G20
-
G20 సదస్సులో బిజీ బిజీగా PM మోడీ
-
రానున్న దశాబ్దంలో భారత్దే హవా!
న్యూఢిల్లీ: భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో వచ్చే దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 20 శాతం వాటను కలిగి ఉంటుందని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఏఐఎంఏ సదస్సులో ఆయన మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని, ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని పేర్కొన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో భారత్ ఎకానమీ జపాన్, జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న భరోసాను ఇచ్చారు. ప్రపంచ ఎకానమీకి భారత్ ఛోదక శక్తిగా ఆవిర్భవిస్తోందని పేర్కొన్నారు. ‘‘ఈ రోజు మనం చూస్తున్నది ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక తరానికి ఒకసారి జరిగే మార్పు. కొన్ని సంవత్సరాల క్రితం భారత్ బలహీనమైన ఐదు దేశాల్లో ఉంది. బలహీనమైన ఐదు నుంచి ఒక దశాబ్దంలో మొదటి ఐదు స్థానాలకు చేరుకున్నాము’’అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామీణుల జీవన ప్రమాణాలు పెరగాలి.. మూడు దశాబ్దాల్లో 9–10 శాతం వృద్ధి సాధించి, 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాలను మార్చాలని, ఆరోగ్య రంగం మెరుగుపడాలని, పోషకాహార ప్రమాణాలు పెరగాలని అమితాబ్ కాంత్ ఉద్ఘాటించారు. భవిష్యత్ వృద్ధిని సాధించడానికి భారత్లో రాష్ట్రాల పాత్ర కీలకమని అన్నారు. ‘‘అంటే దేశ జనాభాలో దాదాపు 50 శాతం ఉన్న బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు పరివర్తన చెందాల్సిన అవసరం ఉంది’’ అని ఈ వివరించారు. ‘‘మనం వాటిని మార్చడం చాలా క్లిష్టమైనది. ఎన్ని అవరోధాలు ఎదురయినప్పటికీ, ఆయా రాష్ట్రాలు మానవ అభివృద్ధి సూచికలో మెరుగుదలకు కీలకమైన ఛోదక శక్తిగా మారడం చాలా ముఖ్యం’’ అని కాంత్ అన్నారు. భారతదేశ జనాభాలో 50 శాతం మంది వృద్ధిని సృష్టిలో కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. అయితే దిగువ 50 శాతం మంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాథమిక జీవన ప్రమాణాలను సాధించడానికి వ్యవసాయ కూలీ లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడుతున్నారని ఆయన తెలిపారు.ఈ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం చాలా ముఖ్యమని ఆయన ఉద్ఘాటించారు. అభివృద్ధి చెందిన దేశమంటే... ప్రస్తుతం భారత్ తలసరి ఆదాయం దాదాపు 2,300 డాలర్లు. 2031 ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. ఇదే జరిగితే దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. ఆ స్థాయి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. -
ఏఐ విప్లవంలో పాల్గొనడం కాదు.. నేతృత్వం వహించాలి
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) విప్లవంలో భారత్ కేవలం పాల్గొనడం మాత్రమే కాదని, దీనికి నేతృత్వం వహించాలని దేశ జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో దేశాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకురావడానికి తన సాంకేతిక శక్తి సామర్థ్యాలను సమీకరించాలని ఇక్కడ జరిగిన గ్లోబల్ ఇండియాఏఐ సదస్సులో ఆయన అన్నారు. ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ– నాస్కామ్ను ఉటంకిస్తూ, 70 శాతం భారతీయ స్టార్టప్లు తమ వృద్ధిని పెంచుకోవడానికి ఏఐకి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కాంత్ ప్రస్తావిస్తూ, తద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ప్రాజెక్ట్లలో 19 శాతం వాటాతో అత్యధిక సంఖ్యలో గిట్హబ్ఏఐ ప్రాజెక్ట్లను కలిగి ఉన్న రెండవ దేశంగా భారత్ ఉండడం గర్వకారణమని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏఐ అభివృద్ధికి సంబంధించి భారత్ శక్తిసామర్థ్యాలను ఈ విషయం స్పష్టంచేస్తోందన్నారు. ఈ స్ఫూర్తితో ఈ రంగంలో భారత్ మరింత పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ విశ్వసనీయంగా, నైతికంగా ఉండే భవిష్యత్తును రూపొందించడానికి చురుకైన విధానం అవసరమని కూడా కాంత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
2024 వృద్ధి 6.8 శాతం: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ 2024 క్యాలెండర్ ఇయర్ వృద్ధి అంచనాను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. ఇంతక్రితం 6.1 శాతం అంచనాలను 6.8 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. ‘‘అంచనాల కంటే బలమైన’’ ఆర్థిక గణాంకాలు తమ తాజా అంచనా పెంపునకు కారణంగా పేర్కొంది. జీ20 దేశాలలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని వివరించింది. 2025లో దేశ వృద్ధి రేటును 6.4 శాతంగా రేటింగ్ దిగ్గజం పేర్కొంది. 2023లో దేశ ఎకానమీ ఊహించినదానికన్నా అధికంగా మంచి పురోగతిని సాధించినట్లు తెలిపింది. ప్రభుత్వ మూలధన వ్యయాలు, పటిష్ట తయారీ కార్యకలాపాలు 2023లో భారత్ బలమైన వృద్ధి ఫలితాలకు దోహదపడ్డాయని మూడీస్ తన నివేదికలో పేర్కొంది. -
Ashwini Vaishnav: వచ్చే పదేళ్లలో 6 నుంచి 8 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ వచ్చే 10 సంవత్సరాలలో 6 నుంచి 8 శాతం స్థిరమైన వృద్ధి రేటును కొనసాగిస్తుందన్న విశ్వాసాన్ని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యక్తం చేశారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చడానికి భారత్ తగిన స్థానంలో ఉందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పెట్టుబడిదారులకు విజ్ఞప్తి చేశారు. రైసినా డైలాగ్ 2024లో ఆయన ఈ మేరకు మాట్లాడుతూ, 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి వచ్చే ఐదేళ్లలో కేంద్రం మరింత పటిష్ట పునాదులు వేస్తుందని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా భారత్ ఆవిర్భవించాలి: జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పెట్టుబడులకు సంబంధించి కీలక మూలధనాన్ని ఆకర్షించడానికి 2047 నాటికి భారతదేశం గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా మారాల్సిన అవసరం ఉందని జీ 20 షెర్పా అమితాబ్ కాంత్ ఇదే కార్యక్రమంలో అన్నారు. ‘రైసినా డైలాగ్ 2024’లో కాంత్ ప్రసంగిస్తూ, నేటి ప్రధాన సవాలు వాతావరణ మార్పు అని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, ప్రపంచ బ్యాంక్ ‘వాతావరణ బ్యాంకుగా’ మారాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో, అన్ని పెట్టుబడులు పునరుత్పాదక రంగంలోకి ప్రవహిస్తాయని అంచనావేశారు. పర్యావరణానికి పెద్దపీట వేసిన దేశాతే మూలధనాన్ని ఆకర్షించగలవని ఆయన అన్నారు. -
ఉజ్వల భవిత వైపు దిశానిర్దేశం
భారత్ జీ20 నాయకత్వ బాధ్యతలు స్వీకరించే నాటికి ప్రపంచం అనేక సమస్యలనెదుర్కొంటోంది. ఈ పరిస్థితి నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించి, ప్రత్యామ్నాయం చూపాలని భారత్ నేతృత్వంలోని జీ20 నిశ్చయించుకుంది. ఇందులో భాగంగా జీడీపీ కేంద్రక ప్రగతి నుంచి మానవ–కేంద్రక పురోగమనం వైపు మళ్లాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. మన మధ్య విభజన తెస్తున్న కారణాన్ని కాకుండా మనల్ని ఏది ఏకం చేయగలదో దాని గురించి గుర్తుచేయడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంతో అంతిమంగా అంతర్జాతీయ చర్చలు పరిణామశీలమై– కొందరి స్వార్థానికి కాకుండా అందరి ఆకాంక్షలు, ప్రయోజనాలకు పెద్దపీట వేయక తప్పలేదు. భారతదేశం జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టి నేటితో 365 రోజులు పూర్తయ్యాయి. ‘వసుధైవ కుటుంబకం’...అంటే– ‘ఒకే భూమి–ఒకే కుటుంబం–ఒకే భవి ష్యత్తు’ స్ఫూర్తిని చాటేలా పునరంకితమవుతూ... పునరుజ్జీవనానికి బీజం వేసిన క్షణమది.మనం నిరుడు ఈ బాధ్యత స్వీకరించే నాటికి యావత్ ప్రపంచం బహుముఖ సవాళ్లతో సతమతం అవుతోంది. బహుళ దేశాలు పాల్గొనే విధానం (మల్టీ లేటరలిజం) క్షీణించే తరుణంలో కోవిడ్–19 మహ మ్మారి దుష్ప్రభావం నుంచి కోలుకోవడం, నానాటికీ పెరుగుతున్న వాతావరణ మార్పు సమస్యలూ, ఆర్థిక అస్థిరత, వర్ధమాన దేశాల్లో రుణభారం తదితరాలన్నీ చోటు చేసుకున్నాయి. అలాగే ఘర్షణలూ, వివాదాలూ, స్పర్థాత్మకతల మధ్య ప్రగతి సంబంధిత సహకార భావన దెబ్బతిని, పురోగమనం కుంటుపడింది. ఈ నేపథ్యంలో జీ20 నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన భారత దేశం ఆనాటి దుఃస్థితి నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించి, ప్రత్యా మ్నాయం చూపాలని నిశ్చయించుకుంది. ఇందులో భాగంగా జీడీపీ కేంద్రక ప్రగతి నుంచి మానవ–కేంద్రక పురోగమనం వైపు మళ్లాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. మన మధ్య విభజన తెస్తున్న కారణాన్ని కాకుండా మనల్ని ఏది ఏకం చేయగలదో దాని గురించి గుర్తుచేయడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంతో అంతిమంగా అంతర్జాతీయ చర్చలు పరిణామశీలమై– కొందరి స్వార్థానికి కాకుండా అందరి ఆకాంక్షలు, ప్రయోజనాలకు పెద్దపీట వేయక తప్పలేదు. అయితే, ఇందుకోసం ముఖ్యంగా చేయాల్సిందల్లా బహుళ దేశాలు పాల్గొనే విధాన మూలాల నుంచి సంస్కరణలు తేవడం. ‘సార్వజనీనత, ఆకాంక్షాత్మకత, కార్యాచరణాత్మకత, నిర్ణయాత్మ కత’ అనే నాలుగు పదాలు జీ20 అధ్యక్ష బాధ్యతల నిర్వహణలో మన విధానమేమిటో సుస్పష్టంగా నిర్వచించాయి. అటుపైన జీ20 సభ్య దేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించిన ‘న్యూఢిల్లీ దేశాధినేతల తీర్మానం’ (ఎన్డీఎల్డీ) ఈ సూత్రాల అమలులో మన నిబద్ధతను ప్రస్ఫుటం చేసింది. సార్వజనీనత అన్నది మన అధ్యక్ష పదవికి ఆత్మ వంటిది. దీనికి అనుగుణంగా ఆఫ్రికా సమాఖ్య (ఏయూ)కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించడం ద్వారా 55 ఆఫ్రికా దేశాలను ఈ వేదిక మీదకు చేర్చాం. దీంతో ప్రపంచ జనాభాలో 80 శాతానికి ప్రాతినిధ్యం వహించే విధంగా జీ20 విస్తరించింది. తద్వారా అంతర్జాతీయ సవాళ్లు –అవకాశాలపై మరింత సమగ్ర చర్చలను ఈ క్రియాశీల వైఖరి ప్రోత్సహించింది. ఇక ‘దక్షిణార్ధ గోళ దేశాల గళం’ పేరిట భారతదేశం తొలిసారి రెండు దఫాలుగా నిర్వహించిన శిఖరాగ్ర సదస్సు మల్టీలేటరలిజం నవోదయానికి శుభారంభం పలికింది. ఆ విధంగా దక్షిణార్ధ గోళ దేశాల సమస్యలను భారతదేశం అంతర్జాతీయ చర్చల ప్రధాన స్రవంతిలోకి తెచ్చింది. సార్వజనీనత అన్నది భారత దేశీయ విధాన ఉత్తేజాన్ని జీ20కి వ్యాపింపజేసింది. ఆ మేరకు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యానికి తగినట్లుగా జీ20కి భారత నాయకత్వం ప్రజా ధ్యక్షతగా రూపొందింది. కీలకమైన 2030 ఎజెండా మధ్యలో జీ20 కార్యాచరణ ప్రణాళికను సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ)ను వేగవంతం చేయడంతోపాటు ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం, పర్యావరణ సమ తౌల్యం, పరస్పర అనుసంధానిత సమస్యల పరిష్కారం కోసం విస్తృత కార్యాచరణ–ఆధారిత విధానాన్ని భారత్ రూపొందించింది. ఈ ప్రగతి ప్రణాళిక పురోగమనానికి జనహిత మౌలిక సదుపాయాలు (డీపీఐ) అత్యంత కీలకం. ఆ మేరకు ‘ఆధార్, యూపీఐ, డిజీలాకర్’ వంటి డిజిటల్ ఆవిష్కరణల విప్లవాత్మక ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూసిన భారత్ తనవంతుగా నిర్ణయాత్మక సిఫారసులు చేసింది. జీ20 ద్వారా మనం జనహిత మౌలిక సదుపాయాల భాండాగారం ఏర్పాటును విజయవంతంగా పూర్తి చేశాం. దీన్ని ప్రపంచ సాంకేతిక సహ కారంలో గణనీయ పురోగమనంగా పేర్కొనవచ్చు. ఈ భాండాగారంలో 16 దేశాల నుంచి 50కి పైగా దేశాల ‘డీపీఐ’లున్నాయి. మన భూగోళం కోసం తక్షణ, శాశ్వత, సమాన మార్పు సృష్టి లక్ష్యంగా ప్రతిష్ఠాత్మక, సమగ్రమైన లక్ష్యాలను అనుసరిస్తున్నాం. భూగోళ పరిరక్షణ, పేదరిక నిర్మూలన నడుమ మన ఎంపి కకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడం ఎలాగో ‘ఎన్డీఎల్డీ’ నిర్దేశిత ‘హరిత ప్రగతి ఒప్పందం’ వివరిస్తుంది. ఇక 2030 నాటికి ప్రపంచ పునరు త్పాదక ఇంధన సామర్థ్యాన్ని ప్రతిష్ఠాత్మక రీతిలో మూడు రెట్లు పెంచాలని కూడా జీ20 తీర్మానం పిలుపునిచ్చింది. మరోవైపు ప్రపంచ జీవ ఇంధన కూటమి ఏర్పాటూ, హరిత ఉదజని కోసం సమష్టి కృషీ... పరిశుభ్ర, హరిత ప్రపంచ నిర్మాణంపై జీ20 ఆదర్శాలు కాదనలేని నిజాలు. భారత్ అనాదిగా అనుసరిస్తున్న విలువలు ఇవే. ఉత్తరార్ధ గోళ దేశాల నుంచి గణనీయ ఆర్థిక సహాయంతోపాటు సాంకేతిక చేయూతను కోరడం ద్వారా వాతావరణ న్యాయం–సమా నత్వం విషయంలో మన నిబద్ధతను కూడా ‘ఎన్డీఎల్డీ’ నొక్కి చెప్పింది. కాగా, అభివృద్ధికి ఆర్థిక చేయూత పరిమాణంలో తొలిసారిగా ఆశించిన మేర రెట్టింపు పెరుగుదల నమోదైంది. ఆ మేరకు ఈ సాయం బిలియన్ల డాలర్ల స్థాయి నుంచి ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో వర్ధమాన దేశాలు 2030 నాటికి తమ దేశీయ ప్రగతి లక్ష్యాల (ఎన్డీసీ)ను సాధించడానికి 5.9 ట్రిలియన్ డాలర్లు అవసరమని జీ20 అంగీకరించింది. న్యూఢిల్లీ దేశాధినేతల తీర్మానం లింగ సమానత్వానికీ పెద్దపీట వేసింది. ఆ మేరకు ఇది వచ్చే ఏడాదికల్లా మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యాచరణ బృందం ఏర్పాటు అవసరాన్ని నొక్కిచెప్పింది. ‘భారత మహిళా రిజర్వేషన్ బిల్లు–2023’ ద్వారా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటా యించడం ద్వారా మహిళా చోదక ప్రగతిపై భారత్ నిబద్ధతను జీ20 ప్రతిబింబించింది. విధానపరమైన సమన్వయం, విశ్వసనీయ వాణిజ్యం, ప్రతిష్ఠాత్మక వాతావరణ కార్యాచరణపై దృష్టి సారిస్తూ ఈ కీలక ప్రాధాన్యాలన్నిటా పరస్పర సహకార స్ఫూర్తిని ‘ఎన్డీఎల్డీ’ చాటిచెప్పింది. మన అధ్యక్షత సమయంలో జీ20 ద్వారా 87 నిర్ణ యాలు తీసుకోవడంతోపాటు 118 పత్రాలకు ఆమోదం సాధించడం గర్వించదగిన అంశం. మన జీ20 అధ్యక్షత సమయంలో భౌగోళిక–రాజకీయాంశాలు, ఆర్థికవృద్ధి–ప్రగతిపై వాటి ప్రభావం వగైరాల పైనా చర్చలకు భారత్ నాయకత్వం వహించింది. ఉగ్రవాదం, విచక్షణ రహితంగా పౌరుల ప్రాణాలు తీయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని తుదముట్టించడమనే విధానంతోనే ఈ బెడదను నిర్మూలించడం సాధ్యమని స్పష్టం చేసింది. మనం శత్రుత్వం స్థానంలో మానవత్వాన్ని స్వీకరించాలి. ఆ మేరకు ఇది యుద్ధ యుగం కాదనే వాస్తవాన్ని పునరుద్ఘాటించాలి. జీ20 అధ్యక్ష బాధ్యతల సమయంలో భారత్ అసాధారణ విజయాలు సాధించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది: ఇది మల్టీలేటరిజాన్ని పునరుజ్జీవింపజేసింది. దక్షిణార్ధ గోళ దేశాల గళాన్ని మరింతగా వినిపించింది. ప్రగతి సాధనకు ప్రాముఖ్యమిచ్చింది. అన్ని రంగాల్లోనూ మహిళా సాధికారత కోసం పోరాడింది.ఈ నేపథ్యంలో భూగోళం పచ్చగా పరిఢవిల్లడంతోపాటు ప్రపంచ ప్రజానీకానికి శాంతి–శ్రేయస్సు దిశగా ఇప్పటివరకూ మనం సమష్టిగా చేసిన కృషి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని విశ్వసిస్తూ జీ20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ దేశానికి అప్పగిస్తున్నాం. నరేంద్ర మోదీ భారత ప్రధాని -
ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు జీ20 వర్చువల్ సమావేశం
ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు జీ-20 వర్చువల్ సమావేశం జరగనుంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ భేటీకి దూరంగా ఉండనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకానున్నారు. ఢిల్లీ డిక్లరేషన్ అమలు, ఇజ్రాయెల్- హమాస్ వివాదం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఆర్థిక పురోగతి సహా ప్రపంచ నూతన సవాళ్లపై చర్చించనున్నారు. సమ్మిట్లో సభ్య దేశాల నాయకుల నుంచి అద్భుతమైన భాగస్వామ్యం ఉంటుందని భావిస్తున్నట్లు జీ20 షెర్పా అమితాబ్ కాంత్ చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడం లేదు. ఆయనకు బదులుగా ప్రీమియర్ లీ కియాంగ్ చైనాకు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు, ప్రపంచ ఆర్థిక పునరుజ్జీవనానికి సానుకూలంగా దోహదపడేందుకు ఈ సదస్సు సహకారాన్ని పెంపొందిస్తుందని చైనా ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. వర్చువల్ సమ్మిట్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొంటారని క్రెమ్లిన్ ప్రకటించింది. సెప్టెంబరులో జరిగిన న్యూ ఢిల్లీ G20 సమ్మిట్లో ఆయన గౌర్హజరైన విషయం తెలిసిందే. అంతకుముందు ఏడాది జరిగిన జీ20 బాలి సదస్సుకు కూడా పుతిన్ దూరమయ్యారు. ప్రస్తుతం పుతిన్ హాజరువుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ జరిగే అవకాశం ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: బందీల విడుదలకు హమాస్తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం -
చైనాను అందుకోవాలంటే.. 10% వృద్ధి అవసరం
న్యూఢిల్లీ: చైనా ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రస్తుతం భారతదేశం కంటే ఐదు రెట్లు ఉందని, చైనా స్థాయి ని మన దేశం చేరుకోవాలంటే 10 శాతం వృద్ధి సాధన అవసరమని భారత్ జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్న ఆయన, రాబోయే మూడు దశా బ్దాల్లో 8–9 శాతం వృద్ధిరేటు సాధన దేశానికి సవాలుగా మారుతుందని పేర్కొన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోర మ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) ఇక్కడ ఏర్పా టు చేసిన ఒక కార్యక్రమంలో కాంత్ మాట్లాడుతూ, ప్రైవేట్ రంగం మద్దతు లేకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అధిక రేటు వృద్ధి సాధన అసాధ్యమని అన్నారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తు తం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకాన మీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. 3.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో భారత్ ఐదవ స్థానంలో నిలుస్తోంది. 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. 2030 నాటికి జపా న్ ఎకానమీని సైతం భారత్ అధిగమించగలదని ఎస్అండ్పీ గ్లోబల్ వంటి సంస్థలు కొన్ని విశ్లేషిస్తున్నాయి. విమానయానంలో యూరప్ను మించి... మౌలిక రంగానికి ప్రభుత్వం పటిష్ట మద్దతునిస్తోందన్నారు. యూరప్లోని విమానాశ్రయాల కంటే భారతీయ విమానాశ్రయాల నాణ్యత మెరుగ్గా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానయాన సంస్థల కంటే మన దేశీయ విమానయాన సంస్థలు కూడా మెరుగ్గా ఉన్నాయని ఆయన అన్నారు. ఏఐ కీలక పాత్ర భారతదేశ వృద్ధి పటిష్టత చెక్కుచెదర కుండా ఉంటుందని భరోసా ఇచి్చన అమితాబ్ కాంత్, స్థిరమైన వృద్ధిని తీసుకురావడానికి ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించకుండా, సాంకేతిక రంగలో పురోగతి అసాధ్యమని సైతం ఈ సందర్బంగా పేర్కొన్నారు. -
కల్లోలాలు మంచివి కావు
న్యూఢిల్లీ: ఘర్షణలు, కల్లోలాలు ఏ పక్షానికీ మంచి చేయబోవని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలకు విచి్ఛన్న ప్రపంచం పరిష్కారాలు చూపజాలదన్నారు. ఇది శాంతి, సౌభ్రాతృత్వాలు నెలకొనాల్సిన సమయమని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు నానాటికీ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శుక్రవారం ఇక్కడ మొదలైన జీ20 పార్లమెంటరీ స్పీకర్ల 9వ సదస్సు ప్రారంభ సెషన్ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ప్రపంచంలో పలు చోట్ల ప్రస్తుతం ఏం జరుగుతోందో మనందరికీ తెలుసు. కలసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయమిది’’ అని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ పోరుకు తక్షణం తెరపడాల్సిన అవసరం చాలా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పరస్పర విశ్వాసంతో మానవ విలువలకు పెద్ద పీట వేయడమే ఇందుకు మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదమే మార్గం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాద భూతంపై అంతర్జాతీయ సమాజం ఉక్కుపాదం మోపడమే ఏకైక మార్గమని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘భారత్ దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. మా దేశంలో వేలాదిగా అమాయకులను బలి తీసుకుంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే మానవత్వానికి మాయని మచ్చ‘ అని పునరుద్ఘాటించారు. ఇంత జరిగినా ఉగ్రవాదాన్ని నిర్వచించే అంశం మీద కూడా ఇప్పటికీ అంతర్జాతీయ సమాజం ఏకాభిప్రాయానికి రాలేకపోవడం శోచనీయమన్నారు. మహిళా భాగస్వామ్యానికి ప్రోత్సాహం భారత్లో ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తున్నట్టు మోదీ తెలిపారు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో సగం మేరకు వాళ్లే ఉన్నట్టు పార్లమెంటుల స్పీకర్లకు వివరించారు. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ ఇటీవలే పార్లమెంటులో చట్టం కూడా చేసినట్టు చెప్పారు. ‘నేడు భారత్ ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యంతో కళకళలాడుతోంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో మహిళల చురుకైన పాత్ర దేశ ప్రగతికి చాలా కీలకం‘ అని అన్నారు. భారత్లో 28 భాషల్లో ఏకంగా 900కు పైగా టీవీ చానళ్లు, దాదాపు 200 భాషల్లో 33 వేలకు పైగా వార్తా పత్రికలు ఉన్నాయని వారికి వివరించారు. ప్రపంచమంతటా దేశాల నాయకత్వ స్థానంలో మహిళలు ఎక్కువగా ఉంటే బహుశా ఇన్ని యుద్ధాలు జరిగేవి కాదని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ప్రెసిడెంట్ దుతర్తే పచెకో అభిప్రాయపడ్డారు. -
క్రిప్టో కరెన్సీపై జీ20 రోడ్మ్యాప్
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీకి సంబంధించి సమస్యలు, సవాళ్లను పరిష్కరించేందుకు ఒక రోడ్మ్యాప్ను వేగంగా, సమన్వయంతో అమలు చేయాలని జీ20 దేశాల ఆర్థికమంత్రులు పిలుపునిచ్చారు. క్రిప్టో ఆస్తులపై జీ20 రోడ్మ్యాప్కు సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (ఎఫ్ఎస్బీ) సంయుక్తంగా రూపొందించిన సింథసిస్ పేపర్ను జీ20 ఆర్థికమంత్రులు ఆమోదించారు. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జరుగుతున్న జీ20 దేశాల ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్ఎంసీబీజీ) సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు ఆమోదించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం గురించి ఇక్కడ సమావేశం ఎటువంటి ప్రస్తావనా చేయకపోవడం గమనార్హం. చమురుపైన పశి్చమాసియా ఉద్రిక్తతల ప్రభావం... కాగా, ఈ సమావేశాల సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, ‘మధ్యప్రాచ్యంలో ఇటీవలి సంక్షోభం వల్ల ఇంధనం (ధరల పెరుగుదల) గురించి ఆందోళనలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఇవి చాలా దేశాలు కలిగి ఉన్న ఆందోళనలు. భారత్ తరహాలోనే ఇతర దేశాలు కూడా ఈ అంశంపై ఆందోళన చెందుతున్నాయి. ఇంధన ఆందోళనలు ఆహార భద్రత అంశాలను, సరఫరాల చైన్ను ప్రభావితం చేస్తాయి’’ అని అన్నారు. జీ20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన–అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అంతర్ ప్రభుత్వ ఫోరమ్. ఇందులో అర్జెంటీనా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేíÙయా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్నాయి. ఈ దేశాలు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 80 శాతం వాటాను, వాణిజ్యంలో 75 శాతం వాటాను, ప్రపంచ జనాభాలో దాదాపు 70 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జీ20 ఇండియా ప్రెసిడెన్సీలో జరిగిన నాలుగవ, చివరి జీ20 ఆర్థిక మంత్రులు– సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కూడా చిత్రంలో ఉన్నారు. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ ఆమె వివిధ దేశాల ప్రతినిధులతో ద్వైమాసిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. -
ఉగ్రవాదమే అసలైన సమస్య.. పీ20 మీటింగ్లో ప్రధాని మోదీ
ఢిల్లీ: 2001 నాటి పార్లమెంట్పై ఉగ్రదాడిని గుర్తు చేశారు ప్రధాని మోదీ. ప్రపంచం మొత్తం ఉగ్రవాదంతో బాధపడుతోందని చెప్పారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఉగ్రవాద నిర్వచనంపై ఏకాభిప్రాయం సాధించకపోవడం బాధాకరమని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మనం ఎలా కలిసి పని చేయాలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పార్లమెంటులు ఆలోచించాలని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో 9వ G20 పార్లమెంటరీ స్పీకర్ల సమ్మిట్ (P20)ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్ సరిహద్దులో ఉగ్రవాదంతో ఎన్నో ఏళ్లుగా పోరాడుతోందని చెప్పిన ప్రధాని మోదీ.. ఉగ్రవాదంతో ప్రపంచం మొత్తం అతిపెద్ద సవాళును ఎదుర్కొంటోందని అన్నారు. మానవత్వానికి ఇది వ్యతిరేకమని చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై స్పందించిన మోదీ.. ఘర్షణలు, నిర్బంధాలు సరైన ప్రపంచాన్ని సృష్టించబోవని తెలిపారు. పార్లమెంటరీ విధానాల పట్ల ప్రధాని మోదీ స్పందించారు. ప్రపంచం పార్లమెంటరీ విధానాల సంగమమని అన్నారు. ఈ విధానాలు మరింత బలోపేతమవుతున్నాయని చెప్పారు. జీ20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ఏడాదంతా మనం సంబరాలు చేసుకున్నామని గుర్తుచేశారు. భారత్ 17 సార్వత్రిక ఎన్నికలను నిర్వహించిందని, 300 సార్లు రాష్ట్ర ఎన్నికలు జరిపినట్లు స్పష్టం చేశారు. పాన్ ఆఫ్రికన్ పార్లమెంట్ కూడా మొదటిసారి పీ20 సమ్మిట్లో పాల్గొంది. జీ20 విభాగంలో పాన్ ఆఫ్రికన్ ఇటీవలే చేరిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన మొదటి విమానం -
అంతర్జాతీయ సవాళ్లపై సమాలోచనలు...
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొరాకో ఆర్థిక రాజధాని మారకేచ్లో ప్రపంచ ఆర్థిక విధాన నిర్ణేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలు అంతర్జాతీయ ఆర్థిక అంశాలు, సవాళ్లు, వీటిని ఎదుర్కొనడం.. ఆమె చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ మరకేచ్లోనే ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్లతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు, ఆర్థిక అనిశి్చతి, బహుళజాతి బ్యాంకుల పటిష్టత, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలు ఈ సమావేశాల చర్చల్లో ప్రధాన భాగంగా ఉన్నాయి. సమావేశాల్లో భాగంగా అమెరికా ఆర్థికమంత్రి జనెత్ ఎలన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనడానికి ఐఎంఎఫ్కు నిధుల లభ్యతపై ప్రధానంగా చర్చ జరిగింది. ఐఎంఎఫ్ రుణ విధానాలు, పటిష్టత, కోటా విధానం, పేదరిక నిర్మూలన, ఐఎంఎఫ్ పాలనా నిర్వహణ విషయంలో సంస్కరణలపై ఆర్థికమంత్రి ప్రధానంగా చర్చించినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కే జార్జివా నేతృత్వంలోని బృందంతోపాటు, ఇంటర్–అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇలాన్ గోల్డ్ఫాజ్్నతో కూడా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. జీ20 ఎజెండాను కొనసాగించేందుకు ఐఎంఎఫ్తో కలిసి పనిచేయాలన్న భారత్ ఆకాంక్షను ఆమె ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్తో జరిగిన సమావేశాల్లో వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
నిర్మలా సీతారామన్ మొరాకో పర్యటన నేటి నుంచి
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఆరు రోజుల పర్యటన నిమిత్తం మొరాకో బయలుదేరనున్నారు. ఆ దేశ ఆర్థిక రాజధాని మారకేచ్లో ఈ ఆరు రోజుల అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో ఆర్థికమంత్రి పాల్గొననున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీనితోపాటు ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్లతో భారత్ ద్వైపాక్షిక సమావేశాలు అక్టోబర్ 11–15 తేదీల మధ్య మరకేచ్లో జరగనున్నాయి. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశాల కోసం వెళుతున్న భారత ప్రతినిధి బృందానికి ఆర్థిక మంత్రి నాయకత్వం వహిస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అధికారులు ఈ ప్రతినిధి బృందంలో సభ్యులుగా ఉంటారని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఈ పర్యటనలో, సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నాల్గవ జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తారు.ఈ సమావేశంలో జీ20 దేశాలు, ఆహా్వనిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుండి దాదాపు 65 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు, ఆర్థిక అనిశి్చతి, బహుళజాతి బ్యాంకుల పటిష్టత, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలు ఈ సమావేశాల చర్చల్లో ప్రధాన భాగం కానున్నాయి. బహుళజాతి బ్యాంకుల పటిష్టతకు సంబంధించి నిపుణుల గ్రూప్ రూపొందించిన రెండవ వ్యాల్యూమ్ నివేదిక ఈ సమావేశాల్లో విడుదల కానుంది. మొదటి వ్యాల్యూమ్ నివేదిక గుజరాత్ గాం«దీనగర్లో జూలైలో జరిగిన మూడవ ఎఫ్ఎంసీబీజీ సమావేశాల్లో విడుదలైన సంగతి తెలిసిందే. -
జీ20 నిర్వహణకు రూ.4,100 కోట్లా
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర భేటీని కేంద్ర ప్రభుత్వం విజయవతంగా నిర్వహించింది. అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచదేశాలు భారత్పై ప్రశంసలు కురిపించాయి. ప్రపంచ స్థాయి నేతగా ప్రధాని మోదీ మరోమారు తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇదే సమయంలో, జీ20 భేటీ కోసం బడ్జెట్ కేటాయింపులకు ఏకంగా 300 శాతం ఎక్కువగా రూ.4,100 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయడంపై కాంగ్రెస్, టీఎంసీ వంటి ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ‘ఇంత డబ్బు ఎక్కడికి పోయింది? మోదీ వ్యక్తిగత ప్రచారం కోసమే ప్రభుత్వం ఇన్ని కోట్లను ఖర్చుచేసింది. ఈ సొమ్మును బీజేపీ ఎందుకు చెల్లించకూడదు? అని పేర్కొన్నాయి. జీ20 భేటీ నిర్వహణ ఖర్చుల వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. ఈ నెల 4న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి కొన్ని వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఉంచారు. జీ20 సదస్సు జరిగిన ప్రాంతంలో అభివృద్ధి పనులకు రూ.4,110.75 కోట్లు ఖర్చయినట్లు ఆమె పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా రూ.3,600 కోట్లను ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటీపీవో) పేరుతో ఖర్చయ్యాయి. మొత్తం ఖర్చులో ఇది 88 శాతం. ప్రగతి మైదాన్లోని ఐటీపీవో సముదాయం నిర్మాణానికైన వాస్తవ వ్యయం రూ.3,600 కోట్లు. దీనికే జీ20 శిఖరాగ్రం సందర్భంగా భారత్ మండపం అనే పేరు పెట్టారు. ఇది శాశ్వత నిర్మాణం, జీ20 బడ్జెట్తో దీనికి సంబంధం లేదు. 2017లో ఈ భవనం నిర్మాణానికి బడ్జెట్లో కేటాయింపులు రూ.2,254 కోట్లు కాగా, రహదారులు, టన్నెళ్ల నిర్మాణానికి మరో వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా.ఈ రెండింటిని కలుపుకుంటే భారత్ మండపం అభివృద్ధి వ్యయం రూ.3,200 కోట్లు దాటింది. రహదారులు, టన్నెళ్లు పోను భారత్ మండపం కాంప్లెక్స్ అభివృద్ధికి రూ.2,700 కోట్లు వెచ్చించినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) జూలై 26న ప్రకటించింది. వీటన్నిటినీ బేరీజు వేసుకుంటూ జీ20 నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రూ.4,100 కోట్లు దుబారా ఖర్చు చేసిందంటూ ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. ఈ విమర్శలపై చార్టెర్డ్ అకౌంటెంట్ గోపాల్ కేడియా ‘ఇండియా టుడే’తో మాట్లాడుతూ శాశ్వత మౌలిక వసతుల కల్పనకైన ఖర్చును జీ20 నిర్వహణ వ్యయంతో కలిపి చెప్పడం సరికాదన్నారు. ఈ నిర్మాణాలు భవిష్యత్తులో జరిగే మరెన్నో కార్యక్రమాలకు ఉపయోగించుకునేందుకు వీలుందన్నారు. జీ20 షెర్పా అమితాబ్ కాంత్ ప్రతిపక్షాల విమర్శలకు స్పందిస్తూ.. బడ్జెట్లో కేటాయించిన రూ.990 కోట్ల కంటే చాలా తక్కువగా జీ20 శిఖరాగ్రానికి ఖర్చు చేసినట్లు చెప్పారు. పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుందన్నారు. -
పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే వచ్చి భారత భూభాగంలో కలుస్తుంది
జైపూర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే వచ్చి భారత భూభాగంలో కలిసిపోతుంది.. కాకపోతే దాని కోసం కొంత కాలం వేచి ఉండాలన్నారు కేంద్ర మంత్రి మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్. పరివర్తన సంకల్ప యాత్రలో భాగంగా దౌసాలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి వీకే సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని షియా ముస్లింలు సరిహద్దు గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూస్తున్నారని చూస్తూ ఉండండి ఎదో ఒక రోజు ఆ భూభగం దానంతటదే వచ్చి భారత్లో కలిసిపోతుందన్నారు. #WATCH | Dausa, Rajasthan | "PoK will merge with India on its own, wait for some time," says Union Minister Gen VK Singh (Retd.) when asked that people in PoK have demanded that they be merged with India. (11.09.2023) pic.twitter.com/xG2qy7hXEm — ANI (@ANI) September 12, 2023 ఈ సందర్బంగా జీ20 సమావేశాలు విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీపై ప్రసశంసలు కురిపించిన ఆయన గతంలో ఇవే సమావేశాలు చాలా దేశాలు నిర్వహించినప్పటికీ భారత్ మరింత ఘనంగా నిర్వహించిందని ప్రపంచ వేదిక మీద భారత్ సత్తా ఏమిటో నిరూపించుకుందని అన్నారు. Every smallest move was so well planned in #G20BharatSummit How #Chinese Premier Li Qiang was greeted on his arrival? 1. Received by VK Singh, EX-ARMY General. 2. Considering #China 's LOVE for Northeast...Assamese song was played in background. Entire reception had NSA Ajit… pic.twitter.com/vCvE4RAse0 — BhikuMhatre (@MumbaichaDon) September 12, 2023 ఇక రాజస్థాన్ విషయానికి వస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని అందుకే బీజేపీ ప్రతిష్టాత్మక పరివర్తన యాత్రను ప్రారంభించిందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని యాత్ర సమయంలో వారే స్వయంగా వచ్చి ఆ విషయాన్ని తెలిపారన్నారు. బీజేపీ ఎక్కడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదని ప్రధాని ఛరిష్మాతోనే ఎన్నికలకు వెళ్తుందని అన్నారు. మంచితనంతో ప్రజలకు ఉపయోగపడుతూ ప్రజలు కోరుకునే అభ్యర్థులకు పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. #WATCH | G-20 in India: US President Joe Biden arrives in Delhi for the G-20 Summit He was received by MoS Civil Aviation Gen (Retd) VK Singh pic.twitter.com/U0qyG0aFcp — ANI (@ANI) September 8, 2023 ఇది కూడా చదవండి: Balayya : నేను ముందుంటా, టిడిపిని నడిపిస్తా : బాలకృష్ణ -
జీ20 కేంద్రం వద్ద వర్షం నీరు.. విపక్షాల వ్యాఖ్యలపై కేంద్రం క్లారిటీ..
ఢిల్లీ: జీ20 వేదిక భారత మండపం వద్ద వర్షపు నీరు వరదలుగా పారుతోందని విపక్షాలు చేసిన వ్యాఖ్యలను కేంద్రం తప్పుబట్టింది. ప్రతిపక్షాల వ్యాఖ్యలు అవాస్తవాలని, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని స్పష్టం చేసింది. శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి తేలికపాటి వర్షం నీరు భారత మండపం బయట నిలిచిందని పేర్కొంది. వెంటనే ఆ నీటిని మోటర్లను ఉపయోగించి బయటకు పంపినట్లు వెల్లడించింది. ‘జీ20 ఏర్పాట్ల కోసం రూ.2,700 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. ఇప్పుడు ఒక్క వర్షానికే భారత మండపం నీటితో నిండిపోయింది. పంపులతో సిబ్బంది నీటిని బయటకు పంపుతున్నారు. అభివృద్ధిలో డొల్లతనం బయటపడింది..’ అంటూ కాంగ్రెస్ ‘ఎక్స్’లో వ్యంగ్యంగా పేర్కొంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘దేశ వ్యతిరేక అంతర్జాతీయ కుట్రలో వానలు కూడా భాగమే’అంటూ ఆ పార్టీ ప్రతినిధి సుప్రియ వ్యాఖ్యానించారు. ‘జీ20 సదస్సు సాగుతుండగానే భారత్ మండపంలోని వరదనీరు చేరిందన్న విషయాన్ని మీడియా ప్రస్తావించనేలేదు. మోదీజీ, దేశాన్ని ఎలా పాలించాలో మా నుంచి మీరు నేర్చుకోలేదు. కానీ, మీడియాను ఎలా మేనేజ్ చేయాలో మిమ్మల్ని చూసి మేం నేర్చుకోవాలి’అంటూ ఆ కాంగ్రెస్ పార్టీ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు. అటు టీఎంసీ నేత సాకేత్ గోఖలే కూడా కేంద్రాన్ని విమర్శించారు. రూ.4000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ వర్షం నీరు వరదలుగా పారుతోందని విమర్శించారు. నిధులను మోదీ ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేసిందో తెలుస్తోందని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కేంద్రం స్పందించింది. ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడింది. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఇదీ చదవండి: జీ20 తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్కు అప్పగింత -
బిజీబిజీగా ద్వైపాక్షిక భేటీలు
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విచ్చేసిన సభ్యదేశాల అధినేతలతో ప్రధాని మోదీ విడివిడిగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చల్లో బిజీగా కనిపించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ చాన్స్లర్ ఓలాఫ్ స్కోల్జ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్, తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రెటే, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా, యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోండెర్ లెయిన్, నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబు, ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజలీ అసౌమనీ తదితరుల నాయకులతో మోదీ వేర్వేరుగా చర్చలు జరిపారు. ♦ మధ్యాహ్నం భోజనం వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్తో జరిపిన విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు ఫలవంతమయ్యాయి. ఇండియా–ఫ్రాన్స్ బంధం నూతన సమున్నత శిఖరాలకు చేరేందుకు ఇరువురం కృషిచేస్తాం’ అని మోదీ ట్వీట్చేశారు. ♦ జీ20 సారథ్య బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకు నేతలంతా మోదీని అభినందించారు. ఇంటర్గవర్నమెంటల్ కమిషన్ మరో దఫా చర్చల కోసం వచ్చే ఏడాది భారత్కు విచ్చేయాల్సిందిగా జర్మనీ చాన్స్లర్ ఓలాఫ్ స్కోల్జ్ను మోదీ ఆహా్వనించారు. ఫిబ్రవరిలో భారత్లో పర్యటించిన ఓలాఫ్కు ఇది రెండో అధికారిక పర్యటన. రక్షణ, హరిత, సుస్థిరాభివృద్ధి, అరుదైన ఖనిజాలు, నైపుణ్యమైన సిబ్బంది, విద్య తదితర రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై స్కోల్జ్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ♦ శుద్ధ ఇంధనం, సెమీ కండక్టర్లు, డిజిటల్ సాంకేతికత తదితరాలపై నెదర్లాండ్స్ ప్రధానితో మోదీ చర్చించారు. ♦ వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, చిరుధాన్యాలు, ఆర్థిక సాంకేతికతలపై నైజీరియా అధ్యక్షుడు తినుబుతో మోదీ చర్చలు జరిపారు. ♦ జీ20లో శాశ్వత సభ్యత్వానికి కృషిచేసినందుకు ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజలీ మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ♦ వాణిజ్యం, సాంస్కృతిక, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం, ఈవీ బ్యాటరీ సాంకేతికతల పరిపుష్టికి మరింతగా కృషిచేయాలని నిర్ణయించామని ద.కొరియా నేత ఇయోల్తో భేటీ తర్వాత ప్రధాని మోదీ వెల్లడించారు. ♦ డిసెంబర్ ఒకటో తేదీ నుంచి బ్రెజిల్ సారథ్యంలో జీ20 మరిన్ని విజయాలు సాధించాలని ఆ దేశ అధ్యక్షుడు డ సిల్వాతో మోదీ వ్యాఖ్యానించారు. ♦ వాణిజ్యం, సాంకేతికత, అనుసంధానం వంటి కీలకాంశాల్లో యూరప్తో భారత్ బంధం మరింత పటిష్టానికి సంబంధించి యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులాతో, ఐరోపా మండలి అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్తో మోదీ విడిగా చర్చలు కొనసాగించారు. భారత్ అతిపెద్ద వాణిజ్యభాగస్వామి: ఎర్డోగన్ దక్షిణాసియాలో భారత్ తమకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ పేర్కొన్నారు. భారత్–తుర్కియే పరస్పర సహకారం అవిచ్చిన్నంగా కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం జీ20 సదస్సు ముగిశాక ఎర్డోగన్ మీడియాతో మాట్లాడారు. ఆదివారం భారత ప్రధాని మోదీతో సమావేశమయ్యాయని, ఇరు దేశాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై చర్చించామని తెలిపారు. జీ20లో ఆఫ్రియన్ యూనియన్ భాగస్వామిగా మారడాన్ని ఎర్డోగాన్ స్వాగతించారు. -
G20 Summit: జీ20 సదస్సు విజయం వారి కృషే..
న్యూఢిల్లీ: దేశరాజధానిలో రెండు రోజులపాటు జరిగిన జీ20 సమావేశాలు విజయవంతమైన నేపథ్యంలో సమావేశాలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన జీ20 నిర్వహణాధికారి అమితాబ్ కాంత్ అతని బృందంపైనా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్బంగా మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ అమితాబ్ కాంత్ నేతృత్వంలోని జీ20 షెర్పాల కృషిని కొనియాడారు. కేరళకు చెందిన ఐఏఎస్ అధికారి అమితాబ్ కాంత్పై శశి థరూర్ ప్రశంసలు కురిపించారు. థరూర్ తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా రాస్తూ.. శభాష్ అమితాబ్.. మీరు ఐఏఎస్ ఎంచుకోవడం వలన ఐఎఫ్ఎస్ ఓ గొప్ప అధికారిని కోల్పోయిందని మాత్రం చెప్పగలను. ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో మీ పాత్ర అనిర్వచనీయం. ఢిల్లీ డిక్లరేషన్ డ్రాఫ్ట్ పూర్తి చేయడానికి ఒక్కరోజు ముందే రష్యా చైనాలతో చర్చించి ఏకాభిప్రాయం సాధించడం సాధారణ విషయం కాదని.. ఇది భారత దేశానికే గర్వకారణమని అన్నారు. Well done @amitabhk87! Looks lile the IFS lost an ace diplomat when you opted for the IAS! "Negotiated with Russia, China, only last night got final draft," says India's G20 Sherpa on 'Delhi Declaration' consensus. A proud moment for India at G20! https://t.co/9M0ki7appY — Shashi Tharoor (@ShashiTharoor) September 9, 2023 ఢిల్లీ డిక్లరేషన్లో అత్యంత కీలక ఘట్టమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంశాన్ని చాలా నేర్పుగా పొందుపరచిన జీ20 షెర్పాలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జీ20 సదస్సు నిర్వహణలో ప్రధానాధికారి అమితాబ్ కాంత్ కూడా షెర్పాల బృందాన్ని అభినందించారు. అమితాబ్ కాంత్ రాస్తూ.. జీ20 సదస్సు మొత్తంలో అత్యంత కఠినమైన అంశం రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశంపై ఏకాభిప్రాయం సాధించడమే. దీనికోసం కనీసం 200 గంటల పాటు చర్చలు నిర్వహించాం, 300 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించాము. మొత్తంగా 15 డ్రాఫ్టులను తయారుచేశాము. ఈ విషయంలో ఎంతగానో సహాయపడిన ఈనమ్ గంభీర్, నాగరాజ్ నాయుడు కాకనూర్ లకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని రాశారు. The most complex part of the entire #G20 was to bring consensus on the geopolitical paras (Russia-Ukraine). This was done over 200 hours of non -stop negotiations, 300 bilateral meetings, 15 drafts. In this, I was greatly assisted by two brilliant officers - @NagNaidu08 & @eenamg pic.twitter.com/l8bOEFPP37 — Amitabh Kant (@amitabhk87) September 10, 2023 రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశంపై గతంలో భేదాభిప్రాయాలు వ్యక్తమైనా కూడా దానిపై కర సాధన చేసి షెర్పాలు సభ్యదేశాల ఏకాభిప్రాయం సాధించారు. ఏ ప్రకటన చేసినప్పుడే భారత్ ప్రధాని కూడా షెర్పాల బృందాన్ని అభినందించిన విషయం తెలిసిందే. #WATCH | G-20 in India: PM Narendra Modi says, " I have received good news. Due to the hard work of our team, consensus has been built on New Delhi G20 Leaders' Summit Declaration. My proposal is to adopt this leadership declaration. I announce to adopt this declaration. On this… pic.twitter.com/7mfuzP0qz9 — ANI (@ANI) September 9, 2023 ఇది కూడా చదవండి: G20 Summit: జీ20 సమావేశాలు విజయవంతం -
G20 Summit: జీ20 సమావేశాలు విజయవంతం
న్యూఢిల్లీ: భారత రాజధాని ఢిల్లీ వేదికగా అంగరంగవైభవంగా జరిగిన 18వ జీ20 సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్బంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ముగింపు ప్రసంగంలో భాగస్వామ్య దేశాలకు కృతఙ్ఞతలు తెలిపి బ్రెజిల్ అధ్యక్షుడికి ప్రెసిడెన్సీ బాధ్యతలను అప్పగించారు. బైడెన్ తొలిసారి భారత్లో.. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు సమావేశాలు ముగిశాక వియత్నాం బయలుదేరి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జో బైడెన్ మొట్టమొదటిసారి భారత్లో పర్యటించారు. జీ20 సమావేశాలు రెండోరోజు ఉదయాన్నే రాజ్ఘాట్కు వెళ్లి భారత జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించిన తర్వాత నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన వియత్నాం బయల్దేరారు. సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. #WATCH | G 20 in India | US President Joe Biden departs from Delhi to Vietnam, after concluding the G20 Summit, earlier visuals. pic.twitter.com/gsAG0m5GwX — ANI (@ANI) September 10, 2023 వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు.. జీ20 సమావేశాలు ఒకపక్కన జరుగుతుండగానే ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ప్రపంచ దేశాల అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సమావేశాలు తొలిరోజున మారిషస్, బంగ్లాదేశ్ దేశాలతో చర్చలు జరిపారు. రెండో రోజున యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ దేశ నేతలతో సమావేశమయ్యారు. ఇక ఆదివారం రోజున ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్తో ప్రధాని లంచ్ సమావేశం అది ముగిశాక కెనడా దేశాధినేతలతోనూ అనంతరం కొమొరోస్, తుర్కియే, యూఏఈ, దక్షిణ కొరియా, యురోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో భాగంగా కొన్ని కీలక అంశాలపై రంగాల వారీగా ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. PM to hold more than 15 bilaterals with world leaders on G20 sidelines Read @ANI Story | https://t.co/W7Ti3xFuAG#NarendraModi #Modi #G20 #G20India2023 #NewDelhi pic.twitter.com/Wwv3pnWfbU — ANI Digital (@ani_digital) September 8, 2023 జయహో భారత్.. రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలను భారత్ విజయవంతంగా నిర్వహించింది. సమేవేశాలు తొలిరోజునే ప్రధాని ప్రతిపాదించిన ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో భాగస్వామ్యదేశాల ఏకాభిప్రాయం సాధించడం భారత్ సాధించిన అపూర్వ విజయమనే చెప్పాలి. సమావేశాలు ముగింపు సందర్బంగా ప్రధాని ప్రతిపాదించిన 'వన్ ఎర్త్ నేషన్'పై సభ్యదేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇది కూడా చదవండి: G20 Summit: ఇకపై జీ20 కాదు.. జీ21 -
కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ సాయం.. జీ20 సదస్సుకు ఫెషాలికా
పెద్ద ఎంటర్ప్రెన్యూర్ కావాలని కలలు కన్న షెఫాలికా పండా ఆ కలకు దూరమై పేదలకు దగ్గరైంది. మహాపట్టణం నుంచి మారుమూల పల్లె వరకు ఎన్నో ప్రాంతాలు తిరిగింది.తమ ఫౌండేషన్ తరఫున ఎంతోమందికి అండగా నిలబడింది.కష్టాలు, సమస్యల్లో ఉన్నవారికి సహాయం చేయడమే కాకుండా స్త్రీ సాధికారతకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. ‘జీ20 ఎంపవర్ వర్కింగ్ గ్రూప్ ఆన్ మెంటార్షిప్’ కన్వీనర్గా స్త్రీ సాధికారతకు సంబంధించి విస్తృత స్థాయిలో పనిచేసే అవకాశం షెఫాలికా పండాకు లభించింది... కాలేజీ రోజుల్లో ‘సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్’ కావాలని కలలు కనేది షెఫాలికా. అయితే ఒకానొక సంఘటనతో ఆమె కలల దారి మారింది. తమ బంధువు ఒకరు అనారోగ్యం పాలుకావడంతో, ఒడిషాలో సరిౖయెన వైద్య సదుపాయాలు లేకనోవడంతో దిల్లీకి తీసుకుపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి అసౌకర్యాల వరకు ఎన్నో సంఘటనలను దగ్గరగా చూసింది షెఫాలికా పండా.బ‘చదువుకున్న వారు, ఆర్థికంగా కాస్త మెరుగైన స్థితిలో ఉన్నవారి పరిస్థితే ఇలా ఉంటే ఒడిశాలోని మారుమూల ప్రాంతాలలో ఉండే పేద ప్రజల పరిస్థితి ఏమిటి?’ అని ఆలోచించింది. ఆ ఆలోచనల ఫలితంగా సేవారంగంలోకి వచ్చిన షెఫాలికా ఎంతోమంది పేదలకు అండగా నిలబడింది. బన్సిధర్ అండ్ ‘ఇలా పండా’ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవాకార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లింది.‘నాయకుల ఎదుగుదలకు సంబంధించి అనుభవం అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎంత అనుభవం ఉంటే అంత బలం సమకూరుతుంది. సామాజిక సేవా రంగంలో పదహారు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. సమాజంలో సానుకూల మార్పు తేవాలనుకునేవారికి సమస్యను అర్థం చేసుకోవడంతో పాటు దానిపై పని చేయడానికి చాలా ఓపిక కావాలి. సామాజిక సేవలో మా అత్తమ్మ ‘ఇలా పండా’ నాకు ఆదర్శం. ఎలాంటి ఆడంబరం లేకుండానే ఎన్నో సంవత్సరాలు సేవ చేసింది. ఎండనకా, వాననకా తిరిగినా ఆమె ముఖంలో ఎప్పుడూ అలసట కనిపించేది కాదు. సామాజిక సేవ తన ఆరోగ్య రహస్యంగా చెప్పుకునేది. ఆమె చురుకుదనం, సామాజిక సేవాదృక్పథాన్ని చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందారు. అందులో నేను ఒకరిని’ అంటుంది షెఫాలికా. ‘అవసరం ఉన్న చోట మేముంటాం’ అనే నినాదంతో బన్సిధర్ అండ్ ‘ఇలా పండా’ ఫౌండేషన్ ట్రస్టీ, సీయివోగా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టింది.‘మహిళలపై ప్రధానంగా దృష్టి పెట్టడానికి కారణం అసమానత, లింగ వివక్షత. మహిళల జీవితాలు మారాలంటే ఆమె పిల్లల జీవితాల్లో కూడా మార్పు రావాలని బలంగా నమ్ముతాను’ అంటుంది షెఫాలికా. అవకాశాలు దొరికేవారు, దొరకని వారు అని మహిళలకు సంబంధించి రెండు రకాల వర్గీకరణలున్నాయి. అవకాశాలు దొరికేవారు సులభంగానే విజయం సాధించి పెద్ద స్థాయికి చేరుకుంటారు. మరి దొరకని వారి పరిస్థితి ఏమిటి? సాంకేతిక, జీవన నైపుణ్యాలు, చదువు రూపంలో అలాంటి వారిని వెలుగులోకి తీసుకువచ్చి విజయపథంలోకి తీసుకువెళ్లడంపై, మహిళలకు సమాన అవకాశాలు ఎలా కల్పించాలనే దానిపై జీ20 సదస్సు దృష్టి పెడుతుంది. జీ20 ఉమెన్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా వ్యాపారవేత్తలు కావాలనుకునేవారికి, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఎంతో మేలు జరుగుతుంది. 30,000 మంది ఎంటర్ప్రెన్యూర్ల అనుభవాలు పాఠాలుగా ఉపయోగపడతాయి. – షెఫాలికా, కన్వీనర్, జీ20 ఎంపవర్ వర్కింగ్ గ్రూప్ ఆన్ మెంటర్షిప్ -
జీ-20 సమ్మిట్: చెహ్లం ఊరేగింపునకు మతం రంగు..
ఢిల్లీ: జీ-20 వేడుకలకు ముందు జరిగిన చెహ్లం ఊరేగింపునకు మతం రంగు పూస్తున్న సోషల్ మీడియా పోస్టులపై ఢిల్లీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆ పుకార్లు అవాస్తవాలని స్పష్టం చేశారు. జీ-20 వేడుకలు శనివారం ప్రారంభం కానుండగా.. బుధవారం ఢిల్లీలో చెహ్లం ఊరేగింపు జరిగింది. దీనిపై ప్రపంచస్థాయి వేడుకలకు ముందు ఏదైనా మతపరమైన ఆందోళనలకు ప్లాన్ చేశారా..? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. వీటిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెహ్లం ఊరేగింపులో కొన్ని మతపరమైన నినాదాలు వినిపించినట్లు, అభ్యంతకరమైన భాషను వాడినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో జీ-20 వేడుకలకు ముందు ఏదైనా మతపరమైన ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నారా..? అంటూ ప్రచారం కల్పిస్తూ పోస్టులు వెలువడ్డాయి. FALSE NEWS: Some social media handles are wrongly projecting videos of Chehlum procession,as communal protest before G-20 Summit.The Chehlum procession is traditional one and carried out with due permissions from the law enforcing agencies. Please do not Spread rumors.#DPUpdates — Delhi Police (@DelhiPolice) September 7, 2023 దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఢిల్లీ పోలీసులు..' అవన్నీ అవాస్తవాలు. చెహ్లం ఊరేగింపు, జీ-20 ముందు మతపరమైన ఊరేగింపు అంటూ కొందరు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారు. చెహ్లం వేడుక సాంప్రదాయంగా, అనుమతుల మేరకు జరుపుకుంటున్నారు. తప్పుడు ప్రచారం చేయవద్దు.' అని పేర్కొన్నారు. చెహ్లం పండగను ఢిల్లీలో షియా ముస్లింలు బుధవారం నిర్వహించారు. మొహర్రం పండుగ పూర్తి అయిన 40వ నాడు ఈ ఊరేగింపును చేపడతారు. ముహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ బలిదానానికి జ్ఞాపకార్థంగా ఈ వేడుక జరుగుతుంది. ఈ పండగ సందర్భంగా ఢిల్లీ పోలీసులు అప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జీ20 సదస్సు శని, ఆదివారాల్లో ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో జరగనుంది. ఈరోజు రాత్రి 9 గంటలకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. వాహనాలను ఆదివారం అర్ధరాత్రి వరకు ఢిల్లీలోకి అనుమతించరు. శనివారం ఉదయం 5 గంటల నుంచి ట్యాక్సీలు, ఆటోలకు ఇవే ఆంక్షలు వర్తిస్తాయి. ఇదీ చదవండి: జీ20: ఎందుకు.. ఏమిటి! -
అనధికారిక లాక్ డౌన్లోకి సెంట్రల్ ఢిల్లీ!
ఢిల్లీ: జీ-20 సదస్సుకు రంగం సిద్ధమైంది. అధికారులు భారీ ఏర్పాటు చేశారు. దేశ రాజధానికి రానున్న ప్రతినిధులకు ప్రధాని మోదీ ఫొటోలతో స్వాగత తోరణాలు దర్శనమిస్తున్నాయి. ఆంక్షలతో సెంట్రల్ ఢిల్లీలో అనధికార లాక్డౌన్ కొనసాగుతోంది. లక్షమంది భద్రతా సిబ్భందితో సెంట్రల్ ఢిల్లీ పరిసరాలు శత్రుదుర్భేద్యంగా మారాయి. నేటి సాయంత్రం నుంచి సెప్టెంబర్ 10 వరకు సెంట్రల్ ఢిల్లీలోకి ఇతర వాహనాలు రాకుండా అనుమతిని నిషేధించారు అధికారులు. ఆంక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. అనుమతి ఉన్న వాహనాలు మినహా మిగిలిన వాటికి ఎంట్రీ ఉండదని అధికారులు తెలిపారు. जी-20 समिट ( दिनांक 9 व 10 सितंबर ) के दौरान, सुगम आवाजाही के लिए यातायात निर्देशिका। Traffic advisory in view of #G20Summit on Sept 9 & 10, 2023, to facilitate hassle free movement of vehicles. यातायात निर्देशिका/Traffic Advisory: https://t.co/fFgh2gcsAK pic.twitter.com/nEO09PFpf9 — Delhi Traffic Police (@dtptraffic) August 31, 2023 సెంట్రల్ ఢిల్లీలో నివాసం ఉండేవారు మినహా మిగిలిన వారికి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. భద్రతా ఏర్పాట్లపై వారం రోజుల నుంచి ఢిల్లీ పోలీసులు రిహార్సల్స్ చేస్తున్నారు. దాదాపు లక్ష మందికి పైగా భద్రత సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. భారత్ వేదికగా జీ-20 సమావేశాలు సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్నాయి. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు దేశ రాజధానికి హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సహా పలు ముఖ్యనేతలు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టం చేశారు. ఇదీ చదవండి: మరో వివాదం: ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 'భారత్' వంతు -
ఇండియా బదులుగా భారత్ అని ముద్రించిన కేంద్రం
-
ఇండియా కాదు భారత్, దేశం పేరు మార్చే దిశగా కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలబెట్టిన జీ20 సదస్సు ఊహించని పరిణామానికి దారి తీసింది. రాష్ట్రపతి భవన్ నుంచి వెలువడ్డ G20 డిన్నర్ ఆహ్వాన పత్రికతో సంచలన విషయం తెరమీదికి వచ్చింది. ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు.. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించింది రాష్ట్రపతి భవన్. దీంతో దేశం పేరును ఆంగ్లంలో ఇండియా నుంచి భారత్కు మార్చే ప్రయత్నాల్లో కేంద్రం ఉందనే చర్చ ఊపందుకుంది. జీ20 సదస్సులో భాగంగా.. సెప్టెంబర్ 9వ తేదీన వివిధ దేశాల అధినేతలకు, ప్రతినిధులకు విందు ఏర్పాటు చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇందుకోసం విదేశీ అధినేతలకు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతోనే ఆహ్వానాలు పంపింది రాష్ట్రపతి . ఇదే ఇప్పుడు రాజకీయ అభ్యంతరాలకు దారి తీసింది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా.. రిపబ్లిక్ ఆఫ్ భారత్గా మారబోతోందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంకేతాలిస్తూ ఓ ట్వీట్ కూడా చేశారు. రిపబ్లిక్ అఫ్ భారత్.. మన నాగరికత అమృత్ కాల్ వైపు ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్లో పేర్కొన్నారాయన. REPUBLIC OF BHARAT - happy and proud that our civilisation is marching ahead boldly towards AMRIT KAAL — Himanta Biswa Sarma (@himantabiswa) September 5, 2023 ఇంకోవైపు కాంగ్రెస్ ఈ పరిణామంపై మండిపడుతోంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో పేర్కొన్న యూనియన్ స్టేట్స్పై ముమ్మాటికీ దాడేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. చరిత్రను వక్రీకరిస్తూ.. దేశాన్ని విభజిస్తూ.. మోదీ ముందుకు సాగుతున్నారంటూ మండిపడ్డారు. దీనికి బీజేపీ కౌంటర్ ఇచ్చింది. Mr. Modi can continue to distort history and divide India, that is Bharat, that is a Union of States. But we will not be deterred. After all, what is the objective of INDIA parties? It is BHARAT—Bring Harmony, Amity, Reconciliation And Trust. Judega BHARAT Jeetega INDIA! https://t.co/L0gsXUEEEK — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 ‘‘దేశ గౌరవానికి, గర్వానికి సంబంధించిన ప్రతి విషయంపై కాంగ్రెస్కు ఎందుకు అంత అభ్యంతరం? వ్యక్తం చేస్తోంది. భారత్ జోడో పేరుతో రాజకీయ యాత్రలు చేసిన వాళ్లు.. భారత్ మాతా కీ జై అనే ప్రకటనను ఎందుకు ద్వేషిస్తున్నారు. కాంగ్రెస్కు దేశంపైనా, దేశ రాజ్యాంగంపైనా, రాజ్యాంగ సంస్థలపైనా గౌరవం లేదని మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ దేశ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఉద్దేశాల గురించి దేశం మొత్తానికి బాగా తెలుసు అని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. कांग्रेस को देश के सम्मान एवं गौरव से जुड़े हर विषय से इतनी आपत्ति क्यों है? भारत जोड़ो के नाम पर राजनीतिक यात्रा करने वालों को “भारत माता की जय” के उद्घोष से नफरत क्यों है? स्पष्ट है कि कांग्रेस के मन में न देश के प्रति सम्मान है, न देश के संविधान के प्रति और न ही संवैधानिक… — Jagat Prakash Nadda (@JPNadda) September 5, 2023 కొత్త భవనంలోనేనా? ఆంగ్లంలో ఇండియా(India)గా ఉచ్చరించే పేరును.. భారత్(Bharat)గా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టేందుకు.. 18 నుంచి 22వ తేదీలో జరగబోయే పార్లమెంట్ సమావేశాలను కేంద్రం వేదికగా చేసుకుంటుందా? అనే దానిపై ఒక స్పష్టత మాత్రం రావాలి. తొలి రెండు రోజులు పాత పార్లమెంట్ భవనంలో.. తర్వాతి మూడు రోజులు కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయి. కొత్త పార్లమెంట్ భవనంలోనే.. పేరుపై తీర్మానంతో పాటు జమిలి ఎన్నికలు, బ్రిటిష్కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో తీసుకురాబోయే కొత్త చట్టాలను చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. So the news is indeed true. Rashtrapati Bhawan has sent out an invite for a G20 dinner on Sept 9th in the name of 'President of Bharat' instead of the usual 'President of India'. Now, Article 1 in the Constitution can read: “Bharat, that was India, shall be a Union of States.”… — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అని పిలవాలని ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ రెండ్రోజుల క్రితం పిలుపునిచ్చారు. ఆ తర్వాత రాష్ట్రపతికి పంపిన ఆహ్వానం వెలుగులోకి వచ్చింది. ప్రతిపక్షాల కూటమి ఇండియా పేరును పెట్టుకున్న తర్వాత దేశం పేరును ఇండియా అని పిలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వర్సెస్ మోదీ లాంటి నినాదాలు చర్చలను తీవ్రతరం చేశాయి. ఇదీ చదవండి: ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమిటీ తొలి భేటీ ఎప్పుడంటే..? -
గైర్హాజరీ సందేశం!
అనుకున్నదే అయింది. రానున్న ‘జీ20’ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అసాధారణ రీతిలో హాజరు కాకపోవచ్చంటూ కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలు నిజమయ్యాయి. చైనా ప్రధాని లీ కియాంగ్ ఆ సదస్సుకు హాజరవుతారంటూ ఆ దేశ విదేశాంగ శాఖ సోమవారం మధ్యాహ్నం ప్రకటించింది. అధ్యక్ష, ప్రధానులిద్దరూ ఏకకాలంలో విదేశాల్లో ఉండడం, అందులోనూ ఒకే కార్యక్రమంలో ఉండడమనేది చైనా ఎన్నడూ చేయని పని గనక ‘జీ20’కి షీ గైర్హాజరు ఖాయమని తేటతెల్లమైంది. వెరసి, ‘జీ–20’ అధ్యక్ష హోదాలో భారత్ ఈ నెల 9, 10 తేదీల్లో ఆతిథ్యమిస్తున్న 18వ వార్షిక శిఖరాగ్ర సదస్సు ఇప్పుడు కొత్త కారణంతో వార్తల్లో నిలిచింది. ఇంట ఆర్థికవ్యవస్థలో ఇక్కట్లు, బయట అమెరికా – భారత్లతో క్షీణసంబంధాలు, పొరుగుదేశాలతో కొనితెచ్చుకున్న తగాదాల మధ్య చైనా అధినేత కావాలనే మొహం చాటేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆహ్వానించినప్పుడు వెళ్ళడానికి కొన్ని కారణాలుంటే, వెళ్ళాల్సి ఉన్నా వెళ్ళకపోవడానికి అంతకు మించే కారణాలుంటాయి. చైనా అధినేత గైర్హాజరు కథా అంతే! భారత్తో చైనా ద్వైపాక్షిక సంబంధాలు నానాటికీ దిగజారుతున్నాయి. లద్దాఖ్లో మూడేళ్ళ క్రితం సైనికుల కొట్లాట నుంచి ఇదే ధోరణి. సరిహద్దుకు ఇరువైపులా మోహరించిన సైన్యం ఉద్రిక్తతలకు అద్దంపడుతోంది. వాణిజ్యంపై విభేదాలు ఉండనే ఉన్నాయి. బద్ధశత్రువైన అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలను భారత్ పెంచు కోవడంతో డ్రాగన్కి పుండు మీద కారం రాసినట్టుంది. చైనాను వెనక్కినెట్టి అత్యధిక ప్రపంచ జనాభా గల దేశంగా భారత్ ఇప్పటికే ముందుకొచ్చింది. సాంకేతిక విజ్ఞానం, అంతరిక్ష శోధన, ప్రపంచ వాణిజ్యంలో పోటాపోటీ సరేసరి. ఇవి చాలదన్నట్టు ప్రామాణిక దేశపటమంటూ భారత భూభాగాల్ని కలిపేసుకున్న వక్రీకరించిన మ్యాప్ను చైనా తాజాగా విడుదల చేసి కొత్త రచ్చ రేపింది. చైనా అధినేత మొహం చాటేయడానికి ఇలా చాలా కారణాలే! ఈ తాజా పరిణామం చైనా – భారత సంబంధాల మెరుగుదలకు తోడ్పడదు. మరోపక్క అమెరికా అధ్యక్షుడు బైడెన్తో షీ సంభాషించే అవకాశం తప్పిపోతోంది. నిజానికి, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సహా పలువురు ఈ మధ్య బీజింగ్కు సందర్శనలు జరిపారు. అయినప్పటికీ అగ్రదేశాలైన అమెరికా, చైనాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత క్షీణించి ఉన్నాయి. గత నవంబర్లో ఇండొ నేషియాలోని బాలిలో జరిగిన గత ‘జీ20’ తర్వాత షీ, బైడెన్లు కలసి మాట్లాడుకున్నది లేదు. ఇప్పుడు మళ్ళీ కలసి, సంబంధాలను సరిదిద్దుకొనే అవకాశాన్ని చైనా చేతులారా జారవిడుస్తోంది. బైడెన్ సైతం ఈ పరిణామంతో నిరాశకు లోనయ్యాననడం గమనార్హం. షీ ఒక్క ‘జీ20’నే కాదు, జకార్తాలో జరగనున్న ఏషియాన్ (వాయవ్య ఆసియా దేశాల సంఘం), ఈస్ట్ ఏషియా సదస్సులూ ఎగ్గొడుతున్నారు. వాటికీ చైనా ప్రధానే హాజరు కానున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు మొత్తం 16 సార్లు భౌతికంగానూ, ఒకసారి వర్చ్యువల్గానూ (సౌదీ అరేబియా– 2020) జీ20 సదస్సులు జరిగాయి. వాటిలో మొదటి మూడు మినహా 2010 నుంచి ఇప్పటి వరకు ఏ ఇతర సదస్సులోనూ అన్ని దేశాల అధినేతలూ పాల్గొన్న దాఖలా లేదు. అయితే, చైనా అధినేత మాత్రం ఏ జీ20 సదస్సుకూ ఇప్పటి దాకా గైర్హాజరవలేదు. కరోనా ఆంక్షలున్న రెండేళ్ళూ వర్చ్యువల్గానైనా హాజరయ్యారు. గత నెల దక్షిణాఫ్రికాలో ప్రధాన వర్ధమాన ఆర్థిక వ్యవస్థల బృందమైన ‘బ్రిక్స్’ సదస్సు జరిగినప్పుడూ షీ వచ్చారు. మరి, ఇప్పుడు మాత్రం తన బదులు ప్రధానిని పంపుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన బదులు విదేశాంగ మంత్రినిపంపుతున్నట్టు ఇప్పటికే చెప్పేశారు. అధ్యక్షుడి గైర్హాజరుకు కారణాలు చైనా బయటకు చెప్పక పోయినా, ఇదంతా సహజమేనన్నట్టు భారత అధికార వర్గాలు చిత్రిస్తున్నా... విషయం మాత్రం అసాధారణమే. షీ రాజనీతి పట్ల సందేహాలు రేపుతున్నాయి. మావో తర్వాత మరే ఇతర చైనా నేతకూ లేనంతటి అధికారం షీ సొంతం. ప్రాదేశిక ప్రయో జనాల పేరు చెప్పి, తైవాన్, దక్షిణ చైనా సముద్రం సహా అన్నీ చైనావేనంటూ ఆయన అంతకంతకూ దూకుడు చూపుతున్నారు. సహజంగానే పాకిస్తాన్ లాంటి ఒకట్రెండు దేశాల్ని మినహాయిస్తే, పొరుగున మిత్రుల కన్నా ఎక్కువగా శత్రువుల్ని చేసుకున్నారు. నిజానికి, జీ20 దేశాలంటే ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బృందం. ఇంత కీలకమైనా సరే, దీని కన్నా తమ చైనా ఆధిపత్యం ఉన్న ‘బ్రిక్స్’ వగైరాల వైపే షీ మొగ్గుతున్నారనుకోవచ్చు. ఇటీవల ఆయన ప్రయాణించినదల్లా సౌదీ అరేబియా, రష్యా, సౌతాఫ్రికా లాంటి స్నేహపూర్వక స్వాగతం లభించే దేశాలకే అని విశ్లేషించవచ్చు. అటు అమెరికా, ఇటు భారత్లతో ఉద్రిక్తతలు తగ్గించడమూ తన షరతుల ప్రకారమే జరగాలని చూస్తున్నారనుకోవచ్చు. డ్రాగన్ బుసలు కొడుతున్నందునే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లతో కూడిన భద్రతా కూటమి ‘క్వాడ్’లో భారత్ చేరిందని గమనించాలి. ఇక, బైడెన్తో ఇప్పుడు భేటీ తప్పిందంటే మళ్ళీ నవంబర్లో శాన్ఫ్రాన్సిస్కోలో ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు దాకా వారు కలిసే ఛాన్స్ లేదు. ప్రస్తుత చైనా వైఖరి చూస్తుంటే, అప్పుడైనా షీ హాజరవుతారన్న గ్యారెంటీ లేదు. జీ20లోనూ దేశాధి నేతలు చేయాల్సిన సమష్టి ప్రకటనకు గండికొట్టి, భారత పాలకుల విశ్వగురు ప్రచారాన్ని దెబ్బ తీశారనుకోవచ్చు. ప్రధానిని పంపుతున్నా, సదస్సులోని నిర్ణయాలకు చైనా కట్టుబడేలా చూసేందుకు సదరు వ్యక్తికి ఏపాటి అధికారం ఉంటుందో చెప్పలేం. వెరసి, షీ గైర్హాజరీ సందేశం సుదీర్ఘమైనదే! -
వచ్చే నెలలో ఢిల్లీలో జీ20 పార్లమెంట్ స్పీకర్ల భేటీ
న్యూఢిల్లీ: జీ20 కూటమి దేశాల పార్లమెంట్ స్పీకర్ల సమావేశం వచ్చే నెలలో ఢిల్లీలో జరగనుంది. అక్టోబర్ 12, 13, 14వ తేదీల్లో పార్లమెంట్ నూతన భవనం పార్లమెంట్–20 భేటీకి వేదిక కానుందని జీ20 ఇండియా స్పెషల్ సెక్రటరీ ముక్తేశ్ పర్దేశి చెప్పారు. జీ20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాల పార్లమెంట్ ప్రిసైడింగ్ అధికారులు పాల్గొని చర్చలు జరుపుతారని తెలిపారు. ‘పార్లమెంటేరియన్లు సంబంధిత ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కాబట్టి, పీ20 సమావేశాలు ప్రపంచ పాలనకు పార్లమెంటరీ కోణాన్ని తీసుకురావడం, అవగాహన పెంచడం, అంతర్జాతీయ నిబంధనలకు రాజకీయ మద్దతును సాధించడం, వీటిని సమర్థంగా కార్యరూపం దాల్చేలా చేయడమే ఈ సమావేశాల లక్ష్యం’అనిముక్తేశ్ వివరించారు. భారత్ను ప్రజాస్వామ్యానికి తల్లిగా చూపేందుకు ఉద్దేశించిన ఒక ఎగ్జిబిషన్ను కూడా ఏర్పాటు చేశామన్నారు. 2010లో జీ20 అధ్యక్ష స్థానంలో కెనడా ఉన్నప్పటి నుంచి పీ20 గ్రూప్ భేటీలు జరుగుతున్నాయని, ఆ క్రమంలో ఇది 9వదని వివరించారు. -
విక్రేతల మధ్య సమాన పోటీ ఉండాలి
జైపూర్: ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఈ–కామర్స్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అదే సమయంలో ఈ రంగంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో చిన్న, పెద్ద విక్రేతల మధ్య సమాన పోటీ ఉండేలా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గురువారం రాజస్తాన్లోని జైపూర్లో జరిగిన జీ20 దేశాల వాణిజ్య, పెట్టుబడి శాఖ మంత్రుల సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ధరలు, ఫిర్యాదుల విషయంలో వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. డిజిటలీకరణ ద్వారా ఈ–కామర్స్ రంగంలో దేశాల మధ్య కార్యకలాపాలు సులభతరం అవుతాయని తెలిపారు. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ) అనేది ఒక గేమ్–చేంజర్ అని మోదీ అభివరి్ణంచారు. దీనిద్వారా డిజిటల్ మార్కెట్ప్లేస్ వ్యవస్థను సృష్టిస్తున్నట్లు వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని, సానుకూలతను ప్రపంచదేశాలు గుర్తిస్తున్నాయని పేర్కొన్నారు. -
G20 Ministerial Meet: భారత్ ఒక ఆదర్శ ప్రయోగశాల
న్యూఢిల్లీ/బెంగళూరు: భారతదేశం విభిన్న సమస్యల పరిష్కారాల కోసం ఆదర్శవంతమైన ఒక ప్రయోగశాల అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడ విజయవంతమైన పరిష్కారాలను ప్రపంచంలో ఎక్కడైనా సులభంగా అన్వయించవచ్చని నొక్కి చెప్పారు. బెంగళూరులో శనివారం జరిగిన జీ20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ మంత్రుల సమావేశంలో ఆయన వర్చువల్గా మాట్లాడారు. భారత్లోని డిజిటల్ మౌలిక వసతులతో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు సురక్షితమైన పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ప్రపంచంతో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ‘భారత్ ఎంతో వైవిధ్యం కలిగిన దేశం. మాకు డజన్ల కొద్దీ భాషలు, వందలాదిగా మాండలికాలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి మతానికి, అసంఖ్యాక సాంస్కృతిక వారసత్వాలకు భారత్ నిలయం. ప్రాచీన సంప్రదాయాల నుంచి లేటెస్ట్ టెక్నాలజీ వరకు, ప్రతి ఒక్కరికీ అవసరమైనవి భారత్లో ఉన్నాయి. అనేక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేందుకు భారత్ ఒక ఆదర్శ ప్రయోగశాల. ఇక్కడ విజయవంతమైన పరిష్కారాన్ని ప్రపంచంలో ఎక్కడైనా సులువుగా అన్వయించుకోవచ్చు’అని ప్రధాని చెప్పారు. డిజిటల్ సాంకేతికతలో అన్ని దేశాలను భాగస్వా ములను చేసేలా వర్చువల్ ఎక్స్లెన్స్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన రోడ్ మ్యాప్ రూపొందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. డిజిటల్ ఎకానమీ విస్తరించే కొద్దీ భద్రతా పరమైన సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జీ20 దేశాల మధ్య ఏకాభిప్రాయంతో విశ్వసనీయమైన, సురక్షితమైన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సురక్షిత, సమ్మిళిత, శ్రేయస్కరమైన గ్లోబల్ డిజిటల్ భవిష్యత్తు కోసం జీ20 దేశాలకు ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఆర్థికంగా, సాంకేతికతపరంగా భారత్ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. భాషల అనువాదం కోసం ‘భాషిణి’అనే కృత్రిమ మేధను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. జన్ధన్ ఖాతాలు 50 కోట్లు జన్ధన్ బ్యాంకు ఖాతాలు 50 కోట్లు దాటిపోవడం కీలక మైలురాయని ప్రధాని మోదీ అన్నారు. ఇందులో సగానికి పైగా ఖాతాలు మహిళలవేనని చెప్పారు. జన్ధన్ బ్యాంకు ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్కు దాటిందని, ఇందులో 56 శాతం మహిళలకు చెందినవేనని శుక్రవారం ఆర్థిక శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 2014లో జన్ధన్ ఖాతాల కార్యక్రమాన్ని ప్రారంభించింది. -
'మణిపూర్లో జీ20 సదస్సును జరపండి'
లక్నో: కేంద్ర ప్రభుత్వంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. మణిపూర్లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటే కేంద్రం ఎందుకు జీ20 సదస్సును అక్కడ నిర్వహించట్లేదని ప్రశ్నించారు. ఈ మేరకు 'జీ20 కా చునావ్ కనెక్షన్' సెషన్లో భాగంగా ఆయన మాట్లాడారు. 'దేశవ్యాప్తంగా జీ20 సెషన్లను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలతో సహా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. కానీ మణిపూర్ సమస్యపై సరిగా స్పందించడం లేదు. అక్కడ పరిస్థితులు సాధారణ స్థాయికి చేరాయని నాయకులు చెబుతున్నారు. నిజంగా అక్కడ అల్లర్లు లేకపోతే ప్రస్తుతం జరిగే జీ20 మీటింగ్లను మణిపూర్లో నిర్వహించవచ్చు.' అని అఖిలేష్ యాదవ్ అన్నారు. మణిపూర్ సమస్యపై ప్రతిపక్షాలు ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని పట్టుబట్టాయి. ప్రధాని మోదీ ఈ సమస్యపై స్పందించాలని కోరారు. అటు.. కేంద్రంపై అవిశ్వాస తీర్మాణాన్ని కూడా ప్రవేశపెట్టాయి. అయితే.. ఈ తీర్మాణంపై కేంద్రం తన బలాన్ని నిరూపించుకుంది. ఇదీ చదవండి: ఆయుష్మాన్ భారత్పై ప్రశంసలు కురిపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ -
భారత్లో జరిగే జీ-20 సదస్సులో అదే హాట్ టాపిక్
వాషింగ్టన్: సెప్టెంబర్ నెలలో జరగనున్న జీ-20 సదస్సులో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి సంబంధించిన చర్చే ప్రధానం కానుందని చెబుతున్నాయి వైట్ హౌస్ వర్గాలు. ఈ మేరకు అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఒక ప్రకటన చేశారు. ఈ దఫా జీ-20 సదస్సు భారత్లో జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ ప్రథమార్ధంలో న్యూఢిల్లీ వేదికగా అజరిగే ఈ సదస్సుకు అతిరధ మహారధులంతా హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా పాల్గొనబోయే ఈ సమావేశంలో మిగతా అంశాలతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన చర్చ కూడా జరగనుందని సమావేశానికి హాజరుకానున్న అన్ని దేశాలు ఇదే అంశానికి పెద్ద పీట వేసినా ఆశ్చర్యపోనక్కరలేదని అన్నారు అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్. నాటో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ ప్రయత్నం చేయడంతో యుద్ధానికి బీజం పడింది. 2022, ఫిబ్రవరి 24న రష్యా స్పెషల్ మిలటరీ ఆపరేషన్ ప్రారంభించింది. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మొదలైన యుద్ధం ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది. ఇక ఉక్రెయిన్ నాటో సభ్యత్వంపై ఇటీవల జరిగిన సమావేశాల్లో భాగస్వామి దేశాలు సంయుక్తంగా ఒక నిర్ణయానికి వచ్చాయి. రష్యాతో జరుగుతున్న యుద్ధం సమసిపోతే గానీ ఉక్రెయిన్ సభ్యత్వం గురించి ఎటూ తేల్చలేమని తేల్చేశాయి. ఇటీవల సౌదీ రాజు అధ్యక్షతన ఆ దేశంలో జరిగిన సమావేశంలోనూ ప్రధానంగా ఉక్రెయిన్ గురించిన చర్చ జరిగింది. వచ్చే నెల జీ-20 సదస్సులో కూడా అదే హాట్ టాపిక్ కానుంది. ఎక్కడ సమావేశాలు జరిగినా రష్యా ఉక్రేయి యుద్ధం ప్రస్తావన వస్తూనే ఉంది. సుదీర్ఘన్గా కొనసాగుతున్న యుద్ధం తదనంతర పరిణామాల దృష్ట్యా ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఎలాగైనా యుద్ధాన్ని ఓ కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తుండడం మంచి పరిణామమే. ఇది కూడా చదవండి: 24 ఏళ్లయ్యింది.. ఇకనైనా తొలగించండి ప్లీజ్.. మళ్లీ -
G20 ఇంధన పరివర్తనలో కలసి పనిచేస్తాం: కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్
G20 గుజరాత్ రాజధాని నగరం గాంధీ నగర్లో మూడవ జీ20 ఆర్థికమంత్రులు,కేంద్రబ్యాంకుల సమావేశం సోమవారం మొదలైంది. గుజరాత్ రాజధానిలో జూలై 14 నుండి 15 వరకు G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీస్ (FCBDs) సమావేశం జరుగుతుంది. పీఎం మోదీ అమెరికా పర్యటన అమెరికా-భారత్ భాగస్వామ్యంలో బలాన్ని, చైతన్యాన్ని పెంచిందని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ వ్యాఖ్యానించారు. రెండు దేశాల ఆర్థిక అధిపతులు చేసిన ప్రకటనల ప్రకారం ఇండియా-అమెరికా దేశాలు కొత్త ఇన్వెస్ట్మెంట్ వేదిక ద్వారా ఇంధన పరివర్తన వ్యయాన్ని తగ్గించడానికి కలిసి పనిచేయాలని అంగీకరించాయి. అభివృద్ధి సహకారం , పునరుత్పాదక ఇంధనం కోసం ప్రత్యామ్నాయ పెట్టుబడి వేదికల ద్వారా కొత్త పెట్టుబడి అవకాశాల ద్వారా ఇదరు దేశాల ద్వైపాక్షిక ప్రయోజనాలను మరింతగా పెంచుకోవడానికి ఎదురుచూస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ తన సొంత ప్రకటనలో, ఇండియా ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన మూలధనాన్ని, ప్రైవేట్ పెట్టుబడులను పెంచడానికి పెట్టుబడి వేదికపై భారతదేశంతో కలిసి పనిచేసేందుకు తాము కూడా ఎదురు చూస్తున్నామని చెప్పారు. VIDEO | "The state visit of PM Modi to the United States last month and his meeting with the US President have enhanced the strength and dynamism of the partnership (between India and US). The historic visit paved the way for new avenues of collaboration, propelling our… pic.twitter.com/YZLXBLdZrj — Press Trust of India (@PTI_News) July 17, 2023 ఆర్థికమంత్రి, ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ శక్తికాంత దాస్ సంయుక్త అధ్యక్షతన జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి, 66 మంది ప్రతినిధులు పాల్గొంటున్నఈ మీట్లో గ్లోబల్ ఎకానమీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్కు సంబంధించిన అనేక అంశాలు చర్చకు రానున్నాయి. ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన మొదటి జీ20 ఎఫ్ఎంసీబీజీ కాన్క్లేవ్ ఆధారంగా అనేక కీలక బట్వాడాలకు సంబంధించిన పనికి పరాకాష్టగా నిలుస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ అజయ్ సేథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
విక్రయాల కోసం ప్రభుత్వంపై ఆధారపడకండి
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ (కొనుగోళ్ల)పై ఆధారపడొద్దని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ సూచించారు. దానికి బదులుగా దేశీ మార్కెట్, ఎగుమతులపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన యూత్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ విషయాలు తెలిపారు. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కొనుగోళ్ల ద్వారా స్టార్టప్లకు తోడ్పాటు అందించేందుకు సానుకూలంగా కృషి చేస్తున్నాయని, అనేక సందర్భాల్లో పలు మినహాయింపులు కూడా ఇస్తున్నాయని ఆయన చెప్పారు. అంకుర సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు గవర్నమెంట్ ఈ–మార్కెట్ప్లేస్ చక్కని రన్వేలాంటిదని కాంత్ వివరించారు. ‘అయితే, అంకుర సంస్థల విషయంలో ప్రభుత్వాలు మరీ ఎక్కువగా జోక్యం చేసుకోవడానికి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం. చురుకైన స్టార్టప్లు మార్కెట్ప్లేస్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ప్రభుత్వ కొనుగోళ్లపై మరీ ఎక్కువగా ఆధారపడిపోకూడదు‘ అని ఆయన చెప్పారు. ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి స్కీముల ద్వారా స్టార్టప్లకు పెట్టుబడులు లభించేలా తోడ్పాటు అందించడానికి మాత్రమే ప్రభుత్వ పాత్ర పరిమితం కావాలని కాంత్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, లింగ అసమానతలను రూపుమాపేందుకు, మహిళల జీవన ప్రమా ణాలు మరింత మెరుగుపడేందుకు పురుషుల దృష్టికోణం మారాలని ఆయన చెప్పారు. సాధారణంగా భారత్, దక్షిణాసియాలో ఆస్తిని కుమార్తెలకు కాకుండా కుమారులకే మార్పిడి చేసే సంస్కృతి ఉందని.. అలా కాకుండా కుమార్తెల పేరిట బదిలీ చేసే సంస్కృతి వస్తే దశాబ్ద కాలంలోనే మహిళలు మరింతగా రాణించడాన్ని చూడగలమని కాంత్ చెప్పారు. -
స్టార్టప్లలో లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అంకుర సంస్థల వ్యవస్థలోకి 2030 నాటికల్లా వార్షిక పెట్టుబడుల పరిమాణం 1 లక్ష కోట్ల డాలర్లకు చేరేలా కృషి చేయాలని స్టార్టప్20 ఎంగేజ్మెంట్ గ్రూప్ నిర్దేశించుకుంది. ఇందుకోసం జీ20 దేశాధినేతలతో భేటీ కానుంది. ప్రస్తుతం స్టార్టప్ వ్యవస్థలోకి వార్షిక పెట్టుబడు లు 700 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. స్టార్టప్20 ఇండియా చెయిర్ చింతన్ వైష్ణవ్ ఈ విషయాలు తెలిపారు. పెట్టుబడుల తోడ్పాటుతో స్టార్టప్లు అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధికి చోదకాలుగా నిలవగలవని ఆయన చెప్పారు. అంకుర సంస్థలకు అంతర్జాతీయంగా ప్రామాణికమైన నిర్వచనాన్ని రూపొందిస్తే వాటికి పెట్టుబడులు, నిపుణుల లభ్యత మరింతగా పెరగగలదని పేర్కొన్నారు. జీ20కి అధ్యక్షత వహిస్తున్న భారత్.. జూలై 3–4న గురుగ్రామ్లో ’స్టార్టప్20 శిఖర్’ సదస్సు నిర్వహించనుంది. ఇందులో జీ20 సభ్యదేశాలకు చెందిన 700 పైగా అంకుర సంస్థలు పాల్గోనున్నాయి. -
భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫైనాన్షింగ్కు సంబంధించి ఒక కొత్త ఒప్పంద ఖరారుకు పారిస్లో జరుగుతున్న సదస్సులో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాల మెరుగుపై దృష్టి సారించారు. ఫ్రాన్స్, బ్రెజిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థికమంత్రులతో ఆమె వేర్వేరుగా చర్చలు జరిపారు. భారత్ ప్రెసిడెన్సీలో కీలక జీ20 దేశాల దృష్టి సారించిన అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను (ఎండీబీ) బలోపేతం చేయడం, రుణ సమస్యల నిర్వహణపై కూడా వీరి సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 22–23 తేదీల్లో జరిగిన ఈసమావేశాలను భారత్, ఫ్రాన్స్, బర్బాడోస్లు నిర్వహించాయి. వాతావరణ మార్పు, జీవవైవిధ్య సంక్షోభం, అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థకు మించిన కొత్త గ్లోబల్ ఫైనాన్సింగ్ ఆర్కిటెక్చర్కు పునాదులు ఏర్పాటు చేయడం ’న్యూ గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్’ శిఖరాగ్ర సమావేశం లక్ష్యం. డీపీఐతో ప్రజా సొమ్ము ఆదా : సీతారామన్ కాగా పన్ను చెల్లింపుదారులు చెల్లించే డబ్బులు చక్కగా వినియోగించుకోవడానికి డిజిటల్ ప్రజా మౌలిక వసతులు (డీపీఐ) ఉపకరిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. భారత సర్కారు నేడు ఎన్నో రకాల ప్రయోజనాలను నేరుగా లబి్ధదారుల బ్యాంకు ఖాతాలకు అందించగలుగుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థలో డీపీఐ గొప్ప సమర్థతను తీసుకొచి్చందని, నిధులను మెరుగ్గా వినియోగించడం సాధ్యపడినట్టు తెలిపారు. డీపీఐని ప్రవేశపెట్టిన తర్వాత కేవలం ఒక రాష్ట్రంలోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో రూ.లక్ష కోట్లను ఆదా చేసినట్టు చెప్పారు. మహిళలకు ఇచి్చన రుణ ఖాతాల పనితీరు మెరుగ్గా ఉందన్నారు. నూతన గ్లోబల్ ఫైనాన్సింగ్ ఒప్పందం విషయమై ప్రస్తుతం నిర్మలా సీతారామన్ ప్యారిస్లో పర్యటిస్తున్నారు. -
అర్ధ వార్షిక పరీక్షలో భేష్!
జీ20 అధ్యక్ష స్థానాన్ని భారతదేశం చేపట్టి మే 31తో సరిగ్గా ఆరు నెలలు అయ్యింది. ఉక్రెయిన్ ఘర్షణ వల్ల సభ్యదేశాలు స్పష్టంగా చీలిపోవడంతో అధ్యక్ష బాధ్యత మరింత క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనూ భారత్ చక్కగా పనిచేసిందనే చెప్పాలి. అంతర్జాతీయ రంగంలో బాధ్యతాయుతమైన కీలక భాగస్వామిగా, ప్రస్తుత సవాళ్లను గుర్తించి స్పష్టంగా ప్రకటించడమే కాకుండా పరిష్కారాలను రూపొందించడంలో కూడా నాయకత్వం వహించింది. దీనిగురించే జీ20 యంత్రాంగం ఇంతవరకూ 120 సమావేశాలు నిర్వహించింది. అసలు సవాల్ ఏమిటంటే, సెప్టెంబర్లో ఢిల్లీలో జరగనున్న శిఖరాగ్ర సదస్సులో విభిన్నమైన పాత్రధారులతో ఘర్షణ పడటమే. అలాంటప్పుడు ‘ఢిల్లీ డిక్లరేషన్ ’పై ఒక ఏకాభిప్రాయ రూపకల్పన చేయగలరా? సంవత్సరం పాటు కొనసాగే భారత్ జీ20 (గ్రూప్ ఆఫ్ 20) అధ్యక్ష పదవి మే 31తో దాని మధ్య బిందువును దాటేసింది. అంటే దాని పదవీ కాలంలో ఆరు నెలలు గడిచిపోయాయి. సెప్టెంబర్ 9, 10 తేదీలలో ఢిల్లీలో జరగ నున్న శిఖరాగ్ర సదస్సుపై దృష్టి సారించడంతో తదుపరి సగం కాలం ఇప్పుడు ఆవిష్కృతమవుతుంది. జీ20 అధ్యక్షత గత పనితీరు, దాని అవకాశాలపై భావోద్వేగ రహితంగా మూల్యాంకనం చేసుకోవడానికి ఇదే సరైన తరుణం. భారత్ జీ20 అధ్యక్ష స్థానం... కోవిడ్ మహమ్మారి, ఆర్థిక మంద గమనం, పదునెక్కుతున్న భౌగోళిక, రాజకీయ పోటీ ప్రభావాన్ని అధిగమించలేకపోయింది. జీ20 దుర్బలత్వాన్ని బహిర్గతపర్చేలా, ఉక్రెయిన్ ఘర్షణ ద్వారా ప్రేరేపితమైన ధ్రువీకరణ కూడా దీనికి తోడయింది. తీవ్రమైన సవాళ్లతో పోరాడుతున్న సమయంలో ఈ గ్రూప్ చీలిపోయింది. అందుకే, జీ20 అధ్యక్ష బాధ్యత ఇప్పుడు మరింత క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో గ్రూపు కీలక లక్ష్యాలను పరిరక్షించుకోడానికి జీ20 అధ్యక్ష స్థానాన్ని సమతుల్యం చేయడంలో భారత్ చక్కగా పని చేసిందనే చెప్పాలి. మొదటగా, అంతర్జాతీయ రంగంలో బాధ్యతాయు తమైన కీలక భాగస్వామిగా, భారతదేశం ప్రస్తుత సవాళ్లను గుర్తించి స్పష్టంగా ప్రకటించడమే కాకుండా పరిష్కారాలను రూపొందించ డంలో కూడా నాయకత్వం వహించింది. దీనిగురించే జీ20 యంత్రాంగం ఇంతవరకూ 120 సమావేశాలు నిర్వహించింది. రాబోయే నెలలు మంత్రుల స్థాయిలో, చివరకు నాయకుల స్థాయిలో జరిగే చర్చలకు సాక్షీభూతంగా నిలుస్తాయి. రెండవది, భారతదేశ ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని, దాని వైవిధ్యం, విజయాలను, ప్రజాస్వామ్య నమూనాతో సాధించిన అభి వృద్ధి, రాజకీయ సుస్థిరత ఫలాలను, బలమైన నాయకత్వాన్ని, సమీకృత ఆర్థిక పురోగతిని ప్రదర్శించడమే లక్ష్యం. పర్యాటక రంగాన్ని, వాణిజ్యాన్ని, టెక్నాలజీని, ప్రపంచంతో పెట్టుబడి ఆధార సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భారత్కు ఇది ఉపకరిస్తుందన్న అంచనా దీని వెనుక ఉంది. మూడవది, ప్రపంచరంగంలో న్యూఢిల్లీ నాయకత్వ పాత్రను నొక్కి చెప్పడానికి మరింత సంక్లిష్టమైన ప్రేరణ ఉంది. పశ్చిమ దేశాలతో వ్యవహరించడంలో (తేడాలు ఉన్నప్పటికీ) భారత్ సౌకర్య వంతమైన దేశంగా ఉంటుందనీ, రష్యాతో, చివరకు చైనాతో కూడా (విభేదాలు కొనసాగుతున్నప్పటికీ) పొత్తులు నిర్వహిస్తుందనీ,ప్రపంచ దక్షిణ దేశాలకు సలహాదారుగా పనిచేస్తుందనీ ఇది చూపు తుంది. ఈ కత్తి మీద సాము చేయడానికి తెలివైన దౌత్యం, చురుకు దనం, సృజనాత్మకతతో పాటు కాస్త అదృష్టానికి చెందిన సమ్మేళనం కూడా అవసరం. ప్రభుత్వ, ప్రభుత్వేతర స్థాయిల్లో జరిగిన చర్చలతో సహా జీ20 సంబంధిత పరిణామాలకు భారత మీడియా విస్తృతంగా ప్రచారం కల్పించింది. ఈ క్రమంలో ప్రజలకు దీనిగురించి చక్కటి అవగాహన కలిగేలా చేసింది. అయితే అసలు సవాల్ ఏమిటంటే, సెప్టెంబర్లో ఢిల్లీలో జరగనున్న శిఖరాగ్ర సదస్సులో విభిన్నమైన పాత్రధారులతో ఘర్షణ పడటమే. ఈ ఢిల్లీ సదస్సు ఫలితాలను న్యాయబద్ధంగా అంచనా వేయడానికి ఏకాభిప్రాయం, జోడింపు, ఆచరణ అనే త్రిముఖ కోణా లను ఉపయోగించడం మంచిది. మొదటగా, భారతీయ అతి«థేయులు ఢిల్లీ శిఖరాగ్ర సదస్సు ముగింపులో ‘ఢిల్లీ డిక్లరేషన్ ’పై ఒక ఏకాభిప్రాయ రూపకల్పన చేయగలరా? లేదా మార్చి నెలలో 20 మంది విదేశాంగ మంత్రుల సమావేశంలో, ఉక్రెయిన్ సమస్యకు చెందిన పేరాలతో మిగిలిన 18 మంది సభ్యులతో కలిసి వెళ్లడానికి రష్యా, చైనాలు తిరస్కరించిన విధంగానే దీని ఫలితం ఉంటుందా? పైగా, ఢిల్లీలో జీ20 దేశాల నాయకులందరూ కనబడటంపై కూడా అనిశ్చితి నెలకొంది. నాయ కులు భౌతికంగా హాజరు కాలేకపోవడంతో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) ఢిల్లీలో సదస్సు నిర్వహణకు అశక్తత వ్యక్తం చేయడం దీన్ని మరింత పెంచింది. రెండు, జోడింపు అనేది ఢిల్లీ డిక్లరేషన్ ప్రతిపాదించే విషయాలను సూచిస్తుంది. మునుపటి సదస్సుకు సంబంధించిన ‘బాలి డిక్లరే షన్’తో పోల్చినప్పుడు, ఢిల్లీ సదస్సులో ప్రత్యేకించి ప్రపంచ పరిష్కారాలకు సంబంధించిన విషయాలు మరింత దృఢంగా, కొత్తగా ఉంటాయా? చివరగా, ప్రధాన ఒప్పందాల ఆచరణకు సంబంధించి: ఏకాభిప్రాయ ప్రాతిపదికన మాత్రమే నిర్ణయాలను అమలు చేయ డానికి రాజకీయ సంకల్పంతో కూడిన ఆచరణ జీ20ని ఒక సమర్థమైన నిర్దేశక కార్యాలయంగా చూపిస్తుందా లేక చర్చల దుకాణంగా మాత్రమే చూపుతుందా? బహువిధ ఆర్థిక వ్యవస్థల్లో సంస్కరణల కోసం నినాదాలు ఇస్తున్నట్టుగా, జీ20 తనను తాను కూడా సంస్కరించుకోగల సమర్థు రాలనే సూచన ఢిల్లీ సదస్సులో వెలువడవచ్చు. అలా అయితే తమ కొత్త సభ్యురాలిగా ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ)ను చేర్చుకోవడంలో కొంచెం కూడా సందేహం ఉండకూడదు. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విస్తరణ, ప్రజాస్వామికీకరణను వేగవంతం చేయడం కోసం పిలుపునిస్తుందా అన్నది కూడా ప్రత్యేక శ్రద్ధతో గమనించాల్సి ఉంది. చర్చల్లో పురోగతిని నమోదు చేయడానికి జీ20 అధ్యక్ష పదవి ప్రాధాన్యతలలో రెండు అంశాలు తప్పనిసరి. అవి వాతావరణం, శక్తి పరివర్తిత ఆర్థికం. వీటికి సంబంధించి జీ20 నిబద్ధత నిర్దిష్టంగా ఉండవచ్చు. దీనికి మరిన్ని జోడింపులు చేర్చవచ్చు. ప్రపంచంలో భారతీయ డిజిటల్ పబ్లిక్ గూడ్స్ (డీపీజీ) ప్రాసంగికతను నొక్కి చెప్పడంలో, భారత ప్రభుత్వం అసాధారణ క్రియాశీలతను ప్రదర్శించింది. కాబట్టి ఢిల్లీ సదస్సు తుది ప్రకటనలో ఒక బలమైన సూత్రీకరణ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ పరిధిలో సహకారం పొందడం కోసం బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్ వంటి ఎనిమిది అధ్యక్ష అతిథి దేశాలతో ద్వైపాక్షిక చర్చల దిశగా అధికారులు పని చేస్తే బాగుంటుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తితో, విమర్శకుల అభిప్రాయాలను, భిన్నా భిప్రాయాలను గమనించాలి. ఒక మాజీ సీనియర్ అధికారి ఇటీవల ప్రపంచం అంతర్జాతీయ ఘర్షణకు ‘ప్రమాదకరంగా దగ్గరవుతోంద’ని పేర్కొంటూ– జీ20, ‘ఎస్సీఓ’ శిఖరాగ్ర సదస్సుల నుంచి గరిష్ఠ ప్రయోజనాలు పొందాలన్న ఆశలను తగ్గించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. ప్రజాస్వామ్యం, వైవిధ్యం గురించిన అధికారిక సిద్ధాంతం దేశీయ రాజకీయాలకు అనుగుణంగా లేదని వాదిస్తూ ఒక సీనియర్ ప్రతిపక్ష నాయకుడు ‘జీ20 కపటత్వం’ గురించి మాట్లా డారు. ఇకపోతే మూడో విమర్శకుడు జీ20 పౌర సమాజ వేదిక హైజాక్ కావడం గురించి రాశారు. కొంతమంది విదేశీ పరిశీలకులు ‘థింక్20’ ప్రక్రియ గురించి ఫిర్యాదు చేశారు. భారతదేశ జీ20 అధ్యక్షతకు సంబంధించి బహుముఖ ప్రయాణ క్రమంలో కొన్ని చికాకులు సమానంగా ఉంటాయి. వస్తుగతంగా చెప్పాలంటే, జీ20 అధ్యక్ష పదవీకాలంలో భారత్ ఇప్పటివరకూ బాగా పనిచేసింది. ప్రత్యేకించి ప్రపంచంలో భారత్ పాత్ర గురించి విశ్వ వ్యాప్తంగా అపూర్వ సందడిని సృష్టించింది. శ్రద్ధ, దౌత్య చతురత, రాజకీయ దృష్టి, కాస్త అదృష్టంతో ఈ బిడారు విజయవంతంగా తన గమ్యాన్ని చేరుకోవాలి. భారతదేశానికీ, జీ20కీ గొప్ప కీర్తిని తెచ్చి పెట్టాలి. రాజీవ్ భాటియా వ్యాసకర్త మాజీ రాయబారి; డిస్టింగ్విష్డ్ ఫెలో, గేట్వే హౌజ్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
18 దేశాల్లో పేదల ఆకలి తీర్చిన భారత్
న్యూఢిల్లీ: పంచ ఆహార ప్ర వ్యవస్థల్లో సానుకూల మార్పులు తీసుకురాగల సామర్థ్యం భారత్కు ఉందని ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగమైన అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి(ఐఎఫ్ఏడీ) అధ్యక్షుడు అల్వారో లారియో ప్రశంసించారు. జీ20 దేశాల వ్యవసాయ శాఖ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు భారత్కు వచి్చన ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఆహార కొరత ఏర్పడిందని గుర్తుచేశారు. అలాంటి సమయంలో 18 దేశాలకు భారత్ 10.8 లక్షల టన్నుల గోధుమలను ఎగుమతి చేసిందని, పేద ప్రజల ఆకలి తీర్చిందని కొనియాడారు. ఇటీవలి కాలంలో తృణధాన్యాల సాగుకు భారత్ అధిక ప్రాధాన్యం వేస్తుండడం ప్రశంసనీయమని చెప్పారు. ఆహార ఉత్పత్తి విషయంలో భారత్ ప్రాధాన్యతలు, ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతలను పోలి ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో భారత్ సాధించిన నైపుణ్యం ‘గ్లోబల్ సౌత్’లోని ఇతర దేశాలకు సైతం ఉపకరిస్తుందని అల్వారో లారియో వివరించారు. వాతావరణ మార్పులు విపరీత ప్రభావం చూపిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో తృణధాన్యాల సాగు చేపట్టడం రైతులకు లాభదాయకమని సూచించారు. కరువులను తట్టుకొనే శక్తి తృణధాన్యాలకు ఉందన్నారు. పేదలకు పౌష్టికాహారం అందించాలంటే తృణధాన్యాలతోనే సాధ్యమని స్పష్టం చేశారు. -
కొత్త విభాగాల్లోకీ ఆడిట్ విస్తరణ
పంజిమ్: కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కొత్త విభాగాల్లోనూ ఆడిటింగ్ను పరిశీలిస్తోంది. నీడి అడుగున వెలికితీత కార్యకలాపాలకు సంబంధించి కూడా ఆడిటింగ్ చేయనున్నట్టు, మరిన్ని నివేదికలను విడుదల చేయాలని అనుకుంటున్నట్టు కాగ్ గిరీష్ చంద్ర ముర్ము చెప్పారు. జీ20 దేశాలతో కూడిన ఎస్ఐ20 మూడు రోజుల సమావేశం ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో కాగ్ గిరీష్ చంద్ర మాట్లాడారు. డేటా ప్రామాణీకరణ అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. దీనివల్ల ఆడిట్లను మరింత సులభంగా, వేగంగా చేయవచ్చన్నారు. ఇందుకు సంబంధించి ఆయా విభాగాలు, శాఖలతో సమావేశం కూడా నిర్వహించినట్టు చెప్పారు. ‘‘కొంత వరకు డేటా ప్రామాణీకరణ పట్ల అంగీకారం కుదిరింది. గతేడాదే పదేళ్ల రికార్డును అధిగమించాం. ఆడిట్ నివేదికలను మరిన్ని విడుదల చేస్తాం. డేటా ప్రాసెసింగ్, నివేదిక రూపకల్పన మరింత వేగాన్ని అందుకుంటుంది. నివేదికల రూపకల్పనలో పూర్తి స్థాయి డిజిటలైజేషన్ను (డిజిటల్ ఆడిట్లు) వినియోగించుకుంటాం’’అని గిరీష్ చంద్ర తెలిపారు. కాగ్ ఈ ఏడాది నుంచే డిటజిటల్ ఆడిట్ల విడుదలను ప్రారంభించడం గమనార్హం. వివిధ శాఖల పరిధిలో నిధుల కేటాయింపులు, వినియోగం పద్దులపై కాగ్ ఆడిటింగ్ చేసి, పార్లమెంటు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల ముందు నివేదికలను ఉంచుంతుంది. షిప్పింగ్, నీటి అడుగు నుంచి వెలికితీసే ఆయిల్ అండ్ గ్యాస్ తదితర నూతన విభాగాల్లోనూ ఆడిట్ చేయాలన్నది తమ ఉద్దేశమ్యని గిరీష్ చంద్ర చెప్పారు. కాగా, బ్లూ ఎకానమీ (సముద్రం ఆధారిత) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్పై ఈ సమావేశం చర్చించింది. -
అందరికీ నాణ్యమైన డేటా
న్యూఢిల్లీ: నాణ్యమైన డేటా ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని, ఈ విషయంలో సాంకేతిక ప్రజాస్వామీకరణ ఒక ముఖ్యమైన సాధనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. డేటాను అందించడంలో అంతరాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం వారణాసిలో జరిగిన జీ20 దేశాల డెవలప్మెంట్ మంత్రుల సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారత్లో డిజిటలీకరణ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందని, ఈ రంగంలో తమ అనుభవాన్ని భాగస్వామ్య దేశాలతో పంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అవసరంలో ఉన్నవారికి రుణాలు సులభంగా లభించేలా ఆర్థిక సంస్థల్లో సంస్కరణలు రావాలని ఆకాంక్షించారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, వనరుల సమర్థ కేటాయింపునకు, ప్రజలకు పాలనాపరమైన సేవలు మెరుగ్గా అందించడానికి అత్యంత నాణ్యమైన డేటా అవసరమని వివరించారు. ప్రజా సాధికారతకు, డేటాను ప్రజలకు అందించడానికి టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటున్నామని వెల్లడించారు. నగరాలు, పట్టణాలే కాదు, మారుమూల ప్రాంతాల్లో ఉండేవారికి సైతం నాణ్యమైన డేటాను అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి లక్ష్యాలు సాధిద్దాం కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వల్ల ప్రపంచ దేశాలు ఆర్థికాభివృద్ధిలో వెనుకంజ వేశాయని మోదీ గుర్తుచేశారు. అభివృద్ధి లక్ష్యాల సాధనకు కలిసికట్టుగా కృషి చేయడం మన బాధ్యత అని సూచించారు. మన ప్రయత్నాలనీ పారదర్శకంగా, సమగ్రంగా ఉండాలన్నారు. అభివృద్ధి లక్ష్యాల సాధనకు పెట్టుబడులు పెంచాలని చెప్పారు. చాలా దేశాలు అప్పుల ముప్పును ఎదుర్కొంటున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి మార్గాలు కనిపెట్టాలని పిలుపునిచ్చారు. భారత్లో వందకుపైగా లక్ష్యిత జిల్లాల్లో ప్రజల జీవనాన్ని మరింత మెరుగుపర్చడానికి చర్యలు చేపట్టామని ప్రధానమంత్రి వివరించారు. ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అవి ఇప్పుడు అభివృద్ధి ఉత్ప్రేరకాలుగా మారాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ డెవలప్మెంట్ మోడల్ను అధ్యయనం చేయాలని జీ20 దేశాల మంత్రులకు నరేంద్ర మోదీ సూచించారు. ప్రకృతిని ఆరాధించడం భారత్లో ఒక సంప్రదాయంగా వస్తోందన్నారు. వాతావరణ మార్పుల నియంత్రణకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. లింగ సమానత్వం, మహిళా సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేవారు. తమ దేశంలో మహిళా సాధికారతకు ఎలాంటి పరిమితులు లేవన్నారు. సమాజంలో మార్పునకు, ప్రగతికి మహిళలే సారథులని తేల్చిచెప్పారు. అభివృద్ధి ఎజెండాను వారే నిర్దేశిస్తారని అన్నారు. కాశీని సందర్శించండి ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి భారత్లో వారణాసి అత్యంత పురాతన నగరమని ప్రధాని మోదీ తెలియజేశారు. విజ్ఞానానికి, చర్చకు, సంవాదానికి, సంస్కృతికి, ఆధ్యాత్మికతకు వారణాసి కొన్ని శతాబ్దాలుగా ముఖ్యమైన కేంద్రంగా వెలుగొందుతోందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజల కలయికకు ఇదొక కూడలి అని చెప్పారు. భారత్లోని భిన్నమైన సంస్కృతి సంప్రదాయాలను ఇక్కడ చూడొచ్చని అన్నారు. సదస్సు జరిగే గదులకే పరిమితం కాకుండా కాశీ నగరాన్ని సందర్శించాలని, కాశీ స్ఫూర్తిని అనుభూతి చెందాలని జీ20 దేశాల మంత్రులకు మోదీ విజ్ఞప్తి చేశారు. గంగా హారతిని, సారనాథ్ను తిలకిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించే ప్రేరణ కచ్చితంగా లభిస్తుందని తెలిపారు. వారణాసి తన సొంత నియోజకవర్గమని తాను ఈ మాట చెప్పడం లేదని మోదీ వ్యాఖ్యానించారు. -
జీ20 సమ్మిట్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (ఫొటోలు)
-
వర్ధమాన దేశాలకు ‘అభివృద్ధి లక్ష్యాల’ నిధులు కావాలి
న్యూఢిల్లీ: సుస్థిర అభివృద్ధి సాధన లక్ష్యాల సాధన కోసం వర్ధమాన దేశాలకు దీర్ఘకాలికంగా నిధులు అవసరమని నీతి ఆయోగ్ మాజీ సీఈవో, జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందుకోసం కోపెన్హాగన్ ఒప్పందం ప్రకారం సంపన్న దేశాల నుంచి వర్ధమాన దేశాలకు నిధుల ప్రవాహం పెరగాలని పేర్కొన్నారు. జీ20 అధ్యక్ష హోదాలో కూటమిని మరింత సమ్మిళితంగా ఎలా చేయవచ్చు, ప్రపంచ ఎకానమీ వృద్ధికి ఎలా దోహదపడవచ్చు అనే అంశాలకు భారత్ ప్రాధాన్యత నిస్తోందని కాంత్ తెలిపారు. ఇదీ చదవండి: ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్ అనేక సవాళ్లు నెలకొన్నప్పటికీ డిజిటల్ చెల్లింపులు, డేటా ఎకానమీ తదితర విషయాల్లో భారత్ వేగంగా పురోగమి స్తోందని.. ఇతర దేశాలకూ ఈ మోడల్ ఉపయోగకరమైనదని ఆయన పేర్కొన్నారు. వాతావరణ వేడిమిని తగ్గించే లక్ష్యాలను సాధించే దిశగా ప్రపంచ దేశాలు చర్యలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కాంత్ చెప్పారు. పారిశ్రామికీకరణ క్రమంలో పాశ్చాత్య దేశాలే వాతావరణాన్ని భారీగా కలుషితం చేశాయని, ప్రస్తుత వాతావరణ సంక్షోభంలో వర్ధమాన దేశాల వాటా చాలా స్వల్పమేనని ఆయన తెలిపారు. కర్బన ఉద్గారాలతో ప్రపంచాన్ని ముంచెత్తకుండా పారిశ్రామిక బాటలో ముందుకు సాగే తొలి దేశాల జాబితాలో భారత్ కూడా ఉంటుందని కాంత్ చెప్పారు. (Dr.Vandana Lal Success Story: రూ. 3వేల కోట్ల నికర విలువతో రిచెస్ట్ విమెన్: ఆసక్తికర విషయాలు) మరిన్ని వార్తలు, అప్డేట్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
జీ20తో డిజిటల్ కృషిని ప్రపంచానికి చాటి చెప్తాం
న్యూఢిల్లీ: డిజిటల్ పరివర్తనలో భారత్ చేస్తున్న కృషిని జీ20 కార్యక్రమాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పనున్నట్లు నీతి ఆయోగ్ మాజీ సీఈవో, జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. తద్వారా గ్లోబల్ సౌత్ (లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, ఓషియానియా దేశాలు) ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తోడ్పాటు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 8వ జాతీయ నాయకత్వ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా 400 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపు లేదని, 250 కోట్ల మంది కనీసం బ్యాంకు ఖాతా కూడా లేదని కాంత్ చెప్పారు. 133 దేశాల్లో వేగవంతమైన డిజిటల్ చెల్లింపుల విధానాలు లేవని పేర్కొన్నారు. అలాంటిది, డిజిటైజేషన్ ద్వారా భారత్ ప్రజల జీవితాల్లో మార్పులు తేగలిగిందని, ఉత్పాదకత పెంచుకుని సమర్థమంతమైన ఆర్థిక వ్యవస్థగా ముందుకెడుతోందని కాంత్ చెప్పారు. డిజిటైజేషన్ డిజిటల్ చెల్లింపులు తదితర విభాగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరించారు. ‘భారత్ పాటిస్తున్న ఈ మోడల్ను మిగతా ప్రపంచం ముందుకు ఎలా తీసుకెళ్లాలన్నది ఒక సవాలు. భారత డిజిటల్ పరివర్తన గాధను ప్రపంచానికి పరిచయం చేసేందుకు జీ20 వేదికను ఉపయోగించు కుందాం. ఆ విధంగా గ్లోబల్ సౌత్ దేశాల పౌరుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం‘ అని కాంత్ పేర్కొన్నారు. -
విశాఖలో రెండో రోజు జీ-20 సదస్సు
సాక్షి, విశాఖపట్నం: గత రెండు రోజులుగా జీ-20 సదస్సులో భవిష్యత్ లో నగరాల అభివృద్ది, పెట్టుబడులనే అంశంపై 8 సెషన్స్ జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సోలమన్ ఆరోఖ్య రాజ్ తెలిపారు. ఈ అర్థవంతమైన చర్చల్లో 40 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. వారు చాలా విలువైన సలహాలు సూచనలు చేశారన్నారు. ఈ సూచనలను సదస్సులను రెండు నెలల పాటు అధ్యయనం చేసి జూన్లో జరిగే మూడో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్లో భవిష్యత్ నగరాల నిర్మాణంపై ఒక డాక్యుమెంటరీ తీసుకొస్తామన్నారు. సింగపూర్, దక్షిణ కొరియా నుంచి వచ్చే నిపుణులచే చివరి రోజు విద్యార్థులు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లకు శిక్షణా తరగతులు వుంటాయన్నారు. ఇదీ చదవండి: వైజాగ్లో జీ20 ప్రతినిధులు మెచ్చినవేంటో తెలుసా? -
ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి భారత్తో కలిసి పని చేస్తాం
వాషింగ్టన్: జీ20 సదస్సు ఆతిథ్య దేశంగా భారత్ ప్రత్యేకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అమెరికా అభిప్రాయపడింది. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించడానికి రష్యాతో తనకున్న చిరకాల సత్సంబంధాలను భారత్ వినియోగించుకోవాలని చెప్పింది. ఈ సంక్షోభాన్ని వీలైనంత త్వరగా ముగించడానికి తాము కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. జీ20 విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం ఉక్రెయిన్ యుద్ధంపై ఏకాభిప్రాయానికి రావడంలో విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకరులతో మాట్లాడుతూ జీ20 సదస్సు ప్రారంభమయ్యే లోపు ఉక్రెయిన్ యుద్ధంపై ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని ఆశిస్తున్నట్టుగా తెలిపారు. ఇందుకోసం విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ ఒక దారి చూపించిందని ఈ ఏడాది కాలంలో ఇంకా చేయాల్సింది చాలా ఉందని అన్నారు. -
ఎకానమీ సవాళ్లను పరిష్కరించాలి!
బెంగళూరు: అంతర్జాతీయ ఆర్థిక అవుట్లుక్ ఇటీవలి నెలల్లో మెరుగుపడినప్పటికీ, అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. గ్లోబల్ ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంపై జీ20 దేశాలు దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న రుణ సమస్యలు, ఆర్థిక స్థిరత్వానికి ఎదురవుతున్న సవాళ్లను దృఢ సంకల్పంతో పరిష్కరించాలని కూడా జీ20 దేశాలకు పిలుపునిచ్చారు. జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్ఎంసీబీసీ) ప్రారంభ సమావేశంలో దాస్ చేసిన ప్రసంగ ముఖ్యాంశాలు.. ► ప్రపంచం తీవ్ర మాంద్యం నుండి తప్పించుకోవచ్చని, వృద్ధి మందగమనం లేదా అంతగా తీవ్రత లేని మాంద్యం పరిస్థితులే సంభవించవచ్చని ఇప్పుడు గొప్ప ఆశావాదం ఉంది. అయితే, ఇంకా అనిశ్చిత పరిస్థితులు మన ముందు ఉన్నాయి. ►మధ్యస్థంగా, దీర్ఘకాలికంగా మనం ఎదుర్కొంటున్న సవాళ్లను మనం కలిసికట్టుగా దృఢంగా పరిష్కరించాలి. ఆర్థిక స్థిరత్వానికి సవాళ్లు, రుణ ఇబ్బందులు, క్లైమాట్ ఫైనాన్స్, వాణిజ్య రంగంలో పరస్పర సహకారం లోపించడం, గ్లోబల్ సరఫరాల సమస్యలు ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. పటిష్ట ప్రపంచ ఆర్థిక సహకారంతో ప్రపంచ వృద్ధి విస్తృత స్థాయిలో మెరుగుపరచడం సాధ్యమవుతుంది. ► జీ20 గ్రూప్ ప్రస్తుతం పరివర్తన దిశలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి జీ20 ఒక బహుపాక్షిక ఫోరమ్గా అచంచలమైన విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది. -
G20 ministerial meeting: క్రిప్టోల కట్టడికి అంతర్జాతీయ విధానం అవసరం
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలను కట్టడి చేసేందుకు అంతర్జాతీయ విధానం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే అంతర్జాతీయ రుణ సమస్యలను ఎదుర్కొనేందుకు, బహుళపక్ష అభివృద్ధి బ్యాంకులను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. జీ20 మంత్రుల సమావేశానికి ముందు అమెరికా, జపాన్, స్పెయిన్ తదితర దేశాల ఆర్థిక మంత్రులతో ఆమె ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇందులో పలు అంశాలు చర్చించారు. శుక్రవారం నుంచి 2 రోజుల పాటు జరిగే జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్ఎంసీబీజీ) సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నేతలు భారత్ వచ్చారు. ఈ సందర్భంగా అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ యెలెన్, జపాన్ ఫైనాన్స్ మినిస్టర్ షునిచి సుజుకీ తదితరులతో సీతారామన్ భేటీ అయ్యారు. సార్వభౌమ రుణాల పునర్వ్యవస్థీకరణలో భారత్ కీలక పాత్ర పోషిస్తుండటంపై యెలెన్ అభినందించినట్లు అమెరికా ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. (ఇదీ చదవండి: Layoffs: మెటాలో మళ్లీ లేఆఫ్స్! నిజమేనా?) -
28న హైదరాబాద్లో స్టార్టప్ 20–గ్రూప్ సమావేశం
న్యూఢిల్లీ: జీ20కి భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో జనవరి 28న హైదరాబాద్లో స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ఆరంభ సమావేశం జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ భేటీలో ఎంట్రప్రెన్యూర్షిప్, నవకల్పనలకు సంబంధించి విధానపరంగా తీసుకోతగిన చర్యల గురించి చర్చించనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో జీ20 దేశాలకు చెందిన ప్రతినిధులు, అబ్జర్వర్ దేశాల నుంచి తొమ్మిది మంది ప్రత్యేక ఆహ్వానితులు, బహుళపక్ష సంస్థలు .. దేశీ స్టార్టప్ వ్యవస్థ ప్రతినిధులు పలు వురు పాల్గొంటారని వివరించింది. స్టార్టప్20 సదస్సు కార్యక్రమం జూలై 3న జరుగుతుందని పేర్కొంది. మరోవైపు, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థ అయిన భార త్ .. వినూత్న అంకుర సంస్థలకు తోడ్పాటునివ్వడంలో సారథ్యం వహించగలదని స్టార్టప్20 ఇండియా చైర్ చింతన్ వైష్ణవ్ పేర్కొన్నారు. -
జాతీయత కొరవడిన పార్టీ.. స్వార్థ ప్రయోజనానికే పెద్దపీట
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ సారథ్యంలో అప్రతిహతంగా పురోగమిస్తున్న భారత్ కీర్తి బావుటా విశ్వ వినీలాకాశంలో ఇప్పుడు మరింత పైఎత్తున ఎగురుతోంది. మొట్ట మొదటి సారిగా జీ–20 అధ్యక్ష హోదా చేపట్టి విశ్వవేదికపై తన సత్తాను భారత్ మరో మారు చాటి చెప్పింది. ఐరోపా యూనియన్ సహా 19 దేశాలు సభ్యులుగా ఉన్న గొప్ప వేదిక ఇది. ప్రపంచ జీడీపీలో 90 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 80 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు జీ–20 దేశాలవే. ప్రపంచ ఆర్థిక వ్యవహారాల్లో జీ–20 పాత్ర ఏమిటో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇతర దేశాల తలరాతను శాసిస్తూ లాభార్జనే ధ్యేయమైన రెండు ఆర్థిక నమూనాలు ఇప్పుడు ప్రపంచంలో కొనసాగుతున్నాయి. ఆధిపత్యం చలాయిస్తూనే తమ ఉత్పత్తులతో విదేశా లను ముంచెత్తే పాశ్చాత్య నమూనా ఒక వైపు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలకు అప్పుల వలవేసి దివాలా తీయించే చైనా నయా వలసవాద నమూనా మరొక వైపు ఉన్నాయి. దీనికి పూర్తి భిన్నంగా విశ్వ మానవ సౌభ్రాతృత్వ స్ఫూర్తితో భారత్ ముందుకు సాగుతోంది. కోవిడ్ కష్ట కాలంలో ప్రపంచాన్ని భారత్ ఆదుకున్న తీరే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇటువంటి భారత్ జీ–20కి నాయకత్వ స్థానంలో ఉండి చేయగలిగింది ఎంతో ఉంది. డిసెంబర్ ఒకటో తేదీన జీ–20 అధ్యక్ష హోదా స్వీకరించిన భారత్, వచ్చే 12 నెలల కాలంలో దేశవ్యాప్తంగా 200 పైగా సమావేశాలు నిర్వ హించాలని నిశ్చయించింది. అందుకోసం రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు డిసెంబర్ 5న ఒక సన్నాహక సమావేశానికి కేంద్రం ఆహ్వానం పలికింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్ సహా దాదాపు అన్ని పార్టీల అధ్యక్షులు హాజరైన ఆ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం డుమ్మా కొట్టారు. దేశాన్ని ఉద్ధరిస్తానని ‘భారాసా’గా పేరు మార్చుకున్న తెరాస అధ్యక్షుడు యావత్ దేశానికి గర్వకారణమైన ఒక కీలక సమావేశాన్ని బహిష్కరించి దేశం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాల విషయంలో ఆ పార్టీ నిబద్ధత ఏ పాటిదో ఆదిలోనే అర్థమయ్యింది. దేశ హితం కన్నా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనానికే పెద్దపీట వేయడం ఇందుకు కారణం. వచ్చే ఏడాది సెప్టెంబర్లో జరగనున్న జీ–20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి వ్యూహాలపై చర్చలు జరిపేందుకు, సూచనలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరుకాని కేసీఆర్, అందుకు కారణాలేమిటో చెప్పగలరా? సొంత లాభాపేక్షే తప్ప తెలంగాణ ప్రజానీకం బాగోగుల గురించి ఆయనకు ఏమాత్రం పట్టింపులేదని దీనివల్ల స్పష్టంగా తెలియడం లేదా? కేంద్ర ప్రభుత్వం ఆయనను ఆహ్వానించినప్పటికీ, సమావేశానికి కావాలనే హాజరు కాకపోవడం... జాతీయ రాజకీయాల్లో కీలక, క్రియాశీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్కు ఎంత మాత్రం తగని పని. జాతీయ రాజకీయాల్లో రాణించడానికి కావలసిన కలుపుగోలుతనం ఇదేనా? చారిత్రక అవకాశాలను ఇలా చేజేతులా వదిలేసుకోవడం కేసీఆర్కు అలవాటైన పనే. జీ–20 సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వాల ముందు అనేక అవకాశాల తలుపులు తెరవబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి తమ రాష్ట్రాల్లో తాజా పెట్టుబడులకు బాటలు వేయడానికి మంచి అవకాశం లభిస్తోంది. తెలంగాణకు చెందిన అనేకమంది సౌదీ అరేబియాలో ప్రవాసం ఉంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో దౌత్య కార్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా సౌదీ అరేబియాను తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి సౌదీ అరేబియా రాజకీయ నాయకత్వంతో చర్చలు జరిపి సానుకూల ఫలితం రాట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ వేదికను ఉపయోగించుకునే అవకాశం ఉంది. జీ –20 అధ్యక్ష హోదా భారత్కు దక్కడంతో ఎంతో స్ఫూర్తి పొందిన సిరిసిల్ల పట్టణానికి చెందిన హరిప్రసాద్, స్వయంగా జీ–20 లోగో నేసి ప్రధానమంత్రికి పంపించారు. హరిప్రసాద్ వంటి వారి నుంచి స్ఫూర్తి పొంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ హితం కోసం కాకపోయినా.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానైనా కేంద్రంతో కలిసి ముందడుగు వేస్తారా? (క్లిక్ చేయండి: సందేహాలు తీరకుండా చర్యలెలా?) - కిశోర్ పోరెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి -
CM Jagan: జీ20 అఖిలపక్ష సమావేశానికి సీఎం జగన్
సాక్షి, అమరావతి: భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ20 దేశాల సదస్సును విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. డిసెంబర్ 5న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న గ్రూప్ ఆఫ్ ట్వంటీ (జీ 20) దేశాలకు 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు భారత్ నేతృత్వం వహించనుంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 32 రంగాలకు సంబంధించి వివిధ నగరాల్లో 200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు. భారతదేశం నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశాలను విజయవంతం చేయడం ద్వారా దేశ సత్తాను ప్రపంచానికి తెలియచేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. ప్రపంచ జీడీపీలో 90 శాతం, వ్యాపారంలో 80 శాతం, జనాభాలో మూడింట రెండొంతుల వాటా ఈ దేశాలదే. ఈ దేశాలు కలిసి పని చేయడం ద్వారా ప్రపంచ ఆరి్థక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ సుస్థిరమైన వృద్ధిని సాధించడమే ఈ సమావేశాల లక్ష్యం. చదవండి: (Yanamala Brothers: నాలుగు దశాబ్దాల చరిత్ర చెబుతున్నది ఇదే) -
భారతీయులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన సునాక్!
UK-India Young Professionals Scheme: ఇండోనేషియాలో బాలి వేదికగా జరుగుతున్న జీ20 తొలిరోజు సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాసేపు ఇరువురు నేతలు ముచ్చంటించారు. అదీగాక సునాక్ ప్రధాని అయ్యాక వారివురు భేటీ అవ్వడం ఇదే తొలిసారి. సమావేశం అనంతరం యూకే ప్రధాని భారత్కి ఒక పెద్ద వీసా స్కీం ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు యూకేలో ఉండి, పనిచేసేలా భారత యువ నిపుణలు కోసం ప్రతి ఏడాది సుమారు 3 వేల వీసాలకు అనుమతిస్తున్నట్లు బ్రిటన్ కార్యాలయం పేర్కొంది. గతేడాది అంగీకరించిన యూకే భారత్ స్వేచ్ఛ వలసల ఒప్పంద(మొబిలిటీ అండ్ మైగ్రేషన్ అగ్రిమెంట్) భాగస్వామ్యన్ని గురించి నొక్కి చెబుతూ ఇటువంటి పథకం కింద ప్రయోజనం పొందిన మొదటి దేశం భారత్ అని బ్రిటన్ ప్రభుత్వ పేర్కొంది. ఈ మేరకు ధృవీకరించిన యూకే యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద 18 నుంచి 30 ఏళ్ల వయసు కలిగి, డిగ్రీ చదివిన భారతీయ పౌరులు రెండేళ్ల వరకు యూకేలో ఉండి, పనిచేయడం కోసం 3 వేల వీసాలకు అనుమతిచ్చింది బ్రిటన్. ఈ పథకం ద్వారా భారత్ బ్రిటన్ల ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడం తోపాటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సంబంధాలు ఏర్పడటానికి ఉపకరిస్తుందని యూకే ప్రధాని డౌన్ స్ట్రీట్ కార్యాలయం పేర్కొంది. అలాగే ఇండో ఫసిఫిక్ ప్రాంతాల్లో దాదాపు అన్ని దేశాల కంటే యూకే భారత్తోనే ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపింది. అంతేగాక బ్రిటన్లో అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు నాలుగింట ఒక వంతు భారత్కి చెందిన వారు ఉన్నారని అందువల్ల యూకేలోని భారత్ పెట్టుబడితో యూకే అంతటా వారికి సుమారు 9,500 ఉద్యోగాలకు మద్దతు ఇస్తోందని చెప్పింది. ప్రస్తుతం యూకే భారత్తో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నట్లు బ్రిటన్ వెల్లడించింది. ఒకవేళ ఈ ఒప్పందం ఖరారు అయితే యూరోపియన్ దేశంతో జరుపుకున్న తొలి ఒప్పందం అవుతుందని పేర్కొంది. అదిగాక ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న దాదాపు 24 బిలయిన్ పౌండ్ల వాణిజ్య సంబంధాలను ఈ ఒప్పందం మరింత బలపరుస్తుందని చెప్పింది. అభివృద్ధి చెందుతున్న దేశం అయిన భారత్ ఈ ఆర్థిక అవకాశాలను వినియోగించుకునేలా బ్రిటన్తో వాణిజ్య ఒప్పందాలను కొనసాగించాలని బ్రిటన్ ఆకాంక్షిస్తోంది. భారత్తో మొబిటిటీ(స్వేచ్ఛ) భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేలా ఇమ్మిగ్రేషన్ నేరస్తులను తొలగించే సామర్థ్యాన్ని కూడా పటిష్టం చేసుకుంటున్నట్లు బ్రిటీష్ ప్రభుత్వం పేర్కొంది. The British government said that India is the first visa-national country to benefit from such a scheme, highlighting the strength of the UK-India Migration and Mobility Partnership agreed last year.@RishiSunak #UK #India #Visa https://t.co/VWRRWoRvoh pic.twitter.com/oDN1B6jULH — Khaleej Times (@khaleejtimes) November 16, 2022 (చదవండి: జీ20: బైడెన్తో మీట్.. సునాక్తో ముచ్చట్లు.. ఆయనతో షేక్హ్యాండ్) -
చర్చల ప్రసక్తే లేదు...తెగేసి చెప్పిన జెలెన్స్కీ
ఇండోనేషియా బాలిలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకి వీడియో సమావేశంలో హాజరైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యుద్ధం ముగించేందుకు రష్యాతో ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు. అలాగే మిన్స్క్ 3 ఒప్పందాన్ని కూడా తోసి పుచ్చారు. పైగా రష్యా ఒప్పందం అంటూనే ఉల్లంఘిస్తూ.. ఉంటుందన్నారు. ఇది తూర్పు డోన్బాస్ ప్రాంతంలో కీవ్ మాస్కోల మధ్య విఫలమైన ఒప్పందానికి ఒక ఉదాహరణ అని జెలెన్స్కీ అన్నారు. "రష్యా బలగాలు కీవ్లో దారుణమైన బీభత్సం సృష్టించాయి. ప్రపంచ అస్థిరతతో ఆటలాడింది, ఎన్ని విధాలుగా చెప్పిన వినలేదు అందువల్ల తాము రష్యాతో చర్చలకు ఇష్టపడటం లేదు. అయినా ఒప్పందం జరిగిన వెంటనే ఉల్లంఘించడం రష్యాకు ఒక అలవాటు అని విమర్శించారు." వాస్తవానికి రష్యా మద్దతుగల వేర్పాటువాదులు, కీవ్ మధ్య యుద్ధ విరమణ కోసం జర్మనీ, ఫ్రాన్స్ 2014, 2015లలో మొదటిసారిగా మిన్స్క్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆ తర్వాత ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ రష్యా, ఉక్రెయిన్ దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. అదీగాక ఇటీవలకాలంలో ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు తక్కువగానే సాగాయి. జెలెన్స్కీ కూడా రష్యాతో చర్చించేందుకు విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. (చదవండి: పది, అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే.. మదర్ హీరోయిన్ అవార్డు!) -
సమయానికి దక్కిన సదవకాశం
ఇప్పటికీ వెంటాడుతున్న కరోనా కష్టాలు... పెరుగుతున్న భౌగోళిక– రాజకీయ ఉద్రిక్తతలు... అంతూపొంతూ లేని రష్యా – ఉక్రెయిన్ యుద్ధం... పెరుగుతున్న చైనా దూకుడు... ప్రపంచం సంక్షోభాలతో నిండిన సంధికాలమిది. ఈ సమయంలో అందివచ్చిన అవకాశమంటే ఇదే. అంతర్జా తీయ ఆర్థిక సహకారంలో కీలకమైన 20 దేశాల కూటమి ‘జీ20’కి ఏడాది పాటు భారత్ పగ్గాలు చేపట్టనుంది. తొలిసారి దక్కిన పట్టం సంతోషదాయకమే కాక ప్రపంచపటంపై అవిస్మరణీయ నేతగా ఎదుగుతున్న మన సత్తాను చాటేందుకు సరైన సందర్భం. ఏడాదిగా ఇండోనేసియా, ఇప్పుడు ఇండియా, తర్వాత బ్రెజిల్ – మూడు ప్రవర్ధమాన ఆర్థిక వ్యవస్థలు 2022 నుంచి 2024 దాకా జీ20కి సారథ్యం వహిస్తుండడం విశేషం. గ్లోబల్ సౌత్ దేశాల ఆందోళనలను తీర్చడానికి ఇది సదవకాశం. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన ఈ 20 దేశాల కూటమి 1999లో ఏర్పడింది. భారత్తో పాటు చైనా, అమెరికా, రష్యా, బ్రిటన్, ఐరోపా సమాజం, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, సౌదీ అరేబియా, సౌతాఫ్రికా, టర్కీలు దీనిలో సభ్యదేశాలు. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది ఈ దేశాల ప్రజలే. ప్రపంచ భూభాగంలో 50 శాతం ఈ దేశాల కిందకే వస్తుంది. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 80 శాతానికి పైగా ఈ దేశాల వాటాయే. అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం వీటిదే. జీ20 కీలకమనేది అందుకే. 2008లో ఆర్థిక మాంద్యం తర్వాత నుంచి ఈ దేశాలు ఏటా సమావేశమవుతూ, వంతుల వారీగా అధ్యక్ష బాధ్యతలు వహిస్తున్నాయి. చర్చల ద్వారా ప్రపంచ ఆర్థిక, అభివృద్ధి ప్రాధాన్యాలను తీర్చిదిద్దే పనిని శక్తిమంతమైన ఈ అంతర్జాతీయ వేదిక భుజానికి ఎత్తుకుంది. అలాగే, వర్తమాన సంక్షోభాలకు పరిష్కారాల దిశగా ప్రయత్నిస్తుంది. ఈ కీలక కూటమికి ఈ డిసెంబర్ 1 నుంచి ఏడాది పాటు భారత్ అధ్యక్షత వహించనుంది. జీ20 భారత సారథ్యానికి సంబంధించి ప్రధాని మోదీ కమలం చిహ్నాన్నీ, ‘వసుధైవ కుటుం బకం’ అంటూ ‘ఒకే పుడమి, ఒకే కుటుంబం, ఒకటే భవిత’ అనే ఇతివృత్తాన్నీ, ప్రత్యేక వెబ్సైట్నూ మంగళవారం ఆవిష్కరించారు. బీజేపీ ఎన్నికల చిహ్నమైన కమలాన్ని పోలి ఉంటూ, అదే కాషాయ, హరిత వర్ణాలతో ఆ లోగో ఉండడం సహజంగానే ప్రతిపక్షాల విమర్శలకు గురవుతోంది. అది జాతీయ పుష్పమైన కమలమనీ, ఆశావహ దృక్పథానికి గుర్తుగా పెట్టామనీ పాలక వర్గాలు ఎంత సమర్థించుకోవాలని చూస్తున్నా, వాడిన రంగులతో సహా అనేక అంశాల్లో విమర్శలకు తావివ్వకుండా ఉండాల్సింది. కరోనా టీకా సర్టిఫికెట్లపై ఫోటో ప్రచారం, పార్లమెంట్పై ఉగ్రసింహాల చిహ్నం లాంటివి ఒక స్థాయికే పరిమితం. కానీ, ప్రపంచవేదికపై దేశ ప్రతిష్ఠను నిలపాల్సిన వేళ చిల్లర రాజకీయాలకు చోటివ్వకపోవడమే ఎవరికైనా శోభస్కరం. నిత్యం మాటల మార్కెటింగ్ కన్నా, నిజానికి జీ20 సారథిగా భారత్కు చేయడానికి చాలా పని ఉంది. స్వీయ అధ్యక్షతన దాదాపు 32 రంగాలపై జరిగే 200 సమావేశాలకు స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోవడం కీలకం. ఈ డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది నవంబర్ 30 వరకు జీ20 సారథిగా దక్కిన అవకాశాన్ని భారత్ పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం జీ20కి నేతృత్వం వహిస్తున్న ఇండోనేసియా ప్రపంచ ఆరోగ్య నిర్మాణ వ్యవస్థ, డిజిటల్ రూపాంతరీకరణ, సుస్థిర ఇంధన మార్పు అనే మూడింటిని ప్రాధాన్యాలుగా ఎంచుకుంది. రేపు ఆ దేశం నుంచి పగ్గాలు అందుకొనే భారత్ ఆ ప్రాధాన్యాలను కొనసాగేలా చూడాలి. పర్యావరణ పరిరక్షణకు కార్యాచరణ, ఇంధన భద్రత, మరింత పటిష్ఠమైన ప్రజారోగ్య వ్యవస్థలు, ప్రజా శ్రేయానికి సాంకేతిక విజ్ఞానం, 2030 నాటికి నిర్దేశించుకున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీల)పై దృష్టి పెట్టాలి. నిర్మాణాత్మకమైన నాయకత్వం అందించాలి. ముఖ్యంగా నవోదయ, పేద దేశాలకు అనుకూల అజెండాను నిర్ణయించేలా తన అధ్యక్ష హోదాను వినియోగించాలి. ప్రత్యేకించి, వ్యవసాయం, ఆహార సబ్సిడీల్లో వర్ధమాన దేశాలకు వ్యతిరేకంగా దీర్ఘకాలంగా ఉన్న వ్యత్యాసాలను సరిదిద్దడానికీ భారత్కు ఇదే సువర్ణావకాశం. జీ20లోని అభివృద్ధి చెందిన దేశాలు సాధారణంగా సబ్సిడీ లాంటి అంశాలపై వర్ధమాన దేశాల్ని ఇరుకునపెడుతుంటాయి. భారత్ వాటికి తమ స్వస్వరూపం తెలిసేలా వాస్తవ దర్పణం చూపాలి. వాతావరణ మార్పు ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతున్న నేపథ్యంలో కర్బన ఉద్గారాలు, పునరుద్ధ రణీయ ఇంధనం విషయంలో పెట్టుకున్న లక్ష్యాలకు కట్టుబడి ఉండేలా, వర్ధమాన ప్రపంచానికి ఇచ్చిన హామీలను నెరవేర్చేలా అభివృద్ధి చెందిన దేశాలపై భారత్ ఒత్తిడి తేవాలి. అలాగే, రష్యా, ఉక్రెయిన్ల యుద్ధం ముగిసేలా మధ్యవర్తిత్వ పాత్ర పోషించవచ్చు. ‘నాటో’లో ఉక్రెయిన్ సభ్యత్వ అంశాన్ని ప్రస్తుతానికి ఆపమంటూ పాశ్చాత్య ప్రపంచాన్ని కోరాలి. సేనల్ని ఉప సంహరించుకొని, దౌత్యమార్గంలో సమస్యల్ని పరిష్కరించుకొనేలా రష్యాను అభ్యర్థించాలి. ఇటు రష్యాతో, అటు పాశ్చాత్య ప్రపంచంతో బలమైన సంబంధాలున్న మన దేశం అలా ప్రస్తుత ప్రతిష్టం భనను తొలగించేందుకు తోడ్పడాలి. తాజాగా తన రష్యా సహచరుడితో భేటీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నట్టు ప్రపంచం ఇప్పుడు బహుళ ధ్రువమవుతూ, కొత్త సమతూకం సాధించే దిశగా నడుస్తోంది. ఈ కీలకవేళ జీ20తో పాటు వచ్చే ఏడాది షాంఘై సహకార సంఘం (ఎస్సీఓ) సారథ్యమూ చేపట్టనున్న భారత్ ప్రపంచపటంపై కొత్త చరిత్ర లిఖిస్తే అంతకన్నా ఇంకేం కావాలి! -
సంపన్న దేశాల చర్యల ప్రతికూలతలపై చర్చ
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో జరుగుతున్న పరిణామాలు, తీసుకుంటున్న చర్యల వల్ల ఏర్పడుతున్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనడానికి సమిష్టి ప్రయత్నాలపై భారతదేశం జీ20 వేదికగా దృష్టి సారిస్తుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అలాగే క్రిప్టో అసెట్స్పై ప్రపంచవ్యాప్త నియంత్రణపై భారత్ తగిన ప్రయత్నం చేస్తుందన్నారు. ఉగ్రవాదానికి నిధులు నిలిపివేతలో ఈ చర్య ఎంతగానో దోహపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుత్లో ఏ ఒక్క దేశమో క్రిప్టో ఆస్తులను నియంత్రించజాలదని ఇక్కడ జరిగిన ఐసీఆర్ఐఈఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్) జీ20 (14వ వార్షిక అంతర్జాతీయ) సమావేశంలో స్పష్టం చేశారు. డిసెంబర్ నుంచి భారత్ నేతృత్వం నేపథ్యం భౌగోళిక ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, వడ్డీరేట్ల పెంపు, డిమాండ్ మందగమనం వంటి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్ డిసెంబర్ 1వ తేదీ నుంచి జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను ఇండొనేషియా నుంచి స్వీకరించనుంది. 2023 నవంబర్ 30 వరకూ నిర్వహించే ఈ బాధ్యతల సమయంలో భారత్ ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టనుందని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. జీ20 దేశాల్లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో ఈ దేశాల వాటా 85 శాతంకాగా, అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం. ప్రపంచంలో మూడింట రెండవంతు (దాదాపు 70 శాతం) జనాభాకు ఈ దేశాలే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. జీ20కి సంబంధించి ఐసీఆర్ఐఈఆర్ మంగళవారం నిర్వహించిన సమవేశంలో ఆర్థికమంత్రి ప్రసంగించారు. రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు బెడిసికొట్టాయా అన్న ప్రశ్నకు ఈ సందర్భంగా ఆర్థికమంత్రి సమాధానం చెబుతూ, భారత్ అధ్యక్షతన జీ20లో ఇదీ ఒక చర్చనీయాంశంగా ఉండే అవకాశం ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల మందగమన పరిస్థితుల వల్ల ప్రపంచ వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతున్న సంగతి తెలిసిందే. 2021లో ప్రపంచ వృద్ధి 6 శాతం ఉంటే, 2022లో ఇది 3.2 శాతానికి పడిపోతుందనిఅంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ అంచనావేసింది. 2023లో ఈ రేటు మరింతగా 2.7 శాతానికి పడిపోతుందని అవుట్లుక్ అంచనావేసింది ఇక ప్రపంచ వస్తు వాణిజ్యం నడుస్తున్న 2022వ సంవత్సరంలో మెరుగ్గాఉన్నా.. 2023లో పరిస్థితి అస్సలు బాగోలేదని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఇటీవల తన తాజా నివేదికలో పేర్కొంది. 2022లో ప్రపంచ వస్తు వాణిజ్య వృద్ధి రేటును గత ఏప్రిల్ నాటి అంచనాలకన్నా ఎక్కువగా తాజాగా 3 శాతం నుంచి 3.5 శాతానికి సవరించింది. 2023లో వృద్ధి రేటు అంచనాను మాత్రం 3.4 శాతం నుంచి భారీగా ఒక శాతానికి తగ్గించింది. ఎగుమతులను భారీగా పెంచుకోవాలని చూస్తున్న భారత్సహా పలు వర్థమాన దేశాలకు డబ్ల్యూటీఓ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీఆర్ఐఈఆర్ సమావేశంలో నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు.. ► జీ20 ప్రెసిడెన్సీ బాధ్యతలుగా భారత్ ఎనిమిది అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ప్రపంచబ్యాంక్, ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సహా బహుళజాతి బ్యాంకింగ్ సంస్థల్లో సంస్కరణలు, ఆహార, ఇంధన భద్రతలు ఇందులో ప్రధానమైనవి. ► ముఖ్యంగా ఐఎంఎఫ్ కోటాల 16వ సాధారణ సమీక్ష (జీఆర్క్యూ) సకాలంలో ముగించాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేస్తోంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది ఎంతో అవసరమని భారత్ ఉద్ఘాటిస్తోంది. ► ఐఎంఎఫ్ కోటా వ్యవస్థ బహుళజాతి రుణ సంస్థలో దేశాల ఓటింగ్ షేర్కు సంబంధించిన అంశం. ప్రస్తుతం ఐఎంఎఫ్లో భారతదేశ కోటా 2.75 శాతం. చైనా కోటా 6.4 శాతం కాగా, అమెరికా కోటా 17.43 శాతం. ఐఎంఎఫ్ తీర్మానం ప్రకారం, కోటాలకు సంబంధించి 16వ సాధారణ సమీక్ష 2023 డిసెంబర్ 15వ తేదీలోపు ముగియాలి. వర్థమాన దేశాల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యత లభించేలా కోటా షేర్లలో సర్దుబాటు జరగాలని, వాటి ఓటింగ్ హక్కులు పెరగాల్సిన అవసరం ఉందని భారత్ డిమాండ్ చేస్తోంది. ► భారత్ ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోల్చే కోణంలో చాలా పటిష్టంగా ఉంది. దేశ ఆర్థిక మూలాధారాలు బాగానే ఉన్నాయి. ► అయితే అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందిన దేశాలలో జరిగే అనూహ్య, అసాధారణ పరిణామాలకు ప్రభావితం అవుతున్నాయి. దీనిపై ప్రధానంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ► అభివృద్ధి చెందుతున్న, మధ్య–దిగువ స్థాయి ఆదాయ దేశాలు ఎదుర్కొంటున్న ప్రతికూలతపై జీ20 వేదికగా భారత్ తన వాదనలను వినిపిస్తుంది. ఆర్థిక ఒడిదుడుకులు కూడా.. జీ20 దేశాలకు అధ్యక్ష బాధ్యతల్లో క్రిప్టో కరెన్సీ ఆస్తుల నియంత్రణతోపాటు, ద్రవ్యోల్బణం తత్సబంధ ఆర్థిక ఒడిదుడుకు లు, సంబంధిత పరిణామాలపైనా భారత్ దృష్టి సారిస్తుంది. అలాగే అనేక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి వృద్ధి ఆకాంక్షలను– వాతావరణ పరిగణనలను సమతుల్యం చేయాల్సిన అవసరం ఉంది. – సీఈఏ అనంత నాగేశ్వరన్ చదవండి: ఇది అసలు ఊహించలేదు.. షాక్లో టాటా స్టీల్! -
ఫేస్బుక్ క్రిప్టో కరెన్సీపై జీ–20 దేశాల దృష్టి
లండన్: సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ ప్రతిపాదించిన క్రిప్టో కరెన్సీ లిబ్రా కాయిన్పై శక్తిమంతమైన జీ20 కూటమి దేశాల నియంత్రణ సంస్థలు దృష్టి పెట్టాయి. ఫేస్బుక్ క్రిప్టో కరెన్సీ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చెప్పారు. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోణంలో ఫేస్బుక్ అత్యున్నత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఫేస్బుక్ ప్రాజెక్టు లక్ష్యాలు భారీగానే ఉన్నాయని, అయితే నిబంధనలకు లోబడే అది పనిచేయాల్సి ఉంటుందని బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ గవర్నర్ ఫ్రాంకోయిస్ విల్రాయ్ డి గాల్ చెప్పారు. ఫేస్బుక్ క్రిప్టోకరెన్సీకి అనుమతులివ్వడం అంత ఆషామాషీ కాదని, నియంత్రణ సంస్థలతో చర్చించకుండా దీన్ని ప్రవేశపెట్టడం కుదరదని ఇంగ్లండ్కి చెందిన ఆర్థిక వ్యవహారాల ప్రాధికార సంస్థ చీఫ్ ఆండ్రూ బెయిలీ పేర్కొన్నారు. ఈ వారాంతంలో జీ20 దేశాల నేతలు జపాన్లో సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థతో సంబంధం లేకుండా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు ఉపయోగపడే లిబ్రా కాయిన్స్ను వచ్చే ఏడాది ప్రవేశపెట్టాలని ఫేస్బుక్ యోచిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో లావాదేవీల వ్యయాలు గణనీయంగా తగ్గుతుందని, మరిన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవొచ్చని ఫేస్బుక్ చెబుతోంది. కంపెనీకి రెండు వందల కోట్ల పైగా యూజర్లు ఉండటంతో ఆర్థిక లావాదేవీలపై ఇది గణనీయ ప్రభావం చూపించవచ్చన్న అంచనాలున్నాయి. అయితే, క్రిప్టో కరెన్సీల భద్రతపై సందేహాలుండటం, పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు వీటిని నిషేధించడం కారణంగా ఫేస్బుక్ లిబ్రా కాయిన్ చర్చనీయాంశమైంది. -
అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!
న్యూఢిల్లీ: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీస్తాయని గతవారంలో మార్కెట్ వర్గాలు ఆందోళన చెందగా.. వారాంతాన అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై వెనక్కి తగ్గినట్లు ప్రకటించి ఊరటనిచ్చారు. అయితే, ఇప్పటికీ ఇరుదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, ఈ నెల 28–29 తేదీల్లో జపాన్లోని ఒసాకాలో జి–20 శిఖరాగ్ర సమావేశాలు జరగనుండగా.. ఈ సదస్సులో పాల్గొనే పలు దేశాలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక, త్రైపాక్షిక చర్చలు జరిపే అవకాశముందని మార్కెట్ పండితులు భావిస్తున్నాయి. అమెరికా–చైనా వాణిజ్య చర్చలకు ఈ సమావేశం వేదిక కానుందనే అంచనాలు వెల్లడవుతున్నాయి. ఇక బడ్జెట్ విధానాలపై ఊహాగానాలు, అంతర్జాతీయ అంశాలే ఈవారంలో మార్కెట్కు దిశా నిర్దేశం చేయనున్నాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య చర్చలు ఈవారంలో ప్రధాన అంశాలుగా ఉన్నాయని రెలిగేర్ రిటైల్ డిస్ట్రిబ్యూషన్ ప్రెసిడెంట్ జయంత్ మంగ్లిక్ పేర్కొన్నారు. వీటితోపాటు ముడిచమురు ధరల కదలికలు, రుతుపవనాలు మార్కెట్ను ప్రభావితం చేయనున్నటువంటి దేశీ అంశాలని కొటక్ సెక్యూరిటీస్ విశ్లేషకులు సంజీవ్ అన్నారు. ఒడిదుడుకులకు ఆస్కారం.. జూన్ సిరీస్ డెరివేటీవ్ పొజిషన్లు గురువారం ముగియనుండగా.. జూలై సిరీస్కు రోల్ ఓవర్లు జరిగే క్రమంలో ఈవారంలో అధికస్థాయి ఒడిదుడుకులకు ఆస్కారం ఉంది. ఆప్షన్ డేటా ప్రకారం తక్షణ ట్రేడింగ్ రేంజ్ 11,600 నుంచి 11,900 రేంజ్లో ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ‘నిఫ్టీ 2018లో నమోదుచేసిన 11,750 స్థాయిలో కన్సాలిడేట్ అవుతోంది. జూన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) ముగింపు వరకు ఇది కొనసాగేందుకు అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ ది మనీ (ఓటీఎం) కాల్, పుట్ ఆప్షన్ రైటింగ్ ఆధారంగా ఈస్థాయిలోనే కదలాడేందుకు అవకాశం ఉంది’ అని ఐసీఐసీఐ డైరెక్ట్ విశ్లేషకులు అమిత్ గుప్తా విశ్లేషించారు. ముడిచమురు ధరల ప్రభావం.. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కారణంగా గతవారంలో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 5 శాతం ర్యాలీ చేసి 65 డాలర్లకు చేరుకుంది. అయితే, ప్రస్తుతానికి అమెరికా వెనక్కి తగ్గిన నేపథ్యంలో ఈవారంలో ధరలు కాస్త చల్లబడే సూచనలు కనిపిస్తున్నాయని కమోడిటీ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది చివరివరకు ఒపెక్ ఉత్పత్తి కోతకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని ఆనంద్ రాఠీ స్టాక్ బ్రోకర్స్ విశ్లేషకులు రుషాబ్ మేరు అన్నారు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి మేనెల ఆర్థిక లోటు, మౌలిక సదుపాయాల ఉత్పత్తి డేటా శుక్రవారం విడుదల కానున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అంశాల్లో.. బ్యాంక్ ఆఫ్ జపాన్ తన ద్రవ్య విధాన సమావేశ మినిట్స్ను వెల్లడించనుంది. కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ భారత్ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్ఫోలి యో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నికర కొనుగోలుదారులుగా నిలుస్తున్న వీరు.. ఈనెల్లో ఇప్పటివరకు రూ.10,312 కోట్లను పెట్టుబడిపెట్టారు. జూన్ 3–21 కాలంలో ఈక్విటీ మార్కెట్లో రూ.552 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.9,761 కోట్లను పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. 82,619 కోట్లకు పీ–నోట్స్ పెట్టుబడులు దేశీయ క్యాపిటల్ మార్కెట్లోకి పీ–నోట్లు (పార్టిసిపేటరీ నోట్స్) ద్వారా వచ్చే పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. మే నెల చివరినాటికి 1,400 పెరిగి 1.72 శాతం వృద్ధిని నమోదుచేశాయి. అంతకుముందు ఏప్రిల్ నెల చివరినాటికి ఈ తరహా పెట్టుబడులు రూ.81,220 కోట్లు కాగా, మే నెల చివరినాటికి రూ.82,619 కోట్లకు చేరినట్లు సెబీ తాజా సమాచారంలో వెల్లడయింది. -
ట్రంప్ అతి.. జీ20లో కూతురుని కూర్చోబెట్టాడు
న్యూయార్క్: ఇప్పటికే బంధుప్రీతి, అశ్రిత పక్షపాతానికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ఆ ఆరోపణలకు మరింత ఆజ్యం పోసే పనిచేశారు. జీ 20 శిఖరాగ్ర సమావేశాలకు వెళ్లిన ఆయన వెంట కూతురు ఇవాంకను కూడా తీసుకెళ్లారు. ఈ విషయం తొలుత ఎవరికీ తెలియకపోయినా సమావేశాల సాక్షిగా ఈ విషయం బయటపడింది. అమెరికా వైట్ హౌస్ కూడా ఇవాంక జీ 20 సదస్సులో పాల్గొన్నారని స్పష్టం చేసింది. అయితే, ఇవాంక పూర్తి స్థాయి ప్రతినిధిగా వెళ్లకుండా ట్రంప్ ఏదో పనిమీద బయటకు వెళ్లినప్పుడు ఆయనకు బదులుగానే ఇవాంక వెళ్లి కూర్చున్నారని వైట్ హౌస్ మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికాలోని ప్రముఖులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం హాంబర్గ్లో జరుగుతున్న జీ 20 సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, రిసెప్ తయ్యీప్ ఎర్డోగన్, ఎంజెలా మెర్కల్, థెరిసా మే వంటి ప్రపంచ దిగ్గజ నేతలు, దౌత్య ప్రతినిధుల మధ్య అనూహ్యంగా ఇవాంక ట్రంప్ కనిపించారు. ఆ సమయంలో ట్రంప్ అక్కడ లేరు. దీనిపై అక్కడ ఉన్న వారంతా కాస్తంత అవాక్కయ్యారు. ఇక అమెరికా నుంచైతే ఆమెకు ఏ అర్హత ఉందని ట్రంప్ తన కూతురుని అంతపెద్ద సదస్సులో కూర్చోబెట్టారని ప్రశ్నించారు. ట్రంప్కు ఉన్న అశ్రితపక్షపాతానికి ఇది పరాకాష్ట అని వారంతా మండిపడుతున్నారు. కాగా, ప్రపంచ నేతల ముందు తన కూతురు, మాజీ ఫ్యాషన్ డిజైనర్ అయిన ఇవాంకను ట్రంప్ పలువిధాలుగా కొనియాడుతూ ఆమెను వారికి పరిచయం చేశారట. -
మంచి తరుణం ఇదే...!
మెల్బోర్న్: కొత్త ప్రభుత్వం వ్యాపారాలకు అనుకూల సంస్కరణలు చేస్తున్న నేపథ్యంలో భారత్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇదే సరైన సమయమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పర్యావరణ అనుకూల టెక్నాలజీ, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ), గ్యాస్, విద్య, పర్యాటక రంగాల అభివృద్ధిలో తోడ్పాటు అందించాలని ఆస్ట్రేలియా కార్పొరేట్ దిగ్గజాలను ఆహ్వానించారు. విక్టోరియా రాష్ట్ర గవర్నర్ అలెక్స్ చెర్నోవ్.. వ్యాపార వర్గాలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో 600 మంది ఆస్ట్రేలియా, భారత్ కార్పొరేట్ దిగ్గజాలు పాల్గొన్నారు. ‘సమ్మిళిత వృద్ధి సాధించేందుకు, ఎకానమీని వేగంగా అధిక వృద్ధి బాట పట్టించేందుకు మా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. పారదర్శకమైన విధానాలతో వాణిజ్యం, పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాం’ అని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. వ్యాపారాల నిర్వహణకు తాము అనుకూలమైన సంస్కరణలు చేపడుతున్న నేపథ్యంలో భారత్తో సంబంధాలు పటిష్టం చేసుకునేందుకు, ఇన్వెస్ట్ చేసేందుకు ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు. ఆస్ట్రేలియా మైనింగ్ దిగ్గజం హాంకాక్ ప్రాస్పెక్టింగ్ గ్రూప్ చైర్మన్ జినా రైన్హార్ట్, బీహెచ్పీ చీఫ్ ఆండ్రూ మెకెంజీ మొదలైన వారితో పాటు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా,ఎస్సార్ గ్రూప్ అధినేత శశి రుయా, గుజరాత్ ఎన్ఆర్ఈ కోక్ సీఎండీ ఏకే జగత్రామ్కా తదితరులు ఇందులో పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు.. అత్యాధునిక పోర్టులు, స్మార్ట్ సిటీలు, తక్కువ వ్యయాలతో విమానాశ్రయాలు మొదలైన వాటితో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ చెప్పారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాల స్థాయిలో వ్యాపారాలకు ఏక గవాక్ష పద్ధతిలో అనుమతులు లభించేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇటీవలే మేక్ ఇన్ ఇండియా పిలుపునిచ్చినట్లు మోదీ తెలిపారు. ప్రజాస్వామ్య భారతదేశంలో ఇటు డిమాండు, అటు అత్యధికంగా యువ జనాభా ఉందని ఆయన చెప్పారు. సుపరిపాలనా విధానాలను అమలు చేయడం ద్వారా ఈ బలాలను మరింత సమర్థంగా వినియోగించుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. సీఈవోలతో రౌండ్టేబుల్..: అంతకుముందు 30 మంది సీఈవోలతో జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు వంటి కీలకాంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గత కొన్నేళ్లుగా భారత ఆర్థిక వృద్ధి మందగించిందని, దీన్ని మళ్లీ మెరుగుపర్చేందుకు అనుకూల పరిస్థితులను కల్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పారు. ఇవి ప్రోత్సాహకరమైన ఫలితాలు ఇస్తున్నాయన్నారు. పర్యాటక రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి అపార అవకాశాలు ఉన్నాయని మోదీ చెప్పారు. ముఖ్యంగా టూరిజం ఇన్ఫ్రాలో వ్యాపారావకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. భారత్ ఇంధన అవసరాలకోసం ఎక్కువగా గ్యాస్పై దృష్టిపెట్టాలనుకుంటోందని దీంతో ఎల్ఎన్జీ టెర్మినల్స్ ఏర్పాటు కోసం భారీ డిమాండు ఉండగలదని మోదీ తెలిపారు. -
2 లక్షల కోట్ల డాలర్లు పెంచాలి..
వచ్చే ఐదేళ్లలో ప్రపంచ జీడీపీపై జీ20 దేశాధినేతల తీర్మానం ఇన్ఫ్రాలో భారీ పెట్టుబడులు, వాణిజ్యం పెంపుతోనే సాధ్యం బ్రిస్బేన్: రానున్న ఐదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ)కి 2 లక్షల కోట్ల డాలర్లను అదనంగా జతచేయాలని జీ20 దేశాధినేతలు నిర్దేశించారు. ఇందుకోసం మౌలిక సదుపాయాల రంగంలో భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యాన్ని గణనీయంగా పెంచడం వంటి చర్యలు చేపట్టాలని తీర్మానించారు. ఆదివారమిక్కడ జీ20 సదస్సు ముగింపు సందర్భంగా విడుదల చేసిన 3 పేజీల ప్రకటనలో ఈ అంశాలను పొందుపరిచారు. అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలకు చెందిన 20 దేశాల కూటమే జీ20. ప్రపంచ ఆర్థిక వృద్ధిని పెంచడం, మెరుగైన జీవన ప్రమాణాలు, నాణ్యమైన ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు జీ20 ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర అగ్రనేతలు స్పష్టం చేశారు. ‘2018 కల్లా ప్రపంచ జీడీపీకి కనీసం మరో 2% వృద్ధిని జోడించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరో 2 లక్షల కోట్ల డాలర్లు జతవుతుంది. మిలియన్లకొద్దీ ఉద్యోగాలను సృష్టించొచ్చు’ అని పేర్కొన్నారు. 2012 గణాంకాల ప్రకారం ప్రపంచ జీడీపీ విలువ 85 లక్షల కోట్ల డాలర్లు. ఇందులో జీ20 దేశాల వాటా 85% కావడం గమనార్హం. సమీకృత అభివృద్ధిపై దృష్టి... ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తగిన డిమాండ్ లేక అవస్థలుపడుతోంది. వృద్ధి పెంపునకు సరఫరాపరమైన అడ్డంకులను తొలగించాలి. ఫైనాన్షియల్ మార్కెట్లు, భౌగోళిక రాజకీయపరమైన ఉద్రిక్తతలు వంటి రిస్కులు పొంచిఉన్నాయి. ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి అంతర్జాతీయ సంస్థలు, వృద్ధికి ఊతమిచ్చేందుకు మేమంతా కట్టుబడి ఉన్నాం. పటిష్టమైన, స్థిరమైన, సమతూకంతోకూడిన వృద్ధితో పాటు ఉద్యోగాల కల్పన కోసం మరిన్ని చర్యలు తీసుకుంటాం. నిర్మాణాత్మక సంస్కరణలు, ప్రైవేటు రంగ వ్యాపార కార్యకలాపాల పెంపు వంటి చర్యలను అమలు చేయనున్నాం. ఇవన్నీ సమీకృత అభివృద్ధితో పాటు ఆర్థిక అసమానతలు, పేదరికాన్ని తగ్గించేందుకు తోడ్పడతాయి’ అని ప్రకటనలో దిగ్గజ నేతలు పేర్కొన్నారు. 2020 కల్లా పురుషులు, మహిళా ఉద్యోగుల మధ్య వ్యత్యాసాన్ని 25% మేర తగ్గించాలని జీ20 పేర్కొంది. తద్వారా 10 కోట్లకుపైగా మహిళా ఉద్యోగులు జతయ్యేలా చూడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. 2017కి ఆటోమేటిక్ పన్నుల సమాచార వ్యవస్థ పన్ను ఎగవేతలకు అడ్డుకట్టవేయడం కోసం సభ్య దేశాల మధ్య ఆటోమేటిక్గా పన్ను సంబంధ సమాచారాన్ని పంచుకునే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు జీ20 నాయకులు పేర్కొన్నారు. 2017కల్లా లేదంటే 2018 చివరినాటికి ఇది అందుబాటులోకి రావచ్చని ఒక ప్రకటనలో వెల్లడించారు. నల్లధనం జాడ్యానికి చెక్ చెప్పేందుకు ప్రపంచదేశాల సహకారం కోసం భారత్ పదేపదే అంతర్జాతీయ స్థాయిలో గొంతెంతున్న నేపథ్యంలో జీ20 సదస్సు దీనిపై దృష్టిపెట్టడం గమనార్హం. అదేవిధంగా కార్పొరేట్ కంపెనీల లాభాల తరలింపునకు చెక్ చెప్పడానికి కూడా తగిన కార్యాచరణను రూపొందిచాలని జీ20 దేశాలు నిర్ణయించాయి. 2015కల్లా ఇది ఖరారు కావచ్చని భావిస్తున్నారు. గ్లోబల్ ఇన్ఫ్రా హబ్ ఏర్పాటుకు అంగీకారం... ప్రపంచస్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ను ఏర్పాటు చేసేందుకు జీ20 నేతలు అంగీకరించారు. అంతర్జాతీయ సంస్థలు, అభివృద్ధి బ్యాంకులు, ప్రైవేటు రంగం, ప్రభుత్వాలు తమ ఆలోచనలు, నైపుణ్యాలను పంచుకునే వేదికగా, పెట్టుబడులకు అడ్డంకులు లేకుండా చేయడమే ఈ హబ్ ముఖ్యోద్దేశం. సిడ్నీలో దీన్ని నెలకొల్పనున్నారు. పెట్టుబడులను ఈ రంగంలోకి తీసుకొచ్చేందుకు మార్గాల అన్వేషణ, ఇన్ఫ్రా మార్కెట్ల నిర్వహణ, ఫైనాన్సింగ్ను మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఆయా దేశాల మధ్య సహకారాన్ని పెంచడానికి హబ్ తోడ్పాటునందిస్తుంది. నాలుగేళ్ల నిర్దేశిత కాలవ్యవధిని ఇందుకు నిర్ధేశించారు. ఈ హబ్ ద్వారా 2030 నాటికి గ్లోబల్ ఇన్ఫ్రా రంగంలో మరో 2 లక్షల కోట్ల డాలర్ల నిధులను ప్రవహింపజేసేందుకు వీలవుతుందని జీ20 దేశాలకు చెందిన బీ20 వ్యాపార దిగ్గజాల బృందం అంచనా వేసింది. రెమిటెన్స్ల చార్జీలను 5 శాతానికి తగ్గించాలి... ప్రవాశీయులు విదేశాల నుంచి స్వదేశానికి పంపే డబ్బు(రెమిటెన్స్) విషయంలో విధిస్తున్న చార్జీలను తగ్గించేందుకు కృషిచేస్తామని జీ20 హామీనిచ్చింది. ప్రపంచ సగటు రెమిటెన్స్ వ్యయాన్ని 5 శాతానికి తగ్గించేందుకు పటిష్టమైన , ఆచరణాత్మక చర్యలు చేపట్టాలని పేర్కొంది. కొన్ని దేశాల్లో రెమిటెన్స్లపై గరిష్టంగా 10 శాతం వరకూ చార్జీలు విధిస్తుండటాన్ని కూడా జీ20 ప్రస్తావించింది. సమీకృత ఆర్థికాభివృద్ధిని పెంచే చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. భారత్, ఇతర వర్ధమాన దేశాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని ఈ అంశాన్ని సదస్సు తన ప్రకటనలో చేర్చడం గమనార్హం. గతేడాది 71 బిలియన్ డాలర్ల రెమిటెన్సులతో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. -
మీ పర్యటన కోసం ఎదురు చూస్తున్నాం: మోడీ
బ్రిస్బేన్: ఇరుదేశాల సంబంధాలు మరింత బలపడుతున్నాయి. మీ పర్యటన కోసం ఎదురు చూస్తున్నాం అని జర్మన్ ఛాన్సలర్ ఎంజెలా మార్కెల్ తో భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. జీ20 సమావేశాల సందర్బంగా మార్కెల్ తో మోడీ భేటి అయ్యారు. ప్రధాని వ్యాఖ్యలను విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. రెండవ రోజు సమావేశాల్లో ఆస్త్రేలియా ప్రధాని టోని అబాట్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కలిసి ఫోటోకు ఫోజిచ్చారు. ఈ సమావేశాల్లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ సమావేశం కానున్నారు. రెండవ రోజు కూడా మోడీ సమావేశాల్లో, ఇతర నేతలతో బిజీ బిజీగా ఉన్నారు. -
సంస్కరణలకు వ్యతిరేకత సహజమే: మోదీ
బ్రిస్బేన్: సంస్కరణలకు వ్యతిరేకత సహజమని, రాజకీయ ఒత్తిళ్లు అధిగమించి అమలు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆస్ట్రేలియాలో శనివారం ఆరంభమైన జీ 20 సదస్సులో మోదీ ప్రసంగించారు. నల్లధనం వల్ల దేశం ఎదుర్కొంటున్న సమస్యలను మోదీ ప్రస్తావించారు. నల్లధనం దేశ భద్రతకు సవాల్ అని, విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడానికి సమన్వయ సహకారం అవసరమని మోదీ పేర్కొన్నారు. -
నల్లధనంపై సహకారమే కీలకం
జీ20లో ఆ అంశాన్నే ప్రముఖంగా ప్రస్తావించనున్న ప్రధాని మోదీ ప్రజల జీవన ప్రమాణాల వృద్ధిపైనా దృష్టి పెట్టాలని సూచన! బ్రిస్బేన్లో బ్రిటన్, జపాన్ ప్రధానులతో భేటీ బ్రిస్బేన్: బ్రిస్బేన్లో నేటి(శనివారం) నుంచి ప్రారంభంకానున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో నల్లధనం వెలికితీతలో అత్యంతావశ్యకమైన అంతర్జాతీయ సహకారం అంశాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖంగా లేవనెత్తనున్నారు. భారతీయులు విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని భారత్కు తిరిగిరప్పించేందుకు కృషి చేస్తున్న మోదీ.. అందుకు ప్రపంచదేశాల సహకారం కోసం ఈ 9వ జీ20 సదస్సు వేదికగా ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. అలాగే, కేవలం ఆరోగ్య, ఆర్థిక రంగాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టడం కాకుండా.. ఉపాధి కల్పనకు దారితీసే ఆర్థికవృద్ధి, తద్వారా ప్రజల జీవన ప్రమాణాల్లో సమూల మార్పునకు జీ20 కృషి చేయాలన్న విషయాన్ని ఈ సదస్సులో మోదీ ప్రస్తావించనున్నారు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రజలందరికీ అందుబాటులో స్వచ్ఛమైన విద్యుత్ తదితర భవిష్యత్ తరాలకు ఉపయోగపడే మౌలిక వసతుల కల్పన అంశాన్ని కూడా సభ్య దేశాల దృష్టికి తేవాలని మోదీ భావిస్తున్నారు. జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఆయనకు క్వీన్స్లాండ్ ప్రభుత్వాధినేత క్యాంప్బెల్ న్యూమన్, ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్ బీరేన్ నందా తదితరులు స్వాగతం పలికారు. జీ20లో భారత్, యూరోపియన్ యూనియన్తో పాటు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మ నీ, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, అమెరికాలు సభ్యదేశాలు. ప్రపంచ జీడీపీలో దాదాపు 85%, ప్రపం చ వాణిజ్యంలో 80%, మూడింట రెండొంతుల ప్రపంచ జనాభాకు జీ20 ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన.. ఈ రెండు ఈ సదస్సులో ప్రధానంగా చర్చకు రానున్నాయని జీ20 కోశాధికారి జో హాకీ వెల్లడించారు. 2018 నాటికి ప్రపంచ ఆర్థిక వృద్ధిలో కనీసం 2% జీ20 దేశాల వాటాగా ఉండాలని సదస్సు అధ్యక్ష హోదాలో ఆస్ట్రేలియా ఆశిస్తోందన్నారు. ఆస్ట్రేలియాలో మోదీ బ్రిస్బేన్, మెల్బోర్న్, సిడ్నీ, కాన్బెర్రాల్లో పర్యటించనున్నారు. 161 ఏళ్ల మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరగనున్న కార్యక్రమంలో 2015 క్రికెట్ ప్రపంచ కప్తో భారత్, అస్ట్రేలియాల ప్రధానులు మోదీ, ఎబాట్లు ఫొటోలు దిగనున్నారు. 1986లో నాటి ప్రధాని రాజీవ్గాంధీ పర్యటన అనంతరం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీనే. ఒబామా, ప్రపంచ నేతల ప్రశంసలు: ఆహార సబ్సిడీల సమస్యకు సంబంధించి ‘డబ్ల్యూటీవో వాణిజ్య సౌలభ్య ఒప్పందం’పై ఒక అవగాహనకు రావడంపై భారత ప్రధాని నరేంద్రమోదీని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ విషయంలో మోదీ చూపిన వ్యక్తిగత నాయకత్వ పాత్ర ప్రశంసనీయమన్నారు. ఈ ఒప్పందం ద్వారా భారత్, అమెరికాలు డబ్ల్యూటీవోకు నూతనోత్తేజాన్ని ఇచ్చాయని డబ్ల్యూటీవో సెక్రటరీ జనరల్ రొబర్టో అజెవెడొ వ్యాఖ్యానించారు. బ్రిస్బేన్లో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరాన్, జపాన్ ప్రధాని షింజే ఎబే, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు హెర్మన్ వాన్లతో మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. బ్రిటన్లో పర్యటించాల్సిందిగా మోదీని కేమరాన్ ఆహ్వానించారు. కాగా, మోదీ గౌరవార్థం శుక్రవారం బ్రిస్బేన్లో షింజో ఎబే విందు ఏర్పాటు చేశారు. యోగా డేకు మద్దతు: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలన్న మోదీ ప్రతిపాదనను హెర్మన్ వాన్ స్వాగతించారు. కాగా, జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని పేర్కొంటూ ఐక్యరాజ్య సమితిలో ఒక ముసాయిదా తీర్మానాన్ని భారత్ రూపొందిస్తుంది. దానిపై సహ స్పాన్సర్లుగా అమెరికా, చైనా సహా 130 దేశాలు ఇప్పటికే సంతకాలు చేశాయి. ప్రపంచ దేశాల అధినేతలతో భేటీల్లో.. మోదీ తరచూ యోగా ప్రాముఖ్యతను, లాభాలను ప్రస్తావిస్తుండటం తెలిసిందే. పీఓకే లేని భారత పటం బ్రిస్బేన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ(క్యూయూటీ)లో ఏర్పాటు చేసిన భారతదేశ పటంలో కాశ్మీర్ను సంపూర్ణంగా చూపకుండా నిర్వాహకులు దుశ్చర్యకు పాల్పడ్డారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించడంతో.. నిర్వాహకులు క్షమాపణలు తెలిపారు. మోదీ పాల్గొన్న కార్యక్రమంలో ప్రదర్శించిన భారతదేశ పటంలో ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్’ను భారత్లో అంతర్భాగంగా చూపలేదు. అధికారిక భారతదేశ పటాల్లో పీఓకే అంతర్భాగంగానే ఉంటుంది. దీనిపై అనంతరం క్యూయూటీ క్షమాపణలు తెలిపింది. ఈ అంశంపై విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ తీవ్రంగా స్పందించడంతో నిర్వాహకులు క్షమాపణలు కోరారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ తెలిపారు. రోబోకు ఆటోగ్రాఫ్: క్యూయూటీ సందర్శన సందర్భంగా మోదీ అక్కడి విద్యార్థుల్లో ఒకరిగా కలసిపోయారు. వారితో ఫొటోలు దిగారు. దాంతో విద్యార్థులు మురిసిపోయారు. నెహ్రూ జయంతి రోజు పిల్లలతో గడిపే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తునానని మోదీ వ్యాఖ్యానించారు. యూనివర్సిటీ క్యాంపస్ అంతా సందర్శించిన మోదీ.. అక్కడి ‘వ్యవసాయ రోబో(అగ్బోట్)’ను పరిశీలించారు. ఆ అగ్బోట్కు ఆటోగ్రాఫ్ ఇచ్చారు. -
జీ20 నిర్ణయాల అమలు వేగవంతం చేయాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల్లో సంస్కరణలు అమలు చేయడానికి సంపన్న దేశాలు ఇష్టపడటం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం చెప్పారు. ఈ నేపథ్యంలో జీ20 కూటమి తన విశ్వసనీయతను నిలబెట్టుకోవాలంటే.. ఇటీవలి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను వేగవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల పరిశోధన సంస్థ ఐసీఆర్ఐఈఆర్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై తీసుకునే విధానపరమైన నిర్ణయాలు, ప్రతి దేశానికి ఒకే రకంగా వర్తించవని ఆయన చెప్పారు. అభివృద్ధికి సంబంధించి ఒక్కో దేశం సమస్యలు ఒక్కో రకంగా ఉంటాయి కనుక.. ఆయా దేశాలు దేశీయంగా నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా విధానాలను తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుందన్నారు.