gadgets
-
స్క్రీన్కు బానిసవుతున్న బాల్యం
విహాన్ వయసు మూడున్నరేళ్లు. తన తోటి పిల్లలు చురుకుగా ఆడుతూ, కేరింతలు కొడతూ, చిట్టిచిట్టి మాటలతో అలరిస్తుంటే తాను మాత్రం ఏమి పట్టనట్లు దిగాలుగా ఉంటున్నాడు. రోజంతా మొబైల్ చూస్తూ కాలం గడుపుతున్నాడు. మాటలు రావడం లేదని తల్లిదండ్రులు డాక్టర్ వద్దకు తీసుకెళితే అసలు విషయం బోధపడింది. చిన్నప్పటి నుంచి తనకు మొబైల్ చూపించడంతో దానికి బానిసయ్యాడని తెలిసింది. టెక్నాలజీ పెరుగుతోందని సంబరపడాలో..అది మన తర్వాతి తరాలకు శాపంగా మారబోతుందని బాధపడలో తెలియని పరిస్థితి నెలకొంది. పుట్టి ఎడాదిన్నర కావస్తున్న చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మొబైలే ప్రపంచమైంది. చిట్టిపొట్టి మాటలు నేర్చుకుంటూ తాత, అమ్మమ్మలూ, నాయనమ్మలతో సంతోషంగా గడపాల్సిన బాల్యం ఎలక్ట్రానిక్ స్క్రీన్లకు బానిసవుతుంది. గతంలో ఇంట్లో పెద్దవారు పిల్లలకు మాటలు, మంచి అలవాట్లు నేర్పుతూ కాలం గడిపేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేయడంతో పిల్లలను పట్టించుకునేవారు లేకుండా పోయారు. వివిధ కారణాల వల్ల తాతలు, అమ్మమ్మ, నాయనమ్మలు పిల్లల వద్ద ఉండలేకపోతున్నారు. దాంతో తెలిసి తెలియక తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల పిల్లలను ఎలక్ట్రానిక్ వస్తువులకు బానిసలుగా మారుస్తున్నారు.పేరెంట్స్ నుంచే పిల్లలకుకేవలం పిల్లల చేతిలోని ఫోనే కాకుండా, తల్లిదండ్రులు వాడే ఫోన్ వల్ల కూడా పిల్లలకు మాటలు రావడం లేదని ఎస్తోనియా దేశంలోని టార్టూ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అద్యయనం ద్వారా తెలిసింది. తల్లిదండ్రులకు ఫోన్ని అతిగా చూసే అలవాటు ఉంటే అది పిల్లలకూ వస్తుందట. వాళ్ల స్క్రీన్టైం సమయం కూడా దాదాపు ఉండటం గమనించారు. రెండు నుంచి నాలుగున్నరేళ్ల వయసులో ఉన్న పిల్లల్ని ఎంపిక చేసుకుని వారి భాషానైపుణ్యాలని పరిశీలించారు. పిల్లలూ, వాళ్ల తల్లిదండ్రులూ రోజులో ఎంత సమయం ఫోన్లో గడుపుతున్నారో చూశారు. స్క్రీన్ టైమ్ అతితక్కువగా ఉన్న తల్లిదండ్రులూ, పిల్లల మధ్య భాషానైపుణ్యాలని పరీక్షించారు. ఈ తరహా పిల్లల్లో భాషానైపుణ్యాలు ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ‘షరతులు తీరిస్తే జాబ్ చేయడానికి సిద్ధం’సమయం గడపాలిమొబైల్ ఫోన్లు చూపించడానికి బదులుగా పిల్లలతో ఎక్కవ సమయం గడిపేందుకు చొరవ చూపాలని శాస్త్రవేత్తలు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. పిల్లలతో కలిసి అవుట్డోర్లో ఆడేందుకు సమయం కేటాయించాలని చెబుతున్నారు. ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి పిల్లలతో గడపాలంటున్నారు. -
కొత్తగా వచ్చాయ్.. లేటెస్ట్ ఫోన్లు.. గ్యాడ్జెట్లు
స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ట్యాబ్స్ వంటి కొత్త గ్యాడ్జెట్స్ ఏవో ఒక ఒకటి మార్కెట్లోకి నిత్యం వస్తూనే ఉంటాయి. వాటిలో ఎలాంటి ఫీచర్స్, ప్రత్యేకతలేంటి అన్న విషయాలపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ ఫోన్లు, వాచీలు, గ్యాడ్జెట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈడిస్ప్లే: 6.7 అంగుళాలురిఫ్రెష్రేట్: 120 హెచ్జడ్రిజల్యూషన్: 1080×2340 పిక్సెల్స్మెమోరీ: 128 జీబి 8జీబి ర్యామ్/256 జీబి 8జీబి ర్యామ్/ 512జీబి 8జీబి ర్యామ్వోఎస్: ఆండ్రాయిడ్ 14; ఫ్రంట్ కెమెరా: 10 ఎంపీబ్యాటరీ: 4700 ఎంఏహెచ్; కనెక్టివిటి: 5జీనథింగ్ సీఎంఎఫ్ వాచ్ ప్రో2సైజ్: 1.32రిజల్యూషన్: 466×466 పిక్సెల్స్» స్విమ్మింగ్, రన్నింగ్, రాక్ క్లైంబింగ్, జిమ్ సెషన్..మొదలైన యాక్టివిటీలలో ఉపకరిస్తుంది.» స్ట్రెస్ రీడింగ్, స్లీప్ మానిటరింగ్లాంటి ఫీచర్లు ఉన్నాయి.ఫుల్ చార్జ్: (జీరో నుంచి) 100 నిమిషాలుఒప్పో ప్యాడ్ 3 ప్రోసైజ్: 12.5 అంగుళాలురిజల్యూషన్: 2000×3200 పిక్సెల్స్ఇంటర్నల్ మెమొరీ: 256 జీబిబ్యాటరీ కెపాసిటీ: 10000 ఎంఏహెచ్వివో ఎక్స్ 200 ప్రోడిస్ప్లే: 6.78 అంగుళాలు; బరువు: 223 గ్రా.మెమొరీ: 256జీబి 12జీబి ర్యామ్/512జీబి 16జీబి ర్యామ్వోఎస్: ఆండ్రాయిడ్ 15రిజల్యూషన్: 1260×2800 పిక్సెల్స్ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీ;బ్యాటరీ: 6000 ఎంఏహెచ్ -
ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్: విశేషాలు
ఎవరూ చేయలేని అద్భుతాలు చేసినప్పుడే ప్రపంచం గుర్తిస్తుంది. 23 ఏళ్ల విద్యార్థి 'తపాలా నాదముని' బాల్పాయింట్ పెన్ భాగాలను ఉపయోగించి ఒక వాల్యూమ్ క్లీనర్ రూపొందించారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్ కావడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది.చిన్నప్పటి నుంచే గాడ్జెట్లను తయారు చేయడం పట్ల అభిరుచి కలిగిన నాదముని 2020లో 0.69 ఇంచెస్ వ్యాక్యూమ్ క్లీనర్ రూపొందించారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత దానికంటే 0.07 ఇంచెస్ చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ రూపొందించారు. దీనిని తయారు చేయడానికి 8 నెలల సమయం రూ. 20000 డబ్బు ఖర్చు అయినట్లు సమాచారం.ఈ చిన్న వ్యాక్యూమ్ క్లీనర్లో రివాల్వింగ్ ఫ్యాన్, ఫోర్-వోల్ట్ వైబ్రేషన్ మోటారును ఉపయోగించారు. ఇది సులభంగా దుమ్ము కణాలను సేకరిస్తుంది. ఈ వాక్యూమ్ క్లీనర్ తయారీకి కొన్ని చిన్న చిన్న ప్లాస్టిక్ బిట్స్, మెటల్ కూడా ఉపయోగించినట్లు నాదముని పేర్కొన్నారు. ఇదీ చదవండి: కేంద్రం అలా.. రాష్ట్రం ఇలా: పెరగనున్న పెట్రోల్ ధరలునాదముని రూపొందించిన ఈ చిన్న ఆవిష్కరణలే.. అతన్ని సూక్ష్మ ఇంజనీరింగ్ రంగంలో అగ్రగామిగా నిలిపాయని పేర్కొన్నారు. దీనిని చూసి కాలేజీలోని విద్యార్థులందరూ ఆశ్చర్యపోతున్నారని, అధ్యాపకులు అభినందిస్తున్నారని నాదముని వెల్లడించారు. -
#CES2024: ఇప్పుడే కొనాలనిపించే గ్యాడ్జెట్లు (ఫోటోలు)
-
ధర ‘వింటే’ మతిపోతుంది! అత్యంత ఖరీదైన ఇయర్ఫోన్స్ ఇవే..
ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్లదే హవా. కళ్లు చెదిరే ధరతో ఖరీదైన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటితోపాటు స్మార్ట్ వాచ్లు, ఇయర్ఫోన్స్, ఇతర గ్యాడ్జెట్లు కూడా అదే స్థాయిలో లాంచ్ అవుతున్నాయి. అయితే ఈ ఇయర్ఫోన్స్ ధర తెలిస్తే మాత్రం నిజంగానే మతిపోతుంది! లూయిస్ విట్టన్ అనే కంపెనీకి చెందిన ఇయర్ఫోన్స్ ప్రపంచంలో అత్యంత ఖరీదైనవి. ఈ ఏడాది మార్చిలో హారిజన్ లైటప్ ఇయర్ఫోన్లను విడుదల చేసి అభిమానులను విస్మయానికి గురి చేసింది. వీటి ధర అక్షరాలా 1,660 డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1.38 లక్షలు. అత్యాధునిక ఫీచర్లతోపాటు ఈ సొగసైన ఇయర్బడ్ల ధర సోషల్ మీడియాలో వైరల్ మారి వీటికి క్రేజ్ను పెంచాయి. ప్రత్యేకతలెన్నో.. మతిపోగొట్టే ధరతోపాటు క్రేజీ ఫీచర్లు వీటి సొంతం. బ్రాండ్ ఐకానిక్ మోనోగ్రామ్ ప్యాట్రన్తో తేలికపాటి అల్యూమినియం ఫ్రేమ్తో ఈ ఇయర్బడ్లను రూపొందించారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలిమినేటింగ్ మైక్రోఫోన్, బ్లూటూత్ మల్టీపాయింట్ వంటివి వీటి ప్రత్యేకతలు. ఐదు రంగులలో లభ్యమయ్యే ఈ ఇయర్బడ్స్కు 28 గంటల బ్యాటరీ లైఫ్, గ్రేడియంట్ రంగులతో ప్రకాశించే సొగసైన స్టెయిన్లెస్ స్టీల్ ఛార్జింగ్ కేస్ స్పెషల్ ఫీచర్స్. -
పండుగ సీజన్లో కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటే.. ఇవి బెస్ట్ ఆప్షన్స్!
పండుగ సీజన్లో కేవలం కార్లు, బైకులు మాత్రమే కాదు, మంచి స్మార్ట్ఫోన్లను కొనటానికి కూడా వినియోగదారులు ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో రూ. 25,000 కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ ఫోన్స్ ఏవి? వాటి వివరాలు ఏంటి? అనేది వివరంగా తెలుసుకుందాం. మోటరోలా ఎడ్జ్ 40 నియో (Motorola Edge 40 Neo) రూ. 25,000 కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో మోటరోలా కంపెనీకి చెందిన 'ఎడ్జ్ 40 నియో' ఒకటి. ఇది 6.55 ఇంచెస్ కర్వ్డ్ పోలెడ్ డిస్ప్లే, చిక్ వేగన్-లెదర్ బ్యాక్ డిజైన్ కలిగి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పెద్ద 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 64 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ పొందుతుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7030, 6nm ప్రాసెసర్ కలిగిన ఈ మొబైల్ వినియోగదారులకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఐకూ జెడ్7 ప్రో (iQOO Z7 Pro) ఐకూ జెడ్7 ప్రో మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో స్మార్ట్ఫోన్. దీని ధర కూడా రూ. 25000 కంటే తక్కువే. 125జీబీ, 256జీబీ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ఫోన్ 8జీబీ ర్యామ్ పొందుతుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా వివిధ లైటింగ్ పరిస్థితులలో కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. 4,600mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ పొందుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ కలిగిన ఈ మొబైల్ బ్లూ లాగూన్, గ్రాఫైట్ మ్యాట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. లావా అగ్ని 2 (Lava Agni 2) మన జాబితాలో మూడవ మొబైల్ లావా అగ్ని 2. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ కలిగి, 8జీబీ ర్యామ్ పొందుతుంది. వైబ్రెంట్ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే వీడియోలు చూడటానికి లేదా గేమ్స్ ఆడటానికి అనుకూలంగా ఉంటుంది. కెమెరా అద్భుతంగా ఉంటుంది. ఇదీ చదవండి: కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం - మునుపెన్నడూ లేనన్ని బెనిఫిట్స్ పోకో ఎక్స్5 ప్రో (Poco X5 Pro) పోకో ఎక్స్5 ప్రో మంచి డిజైన్, క్వాలిటీ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ఫోన్. ఇది 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778జీ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఇన్ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్, 3.5 మిమీ హెడ్ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ మొదలైన ఫీచర్స్ పొందుతుంది. -
చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ఫోన్స్ - రూ.10 వేలు కంటే తక్కువే!
ఇప్పటికే పండుగ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సమయంలో ఓ కొత్త మొబైల్ తక్కువ ధరలో కొనుగోలు చేస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటుంటారు. అలాంటి వారికోసం రూ. 10వేలు లోపు లభించే ఉత్తమ స్మార్ట్ఫోన్లను ఈ కథనంలో చూసేద్దాం. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 రూ. 10 కంటే ధరలో లభించే స్మార్ట్ఫోన్. ఇది 6.6-అంగుళాల HD+ డిస్ప్లే కలిగి, 13 మెగా ఫిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, 5000 mAh బ్యాటరీ పొందుతుంది. ఈ మొబైల్ MediaTek Helio A20 ప్రాసెసర్తో పనిచేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. రెడ్మీ 12 మన జాబితాలో తక్కువ ధరకు లభ్యమయ్యే స్మార్ట్ఫోన్ల రెడ్మి 12 ఒకటి. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా, పెద్ద సెన్సార్, అధునాతన పిక్సెల్-బిన్నింగ్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. 2022 డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ మొబైల్ MediaTek Helio G85 ఆక్టా-కోర్ ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఇదీ చదవండి: డ్రైవర్కు రూ.9000 కోట్లు ట్రాన్స్ఫర్ - బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా శాంసంగ్ గేలక్సీ ఎమ్13 బ్యాంక్ ఆఫర్లతో పనిలేకుండానే తక్కువ ధరకు మొబైల్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ ధృడమైన ప్లాస్టిక్ బాడీ మరియు ట్రిపుల్-కెమెరా సెటప్, ఎక్సినోస్ ప్రాసెసర్ పొందుతుంది. రియల్మి Narzo 50i రియల్మీ Narzo 50i మంచి కలర్ ఆప్షన్స్లో లభించే బెస్ట్ మొబైల్. ఇది Unisoc T612 ప్రాసెసర్ కలిగి 10W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెమరా సిస్టం కూడా బాగానే ఉంటుంది. ఈ మొబైల్ ధర కూడా రూ. 10,000 కంటే తక్కువ. -
తలనొప్పిని తరిమేసే గాడ్జెట్.. ధర ఎంతంటే?
తలనొప్పి చాలామందిని తరచు వేధించే సమస్య. తలనొప్పి వచ్చినప్పుడల్లా మాత్రలతో ఉపశమనం పొందడం తప్ప ఇప్పటివరకు నానా తలనొప్పులకు తగిన పరిష్కారమే లేదు. అయితే, ఈ చిన్న పరికరం ఎలాంటి మొండి తలనొప్పులనైనా చిటికెలో తరిమికొడుతుంది. అమెరికన్ కంపెనీ ‘గామాకోర్’ ఇటీవల ఈ పరికరాన్ని ‘గామాకోర్ సఫైర్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని మెడవద్ద నరాలు ఉండేచోట పెట్టుకుని, ఆన్ చేసుకుంటే వైబ్రేట్ అవుతూ ‘వేగస్’నరాన్ని ఉత్తేజపరచి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అకస్మాత్తుగా వచ్చే తలనొప్పులనైనా, తరచుగా పీడించే మైగ్రేన్ వంటి తలనొప్పులనైనా ఇది నిమిషాల్లోనే తరిమికొడుతుంది. దీనిని ఉపయోగించడం ప్రారంభిస్తే, మాత్రల వాడకమే కాకుండా, వాటితో ఎదురయ్యే దుష్ఫ్రభావాలు కూడా తగ్గుముఖం పడతాయి. దీని ధర 655 డాలర్లు (రూ.54,446) మాత్రమే! -
గంటలో అన్ని బుక్ అయిపోయాయ్.. ఇది కదా ఆ మొబైల్కున్న డిమాండ్!
ప్రపంచ మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకున్న క్రేజే వేరు. ఈ సంగతి అందరికి తెలుసు. ఇటీవల కంపెనీ కొత్త ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్ లాంచ్ చేసింది. కాగా నేడు (2023 సెప్టెంబర్ 16) ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమైన కొంత సమయానికి కనీవినీ ఎరుగని రీతిలో బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమైన కేవలం గంటలోపు ఐఫోన్15 ప్రో సిరీస్కి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు మొత్తం అమ్ముడైనట్లు తెలిసింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. నిజానికి ఈ నెల 12న యాపిల్ వండర్లస్ట్ ఈవెంట్లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ అనే నాలుగు మోడల్స్ లాంచ్ చేసింది. ఇవి పింక్, యెల్లో, గ్రీన్, బ్లూ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో 128, 256, 512 జీబీ స్టోరేజి కెపాసిటీతో లభిస్తాయి. కంపెనీ మొదటి సారి ఈ మొబైల్స్కి USB టైప్ సీ పోర్ట్, ఫ్రీమియం టైటానియం బాడీ, లేటెస్ట్ కెమెరా లెన్స్ వంటివి అందిస్తుంది. ఈ కారణంగా ఎక్కువమంది వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇదీ చదవండి: ఏటా వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే.. గతంలో ఇలా.. గతంలో కూడా కేవలం యాపిల్ కంపెనీ ఫోన్స్ మాత్రమే కాకుండా.. శాంసంగ్ వంటి కంపెనీల మొబైల్స్ కూడా భారీగా బుక్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే వినియోగదారులకు నచ్చిన ఫీచర్స్ కలిగిన మొబైల్ తప్పకుండా మంచి బుకింగ్స్ పొందుతాయని స్పష్టమవుతోంది. -
అదిరిపోయే టెక్నాలజీ.. డిజిటల్ ఇన్ హేలర్ ఎలా పనిచేస్తుందంటే?
ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఇన్హేలర్ వాడక తప్పదు. ఇన్హేలర్లు నోట్లోకి ఔషధాన్ని విడుదల చేసి, స్వేచ్ఛగా ఊపిరి ఆడేలా చేస్తాయి. ఇవి వాడే ప్రతిసారీ కచ్చితమైన మోతాదులోనే ఔషధం విడుదల అవుతుందనే భరోసా లేదు. సాధారణ ఇన్హేలర్లు వాడిన ప్రతిసారి విడుదల చేసే ఔషధం మోతాదులో కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇలాంటి ఇబ్బంది లేకుండా కచ్చితంగా నిర్దిష్టమైన మోతాదులోనే ఔషధం విడుదల చేస్తుంది. ఇది యాప్ ద్వారా బ్లూటూత్కు అనుసంధానమై పనిచేస్తుంది. ఈ డిజిటల్ ఇన్హేలర్ను బ్రిటన్కు చెందిన ‘టెవా’ కంపెనీ ‘గో రెస్ప్ డిజిహేలర్’ బ్రాండ్ పేరుతో రూపొందించింది. ఈ డిజిహేలర్ రెండు మోడల్స్లో దొరుకుతుంది. ఒక మోడల్ 55/14 మైక్రోగ్రాములు, రెండో మోడల్ 113/14 మైక్రోగ్రాముల ఔషధాన్ని విడుదల చేస్తాయి. ఈ డిజిహేలర్ ధర 399 డాలర్లు (రూ.32,709) మాత్రమే! -
విరాట్ కోహ్లీ కొత్త ఇయర్బడ్స్ ధరెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Beats Powerbeats Pro Earbuds: క్రికెట్ గురించి తెలిసినవారికి 'విరాట్ కోహ్లీ' (Virat Kohli) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఈయన ఒక ఖరీదైన ఇయర్బడ్స్ పెట్టుకుని కనిపించారు. దీని ధర ఎంత? ఏ కంపెనీకి చెందినదనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర.. నివేదికల ప్రకారం, విరాట్ కోహ్లీ పెట్టుకున్న ఈ ఇయర్బడ్స్ మన దేశంలో లభించవని తెలుస్తోంది. ఇది బీట్స్ పవర్బీట్స్ ప్రో టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ అని.. దీని ధర రూ. 249.95 డాలర్లు లేదా రూ. 20,000 వరకు ఉంటుందని సమాచారం. సాధారణంగా చాలామంది క్రికెటర్లు, సెలబ్రిటీలు యాపిల్ ఇయర్బడ్స్ ఉపయోగిస్తారు, కానీ కోహ్లీ ఇందుకు భిన్నంగా వేరే బ్రాండ్ ఉపయోగిస్తున్నారు. ఈ ఇయర్బడ్స్ కేవలం యుఎస్ మార్కెట్లోని ఆపిల్ స్టోర్లలో లేదా అమెజాన్ వంటి ఆన్లైన్ సెక్టార్లలో లభిస్తుంది. పవర్బీట్స్ ప్రో మొదటి సారి 2018లో ప్రారంభమైంది. కాగా దీని లేటెస్ట్ వెర్షన్ నవంబర్ 2022లో విడుదలైంది. ఇదీ చదవండి: కొత్త స్మార్ట్ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా! కోహ్లీ వెస్టిండీస్ వికెట్ కీపర్ 'జాషువా డా సిల్వా' తల్లిని కలవడం, ఆలింగనం చేసుకోవడం వంటి సన్నివేశాలకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికి వేలమంది ఈ వీడియో లైక్ చేశారు, కొంత మంది అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. 𝙒𝙝𝙤𝙡𝙚𝙨𝙤𝙢𝙚 😊 ❤️ When Virat Kohli made Josh's mom's day & "year" 🤗#TeamIndia | #WIvIND | @imVkohli | @windiescricket | @joshuadasilva08 pic.twitter.com/0RL20rRcYL — BCCI (@BCCI) July 22, 2023 -
కొత్త స్మార్ట్ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా!
Upcoming Smartphones: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులు విడుదలవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మనం ఆగష్టు నెలలో విడుదలకానున్న కార్లను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చే నెలలో విడుదలకు సిద్దమవుతున్న స్మార్ట్ఫోన్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. షావోమి మిక్స్ ఫోల్డ్ 3 (Xiaomi Mix Fold 3) ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న షావోమి త్వరలో మిక్స్ ఫోల్డ్ 3 మొబైల్ లాంచ్ చేయనుంది. ఇది చైనా మార్కెట్లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం, భారతదేశంలో తరువాత కాలంలో విడుదలయ్యే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ స్మార్ట్ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జాజ్ ఫోల్డ్ 5కి ప్రత్యర్థిగా ఉండనుంది. వివో వీ29 సిరీస్ (Vivo V29 Series) వివో కంపెనీకి చెందిన వీ29 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో వీ29 అండ్ వీ29 ప్రో ఉండనున్నాయి. ఇది కూడా చైనా మార్కెట్లో విడుదలైన తరువాత భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. రియల్మీ జీటీ 5 (Realme GT 5) 2023 ఆగష్టు నెలలో రియల్మీ తన జీటీ 5 స్మార్ట్ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్ ఉంటుంది, అదే సమయంలో 144 Hz ఓఎల్ఈడీ డిస్ప్లే పొందుతుంది. అద్భుతమైన కెమెరా సెటప్ తప్పకుండా కొనుగోలుదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రం ఈయన సొంతం - వెహికల్స్ ఫ్యూయెల్కే వందల కోట్లు.. ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో (Infinix GT 10 Pro) ఇన్ఫినిక్స్ తన జీటీ 10 ప్రో స్మార్ట్ఫోన్ ఆగష్టు 03న ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. ఈ మొబైల్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది. ధరలు & ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఇంటర్నెట్ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్ రెడ్మీ 12 5జీ (Redmi 12 5G) రెడ్మీ కంపెనీ ఆగష్టు 01న మరో కొత్త 5జీ మొబైల్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో గట్టిపోటీనిచ్చే విధంగా కంపెనీ దీనిని రూపొందించింది. ఇందులో స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 90Hz FHD+ డిస్ప్లేతో 5000 mAh బ్యాటరీ ఉంటాయి. -
ప్రపంచాన్ని మార్చిన టాప్ 10 గాడ్జెట్స్
-
త్వరలో విడుదలకానున్న ఒప్పో కొత్త స్మార్ట్ఫోన్ ఇదే!
Oppo Reno 10 Series: భారతదేశంలో 5జీ మొబైల్స్ విరివిగా అమ్ముడవుతున్న సమయంలో 'ఒప్పో' (Oppo) సంస్థ తన 'రెనో 10 సిరీస్' (Reno 10 Series) విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఆధునిక ఫీచర్స్తో విడుదలకానున్న ఈ మొబైల్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో కూడా లభించనున్నాయి. ఈ మొబైల్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ఒప్పో రెనో 10 సిరీస్ స్మార్ట్ఫోన్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అంతే కాకుండా ఈ మొబైల్ ఫోన్కు సంబంధించిన ఫోటోలను కూడా ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ 5జి మొబైల్ గత మే నెల ప్రారంభంలో చైనా మార్కెట్లో మూడు వేరియంట్లలో విడుదలయ్యాయి. అవి ఒప్పొ రెనొ 10, ఒప్పొ రెనొ 10 ప్రో, ఒప్పొ రెనొ 10 ప్రో ప్లస్. (ఇదీ చదవండి: చిన్నారి చేష్టలకు ఆనంద్ మహీంద్రా ఫిదా.. నెట్టింట్లో వైరల్ వీడియో!) కొత్త రెనో 10 సిరీస్ స్మార్ట్ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కలిగి.. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్తో పాటు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778 జీ ఆక్టాకోర్ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఇది ఐస్ బ్లూ, సిల్వర్ గ్రే కలర్ ఆప్షన్స్లో చైనా మార్కెట్లో లభిస్తోంది. భారతీయ మార్కెట్లో కూడా ఇదే కలర్ ఆప్షన్స్ ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ మొబైల్ లాంచ్ డేట్, అధికారిక ధరలను కంపెనీ వెల్లడించలేదు. చైనాలో రెనో 10 సిరీస్ ప్రారంభ ధర 2,499 యువాన్స్. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 29,000 అని తెలుస్తోంది. 10 reasons to get excited. The #OPPOReno10Series5G - coming soon.#ThePortraitExpert pic.twitter.com/AUiIhCxAUQ — OPPO (@oppo) June 27, 2023 -
క్రోమా ‘బ్యాక్ టు క్యాంపస్ సేల్’.. స్మార్ట్ఫోన్లు, గ్యాడ్జెట్లపై అద్భుతమైన ఆఫర్లు
హైదరాబాద్: కొత్త విద్యా సంవత్సరం(2023–24) ప్రారంభం సందర్భంగా ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా.. ‘బ్యాక్ టు క్యాంపస్ సేల్’ పేరుతో గ్యాడ్జెట్లపై అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. విద్యార్థులు, ఔత్సాహికుల భిన్న అవసరాలను తీర్చేందుకు హెడ్ఫోన్లు, ఇయర్ఫోన్లు, ల్యాప్ ట్యాప్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచీలపై భారీ డిస్కౌంట్లు ఇస్తుంది. ఈ ఆఫర్లు పొందేందుకు సమీప క్రోమా స్టోర్టు లేదా ఆన్లైన్లో www.croma.com వెబ్సైట్ను సందర్శించవచ్చు. ల్యాప్టాప్లపై డీల్స్ నెలకు రూ. 1,412 కంటే తక్కువ ఈఎంఐతో 350కి పైగా ల్యాప్టాప్లు ఈ సేల్లో అందుబాటులో ఉన్నాయి. ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్టాప్లు రూ. 32,990 నుంచే ప్రారంభమవుతాయి. రైజెన్ 3 ద్వారా ఆధారితమైన గేమింగ్ ల్యాప్టాప్లను రూ. 37,990 నుంచే కొనుగోలు చేయవచ్చు. వీటిలో మైక్రోసాఫ్ట్ హోమ్, స్టూడెంట్స్ ముందే ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఇక అన్ని యాపిల్ ఉత్పత్తులపైనా డీల్స్ ఉన్నాయి. టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లపై.. క్రోమా సేల్లో రూ.11,999తో టాబ్లెట్ను కొనుగోలు చేయవచ్చు. నెలకు కేవలం రూ. 1,337 ఈఎంఐతో స్మార్ట్ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. క్రోమా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై రూ. 8,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్లను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై కేవలం రూ. 499లకే రూ.9,999 విలువైన కాలింగ్-ఎనేబుల్డ్ స్మార్ట్వాచ్ను పొందవచ్చు. -
తక్కువ ధరలో లభించే బెస్ట్ గ్యాడ్జెట్స్!
Best Affordable Gadgets: భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త లేటెస్ట్ ఉత్పత్తులు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే ఎక్కువ మంది వినియోగదారులు సరసమైన ధర వద్ద లభించే వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అలంటి వారి కోసం రూ. 500 కంటే తక్కువ ధర వద్ద లభించే 5 బెస్ట్ గ్యాడ్జెట్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. విఐహెచ్ఎమ్ ఇన్ 1 ఎలక్ట్రానిక్ క్లీనర్ కిట్ రూ. 399 వద్ద లభించే విఐహెచ్ఎమ్ ఇన్ 1 ఎలక్ట్రానిక్ క్లీనర్ కిట్ చాలా మందికి ఉపయోగపడే బెస్ట్ గ్యాడ్జెట్. ఇది మానిటర్లు, కీబోర్డులు, ఫోన్స్, ఎయిర్ పాడ్స్, ల్యాప్ టాప్ వంటి వాటిని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తక్కువ ధరలో క్లీనర్ కిట్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. వైర్లెస్ బ్లూటూత్ 4.0 యాంటీ-లాస్ట్ యాంటీ-థెఫ్ట్ అలారం డివైస్ మన జాబితాలో తక్కువ ధర వద్ద లభించే మరో గ్యాడ్జెట్ 'వైర్లెస్ బ్లూటూత్ 4.0 యాంటీ-లాస్ట్ అండ్ యాంటీ-థెఫ్ట్ అలారం డివైస్'. దీని ధర రూ. 200 కంటే తక్కువ కావడం గమనార్హం. QOCXRRIN వైర్లెస్ బ్లూటూత్ అనేది పేరుకు తగ్గట్టుగానే ఇది బ్లూటూత్ ట్రాకర్. అంతే కాకుండా దీనిని ఆండ్రాయిడ్ పరికరాలతో ఉపయోగించవచ్చు. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది, దీని పరిధి 25 మీటర్ల వరకు ఉంటుంది. 3 ఇన్ 1 ఛార్జింగ్ కేబుల్ దేశీయ మార్కెట్లో తక్కువ ధర వద్ద లభించే మరో బెస్ట్ మోడల్ 3 ఇన్ 1 ఛార్జింగ్ కేబుల్. దీని ధర రూ. 333 మాత్రమే. ఇది దాదాపు చాలా పరికరాలకు ఉపయోగపడే విధంగా రూపుదిదుకున్న యూనివెర్సల్ ఛార్జింగ్ కేబుల్. ఈ కేబుల్ ద్వారా యాపిల్ పరికరాలకు, ఆండ్రాయిడ్ ఫోన్స్ వంటి వాటికి ఛార్జింగ్ వేసుకోవచ్చు. ఇది అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి అనుకూలంగా రూపొందించారు. (ఇదీ చదవండి: మొదలైన కీవే ఎస్ఆర్250 డెలివరీలు.. మొదటి 5 మందికి 100 శాతం క్యాష్ బ్యాక్!) మల్టీ ఫంక్షన్ కీచైన్ లైట్ కీ చైన్ అనేది మహిళలు, పురుషులు ఎక్కువగా ఉపయోగించే ఒక పరికరం. ఈ కారణంగా కీ చైన్ల వినియోగం ఆధునిక కాలంలో కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రూ. 200 కంటే తక్కువ ధర వద్ద కీ చైన్ కావాలనుకునే వారికి ఒక బెస్ట్ ఆప్షన్ ఈ మల్టీ ఫంక్షన్ కీచైన్ లైట్ (Multi-function keychain light). ఇది కేవలం కీ చైన్ మాదిరిగా మాత్రమే కాకుండా లైట్గా కూడా పనికొస్తుంది.ఇందులో LED లైటింగ్ చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. దీనికి అయస్కాంతం ఉండటం వల్ల డోర్ లేదా హ్యాండిల్స్ వంటి వాటికి తగిలించుకోవచ్చు. (ఇదీ చదవండి: 12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలోనే ఇలాంటి ప్యాలెస్ మరొకటి లేదు!) Hkaudio ఎమ్28 టిడబ్ల్యుఎస్ ఇన్-ఇయర్ ఇయర్బడ్స్ పవర్ బ్యాంక్తో కూడిన Hkaudio M28 TWS ఇన్-ఇయర్ ఇయర్బడ్స్ ధర కూడా రూ. 500 కంటే తక్కువ. ఇది USB టైప్ ఏ పోర్ట్ కలిగి బ్లూటూత్ 5.1 కనెక్టివిటీతో లభిస్తుంది. ఇది గేమింగ్ మోడ్కు కూడా సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఇయర్ఫోన్గా ఉపయోగపడుతుంది. -
గాలిలోని వైరస్లనూ ఖతం చేస్తుంది.. ధర ఎంతంటే?
ఇటీవలి కాలంలో రకరకాల ఎయిర్ ప్యూరిఫైయర్లు అందుబాటులోకి వచ్చాయి. ఫొటోలో కనిపిస్తున్నది వాటికి పూర్తి భిన్నమైన ఎయిర్ప్యూరిఫైయర్. ఇది గాలిలోని దుమ్ము, ధూళితో పాటు ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ల వంటి సూక్ష్మజీవులను పూర్తిగా ఖతం చేసేస్తుంది. హాంకాంగ్కి చెందిన ‘హోమ్ప్యూర్’ కంపెనీ ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ని రూపొందించింది. ఇది ఆరు దశలలో తన పరిసరాల్లోని గాలిని శుభ్రపరుస్తుందని, కోవిడ్ వైరస్లోని ఒమిక్రాన్ వేరియంట్ను కూడా ఇట్టే ఖతం చేసేస్తుందని తయారీదారులు చెబుతున్నారు. ఇందులోని ప్రీఫిల్టర్, ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్మ్, హైప్రెషర్ ప్రాసెసర్లు సమ్మిళితంగా పనిచేస్తూ, గాలిలోని 0.1 మైక్రాన్ల పరిమాణంలోని సూక్షా్మతి సూక్ష్మమైన కణాలను కూడా తొలగిస్తాయని చెబుతున్నారు. దీని ధర 820 డాలర్లు (రూ. 67,767) మాత్రమే! -
సూపర్ గ్యాడ్జెట్ : బట్టతలపై వెంట్రుకలు కావాలా నాయనా!
హెల్మెట్లా కనిపిస్తున్న ఈ హెడ్సెట్ను తలమీద ధరిస్తే, కొద్దిరోజుల్లోనే బట్టతల మీద జుట్టు మొలుస్తుంది. ఇది ‘కరెంట్ బాడీ స్కిన్ ఎల్ఈడీ హెయిర్ రీగ్రోత్ డివైస్’. దీనిని అమెరికన్ సౌందర్య సాధనాల తయారీ సంస్థ ‘కరెంట్ బాడీ’ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో బ్లూటూత్కి అనుసంధానమై పనిచేసే హెడ్ఫోన్స్ కూడా ఉండటం విశేషం. దీనిని తల మీద తొడుక్కుని, ఇంచక్కా నచ్చిన సంగీతాన్ని వినవచ్చు. దీని లోపల తలను కప్పి ఉంచే భాగంలో 120 ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. వీటి నుంచి వెలువడే ‘లో లెవల్ లైట్ థెరపీ’ కిరణాలు వెంట్రుకలు కోల్పోయిన భాగంలోని కణాలను ఉత్తేజపరుస్తాయి. దీనిని రోజుకు పది నిమిషాల చొప్పున కనీసం పదహారు వారాలు వినియోగించినట్లయితే, జుట్టు కోల్పోయిన చోట తిరిగి జుట్టు మొలుచుకొస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీని ధర 773 డాలర్లు (రూ.63,951) మాత్రమే! -
మార్కెట్లో మరో కొత్త 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్ - ధర ఎంతో తెలుసా?
iQoo Z7s 5G: దేశీయ మార్కెట్లో 'ఐకూ జెడ్7ఎస్ 5జీ' (iQoo Z7s 5G) స్మార్ట్ఫోన్ విడుదలైంది. రెండు వేరియంట్లలో విడుదలైన ఈ మొబైల్ ఆధునిక డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఈ లేటెస్ట్ ఫోన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు.. ఐకూ జెడ్7ఎస్ మొబైల్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 18,999 & రూ. 19,999. ఇవి రెండూ ఈ-కామర్స్ సైట్ అమెజాన్, ఐకూ అధికారిక వెబ్సైట్లో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. కావున కొనుగోలుదారులు హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో రూ. 1,500 డిస్కౌంట్ ఆఫర్తో కొనుగోలు చేయవచ్చు. ఫీచర్స్.. నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ కలర్ ఆప్షన్లో లభించే ఈ మొబైల్ 6.38 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే కలిగి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ పొందుతుంది. ఇందులో 2.5 GHz, ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ కూడా ఇందులో లభిస్తుంది. (ఇదీ చదవండి: ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ఇక మార్కెట్లో రచ్చ రచ్చే!) కెమరా ఆప్షన్స్ విషయానికి వస్తే.. ఇందులో రెండు రియర్ కెమెరాలు ఉంటాయి. అవి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. 4,500mAh బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్ఫోన్ 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. కావున ఇది కేవలం 24 నిముషాల్లో 50 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకుండా ఇది ఐపీ54 రేటింగ్ కలిగి ఉండటం వల్ల నీటి తుంపర్ల నుంచి కూడా రక్షణ పొందుతుంది. -
‘డిజిటల్’ అంతరాలు!
సాక్షి, అమరావతి: దేశంలో డిజిటల్ గ్యాడ్జెట్ల వినియోగం ఊపందుకున్న తరువాత కులం, మతం, లింగం, తరగతి, భౌగోళిక ప్రాంతాలవారీగా అసమానతలు పెరుగుతున్నట్లు స్వచ్ఛంద సంస్థ ఆక్స్ఫామ్ ఇండియా డిజిటల్ డివైడ్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో విద్యార్థుల చదువుల కోసం ఇంటర్నెట్, కంప్యూటర్ వాడకం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ’ నిర్వహించిన ఇంటింటి సర్వే డేటాను విశ్లేషించి పలు కీలక అంశాలను వెల్లడించింది. పురుషులతో పోలిస్తే దేశంలో కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలు మహిళలకు తక్కువగా అందుబాటులో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మొబైల్ ఫోన్ల అందుబాటు, వినియోగంలో మహిళలు 15 శాతం వెనకబడి ఉన్నారు. ఇంటర్నెట్ సేవలను వినియోగించుకునే సదుపాయం కూడా మహిళలకు తక్కువేనని, పురుషులతో పోలిస్తే ఏకంగా 33 శాతం మేర వ్యత్యాసం ఉన్నట్లు తెలిపింది. దేశంలో మూడింట ఒక వంతు మంది మహిళలు మాత్రమే ఇంటర్నెట్ వినియోగించుకోగలుగుతున్నారు. ► దేశాన్ని డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతున్నా అవన్నీ పట్టణ వాసులకే ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా అనంతరం డిజిటల్ వృద్ధి రేటు పెరిగింది. ఒక్క ఏడాదిలోనే 13 శాతం మేర వృద్ధి సాధించినట్లు గణాంకాలు పేర్కొంటున్నా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో కేవలం 31 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ వినియోగించుకోగలుగుతున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో 67 శాతానికి పైగా ఇంటర్నెట్ వాడుతున్నట్లు ఆక్స్ఫామ్ ఇండియా నివేదిక తెలిపింది. ► గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాలు డిజిటల్ వినియోగంలో వెనుకబడి ఉన్నట్లు హౌస్హోల్డ్ సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆక్స్ఫామ్ ఇండియా పేర్కొంది. ఓబీసీలు, ఆ తరువాత ఎస్సీలు, ఆపై ఎస్టీలు వెనుకబడి ఉన్నట్లు తెలిపింది. ఎస్సీ, ఎస్టీల కంటే ఓబీసీ వర్గాలు కంప్యూటర్ సదుపాయం, ఇంటర్నెట్ వినియోగంలో ముందున్నారని విశ్లేషించింది. ఎస్సీ, ఓబీసీల కంటే ఎస్టీలు 8 శాతానికి పైగా వెనుకబడినట్లు నివేదిక వెల్లడించింది. ► విద్యాసంస్థల్లో విద్యార్థుల చదువుల కోసం ఇంటర్నెట్, కంప్యూటర్ వాడకం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ► పేదల్లో 40 శాతం మంది డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. ఆపై వర్గాలు, ధనవంతుల్లో 60 శాతానికి పైగా డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారు. ► దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా అంతర్జాతీయంగా పోలిస్తే చాలా వెనుకంజలో ఉన్నట్లు ఆక్స్ఫామ్ నివేదిక పేర్కొంది. ఐక్యరాజ్యసమితి రూపొందించే ఈ–పార్టిసిపేషన్ ఇండెక్స్ 2022 సూచీల్లో దేశం 105 స్థానంలో ఉంది. మొత్తం 193 దేశాల్లో టెలి కమ్యూనికేషన్, డిజిటల్ కనెక్టివిటీ, మానవ వనరుల సామర్థ్యాలను పరిగణలోకి తీసుకొని ఐరాస దీన్ని తయారు చేస్తుంది. ► దేశంలో అత్యధికంగా ఇంటర్నెట్, కంప్యూటర్ల వాడకంలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. గోవా, కేరళ తరువాత స్థానాల్లో నిలిచాయి. అత్యల్పంగా ఇంటర్నెట్ వినియోగించే రాష్ట్రాల్లో బిహార్, జార్ఖండ్, చత్తీస్గఢ్ రాష్ట్రాలున్నాయి. -
స్మార్ట్ వాటర్ బాటిల్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుందో తెలుసా?
ఇది చాలా స్మార్ట్ వాటర్ బాటిల్. ఇందులో ఏ కొళాయి నీళ్లయినా పట్టుకుని, నిక్షేపంగా తాగవచ్చు. ఇది బ్రిటన్కు చెందిన ‘గ్రే ఆర్క్ టెక్’ రూపొందించిన సెల్ఫ్ క్లీనింగ్ వాటర్ బాటిల్. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇందులో వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాలు నీటిలోని సూక్ష్మజీవులను సమూలంగా నాశనం చేసి, నీటిని క్షణాల్లోనే స్వచ్ఛంగా మారుస్తాయి. దీని వాక్యూమ్ సీల్డ్మూత వల్ల ఇందులోని నీళ్ల ఉష్ణోగ్రత ఇరవైనాలుగు గంటలకు పైగా స్థిరంగా ఉంటుంది. దీనిని ఫ్లాస్క్ మాదిరిగా వేడి లేదా చల్లని పానీయాల కోసం కూడా వాడుకోవచ్చు. మూత మీద ఉండే ఎల్ఈడీ డిస్ప్లేలో బాటిల్లోని పానీయం ఉష్ణోగ్రత కనిపిస్తూ ఉంటుంది. దీని ధర 98.41 పౌండ్లు (రూ.9,644). . -
మహిళల భద్రతకు.. అక్షరాలా రక్షణ ఇస్తాయి
ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మహిళల భద్రతకు ఉపయోగపడే బ్రేస్లెట్ తయారుచేసి అభినందనలు అందుకున్నారు. గోరఖ్పుర్లోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇంజినీరింగ్ కాలేజీ’కి చెందిన స్నేహ, అక్షితలు తయారుచేసిన ఈ బ్రేస్లెట్కు ‘నిర్భయ’ అని పేరు పెట్టారు. ఈ బ్రేస్లెట్ ఉమెన్ సేఫ్టీ యాప్కు అనుసంధానమై ఉండడంతో పాటు, అయిదు నంబర్లతో కనెక్టై ఉంటుంది. మరికొన్ని గ్యాడ్జెట్స్ గురించి... ‘బర్డ్ఐ’ అనేది పర్సనల్ సేఫ్టీ అలారమ్. అన్నివేళలా దీన్ని వెంట తీసుకెళ్లవచ్చు. ఆపద సమయంలో పెద్ద శబ్దం, వెలుగుతో ఎటాకర్ను భయపెడుతుంది. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తుంది. సేఫ్టీగా ఫీలైన సమయంలో డీయాక్టివేట్ చేయవచ్చు. బ్యాగు, పర్స్లలో కూడా ఈ పరికరాన్ని తీసుకెళ్లవచ్చు. డ్రైవ్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడితే, చుట్టుపక్కల ఎవరూ లేకుంటే... ఇలాంటి సమయంలో యాపిల్ వాచ్ ఎస్ఇ(సిరీస్4)లోని ‘ఫాల్ డిటెక్ట్ ఫీచర్’ ఉపయోగపడుతుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ను అప్రమత్తం చేస్తుంది. ‘ది రోడ్ ఐడీ బ్రేస్లెట్’ కూడా ఇలాంటిదే. ‘ది గార్డెడ్ రింగ్’ అనేది ఉత్త రింగ్ మాత్రమే కాదు. సెల్ఫ్ డిఫెన్స్ యాక్సెసరీ కూడా. ఆపద సమయంలో ఈ రింగ్లో రహస్యంగా అమర్చిన పదునైన బ్లేడ్ను ఉపయోగించుకోవచ్చు. (క్లిక్ చేయండి: ప్రాణాలు కాపాడుతున్న ఐఫోన్లు.. ఎలాగంటే..) -
ఆహార పదార్ధాల్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచే వాక్యూమ్ ఫుడ్ ప్రిజర్వర్
ఆహార వృథా ప్రపంచవ్యాప్త సమస్య. ఏటా దాదాపు వందకోట్ల టన్నుల ఆహారం వృథా అవుతున్నట్లు అంతర్జాతీయ సంస్థల అంచనా. ఆహారాన్ని తగిన విధంగా ఎక్కువకాలం నిల్వ చేసుకోగల వసతులు అందుబాటులో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సాధారణంగా వంటిళ్లల్లో ఆహారం వృథా అయ్యే పరిస్థితులను అరికట్టడానికి టర్కీకి చెందిన యువ డిజైనర్ గోఖన్ సెతింకయా వాక్యూమ్ ఫుడ్ ప్రిజర్వర్కు రూపకల్పన చేశాడు. ఇళ్లల్లో వాడుకునే ఆహార పదార్థాలు మరింత ఎక్కువకాలం నిల్వ ఉండేలా ఇది దోహదపడుతుంది. ఆహార పదార్థాలను నిల్వచేసుకునే ప్లాస్టిక్ డబ్బాలను మూతలతో సహా ఈ వాక్యూమ్ ఫుడ్ ప్రిజర్వర్లో పెడితే, డబ్బాల్లోని గాలిని తొలగించేసి, మూతలను దృఢంగా బిగించేస్తుంది. అంతేకాదు, దీనిని ఆన్ చేయగానే, ఇందులోంచి వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాలు డబ్బాల్లోని సూక్ష్మజీవులను పూర్తిగా నిర్మూలిస్తాయి. అప్పటికే ఉన్న సూక్ష్మజీవులు నశించడంతో పాటు, గాలిని తొలగించడం వల్ల కొత్తగా సూక్ష్మజీవులు చేరే అవకాశం ఉండదు. దానివల్ల డబ్బాల్లోని ఆహార పదార్థాలు దాదాపు రెట్టింపు కాలం పాడైపోకుండా నిల్వ ఉంటాయి. ఇది స్మార్ట్ఫోన్ యాప్కు అనుసంధానమై పనిచేస్తుంది. ఆహారం ఇంకెన్నాళ్లు నిల్వ ఉండేదీ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది. దీని ధర 989 డాలర్లు (రూ. 81,313). -
అమెజాన్ మైండ్బ్లోయింగ్ ఆఫర్లు.. రూ.2,500 లోపు అదిరిపోయే గాడ్జెట్స్!
పండగలు వస్తే విద్యాసంస్థలు సెలవులు ఇచ్చినట్లే కంపెనీలు ఆఫర్లు ఇస్తుంటాయి. దసరా అయ్యిందో లేదో వెనకే దీపావళి సందడి చేసేందుకు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్లో దీపావళి సేల్ ప్రారంభించనుంది. ఈ సారి పండుగకి మీ ఇంటికి అవసరమయ్యే గ్యాడ్జెట్లు లేదా మీ ప్రియమైన బెస్టీలకు విలువైన గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారా! అయితే దీనికి సమాధానం తమ వద్ద ఉందని ఆమెజాన్ ఇండియా అంటోంది. ప్రస్తుతం కొనసాగుతున్న Amazon Great Indian Festival సేల్లో కొనుగోలుదారులు కొన్ని గాడ్జెట్లపై అదనపు డిస్కౌంట్లతో తక్కువ ధరకే పొందవచ్చు. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. RGB LED ల్యాంప్ కలర్తో వస్తుంది. Odzeni Crystal Rose Diamond Led Lamp: ఇది ₹1,299 తగ్గింపు ధరకు లభిస్తుంది. దీని అసలు ధర ₹3,599 ఉండగా ప్రస్తుతం Amazonలో 64% తగ్గింపుతో కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. USB ఛార్జింగ్తో వస్తోంది. ఒక ఛార్జ్తో 8 గంటల వరకు పని చేస్తుంది. ఈ ల్యాంప్ మూడింతల బ్రైట్నెస్ లైటింగ్ అందిస్తుంది. సరేగామా కార్వాన్ మినీ హిందీ 2.0- మ్యూజిక్ ప్లేయర్ ఈ ప్రాడెక్ట్ అసలు ధరపై 19% తగ్గింపు తర్వాత, Saregama Carvan Mini Hindi 2.0- Music Player ప్రస్తుతం కొనసాగుతున్న Amazon సేల్లో ₹1,499కే లభిస్తోంది. మ్యూజిక్ ప్లేయర్ 351 ఎవర్ గ్రీన్ హిందీ పాటలతో ప్రీలోడ్ చేసి ఉంటుంది. మీ పర్సనల్ సాంగ్స్ కలెక్షన్ కోసం USB బ్లూటూత్ మోడ్లను కలిగి ఉంది. వన్ ప్లస్ స్మార్ట్ బ్యాండ్ (OnePlus Smart Band): OnePlus స్మార్ట్ బ్యాండ్ 100mAh బ్యాటరీతో వస్తుంది. ఇది గరిష్టంగా 14 రోజుల బ్యాటరీ బ్యాకప్ సౌకర్యం ఉంది. స్మార్ట్ బ్యాండ్ 1.1-అంగుళాల స్క్రీన్ తో స్టైలిష్ లుక్తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. అమెజాన్లో ₹1,499 తగ్గింపు ధరతో లభిస్తుంది. Echo Dot (4th Gen, Blue) combo : Wipro 9W LED smart color bulb నాలుగు రేట్ల బ్రైట్నెస్ కాంతిని అందిస్తుంది. విప్రో 9W LED స్మార్ట్ కలర్ బల్బ్తో ఎకో డాట్ (4వ జనరేషన్, బ్లూ) కాంబో.. విప్రో బల్బ్ కాంబోతో కూడిన ఈ Amazon Echo Dot (4వ జనరేషన్) Amazonలో రూ. 2,499కి కొనుగోలు చేయవచ్చు. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
షూస్ను పదికాలాలు కాపాడే డివైజ్, ధర ఎంతంటే?
ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరం పాదరక్షలకు రక్షణ సాధనం. ఖరీదైన షూస్ను పదిలంగా పదికాలాలు కాపాడుకోవడం కష్టమే! అయితే, ఈ పరికరం చెంతనుంటే, ఎంత సున్నితమైన, ఎంత ఖరీదైన పాదరక్షలనైనా పదిలంగా కాపాడుకోవచ్చు. బహుళజాతి సంస్థ ‘నెసుగర్’ ఈ పరికరాన్ని రూపొందించింది. ఇది షూ డ్రైయర్–డీయాడరైజర్. చెమ్మదేరిన లేదా తడిసిపోయిన పాదరక్షలను ఇది నిమిషాల్లో పొడిగా తయారుచేస్తుంది. ఇందులో రెండు రకాల ఉష్ణోగ్రతలను అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది. షూ రకాలను బట్టి వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే, ఇందులోని ఓజోన్ స్టెరిలైజేషన్ మోడ్ను ఆన్ చేసుకున్నట్లయితే, షూస్లోని సూక్ష్మజీవులు నశిస్తాయి. ఫలితంగా వాటి ద్వారా వ్యాపించే దుర్గంధం కూడా నశిస్తుంది. ఈ పరికరాన్ని చక్కగా మడిచిపెట్టి భద్రపరచుకునే సౌలభ్యం ఉండటం మరో విశేషం. -
అదిరిపోయే గాడ్జెట్..కాలుష్యాలు ఖతం!
అరచేతిలో తేలికగా ఇమిడిపోయే ఈ పరికరం ఆహార కాలుష్యాలను ఇట్టే ఖతం చేసేస్తుంది. అమెరికాలో స్థిరపడిన చైనీస్ పరిశోధకుడు కాయ్ జియా ఈ పోర్టబుల్ ఫుడ్ క్లీనర్ను రూపొందించారు. కూరగాయలు, పండ్లు వంటి వాటిపై ఉండే పురుగుమందులు, రసాయనాల అవశేషాలను క్షణాల్లో నిర్మూలిస్తుంది. ఒక గిన్నెలో నీళ్లు నింపి, శుభ్రం చేయదలచుకున్న కూరగాయలు, పండ్లు వేసుకున్నాక, ఈ పరికరాన్ని స్విచాన్ చేసి, గిన్నెలో కొద్ది క్షణాలు ఉంచాలి. దీని నుంచి వెలువడే హైడ్రాక్సిల్ అయాన్లు కూరగాయలు, పండ్లు వంటి వాటిపై ఉండే రసాయన కాలుష్యాలను, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులను క్షణాల్లోనే నశించేలా చేస్తాయి. హైడ్రాక్సిల్ అయాన్ల ప్రభావంతో ఈ కాలుష్యాల అణువులు సమూలంగా నాశనమవుతాయి. -
‘ముసలితనానికి కారణమేంటి’..అదే పనిగా సెల్ ఫోన్ వాడుతున్నారా?
మనుషుల్ని ప్రేమించాలి..వస్తువుల్ని వాడుకోవాలి. కానీ అలా కాకుండా మనుషుల్ని వాడుకుంటూ..వస్తువుల్ని ప్రేమిస్తున్న యుక్త వయస్సు వారు తొందరగా ముసలోళ్లు అవుతున్నారంటూ షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్.. మనిషి జీవితంలో భాగమైంది. అది లేకపోతే ఏదో కోల్పోయామనే భావన కలుగుతోంది. స్మార్ట్ ఫోన్తో పాటు ఇయర్ ఫోన్స్,స్మార్ట్ వాచ్, ల్యాప్ట్యాప్తో పాటు ఇతర గాడ్జెట్స్పై అదే అభిప్రాయం ఉంటే ప్రమాదమని తెలుస్తోంది. ఎందుకంటే వాటివల్ల మానవళి మనుగడకు ముప్పు వాటిల్లుతున్నట్లు..ముఖ్యంగా గాడ్జెట్స్ వల్ల వయస్సు మీద పడి అనేక సమస్యల్లో చిక్కుకుంటున్నట్లు అమెరికాకు చెందిన ‘ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ’ అధ్యయనంలో తేలింది. ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ ( Frontiers in Aging) అనే జర్నల్లో స్మార్ట్ ఫోన్, ల్యాప్ ట్యాప్స్తో పాటు ఇతర గాడ్జెట్స్ నుంచి అతిగా వినియోగించడం వల్ల.. వాటి నుంచి ప్రతిభించించే నీలి రంగు వెలుతురు వల్ల త్వరగా యుక్త వయస్సు నుంచి వృద్ధాప్యంలోకి జారుకుంటున్నట్లు ఒరెగాన్ యూనివర్సిటీ ప్రతినిథులు తెలిపారు. ప్రతి రోజు టీవీ, ల్యాప్ ట్యాప్స్, స్మార్ట్ ఫోన్స్ వినియోగంతో మితిమీరిన కాంతి మనుషులు శరీరంపై పడుతుంది. తద్వారా శరీర కారణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు మా రీసెర్చ్లో తేలింది. చర్మం, కొవ్వు కణాల నుంచి నాడికణాల (ఇంద్రియ న్యూరాన్లు) వరకు దుష్ప్రభావం చూపుతుందని యూనివర్సినీ ప్రొఫెసర్ జాడ్విగా గిబుల్టోవిచ్ చెప్పారు. చదవండి👉 మార్చుకోం : ఐఫోన్14 సిరీస్ విడుదలపై భారతీయులు ఏమంటున్నారంటే! -
ఇంట్లో ఈ గాడ్జెట్ ఉంటే కీటకాలు పరార్!
ఫొటోలో కనిపిస్తున్న చిన్న సాధనం ఇంట్లో ఉంటే చాలు, ఎలాంటి కీటకాలైనా పరారు కావాల్సిందే! దీనిని వాడుకోవడం చాలా తేలిక. దోమలను పారదోలేందుకు వాడే మస్కిటో రిపెల్లెంట్స్ మాదిరిగానే, ప్లగ్లో పెట్టుకుని, స్విచాన్ చేస్తే చాలు. మస్కిటో రిపెల్లెంట్స్ నుంచి వెలువడే రసాయనాల వాసనలు కొందరికి సరిపడవు. దీంతో అలాంటి ఇబ్బందులేవీ ఉండవు. ఇది హైపర్సోనిక్ పెస్ట్ రిపెల్లెంట్ సిస్టమ్ ‘రాడార్కాన్ ఆర్–200’. ఇది ఆన్ చేసి ఉంచితే, చుట్టుపక్కల ఈగలు, దోమలు, చీమలు సహా ఎలాంటి కీటకాలైనా పరిసరాల్లో నుంచి మటుమాయం కావాల్సిందే! దీని ప్రభావం సుమారు 2,700 చదరపు అడుగుల విస్తీర్ణం పరిధిలో సమర్థంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇది అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో అందుబాటులో ఉంది. దీని ఖరీదు 59.99 డాలర్లు (రూ.4,773) మాత్రమే. -
వినియోగదారులకు శుభవార్త,అన్ని రకాల గాడ్జెట్స్కు ఒకే తరహా ఛార్జర్!
న్యూఢిల్లీ: కొత్త ఎలక్ట్రానిక్ పరికరం తీసుకున్న ప్రతిసారీ, దానికి పనికొచ్చే మరో రకం చార్జర్ను కొత్తగా కొనాల్సిన అగత్యాన్ని తప్పించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు మొదలైన వివిధ పరికరాలన్నింటికీ కామన్గా ఒకే చార్జర్ను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై మొబైల్స్ తయారీ సంస్థలు సహా పరిశ్రమ వర్గాలతో ఆగస్టు 17న సమావేశం కానుంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. దేశీయంగా బహుళ చార్జర్ల వినియోగాన్ని, ఈ–వ్యర్థాలతో పాటు వినియోగదారులపై భారాన్ని కూడా తగ్గించే సాధ్యాసాధ్యాలను మదింపు చేసేందుకు ఈ భేటీ ఉపయోగపడగలదని పేర్కొన్నారు. 2024 నాటికి చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటికీ యూఎస్బీ–సీ పోర్ట్ తరహా చార్జర్ల వినియోగాన్ని అమల్లోకి తేనున్నట్లు యూరోపియన్ యూనియన్ ఇటీవలే ప్రకటించింది. అమెరికాలో కూడా ఇలాంటి డిమాండే ఉంది. చదవండి👉 నాసిరకం ప్రెజర్ కుక్కర్ల అమ్మకాలు, అమెజాన్కు భారీ ఫైన్! -
ఈ గాడ్జెట్ ఇంట్లో ఉంటే.. మన వెంట సెలూన్ ఉన్నట్లే
ఆకట్టుకునే ప్రతీది అందమే. అందులో కాళ్లూ.. చేతులూ భాగమే. కాలి గోళ్లు, చేతి వేళ్లు.. నాజూగ్గా మారడానికి క్రమం తప్పకుండా బ్యూటీ పార్లర్లకు వెళ్లి.. పెడిక్యూర్, మానిక్యూర్ చేయించుకుంటూంటారు. అయితే ఆ శ్రమను తప్పిస్తుంది ఈ రీచార్జబుల్ ట్రిమ్మర్. పెద్దలకే కాదు అప్పుడే పుట్టిన పిల్లలక్కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఇది. నొప్పి తెలియకుండా.. శ్రమ లేకుండా ఈజీగా కాలి, చేతి గోళ్లను చక్కగా శుభ్రపరచుకోవచ్చు. అందుకు కావల్సిన మినీ కిట్ ఈ డివైజ్తో పాటు లభిస్తుంది. ఈ మెషిన్కి చార్జింగ్ పెట్టుకోవచ్చు. పైగా ఇందులో లిథియం బ్యాటరీ ఉండటంతో.. ప్రయాణాల్లో కూడా దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. 3 స్పీడ్ సెట్టింగ్ ఉండటంతో.. పిల్లలు, పెద్దలు సురక్షితంగా వాడొచ్చు. గోళ్లు షేప్ చేసుకోవడంతో పాటు.. డెడ్ స్కిన్ తొలగించడం, మృదువుగా మార్చడం.. వంటివన్నీ ఈజీగా చేసుకోవచ్చు. మెటల్ గ్రౌండింగ్ హెడ్, ఎడ్జ్ ఎక్స్ఫోలియేషన్ హెడ్, నెయిల్ సర్ఫేస్ ఫ్రాస్టింగ్ పాలిషింగ్ హెడ్, పాయింటెడ్ ఫ్రాస్టెడ్ గ్రౌండింగ్ హెడ్, డిస్క్ ఫ్రాస్టింగ్ పాలిషింగ్ హెడ్.. ఇలా 5 ప్రత్యేకమైన హెడ్స్తో పాటు 3 ప్రత్యేకమైన రోలర్స్ లభిస్తాయి. ఈ డివైజ్కి ఎడమవైపు చార్జింగ్ పాయింట్ ఉంటుంది. మరోవైపు.. హెడ్స్ అమర్చుకునే స్క్రూ ఉంటుంది. అలాగే డివైజ్ ముందువైపు.. రోలర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతో మడమల పగుళ్లు, మృతకణాలు వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ మెషిన్ ఇంట్లో ఉంటే.. మన వెంట సెలూన్ ఉన్నట్లే. ధర సుమారు వెయ్యి రూపాయలు. అయితే రివ్యూలను గమనించి కొనుగోలు చేయడం మంచిది. -
అదిరిపోయే గాడ్జెట్, కుర్రకారు స్మార్ట్ఫోన్కు అడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే
ఈ హైటెక్ యుగంలో స్మార్ట్ఫోన్ వినియోగం జనాలకు అనివార్యం. స్మార్ట్ఫోన్లో అవసరమైన పనులకు సంబంధించినవే కాకుండా, నానారకాల అనవసరమైన యాప్లు, గేమ్లు కూడా ఉంటాయి. కుర్రకారు వీటికి అలవాటుపడి స్మార్ట్ఫోన్ బానిసలుగా మారుతున్నారు. పని ఉన్నా, లేకున్నా చేతిలోని స్మార్ట్ఫోన్ను అదేపనిగా రుద్దుతూ, అందులోనే తలమునకలై వృథా కాలహరణం చేస్తూ చదువుసంధ్యలకు దూరం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి పిల్లలను తప్పించడానికి ఏదైనా విరుగుడు ఉంటే బాగుండునని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. స్మార్ట్ఫోన్ అడిక్షన్ను తేలికగా తప్పించే విరుగుడు అందుబాటులోకి వచ్చేసింది. ఈ ఫొటోలో కనిపిస్తున్నది అదే! చూడటానికి స్మార్ట్ఫోన్కు వాచీ తొడిగినట్లు కనిపిస్తుంది కదూ! ఇది స్మార్ట్ఫోన్కు స్మార్ట్తాళం. జోవావో పెరీరా అనే పోర్చుగీస్ డిజైనర్ ఈ స్మార్ట్తాళాన్ని ‘డిస్కనెక్ట్’ పేరుతో రూపొందించాడు. ఇందులోని టైమర్లో టైమ్ సెట్ చేసుకుని, స్మార్ట్ఫోన్కు దీనిని తొడిగితే చాలు, టైమర్లో మనం నిర్ణయించుకున్న సమయం పూర్తయ్యే వరకు ఫోన్ పనిచేయదు. ఒకవేళ ఏదైనా ముఖ్యమైన కాల్ లేదా ఈమెయిల్ లేదా మెసేజ్ వస్తే, మనం నిర్ణయించుకున్న ‘పిన్’ ద్వారా దీనిని అన్లాక్ చేసుకోవచ్చు. అయితే, ఇదింకా మార్కెట్లోకి రావాల్సి ఉంది. -
ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్: భారీ డిస్కౌంట్స్
సాక్షి, ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఈ ఏడాది కూడా బిగ్ బచత్ ధమాల్ సేల్ను ప్రారంభించింది. జూలై 1 నుంచి 3వ తేదీ వరకు ఈ ధమాకా సేల్ కొనసాగనుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్లో స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. దీంతోపాటు ఫోన్ ఉపకరణాలు, ల్యాప్టాప్లు, గాడ్జెట్లు, దుస్తులు, గృహోపకరణాలను కూడా తగ్గింపు ధరల్లో అందిస్తోంది. భారీ తగ్గింపులతో పాటు, తన కస్టమర్లకు నోకాస్ట్ ఈఎంఐ, ఉచిత డెలివరీ కూడా ఉంది. అలాగే వినియోగదారుల షాపింగ్ సౌలభ్యం కోసం, ఫ్లిప్కార్ట్ కొత్త పేజీని సృష్టించింది. ఈజీగా ఇక్కడ పూర్తి సమాచారాన్ని పొందొచ్చు. వివో ఎక్స్ 70 ప్రో: 8జీబీ ర్యామ్, 128 స్టోరేజ్ వేరియంట్ రూ.46,990. అందమైన ఫోటోలకు కేరాఫ్ ఎడ్రస్ ఈ ఫోన్. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు ఇన్-బిల్ట్ గింబల్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అందిస్తుంది. మోటరోలా ఎడ్జ్ 20 ప్రొ 5జీ: ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్లో ఈ మొబైల్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999కి అందుబాటులో ఉంది. దీనివాస్తవ ధర 45,999. స్మార్ట్ఫోన్లో 108+16 +8ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో లభ్యమవుతున్న ఈ ఫోన్ ఫోటోలంటే ఇష్టపడే వారికి కూడా ఇది మంచి ఆప్షన్. పోకో 5జీ ప్రొ: బడ్జెట్ ధరలో లభించే 5జీ స్మార్ట్ఫోన్. 6 జీబీ వేరియంట్ ధర 14,499లకే లభ్యం. దీని అసలు ధర 16,499. ఐఫోన్ 12 మినీ: ఐఫోన్ 12 మినీ 128 జీబీ స్టోరేజ్ మోడల్ ఈ సేల్లో రూ. 49,999కి అందుబాటులో ఉంది. దీని వాస్తవ ధర 59,900. ఐఫోన్ 13 లాంటి ఇతర ఆపిల్ ఫోన్లపై డిస్కౌంట్లు ఉన్నాయి. పోకో ఎఫ్4 5జీ: పోకో లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ పోకో ఎఫ్4 5జీ ఫ్లిప్కార్ట్ సేల్లో రూ.27,999కి అందుబాటులో ఉంది. దీంతోపాటు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే, అదనంగా 3 వేల తగ్గింపు లభిస్తుంది. -
Women Safety: ఈ ‘బ్రేస్లెట్’, ‘లాకెట్’ మీ దగ్గర ఉన్నాయంటే..
ధర్మం వైపు నిలిస్తే దర్భపోచ కూడా గర్జిస్తుంది...అనేది పెద్దల మాట.ఆపద చుట్టుముడితే ఈ చిట్టిపొట్టి ఆభరణాలు కూడా ఆయుధాలై గర్జిస్తాయనేది నేటి మాట... రివోలర్: దీన్ని కీచైన్కు తగిలించుకోవచ్చు. దుస్తులకు స్టైలీష్గా పిన్ చేసుకోవచ్చు. ఇది వైఫైతో పనిచేస్తుంది. అత్యవసర సమయంలో సింగిల్క్లిక్తో మన కుటుంబసభ్యులకు ప్రమాద హెచ్చరిక వెళ్లిపోతుంది. ‘అవసరం నుంచే ఆవిష్కరణ’ అన్నట్లు ఆపద సమయం నుంచి పుట్టుకువచ్చిందే ఈ రివోలర్. ఈ కంపెనీ సీయివో జాక్వీలైన్ రోజ్ సోదరి రెండుసార్లు లైంగిక వేధింపుల ప్రమాదం నుంచి బయటపడింది. ఆ చేదు జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని, చాలామంది సర్వైవర్లతో మాట్లాడి ఈ ‘రివోలర్’ను డిజైన్ చేసింది జాక్వీలైన్. న్యూ డీల్ డిజైన్ అనే డిజైనింగ్ స్టూడియో ఆకట్టుకునే రకరకాల సేఫ్టీ డివైజ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి డిజైన్లో పాలుపంచుకున్న జెనిఫర్ లాంగ్ ఒకప్పుడు లైంగిక వేధింపుల బాధితురాలే. ‘సొనాటా వాచ్ ఏసీటి’ అనేది టైమ్ చూపించడమే కాదు. మన టైమ్ బాగో లేనప్పుడు రక్షణగా నిలుస్తుంది. ఆపద సమయంలో వాచ్ని క్లిక్ చేస్తే కుటుంబసభ్యులకు మనం ప్రమాదంలో ఉన్నట్లు తెలియజేసే సమాచారం చేరిపోతుంది. స్టిలెట్టో: ఈ వేరబుల్ టెక్ను బ్రేస్లెట్లాగా చేతికి ధరించవచ్చు. స్టైలీష్ లుక్తో నెక్లెస్లా మెడలో వేసుకోవచ్చు. ఆపద సమయంలో దీన్ని సింగిల్ప్రెస్ చేస్తే చాలు ఎమర్జెన్సీ కాంటాక్ట్ లీస్ట్లోని వారికి సమాచారం చేరవేసి అలార్ట్ చేస్తుంది. అథెనా: లాకెట్లా అందంగా కనిపించే ఈ నల్లని గ్యాడ్జెట్ను మెడలో వేసుకోవచ్చు. అవసరం అనుకుంటే పర్స్కు పిన్ చేయవచ్చు. దీని సహాయంతో మనం ప్రమాదకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులకు మెరుపువేగంతో సమాచారం చేరవేయవచ్చు. సేఫ్లెట్: ఈ సేఫ్లెట్కు రెండు బటన్లు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో వీటిని నొక్కడం ద్వారా, సమాచారం మనవాళ్లకు చేరిపోతుంది. ఇది యూజర్ సెల్ఫోన్కు సింకై ఉంటుంది. ఆడియో రికార్డింగ్ చేస్తుంది. చదవండి: సైబర్ టాక్: కొనకుండానే లాటరీ వచ్చిందా?! -
చూడటానికి పుట్టగొడుగులా ఉన్నా..ఈ గాడ్జెట్లో చాలా విషయం ఉందే!
నాజూకుగా ఉండటమే అసలైన అందంగా నిర్వచిస్తున్న కాలం ఇది. అందుకు ప్రయత్నించని అమ్మాయి లేదంటే అంత అతిశయోక్తి కాదేమో! గడ్డం కింద కనిపించే డబుల్ చిన్, బూరెల్లాంటి బుగ్గలు, మెడ చుట్టూ పేరుకున్న కొవ్వుని కప్పిపుచ్చడానికి ప్రయాస పడని పిల్ల లేదంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఆ ప్రయత్న, ప్రయాసలకు చెక్ పెడుతుంది ఈ డివైజ్. దీన్ని ఠి లైన్ ఫేషియల్ స్లిమ్మింగ్ టూల్ అని కూడా అంటారు. ఇది చూడటానికి పుట్టగొడుగులా ఉంటుంది. చిత్రంలో చూపించినట్టుగా పెదవుల మధ్య ఉంచి.. గాలిని లోపలికి పీలుస్తూ.. బయటికి వదిలిపెడుతూ ఉండాలి. అలా చేయడం వల్ల ముఖం, మెడ, గడ్డం వంటి భాగాల్లో సరైన వ్యాయామం జరిగి.. అందమైన షేప్ వస్తుంది. ఈ టూల్ చాలా మన్నికైనది. పునర్వినియోగించదగినది. ఫుడ్–గ్రేడ్, హీట్–రెసిస్టెంట్ సిలికాన్ మెటీరియల్తో రూపొందిన ఈ టూల్ను.. ముక్కు, నోరు భాగాలకు దగ్గరగా ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి దీనికి ఎలాంటి వాసనా ఉండదు. ఎవ్వరైనా వినియోగించొచ్చు. దవడలు, మెడ, గడ్డం ఇలా మొహంలో పేరుకున్న కొవ్వును ఈ స్లిమ్మర్ చాలా చక్కగా కరిగిస్తుంది. ఇందులో రకరకాల సైజులేం ఉండవు. ఒకే సైజ్లో లభిస్తుంది. ముఖ కండరాలకు మంచి వ్యాయామాన్నిచ్చి.. వయసుని తగ్గిస్తూ.. ముడతల్ని పోగొడుతుంది. రోజువారి వ్యాయామంలో దీన్ని భాగం చేసుకోవాలి. మూడు నిమిషాల నుంచి ఇరవై నిమిషాల లోపు రోజువారిగా కొంచెం కొంచెం పెంచుకుంటూ 8 వారాల పాటు స్వతహాగా ఈ ట్రీట్మెంట్ పొందితే..ముఖం స్లిమ్గా మారుతుంది. -
జుట్టు తెల్లబడుతుందా నోటెన్షన్, అదిరిపోయే గాడ్జెట్ మీకోసం!
నల్లటి, పట్టులాంటి జుట్టే ఎవ్వరికైనా ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. ముఖానికి కళనిచ్చే కేశాలు వయసుతో సంబంధం లేకుండా తెల్లబడిపోతున్నాయి. పోషకాహార లోపమో.. కాలుష్య ప్రభావమో.. బాలమెరుపు అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. వయసు మీద పడినా నల్లటి జుట్టునే కోరుకునేవారు కొందరైతే, బాలమెరుపు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకునేవారు ఇంకొందరు. అందరికీ ఒక్కటే దిక్కు.. అయితే కలర్ వేసుకోవాలి. లేదంటే హెన్నా పెట్టుకోవాలి. హెన్నా అనగానే రెండు రోజుల పని. ముందు రోజు కలిపి నానబెట్టుకోవాలి. తెల్లవారి అప్లయ్ చేసుకుని ఓ రెండుమూడు గంటలు ఉండాలి. అంత టైమ్ ఎక్కడుందీ బిజీ కాలంలో. అందుకే ఎక్కువ మంది కలర్ వేసుకోవడానికే ఇష్టపడుతున్నారు. వీళ్లందరితో పాటు.. స్టయిలిష్ లుక్ కోసం రకరకాల రంగులు వేసుకునేవారికి సైతం చక్కగా సహకరిస్తుంది ఈ దువ్వెన (ఎలక్ట్రిక్ హెయిర్ డైయింగ్ కూంబ్). సొంత ప్రయోగాలు ఎందుకులే అంటూ పార్లర్లు, సెలూన్లకు తిరుగుతూ డబ్బులు వృథా చేసుకునేవారికి ఇది చాలా మంచి ప్రత్యామ్నాయం. ఈ డివైజ్ ఇంట్లో ఉంటే.. వేగంగా, సురక్షితంగా ఒంటి చేత్తో డై వేసుకోవచ్చు. ఇది బ్యాటరీల సాయంతో పనిచే స్తుంది. దువ్వెన పళ్లు ఉన్నవైపు మధ్యలో గుండ్రటి మూత ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి.. అందులో కలర్ నింపుకుని.. తిరిగి మూత పెట్టి, గట్టిగా బిగించి, ముందువైపు కింద భాగంలో ఉన్న బటన్ ఆన్ చేసుకుని, సాధారణంగా జుట్టు దువ్వుకున్నట్లు దువ్వుకుంటే సరిపోతుంది. దువ్వెన పళ్లలోంచి కొద్దికొద్దిగా లిక్విడ్ బయటికి వస్తూ ప్రతి వెంట్రుకకు కలర్ వేస్తుంది. అయితే కలర్ వేసుకునే కంటే ముందు జుట్టును చిక్కు లేకుండా చూసుకోవాలి. మార్కెట్లో ఇలాంటి మోడల్స్ చాలానే దొరుకుతున్నాయి. అయితే ఇతర వినియోగదారుల రివ్యూస్, క్వాలిటీ చూసుకుని కొనుగోలు చేయడం మంచిది. -
నాజూకు అందం కోసం అదిరిపోయే గాడ్జెట్స్!
ఈ రోజుల్లో నాజూగ్గా ఉండటమే అసలైన అందం. ఎక్కడా ఇంచ్ ఎక్స్ట్రా కొవ్వు లేకుండా శరీరం ఓ ఆకృతిలో ఉంటేనే వేసుకున్న డ్రెస్కైనా .. కట్టుకున్న చీరకైనా అందం. ఛాయ తక్కువైనా, మొహం మీద మొటిమలూ.. మచ్చలూ ఉన్నా, ఒంటి మీద నూగు మెరుస్తున్నా కవర్ చేసుకోవడం సులభమే కానీ.. స్థూలకాయాన్ని కవర్ చేసుకోవడం కుదరదు. అందుకే చాలా మంది లావుగా ఉండటమే తమ అందానికి అసలైన సమస్యగా భావిస్తుంటారు. అలాంటివారి కోసమే ఈ డివైజ్ (స్లిమ్మింగ్ బెల్ట్). 360 డబుల్ హెలిక్స్ సెంట్రిఫ్యూగల్ టెక్నాలజీతో రూపొందిన ఈ డివైజ్.. బాడీలో కొవ్వును చాలా వేగంగా తగ్గిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఆటో అండ్ మాన్యువల్ డ్యూయల్ మోడ్ కలిగిన ఈ మెషిన్ ను వినియోగించడం చాలా సులభం. వైబ్రేటెడ్ ట్యాపింగ్, బయోనిక్ మసాజ్తో నొప్పి లేకుండానే సమస్యను పరిష్కరిస్తుంది. పైగా దీన్ని ధరించడం వల్ల రిలాక్సింగ్గానూ ఉంటుంది. పొట్ట, నడుము, తొడలు, కాళ్లు, చేతులు.ఇలా ప్రతిచోటా పేరుకున్న కొవ్వుని ఇట్టే కరిగిస్తుంది ఈ మెషిన్. దీనికి చార్జింగ్ పెట్టుకోవచ్చు. లావుని బట్టి..టైట్గా పట్టేందుకు బెల్ట్ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ డివైజ్కి ఎడమవైపు మోడ్స్, పవర్ బటన్, ఆన్/ఆఫ్, స్పీడ్ వంటి ఆప్షన్లు ఉంటాయి. దీని ధర 25 డాలర్లు. అంటే 1,899 రూపాయలు. ఇది మీ వెంట ఉంటే.. సన్నజాజి సోకు మీదే మరి. -
అదిరిపోయే గాడ్జెట్, ఫోన్లో మీరు అరిచి గీపెట్టినా ఎవ్వరికి వినబడదు!
సాధారణంగా నలుగురిలో ఫోన్ మాట్లాడటం మహా కష్టం. అదీ ఆఫీసుల్లో, ప్రయాణాల్లో ఇంకా కష్టం. మనం మాట్లాడితే పక్కవారు మన రహస్యాలను వింటున్నారా? మాటలను గమనిస్తున్నారా? ఇలా ఎన్నో భయాలతో.. ఫోన్లో అవతల వ్యక్తికి చెప్పాలనుకున్నది చెప్పలేం. మరోవైపు మన ఫోన్ సంభాషణలతో పక్కవాళ్లకు ఇబ్బంది కలుగుతుందేమోననే భయం కొన్నిసార్లు ముఖ్యమైన ఫోన్కాల్స్ను కూడా మాట్లాడనివ్వదు. పోనీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడదామంటే.. అవతల వ్యక్తికి మన మాట సరిగా వినిపించకపోవడమో, చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉండటంతో.. మనమెంత బేస్లో మాట్లాడుతున్నామో మనకు తెలియకపోవడమో ఇలా చాలా సమస్యలు ఉంటాయి. దాంతో ఏదైనా రహస్యం చెప్పాలంటే.. తర్వాత చెబుతానులే అనేస్తాం. మాట దాటేస్తాం. అలాంటి సమస్యకు చెక్ పెడుతోంది ఈ ఉష్మీ హెడ్ ఫోన్స్. చక్కగా వందమందిలో ఉన్నా రహస్యాలను ఆపాల్సిన పనిలేకుండా చేస్తుంది ఈ డివైజ్. దీన్ని మెడలో వేసుకుని, సంబంధిత యాప్ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఫోన్ రాగానే దాని ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని.. మెయిన్ బోర్డ్ డివైజ్ని పెదవులకు దగ్గరగా బిగించుకోవాలి. దీంట్లో సైజ్ అడ్జస్టబుల్ సిస్టమ్ ఉంది. ఔటర్ స్పీకర్స్, మినీ జాక్, ఎయిర్ ఛానల్, మైక్రోఫోన్ ఇలా హై టెక్నాలజీతో రూపొందిన ఈ డివైజ్ ఎంత గట్టిగా మాట్లాడినా మన వాయిస్ని క్యాప్చర్ చేసి.. బయటికి అస్సలు వినిపించనివ్వకుండా ఫోన్లో అవతల వ్యక్తికి మాత్రం స్పష్టంగా వినిపించేలా చేస్తుంది. స్మార్ట్ ఫోన్ యాప్తో లైబ్రరీ మాస్కింగ్ సౌండ్లను ఎంచుకోవడానికీ, వాల్యూమ్ను సర్దుబాటు చేయడానికీ వీలుంటుంది. బయటి నుంచి వచ్చే శబ్దాలను ఇది చాలా సులభంగా నివారిస్తుంది. ఒకవేళ ఏ కారణం చేతైనా క్యాప్చర్ అయినా వాటిని తగ్గించి మన మాటను మాత్రమే అవతలవారికి వినిపించేలా చేస్తుంది. ఆప్షన్స్ను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. -
మీకళ్లు 60లో కూడా 20 లా కనిపించాలని ఉందా!
మొహంలో కళ్లు ఎంత ప్రత్యేకమో.. అంతే సున్నితం కూడా! అందుకే ఫేషియల్స్ చేసినా.. స్క్రబ్ చేసినా..మసాజ్ చేసినా..నయనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. లోషన్స్, క్రీమ్స్ అప్లై చేసుకునేటప్పుడు కూడా కళ్లకు తగలకుండా జాగ్రత్తపడతాం. కీరాముక్కలు, గోరువెచ్చటి కాపడంతో కనుల సోయగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటాం. అపురూపమైన కళ్లు అందంగా.. ఎల్లప్పుడూ ఆకట్టుకునేలా ఉండాలంటే స్పెషల్ కేర్ తప్పనిసరి. వయసుతో వచ్చే నల్లటి వలయాలు, ముడతలు, నిద్రలేమితో కలిగే అలసట.. వీటన్నింటినీ దూరం చెయ్యాలంటే చిత్రంలోని కళ్లజోడు ఎంతో చక్కగా పనిచేస్తుంది. దీన్ని పెట్టుకుని కళ్లు మూసుకుని ఉండటం బోర్ కదా అనుకునే వారికి ఆ దిగులే అవసరం లేదు. ఎందుకంటే ఈ డివైజ్.. పాటలను వినిపిస్తూ కళ్ల పని చూస్తుంది. ఒత్తిడి, అలసట, కళ్ల మంటలు, కళ్లు పొడిబారడం, తలనొప్పి వంటి వాటిని దూరం చేస్తూనే.. 60లో 20లా కనిపించేలా అందాన్ని కాపాడుతుంది. 180 డిగ్రీస్ యాంగిల్లో XECH Eye Massager డివైజ్ని సులభంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. అలా ఫోల్డ్ అయిన గాడ్జెట్ చూడటానికి వైర్లెస్ మౌస్లా ఉంటుంది. డివైజ్కి ఒకవైపు.. చార్జర్ జాక్, ఇయర్ ఫోన్ జాక్ ఉంటాయి. పైభాగంలో ఆన్, ఆఫ్, వైబ్రేషన్, మ్యూజిక్ వంటి ఆప్షన్స్ ఉంటాయి. దీనికి ఇయర్ ఫోన్స్ పెట్టుకునే వీలుండటంతో.. నచ్చిన పాటను వినొచ్చు. నచ్చకుంటే మార్చుకోవచ్చు. సౌండ్ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. డివైజ్ ఆన్ చేసుకుంటే సున్నితంగా వైబ్రేట్ చేస్తూ.. ట్రీట్మెంట్ అందిస్తుంది. ఆఫీస్లో, ఇంట్లో ఎక్కడైనా దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. దీనికి 2 గంటల పాటు చార్జింగ్ పెడితే చాలు బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఈ డివైజ్ అడుగు భాగంలో సాఫ్ట్ స్కిన్ కేర్ లైనింగ్ అమర్చి ఉంటుంది. వెనుకవైపు బ్యాండ్ అటాచ్ అయ్యి ఉంటుంది. దాని సాయంతోనే తలకు అమర్చుకోవచ్చు. దీని ధర సుమారు 28 డాలర్లు. అంటే 2,108 రూపాయలు. -
గూగుల్కు భారీషాక్..అమ్మ బాబోయ్!! ఈ స్మార్ట్ వాచ్తో చేతులు కాలిపోతున్నాయ్!!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్కు యూఎస్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ భారీ షాకిచ్చింది. గూగుల్కు చెందిన స్మార్ట్ వాచ్లను రీకాల్ చేయాలని సూచించింది. దీంతో గూగుల్ స్మార్ట్ వాచ్లను రీకాల్ చేసేందుకు సిద్ధమైంది. గూగుల్కు చెందిన ఫిట్బిట్ కంపెనీ రూ.22,631 ధరతో ఐకానిక్ స్మార్ట్ వాచ్లను మార్కెట్లో విడుదల చేసింది. ఆ స్మార్ట్వాచ్ గూగుల్ కంపెనీది కావడంతో అమెరికాలో 1మిలియన్ వాచ్లు, మిగిలిన ప్రపంచ దేశాల్లో 693,000 వాచ్లను యూజర్లు కొనుగోలు చేశారు. ఫలితంగా స్మార్ట్ వాచ్లను వినియోగించిన యూజర్లు చేతులు కాలి తీవ్రంగా గాయపడ్డారు. స్మార్ట్ వాచ్లను ధరించడం, వాచ్లో ఉండే బ్యాటరీ వేడెక్కి పేలడం, చేతులకు తీవ్రగాయాలు కావడంతో గూగుల్ కంపెనీపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వరుసగా యూజర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులపై యూఎస్ కన్జ్యూమర్ సేఫ్టీ కమిషన్ సభ్యులు గూగుల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటి వరకు బిట్ఫిట్ కంపెనీకి 115 అమెరికన్ యూజర్లు, మిగిలిన దేశాల్లో 59మంది యూజర్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అంతేకాదు యూజర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నాసిరకం ఫిట్బిట్ కు చెందిన 10మిలియన్ల వాచ్లను వెంటనే రీకాల్ చేయాలని హెచ్చరింది. దీంతో కన్జ్యూమర్ సేఫ్టీ కమిషన్ హెచ్చరికలతో కంగుతిన్న గూగుల్ ఆ వాచ్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: అదిరిపోయే స్మార్ట్ గ్లాస్లెస్.. సెల్ఫీలు దిగొచ్చు, కాల్ చేయొచ్చు..ఇంకా ఎన్నో -
2021 టెక్ లెజెండ్స్
-
ఈ ఎలక్ట్రిక్ గాడ్జెట్కి భలే గిరాకీ! ..ఆడవాళ్లకు వెరీ స్పెషల్ అట..!
సౌందర్య పోషణలో ఆవిరిది ప్రధాన పాత్ర. వారానికి రెండు సార్లు అయినా మొహానికి ఆవిరి పట్టిస్తే.. మృతకణాలతో పాటు ట్యాన్ కూడా తొలగిపోయి.. ముఖం ప్రకాశవంతంగా మారుతుందనేది నిపుణుల మాట. అందుకే కొంతకాలంగా మార్కెట్లో ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ ఫేషియల్ స్టీమర్స్కి గిరాకీ బాగా పెరుగుతోంది. వాటికి మించిన సౌకర్యవంతమైన, సమర్థవంతమైన ఫేషియల్ స్టీమర్ ఇది. ముఖానికి చక్కగా పైనుంచి మాస్క్ తొడిగినట్లుగా తొడిగి.. బటన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. కళ్లు, ముక్కు, నోరు ప్రతిభాగం చెక్కినట్లుగా ఫేస్ ఆకారంలోనే ఉంటుంది ఈ స్టీమర్. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ముక్కు ఉండే భాగంలో చిన్న రంధ్రం ఉంటుంది. ఇక దీని పైభాగంలో ఉన్న చిన్నపాటి నీళ్ల ట్యాంక్లో నీళ్లు నింపి పెట్టుకోవాలి. పొడిబారిన చర్మం, జిడ్డు చర్మం, సాధారణ చర్మం.. ఇలా చర్మం తీరు ఏదైనా దాని తత్వానికి సరిపడా ట్రీట్ చేసి ప్రత్యేకమైన గ్లో అందిస్తుంది. వదులుగా లేదా ముడతలు పడిన చర్మాన్ని పునర్యవ్వనంగా మార్చేస్తుంది. మచ్చలు, మొటిమలు ఇట్టే పొగొడుతుంది. నానో స్ప్రే, యునిక్ హీటింగ్ టెక్నాలజీ కలిగిన ఈ స్టీమర్.. ఆన్ చేసిన ఒక్క నిమిషంలోనే ఆవిరిని అందిస్తుంది. ఇందులో స్మార్ట్ స్ప్రే మోడ్స్ ఉంటాయి. నొప్పి, ఇబ్బంది లాంటివి ఏమీ ఉండవు. సాధారణ స్టీమర్స్ అయితే వాటికి తగ్గట్టుగానే ఒకే పొజిషన్లో కూర్చుని.. ఆవిరి పట్టించుకోవాలి. కానీ దీన్ని ముఖానికి పెట్టుకుని ఎక్కడైనా కూర్చోవచ్చు, పడుకోవచ్చు. అలాగే సాధారణంగా ఆవిరి పట్టే పద్ధతిలో వేడి గాలికి సుర్రుమనేలా, చర్మం కందిపోయే సమస్య ఉండనే ఉంటుంది. కానీ ఈ ఫేషియల్ స్టీమర్ ముఖానికి అతుక్కుని, సమతుల్యమైన వేడితో సౌకర్యవంతంగా ఆవిరిని అందిస్తుంది. దీని ధర సుమారు 119 డాలర్లు. అంటే 8,865 రూపాయలు. ఇలాంటి వాటిని క్వాలిటీ, రివ్యూలను చూసి కొనుగోలు చేసుకోవడం మంచిది. చదవండి : మొట్టమొదటి టూత్ బ్రష్ ఎలా తయారుచేశారో తెలిస్తే.. యాక్!! పంది శరీరంపై...! -
కనెక్ట్ ఎస్డబ్ల్యు1 ప్రో స్మార్ట్వాచ్
హైదరాబాద్: యాక్సెసరీస్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ కనెక్ట్ గ్యాడ్జెట్స్ ఎస్డబ్ల్యు1 ప్రో స్మార్ట్వాచ్ను ప్రవేశపెట్టింది. 10.5 మిల్లీమీటర్ల మందం, 1.72 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ కర్వ్డ్ ట్రూ వ్యూ లార్జ్ డిస్ప్లే, 180 ఎంఏహెచ్ బ్యాటరీతో రూపొందించింది. ధర రూ.3,999. అంతరాయం లేని, మెరుగైన కాల్స్ కోసం డ్యూయల్ బ్లూటూత్ మల్టీ పాయింట్ టెక్నాలజీతో జోడించినట్టు కనెక్ట్ సీవోవో ప్రదీప్ తెలిపారు. (చదవండి: అదిరిపోయే ఫీచర్స్ గల 5జీ స్మార్ట్ఫోన్ ఇంత తక్కువ ధరకా!) బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సీజన్, ఈసీజీ తెలుసుకోవచ్చు. ఫిమేల్ అసిస్టెన్స్, బ్రెత్ మోడ్, వెదర్ రిపోర్ట్, సెడెంటరీ రిమైండర్, స్లీప్ మానిటరింగ్, గెశ్చర్ కంట్రోల్, ఏడు రకాల స్పోర్ట్స్ మోడ్స్, వాటర్ ప్రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వాయిదాల్లోనూ కొనుగోలు చేయవచ్చు. (చదవండి: ఇక కిలోమీటరు దూరంలో ఉన్న వై-ఫై కనెక్ట్ అవ్వొచ్చు!) -
బ్యూటీ పార్లర్ల చుట్టూతిరిగే సమస్యను పోగొట్టే గాడ్జెట్ ఇదే
లోలోపల ఆరోగ్య సమస్యల సంగతి పక్కనపెడితే.. పైకి కనిపించే అవాంఛిత రోమాల సమస్య 15 రోజులకోసారి బ్యూటీ పార్లర్ల చుట్టూతిరిగేలా చేస్తుంది. ఇలాంటి అన్ని సమస్యలకు చెక్ పెట్టేదే ఈ డివైజ్ (9,99,000 ఫ్లాషెస్ ఆటో మాన్యువల్ మోడ్స్ 5 ఎనర్జీ లెవెల్ హోమ్ యూజ్ పర్మినెంట్ హెయిర్ రిమూవల్). ఇది స్త్రీలకే కాదు పురుషులకూ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ అల్ట్రా–ఫాస్ట్ పర్మినెంట్ హెయిర్ రిమూవల్.. అధునాతనమైన ఇంటెన్స్ ప్లస్డ్ లైట్ టెక్నాలజీతో అవాంఛిత రోమాలను కుదుళ్ల నుంచి తొలగించి క్రమంగా తిరిగి రాకుండానూ నివారిస్తుంది. నొప్పి తెలియకుండా సమస్యను రూపుమాపుతుంది. ఇందులో 2 ప్రత్యేకమైన మోడ్స్, 5 ఎనర్జీలెవెల్స్ ఉంటాయి. స్కిన్ కలర్, హెయిర్ కలర్ని బట్టి మోడ్స్ సహకరిస్తాయి. మాన్యువల్ మోడ్తో సున్నితమైన భాగాల్లో అంటే బికినీ లైన్కి 4 నిమిషాలు, పైపెదవికి నిమిషం ఇలా ఒక్కోదానికి ఒక్కో సమయం పడుతుంది. ఇక చేతులు, కాళ్లు, వీపు భాగాలకు ఆటోమెటిక్ మోడ్ అప్లై చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకునే ప్రతి భాగంపై ముందుగానే షేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖానికి, మొత్తం బాడీకి ఈ ట్రీట్మెంట్ అందించేందుకు సుమారుగా 30 నిమిషాల సమయం పడుతుంది. 8 నుంచి 12 వారాలు క్రమం తప్పకుండా చేస్తే 90 శాతం హెయిర్ గ్రోత్ తగ్గుతుంది. 13వ వారం నుంచి ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. దీని నుంచి ఒక్కసారికి వెలువడే కాంతి (9,99,000 ఫ్లాషెస్) మానవశరీరానికి ఎలాంటి హానీ కలిగించదని నిరూపితమైంది. ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ అందించే ఈ డివైజ్.. చాలా కంఫర్టబుల్గా పని చేస్తుంది. దీన్ని కళ్ల సమీపంలో ఉపయోగిస్తున్నప్పుడు కళ్లకు డివైజ్తో పాటు లభించిన ప్రత్యేకమైన గాగుల్స్ తప్పకుండా పెట్టుకోవాలి. అయితే ఈ హెయిర్ రిమూవర్ డార్క్ స్కిన్ను, వైట్ హెయిర్ను గుర్తించలేదు. -
పండుగ సీజన్లో బాదుడు?..వీటి ధరలు పెరగనున్నాయ్!
ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే చాలు మార్కెట్లో విడుదలైన ప్రాడక్ట్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతుంటాయి.డిమాండ్కు తగ్గట్లు ఆయా కంపెనీలు ఉత్పత్తులపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తుంటాయి. కస్టమర్లను ఆకట్టుకుంటుంటాయి. అయితే ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ రకాల ఉత్పత్తుల ధరల్ని 8 శాతం పెంచేందుకు పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయంటూ ఎకనమిక్ టైమ్స్ ఓ నివేదికను వెలుగులోకి తెచ్చింది. ఈ ఏడాది ఫెస్టివల్ సీజనల్ సందర్భంగా కార్స్, బైక్, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ ట్యాప్, టీవీ, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండీషనర్ ప్రాడక్ట్ల ధరల్ని పెంచనున్నట్లు ఎకనమిక్ టైమ్స్ తన నివేదికలో తెలిపింది. వీటిలో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 8శాతం వరకు, టూవీలర్లరపై 1 నుంచి 2శాతం వరకు పెరగనున్నాయి. బాష్, సిమెన్స్, హిటాచీ బ్రాండ్లు ధరలను 3 శాతం నుంచి 8 శాతానికి పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని సంస్థలు ఉత్పత్తుల ధరల్ని పెంచనున్నాయి. ఈ సందర్భంగా ఐడిసి ఇండియా(ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ఇండియా) రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ మాట్లాడుతూ..కొన్ని కంపెనీలు వచ్చే నెల ప్రారంభంలో టీవీలు(టెలివిజన్లు), ఎయిర్ కండిషనర్లు,రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు,మైక్రోవేవ్ ఓవెన్ల వంటి గృహోపకరణాల ధరల్ని 3శాతం నుంచి 7శాతం ధరల్ని పెంచేలా నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ఆటోమొబైల్ కేటగిరిలో పెరిగిన ధరలు ఈ ఏడాదిలో ఇప్పటికే ఆటోమొబైల్ రంగానికి చెందిన టూవీలర్లు, కార్ల ధరలు పెరిగాయి. ఆయా మోడల్ని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉన్న కార్ల ధర రూ.50వేల నుంచి రూ.2.5లక్షల వరకు పెరిగింది. అదే సమయంలో టూవీలర్ ధరలు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు పెంచాయి. ఇక గత 12 నుంచి 18నెలల కాలంలో ఆయా సీజన్లను బట్టి కార్, టూవీలర్లపై అందించే ఇన్స్టాల్మెంట్స్ 10 నుంచి 15శాతం వరకు పెరిగాయి. అయితే పెరుగుతున్న ధరల్ని బట్టి కొనుగోలు దారులు మైండ్ సెట్ మారిపోయిందని, ఈ సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో అత్యధికంగా అమ్ముడైన పది కార్ల మోడళ్ల ధర ఐదు సందర్భాల్లో మారిందని కన్సల్టెన్సీ జాటో డైనమిక్స్ ఇండియా ప్రెసిడెంట్ రవి భాటియా చెప్పారు. వీటితో పాటు స్టీల్ ధర రెట్టింపు అయ్యింది. అల్యూమినియం, రాగి ధరలు 20 నుంచి 25 శాతం పెరిగాయి. సెమీకండక్టర్ కొరతతో చిప్ ధరలు 25 శాతం నుంచి 75శాతానికి పెరిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎకనమిక్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది. అన్నింటికీ మించి సరుకు రవాణా వ్యయాలు 2 నుంచి 3 రెట్లు పెరగడంతో దిగుమతులకు మరింత భారంగా మారింది. ఇక మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల మోడళ్ల విడుదల పెరిగిపోవడంతో పలు సంస్థలు స్మార్ట్ఫోన్ ధరల్ని 3నుంచి 5శాతం పెంచగా.. రానున్న రోజుల్లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. -
గాడ్జెట్ మహిమ, వంటకం ఏదైనా చిటికెలో చేయెచ్చు...!
చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్స్కి చాలా చక్కగా, అనువుగా ఉండే ఈ ఫ్యామిలీ సైజ్ ఓవెన్.. ఎయిర్ ఫ్రైయర్లా కూడా పనిచేస్తుంది. డిజిటల్ టచ్స్క్రీన్ తో ఆయిల్లెస్ రుచులని అందిస్తుంది. చికెన్, ఫిష్, పిజ్జా, కేక్, స్టిక్స్, వింగ్స్, కుకీస్, ఫ్రెంచ్ఫ్రైస్ ఇలా చాలానే చేసుకోవచ్చు. 1700గి సామర్థ్యం కలిగిన ఈ మేకర్కి ముందు భాగంలో దానికి ఆనుకునే గుండ్రటి మూత ఉంటుంది. దాన్ని పైనుంచి కిందకు ఓపెన్ చేసుకోవచ్చు. లోపల ట్రాన్స్పరెంట్ బౌల్ పెట్టుకుని.. మూడు సొరుగులుగా గ్రిల్ ప్లేట్స్ అమర్చి, వాటిపై ఆహారాన్ని బేక్ చేసుకోవచ్చు. ఇందులో 3600ఊ వద్ద పిజ్జా 10 నిమిషాలు, కూరగాయలు 12 నిమిషాలు, ఫిష్ 15 నిమిషాలు, కేక్ 30 నిమిషాలు సమయం పడుతుంది. 4300ఊ వద్ద.. పాప్కార్న్ 8 నిమిషాలు, చికెన్ వింగ్స్ 10 నిమిషాలు, ఫ్రెంచ్ఫ్రైస్ 20 నిమిషాలు, హోల్ చికెన్ 30 నిమిషాలు సమయం తీసుకుంటాయి. అధిక–నాణ్యత గల మెటీరియల్తో రూపొందిన చికెన్ ఫోర్క్, డిప్ ట్రే, రొటేటింగ్ బాస్కెట్, ఎయిర్ ఫ్లో రాక్స్, మెస్ బాస్కెట్ వంటివన్నీ మేకర్తో పాటు లభిస్తాయి. ఈ గాడ్జెట్ 80 శాతం నూనె వాడకాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఆప్షన్స్ అన్నీ మేకర్ ముందువైపు డిస్ప్లేలో బొమ్మలతో సహా వివరంగా కనిపిస్తుంటాయి. దాంతో దీన్ని ఆపరేట్ చెయ్యడం ఎవరికైనా సులభమే. -
బడ్జెట్ ఫోన్లు.. 108 మెగా పిక్సల్ క్వాడ్ కెమెరా
న్యూఢిల్లీ: మోటరోలా మధ్య శ్రేణి బడ్జెట్లో రెండు జీ సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మోటో జీ60, మోటో జీ40 ఫ్యూజన్ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ల ప్రారంభ ధర రూ.12,999గా ఉంది. మోటో జీ60: 108 మెగా పిక్సల్ క్వాడ్ కెమెరా వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. ఫొటోలు మరింత స్పష్టంగా వచ్చేందుకు అల్ట్రా పిక్సల్ టెక్నాలజీని ఇందులో ప్రవేశపెట్టారు. ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 11పై పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో ఒకే రకం ఇందులో అందుబాటులో ఉంటుంది. మోటో జీ40 ఫ్యూజన్ ఇందులోనూ 120 గిగాహెర్జ్ 6.8 అంగుళాల హెచ్డీఆర్ 10 డిస్ప్లేను ఏర్పాటు చేశారు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732 జీ ప్రాసెసర్ ఉంది. వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ ప్రధాన కమెరాగా క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. జీ40 ఫ్యూజన్ 4జీబీ/64జీబీ రకం ధర రూ.13,999. 6జీబీ/128జీబీ ధర రూ.15,999. ఐసీఐసీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు లభించనుంది. మోటో జీ60 ధర రూ.17,999. ఫ్లిప్కార్ట్లో ఈ నెల 27 మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభ విక్రయాలు ఉంటాయి. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుతో కొనుగోలు చేసిన వారికి అప్పటికప్పుడే రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. -
2020 ఇండియన్ బెస్ట్ గాడ్జెట్ అవార్డు నామినిస్
ఈ కేలండర్ 2020 ఏడాదిలో ప్రపంచ దేశాలను కోవిడ్-19 వణికించినప్పటికీ మొబైల్ పారిశ్రామిక రంగలో మొదట్లో కొంచెం ఒడి దుడుకులు ఏర్పడినప్పటికీ తర్వాత తిరిగి పుంజుకుంది. దేశం నాలుగు నెలలు పాటు లాక్డౌన్ లో ఉన్నప్పటికీ కంపెనీలు త్వరగా తిరిగి పుంజుకున్నాయి. 2020 ఏర్పడిన అన్ని అడ్డంకులను టెక్నాలజీ సహాయంతో చాలా వరకు ఎదుర్కొన్నాము. గాడ్జెట్ల సహాయంతో జాతీయ, అంతర్జాతీయ సమాచారంతో పాటు గేమ్స్, వినోదాన్ని ప్రజలు ఆస్వాదించారు. లాక్డౌన్ సమయంలో టెక్నాలజీ గాడ్జెట్లు చాలా ముఖ్య పాత్ర పోషించాయి. దేశంలో చాలా వరకు కంపెనీలు మూసివేయబడ్డాయి. కొన్ని కర్మాగారాలు సగం సామర్థ్యంతో పనిచేసాయి. ఐటీ ఇండస్ట్రీ చెందిన చాలా ఉద్యోగులు టెక్నాలజీ పుణ్యమా అని ఇంటి నుండే పని చేస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత టెక్నాలజీ రంగంలో మళ్లీ కొత్త ఆవిష్కరణలు మొదలయ్యాయి. కరోనా ప్రభావం తర్వాత టెక్నాలజీ రంగం చాలా వేగంగా పుంజుకుంది. ప్రతి రోజు స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్టాప్లు, గేమింగ్ కన్సోల్లు, హెడ్ఫోన్లు వంటివి ఎన్నో మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ ఏడాది చాలా గాడ్జెట్లు మార్కెట్ లోకి ఇప్పుడు కొన్ని 2020 ఇండియన్ గాడ్జెట్ అవార్డు కింద ఎంపిక అయ్యాయి. వాటిలో కొన్ని మీకోసం. 2020 బెస్ట్ గాడ్జెట్ నామినిస్ శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 ఆపిల్ మాక్బుక్ ఎయిర్ M1 ఆపిల్ ఐఫోన్ 12 మినీ ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్ Xbox సిరీస్ X సోనీ WH-1000XM4 -
బడ్జెట్లో మైక్రోమాక్స్ నోట్ 1 మోడల్
micromax in note1 డిస్ప్లే: 6.67 అంగుళాలు రెజల్యూషన్: 1080్ఠ2400 పిక్సెల్స్ ర్యామ్: 4జీబి స్టోరేజ్: 128 జీబి బ్యాటరీ: 5,000 ఎంఎహెచ్ కలర్ ఆప్షన్స్: గ్రీన్, వైట్ ∙ఎల్యిడి ఫ్లాష్ ∙నైట్విజన్ సపోర్ట్ ∙48–మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ∙5–మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ ధర: రూ.10,999 realme 7i డిస్ప్లే: 6.5 అంగుళాలు మెమోరీ: 64జీబి 4జీబి ర్యామ్ 128జీబి 4జీబి ర్యామ్ 128జీబి 8జీబి బ్యాటరీ: 5000 ఎంఎహెచ్ రెజల్యూషన్: 720్ఠ1600 పిక్సెల్స్ బరువు: 188గ్రా, కలర్: అరోరా గ్రీన్, పొలార్ బ్లూ ∙ఫింగర్ ప్రింట్ సెన్సర్ ∙గొరిల్లా గ్లాస్ 3 ధర: రూ.12,999 నుండి. గ్యాడ్జెట్ బజార్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 3 సైజ్: 45 యంయం బాడీ: గొరిల్లా గ్లాస్ డిఎక్స్ మెమోరీ: 8జీబి 1జీబి ర్యామ్ డిస్ప్లే: 360్ఠ360 రెజల్యూషన్ కలర్ ఆప్షన్స్: మిస్టిక్ బ్రాంజ్, మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ వైట్ ∙టైటానియం ఫ్రేమ్ ∙వాటర్ రెసిస్టెంట్ ∙ ఎల్టీయి కనెక్టివిటీ ∙శాంసంగ్ పే ∙సీజీ సర్టిఫైడ్ ∙ బ్లడ్ ప్రెజర్ మానిటర్ ∙లౌడ్ స్పీకర్ ధర: రూ.29,990 సోషల్ మీడియా ఆతరువాత....ఇక మాయమే! టెలిగ్రామ్ ‘సెల్ఫ్ డిస్ట్రక్షన్ మెసేజెస్’ ఫీచర్ తరహాలో సరికొత్త ఫీచన్ను తీసుకురానుంది వాట్సాప్. వ్యక్తులు లేదా గ్రూప్లకు పంపిన మెసేజ్ ఏడు రోజుల తరువాత దానికదే మాయమవుతుంది. బానే ఉందిగానీ ఆ టైమ్లో వాట్సాప్ ఓపెన్ చేయనివారి పరిస్థితి ఏమిటి? అనే సందేహం రావచ్చు. అలాంటి వారి కోసం ‘టెంపరరీ మెసేజ్’ కనిపిస్తుంది. ఎనేబుల్, డిసేబుల్ ఆప్షన్స్ను ఎంచుకునే అవకాశం ఉంది. మరో విషయం ఏమిటంటే, వృథాగా పడి ఉన్న మెసేజ్లను మరింత సులభంగా డిలిట్ చేయడానికి ‘స్టోరేజ్ మెనేజ్మెంట్’ టూల్ను అప్డెట్ చేస్తుంది వాట్సాప్. రిడిజైన్ చేసిన టూల్ ‘మెనేజ్ స్టోరేజ్’ సబ్ మేనూలో అందుబాటులో ఉండనుంది. ఎందుకంటే...ఇందుకంటా! ‘డిన్నర్ పార్టీ కోసం’ ‘హాస్పిటల్కు వెళ్లాలి’ ‘సురేష్ వచ్చాడు’....కాల్ చేయడానికి ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. పీకలలోతు పనుల్లో మునిగిపోయి ముఖ్యమైన ‘కాల్’ను ఇగ్నోర్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ‘కాల్’కు ముఖ్య కారణం సూక్ష్మంగా చెప్పేస్తే ఇరుపక్షాలకి మేలే కదా. కాల్పికప్ రేట్ కూడా పెగుతుంది. ఈ ఉద్దేశంతోనే స్మార్ట్ఫోన్ అప్లికేషన్ ట్రూ కాలర్ ‘కాల్ రీజన్’ అనే కొత్త అప్లికేషన్ను తీసుకువస్తుంది. ‘సోషల్ మీడియాలో నెటిజెన్స్ పాప్లర్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని కాల్ రీజన్ ఫీచర్ను తీసుకువస్తున్నాం’ అని తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది ట్రూ కాలర్. -
తండ్రికి తగ్గ తనయ, ఏం చేసిందో చూశారా?
కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని ముద్దుల కుమార్తె జీవా ధోని ఇప్పటికే సోషల్మీడియాలో ఓ సెన్సెషన్. జీవా పలు సార్లు తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. క్యూట్ క్యూట్గా డ్యాన్స్లు వేయడం, తండ్రి మ్యాచ్ మధ్యలో అలసిపోతే మంచినీళ్లు తీసుకెళ్లి ఇవ్వడం, ధోనితో పాటు గ్రౌండ్లో డ్యాన్స్లు వేయడం వంటివి చేస్తూ... జీవా ధోని నెటిజన్లను ఫిదా చేస్తోంది. తాజాగా తండ్రికూతుర్ల ఓ క్యూటెస్ట్ పిక్చర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిలో కూడా జీవా.. మరోసారి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. ధోని, కూతురు జీవా ఇద్దరూ కూడా తమ తమ గాడ్జెట్లలో మునిగిపోయిన పిక్చర్ అది. ఓ హోటల్లో కూర్చుని ఉన్న వీరిద్దరూ.. చుట్టుపక్కల పరిసరాలన్నింటిన్నీ పట్టించుకోకుండా గాడ్జెట్లకు అతుకుపోయారు. ధోని తన ఐప్యాడ్ను వాడుతుండగా.. ఈ బుల్లి జీవా కూడా తన చిన్న ఐప్యాడ్ను తీసుకుని ఎంతో శ్రద్ధగా గమనిస్తూ కనిపించింది. ఈ పిక్చర్లో ధోని తన ట్రైనింగ్ జెర్సీ వేసుకుని కనిపించాడు. అంటే ఈ పిక్చర్ ఇటీవల సిరీస్ మ్యాచ్ల సమయంలో తీసిందేనని తెలిసింది. వారి టేబుల్పై టీ కప్పులు, సూప్ బౌల్స్ వంటివి ఉన్నాయి. ట్విటర్లో షేర్ అయిన ఈ పిక్చర్ ఇప్పుడు సోషల్ మీడియా యూజర్ల హృదయాలను కొల్లగొడుతోంది.ఇటీవల కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ కుమార్తె పూర్ణ పటేల్ వివాహంలో కూడా జీవా తన డ్యాన్స్తో నెటిజన్లను ఫిదా చేసింది. ముద్దుముద్దుగా జీవా వేసిన స్టెపులపై అభిమానులు పొగడ్తల వర్షం కురిపించారు. గతంలో కూడా జీవాకి సంబంధించిన వీడియోలని ధోని, సాక్షిలు ట్విట్టర్లో పోస్ట్ చేయడం, అవి కొద్ది నిమిషాలలోనే వైరల్గా మారడం సంగతి తెలిసిందే. Like father, like daughter. MS Dhoni and Ziva busy on their gadgets. pic.twitter.com/oxEKeMDeUQ — Circle of Cricket (@circleofcricket) August 15, 2018 -
ఆ సమయంలో మొబైల్ ఫోన్లు బ్యాన్
న్యూఢిల్లీ : ఇటీవల వాట్సాప్ లీక్ కేసు కంపెనీలను ఓ కుదుపు కుదిపేసిన సంగతి తెలిసిందే. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ, వాట్సాప్ లీక్ కేసు వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఈ లీక్ల్లో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న వారందర్ని సెబీ విచారిస్తోంది. తాజాగా కంపెనీలు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాయి. కంపెనీ ఆడిట్ సమావేశాల సమయంలో మొబైల్ ఫోన్లు, గాడ్జెట్లను కంపెనీలు అనుమతించకూడదని నిర్ణయించినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. లీకేజీలను నివారించడానికి, ఆడిట్ కమిటీ సమావేశాలను నిర్భందపూర్వక వాతావరణంలో, బడ్జెట్ను రూపొందించిన మాదిరిగా నిర్వహించాలనుకుంటున్నట్టు తెలిపాయి. అధికారికంగా కంపెనీలు తమ ఫలితాలను వెలువరించకముందే, వాట్సాప్ మెసేజ్ల ద్వారా, సోషల్ మీడియా చాట్రూంల ద్వారా కొన్ని బ్లూచిప్ కంపెనీలు, లిస్ట్ అయిన కంపెనీల సున్నితమైన సమాచారం లీక్ అయింది. ఈ కేసుపై సెబీ తీవ్ర స్థాయిలో విచారణ జరుపుతోంది. 30 మందికి పైగా మార్కెట్ విశ్లేషకులు, డీలర్లకు సంబంధించిన ప్రాంతాల్లో సెబీ తనిఖీలు కూడా చేసింది. సమాచారం లీక్ అయిన కంపెనీల్లో సిప్లా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, మహింద్రా హాలిడే, రిసోర్ట్స్లు ఉన్నాయి. వాట్సప్లో సమాచారం లీకేజి కేసులో సెబీ తొలిసారిగా యాక్సిస్ బ్యాంక్ను సైతం ఆదేశించింది. ఇందుకు సంబంధించి టెక్నాలజీ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని, అలాగే అంతర్గతంగా విచారణ జరుపాలని సెబీ సూచించింది. -
బీమా నుంచి గాడ్జెట్ల దాకా!!
మన దేశీ జనాభాలో దాదాపు సగం మంది పాతికేళ్ల కన్నా తక్కువ వయసున్న వారే. ఇక ముప్ఫై అయిదేళ్ల కన్నా తక్కువ వయసున్న వారిని చూస్తే ఏకంగా 65 శాతం. ఇందులో చాలా మంది ఇప్పటికే ఏదో ఒక ఉద్యోగం చేస్తున్న వారో.. లేదా త్వరలో చేరబోయే వారో, స్వయం ఉపాధిలో ఉన్నవారో ఉన్నారు. ఇంత భారీ స్థాయిలో యువజనాభా ఉండటం.. దేశానికి ప్రయోజనకరమే. అయితే, వీరంతా రిటైరయ్యాక పరిస్థితి ఏంటి? రిటైరయిన వారికీ భరోసానిచ్చేలా సామాజిక భద్రత పథకాలు, వృద్ధులకు చెప్పుకోతగ్గ స్థాయిలో ఆదాయాన్నిచ్చే ఆర్థికపరమైన తోడ్పాటు మన దగ్గర లేకపోవడంతో.. వీరంతా తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు సమస్యలు తప్పవు. పైగా.. దేశీయంగా ఉద్యోగానికి సైతం భద్రత తగ్గిపోతోంది. అందుకే... నేటి యువతరం కాస్త ముందు నుంచే ఆర్థిక ప్రణాళికలను వేసుకోవడం మంచిది. భవిష్యత్ అవసరాలు చిన్నవైనా, పెద్దవైనా... లక్ష్యాలు స్వల్పకాలికమైనా, దీర్ఘకాలికమైనవైనా... స్మార్ట్గా అధిగమించవచ్చు. స్వల్ప, మధ్యకాలిక లక్ష్యాల కోసం సిప్లు.. అన్నింటికన్నా ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి తీసుకోవడం ప్రధానం. మీ కంపెనీ నుంచి ఆరోగ్య బీమా కవరేజీ ఉన్నప్పటికీ.. కుటుంబం మొత్తానికి ఉపయోగపడేలా ప్రత్యేకంగా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ఒకటి తీసుకోవడం శ్రేయస్కరం. ఇందుకోసం ప్రీమియం వార్షికంగా చెల్లించేలా ప్లాన్ చేసుకోండి. మిగతా కాలవ్యవధులతో పోలిస్తే.. దీని వల్ల ప్రీమియం కొంత తగ్గుతుంది. అటుపైన స్వల్పకాలిక డెట్ ఫండ్లో నెలవారీగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో (సిప్) ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టండి. తర్వాత ప్రతి ఏటా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి అవసరమైన మొత్తాన్ని క్రమంగా సదరు డెట్ఫండ్ సిప్ నుంచి విడ్డ్రా చేసి కట్టేయొచ్చు. ఈ విధానంతో రెండురకాల ప్రయోజనాలుంటాయి. మొదటిది... వార్షికంగా కట్టడం వల్ల ప్రీమియం కొంత తగ్గుతుంది. అదే సమయంలో మీరు సిప్లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చే పెట్టుబడి ఏడాది పొడవునా ఎంతో కొంత రాబడి అందిస్తూనే ఉంటుంది. అలాగే, కాస్త ముందుగా ప్లాన్ చేసుకుంటే.. స్మార్ట్ఫోన్లూ, ల్యాప్టాప్లు, బైక్లు, కార్లు.. ఇతర గాడ్జెట్స్ లాంటివి కొనుక్కోవడానికి ఈఎంఐల బాట పట్టకుండా సొంతంగానే కొనుక్కునే వీలుంటుంది. ఇందుకోసం కూడా స్వల్పకాలిక సిప్లు ప్రారంభించవచ్చు. తర్వాత వాటి నుంచి కొద్దికొద్దిగా విత్డ్రా చేసుకుని మీరు కోరుకున్న గాడ్జెట్స్.. లేదా వస్తువులు కొనుక్కోవచ్చు. దీర్ఘ కాలికానికీ సిప్లు... యుక్త వయసులో కాస్త రిస్కు సామర్థ్యం ఎక్కువగానే ఉంటుంది కనుక... దీర్ఘకాలంలో అధిక రాబడులిచ్చే అవకాశాలున్న ఈక్విటీల్లో అధికంగా ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే దీర్ఘకాలికంగా షేర్లలో రిస్కులు క్రమంగా తగ్గి రాబడులు పెరిగే అవకాశాలుంటాయి. పైపెచ్చు అనేక సంవత్సరాలుగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండటం వల్ల చక్రవడ్డీ తరహా కాంపౌండింగ్ మహిమ కూడా తోడై మరింత మెరుగైన రాబడులందుకునే ఆస్కారముంటుంది. చాలా మటుకు మిగతా ఇన్వెస్ట్మెంట్ సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో ఈక్విటీలు అధిక రాబడులు అందిస్తాయి. యుక్తవయస్సులోనే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టడం వల్ల పెట్టుబడుల్లో ఒకటి రెండు తప్పిదాలేమైనా చేసినా.. సత్వరం సరిదిద్దుకునేందుకు కొంత అవకాశం ఉంటుంది. అదే రిటైర్మెంట్కి దగ్గరవుతుండగా.. ఏ చిన్న తప్పిదం చేసినా సరిదిద్దుకునేందుకు ఎక్కువ సమయం ఉండదు. టాప్ రేటెడ్ ఫండ్స్లోనే... దీర్ఘకాలంలో సంపదను గణనీయంగా పెంచుకునే దిశగా టాప్ రేటెడ్ ఈక్విటీ ఫండ్స్లో మాత్రమే సిప్ చేయడం మంచిది. అత్యంత తక్కువగా రూ.1,000 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించి... జీతం పెరిగే కొద్దీ కేటాయింపులూ పెంచుకుంటూ వెళ్లండి. ఉదాహరణకు.. సగటున పదిహేను శాతం వార్షిక రాబడులు ఇచ్చే సిప్లో ప్రతి నెలా రూ. 1,000 పెట్టుబడితో మొదలుపెట్టారనుకుందాం. ఏటా ఈ మొత్తాన్ని రూ. 1,000 చొప్పున పెంచుకుంటూ పోతే.. ముప్ఫై ఏళ్ల తర్వాత ఏకంగా రూ. 4.8 కోట్ల సంపద పోగవుతుంది. కాబట్టి స్మార్ట్గా ఇన్వెస్ట్ చేస్తే.. లక్ష్యం ఎలాంటిదైనా సులువుగా సాధించవచ్చు. -
ఫ్లిప్హార్ట్ సేల్..రెడ్ మి నోట్5 గెలుచుకోవచ్చు
సాక్షి,ముంబై: ఇపుడు ఎక్కడ చూసినా వాలెంటైన్స్ డే ఫీవర్ కనిపిస్తోంది. ఈకామర్స్ దిగ్గజాలు ఆఫర్ల మీద ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఫ్లిప్కార్ట్ 'ది ఫ్లిప్హార్ట్ డే' పేరుతో స్పెషల్ డిస్కౌంట్లను అందిస్తోంది. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న స్మార్ట్ఫోన్లపై 14శాతం డిస్కౌంట్ను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ స్పెషల్ సేల్ ఫిబ్రవరి 14 అర్థరాత్రినుంచి ప్రారంభం కానుంది. అంతేకాదు షావోమి లాంచ్ చేయనున్న రెడ్మి నోట్ 5ను ఉచితంగా అందుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. స్మార్ట్ఫోన్లతోపాటు ఇతర గాడ్టెట్లపైనా 14శాతం రాయితీ ఆఫర్ చేస్తోంది. అలాగే దుస్తులు, పాదరక్షలు, ఇతర ఉపకరణాలు, సౌందర్య ఉత్పత్తులు, బొమ్మలు, గేమ్స్, పుస్తకాలపై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఫర్నిచర్, ల్యాప్టాప్స్, కెమెరా తదితరాలపై 40 నుండి 80 శాతందాకా డిస్కౌంట్. టీవీలు, ఇతర గృహోపకరణాలపై కొనుగోలుదారులు 70 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. గివ్ మీ5 హ్యష్ట్యాగ్ ద్వారా రెడ్మీ ఫోన్ను గెలుచుకునే అవకాశం కూడా ఉంది. మరోవైపు రెడ్మి నోట్ 5ను ఫిబ్రవరి 14న లాంచ్ చేయనుంది అంచనా. ఇండియాలోనెం.1 బ్రాండ్స్మార్ట్ ఫోన్ను తమ వెబ్సైట్లో లాంచ్ చేయనున్నామన్న ప్రకటనతో.. అది రెడ్ మి నోట్ 5 కావచ్చని భావిస్తున్నారు. అంతేకాదు వినియోగదారులు ఫ్రీ గిఫ్ట్లను గెలుచుకునేందుకు ప్రత్యేకమైన యాప్ గేమ్స్ నిర్వహిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా కస్టమర్లే తమకు బలమైన మూలస్థంభాలుగా నిలుస్తున్నారని, వారి ప్రేమతోనే ఫ్లిప్కార్ట్ మార్కెట్లీడర్గా ఎదిగిందని సీనియర్ డైరెక్టర్ స్మృతి రవిచంద్రన్ పేర్కొన్నారు. వారి ప్రేమను మరింత గెలుచుకోవడానికి , ఫ్లిప్హార్ట్ సేల్స్ ద్వారా ప్రేమికుల రోజున తమ కస్టమర్లకు మంచి అనుభూతినివ్వాలని భావిస్తున్నామన్నారు. ఈ ఆఫర్లు కేవలం హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డు వినియోగదారులకు మాత్రమే. Unleash your creative side. Last chance to win 5 #GiveMe5 Participate now - https://t.co/XZ3BIRZJdg pic.twitter.com/b6kfXBq8dd — Redmi India (@RedmiIndia) February 13, 2018 -
నిద్ర సమస్యలకు హైటెక్ కళ్లజోడు!
ఆరోగ్య పరిరక్షణలో టెక్నాలజీ వాడకం కొత్తేమీ కాదు. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త, వినూత్న వైద్య పద్ధతులు అందుబాటులోకి వస్తూండటం విశేషం. అమెరికాలోని లాస్వేగస్లో ప్రస్తుతం జరుగుతున్న కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్ –2018)లో ఈ ఏడాది కనిపించిన టెక్నాలజీలే ఇందుకు తార్కాణం. ఒత్తిడిని తగ్గించే హెడ్బ్యాండ్, వయోవృద్ధులు మందులు సరిగా తీసుకుంటున్నారా? లేదా? అన్నది చెక్ చేసేందుకు కాలి సాక్స్లో దాగే సెన్సర్లు.. తుంటి ఎముకలకు రక్షణ కల్పించే వినూత్న బ్యాగ్ వంటివి మచ్చుకు కొన్నే.. ఒక్కోదాని వివరాలు చూసేద్దాం... నిద్ర సమస్యలకు హైటెక్ కళ్లజోడు! నిద్ర పట్టకపోయినా.. ఉదయాన్నే నిద్రలేవాలంటే బద్ధకంగా అనిపిస్తున్నా తెల్లవారకముందే మెలకువ వచ్చేస్తున్నా.. ఈ హైటెక్ కళ్లద్దాలు వాడేయమంటోంది పెగాసీ గ్లాస్ అనే సంస్థ. ఫ్రేమ్ లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైట్ల కారణంగా సుఖనిద్రకు కావాల్సిన మెలటోనిన్ను నియంత్రించవచ్చునన్నది కంపెనీ అంచనా. తద్వారా మన శరీరాల్లోని గడియారం సహజస్థితికి చేరుతుందని.. నిద్ర సమస్యలన్నీ దూరమవుతాయని కంపెనీ అంటోంది. ఒక్కో కళ్లజోడు ఖరీదు రూ.12 వేల వరకూ ఉంటుంది! ఒత్తిడికి విరుగుడు ఈ హెడ్బ్యాండ్ కెనడాకు చెందిన స్టార్టప్ ఇంటరెక్సాన్ ‘మ్యూజ్’ పేరుతో అభివృద్ధి చేసిన ఈ హెడ్బ్యాండ్ మన మెదడులోని నాడుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఒత్తిడిని తగ్గిస్తుందట. ధాన్యం చేసేటప్పుడు ఒక అంశంపై దృష్టి కేంద్రీకరించేందుకు, అథ్లెటిక్స్ పోటీల్లో ఒత్తిడిని జయించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. దక్షిణ కొరియాకు చెందిన లూక్సిడ్ ల్యాబ్స్ కూడా ఇలాంటి పరికరాన్నే ప్రదర్శించినప్పటికీ ప్రస్తుతం తాము పరిశోధన దశలోనే ఉన్నామని కంపెనీ ప్రకటించింది. వృద్ధుల స్థితిగతులపై కన్నేసేందుకు.. మతిమరపు లేదంటే అయిష్టత కారణంగా వయసు మీదపడిన వారు మందులు తీసుకునేందుకు అంతగా ఇష్టపడరు. ఈ సమస్యకు పరిష్కారంగా వాషింగ్టన్ స్టార్టప్ కంపెనీ సెన్సోరియా పేరుతో ఓ వినూత్నమైన గాడ్జెట్ను సిద్ధం చేసింది. వ్యాయామ సమయంలో శరీర కదలికలను గుర్తించి.. తప్పుఒప్పులను సరిచేసేందుకు కొన్నేళ్ల క్రితం సిద్ధం చేసిన ఓ గాడ్జెట్నే ప్రస్తుతం వృద్ధులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారు. మన దుస్తులకు గానీ, సాక్స్కుగానీ ఈ గాడ్జెట్ను తగిలించుకుంటే.. వ్యాయామం సరిగా చేస్తున్నారా లేదా?, మందులు సక్రమంగా తీసుకుంటున్నారా? వంటి అంశాలన్నింటినీ వారికి గుర్తు చేస్తూంటుంది ఇది. తుంటి ఎముకలకు రక్షణ కవచం.. వృద్ధులు పొరబాటున జారిపడితే తుంటి ఎముకలకు నష్టం జరగడం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వారి కోసమే ఫ్రాన్స్ కంపెనీ హెలైట్ తుంటిభాగానికి రక్షణ కల్పించే ఓ హైటెక్ సంచిని తయారు చేసింది. నడుముకు తగిలించుకుని వెళుతూంటే చాలు.. వాటిలోని మోషన్ సెన్సర్స్ మన కదలికలపై ఓ కన్నేసి ఉంచుతాయి. ప్రమాదవశాత్తూ పడిపోతే.. ఇవి వెంటనే స్పందిస్తాయి. గాలి బుడగలు విచ్చుకునేలా చేస్తాయి. ఫలితంగా సున్నితమైన తుంటి ఎముకలకు రక్షణ ఏర్పడుతుందన్నమాట. -
పాత ధరల్లోనే గ్యాడ్జెట్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్
ఢిల్లీ : దేశమంతా ఒకే పన్ను విధానం జీఎస్టీ జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేసింది. జూలై 1 నుంచి ఈ పన్ను విధానం అమల్లోకి వచ్చినప్పటికీ, చాలామంది చిన్న మొబైల్ రిటైలర్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్లు ఇంకా ప్రీ-జీఎస్టీ ధరల్లో ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. పాత ఇన్వెంటరీని క్లియర్ చేసుకునేందుకు లేదా కొత్త పన్ను విధానంలోకి మారేందుకు సన్నద్ధంగా లేకపోవడంతో ఈ రిటైలర్లు బ్యాక్డేటెడ్ బిల్లుల ద్వారా వీటిని విక్రయిస్తున్నట్టు తెలిసింది. జీఎస్టీ రేట్లతో కొత్త స్టాక్ వచ్చేంతవరకు అంటే వచ్చే రెండు మూడు రోజుల వరకు ఈ బ్యాక్డేటెడ్ బిల్లింగ్ ద్వారానే రిటైలర్లు విక్రయాలు చేపడతారని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రి అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్లో గందరగోళ వాతావరణం ఏర్పడిందని, కొత్త పన్ను విధానంలోకి మారడానికి అందరూ రిటైలర్లు సిద్ధంగా లేరని ఓ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీదారి సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. సాఫ్ట్వేర్ అప్డేట్ను బిల్లింగ్ సిస్టమ్స్ చేయాల్సి ఉందని, దానికి మరికొంత సమయం పడుతుందన్నారు. అంతేకాక ఎవరైతే పాత స్టాక్ను ఎక్కువగా కలిగిఉన్నారో వారికి కూడా నష్టాలు వస్తున్నాయని చెప్పారు. కేవలం 30-60 రోజలు స్టాక్కు మాత్రమే పరిహారం ఇవ్వడానికి కంపెనీలు సిద్దమవుతున్నాయని తెలిపారు. జీఎస్టీ అమలుతో చాలా ఉత్పత్తులపై ధరలు పెరిగాయి. ధరలు పెరుగుతాయనే భయాందోళనతో చాలామంది వినియోగదారులు కూడా ముందస్తుగానే ఉత్పత్తులను కొనుగోళ్లు చేశారు. దీంతో శనివారం నుంచి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్ స్టోర్లు బోసిపోయాయి. జీఎస్టీతో పన్ను రేట్లు పెరుగడంతో ఈ నెల ప్రారంభం నుంచి తమ విక్రయాలు 60 శాతం పైగా పడిపోయాయని జువెల్లరీ వర్తకులు చెప్పారు. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండీషనర్ల షాపులదే ఇదే పరిస్థితి. వీటిపై పన్ను రేట్లు 26 శాతం నుంచి 28 శాతానికి పెరిగాయి. దీంతో బ్యాక్డేటెడ్ బిల్లుతో రిటైలర్లు విక్రయాలు చేపడుతున్నారు. -
అమెరికా ఆంక్షలు: ఆ రెండింటికి తెగ లాభం
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం తీసుకున్న మరో వివాదాస్పద నిర్ణయం దేశీయ విమానయసంస్థలకు లాభం చేకూర్చనుందట. కెమెరాలు, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రిక్ పరికరాలను ఎనిమిది ముస్లిం దేశాల నుంచి వచ్చే విమానాల క్యాబిన్లలోకి తీసుకురాకుండా ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలతో దేశీయ విమానసంస్థలు జెట్ ఎయిర్ వేస్, ఎయిర్ ఇండియాలు లబ్ది పొందనున్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఎక్కువ సమయం ప్రయాణించే బిజినెస్ ట్రావెలర్స్ కచ్చితంగా ల్యాప్ టాప్స్, ఐప్యాడ్స్ ను ఆన్ బోర్డులో తీసుకెళ్తుంటారు. కానీ తాజా ఆదేశాలతో బిజినెస్ ట్రావెలర్స్ సమావేశాల కోసం ముందస్తుగా సన్నద్ధమయ్యే ఆన్ బోర్డు వర్క్ పై ప్రభావం పడనుంది. దీంతో ల్యాప్ టాప్స్ ను అనుమతించే విమానాలనే వారు ఎంపికచేసుకుంటారని ఆన్ లైన్ పోర్టల్ యాత్రా.కామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శరత్ ధాల్ చెప్పారు. ఆన్ బోర్డులో ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించే జెట్ ఎయిర్ వేస్, ఎయిర్ ఇండియాలనే వారు ఇక ఎక్కువగా ఎంపికచేసుకునే అవకాశముంటుందని తెలిపారు. అయితే ఈ విషయంపై జెట్ ఎయిర్ వేస్ స్పందించలేదు. ఎయిర్ ఇండియా మాత్రం తాము ఈ ఆదేశాలతో లబ్ది పొందుతామని విశ్వసిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం అమెరికాకు వెళ్లే తమ విమానాలు 90 శాతం వరకు సీట్లు నిండిపోయాయి, చాలావరకు సర్దుబాటు చేయలేకపోతున్నామని ఓ సీనియర్ ఎయిర్ ఇండియా అధికారి చెప్పారు. తాజాగా జారీఅయిన ఆదేశాల్లో 10 అంతర్జాతీయ విమానశ్రయాల నుంచి అమెరికాకు, యూకేకు ప్రయాణించే నాన్ స్టాప్స్ విమానాలపై ఆంక్షలు విధించారు. కైరో(ఈజిప్టు), దుబాయి, అబుదాబీ(యూఏఈ), ఇస్తాంబుల్(టర్కీ), దోహ(ఖతార్), అమ్మన్(జోర్డాన్), కువైట్ సిటీ, కాసాబ్లాంకా(మొరాకో), జెడ్డా, రియాద్(సౌదీఅరేబియా) నగరాల్లోని 10 అంతర్జాతీయ విమానశ్రయాలపై ఈ ఆంక్షల ప్రభావం పడనుంది. దీంతో ఆ మార్గాల గుండా ప్రయాణించే వారు ఇక దేశీయ విమానాలను ఎంచుకునే అవకాశముంటుంది. -
గాడ్జెట్లతో గడిపితే మార్కులు అంతంత మాత్రమే
టొరంటో: వీడియో గేమ్స్, ఫోన్లు, టీవీలతో ఎక్కువ సమయం గడిపే టీనేజీ కుర్రాళ్లకు మాథ్స్, ఇంగ్లిష్లలో తక్కువ మార్కులు వస్తాయని తాజా పరిశోధనలో తేలింది. ఎక్కువ సమయం వివిధ గాడ్జెట్లతో గడపడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందని యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకు చెందిన పరిశోధకుడు అమి ఫీన్ తెలిపారు. ఒకై వైపు టీవీ చూస్తూ ఫోన్ వాడడం లాంటి పనులు ఒకేసారి చేయడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుందని ఫీన్ అన్నారు. 73 మంది టీనేజీ కుర్రాళ్లపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయని ఆయన చెప్పారు. ‘పరిశోధనలో పాల్గొన్న విద్యార్థులు సగటున వారానికి 12 గంటలు టీవీ చూసినా, వారంలో 25 శాతం సమయాన్ని ఫోన్లు, వీడియోగేమ్స్తో గడిపేవారు. మిగతా వారికంటే ఈ విద్యార్థులకు పరీక్షలలో చాలా తక్కువ మార్కులు వచ్చాయ’ని ఫీన్ పేర్కొన్నారు. ఈ వివరాలు స్ప్రింగర్ సైకోనమిక్ బులిటెన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
ఇంటర్నెట్ ఉన్న గాడ్జెట్లతో ఇబ్బందులే...
ఇంటర్నెట్ కనెక్టెడ్ పరికరాలతో భవిష్యత్తు భయంకరంగా మారే అవకాశం ఉందంటున్నారు సైబర్ భద్రతా నిపుణులు. ఇంట్లోని గాడ్జెట్లే ఇబ్బందులకు గురి చేసే అవకాశం కనిపిస్తోందని పానాసోనిక్ సైబర్ భద్రతా చీఫ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేకొద్దీ ప్రతి వస్తువూ ఇంటర్నెట్ ఆధారితంగా మారుతోందని, అయితే వీటి విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. నాణ్యతలేని పరికరాల వాడకంతో పాటు... వినియోగదారుల నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారే ప్రమాదం కనిపిస్తోందంటున్నారు. హ్యాకర్ ప్రూఫ్ లేని వస్తువులను కొనుగోలు చేసేముందు ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నారు. నాణ్యతలేని పరికరాలతో కూడిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో ప్రమాదాలు తప్పవంటున్నారు జపాన్ భద్రతా నిపుణులు. ఇంటర్నెట్ కనెక్షన్ తో వాడే పరికరాలతో భవిష్యత్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పానాసోనిక్ సైబర్ భద్రతాధికారి హికో హిటోలిన్ చెప్తున్నారు. తక్కువ ఖరీదులో వెలువడే ఉత్పత్తుల్లో నాణ్యత లోపిస్తోందని, అలాంటివాటిపై మోజు పెంచుకోవడం ప్రమాదాలకు కారణమౌతుందని హెచ్చరిస్తున్నారు. ఈ గాడ్జెట్లు వేడెక్కడంవల్ల ఇంట్లో మంటలు చెలరేగి ఎందరో మరణించిన దాఖలాలు కూడా ఉన్నాయని అంటున్నారు. గృహ పరికరాల్లో ముఖ్యంగా టంబల్ డ్రయ్యర్లు ప్రమాదకరంగా ఉంటున్నాయని, గత ఆరేళ్ళలో బ్రిటన్లో సుమారు 6 వేల డ్రయ్యర్లు పేలి... మంటలు వ్యాపించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం వెబ్ కనెక్షన్తో వెలువడే ప్రతి ఉత్పత్తిపైనా దృష్టి సారిస్తున్నామని, ముఖ్యంగా వేడెక్కే వస్తువులన్నింటిపైనా చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్నెట్ ఆధారిత పరికరాల విషయంలో ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్ అప్ డేట్ అయ్యేలా చూసుకోవాలని, హ్యాకర్ల దాడి నుంచి రక్షణ కోసం ఇది తప్పనిసరని సూచిస్తున్నారు. దాంతోపాటు ప్రమాదాలకు దూరంగా ఉండాలంటే వినియోగదారులు కూడా తమ తమ గాడ్జెట్లకు ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్లు అప్ డేట్ చేసుకోవడం ఎంతైనా అవసరమంటున్నారు. -
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు కుచ్చుటోపీ..!
ఖరీదైన వస్తువులు అతి తక్కువ ధరకు వస్తున్నాయంటే ఎవరికైనా ఆశే మరి! సరిగ్గా అలాంటి ఆశే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నిండా ముంచేసింది. రూ.60 వేలకు రెండు యాపిల్ ఐఫోన్లతోపాటు మ్యాక్ బుక్ కూడ ఇస్తామంటే 'మంచి బేరమేకదా' అనుకున్నాడు. తీరా డబ్బులు చెల్లించాకగానీ తాను మోసపోయానని తెలుసుకోలేకపోయాడు. బెంగళూరుకు చెందిన 36 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వెంకటనారాయణను అడ్రస్ అడిగే నెపంతో ఇద్దరు వ్యక్తులు కలిశారు. మాటల మధ్యలో బ్యాగ్ లోని యాపిల్ ప్రొడక్ట్స్ చూపించి కొనమని అడిగారు. పైగా వాటిని అరవై శాతం డిస్కౌంట్ కు ఇస్తామన్నారు. వెంకటనాయరాయణను నమ్మించేందుకు ఆ వస్తువుల బిల్లులను కూడ చూపించారు. అంతఖరీదైన వస్తువులు తక్కువ ధరకు వస్తుండటంతో ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. అప్పటికప్పుడే ఏటీఎంనుంచి డబ్బు డ్రాచేసి మరీ ఇచ్చి వాటిని సొంతం చేసుకున్నాడు. మోసగాళ్ల నుంచి బ్యాగ్ తీసుకున్న కాసేపటితర్వాత తెరచిచూస్తే అందులో ఉన్నది ఒట్టి ఇటుక మాత్రమేనని గ్రహించిన ఇంజనీర్.. పోలీసులకు ఫిర్యాదుచేశాడు. తాను మోసపోయినందుకు ఎంతో సిగ్పడుతున్నానని, అయితే, తనలా మరెవరూ మోసపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని నారాయణ చెప్తున్నాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ను బట్టి దుండగుల ఆచూకీ తెలిసే అవకాశం ఉండొచ్చని పోలీసులు భరోసా ఇచ్చారు. -
ప్రశాంతతే అతిపెద్ద లగ్జరీ..!
కార్లు, గాడ్జెట్లను లగ్జరీ వస్తువులుగా చూసే కాలం చెల్లి పోయింది. పరుగుల బతుకుల్లో ప్రశాతను కోరుకునే వారే ఎక్కువైపోయారు. సెలవుల్లోనూ, ఖాళీ సమయాల్లోనూ కారులో షికారుకెడదామన్న ఆలోచననూ వదిలేశారు. ఒంటరిగా ఓ గంట గడపడమే ఎంతో అపురూపంగా ఫీలవుతున్నారు. ఇప్పుడు భారతీయుల్లో సగానికిపైగా జనం ప్రశాంతతనే కోరుకుంటున్నారని సర్వేలు సైతం చెప్తున్నాయి. ఈ కాలంలో ఒంటరితనమే అత్యంత లగ్జరీ వస్తువు అని ఇటీవల జరిపిన ఓ సర్వే తేల్చి చెప్పింది. నేటితరం వ్యక్తిగత సమయం, స్వేచ్ఛ కోరుకుంటోందని ఓ సంస్థ చేపట్టిన గ్లోబల్ సర్వే చెప్తోంది. తైవాన్ల ప్రధాన టెక్ సంస్థ ఆసస్ (ASUS) నిర్వహించిన సర్వేలో భారతదేశంలో నలభై శాతం మంతి ప్రజలు స్వేచ్ఛగా, వారికి ఇష్టమైనట్లుగా సమయాన్ని గడపడం లగ్జరీగా భావిస్తున్నారని తెలుసుకున్నారు. మిలీనియల్ కన్జూమర్ గ్లోబల్ సర్వే లో భారతదేశం, అమెరికా, బ్రిటన్, రష్యా, ఇండోనేషియా సహా అయిదు ప్రాంతాల్లోని సుమారు 19 నుంచి 35 ఏళ్ళ మధ్య వయసున్నవినియోగదారులు పాల్గొన్నారు. వీరిలో భారతదేశ ప్రజలు ఎక్కువగా ఒంటరితనాన్ని, స్వేచ్ఛగా గడపడాన్ని లగ్జరీగా భావిస్తున్నట్లుగా తెలుసుకున్నారు. ప్రజల జీవితాల్లో 'టాబ్లెట్ల' పాత్ర గురించి తెలుసుకునేందుకు ఆసస్ (ASUS) సంస్థ సర్వే నిర్వహించింది. ఎటువంటివారు తమ టెక్నాలజీని ఎక్కువగా వినియోగిస్తున్నారు అన్న విషయంపై ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో... వ్యక్తుల స్వభావాలగురించి వెల్లడైంది. నేటితరం ప్రజలు కొత్త పంథాలో ఆలోచిస్తున్నారనీ, సమూహంలో ఉండేకంటే... తమకిష్టమైనట్లుగానూ, స్వేచ్ఛగానూ ఉండేందుకే ఇష్టపడుతున్నారని మొబైల్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఎరిక్ హెర్మాన్సన్ తెలిపారు. ముఖ్యంగా 1980 తర్వాత పుట్టినవారు వ్యక్తిగత స్వేచ్ఛను, ఒంటరి సమయాన్ని లగ్జరీగా భావిస్తున్నట్లు తెలిపారు. రోజువారీ జీవితాన్ని ఆస్వాదించడంలో మొబైల్స్, టాబ్లెట్స్ వంటి వస్తువులు సహకరిస్తున్నాయని అరవై శాతం మంది చెప్తున్నట్లు సర్వే ద్వారా తెలుసుకున్నారు. టెక్నాలజీ కూడ రొటీన్ నుంచి ప్రశాంతతను అందిస్తున్నట్లుగా జనం భావిస్తున్నారంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి కుటుంబాలు, స్నేహ సంబంధాలకు దూరంగా ఉంటున్న స్పీడు యుగంలో... ఒంటరిగా, స్వేచ్ఛగా బతకడమే సౌఖ్యంగా భావించే వారి సంఖ్య పెరుగుతున్నట్లుగా మరోమారు వెల్లడైంది. -
వైఫై సౌకర్యంతో టాటా ఫొటాన్ వాకీ...
టాటా వాకీ గుర్తుందా? ల్యాండ్లైన్ల జమానాలో లేటెస్ట్ ఎంట్రీగా వచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు కొత్త రూపం సంతరించుకుంది. వైర్లెస్ ఫోన్గా మాత్రమే కాకుండా వైఫై ద్వారా కనీసం ఐదు గాడ్జెట్స్కు ఇంటర్నెట్ సిగ్నల్స్ ఇవ్వగల సాధనంగా మారింది. టాటా టెలిసర్వీసెస్ ఇటీవలే విడుదల చేసిన ఈ టాటా ఫొటాన్ వాకీ వైఫై హాట్స్పాట్గానూ పనిచేస్తుంది. వైఫై కీ ఒకదాన్ని ఆన్ చేయడంతోనే వైఫై సేవలు పొందే అవకాశముండటం విశేషం. కుటుంబం మొత్తం ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కడైనా వైఫై సౌకర్యం పొందేందుకు ఇది ఎంతో ఉపయోగకరమని కంపెనీ అంటోంది. ధర, డేటా ప్లాన్ల కోసం కంపెనీ వెబ్సైట్ను సందర్శించండి. -
అరిచేతిలో ఒదిగిపోయిన ఆధునిక టెక్నాలజీ
టెక్నాలజీ.. 2014 సంవత్సరంలో సరికొత్త మలుపులు తిరిగింది. స్మార్ట్ఫోన్లు ఈ సంవత్సరమే రాజ్యమేలాయి. ఇంతకుముందు కూడా కొంతవరకు ఉన్నా.. ఈసారి మరింత వేగంగా జనంలోకి చొచ్చుకెళ్లాయి. ఫలితంగా మొబైల్ ఇంటర్నెట్ వాడకం గణనీయంగా పెరిగింది. రోజుకో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్లు రావడం, అవి కూడా చవక ధరల్లో అందుబాటులోకి రావడంతో ఎక్కువమంది వీటివైపు మొగ్గు చూపారు. ఇక ధర ఎంతైనా.. బ్రాండు పేరు, అందులో ఫీచర్లు బాగుంటే చాలు.. కొత్తదానికీ బోలెడంత ఆదరణ లభించింది. కేవలం ఫోన్లు మాత్రమే కాదు.. గూగుల్ గ్లాస్, మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ లాంటి సరికొత్త పరికరాలు టెక్నాలజీ ప్రియులకు పండగ చేశాయి. స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ వాడకం పెరగడంతో బ్యాటరీ బ్యాకప్ కోసం పవర్ బ్యాంకులు కూడా బాగా అమ్ముడయ్యాయి... ఈ ఏడాది ఎక్కువగా ఆదరణ పొందిన కొన్ని పరికరాలు.. వాటి వివరాలు చూద్దాం. ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ యాపిల్ సంస్థ విడుదల చేసిన ఈ రెండు ఫోన్లు మార్కెట్లను విపరీతంగా ముంచెత్తాయి. వీటికోసం జనం స్టోర్ల వద్ద క్యూలు కట్టారు. ఇంతకుముందు వచ్చిన యాపిల్ ఫోన్ల కంటే ఇవి కొంత పెద్దవి, వేగంగా పనిచేశాయి. ఐఫోన్ 6 సుమారు రూ. 53,500, 6 ప్లస్ అయితే 80,500 వరకు వెళ్లాయి. యాపిల్ వాచ్ యాపిల్ సంస్థ కొత్త వాచీని విడుదల చేసింది. ఇది కేవలం సమయాన్ని చూపించడమే కాదు.. దాన్ని ధరించినవాళ్ల ఆరోగ్యాన్ని కాపాడి, వారిని ఫిట్గా ఉంచుతుంది. ఇది కొత్త ఐఫోన్లతో పాటు వస్తుంది. దీనికి మాగ్నెటిక్ ఛార్జర్ ఉంటుంది. ఆరోగ్య, ఫిట్నెస్ యాప్లు ఉంటాయి. అంతేకాదు.. ఇది సమయం కూడా చూపిస్తుంది.. యాపిల్ ఐఓఎస్ 8 యాపిల్ పరికరాలన్నింటికీ ఉపయోగపడే ఆపరేటింగ్ సిస్టమ్ను అప్డేట్ చేశారు. కొత్తగా వచ్చిన ఐఓఎస్ 8 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ను సెప్టెంబర్ 17న విడుదల చేశారు. ఐప్యాడ్లలో స్క్రీన్ను రెండుగా విభజించడం దీని ప్రత్యేకత. అయితే.. దీనివల్ల డివైజ్లు బాగా స్లో అయ్యాయన్న ఫిర్యాదు కూడా వచ్చింది. శామ్సంగ్ గెలాక్సీ నోట్4 భారతీయ మార్కెట్లలో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన ఫాబ్లెట్ శామ్సంగ్ గెలాక్సీ నోట్ 4 కూడా ఈ ఏడాదే విడుదలైంది. దీపావళికి వచ్చిన ఈ గాడ్జెట్ ఖరీదు రూ. 58,300. ఇందులో ఆటో సెల్ఫీల లాంటి అద్భుతమైన ఫీచర్లున్నాయి. ఇది యాపిల్ ఐఫోన్ 6, 6ప్లస్ పరికరాలతో పోటీపడింది. ఇందులో 16 మెగాపిక్సెల్స్ వెనక కెమెరా, 3.7 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. మోటరోలా మోటో జి సెల్ఫోన్లను భారత దేశంలో తొలినాళ్లలోనే తెచ్చిన మోటరోలా కంపెనీ తాజాగా మోటో జి ఫోన్ విడుదల చేసింది. ఇందులో 4.5 అంగుళాల డిస్ప్లే, గీతలు పడని గొరిల్లా గ్లాస్ 3 స్క్రీన్, క్వాడ్ కోర్ 1.2 గిగా హెర్ట్జ్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్ ఉన్నాయి. గూగుల్ ఆండ్రాయిడ్ వన్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ తన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్లలో విడుదల చేసింది. దీని ధర రూ. 6,399. తక్కువ ధరలోనే ఫ్రంట్ కెమెరా కూడా అందించడం దీని ప్రత్యేకత. 1 జిబి మెమొరీ, క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, ఎక్కువ కాలం వచ్చే బ్యాటరీ దీని ప్రధాన ఫీచర్లు. డ్యూయల్ సిమ్, ఎఫ్ఎం రేడియో కూడా ఉన్నాయి. నోకియా లూమియా 525 ఏడాది క్రితం తొలిసారిగా విండోస్ ఓఎస్తో నోకియా సంస్థ లూమియా 520ని విడుదల చేసింది. అప్పటికి అది చాలా హిట్టయింది. కానీ, అందులో కేవలం 512 ఎంబీ ర్యామ్ ఉండటంతో తర్వాత చాలామంది దూరమయ్యారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని లూమియా 525ను జనవరిలో విడుదల చేశారు. బ్రహ్మాండమైన బ్యాటరీ, మెరుగైన ర్యామ్తో ఇది వచ్చింది. 10వేల రేంజిలో ఈ ఫోన్లు బాగా అమ్ముడయ్యాయి. గూగుల్ నెక్సస్ 6, 9, ఆండ్రాయిడ్ లాలీపాప్ గూగుల్ తన ఆండ్రాయిడ్ పేర్లన్నీ తినే పదార్థాలవే పెడుతుంది. అలాగే కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్కు లాలీపాప్ అని పెట్టి అక్టోబర్ 17న విడుదల చేసింది. జెల్లీబీన్ తర్వాత ఇది వచ్చింది. అలాగే, యాపిల్తో పోటీగా తన నెక్సస్ ఫోన్లను కూడా గూగుల్ తెచ్చింది. అయితే నెక్సస్ సిరీస్లో వచ్చిన రెండు మోడళ్లను రెండు వేర్వేరు కంపెనీలు తయారుచేశాయి. అమెజాన్ ఫైర్ ఫోన్ అమెజాన్ సంస్థ తన 'ఫైర్ ఫోన్' అనే హై ఎండ్ హ్యాండ్ సెట్ను విడుదల చేసింది. ఇది టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణ అని చెప్పుకొంది. ఇది యాపిల్, శాంసంగ్ ఫోన్లకు దీటుగా మార్కెట్లోకి వచ్చింది. దీనికి హెచ్డీ కెమెరా ఉంది. ప్లే స్టేషన్ 4 సోనీ సంస్థ విడుదల చేసే ప్లే స్టేషన్లంటే పిల్లలకు చెప్పలేనంత మోజు. ఈ సిరీస్లో ప్లే స్టేషన్ 4 జపాన్లో ఫిబ్రవరి 22న విడుదలైంది. ఇంతకు ముందు మోడళ్లతో పోలిస్తే నాజూగ్గా ఉండి.. తేలిగ్గా ఉండటంతో జనం కూడా బాగానే ఆదరించారు. దీనికి కొత్త డ్యూయల్ షాక్4 కంట్రోలర్ ఉండటంతో అందరికళ్లూ వెంటనే పడ్డాయి. ఇప్పటివరకు వచ్చిన ప్లే స్టేషన్ కంట్రోలర్లలో ఇదే టాప్. ఎక్స్ బాక్స్ వన్ మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన గేమింగ్ కన్సోల్ ఎక్స్ బాక్స్ వన్. ఇది ఆసియాలో అధికారికంగా సెప్టెంబర్ నెలలో విడుదలైంది. దీని ధర రూ. 39,990. దీనికి వైర్లెస్ కంట్రోలర్ ఉంది. కొత్త వినియోగదారులకు ఎక్స్ బాక్స్ లైవ్ గోల్డ్ను 14 రోజుల ట్రయల్ ఆఫర్ను కూడా ఇచ్చారు. ఇందులో బ్లూరే డిస్క్ డ్రైవ్ ఉంది. కేవలం చేతులు ఊపడం ద్వారా కూడా ఇందులో ఆటలు ఆడచ్చు. సోనీ ఎక్స్పీరియా జడ్3 కాంపాక్ట్ సోనీ తన ఎక్స్పీరియా సిరీస్లో జడ్2ను విడుదల చేసిన తర్వాత దానికంటే మరింత నాజూగ్గా జడ్3ని సెప్టెంబర్లో విడుదల చేసింది. దాని ధర రూ. 44వేలు. పాతదానికంటే చిన్న సైజులో ఉండటం, మెరుగైన బ్యాటరీ లైఫ్, మెరుగైన కనెక్టివిటీ దీని ప్రత్యేకతలు. బ్లాక్బెర్రీ పాస్పోర్ట్ బ్లాక్బెర్రీ సిరీస్లో ఇప్పటివరకు వచ్చిన అన్ని ఫోన్లలోకీ ఎక్కువ ఫీచర్లున్నది.. పాస్పోర్ట్. దీని ధర రూ. 45,777. ఇందులో 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజి, 3 జిబి ర్యామ్, క్వాడ్ కోర్ 2.2 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్ ఉన్నాయి. ఇక బ్లాక్బెర్రీ అనగానే గుర్తుకొచ్చే అనేక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. నోకియా లూమియా 830 మంచి స్టైలుతో.. అల్యూమినియం ఫినిష్తో వచ్చిన నోకియా లూమియా 830 ఈ సిరీస్లో వచ్చిన వాటిలో అన్నింటికంటే అత్యాధునికమైనది. దీనికి మంచి మెటల్ బటన్లు కూడా పెట్టారు. దాంతో చూసేందుకు చాలా అందంగా కనపడింది. దీని ధర సుమారు రూ. 25వేలు. నోకియా మాత్రమే కావాలనుకునేవాళ్లు.. దీన్ని అందిపుచ్చుకున్నారు. -
కొత్త ప్రపంచం 16th Nov 2014
-
కొత్త ప్రపంచం 28th Sep 2014
-
కొత్త ప్రపంచం 21st Sep 2014
-
కొత్త ప్రపంచం 14th Sep 2014
-
కొత్త ప్రపంచం 7th Sep 2014
-
కొత్త ప్రపంచం 3rd August 2014
-
కొత్త ప్రపంచం 13th July 2014
-
గ్యాడ్జెట్స్ ఉన్నవాడే గ్రీకువీరుడు!
ధోరణి ఒకప్పుడు అమ్మాయిలను మీకెలాంటి భర్త కావాలి అని అడిగితే... ప్రేమించేవాడు, పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడు, అర్థం చేసుకునేవాడు... అంటూ సమాధానాలు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఈ ఆన్సర్ మారింది. లేటెస్ట్ గ్యాడ్జెట్స్ మీద, టెక్నాలజీ మీద అవగాహన ఉన్నవాడు కావాలని చెబుతున్నారు. ఒక మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ చేసిన అధ్యయనంలో వెలువడిన వాస్తవమిది! అప్డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో వస్తున్న ఖరీదైన ఫోన్లను వాడే అబ్బాయిలంటే అమ్మాయిలకు విపరీతమైన క్రేజ్ ఉందట. అబ్బాయి క్యారెక్టర్ను అంచనా వేయడానికి ఫేస్బుక్ ఒక ఉత్తమమైన మాధ్యమం అని అమ్మాయిలు భావిస్తున్నారు. వాళ్లు ఎలాంటి పోస్టులను షేర్ చేస్తున్నారు, ఎలాంటి పేజ్లను లైక్ చేస్తున్నాడు అనే విషయాలను బట్టి అబ్బాయిల క్యారెక్టర్ మీద ఒక అంచనాకు వస్తున్నామని ఆ పెళ్లి సంబంధాల సైట్లో నమోదు చేసుకున్న అమ్మాయిలు పేర్కొన్నారు. ట్విటర్లో అకౌంట్ ఉన్న అబ్బాయి జగమెరిగినవాడిగా ఉంటాడని అనుకొంటున్నారు.