harbajan singh
-
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్కు చేరే జట్లు ఇవే.. అదేలా సాధ్యం భజ్జీ?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కు సమయం అసన్నమవుతోంది. పాకిస్తాన్, యూఏఈ అతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్లో కేవలం భారత్ ఆడే మ్యాచ్లు మాత్రమే దుబాయ్ వేదికగా జరగనుండగా.. మిగితా మ్యాచ్లన్నీ పాక్లోనే జరగనున్నాయి.ఈ టోర్నీ కోసం ఆతిథ్య పాక్ తప్ప మిగితా ఏడు దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను ప్రకటించాయి. అయితే ఈ ఐసీసీ ఈవెంట్కు సమయం దగ్గర పడుతుండడంతో మాజీ క్రికెటర్లు సెమీస్, ఫైనల్కు చేరే జట్లను అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) సైతం ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ చేరే జట్లను అంచనా వేశాడు.ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్ నాలుగు జట్లు సెమీఫైనల్కు చేరుతాయని క్రిక్ట్రాకర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ పేర్కొన్నాడు. అయితే ఇక్కడే భజ్జీ పప్పులో కాలేశాడు. ఎందుకంటే భజ్జీ ఎంచుకున్న జట్లలో మూడు టీమ్స్ ఒకే గ్రూపులో ఉన్నవి కావడం గమనార్హం.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో మొత్తం 8 జట్లు పాల్గోంటున్నాయి. వాటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఎలో బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్ న్యూజిలాండ్.. గ్రూపు-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు మాత్రమే సెమీ-ఫైనల్కు చేరుకుంటాయి.కానీ భజ్జీ మాత్రం గ్రూపు-ఎ నుంచే మూడు జట్లు సెమీస్కు చేరుకుంటాయని అంచనావేశాడు. మ్యాథమెటికల్గా ఒకే గ్రూపు నుంచి మూడు జట్లు సెమీస్కు చేరడం సాధ్యం కాదు. దీంతో నెటిజన్లు హార్బజన్ను ట్రోలు చేస్తున్నారు. ఈ మెగా ఈవెంటలో భారత్ తమ తొలి మ్యాచ్లో దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న అదే స్టేడియంలో దాయాది పాకిస్తాన్తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: #RavindraJadeja: 12 వికెట్లతో చెలరేగిన జడేజా.. పంత్ టీమ్ చిత్తు -
'డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి'.. భజ్జీ పోస్ట్ వైరల్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఘోర వైఫల్యం తర్వాత భారత జట్టు ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం కాస్త ఘాటుగా స్పందించాడు. భారత జట్టులో "సూపర్ స్టార్ సంస్కృతిని వీడాలని, కేవలం ప్రదర్శన ఆధారంగా మాత్రమే భవిష్యత్తు సిరీస్లకు ఎంపిక చేయాలని బీసీసీఐకి భజ్జీ సూచించాడు.ఈ క్రమంలో హర్భజన్ సింగ్ తాజాగా మరో క్రిప్టిక్ స్టోరీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘మార్కెట్లో ఏనుగు నడిచి వెళ్తుంటే డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవుతోంది. దీంతో ఈ మాజీ క్రికెటర్ ఎవరిని ఉద్దేశించి పోస్ట్ పెట్టాడా అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.బీజీటీ ఓటమి తర్వాత భజ్జీ ఏమన్నాడంటే?"ప్రస్తుతం భారత క్రికెట్లో సూపర్ స్టార్ సంస్కృతి బాగా పెరిగింది. జట్టుకు పేరు ప్రఖ్యాతుల ఉన్న వాళ్లు కాదు, బాగా ప్రదర్శన చేసేవారు కావాలి. సూపర్ స్టార్లు కంటే బాగా ఆడేవారు ఉంటేనే జట్టు విజయ పథంలో ముందుకు వెళ్తుంది. సూపర్ స్టార్ కావాలనుకునే వారు ఇంట్లోనే ఉండి క్రికెట్ ఆడాలి.మరో ఆరు నెలలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇప్పటి నుంచే ఇంగ్లండ్ టూర్కు ఎవరు వెళ్తారు? ఎవరికి చోటు దక్కదు? అన్న చర్చ మొదలైంది. ఇది సాధారణంగా ఎప్పుడూ జరిగేదే. నావరకు అయితే బాగా ఆడే వారే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలి. అప్పట్లోనే కపిల్దేవ్, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజ ఆటగాళ్లనే జట్టు నుంచి తప్పుకోవాలని సెలక్టర్లు సూచించారు.కాబట్టి ఇప్పుడు కూడా బీసీసీఐ, సెలక్టర్లు అదే పనిచేయాలి. ముఖ్యంగా సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాలి. భారత్ సూపర్స్టార్ సంస్కృతిని వదిలిపెట్టాలి. ఆటగాళ్లను వారి ప్రదర్శన బట్టి ఎంపిక చేయాలి"భజ్జీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.విరాట్ కోహ్లి, రోహిత శర్మ వంటి స్టార్ ప్లేయర్లను ఉద్దేశించే హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు తెగ చర్చించుకున్నారు. అంతలోనే తాజా పోస్ట్తో భజ్జీ మరోసారి వార్తలోకెక్కాడు. కాగా బోర్డర్ ట్రోఫీని 3-1 తేడాతో టీమిండియా కోల్పోయింది. బీజీటీని భారత్ చేజార్చుకోవడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సిరీస్లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దారుణ ప్రదర్శన కనబరిచారు.కోహ్లి ఓ సెంచరీ చేసినప్పటికి, రోహిత్ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అటు కెప్టెన్సీ, ఇటు వ్యక్తిగత ప్రదర్శన పరంగా తీవ్ర నిరాశపరిచాడు. దీంతో ఈ సీనియర్ ద్వయం టెస్టు క్రికెట్కు విడ్కోలు పలకాలని చాలా మంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.అయితే భారత్ తదుపరి టెస్టు పర్యటనకు మరో ఆరు నెలలు ఉంది. ఈ ఏడాది జూన్లో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటించనుంది. కోహ్లి, రోహిత్ టెస్టుల్లో కొనసాగుతారా లేదా అన్నది తెలియాలంటే మరో 6 నెలలు ఆగక తప్పదు.చదవండి: SA T20: జూనియర్ ఏబీడీ విధ్వంసం.. తొలి మ్యాచ్లో సన్రైజర్స్ చిత్తు -
ధోని కంటే రోహిత్ చాలా డిఫరెంట్ కెప్టెన్: హర్భజన్
ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ.. ఇద్దరూ భారత క్రికెట్ జట్టుకు వరల్డ్కప్లు అందించిన కెప్టెన్లు. అయితే రోహిత్ గొప్ప, ధోని గొప్ప అంటే మాత్రం సమాధనం చెప్పలేం. ఎందుకంటే కెప్టెన్సీలో గానీ, ఆటలో గానీ ఎవరికి వారే మేటి. తాజాగా ధోని, రోహిత్ శర్మ కెప్టెన్సీ శైలుల గురించి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని, రోహిత్ ఇద్దరూ వేర్వేరు కెప్టెన్సీ స్టైల్స్ను కలిగి ఉన్నారని భజ్జీ చెప్పుకొచ్చాడు.కెప్టెన్సీలో ధోని, రోహిత్లకు ఎటువంటి పోలిక లేదు. ఇద్దరూ వేర్వేరు కెప్టెన్సీ శైలిలను కలిగి ఉన్నారు. ధోని కెప్టెన్సీలో నేను భారత జట్టుతో పాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడాడు. హైదరాబాద్తో మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో కేన్ విలియమ్సన్ వరసుగా బౌండరీలు బాది ఒత్తడిలోకి నెట్టాడు. ఆ సమయంలో షార్ట్ ఫైన్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాను. వెంటనే ధోని వద్దకు వెళ్లి ఠాకూర్ తన బౌలింగ్ లెంగ్త్ను మార్చుకుంటే బాగుంటుందని సూచించాను. కానీ ధోని మాత్రం పాజీ నేను ఇప్పుడు అతనితో చెబితే, శార్ధూల్ ఎప్పటికీ నేర్చుకోడు. తనంతట తానే నేర్చుకోనివ్వండి అంటూ నాతో అన్నాడు. ఇది ధోని స్టైల్ కెప్టెన్సీ. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ మరో రకం. రోహిత్ చాలా డిఫరెంట్. అతను వెళ్లి ప్రతి ప్లేయర్తో మాట్లాడతాడు. ఆటగాడి భుజం మీద చేయి వేసి తన నుంచి ఏమి ఆశిస్తున్నాడో చెబుతాడు. మీరు చేయగలరన్న నమ్మకం అతడు కలిగిస్తాడు. టెస్టు క్రికెట్లో కెప్టెన్గా వ్యవహరించినప్పటి నుంచి హిట్మ్యాన్ మరింత మెరుగయ్యాడు. ఎవరైనా టెస్టుల్లో జట్టును నడిపించినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటారు. టెస్ట్ క్రికెట్కు ఖచ్చితమైన వ్యూహాలు, వాటని అమలు చేయడం చాలా అవసరం. దీంతో ఒక ఉత్తమ నాయకుడిగా నిలుస్తారని "తరువర్ కోహ్లీ పోడ్కాస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు. -
'బంగ్లాదేశ్ను తక్కువగా అంచనా వేయొద్దు.. పాక్నే ఓడించారు'
భారత క్రికెట్ జట్టు తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమైంది. సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో టీమిండియా తలపడనుంది. అయితే ఈ సిరీస్కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మను మాజీ క్రికెటర్లు సున్నితంగా హెచ్చరించారు.బంగ్లాదేశ్ను తక్కువగా అంచనా వేయద్దని భారత మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్లు రోహిత్ను సూచించారు. కాగా టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారత్ను బంగ్లాదేశ్ ఓడించలేదు. కానీ బంగ్లా జట్టు మాత్రం ఇటీవల కాలంలో టెస్టుల్లో సంచలన ప్రదర్శన కనబరుస్తోంది. గతేడాది ఆఖరిలో న్యూజిలాండ్ను ఓడించిన బంగ్లా టైగర్స్.. తాజాగా పాకిస్తాన్ను వారి స్వదేశంలోనే చిత్తు చేశారు. కాబట్టి బంగ్లా జట్టు నుంచి భారత్కు పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది.టీమిండియా ఐదు నెలల తర్వాత టెస్టుల్లో ఆడనుంది. బంగ్లాతో సిరీస్కు భారత టెస్టు జట్టును ఎంపిక చేసే పనిలో సెలక్షన్ కమిటీ పడింది. దులీప్ ట్రోఫీలో భారత టాప్ ప్లేయర్లను భాగం చేయడం బీసీసీఐ తీసుకున్న ఒక మంచి నిర్ణయం.రెడ్బాల్ క్రికెట్(టెస్టు) ఆడినప్పుడు ఆటగాళ్లకు చాలా విషయాలు తెలుస్తాయి. బంగ్లాదేశ్ను తేలికగా తీసుకోవద్దు. బంగ్లా జట్టులో అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. అంతేకాకుండా గత కొంత కాలం నుంచి నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఈ సిరీస్ భారత జట్టు మంచి ప్రాక్టీస్గా ఉపయోగపడుతోందని ఏఎన్ఐతో రైనా పేర్కొన్నాడు. హర్భజన్ సింగ్ సైతం రైనా వ్యాఖ్యలను సమర్ధించాడు.ఇది గొప్ప సిరీస్ కానుంది. భారత జట్టు చాలా బలంగా ఉంది. కానీ బంగ్లాదేశ్ను కూడా తక్కువగా అంచనా వేయలేం. వారు రావల్పండి వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్ను ఓడించారు. కొన్ని సార్లు చిన్న జట్లు కూడా అద్భుతాలు సృష్టిస్తాయి అని భజ్జీ చెప్పుకొచ్చాడు. కాగా సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి జరగనుంది. -
'కోహ్లితో 19 ఏళ్ల కుర్రాడు కూడా పోటీ పడలేడు.. ఈజీగా ఓడిస్తాడు'
టీ20 వరల్డ్కప్-2024 విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పొట్టి క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరి క్రికెట్ భవిష్యత్తుపై పలు ఊహగానాలు వినిపించాయి.వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగుతారని, మరి కొందరు ఏకంగా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటారని జోస్యం చెప్పారు. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. విరాట్, రోహిత్ కచ్చితంగా మరో రెండేళ్ల పాటు భారత జట్టు తరపున ఆడుతారని భజ్జీ చెప్పుకొచ్చాడు."రోహిత్ శర్మ ప్రస్తుతం ఫిట్గా ఉన్నాడు. అతడు ఈజీగా మరో రెండేళ్లు పాటు భారత తరపున ఆడగలడు. ఇక విరాట్ కోహ్లి ఫిట్నెస్ కోసం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు మరో ఐదేళ్ల పాటు క్రికెట్ ఆడుతాడని భావిస్తున్నాను. ప్రస్తుత భారత జట్టులో కోహ్లినే అత్యంత ఫిట్గా ఉండే క్రికెటర్. ఫిట్నెస్ పరంగా 19 ఏళ్ల యువకుడు కూడా విరాట్తో పోటీపడలేడు. కోహ్లి అతడిని ఈజీగా ఓడిస్తాడు. అయితే ఫిట్నెస్ ఉన్నప్పటకి క్రికెట్లో కొనసాగాలా లేదా అన్నది వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. నా వరకు అయితే వారు మెరుగ్గా రాణిస్తూ క్రికెట్ మరి కొన్నేళ్లు కొనసాగాలని ఆశిస్తున్నాని" పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ పేర్కొన్నాడు. -
అతడికి ధోనీతో పోలికా? ఏం మాట్లాడుతున్నావ్: భజ్జీ ఫైర్
భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్ జర్నలిస్ట్కు అదరి పోయే కౌంటరిచ్చాడు. భారత మాజీ కెప్టెన్, దిగ్గజ కీపర్-బ్యాటర్ ఎంఎస్ ధోనిని పాక్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్తో పోల్చినందుకు సదరు జర్నలిస్ట్పై హర్భజన్ మండిపడ్డాడు.ఫరీద్ ఖాన్ అనే పాక్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఎంఎస్ ధోని, మహ్మద్ రిజ్వాన్లలో ఎవరు బెటర్ అన్న పోల్ను ఎక్స్లో పోస్ట్ చేశాడు. అందుకు స్పందించిన భజ్జీ ఇదేమి చెత్త ప్రశ్న అంటూ ఫైరయ్యాడు. "ఈ రోజుల్లోనూ ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం దారుణం. భయ్యా అతడికి ఎవరైనా చెప్పండి.ధోనితో రిజ్వాన్కు పోలికా? రిజ్వాన్ కంటే ధోని చాలా ముందున్నాడు. మీరు ఇదే విషయం రిజ్వాన్ను అడిగినా అతడు నిజాయితీగా సమాధానం చెబుతాడు. రిజ్వాన్ ఆట అంటే నాకు కూడా ఇష్టం. అతడు జట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. కానీ ధోనీతో రిజ్వాన్ను పోల్చడం చాలా తప్పు.ప్రపంచ క్రికెట్లో ఇప్పటికీ ధోనినే నంబర్ వన్. వికెట్ల వెనక ధోనిని మించిన వారే లేరు" అంటూ ఎక్స్లో భజ్జీ రిప్లే ఇచ్చాడు. ఇక భారత క్రికెట్లో ధోని కంటూ ఒక ప్రత్యేకస్ధానముంది.భారత్కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ ధోనినే. అతడి సారథ్యంలోనే 2007 టీ20 వరల్డ్కప్, 2011 వన్డే వరల్డ్కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది. What r u smoking nowadays ???? What a silly question to ask . Bhaiyo isko batao . DHONI bhut aage hai RIZWAN se Even if u will ask Rizwan he will give u an honest answer for this . I like Rizwan he is good player who always play with intent.. but this comparison is wrong. DHONI… https://t.co/apr9EtQhQ4— Harbhajan Turbanator (@harbhajan_singh) July 19, 2024 -
మమ్మల్ని క్షమించండి.. దయచేసి ఇక్కడితో ఆపేయండి: హర్భజన్
ఇంగ్లండ్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టైటిల్ను ఇండియా ఛాంపియన్స్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని భారత్ ముద్దాడింది.అయితే విజయనంతరం భారత మాజీ క్రికెటర్లు, డబ్ల్యూసీఎల్ విన్నింగ్ టీమ్ సభ్యులు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్లు బాలీవుడ్ సాంగ్ తౌబ.. తౌబకు కుంటుతూ సరదగా డ్యాన్స్ చేశారు.ఇందుకు సంబంధించిన వీడియోను యువరాజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ రీల్పై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పారా బ్యాడ్మింటన్ స్టార్ మానసి జోషి దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీశారని ఈ ముగ్గురి క్రికెటర్లపై మండిపడింది.అదే విధంగా నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ కూడా క్రికెటర్లపై పోలీస్లకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం వారి చేసిన రీల్ వివాదస్పదం కావడంతో హర్భజన్ సింగ్ స్పందించాడు. దివ్యాంగులకు భజ్జీ క్షమపణలు తెలిపాడు."ఇంగ్లండ్లో ఛాంపియన్షిప్ గెలిచిన అనంతరం మేం చేసిన టౌబా టౌబా రీల్పై వచ్చిన ఫిర్యాదులపై ఓ క్లారిటీ ఇవ్వాలనకుంటున్నాను. మేము ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు. ప్రతీ వ్యక్తికి, ప్రతీ కమ్యూనిటీని మేము గౌరవిస్తాము.15 రోజుల పాటు విరామం లేకుండా క్రికెట్ ఆడిన తర్వాత మా ఒళ్లు హూనమైందని తెలియజేసేందుకు ఈ వీడియోను చేశాము. మేము ఎవరినీ కించపరచడానికి ఈ వీడియో చేయలేదు. ఇప్పటికీ మేము ఏదో తప్పు చేశామని ప్రజలు భావిస్తుంటే.. అందరికి నా తరపున క్షమపణలు తెలుపుతున్నాను. దయచేసి దీన్ని ఇక్కడతో ఆపేయండి" అంటూ ఎక్స్ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
తప్పు విరాట్ కోహ్లిది కాదు.. పిచ్ది: హర్భజన్ సింగ్
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కనుబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ విరాట్ దారుణంగా విఫలమయ్యాడు.మొత్తంగా కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్-2024లో టాప్ రన్ స్కోరర్గా నిలిచిన విరాట్.. పొట్టి ప్రపంచకప్లో మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు.దీంతో కొంతమంది పాక్ మాజీ ఆటగాళ్లు విరాట్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లికి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు. కోహ్లిది ఎటువంటి తప్పులేని, న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని పిచ్ అస్సలు బ్యాటింగ్కు అకుకూలించలేదని భజ్జీ చెప్పుకొచ్చాడు."న్యూయార్క్ పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఆ వికెట్పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అక్కడ పరిస్థితులు అలా ఉండటం వల్లే విరాట్ కోహ్లి పరుగులు చేయలేకపోయాడు. కాబట్టి ఇటువంటి కండీషన్స్లో ఆటగాళ్లను మనం తప్పుబట్టకూడదు.అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటకి జట్టు మాత్రం విరాట్ నుంచి మంచి ఇన్నింగ్స్లను ఆశిస్తోంది. అంతేకాకుండా ఓపెనర్గా వస్తున్నాడు కాబట్టి కోహ్లిపై మరింత బాధ్యత ఉంటుంది. న్యూయార్క్ పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఆ వికెట్పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అక్కడ పరిస్థితులు అలా ఉండటం వల్లే విరాట్ కోహ్లి పరుగులు చేయలేకపోయాడు. కాబట్టి ఇటువంటి కండీషన్స్లో ఆటగాళ్లను మనం తప్పుబట్టకూడదు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటకి జట్టు మాత్రం విరాట్ నుంచి మంచి ఇన్నింగ్స్లను ఆశిస్తోంది. అంతేకాకుండా ఓపెనర్గా వస్తున్నాడు కాబట్టి కోహ్లిపై మరింత బాధ్యత ఉంటుంది. తొలి 6 ఓవర్లలో రోహిత్, విరాట్ మంచి ఆరంభాలను ఇస్తే.. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే వంటి వారు తమపని తాము చేసుకుపోతారని" స్టార్స్పోర్ట్స్తో హర్భజన్ పేర్కొన్నాడు. -
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి..?
టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెడ్కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను సైతం ఆహ్వానించింది.మే 27 సాయంత్రం ఆరు గంటలలోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. టీమిండియా హెడ్కోచ్ రేసులో మాజీ క్రికెటర్లు జస్టిన్ లాంగర్, గౌతం గంభీర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, పాంటింగ్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు అవకాశం లభిస్తే టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు భజ్జీ తెలిపాడు.భారత హెడ్కోచ్ పదవికి నేను దరఖాస్తు చేస్తానో లేదో నాకు తెలియదు. కానీ, టీమిండియాకు కోచింగ్ అనేది మ్యాన్ మేనేజ్మెంట్. భారత ఆటగాళ్లకు క్రికెట్ గురించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. క్రికెట్ ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు. వారికి మార్గదర్శకత్వంగా ఉంటే చాలు. నాకు క్రికెట్ ఎంతో ఇచ్చింది. కోచ్ రూపంలో ఎంతోకొంత తిరిగి ఇచ్చే అవకాశం వస్తే సంతోషిస్తా" అని ఓ స్పోర్ట్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ పేర్కొన్నాడు. -
T20 వరల్డ్ కప్కు భారత జట్టు ఇదే..? ఊహించని ప్లేయర్కు చోటు!
టీ20 వరల్డ్కప్-2024లో భాగమయ్యే భారత జట్టును బీసీసీ సెలక్షన్ కమిటీ మరో నాలుగు, ఐదు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ టోర్నీలో భాగమయ్యే ఆ జట్లు తమ వివరాలను మే 1లోపు ఐసీసీకి సమర్పించాల్సి ఉంది. దీంతో భారత జట్టును ఎంపిక చేసే పనిలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పడింది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు టీ20 వరల్డ్కప్ కోసం బారత జట్టును అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా టీమిండియా మాజీ స్సిన్నర్ హార్భజన్ సింగ్ చేరాడు. టీ20 ప్రపంచకప్ కోసం తన 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును భజ్జీ ఎంపిక చేశాడు. ఈ జట్టులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, ఓపెనర్ శుబ్మన్ గిల్, పేసర్ మహ్మద్ సిరాజ్లకు భజ్జీ ఛాన్స్ ఇవ్వలేదు.వీరితో పాటు స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ను సైతం హార్భజన్ ఎంపిక చేయలేదు. అయితే అనూహ్యంగా ఈ జట్టులో భజ్జీ పేసర్ అవేష్ ఖాన్కు చోటివ్వడం గమనార్హం. ప్రస్తుత ఐపీఎల్లో సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అవేష్ ఖాన్ డెత్ ఓవర్లలో తన బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు.ఈ క్రమంలోనే హార్భజన్ అవేష్కు చోటిచ్చాడు. ఇక భజ్జీ ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్లో అదరగొడుతున్న మయాంక్ యాదవ్, శివమ్ దూబే, యశస్వీ జైశ్వాల్కు చోటు దక్కింది. వికెట్ కీపర్ బ్యాటర్గా రిషబ్ పంత్ను హార్భజన్ ఎంచుకున్నాడు.అదేవిధంగా స్పెషలిస్టు స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ను హార్భజన్ ఎంపిక చేశాడు.టీ20 ప్రపంచ కప్ 2024 కోసం హర్భజన్ సింగ్ భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, మయాంక్ యాదవ్ -
'డివిలియర్స్ కంటే అతడు చాలా డేంజరస్.. ఆపడం ఎవరి తరం కాదు'
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. ఈ ఏడాది సీజన్లో రెండో మ్యాచ్ ఆడిన సూర్యకుమార్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన సూర్య ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. గ్రౌండ్ నలుమూలల షాట్లు ఆడుతూ బౌలర్లకు చమెటలు పట్టించాడు. ఈ క్రమంలో కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 19 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్.. 5 ఫోర్లు, 4 సిక్స్లతో 52 పరుగులు చేశాడు. ఈ క్రమంలో గాయం నుంచి కోలుకుని అద్బుత ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్పై భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్య అతను దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్కు బెటర్ వెర్షన్ భజ్జీ కొనియాడాడు. "సూర్యకుమార్ లాంటి ఆటగాడిని ఇప్పటివరకు నేను చూడలేదు. అతడి బౌలర్లను ఎటాక్ చేసే విధానం నమ్మశక్యం కానిది. అతడికి బౌలర్లకు ఎక్కడ బౌలింగ్ చేయాలో ఆర్ధం కాక తలలపట్టుకుంటున్నారు. ఒకవేళ నేను ఆడిన కూడా సూర్యకి బౌలింగ్ చేసేందుకు భయపడేవాడిని. సూర్య వేరే గ్రహంపై ఆడుతున్నట్లు ఉంది. సూర్యకుమార్ యాదవ్ చెలరేగితే ఆపడం ఎవరి తరం కాదు. ఇంతకముందు అందరూ ఏబీ డివిలియర్స్ గురించి మాట్లాడునుకోవారు. కానీ సూర్య తన ఆటతీరుతో ఏబీడీని మయమరిపిస్తున్నాడు. డివిలియర్స్ కంటే సూర్య డెంజరస్ ఆటగాడని నేను భావిస్తున్నాను. టీ20 ఫార్మాట్లో ప్రస్తుత తరం క్రికెటర్లలో సూర్యనే అత్యుత్తమ ఆటగాడని" స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు. చదవండి: రోహిత్ను టీజ్ చేసిన కోహ్లి.. హిట్మ్యాన్ రియాక్షన్ వైరల్ -
ఇంగ్లండ్తో రెండో టెస్టు.. సర్ఫరాజ్కు ఛాన్స్! సిరాజ్కు నో ప్లేస్
విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2నుంచి ఇంగ్లండ్తో రెండో టెస్టుకు టీమిండియా సన్నద్దమవుతోంది. ఇప్పటికే వైజాగ్కు చేరుకున్న భారత జట్టు.. ఈ మ్యాచ్ కోసం తమ అస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్ను టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఎంచుకున్నాడు. వైజాగ్ టెస్టులో భారత జట్టు నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని హర్భజన్ సూచించాడు. అదే విధంగా గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్ స్ధానంలో సర్ఫరాజ్ ఖాన్కు అవకాశం ఇవ్వాలని భజ్జీ తెలిపాడు. సర్ఫరాజ్ ఖాన్కు దేశీవాళీ క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉందని, ఐదో స్ధానానికి సరిపోతాడని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ఇక హర్భజన్ తను ఎంపిక చేసిన జట్టులో కేవలం ఒకే పేసర్కు ఛాన్స్ ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో పేస్ గుర్రం బుమ్రా ఒక్కడికే చోటు దక్కింది. తొలి టెస్టులో పెద్దగా ఆకట్టుకోకపోయిన మహ్మద్ సిరాజ్ను వైజాగ్ టెస్టుకు హర్భజన్ పక్కన పెట్టాడు. అతడి స్ధానంలో వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు చోటు ఇచ్చాడు. కుల్దీప్ బంతితో అద్బుతాలు చేయగలడని హర్భజన్ సింగ్ తన యూట్యాబ్ ఛానల్లో పేర్కొన్నాడు. రెండో టెస్టుకు హర్భజన్ ఎంపిక చేసిన భారత జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ కేఎస్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ -
సంజూ కంటే అతడు చాలా బెటర్.. విధ్వంసానికి 30 బంతులు చాలు!
వన్డే ప్రపంచకప్-2023కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టుపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వన్డేల్లో వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్ యాదవ్కు బదులుగా సంజూ శాంసన్ను ఎంపిక చేసి ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. టీ20ల్లో నెం1 బ్యాటర్గా ఉన్న సూర్యకుమార్.. వన్డేల్లో మాత్రం తన మార్క్ను చూపించడంలో విఫలమవుతున్నాడు. ఈ క్రమంలో సూర్యకుమార్కు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు. ఐదు, ఆరు స్ధానాల్లో బ్యాటింగ్కు వచ్చే విధ్వంసం సృష్టించే సత్తా సూర్యకు ఉందని భజ్జీ అభిప్రాయపడ్డాడు. సంజూ శాంసన్కు బదులుగా సూర్యను ఎంపిక చేయడం సరైన నిర్ణయమే. సూర్య పూర్తి స్ధాయి ఆటగాడు. మిడిలార్డర్లో అద్భుతంగా ఆడగలడు. సంజూ కంటే సూర్య చాలా బెటర్. ప్రస్తుతం మిడిలార్డర్లో సంజూ పెద్దగా రాణించలేకపోతున్నాడు. సూర్య కంటే శాంసనే ఎక్కువ రిస్కీ షాట్లు ఆడుతాడు. సూర్య టీ20ల్లో ఏమి చేశాడో మనకు తెలుసు. అదే వన్డే ఫార్మాట్లో కూడా చేయగలడు. అతడు 35 ఓవర్లో బ్యాటింగ్ వస్తే ఫీల్డ్లో గ్యాప్లను చూసి ఆడగలడు. అ విధంగా ఆడడంలో సూర్య కంటే మించిన వారు ఎవరూ లేరు. మ్యాచ్ స్వరూపాన్ని మార్చడానికి సూర్యకు కేవలం 30 బంతులు చాలు అని స్టార్స్పోర్ట్స్ ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో హర్భజన్ పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ గణంకాలు మాత్రం పేలవంగా ఉన్నాయి. ఇప్పటివరకు 26 వన్డేలు ఆడిన సూర్యకుమార్.. 24.33 సగటుతో 511 పరుగులు మాత్రమే చేశాడు. ప్రపంచ కప్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్. చదవండి: సచిన్, గవాస్కర్, కోహ్లి కాదు.. భారత అత్యుత్తమ బ్యాటర్ అతడే: గంభీర్ -
'అలా జరగనందుకు చాలా బాధగా ఉంది.. అతడు ఇండియన్ క్రికెట్ను ఏలుతాడు'
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. వెస్టిండీస్తో తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన జైశ్వాల్.. తన తొలి మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 382 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, ఒక సిక్సర్తో 171 పరుగులు చేశాడు. ఇక డెబ్యూ మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టిన జైశ్వాల్పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. జైస్వాల్ అద్భుతమైన ఆటగాడని, చాలా కాలం పాటు భారత్ తరఫున ఆడతాడని హర్భజన్ కొనియాడాడు. "యశస్వి జైస్వాల్ తొలి మ్యాచ్లోనే తన టాలెంట్ ఎంటో నిరూపించుకున్నాడు. అతడు డబుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయినందుకు చాలా బాధ అనిపించింది. కానీ జైశ్వాల్ ఇండియన్ క్రికెట్ను చాలా కాలం పాటు కచ్చితంగా ఏలుతాడు. జైశ్వాల్కు టాలెంట్లో కొదవలేదు. అతడికి నేను ఇచ్చే సలహా ఒక్కటే. జైశ్వాల్ ప్రపంచక్రికెట్ను శాసించాలంటే మరింత కష్టపడి పనిచేయాలి. అదే విధంగా ఫిట్నెస్ను కూడా కాపాడుకుంటూ రావాలి. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా రోజుల తర్వాత అతడి బ్యాట్ నుంచి వచ్చిన సెంచరీ. కోహ్లి కూడా సెంచరీ మార్క్ను అందుకుని ఉంటే బాగుండేది" అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: AFG vs BAN: ఆఖరి టీ20లో ఆఫ్గానిస్తాన్ చిత్తు.. బంగ్లాదేశ్దే సిరీస్ -
వందకు పైగా టెస్టులు ఆడాడు.. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా?
వెస్టిండీస్తో టెస్టు సిరీస్ భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్కు వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారాను పక్కన పెట్టడం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. అతడి పట్ల సెలక్టర్లు వ్యవహరించిన తీరును చాలా మంది మాజీలు తప్పుబడున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో చాలా మంది ఆటగాళ్లు విఫలమైనప్పటికి.. పుజారా ఒక్కడినే బలిపశువును చేయడం సరికాదు అని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం విమర్శించాడు. తాజాగా భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా పుజారాకు మద్దతుగా నిలిచాడు. పుజారా వంటి అనుభవం ఉన్న ఆటగాడిని పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. "విండీస్తో టెస్టులకు ఛతేశ్వర్ పుజారాను ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు భారత జట్టుకు వెన్నెముక వంటి వాడు. చాలా మ్యాచ్ల్లో భారత జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. అతడిని జట్టు నుంచి తప్పించకుండా కేవలం విశ్రాంతి మాత్రమే ఇచ్చారని నేను ఆశిస్తున్నాను. ప్రస్తుత భారత టెస్టు జట్టులో మిగితా బ్యాటర్లు సగటు కూడా అంతగా బాగోలేదు. అటువంటి అప్పుడు పుజారా ఏం తప్పు చేశాడు. ఎంత పెద్ద ఆటగాడైనా ఆడకపోతే పుజారా లాగే జట్టు నుంచి తప్పించాలి. సెలక్టర్లు అలా చేయగలరా? మీరు పుజారాను కీలక ఆటగాడిగా పరిగణించకపోతే.. మిగితా ఆటగాళ్లు కూడా అంతకన్న తక్కువే. పుజారా కెరీర్ గురించి మనం ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి విదేశీ గడ్డలపై భారత జట్టుకు ఎన్నో చారిత్రాత్మక విజయాలు అందించాడు. అతడు 100కు పైగా టెస్టులు ఆడాడు. అటువంటి వ్యక్తి మీరు ఇలా చేయడం సరికాదు. అతడికి సరైన గౌరవం ఇవ్వాలి" అని భజ్జీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: Sunil Gavaskar: వాళ్లేం సాధించారు.. పూజారాని మాత్రం ఎందుకు బలి చేశారు? -
రెజ్లర్లు వీధుల్లోకి రావడం బాధించింది.. న్యాయం జరగాలి: హర్భజన్
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా రెజర్లు గత ఆరు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రెజర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. ఇందులో ప్రముఖ రెజ్లర్లు భజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, సహా ఇతర రెజర్లు పాల్గొన్నారు. ఇక ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్, పార్లమెంటు సభ్యుడు హర్భజన్ సింగ్ సపోర్ట్గా నిలిచాడు. దేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చిన రెజర్లు రోడ్డు రోడ్డుపైకి రావడం చాలా బాధాకరమని భజ్జీ అన్నాడు. "సాక్షి మాలిక్, వినేష్ ఫోగాట్లు భారతదేశానికి గర్వకారణం. అటువంటి రెజర్లు మన దేశ వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నందుకు క్రీడాకారిణిగా నేను బాధపడుతున్నారు. వారికి న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నాను" అని హర్భజన్ ట్విటర్లో పేర్కొన్నాడు. భజ్జీతో పాటు జావిలిన్ త్రో స్టార్ నిరాజ్ చోప్రా, సానియా మీర్జా కూడా సపోర్ట్గా నిలిచారు. Sakshi, Vinesh are India's pride. I am pained as a sportsperson to find pride of our country coming out to protest on the streets. I pray that they get justice.#IStandWithWrestlers pic.twitter.com/hwD9dKSFNv — Harbhajan Turbanator (@harbhajan_singh) April 28, 2023 pic.twitter.com/SzlEhVnjep — Neeraj Chopra (@Neeraj_chopra1) April 28, 2023 చదవండి: Wrestlers Protest: దేశ ప్రతిష్టతను దిగజారుస్తున్నారు.. పీటీ ఉష ఘాటు వ్యాఖ్యలు -
ధావన్ విషయంలో బీసీసీఐ పై హర్భజన్ ఫైర్
-
రోహిత్, కోహ్లి, రాహుల్కే ఛాన్స్లు ఇస్తారా.. అతడు ఏం పాపం చేశాడు మరి?
టీమిండియా వెటరన్ ఓపెనర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఐపీఎల్-2023లో దుమ్మురేపుతున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లో 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన గబ్బర్.. అనంతరం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో 56 బంతులు ఎదుర్కొన్న ధావన్ 9 ఫోర్లు, మూడు సిక్స్ల సాయంతో 86 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఐపీఎల్లో అదరగొడుతున్న ధావన్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హర్భజన్ సింగ్ కీలక వాఖ్యలు చేశాడు. ధావన్ను వన్డే జట్టు నుంచి ఎందుకు తప్పించారో కారణం చెప్పాలని భారత సెలక్టర్లను భజ్జీ ప్రశ్నించాడు. కాగా ధావన్ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 2018 నుంచి టెస్ట్లకు, 2021 నుంచి టీ20లకు దూరంగా ఉంటున్న గబ్బర్.. గతేడాది స్వదేశంలో వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో జరిగిన వన్డే సిరీస్ల్లో టీమిండియాకు సారధ్యం వహించాడు. ఆ మూడు సిరీస్ల్లో గబ్బర్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో సెలక్టర్లు అతడని పక్కన పెట్టి, యువ ఓపెనర్ శుబ్మన్ గిల్కు అవకాశం ఇచ్చారు. ఇదే విషయంపై భజ్జీ హిందుస్థాన్ టైమ్స్తో మాట్లాడుతూ.."ధావన్ చాలా సిరీస్లలో టీమిండియా కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ సిరీస్లో సారథిగా ధావన్ విజయవంతమయ్యాడు. అయితే ధావన్ కెప్టెన్సీ పాత్ర ముగిశాక.. ఇకపై అతడు అవసరం లేనట్లుగా జట్టు నుంచి పక్కన పెట్టడం మనం చూశాం. ఇది నన్ను చాలా బాధించింది. ఎందుకంటే అందరి ఆటగాళ్ల విషయంలోను సెలక్టర్లు ఒకే తీరు కనబరిచాలి. ధావన్ ఒక అద్భుతమైన ఆటగాడు. అతడు భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.అటువంటి వ్యక్తి పట్ల సెలక్టర్లు వ్యవహరించిన తీరు సరికాదు. ధావన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లు చాలా మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యారు. అయినప్పటికీ వారికి చాలా అవకాశాలు ఇచ్చారు. కానీ ధావన్ ఒక్కడి విషయంలో పక్షపాతం ఎందుకు. ధావన్కు పూర్తిగా భారత జట్టులోనే చోటు లేదు. అతడు ఎప్పుడూ తన వంతు సహకారం జట్టుకు అందించడానికే ప్రయత్నిస్తాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. రాజస్తాన్ మ్యాచ్లో 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ కూడా ఆడాడు. అటువంటి ధావన్కు భారత జట్టులో చోటు ఇవ్వడానికి ఏంటి సమస్య? ఫిట్నెస్ పరంగా గబ్బర్ కూడా కోహ్లిలా 100 శాతం ఫిట్గా ఉన్నాడని" పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: తొలి మ్యాచ్లోనే అదరగొట్టాడు.. కార్తీక్కే చుక్కలు! ఎవరీ సుయాష్ శర్మ? -
IND vs AUS: అశ్విన్ అరుదైన రికార్డు.. రెండో భారత బౌలర్గా
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా అశ్విన్ రికార్డులకెక్కాడు. నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో హ్యండ్స్కాంబ్ వికెట్ పడగొట్టిన అశ్విన్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై 19 టెస్టులు ఆడిన అశ్విన్ 97 వికెట్లు సాధించాడు. ఇక ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ పేరిట ఉండేది.ఆస్ట్రేలియాపై హర్భజన్ 95 టెస్టు వికెట్లు పడగొట్టాడు. ఇక తాజా మ్యాచ్తో హర్భజన్ సింగ్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో అశ్విన్ ఇప్పటి వరకు 8 వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లతో రాణించిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు సాధించాడు. విజయం దిశగా భారత్ అయితే తొలి టెస్టులో భారీ విజయం దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఆస్ట్రేలియా సెకెండ్ ఇన్నింగ్స్లో 72 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడింది. ప్రస్తుతం క్రీజులో స్మిత్(12), పాట్ కమ్మిన్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో ఇంకా 151 పరుగులు వెనుకబడి ఉంది. కాగా ఆసీస్ కోల్పోయిన 7 వికెట్లలో ఐదు వికెట్లు కూడా అశ్విన్ పడగొట్టనివే కావడం విశేషం. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులకు ఆలౌటైన భారత్.. ఆసీస్ ముందు 223 పరుగుల ఆధిక్యాన్ని నిలిపింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) The moment Ravi Ashwin Picked his 31st 5-wicket haul in Test cricket - One of the greatest of all time. pic.twitter.com/2LVzWCDOTP — CricketMAN2 (@ImTanujSingh) February 11, 2023 చదవండి: IND vs AUS: సిక్సర్లతో చెలరేగిన షమీ.. ఆసీస్ స్పిన్నర్కు చుక్కలు! వీడియో వైరల్ -
'నెహ్రాను టీమిండియా కోచ్ చేయండి..! కెప్టెన్గా అతడే సరైనోడు'
సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైన టీమిండియా.. టీ20 ప్రపంచకప్-2022 నుంచి ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలో టీమిండియాతో పాటు జట్టు మేనేజేమెంట్పై కూడా విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్పై మాజీలు, అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ను వెంటనే కెప్టెన్సీ తప్పించాలని భారత అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ప్రపంచకప్లో రోహిత్ శర్మ పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో 6 మ్యాచ్లు ఆడిన రోహిత్.. కేవలం 116 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో జట్టుతో పాటు, కోచింగ్ స్టాఫ్లో కూడా మార్పులు చేసే సమయం ఆసన్నమైంది భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఇండియా టుడేతో హర్భజన్ మాట్లాడుతూ.. "రాహుల్ ద్రవిడ్ చాలా తెలివైనవాడు. మేమిద్దరం కలిసి చాలా కాలం క్రికెట్ ఆడాము. కానీ పొట్టి ఫార్మాట్లో భారత జట్టుకు ఇటీవలే టీ20 క్రికెట్ నుంచి రిటైరైన వ్యక్తి కోచ్గా కావాలి. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ను అర్ధం చేసుకోనే వ్యక్తిని తీసుకురావాలి. ద్రవిడ్ను భారత జట్టు కోచ్గా తొలగించకూడదనుకుంటే.. ఇటీవల రిటైర్ అయిన వారిని అతడికి అసిస్టెంట్గా అయినా ఎంపికచేయండి. ఆశిష్ నెహ్రా లాంటి మాజీ ఆటగాడిని కోచింగ్ స్టాఫ్లో భాగం చేయండి. నెహ్రాది గొప్ప క్రికెట్ మైండ్. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ విషయంలో అతడు ఏం చేశాడో మనం చూశాం. అతడు జట్టుతో కలిస్తే యువ ఆటగాళ్లను ఎక్కువగా ప్రోత్సహిస్తాడు" అని పేర్కొన్నాడు. ఇక టీ20 కెప్టెన్సీ గురించి భజ్జీ మాట్లాడుతూ.. "నా అభిప్రాయం ప్రాకారం అయితే హార్దిక్ పాండ్యాను భారత జట్టు కెప్టెన్ చేస్తే బాగుటుంది. అతడు ప్రస్తుత జట్టులో అత్యుత్తమ ఆటగాడు. అతడి లాంటి ఆటగాళ్లు భారత జట్టుకు మరింత మంది అవసరం" అని తెలిపాడు. చదవండి: Wasim Akram: "ఐపీఎల్ ప్రారంభమైంది.. భారత్ పని అయిపోయింది" -
Abu Dhabi T10 League: టీ10 లీగ్లో ఆడనున్న హర్భజన్, రైనా
అబుదాబి టీ10 లీగ్-2022లో టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేష్ రైనా భాగం కానున్నారు. ఈ లీగ్లో ఢిల్లీ బుల్స్తో హర్భజన్ సింగ్ ఒప్పందం కుదుర్చుకోగా.. డిఫెండింగ్ ఛాంపియన్ డెక్కన్ గ్లాడియేటర్స్కు రైనా ప్రాతినిధ్యం వహించనున్నాడు. డక్కన్ గ్లాడియేటర్స్ జట్టుకు వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా గ్లాడియేటర్స్ జట్టులో టిమ్ డేవిడ్, రహ్మానుల్లా గుర్బాజ్, విల్ జాక్స్, డొమినిక్ డ్రేక్స్, ఫజల్హాక్ ఫరూకీ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జట్టుకు జింబాబ్వే మాజీ ఆటగాడు అండీ ఫ్లవర్ కోచ్గా వ్యవహరించనున్నాడు. అబుదాబి టీ10 లీగ్ నవంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. Indian legend Harbhajan Singh has signed for @DelhiBullsT10 and will be joining us in #Season6 of the #AbuDhabiT10 🔒#InAbuDhabi #CricketsFastestFormat pic.twitter.com/d4A8N7DJr2 — T10 League (@T10League) September 29, 2022 ఇక సురేష్ రైనా ప్రస్తుతం రోడ్ సెప్టీ లీగ్లో ఇండియా లెజెండ్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. అదే విధంగా హర్భజన్ సింగ్ లెజెండ్స్ లీగ్ క్రికెట్లో మణిపాల్ టైగర్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. హార్భజన్ సింగ్ 2021లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోగా.. రైనా ఇటీవలే క్రికెట్కు గుడ్బై చెప్పాడు. చదవండి: T20 WC 2022: 'బుమ్రా స్థానంలో అతడికి అవకాశమివ్వండి' -
'పంత్ను కాదని కార్తీక్ను ఆడించడం సరైన నిర్ణయం'
ఆసియా కప్ 2022ను భారత్ విజయంతో ప్రారంభించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దాయాది జట్టు పాకిస్తాన్పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయ భేరి మోగించింది. అయితే ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జట్టు మేనేజేమెంట్ తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ షాక్కు గురిచేసింది. ఈ మ్యాచ్కు తుది జట్టులో ఫామ్లో ఉన్న పంత్ను కాదని ఆనూహ్యంగా దినేష్ కార్తీక్ వైపు జట్టు మేనేజేమెంట్ మొగ్గు చూపింది. అయితే ఈ నిర్ణయంపై ప్రస్తుతం భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తుంటే.. మరి కొంతమంది తప్పుబడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ స్పిన్నర్ హార్భజన్ సింగ్ స్పందించాడు. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు పంత్ను కాదని దినేష్ కార్తీక్ను ఆడించడం సరైన నిర్ణయమని హర్భజన్ తెలిపాడు. డీకే సరైనోడు.. "రిషబ్ పంత్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అతడు కేవలం టెస్టులు, వన్డేల్లో మాత్రమే రాణిస్తున్నాడు. టీ20 ఫార్మాట్లో మాత్రం పంత్ అంతగా ఆకట్టు కోలేకపోయాడు. మరోవైపు దినేష్ కార్తీక్ ఈ పొట్టి ఫార్మాట్లో గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. అటువంటి ఆటగాడిని బెంచ్కే పరిమితం చేయకూడదు. కాబట్టి పంత్ను కాదని కార్తీక్కు తుది జట్టులో చోటు ఇవ్వడం సరైన నిర్ణయం. రిషబ్ పంత్ యువ ఆటగాడు. అతడికి ఇంకా చాలా సమయం ఉంది. కార్తీక్ మరో ఒకటి రెండేళ్లు మాత్రమే క్రికెట్ ఆడే అవకాశం ఉంది. కాబట్టి జట్టులో ఉన్నప్పడే అతడిని సద్వినియోగం చేసుకోవాలి. అతడు టీ20ల్లో అత్యుత్తమ ఫినిషర్గా పేరొందాడు. లోయర్ ఆర్డర్లో కూడా అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ వంటి ఫినిషర్లు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు వెన్నులో వణుకు పుడుతోంది" అని హార్భజన్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో కేవలం ఒక్క బంతి మాత్రమే ఆడిన కార్తీక్ హార్దిక్ స్ట్రైక్ ఇచ్చాడు.. అయితే ఫీల్డింగ్లో మాత్రం వికెట్ల వెనుక మూడు అద్భుతమైన క్యాచ్లు అందుకున్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: Harbhajan Singh explains why Dinesh Karthik played ahead of Rishabh Pant vs Pak -
గిల్ అద్భుతమైన ఆటగాడు.. భావి భారత కెప్టెన్ అతడే: హర్భజన్
టీమిండియా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్లో ఉన్నాడు. గత నెలలో విండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అదరగొట్టిన గిల్.. తాజాగా జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్లోనూ సత్తా చాటాడు. సోమవారం జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో గిల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. తద్వారా తన అంతర్జాతీయ కెరీర్లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో సెంచరీతో చేలరేగిన గిల్పై భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ గిల్ అని అతడు కొనియాడాడు. అదే విధంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్ల శైలిలో గిల్ ఆడుతున్నాడని భజ్జీ అభిప్రాయపడ్డాడు. గిల్ భావి భారత కెప్టెన్ "గిల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అతడు బ్యాటింగ్ టెక్నిక్ గానీ షాట్ సెలక్షన్ గానీ అద్భుతంగా ఉంటాయి. గిల్ను బ్యాటింగ్ శైలీ పరంగా ప్రస్తుతం భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రాహుల్ వంటి కీలక ఆటగాళ్లతో పోల్చవచ్చు. నాకైతే అతడు భావి భారత కెప్టెన్ అవుతాడని అనిపిస్తోంది. అతడికి కెప్టెన్గా అనుభవం లేనప్పటకీ రాబోయే రోజుల్లో అతడు నేర్చుకోనే అవకాశం ఉంది" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. సచిన్ రికార్డు బద్దలు! జింబాబ్వేతో మూడో వన్డేలో 130 పరుగులు సాధించిన గిల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. అంతకుమందు ఈ రికార్డు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1998లో బులవాయో వేదికగా జింబాబ్వేతో జరిగిన వన్డేలో 127 పరుగులు సాధించి సచిన్ అజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్లో సచిన్ 24 ఏళ్ల రికార్డును గిల్ అధిగమించాడు. మ్యాన్ ఆఫ్ది మ్యాచ్, సిరీస్ సొంతం! ఇక మూడో వన్డేతో పాటు ఓవరాల్ సిరీస్లో అదరగొట్టిన గిల్కు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్తో పాటు సిరీస్ అవార్డులు వరించాయి. ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన గిల్ 245 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఒక సెంచరీ, అర్ధశతకం ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు భారత్ తరపున 9 వన్డేలు ఆడిన గిల్ 499 పరుగులు సాధించాడు. వన్డేల్లోఅతడి వ్యక్తిగత స్కోర్ 130 పరుగులు. 👏🏏 𝐈𝐓'𝐒 𝐇𝐄𝐑𝐄! Shubman Gill registers his first international 💯 with a beautiful knock. 🤩 This is just the beginning. More to come in the future! 💪 📸 Getty • #INDvZIM #ZIMvIND #ShubmanGill #TeamIndia #BharatArmy pic.twitter.com/FLESqcAiJW — The Bharat Army (@thebharatarmy) August 22, 2022 చదవండి: ICC ODI Rankings: క్లీన్స్వీప్లు.. టీమిండియా, పాకిస్తాన్ ఏ స్థానాల్లో ఉన్నాయంటే! -
'ఇంగ్లండ్ పిచ్లపై అతడి కంటే ఎవరూ మెరుగ్గా రాణించలేరు'
టీమిండియా వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజారాపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు చాలా సార్లు భారత జట్టును గెలిపించాడని, అయినప్పటికీ అతడి ఇన్నింగ్స్లకు తగిన గుర్తింపు రాలేదని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా అందరూ ఐపీఎల్లో ఆడుతున్నప్పడు.. పుజారా మాత్రం ఇంగ్లండ్ కౌంటీల్లో అడి తన ఫామ్ను తిరిగి పొందాడని అతడు కొనియాడాడు. ఇక శుక్రవారం ఇంగ్లండ్తో జరగనున్న ఐదో టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ను పుజారా ఆరంభించే అవకాశం ఉంది. "పుజారాకు ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఎక్కువగా ఆడిన అనుభవం ఉంది. కౌంటీ క్రికెట్లో బౌలర్ల కంటే అంతర్జాతీయ క్రికెట్లో బౌలర్లు మెరుగ్గా ఉండవచ్చని మీరు భావించవచ్చు. కానీ కౌంటీ క్రికెట్లో కూడా ఒకరిద్దరు అంతర్జాతీయ బౌలర్లు ఉంటారు. కౌంటీ క్రికెట్లో ఆడి పుజారా తన ఫామ్ను తిరిగి పొందాడు. అతడు ఎప్పడూ భారత జట్టుకు తనవంతు సహకారం అందిస్తాడు. ఇక మేము ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు పుజారా అంతగా రాణిస్తాడని ఎవరూ ఊహించలేదు. విదేశాల్లో పర్యటించేటప్పుడు భారత తరపున పుజారా అద్భుతంగా ఆడుతాడు. ఇంగ్లండ్ వంటి బౌన్సీ పిచ్లపై పుజారాకు పరుగులు సాధించే సత్తా ఉంది. ఇంగ్లండ్లో పుజారా కంటే ఎవరూ మెరుగ్గా రాణించలేరు" అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది కౌంటీల్లో ఐదు టెస్టు మ్యాచ్లు ఆడిన పుజారా 700 పరుగులు సాధించాడు. చదవండి: SL vs Aus1st Test: శ్రీలంకతో తొలి టెస్టు.. ఆస్ట్రేలియా స్కోర్: 313/8 -
'ఇంగ్లండ్తో ఐదో టెస్టు.. ఆ ఆల్రౌండర్ భారత జట్టులో ఉండాల్సింది'
ఇంగ్లండ్తో రీషెడ్యూల్ చేసిన 5వ టెస్టుకు టీమిండియా జట్టులోకి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసి ఉండాల్సిందని భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. టెస్టు జట్టులో శార్దూల్ ఠాకూర్ బాగా రాణిస్తున్నప్పటికీ.. హార్దిక్ లాంటి ఆల్ రౌండర్ జట్టులో ఉంటే మరింత బలం చేకూరుతుందని హర్భజన్ తెలిపాడు. ఇక పాండ్యా గత కొన్ని నెలలుగా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్ అదరగొట్టిన పాండ్యా.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్లోనూ రాణించాడు. ఐపీఎల్లో 15 మ్యాచ్లు ఆడిన పాండ్యా.. 487 పరుగులు సాధించాడు. "ఇంగ్లండ్తో టెస్టుకు భారత జట్టులో హార్దిక్ పాండ్యా ఉండాల్సింది. ఇంగ్లండ్ వంటి పిచ్లపై పేసర్లు బాగా రాణిస్తారని తెలుసు. శార్దూల్ ఠాకూర్ గత కొంత కాలంగా బాల్తో పాటు బ్యాట్తో కూడా రాణిస్తున్నాడు. కానీ హార్దిక్ పాండ్యా వంటి ఆల్ రౌండర్ ఉంటే జట్టు బ్యాటింగ్ పరంగా దృఢంగా ఉంటుంది. అదే విధంగా అతడు పార్ట్ టైమ్ బౌలర్గా కూడా ఉపయోగపడతాడు" అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఇక హార్ధిక్ పాండ్యా తన చివరి టెస్టు మ్యాచ్ 2018లో ఇంగ్లండ్పై ఆడాడు. అనంతరం కేవలం వైట్ బాల్ సిరీస్లకే హార్దిక్ పరిమితమయ్యాడు. చదవండి: ENG Vs IND 5th Test: "అతడు అద్భుతమైన ఆటగాడు.. అటువంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు" -
'వారిద్దరూ అద్భుతమైన స్పిన్నర్లు.. టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలి'
ఐపీఎల్-2022లో టీమిండియా వెటరన్ స్పిన్నర్లు యజువేంద్ర చహల్, కుల్ధీప్ యాదవ్ అదరగొడుతున్నారు. రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న చహల్ 10 మ్యాచ్ల్లో 19 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్న కుల్ధీప్ యాదవ్ 18 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టుకు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్లను ఎంపిక చేయాలని భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ సూచించాడు. కొన్నాళ్ల పాటు భారత తరుపున చాహల్, అత్యత్తుమంగా రాణించారు. కాగా 2019 ప్రపంచ కప్ తర్వాత వీరిద్దరూ ఫామ్ను కోల్పోయారు. తరువాత కొన్ని మ్యాచ్లకు జట్టుకు దూరమయ్యారు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2021 కు కూడా వీరిద్దకి చోటు దక్కలేదు. అయితే 'కుల్-చా' ద్వయం మళ్లీ తిరిగి ఫామ్లోకి రావడం భారత జట్టుకు కలిసొచ్చే అంశం. "టీమిండియా తరపున అద్భతంగా రాణించిన కుల్ధీప్,చహల్ భాగస్వామ్యాన్ని సెలక్టర్లు ఎందుకు విడగొట్టారో నాకు తెలియదు. అయితే ప్రస్తుతం 'కుల్-చా' ద్వయాన్ని ఖచ్చితంగా మళ్లీ జట్టులోకి తీసుకురావాలి. వారిద్దరూ కలిసి భారత్ తరపున ఆడినప్పుడు.. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టేవారు. టీ20, వన్డేల్లో భారత జట్టుకు చాలా విజయాలు అందించారు. కాబట్టి వీరిద్దరూ టీ20 ప్రపంచకప్లో భారత జట్టులో భాగం కావాలి" అని "డ్రీమ్ సెట్ గో" ప్రారంభోత్సవ కార్యక్రమంలో హర్భజన్ పేర్కొన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్ జరగనున్న ఆస్ట్రేలియాలో పిచ్లు పెద్దగా స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించవు. అంతేకాకుండా రవీంద్ర జడేజా వంటి స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్ కూడా జట్టులో ఉన్నాడు. దీంతో వీరిద్దరికి భారత జట్టులో మరి చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి. చదవండి: IPL 2022: 'కోల్కతా మ్యాచ్లో విలన్.. ఇప్పుడు హీరో.. శభాష్ సామ్స్' -
'అతడిని భారత జట్టుకు ఎంపిక చేయండి.. బుమ్రాకు సరైన జోడి'
ఐపీఎల్-2022లో సన్రైజర్స్ హైదరాబాద్ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మాలిక్ తన అద్భుత ప్రదర్శనతో అందరినీ అకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో ఉమ్రాన్ మాలిక్ను వీలైనంత త్వరగా భారత జట్టుకు ఎంపికచేయాలని మాజీలు, క్రికెట్ నిపుణులు కోరుకుంటున్నారు. ఈ కోవలో బారత మాజీ క్రికెటర్ హార్భజన్ సింగ్ చేరాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ 20 ప్రపంచకప్కు ఉమ్రాన్ మాలిక్ను భారత జట్టుకు ఎంపిక చేయాలని హార్భజన్ సింగ్ ఆకాక్షించాడు. "ఉమ్రాన్ మాలిక్ నా ఫేవరేట్ బౌలర్. నేను అతడిని భారత జట్టులో చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే అద్భుతమైన పేస్ బౌలర్. అతడు 150 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. అంత స్పీడ్తో బౌలింగ్ చేసే ఏ బౌలర్ కూడా జాతీయ జట్టుకు ఆడకుండా లేడు. అతడు తన ప్రదర్శనతో చాలా మంది యువ ఆటగాళ్లకు ఆదర్శవంతంగా నిలుస్తున్నాడు. కాగా అతడు టీ20 ప్రపంచకప్కు ఎంపిక అవుతాడో లేదో నాకు తెలియదు. కానీ నేను సెలక్షన్ కమిటీలో భాగమైతే, ఖచ్చితంగా అతడిని ఎంపిక చేస్తాను. టి20 ప్రపంచకప్లో జస్ప్రీత్ బుమ్రాకు మాలిక్ సరైన జోడి' అని హార్భజన్ సింగ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: 'కోల్కతా మ్యాచ్లో విలన్.. ఇప్పుడు హీరో.. శభాష్ సామ్స్' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
"చాలా మంది భారత స్టార్ ఆటగాళ్ల కంటే హార్ధిక్ బెటర్"
ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది సీజన్లో కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గా కూడా రాణిస్తోన్నాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన హార్ధిక్ పాండ్యా 308 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో హార్ధిక్ పాండ్యాపై టీమిండియా మాజీ ఆటగాడు హార్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. చాలా మంది భారత స్టార్ ఆటగాళ్ల కంటే హార్ధిక్ అద్భుతంగా ఆడుతున్నాడని భజ్జీ అభిప్రాయపడ్డాడు. త్వరలోనే పాండ్యా జట్టులోకి వస్తాడని హార్భజన్ తెలపాడు. "హార్దిక్ అద్భుతమైన టెక్నిక్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. మూడో స్ధానంలో అతడు నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో హార్దిక్ బ్యాటింగ్ చేయడం మనం చూడ లేదు. అతడు సాధారణంగా ఆరో, ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి హిట్టింగ్ చేసేవాడు. ఇన్నింగ్స్లో అఖరి మూడు, నాలుగు ఓవర్లలో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చేది. అప్పుడు కూడా తానేంటో నిరూపించుకునేవాడు. నేను అతడిని ఎవరితోనూ పోల్చదలచుకోలేదు. కానీ ప్రస్తుతం చాలా మంది స్టార్ బ్యాటర్ల కంటే మెరుగ్గా ఆడుతున్నాడు. ఏ జట్టులోనైనా అత్యత్తుమ బ్యాటర్.. ఎక్కవ బంతులను ఎదుర్కొంటాడు. హార్ధిక్ కూడా అంతే.. ఒక్క సారి సెట్ అయితే చివర్లో మరింత ప్రమాదకరంగా మారుతాడు. భారత జట్టులో కూడా హార్దిక్కి టాప్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఇవ్వాలి. జట్టులో మరో ఆటగాడిని ఫినిషర్గా ఎంపిక చేసి.. అతడిని ముందు బ్యాటింగ్కు పంపాలి. ఈ ఏడాది సీజన్లో హార్దిక్ బ్యాట్తో పాటు బంతితో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు కచ్చితంగా భారత జట్టలోకి పునరాగమనం చేస్తాడని "హార్భజన్ సింగ్ పేర్కొన్నాడు. -
'అతడికి తొలి మూడు మ్యాచ్లకు రెస్ట్ ఇవ్వండి.. ఆ తర్వాతే'
ఐపీఎల్-2022లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుత్రాజ్ గైక్వాడ్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి ఈ సీజన్లో వరకు మూడు మ్యాచ్లు ఆడిన రుత్రాజ్ కేవలం రెండు పరుగులు మాత్రమే సాధించాడు. కాగా రుత్రాజ్ ఆడిన మూడు సీజన్ల తొలి మూడు మ్యాచ్ల్లోను దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్-2020లో అరంగేట్రం చేసిన అతడు తొలి మూడు మ్యాచ్ల్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు. అదే విధంగా గతేడాది సీజన్లోను తొలి మూడు మ్యాచ్ల్లో 20 పరుగులు సాధించాడు. గైక్వాడ్ ప్రతీ సీజన్లో నాల్గువ మ్యాచ్ నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో రుత్రాజ్ గైక్వాడ్పై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ప్రతీ సీజన్లో మొదటి మూడు మ్యాచ్లకు రుత్రాజ్ విశ్రాంతి ఇవ్వాలని సీఎస్కేకు హార్భజన్ సలహా ఇచ్చాడు. అయితే ఎస్ఆర్హెచ్ మ్యాచ్తో గైక్వాడ్ తిరిగి ఫామ్లోకి వస్తాడని హర్భజన్ థీమా వ్యక్తం చేశాడు. నేను సీఎస్కే మేనేజ్మెంట్లో భాగమై ఉంటే... "గైక్వాడ్ను తొలి మూడు మ్యాచ్లకు గైక్వాడ్కు విశ్రాంతిని ఇచ్చేవాడిని. అతడిని నేరుగా నాలుగో మ్యాచ్కు అవకాశం ఇచ్చేవాడిని. ఎందకుంటే గైక్వాడ్ ప్రతీ సీజన్ తొలి మూడు మ్యాచ్ల్లోను విఫలమవుతాడన్న విషయం తెలిసిందే. కాబట్టి అతడి స్థానంలో వేరే ఆటగాడికి అవకాశం ఇస్తే సీఎస్కే విజయం సాధిస్తుంది. అయితే అతడు అద్భుతమైన ఆటగాడు. అతడి ఫామ్లో రావడం సీఎస్కేకు చాలా ముఖ్యం. కాబట్టి అతడు ఫామ్లోకి రావాలి అని ఆశిద్దాం. ఇక సీఎస్కే బౌలింగ్ విభాగంలో సరైన లెగ్స్పిన్నర్ లేడు. గతంలో ఇమ్రాన్ తాహిర్ అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టేవాడు. రవీంద్ర జడేజాతో కలిసి బౌలింగ్ చేయగల సరైన స్పిన్నర్ కావాలి" అని హార్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఇక శనివారం సన్రైజెర్స్ హైదరాబాద్తో సీఎస్కే తలపడనుంది. -
'ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లి కావాలి.. అయితే శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్'
ఐపీఎల్-2022లో ఈ సారి మొత్తం 10 జట్లు పాల్గోనబోతున్నాయి. కాగా ఈ 10 జట్లులో ఇప్పటికే 7 జట్లు కెప్టెన్లను నియమించాయి. ఇక మిగితా మూడు జట్లు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కేకేఆర్ జట్లు సారథిలను ఎంపిక చేసిన పనిలో పడ్డాయి. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే.. ఐపీఎల్-2021 సీజన్ అనంతరం సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారన్నది అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న. ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంచలన వాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లి మళ్లీ ఆర్సీబీ జట్టుకు నాయకత్వం వహించడానికి అంగీకరిస్తే ఎవరూ ఆశ్చర్యపోనవసరం లేదు అని అతడు తెలిపాడు. "రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త జట్టును తయారు చేస్తోంది. అదే విధంగా మంచి కెప్టెన్కోసం కూడా వారు వెతుకుతున్నారు. అయితే కోహ్లి మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టపడతాడని నేను భావిస్తున్నాను. అతడు మరో రెండు సంవత్సరాలు కెప్టెన్గా ఉండటానికి అంగీకరించినా నేను ఆశ్చర్యపోను. భవిష్యత్తులో జట్టును నడిపించగల యువ ఆటగాడిని ఎంపిక చేసుకోవాలి. భారత ఆటగాళ్లలో శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఇద్దరు జట్టును సమర్ధవంతంగా నడిపించగలరు. వారు వేలంలో ఇషాన్ కిషన్ లేదా శ్రేయస్ అయ్యర్లను తీసుకుంటే, వారు భవిష్యత్ కెప్టెన్లు అవుతారు. ఇప్పటి వరకు జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ టైటిల్ను ఒక్క సారి ఆర్సీబీ గెలవలేక పోయింది. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో కోహ్లి మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది" అని హర్భజన్ సింగ్ యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: NZ-W vs IND-W: తొలి వన్డే ముందు భారత్కు బిగ్ షాక్.. స్టార్ బ్యాటర్ దూరం! -
'ఆ విషయంలో హర్భజన్ సింగ్ కంటే నేనే బెటర్'
పాకిస్తాన్ మాజీ పేసర్ ఉమర్ గుల్ టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. హర్భజన్ సింగ్ కంటే తన బ్యాటింగ్ చాలా బాగుంటుందని ఉమర్ గుల్ తెలిపాడు. కాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆసియా లయన్స్కు ఉమర్ గుల్ ప్రాతినిథ్యం వహించాడు. అయితే రెండు మ్యాచ్లు ఆడిన గుల్ కేవలం ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. కాగా గతంలో 2007 టీ20 వరల్డ్కప్ ఫైనల్లోనూ.. 2011 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లోనూ భారత్పై గుల్ అధ్బుతంగా రాణించాడు. హర్భజన్ సింగ్ కూడా బాగా బ్యాటింగ్ చేస్తాడు, కానీ నా బ్యాటింగ్కు ప్రపంచకప్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచాను. కాబట్టి బ్యాటింగ్ విషయంలో హర్భజన్ సింగ్ కంటే నేనే బెటర్ అని ఉమర్ గుల్ పేర్కొన్నాడు. కాగా 2012 టీ20 ప్రపంచకప్లో గుల్ అధ్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా గుల్ ఎంపికయ్యాడు. ఇక పాకిస్తాన్ తరుపున 60 టీ20 మ్యాచ్లు ఆడిన ఉమర్ గుల్ 85 వికెట్లు పడగొట్టాడు. చదవండి: జట్టు సీఈవోతో గొడవ.. ఏకంగా కెప్టెన్సీ నుంచే తీసేసారు! -
"నా జీవితంపై సినిమా తీయాలని అనుకుంటున్నాను"
భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మనుసులో మాటను బయటపెట్టాడు. తన జీవితంపై బయోపిక్ తీయాలని అనుకుంటున్నట్లు భజ్జీ తెలిపాడు. భారత్ తరుపున ఆడే రోజుల్లో తను ఎలా ఉన్నానో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అతడు అభిప్రాయపడ్డాడు. అందుకే బయోపిక్ తీయాలని అనుకుంటున్నట్లు భజ్జీ వెల్లడించాడు. ఇప్పటికే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, మహ్మద్ అజారుద్దీన్లపై బయోపిక్లు అభిమానులను మురిపించాయి. 1983 ప్రపంచ కప్ విజయం ఆధారంగా రూపొందించబడిన '83' సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. "నేను నా జీవితంపై ఒక సినిమా లేదా వెబ్ సిరీస్ని రూపొందించాలనుకుంటున్నాను. తద్వారా ఈ కథలో నేను ఎలాంటి వ్యక్తిని,భారత తరపున ఎలా రాణించానో అనే విషయాలను కూడా ప్రజలు తెలుసుకుంటారు" అని జీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. కాగా గత ఏడాది డిసెంబర్లో హర్భజన్ అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికాడు. భారత తరుపున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు భజ్జీ ఆడాడు. అదే విధంగా ఐపీఎల్లో 163 మ్యాచ్లు అతడు ఆడాడు. చదవండి: SA Vs IND: "బౌన్స్ పిచ్లపై ఆడటానికి సిద్దంగా ఉన్నా" -
షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన హర్భజన్ సింగ్
Shoaib Akhtars mothers demise: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్తర్ తల్లి అనారోగ్యంతో ఆదివారం మరణించింది. ఈ విషయాన్ని అతడు ట్విటర్ వేదికగా తెలిపాడు. పాకిస్తాన్ మీడియా కథనాలు ప్రకారం.. షోయబ్ తల్లి ఆరోగ్యం క్షీణిచడంతో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందూతూ మృతి చెందింది. ఆమె అంత్యక్రియలు ఇస్లామాబాద్లో జరగనున్నాయి. కాగా అక్తర్ తల్లి మృతికి టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, షోయబ్ మాలిక్తో పాటు పలువురు క్రికెటర్లు సంతాపం తెలిపారు. "ఈ క్లిష్ట సమయంలో మీకు అల్లా అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. ఆమె కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని హర్భజన్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నాడు. చదవండి: Vijay Hazare Trophy Final: అర్ధ సెంచరీతో మెరిసిన దినేష్ కార్తీక్.. -
ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్..
‘జంబో’ అనిల్ కుంబ్లే మృదు స్వభావి. బౌలింగ్ తప్ప వేరే ధ్యాస లేదు అతనికి. కానీ అతని నీడన ఎదిగిన ‘టర్బోనేటర్’కు దూకుడెక్కువ. మైదానంలో ఆడతాడు. తిడతాడు. ఇంకెమైనా అంటే చెంప చెళ్లుమనిపిస్తాడు కూడా! అవును భజ్జీ అంతే! తగ్గేదేలే అంటాడు. మనోడైనా... ఇంకెవరైనా... తాడోపేడో తేల్చుకునే రకం. ఇది ఆట సంగతీ... మ్యాచ్ ఫిక్సింగ్తో మసకబారిన క్రికెట్ తదనంతరం సౌరవ్ గంగూలీ సారథ్యంలో టీమిండియాగా రూపాంతరం చెందుతున్న రోజులవి. అప్పటికే కుంబ్లే టాప్ స్పిన్నర్. అయినప్పటికీ తనదైన శైలి ఆఫ్ స్పిన్తో హర్భజన్ ఎదిగాడు. 2001 అతని కెరీర్కు బంగారుబాట వేసింది. భారత్లో పర్యటించిన ఆస్ట్రేలియా మూడు టెస్టులాడింది. ఈ సిరీస్లో భజ్జీ 32 వికెట్లు తీశాడు. ముంబైలో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోయింది. కోల్కతాలో జరిగిన రెండో టెస్టులో వీవీఎస్ లక్ష్మణ్ (281) స్పెషల్ ఇన్నింగ్స్... హర్భజన్ ‘హ్యాట్రిక్’ మాయాజాలంతో టీమిండియా అద్భుత విజయం సాధించింది. సిరీస్ను 1–1తో సమం చేసింది. ఆ తర్వాత చెన్నైలో జరిగిన మూడో టెస్టులో భారత్ రెండు వికెట్లతో నెగ్గి సిరీస్ను 2–1తో సొంతం చేసుకుంది. 2003లో జరిగిన వన్డే ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిన జట్టులో హర్భజన్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. మంకీగేట్ కథ... భారత్ 2008లో ఆసీస్ పర్యటనకెళ్లింది. సిడ్నీలో మ్యాచ్ సందర్భంగా చెలరేగిన జాతి వివక్ష ఆరోపణలు, వివాదం, విచారణ.... తదనంతరం ‘మంకీగేట్’గా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. భజ్జీ తనను కోతి అన్నాడని జాతి వివక్ష ఆరోపణలు చేశాడని సైమండ్స్ నానాయాగీ చేశాడు. అప్పుడు క్రీజులో ఉన్న సచిన్, జట్టు మేనేజర్గా వెళ్లిన ఎంవీ శ్రీధర్, ‘టర్బో’తో పాటు విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఆసీస్, భారత్ క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈ కథ ముగిసింది. అబ్బనీ తియ్యని దెబ్బ! ఆట... మాట... ఇలా వుంటే అతను కొట్టే దెబ్బ సంగతి మాత్రం స్పీడ్స్టర్ శ్రీశాంత్కు బాగా ఎరుక. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభమైంది. తొలి సీజన్లో ముంబై ఇండియన్స్కు హర్భజన్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్కు శ్రీశాంత్ ఆడారు. నిజానికి వీరిద్దరు ఏడాది క్రితం టి20 ప్రపంచకప్ నెగ్గిన ధోని సేన సభ్యులు. ఇద్దరి మధ్య ఎక్కడ పొరపాటు జరిగిందో కానీ ముంబైపై పంజాబ్ గెలిచాక శ్రీకాంత్ నోరు జారడంతో హర్భజన్ ఆగ్రహంతో అతని చెంప చెళ్లుమనిపించాడు. శ్రీశాంత్ చాలాసేపు వెక్కివెక్కి చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. చదవండి: మీడియా సమావేశానికి కోహ్లి డుమ్మా కొట్టనున్నాడా! -
కీపింగ్ చేస్తూ సూపర్ క్యాచ్ పట్టిన హర్భజన్ సింగ్.. వీడియో వైరల్..
Harbhajan Singh Celebrates After Taking Catch In Gully Cricket: భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పడు అభిమానుల కోసం ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంటాడు. అయితే ఓ అసక్తికరమైన వీడియోను హర్భజన్ ట్విట్టర్లో షేర్ చేశాడు. ఆ వీడియోలో అంత ఆసక్తికరం ఏముందంటే.. తన ఇంటికి సమీపంలో హర్భజన్ గల్లీ క్రికెట్ ఆడాడు. మీరు అనుకున్నట్టు బ్యాటర్గానో, బౌలర్గానో కాదు.. ఈ సారి టర్బోనేటర్ వికెట్ కీపర్ అవతారం ఎత్తాడు. వికెట్ కీపింగ్ చేయడమే కాకుండా ఒక క్యాచ్ కూడా పట్టాడు. అది ఇప్పడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా ఈవీడియోకు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కామెంట్రీ చెప్పడం గమనార్హం. ఈ వీడియోపై నెటజన్లు స్పందిస్తూ.. సింగ్ ఈజ్ కింగ్ అని, పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మాల్ కంటే బాగా కీపింగ్ చేస్తున్నావ్ అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: Mahela Jayawardene: శ్రీలంక కోచ్గా మహేల జయవర్ధనే! View this post on Instagram A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) -
MS Dhoni:ఆ జట్టులో కోహ్లికి నో ఛాన్స్.. కెప్టెన్గా మరోసారి ధోని
Harbhajan Singh’s All-Time T20 Playing XI : భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ఆల్ టైమ్ టీ20 ఫ్లేయింగ్ ఎలెవన్ను ఎంచుకున్నాడు . తను ప్రకటించిన జట్టుకు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్గా హర్భజన్ సింగ్ ఎంచుకున్నాడు. అదే విధంగా.. యూనివర్స్ల్ బాస్ క్రిస్ గేల్, హిట్మ్యాన్ రోహిత్ శర్మకు ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్కు మూడో స్ధానంలో, ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్ వాట్సన్కు నాలుగో స్ధానంలో చోటు దక్కింది. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్కు ఐదో స్థానంలో అవకాశం ఇచ్చాడు. ధోనీని తన టీమ్కి వికెట్ కీపర్గా, కెప్టెన్గా హర్భజన్ ఎంపిక చేశాడు. ఆల్రౌండర్ కోటాలో డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్కు చోటు కల్పించాడు. తన జట్టులో ఏకైక స్పిన్నర్గా సునీల్ నరైన్ను ఎంపిక చేశాడు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా,లసిత్ మలింగకు తన జట్టులో హర్భజన్ సింగ్ స్థానం కల్పించాడు. కాగా హర్భజన్ సింగ్ ప్రకటించిన ఈ జట్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లికు స్ధానం దక్కకపోవడం గమనార్హం. హర్భజన్ T20 XI: రోహిత్ శర్మ, క్రిస్ గేల్, జోస్ బట్లర్, షేన్ వాట్సన్, ఏబీ డివిలియర్స్, ధోని (కెప్టెన్), డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా చదవండి: న్యూజిలాండ్ను అఫ్గానిస్థాన్ ఓడించగలదు.. కానీ? -
జవగళ్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్లకు అరుదైన గౌరవం
లండన్: భారత మాజీ క్రికెటర్లు జవగళ్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్లకు ప్రసిద్ధ మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో జీవితకాల సభ్యత్వం లభించింది. టెస్టు క్రికెట్ ఆడే 12 దేశాల నుంచి ఎనిమిది దేశాల క్రికెటర్లకు ఈ ఏడాది జీవితకాల సభ్యత్వం ఇచ్చినట్లు ఎంసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. మేటి పేసర్గా భారత జట్టుకు సేవలందించిన శ్రీనాథ్ ప్రస్తుతం ఐసీసీ ఎలైట్ మ్యాచ్ రిఫరీ ప్యానెల్లో ఉన్నారు. శ్రీనాథ్ తన అంతర్జాతీయ కెరీర్లో వన్డేల్లో 315 వికెట్లు, టెస్టుల్లో 236 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్ మూడు ఫార్మాట్లలో కలిపి 711 వికెట్లు తీశాడు. చదవండి: T20 WC 2021: ఆఖరి ఓవర్లో నలుగురు ఔట్.. బౌలర్కు దక్కని హ్యాట్రిక్ -
T20 World Cup 2021: అతడు తప్పకుండా భారత జట్టులోకి వస్తాడు...
Harbhajan Singh Comments On Yuzvendra Chahal: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తిరిగి టీ20 ప్రపంచ కప్ జట్టులోకి వస్తాడాని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ థీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్2021 సెకెండ్ పేజ్లో చాహల్ అధ్బుతంగా రాణిస్తున్నాడు. దీంతో సెలక్టర్లపైన పలువురు మాజీ ఆటగాళ్లు ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో చాహల్ జట్టుకు ఎంపికవుతాడని హర్భజన్ సింగ్ కూడా ట్వీట్ చేయడం గమనర్హం. "భారత జట్టులో తన స్థానాన్ని తిరిగి పొందడానికి చాహల్ 'సరైన వేగంతో' బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. . టీ 20 ప్రపంచ కప్లో చాహల్ను భారత జట్టులో చూడాలని తాను ఇప్పటికీ ఆశిస్తున్నానని, టోర్నమెంట్ ప్రారంభమయ్యే ముందు కూడా జట్టులో మార్పులు జరగవచ్చు" అని భజ్జీ ట్విట్టర్లో పేర్కొన్నాడు. అయితే 15 మంది సభ్యలుతో కూడిన భారత జట్టును బీసీసీఐ గత నెలలో ప్రకటించింది. బీసీసీఐ ప్రకటించిన జట్టులో యుజ్వేంద్ర చాహల్ దక్కకపోవడం అందరనీ ఆశ్యర్యపరిచంది. ఐసీసీ నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. జట్లు అక్టోబర్ 10 లోపు తమ జట్టులో మార్పులు చేయవచ్చు. కాగా టీ20 ప్రపంచకప్ ఈ నెల 17 నుంచి యూఏఈ, ఒమన్ వేదికగా జరగనుంది. చదవండి: టీ20 ప్రపంచకప్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్..! -
ఐపీఎల్కు గుడ్బై చెప్పనున్న భారత ఆటగాళ్లు వీరే!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా ఈవెంట్ ఐపీఎల్- 2021 సెకండ్ ఫేజ్ ప్రారంభమైంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమైంది . అయితే ఈ సీజన్ తర్వాత కొంత మంది భారత ఆటగాళ్లు లీగ్కు వీడ్కోలు పలుకనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తెరమీదకు వచ్చిన ఆ ఆటగాళ్లు ఎవరో పరిశీలిద్దాం. హర్భజన్ సింగ్ హర్భజన్ సింగ్ భారత అత్యత్తుమ స్పిన్నర్లలోఒకడు. టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా 2001లో అరుదైన ఘనత సాధించాడు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే.. తన ఐపీఎల్ కెరీర్ను ముంబై ఇండియన్స్తో ప్రారంభించాడు. పది సీజన్ల తరువాత 2018 లో ముంబై భజ్జీను వేలంలో పెట్టింది. తరువాత చెన్నై సూపర్ కింగ్స్ కనీస ధరతో అతడుని దక్కించుకోంది. ఆనంతరం రెండు సీజన్ల తరువాత 2021లో చెన్నై కూడా హర్భజన్ ను వేలంలో పెట్టింది. ఈ ఏడాది సీజన్లో ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ని కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసింది. కానీ ఐపీఎల్ మెదటి దశలో కోల్కతా తరుపున అతడకి తుది జట్టులో పెద్దగా అవకాశం దక్కలేదు. ఈ ఏడాది జూలైలో 40వ పడిలోకి అడుగు పెట్టిన హర్భజన్ సింగ్.. ఐపీఎల్ సెకండ్ ఫేజ్ పూర్తయిన తర్వాత ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరియర్లో 160 మ్యాచ్లు ఆడిన హర్భజన్ సింగ్ మొత్తం 150 వికెట్లు పడగొట్టాడు. అమిత్ మిశ్రా అమిత్ మిశ్రా భారత లెగ్ స్పిన్ దిగ్గజం. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే.. తన ఐపీఎల్ కెరీర్ను ఢిల్లీ డెర్డెవిల్స్ తో ప్రారంభించాడు. ఆ తరువాత సన్ రైజర్స్ హైదరాబాద్, పుణే వారియర్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ లో కొనసాగుతున్నాడు. కాగా ఐపీఎల్లో మిశ్రా తన పేరు మీద అనేక రికార్డులు కలిగి ఉన్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్గా మిశ్రా ఉన్నాడు. ఈ లీగ్లో అత్యధిక హ్యాట్రిక్లు(3) సాధించిన బౌలర్గా అమిత్ మిశ్రా రికార్డు సాధించాడు. అయితే.. వెటరన్ స్పిన్నర్ కొన్ని నెలల్లో 39 ఏళ్లు పూర్తి చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో ఇదే అతని అఖరి సీజన్ కావచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరీర్లో 154 మ్యాచ్లు ఆడిన అమిత్ మిశ్రా 166 వికెట్లు సాధించాడు. వృద్ధిమాన్ సాహా సాహా తన కెరీర్ను కోల్కతా నైట్రైడర్స్ తో ప్రారంభించాడు. ఆ తరువాత మూడు సీజన్ల ఆనంతరం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్కు ప్రతినిధ్యం వహించాడు. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొనసాగుతున్నాడు. కాగా ఐపీఎల్ సెకెండ్ ఫేజ్కు ఆజట్టు స్టార్ ఓపెనర్ జానీ బెయిర్స్టో దూరమయ్యాడు. ఈ క్రమంలో సాహా హైదరాబాద్కు ఓపెనింగ్ చేసే అవకాశాఉ ఉన్నాయి. కాగా మరో నెలలో 37 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సాహా ఐపీఎల్కు గుడ్బై చెప్పనున్నాడని సమాచారం. కాగా సాహా తన ఐపీఎల్ కెరీర్లో 126 మ్యాచ్లు ఆడి 1987 పరుగులు సాధించాడు. కేదార్ జాదవ్ కేదార్ జాదవ్ ఐపీఎల్లో ఆద్బతమైన ఆటగాడు కానప్పటికీ, తన ఐపీఎల్ కెరీర్లో కొన్ని మ్యాచ్లలో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. జాదవ్ తన కేరిర్ను ఢిల్లీ డేర్డెవిల్స్తో ప్రారంభించగా.. 2018లో అతడుని చెన్నై సూపర్ కింగ్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆనంతరం 2021లో చెన్నై జాదవ్ను వేలంలో పెట్టింది. తరువాత సన్రైజర్స్ హైదరాబాద్ కేదార్ను దక్కించుకోంది. 36 ఏళ్ల జాదవ్ ఫామ్లో లేనందున, ఇది అతని చివరి సీజన్ కావచ్చోని వినికిడి. కాగా జాదవ్ తన కేరిర్లో 91మ్యాచ్ల్లో 1181 పరుగులు సాధించాడు. రాబిన్ ఉతప్ప రాబిన్ ఉతప్ప తన ఐపీఎల్ కెరీర్ ను కోల్కతా నైట్ రైడర్స్తో ప్రారంభించాడు. 2014 నుంచి 2019 వరకు కోల్కతా నైట్ రైడర్స్ తరుపున అద్భతంగా రాణించాడు. 2014 సీజన్లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఉతప్ప చెన్నై సూపర్ కింగ్స్తో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2021 మొదటి దశలో చెన్నై తరుపున ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం దొరకలేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్కు విడ్కోలు పలకవచ్చని సమాచారం. చదవండి: IPL 2021 2nd Phase CSK VS MI: రుతురాజ్ మెరుపులు.. ముంబై ఇండియన్స్ టార్గెట్ 157 -
హర్భజన్ సింగ్ ఇంటర్వ్యూ
-
సెప్టెంబర్లో హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ ‘ఫ్రెండ్షిప్’
ఇండియన్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ హీరోలుగా నటించిన చిత్రం ‘ఫ్రెండ్ షిప్’. జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత ఎ.ఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు. చదవండి: ‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్, మేకప్కు అంత సమయమా..! ఈ సందర్భంగా... శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎఎన్ బాలాజీ మాట్లాడుతూ ‘సెకండ్ వేవ్ తర్వాత తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మా ‘ఒరేయ్ బామ్మర్ది’ చిత్రం. ఇటీవల థియేటర్లో విడులైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అందరూ సూపర్ హిట్ సినిమా అంటున్నారు. ఇప్పుడు ‘ఫ్రెండ్ షిప్’ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దాదాపు 25 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో వైవిధ్యంగా రూపొందిన ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది’ అని చెప్పారు. చదవండి: అభిషేక్కు గాయాలు.. హాస్పిటల్కు రాని ఐశ్వర్యరాయ్? కాగా మలయాళంలో అందరూ కొత్త నటీనటులతో చేసి సూపర్ హిట్ అయిన ‘క్వీన్’ సిరీస్కు రీమేక్ రైట్స్ తీసుకుని ‘ఫ్రెండ్షిప్’ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో హర్భజన్, అర్జున్ పోటాపోటీగా నటించారు. ఈ మూవీలో మొత్తం ఐదు ఫైట్స్, నాలుగు పాటలు ఉన్నాయట. రాజకీయాలకు, కాలేజ్ స్టూడెంట్స్ మధ్య ఏం జరిగిందనే విషయాన్ని ఆసక్తికరంగా, కమర్షియల్ అంశాలతో ఎంగేజింగ్గా దర్శకుడు జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య ఫ్రెండ్షిప్ను తెరకెక్కించారు. ఈ మూవీ ఐదు భాషల్లో(తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం) విడుదలవుతుంది. సెన్సార్కు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్లో విడుదల చేసేలా ప్లాన్ చేశారు మేకర్స్. ఇక త్వరలోనే రిలీజ్ డేట్ను కూడా ప్రకటిస్తామని చిత్ర బృందం ఈ సందర్భంగా వెల్లడించింది. -
ఫ్రెండ్షిప్ మూవీలోని ‘అరిచి అరగదీయమ్మ’ పాట విడుదల
బౌలర్గా ఎన్నో రికార్డులను సృష్టించాడు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. బాల్తోనే కాదు సిక్సులు బాది బ్యాట్తో కూడా సమాధానం చెప్పే బజ్జీ పుట్టిన రోజు నేడు. అయన నటుడిగా తెరంగేట్రం చేస్తున్న ‘ఫ్రెండ్షిష్’ చిత్ర బృందం ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘అరిచి అరగదీయమ్మ’ అనే సాంగ్ను విడుదల చేసింది. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తుండడం విశేషం. ‘జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య’ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆర్కే ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్. బాలాజీ నిర్మిస్తున్నాడు. ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎ స్ కె) విలన్గా, తమిళ బిగ్ బాస్ విన్నర్, మాజీ 'మిస్ శ్రీలంక' 'లోస్లియా' హీరోయిన్ గా నటిస్తుస్తోంది. 25 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ లోగోను మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్ధ స్వామి మంత్రాలయంలో ఆవిష్కరించగా భారీ స్పందన దక్కింది. త్వరలోనే ఈ మూవీ రామోజీ ఫిలిం సిటీలో ఓ పాట, ఫైట్ సన్నివేశాల షూటింగ్ను జరుపుకోనుంది. -
నా తప్పే.. క్షమించండి: హర్భజన్ సింగ్
వాట్సాప్లో వచ్చిన ఫార్వార్డ్ మెసేజ్. చూడకుండా పోస్టు పెట్టా... సారీ!... అంటూ టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్షమాపణలు కోరుతున్నాడు. ఖలీస్తాన్ వేర్పాటువాది బింద్రన్వాలేను అమరవీరుడిగా పేర్కొంటూ భజ్జీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టడంపై ఇంటర్నెట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది. దీంతో క్షమాపణలు చెప్పాడు టర్బోనేటర్. ఢిల్లీ: ఖలిస్తాన్ తీవ్రవాది బింద్రన్వాలేని అమరవీరుడిగా పేర్కొంటూ హర్భజన్ సింగ్ నివాళులు అర్పిస్తూ చేసిన పోస్టుపై తీవ్ర దుమారం చెలరేగింది. ఆపరేషన్ బ్లూస్టార్కు 37 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్వర్ణ దేవాలయంలో చంపబడ్డ సిక్కు అమరవీరులకు నివాళులర్పిస్తూ భజ్జీ నిన్న(జూన్ 6న) ఒక పోస్ట్ చేశాడు. అయితే అందులో జర్నెయిల్ సింగ్ బింద్రన్వాలే ఫొటో కూడా ఉంది. దీంతో ఒక తీవ్రవాదిని అమరవీరుడిగా ఎలా అభివర్ణిస్తావంటూ హర్భజన్ సింగ్ను చాలామంది ట్రోల్ చేశారు. జరిగిన పొరపాటును గుర్తించానని చెబుతూ.. ఈరోజు ట్విట్టర్లో మరో పోస్ట్ చేశాడు భజ్జీ. అది కేవలం వాట్సాప్లో వచ్చిన ఫార్వార్డ్ మెసేజ్ అని, తానుచూసుకోకుండా పోస్ట్ చేశానని ట్వీట్ చేశాడు. My heartfelt apology to my people..🙏🙏 pic.twitter.com/S44cszY7lh — Harbhajan Turbanator (@harbhajan_singh) June 7, 2021 ‘‘ఇన్స్టాగ్రామ్లో నిన్న చేసిన పోస్టుకి క్షమాపణలు. అది వాట్సాప్లో ఫార్వర్డ్ అయిన మెసేజ్. కంటెంట్ను అర్థం చేసుకోకుండా.. సరిగ్గా చూడకుండా పోస్ట్ చేశా. కానీ, అందులో ఉన్న ఉద్దేశం నేను గ్రహించలేకపోయా. ఇది ముమ్మాటికీ నా తప్పే. అంగీకరిస్తున్నా. ఆ ఫొటోలోని వ్యక్తుల సిద్ధాంతాలకు నేను కట్టుబడి లేను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి మద్ధతు ఇవ్వను. నేను సిక్కును. భారతీయుడను. దేశం కోసం పోరాడుతా. వ్యతిరేకంగా కాదు. ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. నా దేశ ప్రజలకు హాని చేసే ఏ విద్రోహ శక్తులకు నేను సహకరించలేదు. సహకరించను కూడా’’ అని చెప్పుకొచ్చాడు హర్బజన్ సింగ్. అయితే నెటిజన్స్ మాత్రం శాంతించడం లేదు. గతంలో షాహిద్ అఫ్రిదీ కోసం డొనేషన్లు సేకరించిన భజ్జీ.. ఇప్పుడు మరోసారి దేశ వ్యతిరేక బుద్ధిని చాటుకున్నాడంటూ విరుచుకుపడుతున్నారు. ఈ మేరకు హర్భజన్ సింగ్ పేరు ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది కూడా. చదవండి: సెలబ్రిటీలకు మాత్రమే రిప్లైలా? -
రైనాకు మరోషాక్.. కాంట్రాక్టు రద్దు..!
దుబాయ్ : హాట్ ఫేవరెట్గా ఐపీఎల్ లీగ్లో అడుగుపెట్టిన చెన్నై సూపర్కింగ్స్ జట్టు (సీఎస్కే) అంచనాలను అందుకోలేపోతుంది. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ధోనీ జట్టు వరుస రెండు మ్యాచ్ల్లో ఓటమితో వారంలోనే పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. హిట్టింగ్లేని బ్యాటింగ్తో పాటు పసలేని బౌలింగ్తో ప్రత్యర్థి జట్లతో పోటీపడలేక వెనుకబడుతోంది. అయితే ఈ జట్టు సీనియర్ ఆటగాడు, స్టార్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని పలువురు సీనియర్లు అభిప్రాయపడుతుండగా.. ఇక రైనా వైపు తిరిగిచూసే ప్రసక్తేలేదని సీఎస్కే సీఈవో విశ్వనాథన్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ('రైనా.. ప్లీజ్ తిరిగి రావా') తన వ్యక్తిగత కారణాల వల్ల రైనా లీగ్ నుంచి నిష్క్రమించాడని, అతను లేని లోటును రిజర్వుబెంచ్లోని ప్లేయర్ల ద్వారా భర్తీచేస్తామని ప్రకటించాడు. ఈ క్రమంలోనే రైనాతో పాటు మరోసీనియర్ ఆటగాడు హర్బజన్ సింగ్ పేర్లను సీఎస్కే అధికార వెబ్సైట్ నుంచి తొలగించించింది. సీఎస్కే నిర్ణయంతో రైనాకు పూర్తిగా దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. మొన్నటి వరకు రైనా తిరిగి వస్తాడనుకున్న రైనా ఆశలు కూడా అడియాశలై పోయాయి. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు ఈ ఇద్దరు ఆటగాళ్లపై మరో చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ నుంచి అర్థాంతరంగా వైదొలిగిన స్టార్ బ్యాట్స్మెన్ రైనాతో పాటు సీనియర్ స్పిన్నర్ హర్బజన్తో తమకున్న కాంట్రాక్టులను పూర్తిగా రద్దు చేసుకోవాలని సీఎస్కే భావిస్తున్నట్ల వార్తలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి తప్పుకున్న ఇరువురి ఆటగాళ్ల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమచారం. దీనిపై జట్టు యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా మిస్టర్ ఐపీఎల్గా పేరొందిన రైనాకు సీఎస్కే ప్రస్తుత సీజన్లో రూ.11కోట్లు వెచ్చిస్తోంది. (చెన్నైకి అదనపు బౌలర్ కావాలి!) మిస్టర్ కూల్ ముందుకు వస్తాడా..? మరోవైపు వరుస రెండు మ్యాచ్లో ఓటమిని చవిచూసిన సీఎస్కే.. శుక్రవారం జరిగే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడేందుకు సిద్ధమైంది. మొదటి మ్యాచ్లో మెరిపించిన అంబటి రాయుడు నేటి మ్యాచ్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కెప్టెన్ ధోనీపై అభిమానులు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. రైనాలేని లోటును ఏ ఆటగాడు కూడా భర్తీచేయకపోవడంతో టాప్ఆర్డర్లో కొంత వెలితి కనిపిస్తోంది. గత మూడు మ్యాచ్ల్లో బ్యాంటింగ్ ఆర్డర్లో వెనుక వచ్చిన ధోనీ హైదరాబాద్తో మ్యాచ్ నుంచి ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక దుబాయ్ వేదికగా జరిగే నేటి మ్యాచ్లో మిస్టర్ కూల్ ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతాడో వేచి చూడాలి. -
హర్భజన్కు షాకిస్తున్న ఫ్యాన్స్!
ముంబై: కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ స్టార్స్ తమకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు. కరోనా నుంచి రక్షణ పొందటానికి రోగ నిరధక శక్తిని ఎలా పెంచుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్లు చేయాలి అనే విషయాలను కూడా వారి సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఫ్యాన్స్కు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ఫ్యాన్స్ కోసం ‘సింపుల్ ఎక్సర్సైజ్’ అని ఒక వీడియోని తన ట్విటర్ అకౌంట్లో శనివారం పోస్ట్ చేశాడు. (దాదా ఇంట మరోసారి కరోనా కలకలం) ఈ వీడియోలో ఒక వ్యక్తి చాలా కష్టమైన కొన్ని డాన్స్ స్టెప్పులను వేశాడు. వాటిని చాలా మంది గుంపు ముందు చేసి చూపించాడు. ఈ వీడియోను పోస్ట్ చేసిన భజ్జి కరోనా టైంలో ఇంట్లో ఉండి ఎక్సర్సైజ్లు చేయాలనుకుంటున్నారా?, ఈ 20 సెకన్లు ఉండే ఎక్సర్సైజ్ను చేస్తూ ఫిట్గా ఉండండి, రోగనిరోధక శక్తిని పెంచుకోండి అని పోస్ట్ చేశాడు. దీనిపై అతడికి అభిమానులు చురకలు అంటించారు. భజ్జీ నువ్వు ఒకసారి డెమో చేసి చూపించవా అని ఒకరు కోరారు. మరో అభిమాని మీరు ఇది ఫస్ట్ ట్రై చేసి ఆ వీడియో ఎందుకు పెట్టకూడదు అని కామెంట్ చేశాడు. (‘ఆ విషయంలో జడేజాను మించినోడు లేడు’) A Very Simple Exercise for only 20 seconds to Keep you Fit & Boost Your Immunity.. pic.twitter.com/u6miwpXmqF — Harbhajan Turbanator (@harbhajan_singh) June 20, 2020 -
ఇందులో తప్పెవరిదీ?
-
‘మంకీ’ పెట్టిన చిచ్చు..!
ఒక ఆటగాడు తన చర్యలతోనో, వ్యాఖ్యలతోనే వివాదం రేపడం... అతనిపై ఐసీసీ చర్య తీసుకోవడం క్రికెట్ చరిత్రలో లెక్క లేనన్ని సార్లు జరిగాయి. అయితే ఇద్దరు ఆటగాళ్ల మధ్య మైదానంలో సాధారణంగా కనిపించిన గొడవ చివరకు ముదిరి ఇరు దేశాల బోర్డుల మధ్య గొడవగా మారడం... దాదాపు న్యాయస్థానంలో జరిగినట్లుగా లాయర్లతో కలిసి వివాద పరిష్కారం చేయాల్సి రావడం అరుదు. అయితే భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరిగిన 2007–08 సిరీస్ టెస్టు అలాంటిదే. అంపైర్ల తప్పుడు నిర్ణయాలతో అప్పటికే భారత్కు ఓటమి ఎదురు కాగా, హర్భజన్పై ‘జాతి వివక్ష’ వ్యాఖ్యల ఆరోపణలు వెరసి టీమిండియా సిరీస్ను బాయ్కాట్ చేసే వరకు వచ్చింది. ‘మంకీ గేట్’గా ఈ ఉదంతానికి మచ్చ పడింది. అనిల్ కుంబ్లే నాయకత్వంలో ఆస్ట్రేలియా పర్యటించిన భారత జట్టు మెల్బోర్న్లో జరిగిన తొలి టెస్టులో 337 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. అయితే కోలుకున్న టీమ్ సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 463 పరుగులు చేయగా, సచిన్ (153), లక్ష్మణ్ (109) సెంచరీల సహాయంతో 532 పరుగులు చేసిన భారత్ 69 పరుగుల ఆధిక్యం అందుకుంది. రెండో ఇన్నింగ్స్ను 7 వికెట్లకు 401 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన ఆసీస్ చివరి రోజు భారత్ ముందు కనీసం 73 ఓవర్లలో 333 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్కు ఇదేమీ పెద్ద కష్టం కాదు. అయితే ఇద్దరు అంపైర్లు స్టీవ్ బక్నర్, మార్క్ బెన్సన్ తప్పుడు నిర్ణయాల కారణంగా చివరకు జట్టు ఓటమిపాలైంది. ద్రవిడ్ బ్యాట్కు బంతి తగలకపోయినా అవుట్ ఇవ్వడం, స్లిప్లో గంగూలీ ఇచ్చిన క్యాచ్ను క్లార్క్ అందుకున్నప్పుడు బంతి నేలను తాకున్నా అవుట్గా ప్రకటించడం, ఇందు కోసం మూడో అంపైర్ను అడక్కుండా మరో ఫీల్డర్ పాంటింగ్ సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోవడం, ఆపై ధోనిని తప్పుడు ఎల్బీడబ్ల్యూ ప్రకటించడం... ఇలా అన్నీ భారత్ ఓటమికి కారణంగా నిలిచాయి. అయినా సరే 70 ఓవర్లు ముగిసే సరికి 210/7తో మెరుగ్గా కనిపించిన జట్టు మైకేల్ క్లార్క్ వేసిన 71వ ఓవర్లోనే మూడు వికెట్లు కోల్పోయి 112 పరుగులతో ఓడింది. మరో 2.1 ఓవర్లు ఆడితే మ్యాచ్ డ్రాగా ముగిసిపోయేది. అసలు గొడవ... టెస్టు మూడో రోజు హర్భజన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య చిటపటలు సాగుతూనే ఉన్నాయి. మరో ఎండ్లో ఉన్న సచిన్ తన సహచరుడిని వారిస్తూనే ఉన్నాడు. చివరకు సైమండ్స్ ప్రవర్తన శృతి మించడంతో హర్భజన్ ‘తేరీ మాకీ...’ అంటూ తిట్టేశాడు. అది అంతటితో ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ తన రూపాన్ని కోతితో పోల్చినట్లుగా భజ్జీ ‘మంకీ’ అంటూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడంటూ సైమండ్స్ రిఫరీకి ఫిర్యాదు చేశాడు. దీనిని సీరియస్గా తీసుకున్న రిఫరీ మైక్ ప్రొక్టర్ హర్భజన్పై మూడు టెస్టుల నిషేధం విధించాడు. దాంతో భారత టీమ్ మేనేజ్మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తర్వాతి టెస్టు కోసం కాన్బెర్రాకు వెళ్లకుండా సిడ్నీలోనే ఉండిపోయింది. అవసరమైతే సిరీస్ను రద్దు చేసుకుంటామని హెచ్చరించింది. విచారణ సాగిందిలా... నిబంధనల ప్రకారం భారత్ రిఫరీ నిర్ణయంపై అప్పీల్ చేసింది. అయితే అది ‘జాతి వివక్ష’కు సంబంధించి అంశం కావడంతో వ్యవహారం ముదిరింది. చివరకు అప్పీల్ కమిషనర్ జాన్ హాస్నన్ ముందు ఇరు వర్గాలు విచారణకు హాజరయ్యాయి. టీమ్ అసిస్టెంట్ మేనేజర్, హైదరాబాద్కు చెందిన ఎంవీ శ్రీధర్ ఈ మొత్తం వ్యవహారంలో అందరినీ సమన్వయం చేసుకుంటూ కీలక పాత్ర పోషించారు. భారత్ భజ్జీకి మద్దతుగా తమ వాదనకే కట్టుబడింది. సాక్షిగా సచిన్ కూడా హర్భజన్ ‘మాకీ’ మాత్రమే అన్నాడని చెప్పాడు. భజ్జీ వివాదస్పద వ్యాఖ్య చేసినట్లుగా ఎలాంటి సాక్ష్యం లేదంటూ తమ వాదనను వినిపించడంలో టీమిండియా సఫలమైంది. చివరకు భజ్జీపై జాతి వివక్ష ఆరోపణలు కొట్టివేసిన కమిషనర్ కేవలం 50 శాతం జరిమానాతో సరిపుచ్చారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ‘ఒక్క జట్టు మాత్రమే నిజమైన క్రీడా స్ఫూర్తితో ఆడింది’ అంటూ కుంబ్లే చేసిన వ్యాఖ్య చరిత్రలో నిలిచిపోయింది. సిడ్నీ అనుభవంతో కసి పెరిగిన భారత జట్టు పెర్త్లో జరిగిన తర్వాతి టెస్టులో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చి 72 పరుగులతో అద్భుత విజయం సాధించింది. ఈ వివాదం జరిగిన దాదాపు రెండు నెలలకే భారత్లో ఐపీఎల్ వేలం జరిగింది. అయితే గొడవతో సంబంధం లేకుండా అత్యధిక మొత్తానికి అమ్ముడైన విదేశీ ఆటగాడిగా సైమండ్స్ నిలిచాడు. ఆ తర్వాత 2011 ఐపీఎల్ సీజన్లో హర్భజన్, సైమండ్స్ ఒకే జట్టు ముంబై ఇండియన్స్ తరఫున కలిసి ఆడటం విశేషం. -
‘ఫ్రెండ్షిప్’ అంటున్న హర్భజన్
చెన్నై : సినీ కళాకారులు, క్రీడాకారులు కాలేరేమో గానీ, క్రీడాకారులు సినీ కళాకారులగా మారడం సులభమే అవుతోంది. ఇప్పటికే పరుగుల రాణి అశ్వినీ నాచప్ప నటిగా నటించింది. ఇక కొందరు క్రికెట్ క్రీడాకారులు హీరోలుగా నటించారు. తాజాగా ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు, బౌలర్ అయిన హర్భజన్ సింగ్ కథానాయకుడిగా అవతారమెత్తనున్నారు. ఈయన సినిమాకు పరిచయం అవుతున్న చిత్రం ఇదే అవుతుంది. క్రీడా మైదానంలో పోటీ జట్టు బ్యాట్స్మెన్లను తన బంతులతో దడ పుట్టించిన హర్బజన్సింగ్ ఇప్పుడు వెండితెరపై నటుడిగా ప్రేక్షకులను ఎంతగా అలరిస్తారో చూడాలి. షండో స్టూడియో అండ్ సినిమాస్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో హర్భజన్సింగ్ హీరోగా నటిస్తున్నారు. దీనికి జేపీఆర్ - శ్యామ్ సూర్యల ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శక ద్వయం ఇంతకు ముందు అగ్నిదేవి అనే చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. కాగా హర్భజన్సింగ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ఫ్రెండ్షిప్ అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ను హర్భజన్సింగ్ ఆదివారం విడుదల చేశారు. కాగా ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, ఇతర సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర వర్గాలు తెలిపారు. కాగా సంకెళ్లు వేయబడ్డ రెండు చేతులు మాత్రమే కలిగిన ఫస్ట్లుక్ పోస్టర్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదేదో ఖైదీలకు సంబంధించిన కథాంశంతో కూడిన చిత్రమా అన్న ఆసక్తి నెలకొంది. కాగా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా భారతీయ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. కాగా ఇదే సమయంలో భారత క్రికెట్ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ను గెలుచుకున్న ఇతివృత్తంతో బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్, కోలీవుడ్ నటుడు జీవా నటించిన 83 చిత్రం తెరపైకి రానుందన్నది గమనార్హం. -
సచిన్ భావోద్వేగ పోస్ట్..యూవీ రియాక్షన్
ప్రపంచ క్రికెట్లో తనదైన ముద్ర వేసి దిగ్గజ క్రికెటర్గా మన్ననలు అందుకుంటున్న సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ఫోటోను విడుదల చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పుట్టిన రోజు (డిసెంబర్ 12)సందర్బంగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, యువరాజ్లతో దిగిన పాత పోటోలను సచిన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. యూవీ పుట్టిన రోజు వేడుకలను తన మిత్రులతో కలిసి పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని సచిన్ అన్నాడు. యూవీ స్పందిస్తూ.. సచిన్ పోస్ట్ చేసిన ఫోటోలో తన చెయ్యి కనిపించలేదంటూ యూవీ ఫన్నీగా కామెంట్ చేశాడు. కాగా తన సహచర క్రికెటర్లు మాట్లాడుతుండగా కాళ్లు లాగడం, సోషల్ మీడియా పోస్ట్లను చమత్కరించడంలో యూవీ ప్రసిద్ది పొందిన విషయం తెలిసిందే. డిసెంబర్ 12 న యువరాజ్ సింగ్ తన పుట్టినరోజు జరుపుకోగా, 2019 లో అత్యధికంగా నెటిజన్లు శోధించిన భారత క్రీడాకారుడిగా యువరాజ్ సింగ్ రికార్డు సృష్టించాడు. చదవండి: ‘మనం కన్నీళ్లను దాచనవసరం లేదు’ -
‘ఆమె మరో హర్భజన్ సింగ్’
-
మ్యాచ్ టై అయిందని..తండ్రి ఎంత ఓదార్చిన!
-
సీఎస్కే ‘కాలా’ టీజర్
-
రెండో ఇంగ్లండ్ బౌలర్గా..
ఆక్లాండ్ : ఇంగ్లండ్ బౌలర్ స్టువార్ట్ బ్రాడ్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో నాలుగు వందల వికెట్లను సాధించిన క్లబ్లో బ్రాడ్ చేరిపోయాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న డే–నైట్ టెస్టు మ్యాచ్లో కివీస్ బ్యాట్మెన్ లాథమ్ వికెట్ సాధించడంతో బ్రాడ్ ఈ ఫీట్ సాధించాడు. 115 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. 2007లో శ్రీలంకపై టెస్ట్ ఆరంగ్రేటం చేసిన బ్రాడ్,అతి కొద్ది కాలంలోనే ఇంగ్లండ్ స్టార్ బౌలర్ ఆయ్యాడు. ఇంగ్లండ్ తరుపున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన వారిలో అండర్సన్(524) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ఇంకో 17 వికెట్లు సాధిస్తే టీమిండియా బౌలర్ హర్భజన్ సింగ్ రికార్డును సమం చేస్తాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో 58 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌటైన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ పేసర్ బౌల్ట్ ఆరు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. -
సత్తా చాటేందుకు సీనియర్లు సిద్ధం
కోల్కతా: ఐపీఎల్–11 వేలానికి ముందు సీనియర్ క్రికెటర్లతో పాటు, యువ కెరటాలు సత్తా చాటేం దుకు సన్నద్ధమయ్యారు. నేటినుంచి జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ సూపర్ లీగ్ దశలో పలువురు అగ్రశ్రేణి, వర్ధమాన క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఐపీఎల్లో గత జట్లు తమను కొనసాగించకపోవడంతో యువరాజ్, గంభీర్, హర్భజన్వంటి సీనియర్లు వేలంలోకి వస్తున్నారు. వీరందరూ ఈ టోర్నీలో చెలరేగి ఫ్రాంచైజీల దృష్టిలో పడాలని చూస్తున్నారు. ఇక యువ ఆటగాళ్లలో ఇటీవల 32 బంతుల్లో సెంచరీ సాధించిన రిషభ్ పంత్పై మరో సారి అందరి దృష్టి నిలిచింది. నేటి నుంచి కోల్కతా వేదికగా జరుగనున్న ఈ టోర్నీ సూపర్ లీగ్లో 10 జట్లు రెండు గ్రూపులుగా రౌండ్ రాబిన్ ఫార్మాట్లో బరిలో దిగనున్నాయి. గ్రూప్ ‘ఎ’లో పంజాబ్, కర్ణాటక, జార్ఖండ్, ముంబై, రాజస్తాన్; గ్రూప్ ‘బి’లో ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్, బరోడా, ఉత్తరప్రదేశ్ జట్లు ఉన్నాయి. ఆదివారం జరిగే మ్యాచ్ల్లో తమిళనాడుతో ఢిల్లీ, బరోడాతో బెంగాల్, కర్ణాటకతో పంజాబ్, జార్ఖండ్తో ముంబై తలపడనున్నాయి. -
హర్భజన్సింగ్పై నెటిజన్ల విమర్శలు...
సాక్షి, హైదరాబాద్: టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్పై నెటిజన్లు ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. పంజాబీలో పెళ్లైన మహిళలు పవిత్రంగా జరుపుకునే ‘కర్వా చౌత్’ పండుగ సందర్భంగా బజ్జీ తన భార్యకు విషేస్ తెలియజేస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం లేపింది. కర్వా చౌత్ శుభాకాంక్షలు గీతా బస్రా. నేను బానే ఉన్నా.. ఆకలిగా ఉంటుంది తినండి’ అని భార్య ఫోటోతో బజ్జీ పోస్టు చేశాడు. దీనిపై కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. ఈ మూడనమ్మకాన్ని పంజాబీలు ఇంకా పాటించడం బాధగా ఉంది. సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్ సాహిబ్లో ఇది ఒక మూఢాచారమని ఒకరు కామెంట్ చేయగా.. బజ్జీ సిక్కిసమ్ను బోధిస్తున్నాడని విమర్శించారు. ఈ ట్వీట్లపై మరికొందరు బజ్జీకి మద్దతుగా నిలిచారు. పంజాబీల గురించి మీకు అవగాహనలేకుంటే మాట్లాడకండి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఓ బజ్జీ అభిమాని. ఇక హర్భజన్ కూడా నెటిజన్లకు ‘మతం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించకండి. మంచిగా ఉండటమే అతి పెద్ద మతమని’ స్ట్రాంగ్ రిప్లే ఇచ్చాడు. కార్తీక పౌర్ణమి తరవాత నాలుగవ రోజున ఈ కర్వా చౌత్ పర్వదినాన్ని ఉత్తరాది మహిళలు జరుపుకుంటారు. తమ భర్తలు ఆయు, ఆరోగ్యాల కోసం ఉదయం నుంచి ఉపవాస దీక్ష చేసి, సాయంత్రం చంద్రుడికి పూజ చేసి, చంద్రోదయం తర్వాత జల్లెడ చాటున భర్తను చూస్తారు. ఇలా చేయడం వలన తమ భర్త ఆయు, ఆరోగ్యాలతో ఉంటారని వారి విశ్వాసం. తమ భర్తను జల్లెడ చాటున చూసిన తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు. Happy karwa chaouth biwi ❤️❤️❤️😘😘😘@Geeta_Basra now khao 🍎🍇🍔🍕piyo moaj karo I am sure badi bukh lagi hogi 😜😜🍎 pic.twitter.com/6opQbjmDxq — Harbhajan Turbanator (@harbhajan_singh) 8 October 2017 Feeling sad to see a Punjabi is doing such a hypocrisy... Its called hypocrisy according to Shri Guru Granth Sahib Ji... — Amrit Lohar (@AmritLohar07) 8 October 2017 Kon se Granth mai likha hai yeh na karo wo na karo.Dharm ke naam par logo ko gumrah mat karo.phle acha insaan bano wohi sabse bada dharm hai https://t.co/92KlSAsCMh — Harbhajan Turbanator (@harbhajan_singh) 8 October 2017 -
గ్రామీణ క్రికెటర్లను వెలుగులోకి తెస్తా...
దేశంలో వివిధ ప్రాంతాల్లో అకాడమీలు నెలకొల్పి గ్రామీణ క్రికెటర్లను వెలుగులోకి తెస్తానని భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ చెప్పాడు. ప్రస్తుతం అతను ఐదు అకాడమీలు నడుపుతున్నాడు. ఇటీవల వన్డేల్లో రాణించడం ద్వారా తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని... త్వరలో టెస్టు జట్టులోకి కూడా తిరిగి వస్తానని హర్భజన్ అన్నాడు.