు సంస్థ తెలియజేసింది. భారత్లోని తమ అనుబంధ సంస్థ హోన్ హాయ్ టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్మెంట్ ద్వారా పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొంది. చైనాకు మాత్రమే పరిమితం కాకుండా కార్యకలాపాలను ఇతర దేశాలకు కూడా మళ్లించే వ్యూహంలో భాగంగా (చైనా ప్లస్ వన్) కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటం తరచుగా సమస్యలకు దారి తీస్తున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఫాక్స్కాన్ ఇప్పటికే భారత్లో దాదాపు 8 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. భారత మార్కెట్లో అవకాశాల రీత్యా ఇక్కడ తమ పెట్టుబడులను గతేడాదితో పోలిస్తే మరింతగా పెంచుకునే అవకాశం ఉందని కంపెనీ చైర్మన్ యంగ్ లియు ఇటీవలే తెలిపారు. ఐఫోన్ల తయారీలో టాప్.. అమెరికా టెక్ దిగ్గజం యాపిల్కు అత్యధికంగా ఐఫోన్లను సరఫరా చేసే కాంట్రాక్ట్ తయారీ సంస్థల్లో ఫాక్స్కాన్ది అగ్రస్థానం. భారత్లోనూ పోటీ సంస్థలైన టాటా, పెగాట్రాన్కు మించి ఉత్పత్తి చేస్తోంది. ఫాక్స్కాన్ ఆదాయంలో దాదాపు సగభాగం ఐఫోన్ల తయారీ ద్వారానే ఉంటోంది. కంపెనీకి భారత్లో 40,000 మంది పైగా వర్కర్లు ఉన్నారు. ఇక్కడ మొత్తం 30 ఫ్యాక్టరీలు ఉండగా, ఏటా దాదాపు 10 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోంది. 2022లో ఫాక్స్కాన్ ఆదాయం 216 బిలియన్ డాలర్లు కాగా అందులో భారత విభాగం వాటా 4.6%గా నమోదైంది. అంతక్రితం ఏడాది 2021లో ఇది 2%గా ఉండేది. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఎల్రక్టానిక్ పరికరాల తయారీ కోసం మరో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఫాక్స్కాన్ యోచిస్తోంది. అటు కర్ణాటకలో రూ. 8,800 కోట్లతో ఐఫోన్ విడిభాగాల యూనిట్ నెలకొల్పే యోచన కూడా ఉంది. ఇందుకు తుమకూరులోని జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్లో స్థలాన్ని కూడా అధికారులు పరిశీలించినట్లు సమాచారం. కొత్తగా ప్రతిపాదించిన 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికల్లోనే ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా భాగంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీతో కొత్తగా 14,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగవచ్చని అంచనా. ఇందులో ఫోన్ స్క్రీన్లు, వెలుపలి కవరింగ్లు తయారు చేసే అవకాశం ఉంది. సెమీకండక్టర్లపైనా దృష్టి.. భారత్లో తొలి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ఫాక్స్కాన్ సైతం పోటీపడుతోంది. ఇందుకోసం ముందుగా వేదాంత సంస్థతో జట్టు కట్టినప్పటికీ, తర్వాత ఆ జాయింట్ వెంచర్ నుంచి పక్కకు తప్పుకుంది. భారతీయ భాగస్వామి అవసరం లేకుండా సొంతంగానే ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించి తమ ఫ్యాబ్ యూనిట్ ప్లాన్కి ఆమోదం పొందేందుకు ప్రభుత్వంతో చర్చలు కూడా జరుపుతున్నట్లు కంపెనీ గతంలో తెలిపింది. -
27 సంస్థలకు ఐటీ హార్డ్వేర్ పీఎల్ఐ స్కీము
న్యూఢిల్లీ: దేశీయంగా ఐటీ హార్డ్వేర్ తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీము కింద 27 సంస్థలు ఎంపికయ్యాయి. అనుమతి పొందిన వాటిలో డెల్, హెచ్పీ, ఫ్లెక్స్ట్రానిక్స్, ఫాక్స్కాన్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థల్లో 95 శాతం కంపెనీలు (23) ఇప్పటికే తయారీకి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మిగతా నాలుగు కంపెనీలు వచ్చే 90 రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించగలవని ఆయన వివరించారు. ‘ఈ 27 దరఖాస్తులతో దాదాపు రూ. 3,000 కోట్ల మేర పెట్టుబడులు రాగలవు. అంతకన్నా ముఖ్యంగా విలువను జోడించే ఉత్పత్తుల తయారీ వ్యవస్థ భారత్ వైపు మళ్లగలదు‘ అని మంత్రి పేర్కొన్నారు. పీసీలు, సర్వర్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు వంటి ఐటీ హార్డ్వేర్ తయారీలో భారత్ దిగ్గజంగా ఎదిగేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. అదనంగా రూ. 3.5 లక్షల కోట్ల విలువ చేసే ఉత్పత్తుల తయారీకి, ప్రత్యక్షంగా 50,000 మంది .. పరోక్షగా 1.5 లక్షల మంది ఉపాధి పొందడానికి స్కీము దోహదపడగలదని మంత్రి చెప్పారు. -
మోదీజీ..వచ్చే ఏడాదికి గొప్ప బర్త్డే గిఫ్ట్: ఫాక్స్కాన్ పోస్ట్ వైరల్
యాపిల్ ఐఫోన్ తయారీదారు తైవాన్కు చెందిన పాక్స్కాన్(Foxconn) దేశంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించనుంది. భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో దాని తయారీ సౌకర్యాలను వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారీగా ఉద్యోగావకాశాలను కల్పించనుంది. భారతదేశంలో తన ఉద్యోగులను రెట్టింపు చేయాలని నిర్ణయించింది ఫాక్స్కాన్ ప్రతినిది లింక్డ్ఇన్ ఖాతా ద్వారా ఈవిషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఆదివారం ప్రధానమంద్రి నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజు సందర్భంగా ఫాక్స్కాన్ ప్రతినిధి వి లీ ఈ విషయాన్నిఅధికారికంగా ప్రకటించారు. "హ్యాపీ బర్త్డే, గౌరవ ప్రధానమంత్రి. మీ నాయకత్వంలో ఫాక్స్కాన్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందింది. వచ్చే ఏడాది గొప్ప బహుమతి అందించేలా మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, దేశంలో వ్యాపార వృద్ధితోపాటు, రెట్టింపు ఉపాధిని అందించే లక్ష్యంతో మరింత కష్టపడి పని చేస్తామంటూ ప్రకటించారు. చైనాఆంక్షల నేపథ్యంలో అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ఇండియాపై దృష్టిపెడుతోంది. తద్వారా ఐఫోన్ విక్రయాలకు పెద్ద మార్కెట్గా ఉన్న చైనాపై ఆధార పడటాన్ని తగ్గించాలని కంపెనీ చూస్తోంది. తమిళనాడు ప్లాంట్లో ఇప్పటికే 40వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. (మ్యూచువల్ ఫండ్స్లో ఎన్నో అవకాశాలు..కానీ వాటిని నమ్మొద్దు!) ఫాక్స్కాన్ ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్లో ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీదారుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టులో, ఫాక్స్కాన్ రాష్ట్రంలోని రెండు ప్రాజెక్టులలో 600 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కర్ణాటక ప్రకటించింది. ఇక్కడ ఐఫోన్ల కేసింగ్ కాంపోనెంట్స్ , చిప్ తయారీకి సంబంధించిన పరికరాల ఉత్పత్తికానున్నాయి. మరోవైపు తెలంగాణలోఇటీవల మరో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఆ సంస్థ మొత్తం 550 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది. (గణేష్ చతుర్థి: ఈ మూడు రోజులు సెలవులేనా? ఇవిగో వివరాలు) గత నెలలో ఎర్నింగ్స్ బ్రీఫింగ్ సందర్భంగా, ఫాక్స్కాన్ ఛైర్మన్ లియు యంగ్-వే ఇండియా మార్కెట్పై భారీ ఆశలే ప్రకటించారు. మల్టీ బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రారంభం మాత్రమేనని పేర్కొనడం గమనార్హం. -
భారత్లో ఫాక్స్కాన్ ఈవీ ప్లాంట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తైవాన్కు చెందిన చిప్ తయారీ సంస్థ ఫాక్స్కాన్ భావిస్తోంది. అయితే ఫాక్స్కాన్ ఇతర ఈవీ కంపెనీల కోసం కాంట్రాక్ట్ తయారీ చేపడుతుందా లేదా సొంత బ్రాండ్ కింద మోడళ్లను విక్రయించబోతోందా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి తమిళనాడును తమ స్థావరంగా ఉపయోగించుకోవాలని ఫాక్స్కాన్ చైర్మన్ చర్చించినట్లు తెలుస్తోంది.ఫాక్స్కాన్ మాతృ సంస్థ హాన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యంగ్ లేయో యూఎస్లోని ఓహియోతోపాటు థాయ్లాండ్లో ఈవీ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అలాగే అతి త్వరలో భారత్లో కూడా ఈవీ ఫ్యాక్టరీని నిర్మిస్తాం అని తెలిపారు. -
చైనాకు షాకిచ్చిన యాపిల్ సంస్థ..భారత్ లో ఐఫోన్15 సిరీస్ ఫోన్ల తయారీ..
-
యాపిల్ కీలక నిర్ణయం.. చైనా గొంతులో పచ్చి వెలక్కాయ?!
ప్రపంచ వ్యాప్తంగా 85 శాతం ఐఫోన్ల తయారీతో గుత్తాదిపత్యం వహిస్తున్న డ్రాగన్ కంట్రీకి భారీ షాక్ తగలనుందా? తాజాగా, యాపిల్ తీసుకున్న నిర్ణయం చైనా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యిందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఐఫోన్ల తయారీలో ప్రధాన దేశమైన చైనాకు, యాపిల్ ప్రొడక్ట్ల తయారీ, సరఫరా, అమ్మకాలు, సర్వీసింగ్ వంటి విభాగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న భారత్కు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాను కాదనుకొని భారత్లో ఐఫోన్ 15ను భారీ ఎత్తున తయారు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో తమిళనాడు పెరంబదూర్ కేంద్రంగా ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్కు ప్లాంట్లో గతంలో కంటే ఎక్కువగానే ఈ లేటెస్ట్ ఐఫోన్లను తయారు చేయనుంది. చైనాలో తయారైన యాపిల్ ప్రొడక్ట్లు ఇతర దేశాలకు దిగుమతి చేసిన వారం రోజుల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్రమత్తమైన టిమ్కుక్ యాపిల్ సంస్థ గత కొన్నేళ్లుగా చైనాలో తన ఉత్పత్తుల్ని తయారీ, అమ్మకాలు నిర్వహిస్తుంది. అయితే, డ్రాగన్ కంట్రీలో సప్లయి చైన్ సమస్యలు, అమెరికా - చైనాల మధ్య తగ్గిపోతున్న వ్యాపార సత్సంబంధాలు, అదే సమయంలో తయారీ కేంద్రంగా ఎదిగేందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అమెరికాతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుని, తనను తాను తయారీ కేంద్రంగా మార్చుకోవాలని కోరింది. ఇలా వరుస పరిణామాలతో యాపిల్ సీఈవో టిమ్కుక్ అలెర్ట్ అయ్యారు. చైనాలో వ్యాపారం ఎప్పటికైనా ప్రమాదమనే ఓ అంచనాకు వచ్చిన యాపిల్ గత కొన్నేళ్లుగా తన వ్యాపారాన్ని ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. ఇందులో భాగంగా భారత్లో ఐఫోన్ 15 తయారీని ప్రారంభించనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చైనా నుంచి భారత్కు చైనాలో సప్లయి చైన్ సమస్యలతో యాపిల్ తన తయారీని భారత్కు తరలించాలని భావించింది. కాబట్టే గత ఏడాది భారత్లో తయారైన యాపిల్ ఐఫోన్ షిప్మెంట్ విలువ 65 శాతం పెరిగింది. ఐఫోన్ల విలువ 162 శాతం పెరిగిందంటూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఆ నివేదికను ఊటంకిస్తూ ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ మరో రిపోర్ట్ను వెలుగులోకి తెచ్చింది. 2022లో భారత్లో మొత్తం స్మార్ట్ఫోన్ షిప్మెంట్ విలువలో యాపిల్కు 25 శాతం వాటాను కలిగి ఉందని వెల్లడించింది. ఈ వృద్ది రేటు 2021లో 12 శాతం నుండి పెరిగినట్లు మరికొన్ని సంస్థలు నివేదించాయి. ప్రమాదం అంచున చైనా ఆధిపత్యం ప్రపంచ వ్యాప్తంగా 85 శాతం ఐఫోన్లను చైనానే తయారు చేస్తుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదికలో టెక్నాలజీ రిపోర్టర్ జిన్మీ షెన్ తెలిపారు. అయినప్పటికీ, యాపిల్ తన తయారీని చైనా నుంచి బయట (ముఖ్యంగా భారత్కు) దేశాలకు తరలించాలని భావిస్తున్నందున బీజింగ్ తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 ప్రపంచ చరిత్రలో నష్ట జాతకుడు ఇతనే! -
ఎయిర్పాడ్స్ ఇక మేడ్ ఇన్ ఇండియా.. హైదరాబాద్లోనే తయారీ
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ కోసం వైర్లెస్ ఇయర్బడ్స్ (ఎయిర్పాడ్స్)ను ఫాక్స్కాన్ తమ హైదరాబాద్ ప్లాంటులో తయారు చేయనుంది. 2024 డిసెంబర్ నాటికి భారీ స్థాయిలో వీటి ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ ప్లాంటుపై ఫాక్స్కాన్ దాదాపు 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఐఫోన్ల తర్వాత యాపిల్ పోర్ట్ఫోలియోలో అత్యధికంగా అమ్ముడయ్యే ఉత్పత్తుల్లో ఎయిర్పాడ్లు రెండో స్థానంలో ఉన్నాయి. ట్రూ వైర్లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) మార్కెట్లో 36 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. మరోవైపు, తమ ప్రణాళికలను సక్రమంగా అమలు చేయగలిగితే భారత్లో బిలియన్ల కొద్దీ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని కంపెనీ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్కాన్) చైర్మన్ యంగ్ లియు తెలిపారు. వార్షిక ప్రాతిపదికన భారత్లోని తమ విభాగం 10 బిలియన్ డాలర్ల పైగా టర్నోవరు సాధించినట్లు వివరించారు. -
భారత్లో ఫాక్స్కాన్.. 500 మిలియన్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు ఐఫోన్లను తయారీ చేసి సరఫరా చేసే ఫాక్స్కాన్ టెక్నాలజీ సంస్థ భారత్ రెండు మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను నిర్మించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా 500 మిలియన్ల పెట్టుబడి పెట్టే యోచనలో ఉందంటూ బ్లూమ్బెర్గ్ నివేదించింది. ఫాక్స్కాన్ ఈ తయారీ యూనిట్లను కర్ణాటకలో నిర్మించనుండగా..ఒక ఫ్యాక్టరీ ఐఫోన్ల తయారీ, రెండో ఫ్యాక్టరీలో యాపిల్కు విడిభాగాలు ఉత్పత్తి చేయనుందని నివేదిక పేర్కొంది. అయితే, ఏ రాష్ట్రంలో ఫ్యాక్టరీలను నిర్మించాలనే అంశంపై ఫాక్స్కాన్ స్పష్టత ఇచ్చినప్పటికీ.. ప్రాంతం ఎక్కడనేది నిర్ణయించలేదు. ఈ వారంలో ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన అనువైన ప్రాంతంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చిలో కర్నాటకలో ఫాక్స్ కాన్ యూనిట్ కోసం 80 బిలియన్ రూపాయల ($972.88 మిలియన్లు) పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. చైనా కంటే భారత్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్కాన్ కంపెనీ సిద్ధమైంది. తమిళనాడులో ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాల తయారీ కేంద్రంలో 16 బిలియన్లను పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకుంది. తద్వారా 6,000 మందికి ఉపాధి కలగనుంది. కాగా, ఫాక్స్ కాన్ తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని కాంచీపురం జిల్లాలో నిర్మించనుందని తెలుస్తోంది. దీనిపై ఫాక్స్కాన్, తమిళనాడు ప్రభుత్వాలు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదీ చదవండి : చైనాను వద్దనుకొని వచ్చేస్తోంది?.. భారత్లో ఫాక్స్కాన్ 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులు -
సెమీకండక్టర్ ప్లాంటు.. వారి ప్రతిపాదనలు వేర్వేరుగా పరిశీలిస్తాం...
న్యూఢిల్లీ: భారత్లో సెమీకండక్టర్ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి వేదాంత, ఫాక్స్కాన్ సంస్థలు వేర్వేరుగా ప్రతిపాదనలను సమర్పించేంత వరకు ప్రభుత్వం వేచి చూస్తుందని, తర్వాత తగు విధంగా వాటిని మదింపు చేస్తుందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. గతంలో ఇరు సంస్థలు జాయింట్ వెంచర్గా ప్రతిపాదనలు ఇచ్చాయని, ప్రస్తుతం అవి వేర్వేరుగా ప్రపోజల్స్ ఇచ్చే యోచనలో ఉన్నాయని పేర్కొన్నారు. సెమీకాన్ ఇండియా 2023 కార్యక్రమంలో భాగంగా అధునాతన సెమీకండక్టర్ టెక్నాలజీల ఎగ్జిబిషన్ ప్రారంభంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. సెమీకండక్టర్ రంగంలో 70 ఏళ్లలో లేనంత పురోగతిని గత 15 నెలల్లో సాధించగలిగామని పేర్కొన్నారు. -
‘సెమీ’ ఆశలకు సడన్ బ్రేకులు!
ఆశించిన పురోగతికి అర్ధంతరంగా బ్రేకులు పడినప్పుడు నిరాశ సహజమే! అందులోనూ అది సాక్షాత్తూ ప్రధాని గొప్పగా చెప్పిన ఆత్మనిర్భర ఆశయాలకు భంగకరమని అనిపించినప్పుడు నిరుత్సాహం మరీ ఎక్కువే! భారత దేశ సెమీ కండక్టర్ల (చిప్ల) తయారీ ఆకాంక్షలకు ఇప్పుడు అలాంటి అవరోధాలే వచ్చాయి. సెమీ కండక్టర్ల తయారీకి కలసి కృషి చేసేందుకు ఒక్కటైన తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ‘ఫాక్స్కాన్’, భారత సంస్థ ‘వేదాంత’ ఇప్పుడు దేని దారి అది చూసుకోవడం అలాంటి పరిణామమే. దీనివల్ల భారత చిప్ లక్ష్యాలకు ఇబ్బంది ఏమీ ఉండదని కేంద్రం చెబుతున్నప్పటికీ అది సంపూర్ణ సత్యమేమీ కాదు. చిప్ల తయారీ నిమిత్తం వేదాంత– ఫాక్స్కాన్లు గత ఏడాది ఉమ్మడి భాగస్వామ్యానికి దిగి, గుజరాత్ ప్రభుత్వంతో 19.5 బిలియన్ డాలర్ల విలువైన సెమీ కండర్ల కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాయి. తీరా పట్టుమని పది నెలలకే ఆ గ్రూపు నుంచి వైదొలగుతున్నట్టు ఫాక్స్కాన్ ప్రకటించడం ఒక విధంగా ఆకస్మిక బ్రేకనే చెప్పాలి. ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజైన్ రంగంలో ప్రపంచ కేంద్రంగా మన దేశం ఆవిర్భవించేందుకు తగిన వాతావరణ పరికల్పనే లక్ష్యంగా పెట్టుకున్న భారత సెమీ కండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)కు ఇది శుభవార్త కానే కాదు. ‘సెమీ కండక్టర్ల ఆలోచనను నిజం చేయడానికి’ వేదాంత సంస్థతో కలసి ఏడాది పైగా కృషి చేసిన ఫాక్స్కాన్ పరస్పర అంగీకారంతో, ఈ ఉమ్మడి భాగస్వామ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సోమవారం ప్రకటించింది. అంటే ఇక ఆ బృహత్ ప్రయత్నంలో ఫాక్స్కాన్ పేరు ఉండదు. ప్రాజెక్ట్ పూర్తిగా వేదాంత సంస్థకే సొంతమన్నమాట. తొలి ప్రకటన వచ్చిన 24 గంటలలోపే ఇటు ఫాక్స్కాన్ సైతం విడిగా తగిన సాంకేతిక భాగస్వామిని చేర్చుకొని, తనదైన వ్యూహంతో ముందుకు నడుస్తుందన్న సంకేతాలొచ్చేశాయి. కలసి అడుగులేసిన సంస్థలు ఏడాదికే ఇలా వేరు కుం పట్లయిన పరిణామానికి కారణాలేమిటన్నది అవి చెప్పలేదు. గుజరాత్లో చిప్ల తయారీకి కావాల్సిన లైసెన్స్తో కూడిన సాంకేతిక పరిజ్ఞానంకోసం వేదాంత, ఫాక్స్కాన్లు ఎస్టీమైక్రోను ఆసరాగా బరిలోకి దింపాయి. కానీ, ప్రభుత్వం మాత్రం సదరు యూరోపియన్ చిప్ తయారీ సంస్థ కూడా నిష్పూచీగా మిగలక, ఒప్పందంలో భాగస్వామిగా ఉండాల్సిందే అనడంతో చిక్కొచ్చినట్టుంది. ప్రపంచంలో 37 శాతం చిప్లు తైవాన్వే! భారత ఎలక్ట్రానిక్ చిప్ అవసరాలన్నీ ప్రధానంగా దిగుమతి ద్వారానే తీరుతున్నాయి. కొన్నేళ్ళుగా ఏటా దాదాపు 1000 కోట్ల డాలర్ల విలువైన చిప్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందులో సుమారు 70 శాతం చైనా నుంచి వస్తున్నవే. చిప్ల తయారీలోని ఈ అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఐఎస్ఎం ప్రారంభమైంది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, అనేక ఐరోపా దేశాలు చిప్ల తయారీ సత్తా పెంచుకుంటున్నాయి. తాజాగా భారత్ ఆ పరుగులో చేరింది. దేశంలో చిప్ల తయారీ కేంద్రాల్ని నెలకొల్పాలని వచ్చేవారికి పెట్టుబడి రూపంలో ప్రోత్సాహకాలిచ్చేందుకు సిద్ధపడింది. అమెరికా చిప్ తయారీ సంస్థ మైక్రాన్ ఇటీవలే భారత్లో చిప్ కేంద్రానికి ఆమోదం పొందింది. కేంద్ర, గుజరాత్ సర్కార్లు దానికి గణనీయంగా పెట్టుబడి సాయం చేస్తున్నాయి. ఆత్మ నిర్భరతకై ఇలాంటి యత్నాలు జరుగుతున్న వేళ భారీ ఒప్పందమైన వేదాంత – ఫాక్స్కాన్ చిక్కుల్లో పడడమే విచారకరం. కారణాలేమైనా గత ఏడాది ఫిబ్రవరి 14న ఫాక్స్కాన్– వేదాంతల మధ్య మొలకెత్తిన ప్రేమ మూణ్ణాళ్ళ ముచ్చటైంది. గుజరాత్లో చిప్ల తయారీ కేంద్రాల ఏర్పాటుకై గత సెప్టెంబర్లో చేసుకున్న రూ. 1.54 లక్ష కోట్ల మేర ఒప్పందాలు ఇరుకునపడ్డాయి. ఏ సంస్థకు ఆ సంస్థ విడివిడిగా ముందుకు పోయినా భారత సెమీ కండక్టర్ల మిషన్లో జాప్యం తప్పదనిపిస్తోంది. చిప్ల తయారీకి తగ్గ పునాది లేకున్నా చిప్ డిజైన్లో మాత్రం మన దేశం ముందంజలో ఉంది. దాన్ని ఆయుధంగా మలుచుకోవాలి. సొంత తయారీతో పదునుపెట్టుకోవాలి. పైగా, కరోనాతో సరఫరా వ్యవస్థలకు అంతరాయం, రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో వచ్చిపడ్డ అనివార్యతల రీత్యా రక్షణ, ఎలక్ట్రానిక్స్ తదితర కీలక రంగాల్లో భారత్ ఎంత త్వరగా సొంతకాళ్ళపై నిలబడగలిగితే వ్యూహాత్మకంగా అంత మంచిది. ఆ మాటకొస్తే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా పైచేయి సాధించగలిగిందీ ఈ చిప్ల వల్లేనంటారు విశ్లేషకులు. అమెరికా, చైనాల మధ్య ఇప్పుడు నడుస్తున్న భౌగోళిక రాజకీయాల తోపులాటలోకూ ఇవే కారణం. ఇవాళ దేశాలన్నీ తమ గడ్డపైనే అన్ని రకాల చిప్ల రూపకల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తోందీ, ప్రోత్సాహకాలిస్తున్నదీ అందుకే. కాబట్టి, మనకు అవసరమైన చిప్ల డిజైనింగ్ నుంచి తయారీ దాకా అన్నీ మన చేతుల్లోనే ఉండడం పోటీలో ముందు ఉండడానికో, ఆర్థిక ప్రయోజనాల రీత్యానో కాకున్నా... వ్యూహాత్మకంగా భారత్కు అత్యంత కీలకం. అందుకే, వేదాంత – ఫాక్స్కాన్ల బంధం విచ్ఛిన్నమైందన్న నిరాశను పక్కనపెట్టి, సెమీ కండక్టర్ల రంగాన్ని దృఢంగా నిర్మించేందుకు మరింతగా కృషి చేయాలి. చైనా లాంటివి పడనివ్వకుండా చేసినా పట్టుదలతో సాగాలి. వేదాంత – ఫాక్స్కాన్లకు ఇరుకున పెట్టిన ఆర్థిక, సాంకేతిక అంశాలనూ క్షుణ్ణంగా పరిశీలించాలి. భవిష్యత్తులో ఇలాంటి మరో ప్రయత్నానికి ఆ చిక్కులు రాకుండా నివారించాలి. సెమీ కండక్టర్ల రంగంలో సాంకేతిక విజ్ఞాన బదలీని ప్రోత్సహించాలి. పరిశోధన, అభివృద్ధిలో దేశ, విదేశీ సంస్థల మధ్య సహకారాన్నీ పెంచిపోషించడమూ అంతే ముఖ్యం. ఎందుకంటే, ఐఎస్ఎం కింద రూ. 76 వేల కోట్ల కేటాయింపుతో నాలుగు పథకాలు ప్రవేశపెట్టామంటున్న ప్రభుత్వం సంస్థలకు తగిన వాతావరణం కల్పిస్తేనే ఫలితం. మేకిన్ ఇండియాకు బ్రేకులు పడకూడదంటే అది అత్యంత కీలకం. -
అనిల్ అగర్వాల్కు మరో దెబ్బ? టాటా గ్రూపుతో ఫాక్స్కాన్ చర్చలు?
తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్కాన్ రూ.1.6 లక్షల కోట్ల(19.5 బిలియన్ల డాలర్ల) ప్రాజెక్టును వెనక్కి తీసుకుని చైర్మన్ అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత గ్రూపునకు భారీ షాక్ ఇచ్చింది. భారతదేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తి కోసం జాయింట్ వెంచర్ (జేవీ) నుండి వైదొలగాలని సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించిన సంస్థ దేశీయంగా మరో టాప్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. టాటా గ్రూప్తో సంభావ్య టై-అప్ కోసం ఫాక్స్కాన్ అన్వేషిస్తోందని సీఎన్బీసీ ఆవాజ్ రిపోర్ట్ చేసింది. ముఖ్యంగా, టాటా గ్రూప్ ఇటీవలి సెమీకండక్టర్ ప్రయత్నాలలో ఉంది. మరోవైపు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రాజెక్టుకు ఫాక్స్కాన్ కట్టుబడి ఉందనీ, దేశం ఒక బలమైన సెమీకండక్టర్ తయారీ పర్యావరణ వ్యవస్థను విజయవంతంగా స్థాపించాలని చూస్తోందని ఫాక్స్కాన్ మంగళవారం మరోసారి స్పష్టం చేసింది. సరైన భాగస్వాముల కోసం సమీక్షిస్తున్నామని, దేశీయ, అంతర్జాతీయ వాటాదారులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందని కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించి అప్లికేషన్ను సమర్పించే దిశగా పని చేస్తోందని ప్రకటించడం ఈ వార్తలు ఊతమిస్తోంది. (వేదాంత చిప్ ప్లాంటుకు బ్రేక్ ) తరువాతి తరం వృద్ధిని ప్రారంభించే క్రమంలో దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన ఈ మెగా ప్రాజెక్టును కోసం వేదాంత ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రాయితీలను అందిపుచ్చుకునేందుకు ఫాక్స్ కాన్-వేదాంత జాయింట్ వెంచర్గా గుజరాత్ లో సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించాయి. అయితే పరస్పర అంగీకారంతో ఈ డీల్ నుంచి తప్పుకుంటున్నట్టు ఫాక్స్కాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (90 శాతం ఉద్యోగాలు ఫట్: సిగ్గూ, శరం, మానవత్వం లేదా? సీఈవోపై పైర్) -
వేదాంత చిప్ ప్లాంటుకు బ్రేక్
న్యూఢిల్లీ: భారత్లో సెమీకండక్టర్ల ప్లాంటు నెలకొల్పేందుకు దేశీ దిగ్గజం వేదాంతతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ (జేవీ) నుంచి హోన్ హయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్కాన్) తప్పుకుంది. మరిన్ని వైవిధ్యమైన అవకాశాలను అన్వేషించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ‘పరస్పర అంగీకారం మేరకు, వేదాంతతో జాయింట్ వెంచర్ విషయంలో ముందుకు సాగరాదని నిర్ణయించుకున్నాం. వేదాంత యాజమాన్యంలోని సంస్థకు మాకు ఎటువంటి సంబంధం ఉండదు. మా పేరును జోడించి ఉంచడం వల్ల గందరగోళానికి దారి తీస్తుంది కాబట్టి దాన్ని తొలగించుకునే ప్రయత్నాల్లో ఉన్నాం‘ అని ఫాక్స్కాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా ఆకాంక్షల సాకారానికి పూర్తి తోడ్పాటు అందిస్తామని, స్థానిక అవసరాల మేరకు భాగస్వామ్యాలు కుదుర్చుకుంటామని పేర్కొంది. తైవాన్కు చెందిన కాంట్రాక్ట్ ఎల్రక్టానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్కాన్, వేదాంత .. గుజరాత్లో దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో దేశీయంగా తొలి సెమీకండక్టర్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు గతేడాది జేవీ కుదుర్చుకున్నాయి. ఏడాది పైగా దీనిపై కసరత్తు చేశాయి. సాంకేతిక భాగస్వామిగా యూరప్ సంస్థ ఎస్టీ మైక్రోఎలక్ట్రానిక్స్తో జట్టు కట్టేందుకు ప్రయత్నించినా చర్చలు ముందుకు సాగలేదు. దీంతో ప్రస్తుతం వేదాంత–ఫాక్స్కాన్ జేవీకి బ్రేక్ పడింది. ఫోన్లు, ఫ్రిజ్లు, కార్లలో ఉపయోగించే చిప్లు కేవలం కొన్ని దేశాల్లోనే తయారవుతున్నాయి. భారత్ కూడా చిప్ల తయారీలోకి ప్రవేశించడంపై దృష్టి పెట్టి ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీనికి స్పందనగా వేదాంత–ఫాక్స్కాన్, ఐఎస్ఎంసీ, ఐజీఎస్ఎస్ దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, వేదాంత జేవీ మినహా మిగతా రెండింటి విషయంలో పెద్దగా పురోగతి లేదు. ప్రాజెక్టుకు కట్టుబడి ఉన్నాం.. కాగా సెమీకండక్టర్ ప్రాజెక్టుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని వేదాంత స్పష్టం చేసింది. చిప్ ప్లాంటు ఏర్పాటులో భాగస్వాములయ్యేందుకు పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ‘సెమీకండక్టర్ల విషయంలో ప్రధాని విజన్ను సాకారం చేసేందుకు, మరింతగా కృషి చేస్తాం’ అని వేదాంత పేర్కొంది. సైయంట్ డీఎల్ఎం లిస్టింగ్ భళా ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్విసుల కంపెనీ సైయంట్ డీఎల్ఎం భారీ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 265తో పోలిస్తే బీఎస్ఈలో 51 శాతం ప్రీమియంతో రూ. 401 వద్ద లిస్టయ్యింది. ఆపై ఒక దశలో 61% దూసుకెళ్లి రూ. 426ను అధిగమించింది. చివరికి 59 శాతం(రూ. 156) లాభంతో రూ. 421 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో సైతం రూ. 403 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రూ. 427 వరకూ ఎగసి చివరికి రూ. 422 వద్ద స్థిరపడింది. వెరసి రూ. 157 లాభంతో ముగిసింది. భారత్ లక్ష్యాలపై ప్రభావం ఉండదు వేదాంతతో జేవీ నుంచి ఫాక్స్కాన్ వైదొలగడమనేది భారత్ నిర్దేశించుకున్న చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటు ఏర్పాటు లక్ష్యాలపై ప్రభావం చూపబోదు. – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఐటీ మంత్రి -
ఫాక్స్కాన్ సంచలన నిర్ణయం: లక్షల కోట్ల ప్రాజెక్ట్ నుంచి వెనక్కి
తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ ఫాక్స్కాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీయ మెటల్స్-టు-ఆయిల్ వేదాంత కంపెనీతో 19.5 బిలియన్ డాలర్ల సెమీ కండక్టర్ జాయింట్ వెంచర్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ఫాక్స్కాన్ నిర్ణయించుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు సంస్థ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది దీనికి గల కారణాలను వివరించలేదు. (మ్యారేజ్ డే ఏమోగానీ, 24 లక్షల ఉబెర్ బిల్లు చూసి గుడ్లు తేలేసిన జంట) గ్లోబల్ కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్కాన్ , వేదాంత గత ఏడాది గుజరాత్లో సెమీకండక్టర్. డిస్ప్లే ప్రొడక్షన్ ప్లాంట్లను నిర్మించడానికి సుమారు రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కానీ ప్రాజెక్ట్పై ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పనిచేసినప్పటికీ ఈ జాయింట్ వెంచర్ను ముగించాలని ఇరుపక్షాలు పరస్పరం నిర్ణయించుకున్నాయన్న తాజా ప్రకటన సంచలనం రేపుతోంది. ఆ కంపెనీతో ఫాక్స్కాన్కు ఎలాంటి సంబంధం లేదని, భవిష్యత్లో భాగస్వాములు ఎలాంటి గందరగోళానికి గురవ్వకుండా ఒరిజినల్ పేరునే కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు హోన్ హయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్కాన్) ప్రకటించింది. ఈ ఒప్పందం 'మేక్ ఇన్ ఇండియా' పుష్కు ఖచ్చితంగా ఎదురుదెబ్బ అని కౌంటర్పాయింట్లోని రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ షా వ్యాఖ్యానించారు. (ITR Filing: గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ జాగ్రత్తలు, లాభాలు) కాగా 2026 నాటికి సెమీకండక్టర్ మార్కెట్ విలువ 63 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్న కేంద్రం, గతేడాది 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహక పథకం కింద ప్లాంట్ల ఏర్పాటుకు మూడు దరఖాస్తులు అందుకుంది. ఇందలో వేదాంత-ఫాక్స్కాన్ జాయింట్ వెంచర్ ఒకటి, సింగపూర్కు చెందిన IGSS వెంచర్స్ , టవర్ సెమీకండక్టర్ను టెక్ భాగస్వామిగా పరిగణించే గ్లోబల్ కన్సార్టియం ఐఎస్ఎంసీ నుండి వచ్చాయి. -
చిప్ ప్లాంట్కు వేదాంత ఫాక్స్కాన్ మళ్లీ దరఖాస్తు
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్లకు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలను ప్రకటించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా తమ దరఖాస్తును మళ్లీ దాఖలు చేసినట్లు వేదాంత ఫాక్స్కాన్ జాయింట్ వెంచర్ సంస్థ వెల్లడించింది. 2027 నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా రూ. 1.5 లక్షల కోట్లతో ఎలక్ట్రానిక్ చిప్ ప్లాంటును నెలకొల్పనున్నట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశీయంగా చిప్ తయారీని ప్రోత్సహించే దిశగా సెమీకండక్టర్ ఫ్యాబ్ల ఏర్పాటుకు ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహకాలను కేంద్రం 30 శాతం నుంచి 50 శాతానికి ఇటీవల పెంచింది. దీంతో గతంలో సమర్పించిన దరఖాస్తును ఉపసంహరించుకుని వేదాంత ఫాక్స్కాన్ తాజాగా మరోసారి దాఖలు చేసింది. 2027 ప్రథమార్ధంలో 5,000 వేఫర్లతో ప్రారంభించి .. నెలకు 40,000 వేఫర్ల స్థాయికి ఉత్పత్తిని పెంచుకోనున్నట్లు వేదాంత ఫాక్స్కాన్ సంస్థ సీఈవో డేవిడ్ రీడ్ వెల్లడించారు. -
విబేధాలే కారణమా? గుజరాత్లో 1.54 లక్షల కోట్ల ప్రాజెక్ట్కు అడ్డంకి!
మైనింగ్ కంపెనీ వేదాంతా లిమిటెడ్కు భారీ షాక్ తిగిలింది.సెమీకండక్టర్ల తయారీ కోసం వేదాంతాతో కదుర్చుకున్న ఒప్పందం నుంచి తైవాన్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు ఫాక్స్కాన్ తప్పుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రెండేళ్ల క్రితం ఫాక్స్కాన్ భారత్లో సెమీ కండక్టర్ తయారీ విభాగంలో అడుగు పెట్టాలని అనుకుంది. ఇందుకోసం వేదాంతాతో చేతులు కలిపింది. 67శాతం షేరుతో వేదాంత - ఫాక్స్కాన్ జాయింట్ వెంచ్ర్లో గుజరాత్ దోలేరా ప్రాంతంలో వెయ్యి ఎకరాల్లో రూ.1.54 లక్షల కోట్లతో సెమీకండక్టర్ తయారీ ప్లాంట్ను నెలకొల్పేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నాయి. తాజాగా, ఫాక్స్కాన్క, వేదాంతా సెమీ కండక్టర్ ప్రాజెక్ట్కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఇరు సంస్థల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా సెమీ కండక్టర్ల తయారీ కోసం వేదాంతాను వద్దనుకొని కొత్త భాగస్వామి కోసం ఫాక్స్కాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వేదాంత గ్రూప్ ఆర్థిక ఇబ్బందులతో ఫాక్స్కాన్ వేరే భాగస్వామిని చూసుకోవాలని సూచించిందని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. దీంతో, ఫాక్స్కాన్ మరో భాగస్వామికోసం ఇప్పటికే అనధికారిక చర్చలు జరిపినట్లు సమాచారం. వాటిల్లో రెండు కార్పొరేట్ దిగ్గజాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ రెండు కంపెనీలు ఏంటీ? ఫాక్స్కాన్కు, వేదాంతాల మధ్య ఎందుకు విబేధాలు తలెత్తాయనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి👉 భారత్లో ఆఫీస్ను అమ్మేస్తున్న ఇంటెల్.. వేలాది మంది ఉద్యోగుల్ని.. -
ఫాక్స్కాన్ రంగంలోకి: రాయిల్ ఎన్ఫీల్డ్, ఓలా ఏమైపోవాలి?
ప్రపంచంలోనే అతిపెద్ద యాపిల్ ఐఫోన్ తయారీ ఫాక్స్కాన్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోందట. ఈమేరకు ప్రస్తుతం పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో ఈ-బైక్ మార్కెట్లో రానున్నకాలంలో కొత్త ఎలక్ట్రిక్ బైక్లను రిలీజ్ చేయాలని భావిస్తున్న ఓలా ఎలక్ట్రిక్, రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, యాపిల్ ఐఫోన్ తయారీదారు తన వార్షిక నివేదికలో ఆగ్నేయాసియాలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ప్లాంట్ను స్థాపించడానికి కంపెనీకి సహాయం చేస్తుందని పేర్కొంది. దీనిపై ఫాక్స్కాన్ ఎగ్జిక్యూటివ్లతో చర్చించడానికి భారతీయ ప్రతినిధి బృందం త్వరలో తైవాన్ను సందర్శించాలని యోచిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే పలు బ్రాండ్ ఎలక్ట్రిక్ టూవీలర్స్ను తయారు చేస్తుందా లేదా జాయింట్ వెంచర్ ద్వారా ఒకే బ్రాండ్కు పరిమితమవుతుందా అనేది స్పష్టత లేదు. (టీసీఎస్కు భారీ ఎదురుదెబ్బ: బిగ్ డీల్ నుంచి ట్రాన్సామెరికా ఔట్!) కాగా ఇప్పటికే తమిళనాడులో పెద్ద ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్న ఫాక్స్కాన్ మహారాష్ట్రలో కూడా ఈవీ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉంది. అటు తెలంగాణపై కూడా దృష్టి సారిస్తోన్న సంగతి తెలిసిందే. (అమెరికా గుడ్ న్యూస్: వీలైనన్ని ఎక్కువ వీసాలిచ్చేందుకు తీవ్ర కృషి!) -
రానున్న 10 ఏళ్లలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రానున్న 10 సంవత్సరాలలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలను ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ శివారు కొంగరకలాన్లో ఫాక్స్కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ చైర్మన్ యాంగ్ లియూ, సీఈవోలు, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణను తమ తయారీ కేంద్రంగా ఎంచుకున్న ఫాక్స్ కాన్ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. కంపెనీ నిర్మాణం, తయారీ ప్లాంట్లను విస్తరించడంలో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. ఫాక్స్కాన్ రంగారెడ్డి జిల్లాకు రావడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలోలో కొంగరకలాన్ గుర్తు పట్టలేనంతగా మారబోతున్నదని చెప్పారు. రూ. 4 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఫాక్స్కాన్ పరిశ్రమతో 35 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ఫాక్స్కాన్ హామీ ఇచ్చిందని తెలిపారు. అటు కంపెనీ నిర్మాణం జరుగుతుంటే మరోవైపు యువతకు శిక్షణ ఇస్తామన్నారు. యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ రోజు తెలంగాణకు చరిత్రాత్మక సందర్భమని కేటీఆర్ అన్నారు. గత తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని. దేశంలోనే ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు . చిన్న రాష్ట్రమైనా 30 శాతం కంటే అధిక అవార్డులను సాధించిందన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. దేశంలోని ఐటీ ఉద్యోగాల్లో ప్రతి మూడింట్లో ఒక ఉద్యోగం మనదేనని చెప్పారు చదవండి: కర్ణాటక ఫలితం.. తెలంగాణలో ఇప్పుడెలా?.. బీజేపీ బేజార్, 'కారు'కు ఫియర్.. -
రూ. 300 కోట్లతో 300 ఎకరాలు! కర్ణాటకలో ఫాక్స్కాన్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే?
గత కొంతకాలంగా ఫాక్స్కాన్ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి యోచిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ సంస్థ ఇప్పుడు బెంగళూరు ఎయిర్ పోర్ట్ సమీపంలో రూ. 300కోట్ల పెట్టుబడితో 300 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యాపిల్ కాంట్రాక్ట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో దీని కోసం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో కంపెనీ బెంగళూరు ఎయిర్ పోర్ట్ సమీపంలోని దేవనహళ్లి వద్ద 300 ఎకరాల భూమిని సొంతం చేసుకుంది. ఫాక్స్కాన్ హాన్ హై టెక్నాలజీ కోసం ఈ స్థలం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి యాపిల్ కంపెనీకి ఫాక్స్కాన్ అనేది అతి పెద్ద సప్లయర్. కర్ణాటక ఎన్నికలు ముగిసిన తరువాత ఈ స్ధలం కంపెనీ స్వాధీనం చేసుకోనున్నట్లు గతంలో కర్నాటక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కమీషనర్ గుంజన్ కృష్ణ చెప్పారు. ఇక ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. కావున సంస్థ భూమిని త్వరలోనే స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలా? ఒక్క నిముషం.. ఇవి తెలుసుకోండి!) కర్నాటక రాష్ట్రంలో రూ. 8 వేల కోట్లతో మొబైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం ఫాక్స్కాన్తో మార్చి 20 వ తేదీన అక్కడి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఫెసిలిటీలో సుమారు 50 వేల మందికి ఉపాథి లభిస్తుందని అంచనా. అంతే కాకుండా రానున్న మరో పది సంవత్సరాల్లో మరిన్ని ఉద్యోగాలు ఇందులో లభించే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఇక తెలంగాణాలో కూడా ఫాక్స్కాన్ భూమిని కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. హైదరాబాద్ శివారులోని కొంగరకలాన్లోని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిఎస్ఐఐసి) పార్క్లో సుమారు 186 ఎకరాలను రూ.196 కోట్లకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లుగా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇక ఎయిర్ప్యాడ్స్ కూడా తక్కువ ధరకే: రూ. 1,654 కోట్లతో ఫాక్స్కాన్ ఫ్యాక్టరీ!
సాక్షి, ముంబై: ప్రపంచంలోని అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు, యాపిల్ ఐఫోన్ మేకర్ ఫాక్స్కాన్ భారత్లో మరో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి వేల కోట్ల రూపాయల ఆర్డర్ను సాధించింది. దీంతో ఇప్పటివరకు ఐఫోన్ మేకర్గా ఉన్న తైవాన్కు మేకర్ ఇపుడు తొలిసారి ఎయిర్పాడ్స్ను కూడా ఉత్పత్తి చేయనుంది. దాదాపు 70శాతం ఐపోన్ల అసెంబ్లర్ ఫాక్స్కాన్ కొత్త ప్లాంట్లో ఎయిర్ప్యాడ్స్ ఉత్పత్తి షురూ అయితే తక్కువ ధరకే లభ్యం కానున్న యాపిల్ ఉత్పత్తుల జాబితాలో ఇవి కూడా చేరనున్నాయి. (లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు!) రాయిటర్స్ అందిచిన రిపోర్ట్ ప్రకారం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఇండియా ఎయిర్ప్యాడ్ ప్లాంట్లో ఫాక్స్కాన్ 200 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1,654 కోట్లు) పైగా పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్లాంట్ ద్వారా 2024 చివరి నాటికి తయారీని ప్రారంభించాలనే ఫాక్స్కాన్ లక్క్ష్యం. గత కొంతకాలంగా యాపిల్ భారత్లో తన కార్యకలాపాలని విస్తరించాలని యోచిస్తోంది. అయితే తక్కువ లాభాలు ఉన్నందున ఎయిర్పాడ్లను తయారు చేయాలని అనేదానిపై ఫాక్స్కాన్ తీవ్రం చర్చిస్తోందని చివరికి ఒప్పందంతో ముందుకు సాగాలని నిర్ణయించుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ ఊహాగానాలపై వ్యాఖ్యానించిందేకు నిరాకరించిన ఫాక్స్కాన్ కస్టమర్ డిమాండ్ను తీర్చడానికి, ఉత్పత్తి కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి చైనా వెలుపల పెట్టుబడులను పెంచుతామని ఫాక్స్కాన్ బుధవారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎయిర్ప్యాడ్స్ సరఫరా చేస్తున్న చైనా కంపెనీలను కాదని, భారత్లో కాంట్రాక్ట్ ఉన్న ఫాక్స్కాన్తో యాపిల్ ఒప్పందం చేసుకున్నట్టు అంచనా. మరోవైపు ఈ వార్తలపై యాపిల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీ యాపిల్ నుండి మరిన్ని ఆర్డర్లను గెలుచుకోవడానికి Wistron Corp, Pegatron Corp వంటి తైవానీస్ ప్రత్యర్థులతో ఫాక్స్కాన్ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. (‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!) -
హైదరాబాద్కు ఐఫోన్ తయారీ సంస్థ ఫాక్స్కాన్!
తైవాన్కు చెందిన యాపిల్ ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో.. తయారీ పరిశ్రమలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాయి. యాపిల్ ఫోన్లను తయారు చేసే తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ సంస్థ..తమ ఐఫోన్ల తయారీ యూనిట్ను భారత్లో నెలకొల్పేందుకు ప్రణాళికలు రచించింది. ఈ తరుణంలో ఫాక్స్కాన్ టెక్నాలజీ చైర్మన్ యంగ్ లియూ మార్చి 2న సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తాను మాటిచ్చినట్లుగానే..రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ ఫాక్స్కాన్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను నెలకొల్పేందుకు సిద్ధమైనట్లు కేసీఆర్కు లేఖ రాశారు. తద్వారా లక్షమందికి ఉపాధి కలుగుతుందని అందులో పేర్కొన్నారు. కొంగరకలాన్ లో ప్లాంట్ సీఎం కేసీఆర్పై ప్రశంసలు కురిపించారు యంగ్ లియూ. రాష్ట్రాభివృద్ధి పట్ల కేసీఆర్ కు ఉన్న విజన్ తనకు నచ్చిందన్నారు లియూ. వీలైనంత త్వరగా కొంగర కలాన్లో ఫాక్స్కాన్ను ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా సీఎం కేసీఆర్ను తైవాన్కు ఆహ్వానించారు. తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. రూ.3500 కోట్ల పెట్టుబడులు రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో రూ.3500 కోట్ల పెట్టుబడితో ఫాక్స్కాన్ ఎలక్ట్రానిక్ కంపెనీని నెలకొల్పనుంది. ఇందుకోసం ఈ కంపెనీకి 250 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికే సర్వే నం.300లో 187 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వ కేటాయించినట్లు సమాచారం. కర్ణాటకలో ఒక ప్లాంటు తెలంగాణలో పెట్టుబడులపై ప్రకటన వెలువరించకముందు కర్ణాటకలో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను నెలకొల్పేందుకు ఫాక్స్కాన్ ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. చర్చలు సఫలం కావడంతో అక్కడ కూడా తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తామని మాటిచ్చింది. ఈ ప్రకటన వచ్చిన తర్వాతే కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై మాట్లాడుతూ.. ఫాక్స్కాన్ సంస్థ తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుందని, ఆ పెట్టుబడుల కారణంగా రాష్ట్రంలో లక్ష మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. ఎంఓయూ (MOU) కూడా పూర్తయిందని చెప్పిన బొమ్మై.. ఫాక్స్ కాన్ ప్లాంట్ కోసం బెంగళూరు ఎయిర్పోర్ట్ సమీపంలో దొడ్డబల్లాపూర్, దేవంగల్లి తాలూకా ప్రాంతంలో 300 ఎకరాల భూమిని గుర్తించినట్లు తెలిపారు. Chairman, @HonHai_Foxconn Mr. Young Liu, in a letter addressed to CM Sri KCR, has stated that he was inspired by the vision and efforts of the #Telangana CM towards transformation and development of the State. pic.twitter.com/dJ82MinS14 — Telangana CMO (@TelanganaCMO) March 6, 2023 -
భారీ పెట్టుబడులు, ఒప్పందాలు: ఫాక్స్కాన్ షాకిచ్చిందిగా!
సాక్షి,ముంబై: తైవాన్ కు చెందిన ఫాక్స్కాన్ సంస్థ ఇండియాలో కొత్త పెట్టుబడులపై క్లారిటీ ఇచ్చింది. తమ ఛైర్మన్ ఇండియాను సందర్శించి నప్పటికీ దేశంలోఎలాంటి కచ్చితమైన ఒప్పందాలు కుదుర్చుకోలేదని వెల్లడించింది. యాపిల్ ఐఫోన్ల తయారీలో అగ్రగామి ఫాక్స్కాన్ దేశంలో భారీ పెట్టుబడులు పెడుతోందంటూ మీడియాలో వచ్చిన వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను సంస్థ శనివారం తోసిపుచ్చింది. దీంతో ఇకపై తక్కువ ధరకే మేడిన్ ఇండియా ఐఫోన్లు అందుబాటులోకి వస్తాయని ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లైంది. కర్ణాటకలో ఏర్పాటు కానున్న భారీ ప్లాంట్లో ఐఫోన్ల విడిభాగాల తయారీకి 700 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాలన్న యోచనలో ఉందని బ్లూమ్ బెర్గ్ నివేదించింది. ఈ విషయంలో మీడియా వచ్చినట్టుగా చర్చలు,అంతర్గత సమీక్షలు, భారీ పెట్టుబడులు అనేది ఫాక్స్కాన్ అందించిన సమాచారం కాదని తేల్చి పారేసింది. అయితే భారీ పెట్టుబడి కోసం ఫాక్స్కాన్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గతంలో చెప్పారు.యంగ్ లియుతో వివరణాత్మక చర్చల తర్వాత రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మేజర్ ఫాక్స్కాన్తో ఒప్పందం కుదిరిందనీ, ఇది 1 లక్ష ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని ఆయన ట్వీట్ చేశారు. విమానాశ్రయానికి సమీపంలో 300 ఎకరాల భూమి కేటాయించినట్టుగా కూడా బొమ్మై ట్వీట్ చేశారు. దీంతోపాటు లక్షమందికి ఉపాధి కల్పించేలా రాష్ట్రంలో పెట్టుబడుల నిమిత్తం ఫాక్స్కాన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ట్వీట్ చేశారు. కాగా ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియు గత ఫిబ్రవరి 27 నుంచి ఈ నెల (మార్చి) 4 వరకు ఇండియాలో పర్యటించారు. సెమి కండక్టర్ల వంటి నూతన రంగాల్లో సహకారాన్ని కోరేందుకు ఉద్దేశించిందని అధికారికంగానే ప్రకటించారు. అలాగే కంపెనీ అభివృద్ధి అవకాశాలను దృష్టిలో నుంచుకొని స్థానిక ప్రభుత్వాలతో సంబంధాలను కొనసాగిస్తామని కూడా ఆయన ప్రకటించిన సంగతి విదితమే. -
చైనాను వద్దనుకొని భారత్కు వచ్చేస్తోంది?
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు చెందిన ఐఫోన్లను తయారు చేసే ఫాక్స్కాన్ టెక్నాలజీ సంస్థ చైనాను విడిచేసేందుకు సిద్ధమైంది. భారత్లో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభించనుంది. ఇందుకోసం ఆ సంస్థ సుమారు 700 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా-చైనా మధ్య అసలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దిగజారేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్పై బెలూన్ కూల్చేవేతతో అమెరికాపై చైనా మండిపడుతుంటే .. ఉక్రెయిన్పై యుద్ధం విషయంలో రష్యాకు సాయం చేస్తే చైనాపై ఆంక్షలు విధించేందుకు అమెరికా రెడీ అవుతోంది. దీంతో రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య వివాదం తమ వ్యాపారానికి ఆటంకం కలిగే అవకాశం ఉందని పలు దిగ్గజ సంస్థలు భావిస్తున్నాయి. అందుకే చైనాలో ఉండి వ్యాపారం చేయడం ఏమాత్రం మంచిది కాదన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నాయి. చైనాలో ఉంటే అన్నీ ఆటంకాలే ఈ తరుణంలో చైనాలో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు దిగ్గజ కంపెనీలు డ్రాగన్ కంట్రీని విడిచి పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. వరల్డ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ సంస్థగా ఫాక్స్గాన్కు పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. చైనాలో పరిస్థితులు, ఇతర దేశాలతో వైరం కారణంగా ఆ సంస్థకు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడమే గాక.. భారీగా నష్టాల్ని మూటగట్టుకుంటుంది. అందుకే చైనా నుంచి మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను భారత్కు తరలించాలని చూస్తోంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఎయిర్ పోర్ట్ సమీప ప్రాంతంలో 300 ఎకరాల్లో ఐఫోన్ విడి భాగాల తయారీ యూనిట్ను నెలకొల్పే యోచనలో ఉందంటూ ఎకనమిక్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. లక్షమందికి ఉపాధి యాపిల్తో పాటు ఇతర అమెరికన్ బ్రాండ్లు చైనాకు గుడ్బై చెప్పి ప్రత్యామ్నాయంగా ఉన్న భారత్తో పాటు ఏసియన్ కంట్రీ వియాత్నంలలో తన కార్యకలాపాలు కొనసాగించాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇక భారత్లో ఫాక్స్కాన్ నెలకొల్పబోయే తయారీ యూనిట్ కారణంగా లక్ష మంది ఉపాధి కలగనుంది. ప్రస్తుతం ఆ సంస్థ చైనా నగరం జెంగ్జౌ ఫాక్స్కాన్కు చెందిన ఐఫోన్ల తయారీ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లో 2లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా..ప్రత్యేక సందర్భంగాల్లో తయారీని పెంచేందుకు భారీ ఎత్తున ఉద్యోగుల్ని నియమించుకుంటుంది. పునరాలోచనలో యాపిల్ ప్రస్తుతం వైరస్ విజృంభణతో కోవిడ్-19 ఆంక్షలు విధించింది చైనా ప్రభుత్వం. దీంతో జెంగ్ జౌ ఫాక్స్కాన్ ప్లాంట్ తయారీలో ఉద్యోగులు సెలవులో ఉండగా.. చైనాలో ఐఫోన్లను తయారు చేసే విషయంలో యాపిల్ పునఃపరిశీలిస్తుంది. అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.యాపిల్ నిర్ణయానికి కొనసాగింపుగానే ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్ ఎంత వీలైతే అంత తొందరుగా భారత్లో ప్లాంట్ నెలకొల్పనున్నట్లు సమాచారం. కాగా, ఫాక్సాకాన్ను చైనా నుంచి భారత్కు తరలించే విషయంలో ఇప్పటి వరకు ఆ సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటనలేదు. ఫాక్సాకాన్, యాపిల్ తోపాటు ఇటు కర్ణాటక ప్రభుత్వం సైతం మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ల తయారీపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. -
తెలంగాణ వేగం అబ్బురపరిచింది
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ సందర్శనకు ఆహ్వానం అందినప్పుడు అలా వచ్చి.. ఇలా ఓ బటన్ నొక్కేసి తిరిగి వెళ్లిపోవచ్చనుకున్నా. కానీ విమానాశ్రయంలో విమానం దిగింది మొదలుకొని భారత్లోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రం ‘టీ–వర్క్స్ను ప్రారంభించేంత వరకూ ప్రతీ క్షణం అబ్బురంగా అనిపించింది’అని ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లూ చెప్పారు. ఆలోచనలను ఆచరణలో పెట్టి వస్తువులుగా మార్చేందుకు అవకాశం కల్పించే టీ–వర్క్స్తో ఎన్నో అద్భుతాలు సాధ్యమవుతాయన్నారు. హైదరాబాద్లో గురువారం టీ–వర్క్స్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైటెక్ రంగంలో వృద్ధి సాధించాలంటే వేగం అన్నింటికంటే ముఖ్యమని, తెలంగాణ ప్రభుత్వానికి ఆ వేగం పుష్కలంగా ఉందని కొనియాడారు. విమానాశ్రయం నుంచి వస్తున్నప్పుడు ఇక్కడి అభివృద్ధిని గమనించానని.. ఇది నిజంగా భారతదేశమేనా అనిపించిందని చెప్పారు. ఫాక్స్కాన్ పెట్టుబడుల కోసం రెండు ప్రాంతాలను సందర్శించానని, అక్కడి కంటే చురుకుగా ఏర్పాట్లు చేసి తెలంగాణ అంటే వేగమని నిరూపించుకున్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ సందర్భంగా ఆయన ఎనిమిదేళ్లలో చేపట్టిన కార్యక్రమాలను వీడియో రూపంలో చూపారని.. అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధి జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. కేసీఆర్ స్థాయిలో తన కంపెనీలోనూ ప్రగతిని సాధించాలంటే తనకున్న నాలుగేళ్ల పదవీకాలంలో ఆదాయాన్ని ఇప్పుడున్న 205 బిలియన్ డాలర్ల నుంచి 400 బిలియన్ డాలర్లకు పెంచాల్సి ఉంటుందన్నారు. టీ–వర్క్స్ మరింత ప్రయోజనకారిగా మారేందుకు తమవంతు సాయంగా పూర్తిస్థాయి అసెంబ్లీ లైన్ ఒకదాన్ని బహూకరించనున్నట్లు చెప్పారు. కేసీఆర్ పునాది.. కేటీఆర్ నిర్మాణం.. రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పునాదులు వేస్తోంటే.. మంత్రి కేటీఆర్ ఆ పునాదులపై అభివృద్ధిని నిర్మిస్తున్నారని టీ–వర్క్స్ సీఈవో సుజయ్ కరమ్పుర కొనియాడారు. రూ.11.5 కోట్ల విలువైన 200 అత్యాధునిక పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, 78 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న టీ–వర్క్స్ను 2.5 లక్షల చదరపు అడుగులకు విస్తరించనున్నట్లు తెలిపారు. అంతకుముందు.. అద్భుతమైన లేజర్ షో తరువాత దేశంలోనే మొదటిసారిగా టీ–వర్క్స్ భవనం చుట్టూ ఏర్పాటు చేసిన పరదాలను తొలగించి (కబూకీ డ్రాప్) ఈ కేంద్రాన్ని కేటీఆర్, యంగ్ లూ ప్రారంభించారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్తోపాటు వివిధ కంపెనీల సీఈవోలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఆ అద్భుతాలు హైదరాబాద్లోనూ..: కేటీఆర్ ఐటీ రంగంలో తనదైన ముద్ర వేసిన భారత్, హార్డ్వేర్ రంగం దిగ్గజమైన తైవాన్ చేతులు కలిపితే ప్రపంచానికి ఉపయోగపడే ఎన్నో ఉత్పత్తులను సిద్ధం చేయొచ్చని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే కాదని, తన దృష్టిలో ఇప్పుడు ఐటీ అంటే ఇండియా + తైవాన్ అని చెప్పారు. రాష్ట్రంలో లక్ష వరకూ ఉద్యోగాలు కల్పించేలా ఎలక్ట్రానిక్ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఫాక్స్కాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఫాక్స్కాన్ షెన్జెన్లో సాధించిన అద్భుతాలను హైదరాబాద్లోనూ చేద్దామని పిలుపునిచ్చారు. హార్డ్వేర్ రంగంలోనూ హైదరాబాద్ను ఉన్నత స్థానంలో నిలిపేందుకు ఫాక్స్కాన్ మార్గదర్శనం చేయాలని కోరారు. కోవిడ్ సమయంలో వెంటిలేటర్ మొదలుకొని ఎన్నో అద్భుత ఆవిష్కరణలకు టీ–వర్క్స్ కేంద్రమైందన్నారు. -
పదేళ్లలో లక్ష మందికి ఉపాధి
సాక్షి, హైదరాబాద్: తైవాన్కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ ఫాక్స్కాన్ (హోన్ హై టెక్నాలజీ గ్రూప్) రాష్ట్రంలో భారీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. మొబైల్ఫోన్లు, ట్యాబ్ల అనుబంధ ఉత్పత్తుల పరిశ్రమను స్థాపించనుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమీపంలోని కొంగరకలాన్ లేదా బాచుపల్లి సమీపంలోని దుండిగల్లో 250 ఎకరాల్లో ఇది ఏర్పాటు కానుంది. ఈ పరిశ్రమ ద్వారా రానున్న పదేళ్లలో లక్షమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో సమావేశమై ఆయన సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేశానికి వచ్చిన అతిపెద్ద ఎలక్ట్రానిక్స్రంగ పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనదని సమావేశం అనంతరం సీఎం కార్యాలయం ప్రకటించింది. గురువారం యంగ్ ల్యూ పుట్టినరోజు కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారుచేసిన గ్రీటింగ్ కార్డును సీఎం కేసీఆర్ ఆయనకు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం అనంతరం ప్రగతిభవన్లో యంగ్ల్యూ ప్రతినిధి బృందానికి మధ్యాహ్న భోజనంతో ఆతిథ్యమిచ్చారు. ఒప్పంద కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ప్రత్యేక సీఎస్లు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్దన్రెడ్డి, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల సాయం అందిస్తాం: సీఎం కేసీఆర్ అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిరంగ ముఖచిత్రాన్ని గుణాత్మకంగా మార్చిన గొప్ప సంస్థ ‘ఫాక్స్కాన్’తన కార్యకలాపాలకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంపిక చేసుకోవడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాలకు అన్ని రకాల సహాయ, సహకారాలను అందిస్తామని హామీనిచ్చారు. ఫాక్స్కాన్తో లక్షకుపైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం రావడం గొప్ప విషయన్నారు. సాధ్యమైనంత వరకు స్థానిక యువతకు ఉద్యోగాలు లభించేలా చర్యలు చేపడతామని ప్రకటించారు. ఈ సమావేశ సమయంలోనే టీఎస్ఐఐసీ అధికారులు కొంగరకలాన్, దుండిగల్ ప్రాంతాలపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తైవాన్ మా సహజ భాగస్వామి.. ‘రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను అమలుచేస్తోంది. బంగారు తెలంగాణ సాధనకు అనేక గొప్ప ప్రాజెక్టులను చేపట్టింది. ఫాక్స్కాన్ రాక రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుంది. తైవాన్ను తెలంగాణ సహజ భాగస్వామిగా భావిస్తున్నాం. ఫాక్స్కాన్ పురోగమనంలో రాష్ట్రం భాగమైనందుకు సంతోషంగా ఉంది’అని సీఎం కేసీఆర్ అన్నారు. పదేళ్లలో లక్ష ఉద్యోగావకాశాలు: మంత్రి కేటీఆర్ ఫాక్స్కాన్ పరిశ్రమ స్థాపనతో వచ్చే పదేళ్లలో లక్ష మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. విస్తృత అధ్యయనం చేశాకే వచ్చాం: ఫాక్స్కాన్ చైర్మన్ తెలంగాణ గురించి తమ సంస్థ విస్తృతంగా అధ్యయనం చేసిందని ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ ల్యూ తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని ప్రశంసించారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో ఆశావహ దృక్పథంతో ఉన్నామన్నారు. ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తుల తయారీ.. ప్రపంచవ్యాప్తంగా విక్రయించే 40 శాతం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను ఫాక్స్కాన్ తయారుచేస్తోంది. యాపిల్, మైక్రోసాఫ్ట్, నోకియా, సోనీ వంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులను రూపొందిస్తోంది. ఫాక్స్కాన్ పరిశ్రమల్లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్, ఐపాడ్, ఐప్యాడ్, అమెజాన్కు చెందిన కిండిల్, బ్లాక్బెర్రీ లిమిటెడ్కు చెందిన స్మార్ట్ఫోన్లు, ఇతర పరికరాలు, గేమింగ్ సిస్టమ్స్, నోకియా, సోనీ పరికరాలు (ప్లే స్టేషన్ 3, ప్లే స్టేషన్ 4 గేమింగ్ కంన్సోల్స్) గూగుల్ పిక్సల్, షావోమీ పరికరాలు, సీపీయూ సాకెట్ల తయారీ జరుగుతోంది. ఈ సంస్థ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో కార్యకలాపాలు సాగిస్తోంది. సెమీకండక్టర్ చిప్ల తయారీ కోసం.. సాక్షి, రంగారెడ్డి జిల్లా: యాపిల్ కంపెనీ ఫాక్స్కాన్కి అతిపెద్ద కస్టమర్. ఐఫోన్లు, ఐపాడ్లు, మాక్బుక్స్ ద్వారానే ఫాక్స్కాన్ 50 శాతం ఆదాయం ఆర్జిస్తోంది. కరోనా తర్వాత దేశంలోనే ఎలక్ట్రానిక్ చిప్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం ముందుకురావడంతో మైనింగ్ దిగ్గజం వేదాంతతో కలిసి 20 బిలియన్ డాలర్లతో దేశంలో మొదటి సెమీకండక్టర్ చిప్ తయారీ ఫ్యాక్టరీని నిర్మించేందుకు ఫాక్స్కాన్ సన్నాహాలు చేస్తోంది. -
దిగ్గజ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం.. లక్ష మందికి ఉద్యోగాలు!
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’( Hon Hai Fox Conn)సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ ( Young Liu) నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్తో ప్రగతి భవన్లో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా హోన్ హై ఫాక్స్ కాన్ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. తద్వారా ఒక లక్ష ఉద్యోగాల కల్పనకు దారులు వేసింది. దాంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి లభించనుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైంది. ఒకే సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయం. ఈ ఘనతను తెలంగాణ ప్రభుత్వం సాధించింది. యంగ్ ల్యూ పుట్టిన రోజు కూడా ఇదే రోజు కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్ కార్డును సిఎం కేసీఆర్ స్వయంగా యాంగ్ లీకి అందచేశారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం అనంతరం ప్రగతి భవన్ లో యంగ్ ల్యూ ప్రతినిధి బృంధానికి మధ్యాహ్న భోజనంతో సీఎం కేసీఆర్ ఆతిథ్యమిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్, వైద్యారోగ్యం, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, డైరక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు. చదవండి: గవర్నర్ తమిళిసై తీరుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ -
ఫాక్స్కాన్కు రూ.357 కోట్లు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లకు సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద (పీఎల్ఐ).. యాపిల్ ఉత్పత్తుల కాంట్రాక్ట్ తయారీ సంస్థ ఫాక్స్కాన్ ఇండియాకు రూ.357 కోట్లు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అలాగే, డిక్సన్ టెక్నాలజీస్ సబ్సిడరీ అయిన పాడ్గెట్ ఎలక్ట్రానిక్స్కు రూ.58 కోట్ల ఉత్పత్తి ప్రోత్సాహకాల మంజూరునకు సైతం ఆమోదం తెలిపింది. పాడ్గెట్ ఎలక్ట్రానిక్స్కు మొబైల్ ఫోన్ల విభాగంలో తయారీ ప్రోత్సాహకాలు రావడం ఇది రెండో విడత కావడం గమనార్హం. ఈ విభాగంలో ప్రోత్సాహకాలను అందుకోనున్న తొలి కంపెనీ ఫాక్స్కాన్ కానుంది. చదవండి: కొత్త సంవత్సరంలో టీవీ ప్రేక్షకులకు ఊహించని షాక్! -
‘నా దారి నేను చూసుకుంటా’, చైనాకు యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారీ షాక్!
చైనా నుంచి ఒక్కొక్క కంపెనీ తరలి వెళ్లిపోతుంది. ప్రముఖ కంపెనీలు భారత్కు క్యూ కడుతున్నాయి. మొబైల్ దిగ్గజం యాపిల్కు విడి భాగాలు సరఫరా చేసే ఫాక్స్కాన్ భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం..యాపిల్కు అతిపెద్ద తయారీ భాగస్వామి సంస్థ, తైవాన్కు చెందిన ఫాక్స్కాన్..భారత్లో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ కంపెనీ తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. చైనా నుండి ఉత్పత్తిని తరలించడంపై యాపిల్ ప్రయత్నిస్తుందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ సూచించిన కొన్ని రోజుల తర్వాత ఈ నివేదిక వెలుగులోకి వచ్చింది. విజృంభిస్తున్న కోవిడ్-19 డ్రాగన్ కంట్రీలో రోజుకు 20 వేలు అంతకన్నా ఎక్కువ కోవిడ్ కేసులు విజృంభిస్తున్న కారణంగా అక్కడ అమలు చేస్తున్న కఠిన లాక్ డౌన్ నిబంధనలు తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అవుతుంది. గతంలో మాదిరిగా కాకుండా.. ఈ సారి ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తినకుండా ఫ్యాక్టరీలో తయారీని కొనసాగించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కంపెనీలో క్వారంటైన్ కేంద్రాల్ని ఏర్పాటు చేసి కార్మికులు, సిబ్బందిని అందులో నెలల తరబడి ఉంచుతున్నారు. కొన్ని చోట్ల ఇనుప కంచెలు వేసి సిబ్బంది తప్పించుకోకుండా ఏర్పాట్లు చేశారు. కంపెనీలు, ఫ్యాక్టరీల వెలుపల భారీ ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు. తిరగబడ్డ యాపిల్ ఉద్యోగులు ఫలితంగా నెలల తరబడి క్వారంటైన్ కేంద్రాల్లో మగ్గిపోతున్న కార్మికులు, సిబ్బంది ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా యాపిల్ ఫోన్ ప్రధాన తయారీ భాగస్వామి జెంగ్షూలోని ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో కార్మికులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. వీరిని నిలువరించేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బందితో వారు ఘర్షకు దిగారు. దీంతో ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ‘నా దారి నేను చూసుకుంటా’ అక్కడి ప్రభుత్వం ఈ తరహా నిర్ణయాలు ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడడంతో..ఐఫోన్ తయారీని చైనా వెలుపలి దేశాలకు తరలించాలని యాపిల్ తన కాంట్రాక్ట్ తయారీ కంపెనీలకు సమాచారం ఇచ్చింది. మార్కెట్ కేపిటలైజేషన్ వ్యాల్యూలో ప్రపంచంలో రెండో అతిపెద్ద కంపెనీగా యాపిల్ తన ఉత్పత్తులైన ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్బుక్ల తయారీ 90 శాతం చైనాలోనే జరుగుతుంది. ఈ తరుణంలో యాపిల్ సూచనతో ఫాక్స్కాన్ భారత్లో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమైంది. ఫాక్స్కాన్ విషయానికి వస్తే ఫాక్స్కాన్ 2019 నుండి మనదేశంలో యాపిల్ ఐఫోన్ 11 నుంచి తయారీని ప్రారంభించింది. ఇటీవల విడుదలైన ఐఫోన్ 14 మోడల్ను అసెంబుల్ చేస్తోంది. ఇప్పుడు దాని సామర్థ్యాన్ని విస్తరించేందుకు, ఇతర ప్రొడక్ట్లను తయారు చేసేందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ఐప్యాడ్ను భారత్ లో ఇతర ప్రొడక్ట్లను తయారు చేసే అవకాశలను అన్వేషించేందుకు కేంద్రంతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇతర దేశాలకు ప్రత్యామ్నాయంగా యాపిల్.. తన ఐపాడ్లను అసెంబుల్ కోసం మనదేశం వైపు చూస్తుందంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైనా వద్దు.. భారత్ ముద్దు భారత్లో తైవాన్కు చెందిన ఫాక్స్కాన్, విస్ట్రాన్,పెగాట్రాన్లు యాపిల్ తయారీ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ కంపెనీలు భారత్లో ఐప్యాడ్ అసెంబుల్ చేయడం అంత సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధిక నైపుణ్యం, ప్రతిభ గల సిబ్బంది లేకపోవడం ఆందోళన వ్యక్త మవుతుంది. అయినా సరే ఫాక్స్ కాన్ $500 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో సమీకరణాలు మారనున్నాయని, యాపిల్ గతంలో కంటే ఉత్పత్తికి కేంద్రంగా భారత్ అనువైన దేశమని భావిస్తోందంటూ చర్చ జరుగుతోంది. -
వారెవ్వా, సూపర్ ట్రాక్టర్.. డ్రైవర్ లేకపోయినా దూసుకుపోతుంది!
డ్రైవర్ లేకపోయినా ఫర్వాలేదు. ఎలాంటి పొలాన్నయినా ఇట్టే దున్నిపారేస్తుంది ఈ ట్రాక్టర్. డ్రైవర్లేని ట్యాక్సీలు ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో వాడుకలోకి వస్తున్న సంగతి తెలిసిందే. తైవాన్కు చెందిన బహుళజాతి సంస్థ ‘ఫాక్స్కాన్’ తొలిసారిగా డ్రైవర్లెస్ ట్రాక్టర్ను రూపొందించింది. ‘మోనార్క్ ట్రాక్టర్’ సంస్థతో కలసి ‘ఫాక్స్కాన్’ పూర్తిగా విద్యుత్తుతో నడిచే ఈ డ్రైవర్లెస్ ట్యాక్సీని అధునాతనమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసేలా తయారు చేసింది. దీనిని ఒకసారి చార్జ్ చేసుకుంటే, ఏకధాటిగా పదిగంటలు పనిచేస్తుంది. ఈ ట్రాక్టర్కు అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 70 హార్స్పవర్ సామర్థ్యంతో ఎలాంటి పొలంలోనైనా ఇట్టే పనిచేయగలుగుతుంది. దీని పనితీరుపై ‘ఫాక్స్కాన్’ పరీక్షలు జరుపుతోంది. త్వరలోనే దీనిని మరింత మెరుగ్గా తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. చదవండి: వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ టైర్ల కంపెనీ సేల్స్ టెక్నిక్ మైండ్బ్లోయింగ్! -
తెలంగాణలో ఫాక్స్కాన్ యూనిట్
సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ రంగ దిగ్గజం, తైవాన్కు చెందిన హాన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్కాన్)యూనిట్ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఫాక్స్కాన్ ఛైర్మన్ యంగ్ లియును కోరారు. గురువారం ఢిల్లీలో లియుని కలిసిన కేటీఆర్.. దేశంలో కంపెనీ విస్తరణ ప్రణాళి కలను చర్చించారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి మౌలిక సదుపా యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆయనకు వివరించారు. రాష్ట్రంలో కంపెనీ కొత్త యూనిట్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రం అందించే ప్రోత్సాహం కోసం ఎదురుచూస్తున్నామని యంగ్ లియు తెలిపారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... ఫాక్స్కాన్ సంస్థకు తెలంగాణ నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సాధ్యాసాధ్యాలను అన్వేషించేందుకు బృందాన్ని రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామన్నారు. సమావేశం లో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కరంపురి పాల్గొన్నారు. -
ఈవీ తయారీలోకి ఫాక్స్కాన్.. భారత్లో కూడా!
Taiwan Foxconn EV India: ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్, క్రేజ్ పెరుగుతున్న తరుణంలో పలు కంపెనీలు ఆటోమొబైల్ రంగం వైపు అడుగులు వేస్తున్నాయి. తాజాగా మరో దిగ్గజ కంపెనీ ఈవీ తయారీలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించింది. తైవాన్ టెక్ దిగ్గజం ఫాక్స్కాన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి అడుగుపెట్టనున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ మేరకు బుధవారం ఫాక్స్కాన్ చైర్మన్ లీయూ యంగ్ వే స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశారు. జర్మన్ ఆటోమేకర్స్ పరోక్ష సహకారంతో ఈ వాహనాల ఉత్పత్తిని మొదలుపెట్టనున్నట్లు వెల్లడించారు. అంతకు ముందు సోమవారం మూడు కార్ల నమునాను సైతం లీయూ, తైపీలో జరిగిన ఓ ఈవెంట్లో ప్రదర్శించారు. భారత దేశంతో పాటు యూరప్, లాటిన్ అమెరికా ఖండాల్లో ఈవీ వాహనాల తయారీని చేయనున్నట్లు ప్రకటించారాయన. ఇటలీ సంస్థ పినిన్ఫార్నియా డెవలప్ చేస్తున్న ‘ఇ సెడాన్’ మోడల్ను 2023లో విడుదల చేయనున్నట్లు, ఐదు సీట్లు కలిగిన ‘మోడల్ ఇ’ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 750 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని కంపెనీ చెబుతోంది. అయితే జర్మన్ టెక్నాలజీ నేపథ్యంలో తమ తొలి ప్రాధాన్యం యూరప్గానే ఉంటుందన్న లీయూ, ఆ తర్వాతి ప్రాధాన్యం మాత్రం భారత్లోనేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తైవాన్కు చెందిన హోన్ హాయ్ ప్రెసిషన్ కంపెనీ.. ఎలక్ట్రిక్ గూడ్స్ తయారీలో నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ట్యూచెంగ్ కేంద్రంగా అంతర్జాతీయంగా 13 లక్షల ఉద్యోగులతో భారీ మార్కెట్ను విస్తరించుకుంది. అంతేకాదు తైవాన్లో యాపిల్ ప్రొడక్టులకు సప్లయర్గా ఉంది. క్లిక్ చేయండి: ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి గుడ్న్యూస్ -
అదిరిపోయిన ఐఫోన్ తయారీ సంస్థ ఎలక్ట్రిక్ కార్లు
భారత్లో ఆపిల్ ఐఫోన్లను తయారు చేస్తున్న తైవాన్కు చెందిన కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ ఫాక్స్కాన్ ఎలక్ట్రిక్ మార్కెట్లోకి అడుగు పెట్టబోతుంది. తైవాన్ ఫాక్స్కాన్ కంపెనీ త్వరలో మార్కెట్లోకి తీసుకొని రానున్న మొదటి మూడు ఎలక్ట్రిక్ వాహన నమూనాలను నేడు ఆవిష్కరించింది. ప్రముఖ తైవాన్ కార్ల తయారీ సంస్థ యులోన్ మోటార్ కో లిమిటెడ్, ఫాక్స్కాన్ మధ్య చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఫాక్స్ ట్రాన్ పేరుతో ఎలక్ట్రిక్ ఎస్యువి, సెడాన్, బస్సు తయారు చేయనున్నారు. ఫాక్స్ ట్రాన్ వైస్ ఛైర్మన్ విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఐదు ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ 35 బిలియన్ డాలర్లకు చెరనుంది అని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీదారు అయిన ఫాక్స్కాన్ ప్రపంచ ఈవి మార్కెట్లో ప్రధాన నాయకుడిగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 2019లో ఈవీ ఆలోచన గురుంచి పేర్కొంది. భవిష్యత్తు డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రిక్ మార్కెట్లోకి అడుగుపెట్టినట్లు ఫాక్స్కాన్ తెలపింది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు చూడాటానికి కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఈ వీడియోను వీక్షించండి.(చదవండి: ఐఫోన్ యూజర్లకు హెచ్చరిక...!) -
భారత్లో ఐఫోన్–12 అసెంబ్లింగ్
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఐఫోన్–12 స్మార్ట్ఫోన్ అసెంబ్లింగ్ను భారత్లో మొదలుపెట్టింది. స్థానిక కస్టమర్ల కోసం వీటిని దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నందుకు గర్వంగా ఉందని ఈ సందర్భంగా సంస్థ వెల్లడించింది. ఈ మోడల్ను థర్డ్ పార్టీ అయిన ఫాక్స్కాన్ రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే భారత్లో ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్–10ఆర్, ఐఫోన్–11 మోడళ్లను ఫాక్స్కాన్, విస్ట్రన్ కంపెనీలు అసెంబుల్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2017లో తొలుత ఐఫోన్ ఎస్ఈ మోడల్తో భారత్లో ఫోన్ల తయారీకి యాపిల్ శ్రీకారం చుట్టింది. భారతదేశాన్ని మొబైల్, విడిభాగాల తయారీకి పెద్ద కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు. పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుందని అన్నారు. జోరుమీదున్న అమ్మకాలు.. ఆన్లైన్ స్టోర్ మెరుగైన పనితీరుతో డిసెంబర్ త్రైమాసికంలో భారత్లో తమ వ్యాపారం రెండింతలైందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ జనవరిలో వెల్లడించారు. కంపెనీ తన ఉనికిని పెంచుకోవడానికి దేశంలో రిటైల్ ఔట్లెట్లను ఏర్పాటు చేసే పనిలో ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా స్టోర్లు నెలకొల్పాలన్నది సంస్థ లక్ష్యం. కౌంటర్పాయింట్ నివేదిక ప్రకారం 2020 అక్టోబర్–డిసెంబరులో స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో దేశంలో ఆరవ స్థానంలో ఉన్న యాపిల్ అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 171 శాతం వృద్ధి సాధించింది. 2019తో పోలిస్తే గత సంవత్సరం 93 శాతం అధికంగా సేల్స్ నమోదు చేసింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ 15 లక్షల యూనిట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించింది. సంస్థ ఈ స్థాయి అమ్మకాలు ఒక త్రైమాసికంలో సాధించడం ఇదే తొలిసారి. గతేడాది యాపిల్ టర్నోవర్ 29 శాతం పెరిగి రూ.13,756 కోట్లు నమోదు చేసింది. నికరలాభం రూ.926 కోట్లుగా ఉంది. -
డ్రాగన్ శకం ముగిసింది!
గతమెంతో ఘనకీర్తి..?! భవిష్యత్తులో చైనా ఇదేవిధంగా చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుందేమో. పిన్ను నుంచి పెద్ద యంత్రం వరకు ఏ ఉత్పత్తిని అయినా తయారు చేయగలదు చైనా. అందుకే అంత వేగంగా ఎదిగి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగలిగింది. కానీ, కరోనాతో, అమెరికాతో వాణిజ్య కయ్యం కారణంగా చైనా పరిస్థితి మారిపోనుందని నిపుణులు, పారిశ్రామికవేత్తల మాటలను పరిశీలిస్తే అర్థమైపోతోంది. ‘ప్రపంచానికి పరిశ్రమగా చైనా రోజులు ముగిసినట్టే’.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు... ఫాక్స్కాన్ బాస్ యంగ్ లీ!. దీనికి కారణంగా ట్రేడ్ వార్ (వాణిజ్య యుద్ధం)ను ఆయన పేర్కొన్నారు. యాపిల్ ఐఫోన్ల నుంచి, డెల్ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఇలా ఒకటేమిటి అన్నింటికీ తయారీ కేంద్రం చైనాయే. యాపిల్ కు ప్రధాన తయారీ భాగస్వాముల్లో ఒకటైన ఫాక్స్కాన్ తోపాటుచైనా కేంద్రంగా విస్తరించిన డజను వరకు టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు చైనా బయట వైపునకు చూస్తున్నాయి. చైనా మార్కెట్కు, యూఎస్ మార్కెట్కు సరఫరా వ్యవస్థలను వేర్వేరుగా నిర్వహించాల్సిన ఆవశ్యకతను మారిన పరిస్థితుల్లో అవి అవగతం చేసుకున్నాయి. చైనా బయట క్రమంగా మరింత తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్టు హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ (ఫాక్స్ కాన్ గా ట్రేడయ్యే సంస్థ) చైర్మన్ యుంగ్ లీ తెలిపారు. ప్రస్తుతానికి మొత్తం తయారీ సామర్థ్యంలో 30 శాతం చైనా బయట ఈ సంస్థ ఏర్పాటు చేసుకుంది. గతేడాది జూన్ నాటికి ఇది 25 శాతమే. ఏడాదిలో చైనా వెలుపల 5 శాతం తయారీని పెంచుకున్న ఈ సంస్థ.. భవిష్యత్తులో దీన్ని మరింతగా పెంచుకునే ప్రణాళికలతో ఉంది. చైనాలో తయారై అమెరికాలోకి ప్రవేశించే ఉత్పత్తులపై పెరిగే టారిఫ్ల భారం పడకుండా ఉండేందుకు గాను ఫాక్స్ కాన్ సంస్థ భారత్, ఆగ్నేయాసియా, ఇతర ప్రాంతాలకు తయారీని తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్టు కంపెనీ ఫలితాల ప్రకటన సందర్బంగా యంగ్ లీ స్వయంగా మీడియాకు వెల్లడించారు. ‘‘భారత్ లేదా ఆగ్నేయాసియా లేదా అమెరికా.. ఏదైనా సరే ఆయా ప్రాంతాల్లో తయారీ ఎకోసిస్టమ్ ఉంది’’ అని లీ పేర్కొన్నారు. అయితే, ఫాక్స్ కాన్ తయారీలో చైనా ఇక ముందూ కీలకపాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. కాకపోతే ప్రపంచానికి తయారీ కేంద్రంగా చైనా దశకం ముగిసినట్టేనని వ్యాఖ్యానించారు. భారత్ లో ఫాక్స్ కాన్ విస్తరణ అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం కావడంతో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సంస్థలు తమ తయారీ కేంద్రాలను చైనా బయట కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాయి. అవసరమైతే యాపిల్ ఉత్పత్తులను పూర్తిగా చైనా బయట తయారు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని యంగ్ లీ గతేడాదే ఓ సందర్భంలో చెప్పడం గమనార్హం. దీర్ఘకాలంలో చైనాకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలు ఏర్పాటు కావడం తథ్యమని లీ మాటలతో స్పష్టమవుతోంది. ఫాక్స్కాన్ కు మన దేశంలోనూ తయారీ కేంద్రాలున్నాయి. మరిన్ని పెట్టుబడులతో సామర్థ్య విస్తరణ చేయనున్నట్టు ఈ సంస్థ ఇటీవలే ప్రకటించింది కూడా. భారత్ లో తయారీకి అమెరికాకు చెందిన యాపిల్ ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో యాపిల్ తయారీ భాగస్వామిగా ఫాక్స్కాన్ సంస్థ భారత మార్కెట్ పట్ల విస్తరణ ప్రణాళికలతో ఉంది. అమెరికాకు సరఫరా చేసే ఉత్పత్తుల తయారీకి భారత్ ను ప్రధానంగా ఫాక్స్కాన్ పరిశీలిస్తుండడం గమనార్హం. యాపిల్ ఐపాడ్, మ్యాక్ ఉత్పత్తులకు డిమాండ్ కారణంగా ఫాక్స్ కాన్ జూన్ క్వార్టర్ లో 5,835 కోట్ల భారీ లాభాన్ని ప్రకటించడం గమనార్హం. ఈ సంస్థ తైవాన్ కు చెందినది. టెన్సెంట్ హోల్డింగ్స్కు చెందిన వీచాట్ వినియోగాన్ని అమెరికా పౌరులు వినియోగించకుండా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. పోటీతత్వంతో స్వావలంబన భారత్ భారత్ తన అవసరాలను దేశీయంగా తీర్చుకునేందుకు (ఆత్మ నిర్భర్) దేశీయ పరిశ్రమ కచ్చితంగా మరింత పోటీనిచ్చే విధంగా మారాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు రక్షణాత్మక విధానాలను అవలంబిస్తున్నతరుణంలో.. భారత్ కూడా తన అవసరాలకు తనపైనే ఆధారపడాల్సిన అవసరం ఉందన్నారు. స్వేచ్ఛాయుత మార్కెట్ కలిగిన అమెరికా సైతం రక్షణాత్మక విధానాలను అనుసరిస్తున్న విషయాన్ని ప్రభు గుర్తు చేశారు. కనుక రానున్న రోజుల్లో ఆత్మనిర్భర్ కు మరే ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ‘‘మన పరిశ్రమలను మరింత పోటీయుతంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోటీతత్వం మన పరిశ్రమల సమర్థతను పెంచుతుంది. ఆ పోటీయే మనకు మేలు చేస్తుందని నేను నమ్ముతున్నాను’’ అంటూ పీహెచ్ డీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహంచిన కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు. ఉద్యోగ కల్పనకు కేంద్రం ఎన్నో విధాానాలను అమలు చేసినట్టు ప్రభు చెప్పారు. చైనా ఉత్పత్తులకు తగ్గిన ఆదరణ! న్యూఢిల్లీ: చైనా తయారీ ఉత్పత్తుల పట్ల భారతీయుల్లో ఆసక్తి తగ్గుతోందని సోషల్ మీడియా వేదిక లోకల్సర్కిల్స్ తన సర్వేలో వెల్లడించింది. నవంబరు 10–15 మధ్య దేశవ్యాప్తంగా 204 జిల్లాల్లో ఈ సర్వే చేపట్టారు. దీని ప్రకారం సర్వేలో పాలుపంచుకున్న వారిలో పండుగల సీజన్లో కేవలం 29 శాతం మంది మాత్రమే చైనా ఉత్పత్తులను కొనుగోలు చేశారు. గతేడాది ఈ సంఖ్య 48 శాతం ఉంది. 2019లో చేపట్టిన సర్వేలో 14,000 మందికిపైగా పాల్గొన్నారు. 2019తో పోలిస్తే ప్రస్తుత సీజన్లో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారి సంఖ్య 40 శాతం తగ్గిందని లోకల్సర్కిల్స్ ఫౌండర్ సచిన్ తపారియా తెలిపారు. ఈ ఏడాది చైనా ఉత్పత్తులు కొన్నవారిలో 71 శాతం మంది తాము స్పృహతో కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. డబ్బుకు తగ్గ విలువ కాబట్టే ఆసక్తి చూపామని 66% మంది తెలిపారు. దాడి తర్వాత పెరిగిన వ్యతిరేకత.. జూన్లో గాల్వన్ వ్యాలీలో చైనా సైనికుల దాడిలో భారత జవాన్లు వీర మరణం పొందిన సంఘటన తర్వాత చైనా ప్రొడక్ట్స్ పట్ల భారతీయుల్లో వ్యతిరేకత అధికమైంది. వచ్చే ఏడాది కాలంలో చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తామని 87 శాతం మంది వెల్లడించారు. దేశీయంగా తయారైన ప్రొడక్ట్స్ ఖరీదు ఉన్నప్పటికీ నాణ్యత మెరుగ్గా ఉంటుందని అత్యధికులు ఈ విషయాన్ని వ్యక్తపరిచారు. పండుగల సమయంలో లైట్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు ఒకసారి మాత్రమే వినియోగించేవి కావడంతో నాణ్యత ప్రధాన అంశం కాదని చాలా మంది అభిప్రాయపడ్డారు. -
చైనా శకం ముగిసింది!
గతమెంతో ఘనకీర్తి..?! భవిష్యత్తులో చైనా ఇదేవిధంగా చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుందేమో. పిన్ను నుంచి పెద్ద యంత్రం వరకు ఏ ఉత్పత్తిని అయినా తయారు చేయగలదు చైనా. అందుకే అంత వేగంగా ఎదిగి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగలిగింది. కానీ, కరోనాతో, అమెరికాతో వాణిజ్య కయ్యం కారణంగా చైనా పరిస్థితి మారిపోనుందని నిపుణులు, పారిశ్రామికవేత్తల మాటలను పరిశీలిస్తే అర్థమైపోతోంది. ‘ప్రపంచానికి పరిశ్రమగా చైనా రోజులు ముగిసినట్టే’.. ఈ విధంగా వ్యాఖ్యానించింది ఫాక్స్ కాన్ బాస్ యంగ్ లీ. (3 కోట్లు దాటిన పరీక్షలు) దీనికి కారణంగా ట్రేడ్ వార్ (వాణిజ్య యుద్ధం)ను ఆయన పేర్కొన్నారు. యాపిల్ ఐఫోన్ల నుంచి, డెల్ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు ఇలా ఒకటేమిటి అన్నింటికీ తయారీ కేంద్రం చైనాయే. యాపిల్ కు ప్రధాన తయారీ భాగస్వాముల్లో ఒకటైన ఫాక్స్ కాన్తోపాటు చైనా కేంద్రంగా విస్తరించిన డజను వరకు టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు చైనా బయట వైపునకు చూస్తున్నాయి. చైనా మార్కెట్ కు, యూఎస్ మార్కెట్కు సరఫరా వ్యవస్థలను వేర్వేరుగా నిర్వహించాల్సిన ఆవశ్యకతను మారిన పరిస్థితుల్లో అవి అవగతం చేసుకున్నాయి. చైనా బయట క్రమంగా మరింత తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్టు హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ (ఫాక్స్ కాన్ గా ట్రేడయ్యే సంస్థ) చైర్మన్ యుంగ్ లీ తెలిపారు. ప్రస్తుతానికి మొత్తం తయారీ సామర్థ్యంలో 30 శాతం చైనా బయట ఈ సంస్థ ఏర్పాటు చేసుకుంది. గతేడాది జూన్ నాటికి ఇది 25 శాతమే. ఏడాదిలో చైనా వెలుపల 5 శాతం తయారీని పెంచుకున్న ఈ సంస్థ.. భవిష్యత్తులో దీన్ని మరింతగా పెంచుకునే ప్రణాళికలతో ఉంది. చైనాలో తయారై అమెరికాలోకి ప్రవేశించే ఉత్పత్తులపై పెరిగే టారిఫ్ల భారం పడకుండా ఉండేందుకు గాను ఫాక్స్ కాన్ సంస్థ భారత్, ఆగ్నేయాసియా, ఇతర ప్రాంతాలకు తయారీని తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్టు కంపెనీ ఫలితాల ప్రకటన సందర్భంగా యంగ్ లీ స్వయంగా మీడియాకు వెల్లడించారు. ‘‘భారత్ లేదా ఆగ్నేయాసియా లేదా అమెరికా.. ఏదైనా సరే ఆయా ప్రాంతాల్లో తయారీ ఎకోసిస్టమ్ ఉంది’’ అని లీ పేర్కొన్నారు. అయితే, ఫాక్స్ కాన్ తయారీలో చైనా ఇక ముందూ కీలకపాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. కాకపోతే ప్రపంచానికి తయారీ కేంద్రంగా చైనా దశకం ముగిసినట్టేనని వ్యాఖ్యానించారు. భారత్లో ఫాక్స్ కాన్ విస్తరణ అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం కావడంతో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సంస్థలు తమ తయారీ కేంద్రాలను చైనా బయట కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాయి. అవసరమైతే యాపిల్ ఉత్పత్తులను పూర్తిగా చైనా బయట తయారు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని యంగ్ లీ గతేడాదే ఓ సందర్భంలో చెప్పడం గమనార్హం. దీర్ఘకాలంలో చైనాకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలు ఏర్పాటు కావడం తథ్యమని లీ మాటలతో స్పష్టమవుతోంది. ఫాక్స్కాన్కు మన దేశంలోనూ తయారీ కేంద్రాలున్నాయి. మరిన్ని పెట్టుబడులతో సామర్థ్య విస్తరణ చేయనున్నట్టు ఈ సంస్థ ఇటీవలే ప్రకటించింది కూడా. భారత్లో తయారీకి అమెరికాకు చెందిన యాపిల్ ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అమెరికాకు సరఫరా చేసే ఉత్పత్తుల తయారీకి భారత్ ను ప్రధానంగా ఫాక్స్ కాన్ పరిశీలిస్తుండడం గమనార్హం. యాపిల్ ఐపాడ్, మ్యాక్ ఉత్పత్తులకు డిమాండ్ కారణంగా ఫాక్స్ కాన్ జూన్ క్వార్టర్ లో 5,835 కోట్ల భారీ లాభాన్ని ప్రకటించడం గమనార్హం. ఈ సంస్థ తైవాన్కు చెందినది. టెన్సెంట్ హోల్డింగ్స్కు చెందిన వీచాట్ వినియోగాన్ని అమెరికా పౌరులు వినియోగించకుండా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా యాపిల్ తన యాప్ స్టోర్ నుంచి వీచాట్ యాప్ ను తొలగించినట్టయితే వార్షికంగా ఐఫోన్ల ఎగుమతులు 25–30% పడిపోవచ్చనేది టీఎఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ అంచనా. పోటీతత్వంతో స్వావలంబన భారత్ భారత్ తన అవసరాలను దేశీయంగా తీర్చుకునేందుకు (ఆత్మ నిర్భర్) దేశీయ పరిశ్రమ కచ్చితంగా మరింత పోటీనిచ్చే విధంగా మారాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు రక్షణాత్మక విధానాలను అవలంబిస్తున్న తరుణంలో.. భారత్ కూడా తన అవసరాలకు తనపైనే ఆధారపడాల్సిన అవసరం ఉందన్నారు. స్వేచ్ఛాయుత మార్కెట్ కలిగిన అమెరికా సైతం రక్షణాత్మక విధానాలను అనుసరిస్తున్న విషయాన్ని ప్రభు గుర్తు చేశారు. కనుక రానున్న రోజుల్లో ఆత్మ నిర్భర్కు మరే ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ‘‘మన పరిశ్రమలను మరింత పోటీయుతంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోటీతత్వం మన పరిశ్రమల సమర్థతను పెంచుతుంది. ఆ పోటీయే మనకు మేలు చేస్తుందని నేను నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు, ఉద్యోగ కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధానాలను అమలు చేసినట్టు ప్రభు చెప్పారు. దేశాన్ని మరింత సౌభాగ్యంగా మార్చేందుకే ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ పిలుపునిచ్చినట్టు చెప్పారు. -
ఫాక్స్కాన్- భారీ పెట్టుబడి, ఉద్యోగాల బాట!
తైవాన్లోని తైపీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఫాక్స్కాన్ దేశీయంగా బిలియన్ డాలర్ల(రూ. 7500 కోట్లు)ను ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రధానంగా కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ సేవలను అందిస్తుంటుంది. కంపెనీ కస్లమర్లలో యూఎస్ టెక్ దిగ్గజం యాపిల్ను ప్రధానంగా పేర్కొనవచ్చు. యాపిల్ తయారీ ఐఫోన్ల అసెంబ్లింగ్ను చేపడుతుంటుంది. ఇటీవల యూఎస్, చైనా మధ్య తలెత్తిన వాణిజ్య వివాదాలు, కరోనా వైరస్ తదితర సవాళ్ల నేపథ్యంలో దేశీయంగా తయారీని విస్తరించాలని ఫాక్స్కాన్ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు ప్రధానంగా యాపిల్ నుంచి ఒత్తిడి(బిజినెస్) పెరుగుతుండటంతో తాజా ప్రణాళికలకు తెరతీసినట్లు తెలియజేశాయి. అయితే కస్లమర్ల విషయాలకు సంబంధించి మాట్లడబోమని ఫాక్స్కాన్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ఐఫోన్ XR ప్లాంటులో ఇప్పటికే చెన్పైలోని శ్రీపెరంబూర్ ప్లాంటులో యాపిల్ ఎక్స్ఆర్ మోడల్ ఐఫోన్లను ఫాక్స్కాన్ తయారు చేస్తోంది. ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా మరిన్ని మోడళ్ల ఐఫోన్లను రూపొందించాలని భావిస్తోంది. తద్వారా చైనాలో ఫాక్స్కాన్ చేపడుతున్న ఐఫోన్ తయారీ కార్యకలాపాలను కొంతమేర దేశీయంగా తరలించే యోచనలో ఉన్నట్లు అంచనా. వెరసి ఇక్కడ అదనంగా 6,000 మందికి ఉపాధి కల్పించవలసి ఉంటుందని విశ్లేషకులు తెలియజేశారు. ఇప్పటికే దేశీయంగా స్టార్ట్ ఫోన్ల విక్రయాలలో యాపిల్ ఐఫోన్లు 1 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఏపీలోనూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన ప్లాంటు ద్వారా చైనా కంపెనీ షియోమీ కార్ప్సహా పలు ఇతర కంపెనీల స్మార్ట్ ఫోన్లను ఫాక్స్కాన్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. మరోవైపు బెంగళూరు ప్లాంటులో యాపిల్ ఐఫోన్లలో కొన్ని మోడళ్లను అసెంబ్లింగ్ చేస్తున్న తైవాన్ కంపెనీ విస్ట్రన్ కార్ప్ సైతం ఫాక్స్కాన్ తరహా ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా యాపిల్ కంపెనీకి చెందిన ఇతర ప్రొడక్టుల తయారీని సైతం చేపట్టాలని యోచిస్తున్నట్లు సంబంధితవర్గాలు వెల్లడించాయి. మేకిన్ ఇండియా దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సాహించేందుకు గత నెలలో కేంద్ర ప్రభుత్వం 6.65 బిలియన్ డాలర్ల(రూ. 50,000 కోట్లు) విలువైన ప్రణాళికను ప్రకటించింది. దీనిలో భాగంగా దేశీయంగా స్మార్ట్ ఫోన్ తయారీ కార్యకలాపాలు ప్రారంభిస్తే గ్లోబల్ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించనుంది. వెరసి ప్రధాని మోడీ ప్రకటించిన మేకిన్ ఇండియా కార్యక్రమానికి మరింత మద్దతు లభించనుంది. అంతేకాకుండా కొత్తగా ఉద్యోగ కల్పనకు దారి ఏర్పడుతుందని పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. -
ఆ ఫోన్ కోసం విద్యార్థులు ఓవర్టైమ్ వర్క్
బీజింగ్ : ఐఫోన్ ఎక్స్... ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన నూతన స్మార్ట్ఫోన్. ఈ స్మార్ట్ఫోన్కు వినియోగదారుల నుంచి విపరీతమైన డిమాండ్ వచ్చింది. డిమాండ్ను చేధించడానికి మరోవైపు కంపెనీకి ఉత్పత్తి ఆలస్యమైంది. దీంతో ఆపిల్ సప్లయిర్ ఫాక్స్కాన్ ఐఫోన్ ఎక్స్ను రూపొందించడానికి వేల కొద్ది విద్యార్థులను ఉద్యోగులుగా నియమించుకుంది. అంతేకాక వారితో ఓవర్టైమ్ వర్క్ కూడా చేయించినట్టు మీడియా రిపోర్టు చేసింది. ఫైనాన్సియల్ టైమ్స్ రిపోర్టు ప్రకారం 17 నుంచి 19 వయసు ఉన్న విద్యార్థులను ఫాక్స్కాన్ సెప్టెంబర్లో ఇంటర్న్లుగా నియమించుకుంది. చైనాలోని జెంగ్జౌ అసెంబ్లింగ్ యూనిట్లో వీరిని నియమించింది. మూడు నెలల పాటు ఇంటర్న్లుగా ఇక్కడ పనిచేస్తే పని అనుభవం కూడా వస్తుందంటూ పేర్కొంది. కానీ ఈ పని తమ చదువుకు ఏ మాత్రం సరిపోదని, తమ స్కూల్ వారు బలవంతం మీద ఇక్కడ పనిచేసినట్టు ఓ విద్యార్థిని చెప్పింది. ఈ విద్యార్థి 1200 ఐఫోన్ ఎక్స్లకు కెమెరాలను అసెంబుల్ చేసింది. స్థానికంగా ఉన్న ఈ ఫాక్స్కాన్ యూనిట్లో పనిచేస్తున్న 3000 మంది జెంగ్జౌ అర్బన్ రైల్ ట్రాన్సిట్ స్కూల్ విద్యార్థుల్లో ఈమె ఒకరు. కానీ ఆపిల్, ఫాక్స్కాన్ రెండు కంపెనీలు విద్యార్థులు స్వచ్ఛదంగానే ఈ పనిచేస్తున్నారని పేర్కొన్నాయి. స్థానిక ప్రభుత్వాలు, వొకేషనల్ స్కూల్స్ కోపరేషన్తోనే ఇంటర్న్షిప్ ప్రొగ్రామ్లను చేపడతామని ఫాక్స్కాన్ చెబుతోంది. కానీ చైనాలోని మరో మూడు ఫాక్స్కాన్ యూనిట్లు పనిగంటలను పెంచుతూ ఆరోగ్య, భద్రతా రెగ్యులేషన్లను ఉల్లంఘిస్తుందని గార్డియన్ రిపోర్టు చేసింది. ఎలాంటి పరిమితులు లేకుండా ఎక్కువ గంటల పాటు వర్కర్లను పనిచేయించేలా ఫ్యాక్టరీలకు ఆపిల్ అనుమతిస్తోందని న్యూయార్క్కు చెందిన లాభాపేక్ష లేని చైనా లేబర్ వాచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లి కయాంగ్ తెలిపారు. విద్యార్థులను రాత్రి సమయాల్లో పనిచేస్తుందని, ఎక్కువ గంటల పాటు పని చేయిస్తుందని పేర్కొన్నారు. -
వన్ప్లస్ మొబైల్స్ ‘మేక్ ఇన్ ఇండియా’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ తయారీలో ఉన్న చైనా స్టార్టప్ కంపెనీ వన్ప్లస్.. బెంగళూరు వేదికగా నేడు కొత్త మోడల్ ఆవిష్కరణతోపాటు మేక్ ఇన్ ఇండియా ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది. ఫోన్ల తయారీకిగాను కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలైన ఫాక్స్కాన్ తదితర సంస్థలతో కంపెనీ చర్చిస్తోంది. మేక్ ఇన్ ఇండియా ఫోన్ను ఈ ఏడాదే తీసుకొస్తామని వన్ప్లస్ ఇండియా జీఎం వికాస్ అగర్వాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. అయితే సోమవారం నాటి అధికారిక ప్రకటన గురించి సమాధానం దాటవేశారు. బెంగళూరు కార్యక్రమానికి సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈవో పీట్ లూ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. వన్ప్లస్ మూడో మోడల్ పేరు ‘ఎక్స్’ లేదా ‘మినీ’ అని సమాచారం. 5 అంగుళాల స్క్రీన్, 1.9 గిగాహెట్జ్ ప్రాసెసర్, 4జీ, 1,920/1,080 రిసొల్యూషన్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. వన్ప్లస్ వన్, వన్ప్లస్-2 మోడళ్ల కంటే ఇది తక్కువ ధర ఉంటుంది. ఇక ఎటువంటి ఇన్విటేషన్ లేకుండానే వన్ప్లస్-2 కొనుక్కోవచ్చు. సోమవారం మధ్యాహ్నం 12 నుంచి 1 మధ్య అమెజాన్ ద్వారా ఈ అవకాశం ఉంది. -
శ్రీసిటీలో ఆసస్ మొబైల్స్ తయారీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న తైవాన్ కంపెనీ ఆసస్ టెక్నాలజీస్ మేక్ ఇన్ ఇండియా బాట పట్టింది. కాంట్రాక్ట్ తయారీలో ఉన్న ఫాక్స్కాన్తో చేతులు కలిపింది. ఆంధ్రప్రదేశ్ శ్రీసిటీలో ఉన్న ఫాక్స్కాన్ ప్లాంటులో ఆసస్ మొబైల్స్ రూపొందనున్నాయి. ఆసస్ జెన్ఫోన్ స్మార్ట్ఫోన్లకు దేశీయంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్లో తయారీ ప్లాంటు ఉండాలన్న తలంపుతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంటది. ప్లాంటులో నెలకు 1.5 లక్షల ఫోన్లను ఉత్పత్తి చేస్తారు. తొలుత జెన్ఫోన్ 2 లేసర్, జెన్ఫోన్ గో మోడళ్లు తయారు కానున్నాయి. డిసెం బర్ నాటికి జెన్ఫోన్ సెల్ఫీ మోడల్ను మార్కెట్లో ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. లెనోవో, షావొమీ, జియోనీ ఫోన్లు సైతం ఫాక్స్కాన్ శ్రీసిటీ ప్లాంటులోనూ తయార వుతున్న సంగతి తెలిసిందే. 5 శాతం వాటా లక్ష్యం.. స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట ్లలో భారత్ ఒకటి. ఇక్కడి మార్కెట్పై ఆసస్ భారీ అంచనాలు పెట్టుకుంది. కంపెనీ ఆఫర్ చేస్తున్న మోడళ్ల వ్యూహాత్మక ధరల కారణంగా 2016 మార్చినాటికి భారత స్మార్ట్ఫోన్ల మార్కెట్లో 5 శాతం వాటాను లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం మార్కెట్ వాటా 2 శాతమున్నట్టు కంపెనీ చెబుతోంది. భారత్లో తాము విక్రయిస్తున్న ఫోన్లలో 80 శాతం దేశీయంగా తయారు చేయాలన్నది ప్రణాళిక అని ఆసస్ దక్షిణాసియా హెడ్ పీటర్ చాంగ్ తెలిపారు. మంచి ఫీచర్లు, డిజైన్ కోరుకునేవారికి అత్యుత్తమ మోడళ్లను అందుబాటు ధరలో అందిస్తామన్నారు. భారత్లో తయారీ చేపట్టడం వల్ల వ్యయం 3 శాతం తగ్గుతుందని చెప్పారు. -
శ్రీసిటీలో జియోనీ ఫోన్ల తయారీ
- ఫాక్స్కాన్తో చేతులు కలిపిన కంపెనీ - తయారీకి మూడేళ్లలో రూ.330 కోట్ల వ్యయం - జియోనీ ఇండియా ఎండీ అరవింద్ వోరా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న జియోనీ ‘మేక్ ఇన్ ఇండియా’ బాటపట్టింది. మొబైల్స్ తయారీ సంస్థలైన ఫాక్స్కాన్, డిక్సన్ టెక్నాలజీస్తో చేతులు కలిపింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో ఉన్న ఫాక్స్కాన్ ప్లాంటుతోపాటు డిక్సన్కు చెందిన నోయిడా ప్లాంటులో ఫోన్లు తయారు కానున్నాయి. అక్టోబరులో మేక్ ఇన్ ఇండియా తొలి ఉత్పాదన మార్కెట్లోకి రానుంది. ఫాక్స్కాన్ శ్రీసిటీ ప్లాంటులో మూడు అసెంబ్లీ లైన్స్ ఉన్నాయి. తయారీ సామర్థ్యం నెలకు 5 లక్షల యూనిట్లు. డిక్సన్ నోయిడా ప్లాంటులో 9 అసెంబ్లీ లైన్స్ ఉన్నాయి. తయారీ సామర్థ్యం నెలకు 7 లక్షల యూనిట్లు. రెండు ప్లాంట్ల వద్ద జియోనీ ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. వచ్చే మూడేళ్లలో తయారీకి రూ.330 కోట్లు ఖర్చు చేస్తామని జియోనీ ఇండియా ఎండీ అరవింద్ రజనీష్ వోరా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. భారత్ నుంచి విదేశాలకు: చైనాలోని సొంత ప్లాంటులో తయారైన ఫోన్లను జియోనీ దిగుమతి చేస్తోంది. ఇక నుంచి జియోనీ ఎఫ్ సిరీస్, పీ సిరీస్ స్మార్ట్ఫోన్లను ఫాక్స్కాన్ శ్రీసిటీ ప్లాంటులో తయారు చేస్తుంది. ఇతర స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లను డిక్సన్ ఉత్పత్తి చేయనుంది. దేశీయంగా తయారీ చేపట్టడం ద్వారా త్వరితగతిన కొత్త మోడళ్లను ఆవిష్కరించేందుకు కంపెనీకి వీలవుతుంది. అలాగే దిగుమతి సుంకాలు ఆదా అవుతాయి. ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంతో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. చైనా వెలుపల తయారీ కేంద్రంగా భారత్ను నిలుపుతామని జియోనీ ప్రెసిడెంట్ విలియం లూ పేర్కొన్నారు. నెలకు ఒక మోడల్: భారత్ మార్కెట్లో నెలకు ఒక మోడల్ను విడుదల చేయాలని నిర్ణయించినట్టు అరవింద్ తెలిపారు.రూ.8,000 ఆపైన ధరలో వచ్చేవన్నీ 4జీ మోడళ్లని తెలిపారు. ఆన్లైన్లోనూ ఫోన్లను విక్రయిస్తామని వెల్లడించారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్తోపాటు ఇతర ఇ-కామర్స్ కంపెనీలతో కంపెనీ చర్చలు జరుపుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,750 కోట్ల ఆదాయాన్ని జియోనీ ఇండియా ఆర్జించింది. ఈ ఏడాది రూ.6,000 కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది. -
స్నాప్డీల్లో రూ.3,269 కోట్ల తాజా పెట్టుబడులు
సాఫ్ట్బ్యాంక్, ఆలీబాబా, ఫాక్స్కాన్ నుంచి నిధులు న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్డీల్ తాజాగా 50 కోట్ల డాలర్లు(రూ.3,269 కోట్లు) పెట్టుబడులు సమీకరించింది. చైనాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా, తైవాన్కు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ఫాక్స్కాన్, జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంక్ల నుంచి ఈ నిధులు సమీకరించామని స్నాప్డీల్ తెలి పింది. ఇప్పటికే తమ సంస్థలో ఇన్వెస్ట్ చేసిన టిమసెక్, బ్లాక్రాక్, మైరాయిడ్, ప్రేమ్జీ ఇన్వెస్ట్ల నుంచి కూడా ఈ తాజా రౌండ్ నిధుల సమీకరణలో పెట్టుబడులు వచ్చాయని స్నాప్డీల్ సీఈఓ, వ్యవస్థాపకుల్లో ఒకరైన కునాల్ బహాల్ చెప్పారు. ఇప్పటికే ఈ సంస్థ వంద కోట్ల డాలర్లుకు పైగా పెట్టుబడులను సాఫ్ట్బాంక్(62.7 కోట్ల డాలర్లు), పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాల నుంచి రాబట్టింది. కాగా పెట్టుబడి వివరాలను స్నాప్డీల్ వెల్లడించలేదు. అయితే ఫాక్స్కాన్కు చెందిన ఎఫ్ఐహెచ్ మొబైల్ సంస్థ స్నాప్డీల్లో 4.27 శాతం వాటాను 20 కోట్ల డాలర్లకు కొనుగోలు చేశామని పేర్కొంది. ఈ లెక్కన స్నాప్డీల్ విలువ 400-500కోట్ల డాలర్లు(రూ.25,200-31,500 కోట్లు) ఉంటుందని అంచనా. -
5 ఏళ్లు..5 బిలియన్ డాలర్లు..
పెట్టుబడి ప్రణాళికలను వెల్లడించిన ఫాక్స్కాన్ మహారాష్ట్రలో తయారీ యూనిట్, ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు ముంబై: తైవాన్కు చెందిన ప్రపంచ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీ కంపెనీ ఫాక్స్కాన్ భారత్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. మహారాష్ట్రలో వచ్చే ఐదేళ్లలో రూ. 32 వేల కోట్ల(5 బిలియన్ డాలర్లు)ను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఫాక్స్కాన్ శనివారం తెలిపింది. ఇందులోభాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం, ఫాక్స్కాన్కు మధ్య ఒప్పందం కుదిరింది. కంపెనీ ఈ పెట్టుబడులను తయారీ యూనిట్ స్థాపనకు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్ర ఏర్పాటుకు వెచ్చించనుంది. వీటి ఏర్పాటు ముంబై లేక పుణే ప్రాంతంలోని 1,500 ఎకరాల్లో ఉంటుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల 50 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. మహారాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉండటం తమను ఆకర్షించిందని ఫాక్స్కాన్ వ్యవస్థాపకుడు టెర్రీ గో తెలిపారు. స్నాప్డీల్, మైక్రోమ్యాక్స్, అదాని గ్రూప్ తదితర కంపెనీలతో జతకడుతున్నట్లు ఫాక్స్కాన్ ఇది వర కే ప్రకటించింది. ఫాక్స్కాన్ కంపెనీ యాపిల్ ఐ-ఫోన్స్ను తయారు చేస్తుంది. -
ఫాక్స్కాన్తో అదాని జాయింట్ వెంచర్?
న్యూఢిల్లీ: అదాని ఎంటర్ప్రైజెస్, ప్రపంచ అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీదారు ఫాక్స్కాన్తో కలసి ఒక జాయిం ట్ వెంచర్ను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతోంది. ఈ జాయింట్ వెంచర్ ద్వారా అదాని ఎంటర్ప్రైజెస్ భారత్లో యాపిల్ ఐఫోన్స్ను తయారు చేస్తుందని సమాచారం. కంపెనీ వ్యాపార విస్తరణ కోసం గత నెలలో అదాని షేర్హోల్డర్లు సెక్యూరిటీల ఇష్యూ ద్వారా రూ.6,000 కోట్ల నిధుల సమీకరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో కంపెనీ షేరు ధర బీఎస్ఈలో 11 శాతం పెరిగి రూ.94 వద్ద ముగిసింది. -
50 కోట్ల డాలర్ల సమీకరణ బాటలో స్నాప్డీల్
న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్డీల్ తాజాగా ఆలీబాబా, సాఫ్ట్బ్యాంక్, ఫాక్స్కాన్ తదితర సంస్థల నుంచి 50 కోట్ల డాలర్లు (రూ. 3,000 కోట్లకుపైగా) సమీకరించనుంది. ఇందుకోసం వాటితో చర్చలు జరుగుతున్నాయని, మరికొద్ది వారాల్లో ఫండింగ్ వివరాలు వెల్లడి కావొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తాజా డీల్తో స్నాప్డీల్ విలువ 4-5 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని తెలిపాయి. దీనిపై స్నాప్డీల్, సాఫ్ట్బ్యాంక్ వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి. ఆలీబాబాతో ఇటీవలే నిధుల కోసం చర్చలు జరిపినప్పటికీ స్నాప్డీల్ భారీ వేల్యుయేషన్లు కోరడంతో అవి విఫలమయ్యాయి. వివిధ సంస్థల నుంచి స్నాప్డీల్ ఇప్పటికే 1 బిలియన్ డాలర్ల పైగా నిధులు సమీకరించింది. -
మొబైల్ తయారీ హబ్గా ఏపీ!
శ్రీసిటీలో ప్లాంటు; ఉత్పత్తి ఆరంభించిన ఫాక్స్కాన్ ♦ {పస్తుతానికి 55వేల చదరపుటడుగుల్లో ప్లాంటు ♦ మున్ముందు మరింత భూమి తీసుకుని అక్కడే విస్తరణ ♦ భవిష్యత్తులో యాపిల్ సహా పలు ఫోన్ల తయారీ ♦ గుజరాత్లో మరో ప్లాంటు! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇండియాలో మొబైల్ ఫోన్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ను ప్రధానమైన హబ్గా తీర్చిదిద్దాలని ప్రఖ్యాత సెల్ఫోన్ తయారీ సంస్థ ఫాక్స్కాన్ యోచిస్తోంది. దాదాపు రెండున్నర నెలల కిందట ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో ప్లాంటు ఆరంభించడానికి సన్నాహాలు మొదలుపెట్టిన ఈ సంస్థ... ఈ రెండున్నర నెలల వ్యవధిలో ప్లాంటులో యంత్రాలను అమర్చటమే కాక ఉత్పత్తిని కూడా మొదలు పెట్టేసింది. తొలివిడతగా షావొమీ (కంపెనీ ఇలాగే పిలవాలని చెబుతోంది), ఇన్ఫోకస్ ఫోన్లను తయారు చేస్తున్నట్లు, తొలి విడత కన్సైన్మెంటును కూడా రెండ్రోజుల కిందట బయటకు పంపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రఖ్యాత యాపిల్ ఫోన్లతో పాటు సోనీ తదితర సంస్థల మొబైల్స్నుకూడా ఫాక్స్కాన్ కాంట్రాక్టు మేరకు తయారు చేస్తోంది. దీంతో ఇండియాలో అమ్ముడయ్యే ఈ సంస్థల ఫోన్లన్నిటినీ ఇకపై శ్రీసిటీలోనే తయారు చేసే అవకాశం ఉందని ఫాక్స్కాన్ వర్గాలు తెలిపాయి. రెండున్నర నెలల్లోనే ఉత్పత్తి... చైనాలో లేబర్ ధర విపరీతంగా పెరిగిపోవటం, తయారీకయ్యే ఖర్చు కూడా ఇపుడు పెరగటంతో చైనాకు వెలుపల భారీ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని గత కొన్ని నెలలుగా ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. మొదట గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని భావించి... అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో శ్రీసిటీతో పాటు విశాఖపట్నంలోని కొన్ని స్థలాలను చూపించింది. అయితే కొన్నేళ్ల కిందట ఆరంభమైన శ్రీసిటీలో మౌలిక సదుపాయాలన్నీ ఉండటంతో పాటు అక్కడి యాజమాన్యం రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీ (ఆర్బీఎఫ్) పేరిట షెడ్లు నిర్మించి అన్ని సౌకర్యాలూ కల్పిస్తోంది. వీటిలో కంపెనీలు నేరుగా తమ యంత్రాలను తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసకుని, ఉత్పత్తిని ప్రారంభించే అవకాశముంటుంది. శ్రీసిటీ చెన్నైకి దగ్గరగా ఉండటం, ఇక్కడికి ఇప్పటికే పలురకాల కంపెనీలు వచ్చి కార్యకలాపాలు సాగిస్తుండటం, కృష్ణపట్నం పోర్టు కూడా సమీపంలోనే ఉండటంతో ఫాక్స్కాన్ కంపెనీ దీనికే మొగ్గు చూపించింది. కృష్ణపట్నం పోర్టు ద్వారా భారీ యంత్రాలను తీసుకొచ్చి, 55వేల చదరపుటగుడుల మేర విస్తీర్ణం ఉన్న 3 ఆర్బీఎఫ్ షెడ్లను తీసుకుని ఉత్పత్తిని మొదలుపెట్టేసింది. అనుమతులు సైతం ఆగమేఘాలపై రావటంతో.. రెండున్నర నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభమయింది. త్వరలో మరింత విస్తరణ... ప్రస్తుతం 55వేల చదరపుటడుగుల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఫాక్స్కాన్ సంస్థ... మున్ముందు శ్రీసిటీలోనే భారీ ఎత్తున విస్తరించేలా ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిసింది. అక్కడే కొంత భూమి తీసుకుని శాశ్వత నిర్మాణాలు చేపట్టి భారీగా మొబైల్స్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే పూర్తిగా ఒక్క ప్లాంటుమీదే ఆధారపడినట్లు కాకుండా గుజరాత్లో మరో ప్లాంటును కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు చెప్పాయి. ఏర్పాటు నుంచి గోప్యమే!! ఆంధ్రప్రదేశ్లోకి ఏదైనా ప్లాంటు వస్తుందంటే... ఒప్పందం నుంచీ ప్రభుత్వం భారీ ప్రచారం చేసుకుంటూనే వస్తోంది. ఫాక్స్కాన్ విషయంలో కూడా ఆ సంస్థ రాష్ట్రంలో ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రకటించినా... ప్లాంటు ఏర్పాటై, ఉత్పత్తి కూడా ప్రారంభించినా ఆ విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. అలాగే ఏ కంపెనీ టెంకాయ కొట్టినా, భూమి పూజ చేసినా అదంతా మీడియాకు తప్పనిసరిగా వెల్లడించే శ్రీసిటీ యాజమాన్యం కూడా ఈ విషయంలో గోప్యత పాటించడం గమనార్హం. అయితే ఫాక్స్కాన్ ప్రతినిధులు ప్లాంటు ఏర్పాటు, ఉత్పత్తికి సంబంధించిన ఏ సమాచారాన్నీ తెలియజేయవద్దని పట్టుబట్టడమేనని సమాచారం. నిజానికి ప్లాంటు ఫాక్స్కాన్దే అయినా వేరే పేరిట ఏర్పాటు చేసినట్లు తెలియవచ్చింది. -
తెలంగాణకు ఫాక్స్కాన్ టెక్నాలజీస్!
- తైవాన్ పర్యటనలో ‘ఫాక్స్కాన్’ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ - హైదరాబాద్లో యూనిట్లు నెలకొల్పాలని విజ్ఞప్తి - త్వరలో తమ ప్రతినిధుల బృందాన్ని పంపేందుకు సంస్థ సీఈవో అంగీకారం సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత మొబైల్ కంపెనీలకు విడిభాగాలను సరఫరా చేసే ఫాక్స్ టెక్నాలజీస్.. తమ యూనిట్లను తెలంగాణలో నెలకొల్పేందుకు సుముఖత వ్యక్తం చేసింది. తైవాన్ పర్యటనలో ఉన్న ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ఫాక్స్కాన్ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, పారిశ్రామిక విధానాలను మంత్రి కేటీఆర్ వారికి వివరించారు. ఫాక్స్కాన్ టెక్నాలజీస్కు చెందిన యఫ్హెచ్ మొబైల్స్ కంపెనీ సీఈవో డబ్ల్యుయచ్ తాంగ్ స్పందిస్తూ.. హైదరాబాద్లో తమ యూనిట్లను నెలకొల్పేందుకు సుముఖత వ్యక్తం చేశారు. తమ ప్రతినిధుల బృందాన్ని త్వరలోనే హైదరాబాద్ పంపనున్నట్లు మంత్రికి హామీ ఇచ్చారు. అనంతరం టెక్ గ్రూప్ చైర్మన్ ధియోడర్ హువాంగ్తో సమావేశమైన మంత్రి కేటీఆర్.. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. అలాగే.. ైతె వాన్ ఆర్థిక వ్యవహారాల ఉపమంత్రి షి.చావోతో కూడా మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. తైవాన్ నుంచి పెట్టుబడిదారుల బృందాన్ని తెలంగాణకు పంపాలని కోరారు. శనివారంతో తైవాన్ పర్యటనను ముగించుకున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు.