Independent
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించేది వీరే
అమెరికా నుంచి సాక్షి టీవీ ప్రతినిధి ఇస్మాయిల్అమెరికా అధ్యక్ష ఎన్నికలపై అటు డెమొక్రాట్లు ఇటు రిపబ్లికన్లు పూర్తిగా విడిపోయిన నేపథ్యంలో ఒక వర్గం మాత్రం మౌనం వహిస్తోంది. అటు హారిస్కు కానీ ఇటు ట్రంప్కు గానీ మద్దతు ఇవ్వడంపై వీరు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించడం లేదు. వారే స్వతంత్ర ఓటర్లు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించేది వీరే. నువ్వా నేనా అన్నట్టు జరుగుతున్న అమెరికా ఎన్నికల్లో ఏడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్లో విస్తరించి ఉన్న స్వతంత్ర ఓటర్లే నిర్ణాయకం కాబోతున్నారు. పెరుగుతున్న స్వతంత్ర ఓటర్ల సంఖ్యప్రముఖ శాంపిల్ సర్వే గాలప్ పోల్ డేటా ప్రకారం 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఓటు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో 43 శాతం తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా చెప్పుకుంటున్నారు. 27% మంది రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులుగా, మరో 27 శాతం మంది డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా ప్రకటించుకున్నారు. 1990లో కేవలం 32 శాతం మంది ఓటర్లు మాత్రమే తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా ప్రకటించుకున్నారు. కాలంతో పాటు ఇండిపెండెంట్ ఓటర్ల సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.7 రాష్ట్రాల్లో కీలకం⇒ అమెరికాలో పార్టీతో అనుబంధం అనేది చాలా సాధారణ మైన అంశం. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రైమ రీస్లో ఓటు వేసేందుకు చాలామంది పార్టీ ఓటర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ప్రైమరీస్ అంటే ఒక పార్టీ నుంచి ఎవరు అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయాలనే విషయంపై జరిగే పోలింగ్. సాధారణ ఓటర్లు ఈ పోలింగ్లో పాల్గొంటారు. వీరు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలంటే చాలా రాష్ట్రాల్లో కచ్చితంగా ఏదో ఒక పార్టీ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఈ డేటా ప్రకారమే చాలామందిని అమెరి కాలో డెమొక్రాట్ ఓటర్లు, రిపబ్లికన్ ఓటర్లుగా పిలుస్తారు.అమెరికాలో సర్వే సంస్థలు తాము చేసే సర్వేల ఆధారంగా పార్టీ ఓటర్ల సంఖ్యను లెక్కగడుతోంది. దీని ఆధారంగానే ఏ పార్టీకి ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనే విషయం తేలుతుంది. ఈ గణాంకాల ఆధారంగానే చాలా రాష్ట్రాలను బ్లూస్టేట్స్, రెడ్ స్టేట్స్గా తేలుస్తారు. డెమొక్రాట్ ఓటర్లు ఎక్కువగా ఉంటే అది బ్లూ స్టేట్ అని రిపబ్లికన్ ఓటర్లు ఎక్కువగా ఉంటే రెడ్ స్టేట్ అని తేలిపోతుంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు దాదాపు ఊహించిన దానికి అనుకూలంగానే ఉంటాయి. ఎక్కడైతే రెండుపార్టీల మద్దతు దారుల మధ్య తేడా మూడు శాతం కంటే తక్కువగా ఉంటుందో దానిని బ్యాటిల్ స్టేట్ లేదా పర్పుల్ స్టేట్గా పిలుస్తారు. ఇప్పుడు ఏడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ ఉన్నాయని భావిస్తుండగా..వీటిల్లో ఈ ఇండిపెండెంట్ ఓటర్లే నిర్ణాయక శక్తిగా మారారు.కొత్త తరం ఓటర్లే ఎక్కువ..అమెరికాలోని కొత్త తరం ఎక్కువగా స్వతంత్ర భావాలు కలిగి ఉంది. ముఖ్యంగా మిలేనియల్స్ లేదా జనరేషన్ వై ఎక్కువగా ఇండిపెండెంట్ ఓటర్లుగా ఉన్నారని పరిశోధనలో తేలింది. స్వతంత్ర ఓటర్లలో 1981–96 మధ్యలో జన్మించిన జనరేషన్ వైకి చెందిన వారే 36% మంది ఉన్నారు. ఇక తరువాతి తరం అంటే 1997– 2012 మధ్య జన్మించిన జెన్జీ స్వతంత్ర ఓటర్లలో 26% ఉన్నారు. అంటే స్వతంత్ర ఓటర్లలో 52% మంది వై, జీ తరంవారే.ఇక ఓటర్ల మూలాలను పరిశీలిస్తే 31% మంది నల్ల జాతీయులు, 52% మంది లాటినోస్, 43% మంది ఏషియన్ అమెరికన్లు తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా ప్రకటించు కున్నారు. మాజీ సైనికులు సైతం పెద్ద ఎత్తున తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా చెప్పుకుంటున్నారు. 18–49 సంవత్సరాల మద్య ఉన్న దాదాపు 59% మంది మాజీ సైనికులు తమను తాము స్వతంత్ర ఓటర్లుగా చెప్పుకుంటున్నారు.పేరుకే స్వతంత్ర ఓటర్లు⇒ అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేసే ఈ స్వతంత్ర ఓటర్లపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సర్వేల్లో తమను తాము స్వతంత్ర ఓట ర్లుగా చెప్పుకునే వీరంతా నిజంగానే స్వతంత్ర ఓటర్లా? అన్న విషయంపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా మీరు ఏ పార్టీ భావ జాలాన్నినమ్ముతున్నారన్నప్పుడు వీరిలో చాలామంది రిపబ్లికన్ లేదా డెమొక్రాట్ పార్టీకి మద్దుతుదారు లుగా తేలిందని కీత్ అనే అమెరికన్ పొలిటికల్ అనలిస్ట్ ‘ది మిత్ ఆఫ్ ఇండిపెండెంట్ ఓటర్’పుస్తకంలో వివరించడం గమనార్హం. చాలామంది తమను తాము ఇండిపెండెంట్ ఓటర్గా చెప్పుకున్నప్పటికీ ఏదో ఒక స్థాయిలో రాజకీయ పార్టీలతో అనుబంధం కలిగి ఉన్నారని పరిశోధనల్లో బయటపడింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో 10 శాతానికి మించి నిజమైన స్వతంత్ర ఓటర్లు లేరని అక్కడి రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.కొత్త అభ్యర్థుల వైపే వీరి మొగ్గుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త అభ్యర్థుల వైపే ఇండిపెండెంట్ ఓటర్లు ఎక్కు వగా మక్కువ చూపుతున్నా రని గణాంకాలు చెబుతు న్నాయి. 2008లో బరాక్ ఒబామా పోటీ చేసిన సందర్భంగా దాదాపు 54% స్వతంత్ర ఓటర్లు ఆయనకు ఓటువేశారు. 2016లో ట్రంప్కు 52% మంది ఇండిపెండెంట్ ఓటర్లు మద్దతు పలికారు. ఇక 2020లో జో బైడెన్కు అత్యధికంగా 56.5 శాతం మంది మద్దతు తెలిపారు.⇒ ఇండిపెండెంట్ ఓటర్లలో 75శాతం మంది ఓటర్లు తమ వ్యక్తిగతమైన ఆర్థిక స్థితిని ప్రభావితం చేయగల అంశాలే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు. ⇒ 73 శాతం మంది నేరాలను అదుపు చేసేవారికే తమ ఓటు అని చెబుతున్నారు. ⇒ 63 శాతం మంది అమెరికా తన మిత్రదేశాల కోసం అత్యధికంగా ఖర్చు చేయడం సరికాదంటున్నారు. ⇒ 57 శాతం అబార్షన్ హక్కులే తమ ప్రాధాన్యత అంటున్నారు⇒ 56 శాతం జాత్యహంకారం తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నారు. -
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
మహారాష్ట్ర లోక్సభ ఎన్నికలు ఈసారి మరింత ఆసక్తికరంగా మారాయి. హిందీ బిగ్ బాస్ ఫేమ్, నటుడు అజాజ్ ఖాన్ ముంబైలోని నార్త్ సెంట్రల్ సీటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్నాక అజాజ్ ఖాన్ జనంలో మరింత ఆదరణ సంపాదించారు. ఇప్పుడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఈ ఖాన్ ఉవ్విళ్లూరుతున్నారు.అజాజ్ ఖాన్ తాను ముంబైలోని నార్త్ సెంట్రల్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగానని, తన ఎన్నికల గుర్తు డంబెల్ అని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. వ్యవస్థ మారాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన పేర్కొన్నారు. అజాజ్ ఖాన్ బీజేపీ అభ్యర్థి ఉజ్వల్ నికమ్, కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్లపై పోటీకి దిగారు.తన సోషల్ మీడియా ఖాతాలో అజాజ్ ఖాన్ ‘వ్యవస్థలో మార్పు తీసుకురావాలనుకుంటే, అవినీతిపరులపై పోరాడాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలి. ప్రజలు నన్ను బిగ్ బాస్ షోలో చూసి ఎంతగానో ఇష్టపడ్డారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సమాజానికి ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకనే ఎన్నికల బరిలోకి దిగాను.అయితే ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అయితే నేను పోరాడటానికి, ప్రజలకు మంచి చేయడానికే ఎన్నికల బరిలోకి దిగాను. నేను వ్యవస్థలో కీలకంగా ఉంటే ఏదైనా చేయగలుగుతాను. నేను ఒక యువ నాయకునిగా ఎదగాలనుకుంటున్నాను. మనకు దేవాలయాలు, మసీదుల కంటే పాఠశాల అవసరం ఎక్కువగా ఉంది.నేను భగవద్గీగీతను చదవని హిందువులను, ఖురాన్ చదవని ముస్లింలను చాలా మందిని చూశాను. దీంతో వాస్తవానికి మతం అంటే ఏమిటో చాలామందికి తెలియదని అర్థం చేసుకున్నాను. ఎవరైనా ఈ గ్రంథాలను చదివినప్పుడు మతం అంటే ఏమిటో అర్థం చేసుకోగలుగుతారు. దేశంలో మత రాజకీయాలు చేయకూడదు. ఐక్యతతో కూడిన రాజకీయాలు అవసరం’ అని అజాజ్ ఖాన్ పేర్కొన్నారు. -
చెప్పుల దండతో ఎన్నికల ప్రచారానికి..
దేశంలో లోక్సభ ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతోంది. ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు వినూత్న ప్రచారాలు సాగిస్తున్నారు. యూపీలోని అలీగఢ్లో ఓ అభ్యర్థి చేస్తున్న ప్రచారతీరును చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎవరి మెడలోనైనా చెప్పుల దండను వేశారంటే వారిని అవమానించారని అర్థం. ఇటువంటి ఉదంతాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. అయితే అలీగఢ్లో స్వతంత్ర అభ్యర్థి పండిట్ కేశవ్ దేవ్ గౌతమ్ చెప్పుల దండ వేసుకుని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పూల దండకు బదులు చెప్పుల దండ వేసుకుని ఓట్లు అడగటాన్ని చూసి, స్థానికులంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పండిట్ కేశవ్ దేవ్కు ఎన్నికల సంఘం చెప్పు గుర్తును కేటాయించింది. ఈ నేపధ్యంలో కేశవ్ తన మెడలో ఏడు చెప్పులతో కూడిన దండతో ప్రచారం సాగిస్తున్నాడు. అవినీతిని అరికడతానంటూ అందరికీ చెబుతున్నాడు. పండిట్ కేశవ్ దేవ్ సమాచారం హక్కు(ఆర్టీఐ) కార్యకర్త. ఆయన భారతీయ హిందూ రాష్ట్ర సేన, అవినీతి నిరోధక సేన అనే సంస్థలను కూడా నడుపుతున్నారు. కేశవ్ గతంలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని ఎదుర్కొన్నారు. అలీఘర్ లోక్సభ స్థానానికి రెండో దశలో అంటే ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా, మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 4 వరకు మొత్తం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. #WATCH | Aligarh, UP: Independent candidate from Aligarh Pandit Keshav Dev has been allotted 'slippers' as the election symbol. After which, he was seen carrying out the election campaign wearing a garland of 7 slippers around his neck. (08.04) pic.twitter.com/V0Hm8JYRmC — ANI (@ANI) April 8, 2024 -
చందాలతో నామినేషన్.. ఆటోలో తిరుగుతూ ప్రచారం!
దేశంలో లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ప్రచారం ముమ్మరమయ్యింది. ఈ ఎన్నికల పోరులో నేతలంతా తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్దే తమ నినాదమంటూ ఎన్నికల సభల్లో ప్రజలకు పలు హామీలు గుప్పిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా ‘మిస్టర్ డొనేషన్’గా పేరు తెచ్చుకున్న ఒక అభ్యర్థి విచిత్ర రీతిలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. బీహార్లోని గయ లోక్సభ నియోజకవర్గం నుంచి అశోక్ కుమార్ పాశ్వాన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అతని బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా. అశోక్ ప్రభుత్వ భూమిలో ఇంటిని కట్టుకున్నాడు. తన ఎన్నికల నామినేషన్కు అయ్యే మొత్తాన్ని విరాళాల రూపంలో సేకరించాడు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి నిధులను సేకరిస్తున్నాడు. ఈ నేపధ్యంలో స్థానికులు అతనికి ‘మిస్టర్ డొనేషన్’ అనే పేరు పెట్టారు. స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ ప్రజల మధ్యకు వెళ్లి, వారికి వందనం చేస్తూ పది రూపాయల చందాతో పాటు తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాడు. అశోక్ కుమార్ పాశ్వాన్ ఎన్నికల గుర్తు ఆటో. దీంతో అతనే స్వయంగా ఆటో నడుపుతూ ఊరూరా తిరుగుతూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాడు. గతంలో గయ లోక్సభ ఎన్నికల్లో గెలిచినవారెవరూ ఈ ప్రాంతానికి ఒక్కసారైనా రాలేదని అశోక్ ఆరోపిస్తున్నాడు. తాను ఎంపీని అయ్యాక నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని అన్నాడు. ప్రజల నుంచి సేకరించిన విరాళాలను అభివృద్ధి పనులకు వెచ్చిస్తానని అశోక్ తెలిపాడు. బడా నేతల మాదిరిగా తాను ప్రచారం చేయలేనని, తోటి ఆటో డ్రైవర్లు తన కోసం ప్రచారం చేస్తున్నారని అశోక్ పేర్కొన్నాడు. -
నాడు ప్రత్యర్థికి ఓటు వేయాలని కోరిన వాజ్పేయి?
దేశంలో ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల సందడే కనిపిస్తోంది. ఎన్నికలు ప్రజాస్వామ్య పండులని అంటుంటారు. దేశంలో 1957లో జరిగిన లోక్సభ ఎన్నికలను ఇప్పటికీ ఏదోవిధంగా గుర్తుకు తెచ్చుకుంటారు. దేశంలో 1957లో రెండో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పలు వింత వైనాలు చోటుచేసుకున్నాయి. నాడు జన్సంఘ్ నేతగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి కాంగ్రెస్ను ఓడించేందుకు ఒక ప్లాన్ చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి 1957 లోక్సభ ఎన్నికల్లో మథుర, బల్రాంపూర్, లక్నో ఈ మూడు చోట్ల నుంచి పోటీ చేశారు. బలరాంపూర్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందిన ఆయన పార్లమెంటుకు చేరుకున్నారు. తన 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఐదుసార్లు ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నారు. వాజ్పేయి తొలిసారిగా మధుర లోక్సభలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. నాడు రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన కారణంగానే అటల్ బిహారీ వాజ్పేయి ఈ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే అటల్ బిహారీ వాజ్పేయి ఈ ఓటమిని తనకు తానుగా ఆహ్వానించుకున్నారని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటారు. ఈ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి బహిరంగ సభలకు వెళ్లినప్పుడు ప్రత్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేసేవారు. తనకు కాకుండా రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్కు ఓటువేయాలని కోరేవారు. ఇలా తాను వెళ్లిన ప్రతీచోటా ప్రత్యర్థికి ఓటు వేయాలని కోరారట. ఎవరైనా అదేమిటని అడిగితే ఆయన తన లక్ష్యం ఎన్నికల్లో గెలవడం కాదని, కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని నిర్ధారించడమేనని చెప్పుకొచ్చేవారు. నాటి లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రాజ మహేంద్ర ప్రతాప్ విజయం సాధించారు. ఆయనకు 95 వేల 202 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దిగంబర్ సింగ్ 69 వేల 209 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. జనసంఘ్కు చెందిన అటల్ బిహారీ వాజ్పేయి నాలుగో స్థానంలో నిలిచారు. వాజ్పేయికి కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. -
కూటమిలో కుతకుత
సాక్షి నెట్వర్క్: క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కుమ్ములాటలు చల్లారడం లేదు. టికెట్ ఆశించి భంగపడినవారు అక్కడి అభ్యర్థులకు సహకరించడానికి ససేమిరా అంటున్నారు. టికెట్ దక్కించుకున్నవారితో నేరుగా వాదులాటకు దిగుతున్నారు. కొందరు నాయకులు అభ్యర్థిత్వాల ఎంపికకు నిరసనగా రాజీనామా చేస్తుండగా... మరికొందరు ఇండిపెండెంట్గా బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు. తమకు నచ్చని వ్యక్తులకు అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో వారిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో పావులు కదుపుతున్నారు. జరుగుతున్న పరిణామాలు కూటమి నేతలకు శిరోభారంగా మారుతున్నాయి. పరిస్థితులు ఇలానే కొనసాగితే ఆయా అభ్యర్థులకు ఎదురుగాలి తప్పదని శ్రేణులు ఖరాకండీగా చెబుతున్నాయి. జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. అక్కడ గత ఎన్నికల్లో ఓడిపోయిన శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)కు టికెట్ ఇవ్వడాన్ని మాజీమంత్రి నెట్టెం రఘురాం, బీఆర్కే చానల్ యజమాని, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. నియోజకవర్గంలో సుమారు 40 వేల ఓటుబ్యాంకు కలిగిన కమ్మ సామాజికవర్గానికి గడచిన నాలుగు పర్యాయాల నుంచి టికెట్ కేటాయించకుండా అవమానిస్తోందని ఆ సామాజికవర్గ నేతలు మండిపడుతున్నారు. పాడేరు అసెంబ్లీ టికెట్పై కొనసాగుతున్న టీడీపీ నిరసన పాడేరు అసెంబ్లీ టీడీపీ టికెట్ కిల్లు రమేష్నాయుడుకు కేటాయించడంపై ఆ పార్టీ శ్రేణులు నిరసన కొనసాగిస్తున్నారు. జీసీసీ మాజీ చైర్మన్ ఎం.వి.ఎస్.ప్రసాద్కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొయ్యూరులో ఆదివారం ఆ పార్టీ నేతలు పార్టీ జెండాలతో నిరసన తెలిపారు. రెండు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న ప్రసాద్కు అన్యాయం చేయడం తగదని అధిష్టానం నిర్ణయంపై మండిపడ్డారు. రమేష్ నాయుడు ఎవరో కనీసం కార్యకర్తలకు కూడా తెలియదని, అలాంటి వ్యక్తికి సీటు ఇవ్వడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్గా బరిలో దిగేందుకు ప్రభాకర్ చౌదరి నిర్ణయం అనంతపురం అర్బన్ నుంచి అభిమానులు కోరితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సిద్ధమని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర చౌదరి వెల్లడించారు. ఆదివారం ఆయన అనంతపురంలోని కమ్మభవన్లో పార్టీ కార్యకర్తలు, తన వర్గీయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్కడ టీడీపీ అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ను ఎంపిక చేయడం సరికాదన్నారు. ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడి ఆస్తులు కోల్పోయానని, కేసుల్లో ఇరుక్కున్నానని, అయినా అధిష్టానం తన శ్రమను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ♦ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని మిరియాల శిరీషా దేవిని తక్షణమే మార్చాలని రాజవొమ్మంగి మండలంలోని 19 పంచాయతీలకు చెందిన టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం రాజవొమ్మంగిలో వారు సమావేశమై అభ్యర్థిని మార్చకుంటే రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ♦ ఎన్టీఆర్ జిల్లా నందిగామ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో ఆదివారం రాత్రి ‘మన పల్లెకు మన సౌమ్య’ కార్యక్రమం ముగించుకుని వస్తుండగా కార్యకర్తలు అడ్డగించారు. గ్రామంలో నిర్వహించే కార్యక్రమాలకు పార్టీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకపోవడంపై మహిళలు మండిపడ్డారు. ♦ అనంతపురం జిల్లా గుంతకల్లు అసెంబ్లీ టీడీపీ టికెట్ గుమ్మనూరు జయరామ్కు కేటాయించడాన్ని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆర్.జితేంద్రగౌడ్ తప్పు పట్టారు. ♦ గుంతకల్లులోని తన కార్యాలయంలో పార్టీ క్లస్టర్, బూత్ ఇన్చార్జులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో అధినేత పునరాలోచన చేయకపోతే దేనికైనా సిద్ధంగా ఉండాలని తన వర్గీయులకు పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీ మధ్య ఫ్లెక్సీల రగడ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆదివారం నిర్వహించిన చంద్రబాబు ప్రజాగళం యాత్ర సభ టీడీపీ, బీజేపీల మధ్య చిచ్చుపెట్టింది. టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫొటో లేకపోవడంపై ఆ పార్టీ బీజేవైఎం రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ జి.వి.రెడ్డి, టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా కిసాన్మోర్చా ఇన్చార్జి కె.వి.రమణారావు కూడా టీడీపీ నేతల తీరును ఎండగట్టారు. పేరుకే కూటమిలో ఉన్నప్పటికీ తమకు ఏమాత్రం టీడీపీ నాయకులు విలువ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ♦ అరకు ఎంపీ టిక్కెట్ ఆర్థిక నేరస్తురాలైన కొత్తపల్లి గీతకు ఎలా ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఆ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు నిమ్మక జయరాజ్ మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గీత నిజమైన ఎస్టీ కాదని కూడా చెప్పారు. ♦ అద్దంకి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ జనసేన కార్యకర్తలను విస్మరిస్తున్నారని పార్టీ అద్దంకి మండల కార్యదర్శి సాధు వెంకటేష్ అన్నారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సంతమాగులూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో ఉద్దేశ పూర్వకంగానే జనసైనికులను దూరం పెడుతున్నారని ఆరోపించారు. -
పవన్పై పోతిన మహేష్ తిరుగుబాటు.. రెబల్గా పోటీ?
సాక్షి, విజయవాడ: విజయవాడ వెస్ట్ సీటు పంచాయితీ పవన్ కల్యాణ్ వద్దకు చేరింది. వెస్ట్ సీటు జనసేనకే ఇవ్వాలని పోతిన మహేష్ కోరగా, టిక్కెట్ ఇచ్చేది లేదంటూ పవన్ తేల్చేశారు. పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సిందేనన్నారు. పార్టీ కోసం కష్టపడిన తనకు న్యాయం చేయాలంటూ మహేష్ పట్టుబట్టారు. పవన్ కుదరదని చెప్పడంతో రెబల్గా బరిలోకి దిగాలని పోతిన నిర్ణయించారు.ఇండిపెండెంట్గా పోటీచేస్తానని పవన్కు పోతిన స్పష్టం చేశారు. పశ్చిమలో పోతిన మహేష్ నిరసనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ టికెట్ మహేష్కి ఇవ్వాలని, పవన్ మనస్సు మార్చాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుడికి జనసేన కార్యకర్తలు 108 కొబ్బరి కాయలు కొట్టి మరి వేడుకొంటున్నారు. 7 రోజులుగా జనసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదీ చదవండి: దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు? -
కేఎస్ ఈశ్వరప్ప కీలక నిర్ణయం.. మోదీకి వ్యతిరేకం కాదు
రాబోయే లోక్సభ ఎన్నికల్లో షిమోగా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ కార్యకర్త కేఎస్ ఈశ్వరప్ప తెలిపారు. తన కుమారుడు కేఈ కాంతేశ్కు హవేరీ టికెట్ దక్కకపోవడంతో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్ యడ్యూరప్పపై ఈశ్వరప్ప మండిపడ్డారు. వంశపారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా, హిందుత్వ కోసం పోరాడతానని ఈశ్వరప్ప పేర్కొన్నారు. ఇది ప్రధాని మోదీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. షిమోగా మద్దతుదారులతో దాదాపు రెండు గంటలపాటు సమావేశమైన అనంతరం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. బీజేపీ పార్టీని, దాని సిద్ధాంతాలను కాపాడటానికి ఈ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నద్ధమైనట్లు, నరేంద్ర మోదీని మరో సారి ప్రధానిని చేసేందుకు నేను చేస్తున్న పోరాటమని ఈశ్వరప్ప అన్నారు. ప్రస్తుతం ఈ చర్యకు పూనుకోవడం వల్ల బీజేపీ తనకు నోటీసు ఇచ్చే అవకాశం ఉంది లేదా పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో నేను గెలిస్తే.. తప్పకుండా బీజేపీకి మద్దతు ఇస్తానని ఆయన అన్నారు. అయితే బీజేపీ అభ్యర్థి యడియూరప్ప కుమారుడు, సిట్టింగ్ ఎంపీ బీ వై రాఘవేంద్ర మరోసారి షిమోగా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారనేది త్వరలోనే తెలుస్తుంది. -
హర్యానా సీఎం రాజీనామా.. కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
హర్యానా సీఎం మనోహర్ లాల్ తన పదవికి రాజీనామా చేశారు. శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హర్యానాలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మనోహర్ లాల్తో పాటు మంత్రివర్గమంతా రాజీనామా చేసింది. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం ఉదయం 11 గంటలకు బీజేపీ శాసనసభా పక్షంతో సమావేశమై, హర్యానా గవర్నర్ను కలిశారని సమాచారం. హర్యానాలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ), దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) విబేధాలు చోటుచేసుకున్నాయి. లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై కూటమిలో ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. దీంతో జేజేపీతో పొత్తును బీజేపీ తెగతెంపులు చేసుకుంది. ఈ నేపధ్యంలోనే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గం సమిష్టిగా రాజీనామా చేసి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు.. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధికార బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వానికి మద్దతు కోరుతూ స్వతంత్ర ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఫార్ములాపై బీజేపీ కసరత్తు చేసింది. మరోవైపు.. హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. వీళ్ల భేటీలో సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య ఎటువంటి ఒప్పందం కుదరలేదు. ఈ నేపథ్యంలో దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41, జేజేపీకి 10, కాంగ్రెస్కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనితో పాటు బీజేపీకి ఆరుగురు స్వతంత్రులు, ఒక హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు ఉంది. ఈ లెక్కన.. జేజేపీ విడిపోయిన తర్వాత కూడా బీజేపీకి 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని లెక్క తేలుతోంది. అయితే.. హర్యానా కేబినెట్ నుంచి జననాయక్ జనతా పార్టీని తప్పించేందుకే బీజేపీ ఈ వ్యూహం పన్నిందని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
Israel-Hamas war: స్వతంత్ర పాలస్తీనాకు నెతన్యాహు నో
టెల్ అవీవ్: గాజాలో యుద్ధం ముగిశాక స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు చేయాలన్న అగ్ర రాజ్యం అమెరికా ప్రతిపాదనను తిరస్కరించానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హమాస్ నిర్మూలన, బందీల విడుదలతో సంపూర్ణ విజయం లభించేదాకా గాజాలో యుద్ధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు మరికొన్ని నెలలు పడుతుందని చెప్పారు. గాజాలోని 25 వేల మంది ప్రజలు మృత్యువాత, 85% మంది ప్రజలు వలసబాట పట్టిన నేపథ్యంలో యుద్ధం విరమించుకునేలా చర్చలు జరపాలంటూ ఇజ్రాయెల్పై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా సహా పలు దేశాలు ‘రెండు దేశాల’విధానాన్ని పునరుద్ధరించాలంటూ కోరుతున్నాయి. అయితే, నెతన్యాహు తాజా ప్రకటనతో యుద్ధం విషయంలో ఇజ్రాయెల్ నిర్ణయంలో మార్పులేదని స్పష్టమైంది. నెతన్యాహు వ్యాఖ్యలపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు ప్రతినిధి జాన్ కిర్బీ స్పందిస్తూ.. ఇజ్రాయెల్, అమెరికాలు ఒకే అంశంపై భిన్నంగా ఆలోచించడం సహజమేనన్నారు. -
‘అంతరిక్ష విత్తనాలు’ ఆదుకుంటాయా?
భూమ్మీద అధిక ఉష్ణం, కరువు పరిస్థితులను ఎదుర్కొని సజావుగా పంట దిగుబడులు పొందాలంటే అందుకు తగినంత జన్యు దృఢత్వం కలిగిన వైవిధ్య భరితమైన వంగడాలు అవసరం. కానీ గడ్డు పరిస్థితులను తట్టుకొనే జన్యు దృఢత్వం తేవడం ఎలా అన్నది ప్రశ్న? అయితే అంతరిక్షంలో వేగంగా ఉత్పరివర్తనాలకు గురైన విత్తనాలతో భూమ్మీద ప్రతికూలపరిస్థితులను తట్టుకొనే వంగడాల తయారీ సాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంత? ఈ నెల 4 నుంచి 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక కథనం. (సాక్షి, సాగుబడి డెస్క్) విత్తన జన్యువ్యవస్థను సంపూర్ణంగా ప్రభావితం చేసే స్పేస్ బ్రీడింగ్... జన్యుమార్పిడి/సవరణకన్నా మెరుగైన ఫలితాలను అందిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. 15 ఏళ్లుగా స్పేస్ బ్రీడింగ్ ద్వారా కొత్త వంగడాలు రూపొందిస్తూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నట్లు చైనా చెబుతోంది. మరోవైపు తొలిసారిగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ), ఐక్యరాజ్య సమితి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) సంయుక్తంగా స్పేస్ బ్రీడింగ్ ప్రాజెక్టుకు 2022 నవంబర్ 7న శ్రీకారం చుట్టాయి. ‘నాసా’కు చెందిన వాల్లప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ రోదసీ నౌక ద్వారా భూమికి 175 మైళ్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తెల్లజొన్న విత్తనాలు, అరాబిడోప్సిస్ అనే ఆకుకూర విత్తనాలను అంతరిక్షంలోకి పంపాయి. కొన్ని విత్తనాలను అంతరిక్ష కేంద్రం లోపల భారరహిత స్థితిలో ఉంచగా మరికొన్నింటిని కేంద్రం బయట కాస్మిక్ రేడియేషన్కు గురిచేశాయి. ఆర్నెల్ల తర్వాత వాటిని 2022 ఏప్రిల్లో తిరిగి భూమిపైకి తీసుకొచ్చాయి. ఆ్రస్టియా రాజధాని వియన్నాలో ఏర్పాటైన ఐఏఈఏ, ఎఫ్ఏఓ ఉమ్మడి ప్రయోగశాలలోని పాలిహౌస్లో వాటిని ప్రయోగాత్మకంగా పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేరళకు చెందిన జన్యుశాస్త్ర నిపుణురాలు డా. శోభ శివశంకర్ సారథ్యం వహిస్తుండగా, మరో భారతీయ శాస్త్రవేత్త అనుపమ హింగనె ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అనేక సీజన్లపాటు సాగు చేసి వాటి జన్యుమార్పులను నిర్ధారించాక సరికొత్త వంగడాలను రైతులకు అందించనున్నాయి. చైనా పొలాల్లో 260 ‘అంతరిక్ష వంగడాలు’! అంతరిక్షంలోని రేడియేషన్లో కొన్నాళ్లు ఉంచి భూమిపైకి తెచి్చన విత్తనాల (స్పేస్ ఇండ్యూస్డ్ మ్యుటేషన్ బ్రీడింగ్ లేదా స్పేస్ బ్రీడింగ్)తో సరికొత్త వంగడాలను రూపొందిస్తూ చైనా కొన్ని దశాబ్దాలుగా ప్రయోజనం పొందుతోంది. చైనా వ్యవసాయ పరిశోధనా సంస్థ (సీఏఏఎస్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, చైనా అణు వ్యవసాయ శా్రస్తాల సంస్థ అధ్యక్షుడు కూడా అయిన డా. లూక్సియాంగ్ లియు చెబుతున్న మాట ఇది. ‘ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్’ న్యూస్లెటర్ 2023 జనవరి సంచికలో స్పేస్ బ్రీడింగ్ ప్రయోజనాలను వివరిస్తూ ఆయన ఓ వ్యాసం రాశారు. వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, నువ్వు, క్యాప్సికం, టొమాటో తదితర పంటలకు చెందిన 260 వంగడాలను ఇప్పటివరకు విడుదల చేసినట్లు డా. లియు ఆ వ్యాసంలో వెల్లడించారు. 2011లో విడుదల చేసిన ‘లుయుయాన్ 502’ గోధుమ వంగడంతో 12% దిగుబడి పెరగడంతోపాటు కరువును, ప్రధాన తెగుళ్లను తట్టుకుంటోందని పేర్కొన్నారు. హెక్టారుకు 12.18 టన్నుల గోధుమ దిగుబడినిస్తున్నదని డా. లియు చెప్పారు. 2016 తర్వాత 21 గోధుమ, 15 వరి, 7 మొక్కజొన్న వంగడాలను అధికారికంగా విడుదల చేశామన్నారు. మెరుగైన వంగడాల అభివృద్ధికి అవసరమే! అంతరిక్షంలో ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్లు) ఎక్కువ సంఖ్యలో వస్తాయి. కాస్మిక్ ఎనర్జీ వల్ల విత్తనాల్లోని డిఎన్ఎలో పెనుమార్పులు సంభవిస్తాయి. కాంబినేషన్లు మారిపోతాయి. కొత్త వేరియంట్స్ ఆవిష్కరణకు, విస్తృతమైన జీవ వైవిధ్యానికి ఇది అవసరం. 1960వ దశకంలో ఎక్స్రేస్, గామారేస్తో మ్యుటేషన్ బ్రీడింగ్పై విస్తృత పరిశోధనాలు జరిగాయి. వరిలో జగన్నాద్ రకం అలా వచ్చిందే. అయితే, ఆ మ్యుటేషన్ల ద్వారా మనుగడలోకి వచ్చిన వంగడాలు చాలా తక్కువ. స్పేస్ బ్రీడింగ్ వల్ల లక్షల్లో మ్యుటేషన్లు వస్తే వాటిని స్థిరీకరించిన తర్వాత కొన్నయినా ఉపయోగపడొచ్చు. మ్యుటెంట్ లైన్స్ను ఉపయోగించుకొని పలు వాతావరణ పరిస్థితులకు అనువైన వాటిని స్థిరీకరించిన తర్వాత మెరుగైన వంగడాలను తయారు చేసుకోవడానికి స్పేస్ బ్రీడింగ్ ఉపయోగపడుతుంది. – డా. రాఘవరెడ్డి, మాజీ కులపతి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. రైతుల సమస్యలు తీరతాయనుకోవటం భ్రమే! మొక్కలు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సహజంగానే మారుతూ ఉంటాయి. అంతరిక్షంలో గాలి, వత్తిడి ఉండదు. కాస్మిక్ కిరణాలు పడతాయి. అటువంటి అంతరిక్షంలోకి పంపిన విత్తనాల్లో వచ్చే పెను మార్పులు మంచివి కావొచ్చు, చెడువి కావొచ్చు. కొన్నిటిని మాత్రమే మనం గుర్తించగలం. గుర్తించలేని మార్పుల వల్ల ఎటువంటి పరిణామాలుంటాయో తెలియదు. మారిన దాని ప్రభావం వల్ల ఎలర్జీ రావచ్చు, ఇంకేదైనా సమస్య రావచ్చు. జన్యుమార్పిడి మాదిరిగానే మ్యూటేషన్ బ్రీడింగ్ వల్ల కూడా జీవ భద్రతకు ముప్పు ఉంటుంది. దీని వల్ల ఉపయోగం 0.0001% మాత్రమే. దానికి పెట్టే ఖర్చుకు, పొందే ప్రయోజనానికి పొంతన ఉండదు. ఈ హై టెక్నాలజీ ఫలితాలు అకడమిక్ పరిశోధనలకు పరిమితం. దీంతో రైతుల సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందనుకోవటం భ్రమ. 60 ఏళ్లుగా మ్యూటేషన్ బ్రీడింగ్ అనుభవాలు చెబుతున్నది ఇదే. భూమ్మీదే సుసంపన్నమైన పంటల జీవవైవిధ్యం ఉంది. ప్రకృతిసిద్ధమైన వాతావరణంలో రెగ్యులర్ సెలక్షన్ ద్వారా వంగడాల ఎంపికపై ఆధారపడటమే మేలు. అధిక ఉష్ణాన్ని తట్టుకునే టొమాటో మొక్క భూమ్మీద దొరుకుతుంది. చంద్రుడి మీద దొరకదు కదా! – డా. జీవీ రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం, కృష్ణ సుధా అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ. -
బీజేపీకి మద్దతు పలికిన స్వతంత్ర ఎంపీ సుమలత
మాండ్య: మాజీ నటి, కర్ణాటక ఎంపీ సుమలత అంబరీష్(59).. ఊహించని స్టేట్మెంట్ చేశారు. కేంద్రంలోని బీజేపీకి పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. నాలుగేళ్లుగా మాండ్య లోక్సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ఆమె హఠాత్తుగా తన మద్దతును కమలానికి ప్రకటించడం గమనార్హం. మోదీ నాయకత్వంలో భారత్కు లభించిన సుస్థిరత, దేశం ప్రపంచవ్యాప్తంగా సంపాదించిన ఖ్యాతిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ‘నాలుగేళ్లపాటు స్వతంత్రంగా వ్యవహరించాను. ఈ సమయంలో బహిరంగ సమావేశాల్లో పాల్గొనడం వంటి విషయాల్లో పలు సవాళ్లను ఎదుర్కొన్నాను. వీటిని దృష్టిలో ఉంచుకునే మద్దతు అవసరమని భావించాను. అందుకే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నాను’అని ఆమె మీడియాతో అన్నారు. కన్నడ అగ్ర నటుడు దివంగత అంబరీష్ భార్య అయిన సుమలత బహు భాషా నటి. సుమారు 220కిపైగా సినిమాల్లో నటించారామె. 2019 మాండ్యా ఎన్నికలో లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. కిందటి నెలలో ఆమె బీజేపీలో చేరతారంటూ వచ్చిన వార్తలను ఖండించిన ఆమె.. ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో తన మద్దతు ఉండబోదంటూ ప్రకటించడం గమనార్హం. -
ఆర్క్యాప్ లిక్విడేషన్ విలువ రూ.13,000 కోట్లు?
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ (ఆర్క్యాప్) లిక్విడేషన్ విలువ రూ.13,000 కోట్ల వరకు ఉంటుందని ఇండిపెండెంట్ వాల్యూయర్లు తేల్చారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దివాలా పక్రియ ప్రారంభించే తేదీ నాటికి ఆస్తిని విక్రయించినప్పుడు ఆ ఆస్తిపై అప్పులుపోను కొనుగోలుదారుకు అందే తుది విలువ అంచనానే లిక్విడేషన్ విలువ. రిలయన్స్ క్యాపిటల్ రుణ దాతల కమిటీ (సీఓసీ) సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో సంస్థకు సంబంధించి ఇండిపెండెంట్ వాల్యూయర్లు– డఫ్ అండ్ ఫెల్ప్సŠ, ఆర్బీఎస్ఏలు ఇచ్చిన లిక్విడేషన్ విలువ వివరాలను రిలయన్స్ క్యాపిటల్ అడ్మినిస్ట్రేటర్ సమర్పించారు. సంబంధిత వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ► ఆర్క్యాప్కు డఫ్ అండ్ ఫెల్పŠస్ రూ.12,500 కోట్ల లిక్విడేషన్ విలువ కడితే, ఆర్బీఎస్ఏ విలువ రూ.13,200 కోట్లుగా ఉంది. ► రిలయన్స్ క్యాపిటల్ కోసం నాలుగు సంస్థలు బిడ్డింగ్ వేశాయి. వీటి బిడ్డింగ్ విలువ తాజా లిక్విడేషన్ అంచనా విలువకంటే 30 నుంచి 40 శాతం తక్కువగా ఉండడం గమనార్హం. ► రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలు అందుకున్న అత్యధిక బిడ్ విలువ చూస్తే... కాస్మియా ఫైనాన్షియల్, పిరమల్ గ్రూప్ కన్సార్టియంల ఆఫర్ రూ. 5,231 కోట్లు. ► హిందూజా రూ.5,060 కోట్లకు బిడ్ చేసింది. ► టొరెంట్, ఓక్ట్రీ బిడ్ల పరిమాణం వరుసగా రూ.4,500 కోట్లు, రూ.4,200 కోట్లుగా ఉంది. ► లిక్విడేషన్ విలువ– వాస్తవ బిడ్ విలువల మధ్య ఉన్న భారీ అంతరాన్ని దృష్టిలో ఉంచుకుని, తమ బిడ్లను సవరించమని సీఓసీ బిడ్డర్లను కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలుతెలిపాయి. రిలయన్స్ క్యాప్ లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ విలువలు ఇలా... రిలయన్స్ క్యాపిటల్ వ్యాపారం విలువలో దాదాపు 90 శాతం వాటా కలిగిన ఆ సంస్థ– జీవితబీమా, సాధారణ బీమా వ్యాపారాల లిక్విడేషన్ విలువలు చూస్తే.. డఫ్ అండ్ ఫెల్పŠస్ వాల్యుయేషన్ నివేదిక ప్రకారం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ లిక్విడేషన్ విలువ రూ.7,000 కోట్లు. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విలువ రూ.4,000 కోట్లు. ఆర్బీఎస్ఏ విషయంలో ఈ అంచనా వరుసగా రూ.7,500 కోట్లు, రూ.4,300 కోట్లుగా ఉన్నాయి. రిలయన్స్ క్యాపిటల్ రుణ దాతలు.. మొత్తం సంస్థకు అలాగే సంస్థలోని విభిన్న వ్యాపారాలకు వేర్వేరుగా బిడ్డింగ్ను పిలవడం జరిగింది. సంస్థ మొత్తం కొనుగోలుకు పైన పేర్కొన్న నాలుగు సంస్థలు బిడ్డింగ్ వేయగా, సెక్యూరిటీస్, రియల్టీ, ఏఆర్సీలకు మూడు బిడ్లు వచ్చాయి. మూడు బిడ్ల విలువ కేవలం రూ.120 కోట్లుగా ఉంది. అయితే డఫ్ అండ్ ఫెల్ప్సŠ, ఆర్బీఎస్ఏలు తాజాగా ఇచ్చిన లిక్విడేషన్ విలువలు వరుసగా రూ.280 కోట్లు, రూ.240 కోట్లుగా ఉన్నాయి. కాగా, జీవితబీమా, సాధారణ బీమా వ్యాపారాలకు మాత్రం వేర్వేరుగా ఎటువంటి బిడ్లు దాఖలు కాలేదు. -
దేశం రెండు ముక్కలైంది నేడే!
భారత స్వాతంత్య్ర చట్టం–1947 ఆమోదం పొందిన రోజు ఇది. బ్రిటిష్ ఇండియాను భారత్, పాక్ అనే రెండు స్వతంత్ర దేశాలుగా విభజిస్తూ యునైటెడ్ కింగ్డమ్ చేసిన ఈ చట్టం 1947 జూలై 18న బ్రిటిష్ పార్లమెంటు ఆమోదం పొందింది. ఆ ప్రకారం భారత్, పాక్లకు ఆగస్టు 15 వ తేదీ స్వాతంత్య్రం వచ్చినట్లు. అయితే వైశ్రాయ్ లార్డ్ మౌంట్బాటన్ ఆగస్టు 15 వ తేదీన అధికార బదలీ కోసం ఢిల్లీలో ఉండవలసి రావడంతో పాకిస్థాన్ ఒక రోజు ముందే ఆగస్టు 14న తన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంది. భారత స్వాతంత్య్ర చట్టాన్ని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ, సిక్కుల తరఫున బల్దేÐŒ సింగ్, బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ కలిసి కూర్చొని, చర్చించి రూపొందించారు. కాంగ్రెస్ నుంచి జవహర్లాల్ నెహ్రూ, వల్లభ్భాయ్ పటేల్, ఆచార్య కృపలానీ, ముస్లిం లీగ్ నుంచి మహమ్మద్ అలీ జిన్నా, లియాఖత్ అలీఖాన్, అబ్దుల్ రబ్ నిష్తార్ ఆ సమావేశానికి ప్రాతినిథ్యం వహించారు. విభజనను గాంధీజీ వ్యతిరేకిస్తుండటంతో సమావేశానికి రమ్మని ఆయనకు ఆహ్వానం అందలేదు. (చదవండి: సామ్రాజ్య భారతి: 1903/19047 ఘట్టాలు! చట్టాలు) -
మోసం చేసేందుకు సహాయపడ్డారు
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్నకు రిటైల్ స్టోర్ల బదలాయింపు విషయంలో ఫ్యూచర్ రిటైల్తో (ఎఫ్ఆర్ఎల్) ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ వివాదం కొనసాగుతోంది. ఈ ’మోసపూరిత వ్యూహం’ అమలుకు ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లు సహాయం చేశారంటూ అమెజాన్ తాజాగా ఆరోపించింది. ఎఫ్ఆర్ఎల్ భారీ అద్దె బకాయిలు కట్టలేకపోవడం వల్లే 835 పైచిలుకు స్టోర్లను రిలయన్స్ గ్రూప్ స్వాధీనం చేసుకుందన్న వాదనలన్నీ తప్పుల తడకలని పేర్కొంది. స్టోర్స్ స్వాధీనానికి నెల రోజుల ముందే ఈ బకాయిలు కేవలం రూ. 250 కోట్లు మాత్రమే ఉంటాయంటూ ఎఫ్ఆర్ఎల్ వెల్లడించిందని.. ఆ కాస్త మొత్తానికి అన్ని స్టోర్స్ను రిలయన్స్కు ఎలా బదిలీ చేస్తారంటూ ప్రశ్నించింది. ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లకు ఈ మేరకు లేఖ రాసింది. సంక్షోభంలో ఉన్న ఎఫ్ఆర్ఎల్కు తాము ఆర్థిక సహాయం అందిస్తామంటూ ఆఫర్ చేసినప్పటికీ అప్పట్లో రిలయన్స్కు రిటైల్ వ్యాపార విక్రయ డీల్పై చర్చల సాకును చూపించి స్వతంత్ర డైరెక్టర్లు తమ ప్రతిపాదన తిరస్కరించారని పేర్కొంది. ఆ తర్వాత కంపెనీ, దాని ప్రమోటర్లు, డైరెక్టర్లు మొదలైన వారంతా రిలయన్స్ గ్రూప్తో కుమ్మక్కై ఎఫ్ఆర్ఎల్ నుంచి రిటైల్ స్టోర్స్ను వేరు చేశారని, ఈ మోసాన్ని అడ్డుకోవడానికి స్వతంత్ర డైరెక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అమెజాన్ ఆరోపించింది. తద్వారా ప్రజలు, నియంత్రణ సంస్థలను మోసం చేశారని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో చట్టప్రకారం ప్రమోటర్లతో పాటు డైరెక్టర్లకు కూడా జైలు శిక్షలు తప్పవని హెచ్చరించింది. ఫ్యూచర్ గ్రూప్లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్లో వాటాల ద్వారా రిటైల్ వ్యాపారమైన ఎఫ్ఆర్ఎల్లో అమెజాన్కు స్వల్ప వాటాలు ఉన్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో రిటైల్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్కు రూ. 24,713 కోట్లకు విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పం దం కుదుర్చుకుంది. అయితే, ఇది తన ప్రయోజనాలకు విరుద్ధమంటూ అమెజాన్ న్యాయస్థానాలు, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్స్ను ఆశ్రయించగా పలు చోట్ల దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం దీనిపై ఇంకా న్యాయపోరాటం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్ఎల్ డీల్ను రిలయన్స్ రద్దు చేసుకుంది. రిటైల్ స్టోర్స్ లీజు బకాయిలు తమకు కట్టనందున వాటిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. -
రావిచెట్టుపై రాత్రికి రాత్రే జెండా ఎగిరింది.. పెద్ద హంగామా..
సాక్షి, భానుపురి (నల్లగొండ): దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో నిజాం రాజు ఇంకా ప్రత్యేక దేశంగా ఉండేందుకే మొగ్గు చూపారు. ఈ సమయంలో కొందరు స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇంకా నిజాం పోలీసులు, రజాకార్లదే పెత్తనం. అప్పుడు నా వయస్సు 9 ఏళ్లు. 1947 ఆగస్టు 15న గుర్తుతెలియని వ్యక్తులు రావిచెట్టు బజారు (ప్రస్తుత బొడ్రాయిబజారు)లో ఓ పెద్ద రావిచెట్టుపై రాత్రికి రాత్రే జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల భయం ఎక్కువగా ఉన్న ఆ సమయంలో జెండా ఎవరూ కట్టారో తెలుసుకునేందుకు పెద్ద హంగామే జరిగింది. పోలీసులు సోదాలు చేయడం, అనుమానం ఉన్న వారిపై లాఠీలు ఝుళిపించారు. పెద్ద ఘర్షణ వాతావరణమే నెల కొంది. నిజాంరాజు లొంగిపోయిన తర్వాత కూడా జెండా పండుగకు ప్రజలు పోలీసుల భయంతో పెద్దగా వచ్చేవారు కాదు. ఆర్య సమాజ్కు చెందిన యామ రామచంద్రయ్య (కన్నయ్య), విశ్వమిత్ర పండిత్జీ లాంటి వారు ముందుండి నడిపేవారు. రామాలయం పక్కనే ఉన్న గ్రంథాలయంలో జెండా ఎగురవేసేది. రానురాను మొదటగా గాంధీపార్క్, పబ్లిక్ క్లబ్ ఇలా అన్నిచోట్ల జాతీయ జెండాలను ఎగురవేస్తున్నారు. -
వయసు 58... ఉత్సాహం 18: కాంస్యం సాధించిన షూటర్
2016 రియో ఒలింపిక్స్... షూటింగ్ స్కీట్ ఈవెంట్లో 53 ఏళ్ల అబ్దుల్లా అల్ రషీదీ కాంస్య పతకం సాధించాడు. అయితే అతనిలో ఏమాత్రం ఆనందం లేదు. తన సొంత దేశం కువైట్పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిషేధం విధించి ఉండటంతో అతను ఇండిపెండెంట్ ఒలింపిక్ అథ్లెట్గా బరిలోకి దిగాడు. ఫుట్బాల్ క్లబ్ ‘అర్సెనల్’ జెర్సీ వేసుకొని పతకం అందుకోగా... వేడుక సమయంలో ఒలింపిక్ పతాకం మాత్రమే ఎగిరింది. ఇది అతడిని చాలా బాధించింది. అంతే... తాను మళ్లీ ఒలింపిక్స్ ఆడాలని, దేశం తరఫున పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అలా అనుకోవడమే కాదు... ఐదు సంవత్సరాల తర్వాత దానిని సాధించి చూపించాడు. 58 ఏళ్ల వయసులో అదే స్కీట్ ఈవెంట్లో మళ్లీ కాంస్యం గెలిచి కువైట్ జాతీయ పతాకం ఎగురుతుండగా సగర్వంగా నిలబడ్డాడు. టోక్యో క్రీడల్లో పతకం సాధించిన అతి పెద్ద వయస్కుడి గా రషీదీ నిలవడం విశేషం. 1996 నుంచి వరుసగా విశ్వ క్రీడల్లో పాల్గొంటున్న రషీదీకి ఇవి ఏడో ఒలింపిక్స్ కావడం విశేషం. తొలి ఐదు సందర్భాల్లో 42, 14, 9, 9, 21 స్థానాల్లో నిలిచినా, అతను వెనక్కి తగ్గకుండా పోరాడుతూనే వచ్చాడు. సోమవారం ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచి పతకం కోసం రషీదీతో చివరి వరకు పోటీ పడిన ఈటూ కలినన్ (ఫిన్లాండ్)... రషీదీ తొలి ఒలింపిక్స్ ఆడే సమయానికి పుట్టనే లేదు! అన్నట్లు అతని కుమారుడు తలాల్ అలా రషీదీ కూడా షూటరే. 2012 లండన్ ఒలింపిక్స్లో తండ్రితో కలిసి బరిలోకి దిగిన తలాల్, ఈసారి కూడా ‘ట్రాప్’ ఈవెంట్లో మళ్లీ ఆడుతున్నాడు. చివరగా... ఇంతటితో ఆగిపోనని చెబుతున్న రషీదీ, రిటైర్మెంట్ వయసు (61) వచ్చినా సరే పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణమే లక్ష్యంగా పోటీ పడతానని ప్రకటించడం విశేషం! అదో అంకె మాత్రమే... టోక్యో ఒలింపిక్స్లో బరిలోకి దిగిన పెద్ద వయస్కురాలిగా మేరీ హనా (ఆస్ట్రేలియా) నిలిచింది. 66 ఏళ్ల హనా ఈక్వెస్ట్రియన్లో ఏడోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగుతుండటం విశేషం. అమెరికా ఈక్వెస్ట్రియన్ జట్టు సభ్యుడైన ఫిలిప్ డాటన్ వయసు 57 ఏళ్లు కాగా, ఉజ్బెకిస్తాన్ జిమ్నాస్ట్ ఒక్సానా చుసోవితినా వయసు 46 సంవత్సరాలు. ఎనిమిదో ఒలింపిక్స్లో పాల్గొంటున్న చుసోవితినాకు 21 ఏళ్ల కొడుకు ఉండగా... ఈ పోటీల్లో అతనికంటే చిన్న వయసువారు ఎంతో మందితో ఆమె పోటీ పడుతోంది. 45 ఏళ్ల అమెరికా బీచ్ వాలీబాల్ ప్లేయర్ జేక్ జిబ్ను చూసినా సరే... వీరంతా కాలాన్ని వెనక్కి తిప్పి యవ్వనంతో పోటీ పడుతున్నారా అనిపిస్తుంది! -
స్వతంత్ర డైరెక్టర్లు.. గుడ్బై!!
దేశీ కార్పొరేట్ రంగంలో తాజాగా వెలుగుచూస్తున్న కుంభకోణాలు, అవకతవకలు... బోర్డు రూమ్ సంక్షోభానికి దారితీస్తున్నాయి. స్కామ్ల పాపం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో కంపెనీల నుంచి వైదొలగుతున్న ఇండిపెండెంట్ డైరెక్టర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో మొత్తం 126 మంది ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఆ సంఖ్య రెట్టింపై 291కి పెరగడం తాజా పరిస్థితికి నిదర్శనం. ఈ వివరాలను ఎన్ఎస్ఈఇన్ఫోబేస్ డాట్కామ్ వెల్లడించింది. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్(ఎన్ఎస్ఈ), ప్రైమ్ డేటాబేస్ కలసి ఈ సంస్థను ఏర్పాటు చేశాయి. తాజా నివేదికలో స్వతంత్ర డైరెక్టర్ల విషయమై కీలకాంశాలు వెలుగుచూశాయి. సాధారణంగా ఒక కంపెనీ డైరెక్టర్ల బోర్డ్లో మూడో వంతు ఇండిపెండెంట్(స్వతంత్ర) డైరెక్టర్లుంటారు. కంపెనీలను వదిలిపోతున్న ఇండిపెండెంట్ డైరెక్టర్లలో సగం మంది వారి పదవీకాలం పూర్తవ్వడంతో వైదొలుగుతున్నారు. ఆరోగ్య, వ్యక్తిగత లేదా ఇతర వృత్తులు, వ్యాపకాల్లో స్థిరపడటం వంటి కారణాలతో చాలా మంది తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 291 మంది ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేశారు. దీంట్లో 146 మంది తమ పదవీ కాలం పూర్తవ్వడంతో రాజీనామా చేయగా, మళ్లీ ఆ పదవిలో కొనసాగడం ఇష్టం లేదంటూ 36 మంది వైదొలిగారు. ఇతర వృత్తుల్లో స్థిరపడేందుకు రాజీనామా చేసిన వారి సంఖ్య 26గా ఉంది. సెబీ, కంపెనీల చట్టం ప్రకారం తగిన అర్హతలు లేకపోవడంతో 17 మంది రాజీనామా చేశా రు. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు, ఆసక్తి లేదంటూ రాజీనామా చేసిన వాళ్ల సంఖ్య 40. యాజమాన్యం మారడంతో ఆరుగురు రాజీనామా చేశారు. కాగా, జెట్ ఎ యిర్వేస్ కంపెనీలో ఇబ్బందులు తలెత్తగానే పలువు రు ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేశారు. చెల్లింపుల్లో విఫలం కావడంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నుంచి కూడా ఇండిపెండెట్ డైరెక్టర్లు వైదొలిగారు. ఇష్టపడని పదవి.. గతంలో ఇతర కంపెనీలకు ఎగ్జిక్యూటివ్లుగా పనిచేసిన వాళ్లు, ప్రభుత్వంలో ఉన్నత స్థాయి పదవులు నిర్వహించినవాళ్లు ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా రావడానికి ఇష్టపడటం లేదు. కంపెనీల్లో అవకతవకలు ఉంటాయేమోనన్న అనుమానాలతో ఈ పదవులను వారు తిరస్కరిస్తున్నారు. కంపెనీ ప్రమోటర్లు, యాజమాన్యం తీసుకునే నిర్ణయాలకు బలికావలసి వస్తుందనే భయాలతో పలువురు ఈ పదవులను నిరాకరిస్తున్నారు. ఇండిపెండెంట్ డైరెక్టర్గా చేరితే, ఒకవేళ కంపెనీ లోటుపాట్లు వెల్లడైన పక్షంలో, అప్పటివరకూ తాము సంపాదించుకున్న పేరు, నమ్మకం అన్నీ కోల్పోవలసి వస్తుందని, న్యాయ వివాదాలు ఎదుర్కోవలసి వస్తుందని, అందుకే ఈ పదవులకు దూరంగా ఉంటున్నామని పలువురు పేర్కొన్నారు. ఇదిలాఉంటే... భారత్లో పలు కంపెనీలు కుటుంబాల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. దీంతో ఇండిపెండెంట్ డైరెక్టర్లు ప్రమోటర్ల దయ మీదనే ఆధారపడక తప్పటం లేదు. దీనికి వ్యతిరేకంగా గళం విప్పితే.. ప్రత్యేక తీర్మానం ద్వారా వీరిని సాగనంపే అవకాశాలున్నాయి. ఒకవేళ కంపెనీ అవకతవకల విషయమై తెలిసి కూడా స్పందించకపోతే, వీరి ఆస్తులను కూడా కంపెనీల వ్యవహారాల శాఖ స్తంభింపజేసే అవకాశాలున్నాయి. దీంతో ఇప్పుడు ఇండిపెండెంట్ డైరెక్టర్ల పదవి అడకత్తెరలో పోకచెక్కలా మారిందని విశ్లేషకులంటున్నారు. వంద శాతం పూర్తిగా నమ్మకం కుదిరితేనే ఈ పదవికి ముందుకొస్తున్నారని చెబుతున్నారు. ఇండిపెండెంట్ డైరెక్టర్ విధులేంటి? ► ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్...తన బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. కంపెనీ, వాటాదారులు ముఖ్యంగా మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం బాథ్యతాయుతంగా మెలగాలి. ► తన హోదాను స్వలాభం కోసం దుర్వినియోగం చేయకూడదు. అలాగే తన స్వలాభం కోసం కంపెనీకి నష్టం వచ్చేలా ప్రవర్తించకూడదు. కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ సవ్యంగా సాగేలా తగిన తోడ్పాటునందించాల్సి ఉంటుంది. ► కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ► ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలాగా కంపెనీ రోజువారీ కార్యకలాపాలను ఇండిపెండెంట్ డైరెక్టర్లు చూడాల్సిన పని ఉండదు. వారికి అధికారాలు కూడా పరిమితంగానే ఉన్నాయి. ► డైరెక్టర్ల సమావేశాలకే కాకుండా బోర్డ్ నియమించే కమిటీల్లో సభ్యుడిగా ఉంటూ, ఈ కమిటీ సమావేశాలకు కూడా హాజరు కావలసి ఉంటుంది. కంపెనీలో ఏమైనా అవకతవకలు చోటు చేసుకుంటే వాటిని వెలుగులోకి తేవలసి ఉంటుంది. ► కంపెనీకి సంబంధించిన రహస్యాలను (టెక్నాలజీ, భవిష్యత్తు నిర్ణయాలు, ఇతర కంపెనీలతో కుదుర్చుకోబోయే ఒప్పందాలు తదితర అంశాలను) లీక్ చేయకూడదు. ఇక ప్రత్యేక తీర్మానం ద్వారానే ఇండిపెండెంట్ డైరెక్టర్లను తొలగించే వీలుంది. ప్రశ్నించే అధికారం ఉండాలి... ప్రమోటర్లు, వాటాదారుల ఆధిపత్యం ఉన్న కంపెనీల్లో ‘నిజమైన’ ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఎవరూ ఉండరు. ఇండిపెండెంట్ డైరెక్టర్ హోదాను పునఃపరిశీలించాలి. భారత కుటుంబ వ్యాపారాల్లో మెజార్టీ వాటా ప్రమోటర్ గ్రూప్దే. ఇలాంటి కంపెనీల్లో డైరెక్టర్ల స్వతంత్రత చాలా కష్టసాధ్యమైన విషయం. మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ ఇండిపెండెంట్ డైరెక్టర్ల బాధ్యత అయినప్పటికీ, ప్రమోటర్ గ్రూప్ చర్యలను, నిర్ణయాలను ప్రశ్నించే అధికారం వారికి ఉండాలి. – ప్రణవ్ హల్దియా, ఎమ్డీ, ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ సత్యం స్కామ్ నుంచి... సత్యం కంప్యూటర్స్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్ల పాత్ర కీలకమైందని ప్రభుత్వం గుర్తించింది. అప్పటి వరకూ ఇండిపెండెంట్ డైరెక్టర్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. ఉత్సవ విగ్రహాలేనని చెప్పవచ్చు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని 2013 నాటి కంపెనీల చట్టంలో ఇండిపెండెంట్ డైరెక్టర్లకు సంబంధించిన నిబంధనల విషయమై పలు మార్పులు, చేర్పులు చేసింది. మరోవైపు ఇండిపెండెంట్ డైరెక్టర్లు సభ్యులుగా ఉన్న రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ తరచుగా సమావేశాలు జరుపుతూ, కంపెనీ స్థితిగతులపై చర్చించాల్సి ఉంటుంది. కానీ ఐఎల్అండ్ఎఫ్ఎస్ కంపెనీలో నాలుగేళ్ల కాలంలో ఇలాంటి ఒక్క సమావేశం కూడా జరగలేదంటే కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇక లిస్టైన కంపెనీల్లో మొత్తం డైరెక్టర్లలో మూడు నుంచి ఐదో వంతు వరకూ ఇండిపెండెంట్ డైరెక్టర్లుండాలి. టాప్1000 కంపెనీల్లో కనీసం ఒక మహిళ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉండితీరాలి. -
జెట్ మాజీ ఛైర్మన్కు మరోసారి చిక్కులు
సాక్షి, ముంబై: జెట్ఎయిర్వేస్ వ్యవస్థాపకులు నరేష్ గోయల్కు మరోసారి చిక్కులు తప్పేలా లేవు. నిధుల మళ్లింపు ఆరోపణలతో ఇండిపెండెంట్ ఆడిట్ నిర్వహించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భావిస్తోంది. ఎస్బిఐ నిర్వహించిన ఆడిట్పై సంతృప్తిచెందని అధికారులు స్వతంత్ర ఆడిట్నిర్వహిస్తామని ప్రకటించడంతో నరేష్గోయల్ చిక్కుల్లోపడ్డారు. మొత్తం 19 ప్రైవేటు కంపెనీలు నరేష్గోయల్కు ఉన్నాయని, వాటిలో ఐదు కంపెనీలు విదేశాల్లో రిజిష్టరు అయినట్లు సీనియర్ ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ సంస్థలు అమ్మకం, పంపిణీ , నిర్వహణ ఖర్చులు ముసుగులో అనుమానాస్పద లావాదేవీలను ఈడీ పరిశీలిస్తోంది. నగదు సంక్షోభంలో చిక్కుకుని, ఏడువేల కోట్ల బకాయిలు పేరుకున్న సంస్థపై ఇపుడు స్వతంత్ర ఆడిట్ నిర్వహించడమే మంచిని భావిస్తోంది. గతవారంలో గోయల్ను ప్రశ్నించిన అధికారులు ఎస్బిఐ నిర్వహించిన ఆడిట్లో లోపాలున్నట్లు గుర్తించారు. రుణాల సొమ్మును విదేశాల్లోని కంపెనీలకు మళ్లించారన్న ఆరోపణల నేపథ్యంలో స్వతంత్ర ఆడిట్తోనే మరిన్ని అంశాలు వెలుగులోనికి వస్తాయని ఈడీ భావిస్తోంది. ముంబై కార్యాలయంలో గత వారంలోనే గోయల్ను విచారించిన ఈడీ విదేశీ కరెన్సీ చట్టాల పరిధిలో విచారణ నిర్వహించింది. ఆగస్టులో ఆయన నివాసాలు కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన తర్వాత మొదటిసారి ముంబైలో గోయల్ను ప్రశ్నించింది. రూ.18వేల కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలపై దర్యాప్తునకు గోయల్ సహకరించడం లేదని ఆగస్టులో ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం నివేదించింది. అయితే ఈ ఆరోపణలను గోయల్ తిరస్కరించారు. కాగా దివాలా చర్యలను ఎదుర్కొంటున్న ఎయిర్లైన్స్ చైర్మన్ గోయల్ ఇదివరకే తన పదవికి రాజీనామా చేశారు. అలాగా మార్చిలో జెట్ ఎయిర్వేస్ బోర్డు పునర్నిర్మాణంలో భాగంగా గోయల్, అతని భార్య అనిత రాజీనామా చేశారు. ఈ సంక్షోభం నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. -
మంచిర్యాల: పోరు త్రిముఖం
సాక్షి, మంచిర్యాల: లోక్సభ ఎన్నికల ప్రచారం వేడెక్కనుంది. మొన్న నామినేషన్ల దాఖలు... నిన్న పరిశీలన పూర్తి కాగా.. తాజాగా గురువారం ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఇక ప్రచార పర్వానికి తెరలేవనుంది. శుక్రవారం నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకోనుంది. ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. గురువారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేశారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ రెబల్గా నామినేషన్ వేసిన నరేశ్ జాదవ్ పోటీ నుంచి తప్పుకున్నారు. పెద్దపల్లిలో మాత్రం ఏ అభ్యర్థి కూడా నామినేషన్ను ఉపసంహరించుకోకపోవడం గమనార్హం. ఆదిలాబాద్లో 11 మంది.. ఆదిలాబాద్ లోకసభ స్థానానికి 11 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఇతర పార్టీలు, స్వతంత్రులుగా మొత్తం 11 మంది బరిలో మిగిలారు. తొలుత 17 మంది నామినేషన్లు వేయగా, అందులో నాలుగు నామినేషన్లు పరిశీలనలో తిరస్కరించారు. గురువారం భారతీయ బహుజన్ క్రాంతి దళ్ పార్టీకి చెందిన అడే బాలాజీ, కాంగ్రెస్ రెబల్ నరేశ్ జాదవ్ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. పోటీలో 11 మంది మిగిలారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దివ్యదేవరాజన్ ప్రకటించారు. కాగా, కాంగ్రెస్ టికెట్ ఆశించి, రెబల్గా నామినేషన్ వేసిన నరేశ్ జాదవ్ పోటీ నుంచి తప్పుకున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఈయన పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లోనూ పార్టీ టికెట్ ఆశించారు. కాని అధిష్టానం రమేశ్ రాథోడ్కు అవకాశం కల్పించింది. దీంతో అలక వహించిన నరేశ్ రెబల్గా పోటీ చేశారు. కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేసి, బీ–ఫారం ఇవ్వకున్నా పోటీకి సై అన్నారు. కాని పార్టీ అధిష్టానం బుజ్జగించడంతో మెత్తబడ్డ ఆయన తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి కూడా తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో పోటీలో పదకొండు మంది అభ్యర్థులు ఉన్నారు. ఇదిలాఉంటే టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేశ్, కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్, బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు మధ్య ప్రధాన పోరు నెలకొంది. కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో బాపూరావు బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పెద్దపల్లి బరిలో 17 మంది పెద్దపల్లి లోక్సభ బరిలో 17 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఏ అభ్యర్థి కూడా పోటీ నుంచి తప్పుకోకపోవడం గమనార్హం. నామినేషన్ల పరిశీలన అనంతరం మిగిలిన 17 మందిలో ఎవరూ కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. కాగా పెద్దపల్లిలోనూ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల నడుమ ప్రధాన పోటీ నెలకొంది. చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరి, అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న బొర్లకుంట వెంకటేశ్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్, బీజేపీ అభ్యర్థి ఎస్.కుమార్ల మధ్య పోటీ ఉంది. మూడు ప్రధాన పార్టీలు కూడా తమ విజయంపై ధీమాతో ఉన్నాయి. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు. ఆదిలాబాద్ బరిలో వీరు.. అభ్యర్థి పేరు పార్టీ గుర్తులు 1.గోడం నగేశ్ టీఆర్ఎస్ కారు 2.రమేశ్ రాథోడ్ కాంగ్రెస్ హస్తం 3.బాపూరావు సోయం బీజేపీ కమలం 4.కుందం వందన నవ ప్రజారాజ్యం ట్రాక్టర్ నడిపే రైతు 5.భీమ్రావు అంబేద్కర్ రైట్ పార్టీ ఆఫ్ ఇండియా కోటు 6.పవార్ కృష్ణ రాష్ట్రీయ జనక్రాంతి హెల్మెట్ 7.ధరావత్ నరేందర్ జనసేన గాజుగ్లాసు 8.గంట పెంటన్న స్వతంత్ర కుండ 9.కుమ్ర రాజు స్వతంత్ర ఉంగరం 10.ఆరె ఎల్లన్న స్వతంత్ర బ్యాట్ 11.నేతావత్ రాందాస్ స్వతంత్ర గ్యాస్ సిలిండర్ పెద్దపల్లి బరిలో వీరే.. పేరు పార్టీ గుర్తు 1. వెంకటేశ్నేత టీఆర్ఎస్ కారు 2.డాక్టర్ చంద్రశేఖర్ కాంగ్రెస్ హస్తం 3.ఎస్.కుమార్ బీజేపీ కమలం 4.బాలకల్యాణ్ పంజా బీఎస్పీ ఏనుగు 5. ఎరుగుర్ల భాగ్యలక్ష్మి పిరమిడ్ పార్టీ పిల్లనగ్రోవి 6. ఎస్.కృష్ణ సెక్యులర్ డెమోక్రటిక్ బావి 7. రాజ్ప్రకాశ్ ఇండియా ప్రజాబంధు ట్రంపెట్ 8. వెలుతురు మల్లయ్య రిపబ్లిక్ పార్టీ హెలికాఫ్టర్ 9. సబ్బని కృష్ణ సీపీఐయూ కంప్యూటర్ 10. దేవదాస్ యాంటీ కరెప్షన్ పనసకాయ 11. అర్షం అశోక్ స్వతంత్ర గ్యాస్ సిలిండర్ 12. కుంటాల నర్సయ్య స్వతంత్ర రోడ్డురోలర్ 13. గద్దల వినయ్ స్వతంత్ర గాజుగ్లాస్ 14. గొడిశెల్లి నాగమణి స్వతంత్ర గౌను 15. దుర్గం రాజ్కుమార్ స్వతంత్ర బ్యాట్ 16. ఎరికిల్ల రాజేశ్ స్వతంత్ర ఓర 17. అంబాల మహేందర్ స్వతంత్ర ట్రాక్టర్ నడిపే వ్యక్తి -
రెబల్.. గుబుల్
సాక్షి, అనంతపురం : టీడీపీ అభ్యర్థులకు రెబల్స్ గుబులు పట్టుకుంది. టీడీపీ తరఫున టిక్కెట్ ఆశించి భంగపడిన ఆశావహులు ఇప్పుడు ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతున్నారు. టీడీపీ ఓటమే తమ లక్ష్యమని ప్రకటిస్తున్నారు. ఈ పరిణామాలతో బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థులంతా ఆందోళనతో చెందుతున్నారు. కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యే ‘ఉన్నం’ ఇప్పటికే ఇండిపెండెంట్గా నామినేషన్ వేయగా.. గురువారం ‘దుర్గం’లో కాలవకు పోటీగా ఎమ్మెల్సీ దీపక్రెడ్డి నామినేషన్ వేశారు. పైగా కాలవను ఓడించడమే ధ్యేయమని ఇప్పటికే ఆయన ప్రకటించారు. దీంతో మంత్రి కాలవ వెన్నులో వణుకుపుడుతోంది. రాయదుర్గం నుంచి బరిలో ఉన్న మంత్రి కాలవ శ్రీనివాసులుకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. గత ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించి కాలవను గెలిపించిన మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ‘దుర్గం’లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన ప్రచార సభ జనాలతో కిక్కిరిసింది. వేలాది మందితో దుర్గం హోరెత్తింది. ఈ జనస్పందన చూస్తే వైఎస్సార్సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి, మెట్టు కలయికతో పార్టీ మరింత బలోపేతమైందని స్పష్టమవుతోంది. ఈ సభ విజయవంతంతోనే కాలవ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంతలోనే దీపక్రెడ్డి గురువారం ఓ సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థిగా ఇప్పటికే కాలవ బరిలో ఉన్నారు. అయినప్పటికీ దీపక్రెడ్డి నామినేషన్ వేయడం టీడీపీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. రెండేళ్లుగా కాలవను దీపక్రెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాలవకు టిక్కెట్ రాకుండా తాను బరిలో ఉండాలని యత్నించారు. టీడీపీ అధిష్టానం కాలవకు టిక్కెట్ ఇస్తే తాను ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిస్తానని చెప్పారు. అయితే అధిష్టానం సర్దుబాటు చేస్తుందని అంతా భావించారు. అయినప్పటికీ దీపక్ మాత్రం నామినేషన్ వేశారు. ముహూర్తం బాగుందని నామినేషన్ దాఖలు చేశామని, ఈ నెల 25న భారీర్యాలీ నిర్వహించి నామినేషన్ వేస్తామని ఆయన తెలిపారు. ‘దుర్గం’ టీడీపీలో ‘మెట్టు’, దీపక్రెడ్డికి బలమైన కేడర్ ఉంది. మెట్టు వెళ్లడంతో ఓ వర్గం టీడీపీకి దూరమైంది. మరో వర్గం దీపక్రెడ్డి వెంట నడవనుంది. దీంతో కాలవ పూర్తిగా బలహీనపడినట్లయింది. సర్వేల్లోనూ కాలవకు ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలో దీపక్రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేయడం చూస్తే అక్కడ ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో స్పష్టమవుతోంది. కళ్యాణదుర్గంలో ‘ఉన్నం’ ప్రచారం షురూ కళ్యాణదుర్గంలో నియోజకవర్గంపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ వైఎస్సార్సీపీ తరఫున ఉషాశ్రీ చరణ్, కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, టీడీపీ తరఫున ఉమామహేశ్వరరావు బరిలో ఉన్నారు. ఇప్పటికే నామినేషన్ వేసిన ‘ఉన్నం’ ఇండిపెండెంట్గా ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇక్కడ టీడీపీ కూడా రఘువీరాకు సహకరించేందుకు సిద్ధమైంది. అయితే కొన్నేళ్లుగా కాంగ్రెస్పై పోరాడి కష్టనష్టాలకోర్చిన టీడీపీ శ్రేణులు ‘చంద్రబాబు–రఘువీరా’ కుమ్మక్కు రాజకీయాలపై తీవ్రంగా రగిలిపోతున్నారు. వారి రాజకీయానికి తాము బలికావాలా? అంటూ రఘువీరాతో పాటు ఉమామహేశ్వర్కు కూడా సహకరించేది లేదని తేల్చిచెబుతున్నారు. రఘువీరా, ఉమా, ఉన్నంలు టీడీపీ ఓట్లును చీల్చనున్నారు. ఇదే జరిగితే అక్కడ ఎలాంటి ఫలితం ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఉషాశ్రీ చరణ్ వైఎస్సార్సీపీ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రచారంలో దూసుకుపోతున్నారు. గుప్తా కూడా రెబల్గానే బరిలోకి టీడీపీ తరఫున గుంతకల్లు టిక్కెట్ ఆశించి భంగపడిన మధుసూదన్ గుప్తా జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. జనసేన తరఫున పోటీలో ఉన్నా...ఇతన్ని కూడా టీడీపీ రెబల్గానే భావించాలి. ఏడాదిగా అతను టీడీపీ శ్రేణులతో కలిసి నియోజకవర్గంలో పనిచేశారు. జితేంద్రగౌడ్కు కాకుండా గుప్తాకే టిక్కెట్ అని ఆపార్టీ శ్రేణులు భావించాయి. ఎంపీ జేసీ కూడా గుప్తానే అభ్యర్థి అని ప్రచారం చేస్తూ వచ్చారు. దీంతో గౌడ్ బలహీనంగా తయారయ్యారు. ఇప్పుడు గుప్తాకు కాకుండా తిరిగి గౌడ్కే టిక్కెట్ ఇచ్చారు. దీంతో గుప్తా పార్టీ వీడి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. టీడీపీలోని బలమైన వర్గం గుప్తాతో నడవనుంది. దీంతో టీడీపీ ఓట్లు భారీగా చీలే అవకాశం ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో బలంగా ఉన్న వెంకట్రామిరెడ్డికి టీడీపీలోని ఓట్ల చీలిక కలిసిరానుంది. ఇండిపెండెంట్గా బరిలోకి అత్తార్..! కదిరి ఎమ్మెల్యే అత్తార్చాంద్బాషా ఇండిపెండెంట్గా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ నిమ్మల కిష్టప్ప, కందికుంట ప్రసాద్ చర్చలు జరిపినప్పటికీ ఫలించలేదని అత్తార్తో అనుచరులు చెబుతున్నారు. కందికుంటకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని, ఇండిపెండెంట్గా బరిలో నిలిచి కందికుంటను ఓడించాలనే భావనలో అత్తార్ ఉన్నట్లు తెలుస్తోంది. మైనార్టీ నేతగా ఉన్న అత్తార్ వైఎస్సార్సీపీ తరఫున గెలిచి టీడీపీ కండువా కప్పుకుని మైనార్టీ ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేశారు. దీంతో అత్తార్ వెంట మైనార్టీలు వచ్చే అవకాశం లేదు. ఈ విషయం అత్తార్కు తెలుసు. అయితే టీడీపీలో ఉన్న మైనార్టీయేతర వర్గాల ఓట్లనైనా తాను చీల్చగలనని, తద్వారా సిట్టింగ్ అయిన తనను కాదని టిక్కెట్ తెచ్చుకున్న కందికుంటను ఓడించొచ్చనే ఎత్తుగడలో అత్తార్ ఉన్నారు. నిజంగా ఇదే జరిగితే కదిరిలో టీడీపీకి పెద్ద దెబ్బ తగిలినట్లే. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థులు వ్యతిరేకగాలి మధ్య ఎదురీదుతుంటే రెబల్స్ గొడవతో మరింత నష్టపోతున్నారు. -
పెట్రోల్ బండికి.. మైలేజీ నాకు
సాక్షి, అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో బుధవారం స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపార సముదాయాల్లో తిరుగుతూ తనను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం చంద్రశేఖర్ ఓ పెట్రోల్ బంక్లో వాహనదారులకు పెట్రోల్ విక్రయించి వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. -
రాజకీయంగా వాడుకుంటే 10సీట్లు గెలిపించే వాడ్ని
యాదగిరిగుట్ట : తనను రాజకీయంగా అణచివేయడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. తాను ఏనాడు రాజ్యసభ, గవర్నర్ పదవులు అడగలేదని, ఆశపెట్టి మోసం చేసిండని మండిపడ్డారు. యాదగిరిగుట్టలో గురువారం జరిగిన ‘మోత్కుపల్లి శంఖారావ’ బహిరంగసభలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడారు. ప్రజల కోసమే జీవితమంతా బతుకుతానని, ఓ దుర్మార్గుడు, ఓ పాపత్ముడు, ఓ నీచుడిని నమ్మి మోసపోయానని చంద్రబాబునాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను రాజకీయాలపై, పేద ప్రజల పక్షాన మాట్లాడడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. ఓ మిత్రుడా.. కేసీఆర్... ఓ మిత్రుడా కేసీఆర్ నన్ను రాజకీయంగా వాడుకుని ఉంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లకు గానూ 10 అసెంబ్లీ సీట్లు గెలిపించి, పువ్వుల్లో పెట్టి ఇచ్చే వాడినని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు తప్ప మిగతావి ఏవీ గెలవవని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఇక్కడి ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే.. ఒక ఎమ్మెల్యే 2వందల ఎకరాల భూమి, మరొకరు 5వందల ఎకరాల భూమిని కోనుగోలు చేశారన్నారు. నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న కానీ ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదన్నారు. గతంలో ఆలేరులో ఎమ్మెల్యేగా ఉన్న బూడిద భిక్షమయ్యగౌడ్, తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితను గెలిపించింది తనేనని మోత్కుపల్లి పేర్కొన్నారు. ఇవే నా చివరి ఎన్నికలు... నా వయస్సు 65 సంవత్సరాలు.. ఇవే నా చివరి ఎన్నికలు.. ఈ ఒక్క సారి ఆశీర్వదించండని ఉద్వేగంగా మోత్కుపల్లి విజ్ఞప్తి చేశారు. ఆలేరు ప్రజలు అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గానికి సాగు జలాలు తీసుకుచచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. సిద్దిపేటకు తరలుతున్న తప్పాసుపల్లి జలాలను రాజపేట, ఆలేరు ప్రాంతాలకు తీసుకువస్తానని, గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను పూర్తి చేస్తానన్నారు. అంతే కాకుండా జిల్లాల విభజనలో జనగాంలో కలిసిన గుండాల మండలాన్ని తిరిగి యాదాద్రి జిల్లాలో కలిపే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ బహిరంగ సభలో ఎక్కడ కూడా కేసీఆర్ను విమర్శించకపోవడంతో స్థానికంగా చర్చ జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి వెంకన్న, యాదగిరిగుట్ట మాజీ సర్పంచ్ కైరంకొండ శ్రీదేవి, దడిగె ఇస్తారి, గజం ఉప్పలయ్య, పాపయ్య, చంద్రారెడ్డి, కే.ఆంజనేయులు, అమరేందర్రెడ్డి, గుంటి మధుసూదన్రెడ్డి, శ్రీరామూర్తి, దానయ్య, వెంకట్రెడ్డి, మచ్చ లక్ష్మీనారాయణ, ప్రజా చైతన్య వారధి పాపట్ల నరహరి తదితరులున్నారు. -
గవర్నర్ హోదా పెంచండి - రాజన్ అల్విదా
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా రఘురామ్ రాజన్ వీడ్కోలు ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. కేంద్ర బ్యాంకు స్వతంత్రాన్ని కాపాడాలన్న వాదనను మరోసారి సమర్ధించుకున్న రాజన్.. ఆర్బీఐ గవర్నర్ హోదాను పెంచాలని కోరారు. గవర్నర్కు ప్రస్తుతం కేబినెట్ సెక్రటరీ హోదా ఉంది. రిజర్వ్ బ్యాంకు స్వేచ్ఛను కాపాడాలని ఉద్ఘాటించిన రాజన్, భారతదేశంలో అసమానమైన ప్రాముఖ్యత ఉన్న స్థూల ఆర్ధిక స్థిరత్వానికి బలమైన, స్వతంత్ర రిజర్వ్ బ్యాంక్ అవసరం చాలా ఉందని పేర్కొన్నారు. బ్యాంక్ పాత్రను ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనాల్సిన అవసరం ఉందని చెప్పారు. తద్వారా సంస్థ సామర్థ్యాన్ని కాపాడాలన్నారు. సంస్థలో తన మిగులునుంచి ప్రభుత్వానికి ప్రత్యేక డివిడెండ్ చెల్లిస్తోందని తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ కింద పని చేయాలి తప్ప, ఇతర అన్ని నిరోధకాలకు, ఆటంకాలకు అనువుగా ఉండకూదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా రేపటితో (సెప్టెంబర్ 4, ఆదివారం) రాజన్ పదవీ కాలం ముగియనుంది. నూతన గవర్నర్ గా ఊర్జిత్ పటేల్ మంగళవారం బాధ్యతలను స్వీకరించనున్న సంగతి తెలిసిందే. -
అందరి దృష్టి జెడ్పీ మీటింగ్పైనే!
ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, నారాయణస్వామే టార్గెట్ అధికారుల్లో పెరుగుతున్న టెన్షన్ చిత్తూరు (టౌన్): జిల్లా కేంద్రంలో ఈనెల 31న జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. జిల్లాలో 37 మంది జెడ్పీటీసీ సభ్యు లు అధికారపార్టీకి చెందిన వారు కాగా 27 మంది వైఎ స్ఆర్ సీపీకి చెందిన సభ్యులు ఉన్నారు. వీరితో పాటు ఒక ఇండిపెండెంట్ సభ్యుడు ఉన్నారు. అధికార పార్ట్టీకి చెందిన జెడ్పీటీసీసభ్యులంతా దాదాపుగా కొత్తవారు కాగా వైఎస్ఆర్ సీపీలో కొందరు రెండోసారి ఎన్నికైన వారున్నారు. కొత్తపాలకవర్గం నిర్వహించేతొలి సమావేశంలో ఎవరు ఏమడుగుతారో, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు, ఇంతకూ సమావేశం సామరస్యం గా జరుగుతుందా? లేక ఉద్రిక్త పరిస్థితుల్లో నడుస్తుం దా, ఒకవేళ అదే జరిగితే వారిని ఎదుర్కొనేదెలా? అని జెడ్పీ పాలకవర్గ సభ్యులు ఆలోచిస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ జెడ్పీటీసీ సభ్యుల్లో పరిపాలనపై అవగాహన వుం డేవారెవరు, వారు దేనిపై ఎక్కువగా మాట్లాడే అవకా శం వుంది, దాన్ని మనం ఎలా ఎదుర్కొవాలనే కోణం లో సంబంధిత అధికారులతో పాలకవర్గసభ్యులు ఇప్పటికే చర్చించి, ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఎవరు ఏమడి గినా సంబంధిత శాఖల అధికారులనే సమాధానం చెప్పమని సభకు అధ్యక్షత వహించే చైర్పర్సన్తో చెప్పించాలని, అప్పటికీ ప్రతిపక్ష సభ్యుల్లో ఆం దోళన తగ్గకపోతే రేపటి సమావేశంలో మీరడిగిన ప్రశ్నలకు సమాధానం రాతపూర్వకంగా ఇప్పించే చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్తో చెప్పిస్తే సరిపోతుం దనే నిర్ణయించుకున్నారని తెలిసింది. దృష్టంతా ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, నారాయణస్వామిపైనే జెడ్పీ సమావేశానికి జిల్లాలోని వైఎస్ఆర్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులతో పాటు ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. అధికార పార్టీకి కూడా ఆరుగురు ఎమ్మెల్యేలున్నప్పటికీ వారిలో ఒకరు సీఎం, ఇంకొకరు మంత్రి. వీరిద్దరూ రావడం కుదర దు. ఇకపోతే మిగిలింది నలుగురే. వారిలో ఒకరు త ప్ప మిగిలినవారంతా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనవారే. కాగా జెడ్పీటీసీ మాజీ సభ్యుడిగా జెడ్పీపై ప ట్టున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి, వైఎస్ఆర్ సీపీ జి ల్లా కన్వీనర్ నారాయణస్వామి సభకు అడ్డుపడతారనే గుబులు జెడ్పీ అధికారులతోపాటు పాలకవర్గాన్ని పట్టి పీడిస్తుంది. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మం ది ఉన్నా వారిలో చెవిరెడ్డి, నారాయణస్వామిపైనే అం దరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. సమస్యంతా స్థాయి సంఘాల ఏర్పాటులోనే జెడ్పీ పరిధిలో నిర్వహించే సర్వసభ్య సమావేశాలతో పాటు స్థాయి సంఘ సమావేశాలు కూడా జరగాల్సివుంది. అయితే సర్వ సభ్యసమావేశం, స్థాయి సంఘ సమావేశాలు వేర్వేరు తేదీల్లో జరుగుతాయి. జెడ్పీకి పా లకవర్గం ఏర్పడిన తర్వాత జరిగే తొలి సమావేశంలోనే స్థాయి సంఘాల సభ్యులను నియమించాల్సి ఉంది. ఒకటి, ఏడు సంఘాలు కీలకం కావడంతో వాటికి చైర్పర్సన్ ఆ సంఘాల చైర్పర్సన్గా నియమితులు కావ డం ఆనవాయితీ. మిగిలిన వాటికి కొన్నింటికి వైస్చైర్మన్ను, మరికొన్నింటికి అధికారపార్టీ జెడ్పీటీసీ సభ్యుల ను చైర్మన్లుగా నియమిస్తారు. అయితే ఈ స్థాయి సం ఘాల్లో అధికారపార్టీకి చెందిన వారే కాకుండా ప్రతి పక్షానికి చెందిన జెడ్పీటీసీ సభ్యులను కూడా చైర్మన్లతో పాటు సభ్యులుగా నియమించాల్సివుంది. వీటిలో ప్రా ధాన్యత లేని సంఘాలకు ప్రతిపక్షానికి చెందిన జెడ్పీటీసీ సభ్యులను నియమిస్తే దానిపై సభలో దుమారం లే చే పరిస్థితి లేక పోలేదు. ఇవన్నీ లేకుండా చేయాలంటే ఎలా వ్యవహించాలనే దిశగా అధికారులు ఆచితూచి అడుగులేస్తున్నారు. -
పైరుకు ప్రాణం పోసిన వరుణుడు
అరకులోయ/గొలుగొండ: నిన్నామొన్నటి వరకు చినుకు జాడలేక అల్లాడిన పైరులన్నీ మూడ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కళకళలాడుతున్నాయి. తీవ్రమైన ఎండలతో ఎండిపోయిన అవి మళ్లీ జీవం పోసుకున్నాయి. మన్యంలో మునుపెన్నడూ లేనివిధంగా గిరి రైతులు సామ విస్తారంగా సాగుచేశారు. రెండేళ్లుగా అతివృష్టి, అనావృష్టి కారణాలతో వివిధ రకాల పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయినవారు ఈసారి ప్రత్యామ్నాయంగా సామపై దృష్టి పెట్టారు. ఖరీఫ్ వరిపంట చేతికందే వరకూ సామలే వారికి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. మార్కెట్లో కిలో సామలు ధర రూ. 15 నుంచి రూ. 20 వరకు ఉంది. ఈ ఏడాది ఒక అరకులోయ మండలంలోనే సు మారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో సామ సాగు అవుతోందని వ్యవసాయ శాఖ అధికారు లు చెబుతున్నారు. అయితే తొలుత విత్తనాలు వేసినప్పటి నుంచి ఆశించిన స్థాయిలో వర్షం లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడటంతో వారు ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే ఇటీవలి ఎండలకు గొలుగొండ మండలంలో మొక్కజొన్న, చెరకు, కూరగాయల పంటలకు తీవ్రమైన నష్టం కలిగింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో వేసిన చెరకు నాట్లు అయితే మొలకె త్తిన పరిస్థితి లేదు. మేలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు మండలంలో 200 ఎకరాలుకుపైగా మొక్కజొన్న సాగు చేపట్టారు. అదీ ఎండలకు బాగా వాడిపోయింది. పెట్టుబడులన్నీ పోతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో వర్షం ఊరటనిచ్చింది. అలాగే ఏటిగైరంపేట, రావణాపల్లి, పుత్రగైరంపేట ప్రాంతాల్లో రైతులు వరి నారుమడులు సిద్ధం చేసుకొనే పనుల్లో నిమగ్నమవుతున్నారు. -
గుప్పుమన్న గంజాయి...
జిల్లాలో వేర్వేరు చోట్ల 332 కిలోల పట్టివేత ఏడుగురి అరెస్టు విశాఖ మన్యంలో గంజాయి కొనుగోలు చేసి అక్రమంగా తరలించుకుపోవడానికి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచే కాదు ఉత్తరభారతంలోని హర్యానా వంటి రాష్ట్రాలకు చెందినవారూ విఫలయత్నం చేశారు. నిఘా కన్నుగప్పి గుట్టుగా సాగుతున్న ఈ మత్తు వ్యవహారంపై అందిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం ఉదయం నుంచే చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు. ఫలితంగా జిల్లాలో పలుచోట్ల భారీగా గంజాయి పట్టుబడింది. దీన్ని తరలిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నర్సీపట్నం టౌన్: సుమారు రూ. 15 లక్షల విలులైన 252 కిలోల గంజాయిని సోమవారం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సీఐ జగన్మోహన్రావు కథనం ప్రకారం... అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం ఉదయం చింతపల్లి రోడ్డులోని ఏటిగైరంపేట చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఒక సుమో వాహనంలో గంజాయి బయటపడింది. ఈ గంజాయిని తరలిస్తున్న హైదరాబాద్కు చెందిన షేక్ కమాల్ (32), పగడాల ప్రకాశ్ (40)లను అదుపులోకి తీసుకొని ఎక్సైజ్ పోలీసులు విచారించారు. లంబసింగి ప్రాంతంలో ఈ సరకు కొనుగోలుచేసి, హైదరాబాద్కు తీసుకెళ్తున్నట్లు నిందితులు అంగీకరించారు. దీంతో వారిద్దర్నీ అరెస్టు చేశారు. ఈ గంజాయి విక్రయదారుల వివరాలు రాబట్టేందుకు దర్యాప్తు చేస్తున్నామని జగన్మోహన్రావు తెలిపారు. అలాగే గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. సోమవారం తనిఖీల్లో ఎస్సై శ్రీనివాసరెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నట్లు చెప్పారు. అరకు రూరల్: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఓ మహిళ సహా ముగ్గుర్ని అరకులోయ పోలీసులు పట్టుకున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతానికి చెందిన బల్కర్సింగ్ (39), రాజ్కుమార్ (45)లతో పాటు హర్ప్రీత్ (33) అనే మహిళ డుంబ్రిగుడ మండలం చాపరాయి వద్ద 22 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. దాన్ని ఆర్టీసీ బస్సులో తీసుకొస్తూ సోమవారం అరకులోయ నాలుగు రోడ్ల కూడలిలో దిగారు. అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ సీహెచ్ సోమయ్య వారిని ప్రశ్నించారు. దీంతో హర్ప్రీత్ అక్కడి నుంచి పరుగుతీయడంతో ఆటోవాలా సహాయం ఆమెను పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. పోలీసులు వారిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేపట్టారు. చోడవరం టౌన్ : చోడవరంలో సుమారు రూ. 1.80 లక్షల విలువైన 36 కిలోల గంజాయి దొరికింది. చోడవరంలో సోమవారం ఎస్సై ఎ.విజయ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఒక ఆటోను పక్కగా నిలిపేసి జారుకున్నారు. పోలీసులు దాన్ని పరిశీలించగా, ఇంజిన్, బోనెట్లో 36 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. జి.మాడుగుల: చింతపల్లి మండలం కుడుములసారి గ్రామానికి చెందిన కొర్రా రాజారావు రూ. 25 వేల విలువైన 12 కిలోల గంజాయిని విశాఖపట్నానికి తీసుకెళ్లేందుకు సోమవారం సాయంత్రం జి.మాడుగుల బస్టాండ్కు రాగా, పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకొని, కేసు నమో దు చేసినట్లు జి.మాడుగుల పీఎస్ ఎస్సై శేఖరం తెలిపారు. అనకాపల్లి రూరల్: గంజాయిని తరలిస్తున్న అనకాపల్లి మండలంలోని కె.ఎన్.ఆర్.పేటకు చెందిన పూడి బాజ్జీ అనే వ్యక్తిని సోమవారం అరెస్ట్ చేసినట్లు అనకాపల్లి ఎస్సై కోటేశ్వరావు తెలిపారు. నిందితుడు బాబ్జీ వద్ద పది కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
అటు కళకళఇటు విలవిల
మన్యంలో ఆశాజనకంగా వాన మైదానంలో చినుకు కరువు 24 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం కొన్ని మండలాల్లో సాధారణం కన్నా తక్కువ జిల్లాలో తొలకరి పరిస్థితి విచిత్రంగా ఉంది. ఏజెన్సీలో అడపాదడపా వర్షాలతో ఆదివాసీ రైతులు వరినాట్లుకు సిద్ధమవుతుంటే...మైదానంలో చుక్కతడి కనిపించకుండాపోతోంది. మన్యంలో వరినారుపోతలు జోరుగా సాగుతుంటే కొన్ని ప్రాంతాల్లో ఎండిన భూములు దర్శన మిస్తున్నాయి. ఈ నెలలో విశాఖ నగరంతో పాటు పాడేరు మండలంలోనే అధిక వర్షపాతం నమోదయింది. 24 మండలాల్లో అతి తక్కువ, కొన్ని మండలాల్లో తక్కువతో నిరాశపరిచింది. పాడేరు/నర్సీపట్నంరూరల్ : తొలకరికి మేలుమలుపుగా ఉండాల్సిన ఈ రోజుల్లో జిల్లాలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. రోజూ వర్షంతో ఏజెన్సీ తడిసి ముద్దవుతుంటే,మైదానంలో ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయి. మైదానంలో వానలు లేక రైతులు అల్లాడుతుంటే మన్యంలో మాత్రం భారీ వర్షం పడుతోంది. ఏజెన్సీలోని 11 మండలాల్లో మే నెలలో సరాసరి 1,318 మిల్లీమీటర్లు, జూన్ నెలలో 2,339 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గిరిజన రైతుల్లో ఆనందం నెలకొంది. ఎక్కడికక్కడ వ్యవసాయ భూముల్లో వర్షపునీరు చేరింది. లోతట్టు భూములు చెరువులను తలపిస్తున్నాయి. ఖరీఫ్కు ఈ వర్షాలు ఎంతో మేలు చేస్తాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. కాగా మే నెలాఖరు నుంచే రుతుపవనాలు అనుకూలిస్తాయని ఆశించిన మైదానంలోని రైతులకు నిరాశే ఎదురయింది. ఖరీఫ్పనులను దుక్కులతోనే సరిపెట్టుకునే దుస్థితి. జూన్లో సాధారణ వర్షపాతం 128.8 మిల్లీమీటర్లు. 54.4 మాత్రమే నమోదయింది. విశాఖ నగరంతో పాటు ఏజెన్సీ మండలాల్లోనే అధిక వర్షం పడింది. 24 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో సాధారణం కన్నా తక్కువ కురిసింది. మరో నాలుగు మండలాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. ఏజెన్సీలో మాత్రం రోజూ ముమ్మరిస్తోంది. జిల్లాలో ఎక్కువ మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఇప్పటికే వ్యవసాయశాఖ కమిషనర్ జిల్లా యంత్రాంగంతో సమీక్షించారు. వర్షాభావ పరిస్థితిని గమనించాలంటూ సూచించారు. ఇదే కాకుండా గ్రామ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మరో పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. -
గిరిజనుల దేవుడు ‘అల్లూరి’
ఈడేపల్లి (మచిలీపట్నం) : మన్యం వాసులకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అందించి వారిగుండెల్లో దేవుడైన అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయులకు సింహస్వప్నంగా నిలిచాడని డెప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు మచిలీపట్నం కృష్ణావిశ్వవిద్యాలయ ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా బుద్దప్రసాద్ పాల్గొని మాట్లాడారు. గిరిజనుల ఆశాజ్యోతిగా చరిత్ర ప్రసిద్ధిచెందిన సీతారామరాజు జయంతిని ప్రభుత్వ వేడుక గా నిర్వహించడం ముదావహమన్నారు. ధైర్యానికి, పరాక్రమానికి, తెలుగువారి పౌరుషానికి నిలువెత్తు నిదర్శనంగా అల్లూరి నిలిచాడని బీసీ సంక్షేమ, ఎక్సైజ్, చేనేత శాఖల మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. సీతారామరాజు అసమాన చరిత్ర పురుషుడని శ్లాఘించారు. అల్లూరిని ఆంగ్లేయులు కాల్చినప్పుడు ‘ఈ ఉద్యమం ఆగబోదు. ఎప్పటికైనా మీరు మాగడ్డ వదిలి పారిపోక తప్పదు. వందేమాతరం..వందేమాతరం’ అంటూ తుదిశ్వాస విడిచారని గుర్తుచేశారు. సీతారామరాజు స్ఫూరితో యువతరం ముందుకు సాగాలని కలెక్టర్ ఎమ్. రఘునందనరావు, ఎస్పీ జె ప్రభాకరరావు పేర్కొన్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు పాండురంగారావును అతిథులంతా దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమ ప్రారంభానికి ముందుగా అతిథులంతా అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనం గా నివాళులు అర్పించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి వి. వెంకయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ మురళీ, ట్రైనీ కలెక్టర్ సృజన, టీడీపీ నాయకుడు కొనకళ్ల బుల్లయ్య, రిజిస్ట్రార్ డి. సూర్యచంద్రరావు, మచిలీపట్నం డీఎస్పీ , ఆర్డీవో, తహసీల్దారులు శ్రీనివాసరావు, సాయిబాబా, నారదముని, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, పలుకళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. అల్లూరి జయంతి వేడుకల్ని పురస్కరించుకుని కృష్ణా విశ్వవిద్యాలయ(కేయూ) పరిధిలోని అన్ని కళాశాల్లో విద్యార్థులకు వక్తృత్వం, వ్యాసరచన, ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహించారు. వీటిలో విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. తెలుగు మీడియం విభాగం వక్తృత్వంలో ప్రథమ, ద్వితీయ బహుమతులు ఎమ్ఎల్ ఆదిత్య(కేయూ), వి. స్రవంతి (బాలసాయి డిగ్రీ కళాశాల ) పొందారు. వ్యాసరచనలో మొదటి రెండు బహుమతులను వి. స్రవంతి (బాలసాయి డిగ్రీ కళాశాల), రమ్య (పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల) కైవసం చేసుకున్నారు. ఇంగ్లిష్మీడియం విభాగం వక్తృత్వంలో సీహెచ్ లక్ష్మీభార్గవి (బాలసాయి డిగ్రీకళాశాల), జె. స్వర్ణలతా రాజ్ (పద్మావతి బీఈడీ కళాశాల) ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు. వ్యాసరచనలో మొదటి, రెండో స్థానాలు వరుసగా వీహెచ్ రమ్య(కేయూ), సీహెచ్ లక్ష్మీభార్గవి (బాలసాయి డిగ్రీ కళాశాల)సాధించారు. అల్లూరి సీతారామరాజు ఏక పాత్రాభినయం పోటీలో ప్రథమ, ద్వితీయ బహుమతులు వరుసగా కృష్ణావిశ్వవిద్యాలయానికి చెందిన ఎమ్.ఎల్. ఆదిత్య (ఎమ్ఏ తెలుగు), అనిల్కుమార్ (బయోటెక్నాలజీ) సాధించారు. రామరాజును ఆదర్శంగా తీసుకోవాలి నూజివీడు : బ్రిటీష్ సామ్రాజ్యంపై అలుపెరగని పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజును యువత ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పట్టణంలోని పీజీ కేంద్రంలో శుక్రవారం అల్లూరి జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉమా మాట్లాడుతూ నూజివీడు పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. నూజివీడు మామిడికి ఒక ట్రేడ్మార్కును ఏర్పాటుచేసి ప్రపంచదేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు. సబ్కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు మాట్లాడుతూ సీతారామరాజు దేశంకోసం ప్రాణాలు అర్పించిన గొప్ప త్యాగశీలి అన్నారు. విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పీజీ కేంద్రం ప్రత్యేకాధికారి బసవేశ్వరరావు, సీనియర్ సిటిజన్లు మంగరాజు, బత్తుల వీరమ్మ, నూజివీడు నూతన ఎంపీపీ తొమ్మండ్రు శ్రీనివాసరావు, ఐదోవార్డు కౌన్సిలర్ కందుల సత్యనారాయణ పాల్గొన్నారు. అంతా గోప్యం సీతారామరాజు జయంతుత్య్సవాలను పీజీకేం ద్రం ప్రత్యేకాధికారి మండవ వెంకట బసవేశ్వరరావు గోప్యంగా నిర్వహించుకున్నారు. రాష్ట్ర మంత్రి పాల్గొనే కార్యక్రమమైనా కనీసం సమాచారశాఖకు కూడా తెలియజేయలేదు. దీనిపై మీడియాకుకూడా తెలియజేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
కన్నీటి కథ ఇది..
పాడేరు : మన్యంలో వైద్య సేవలు కొనసాగుతూనే ఉంటాయి.. మలేరియాపై పోరుకు బహుముఖ వ్యూహం కొనసాగుతూనే ఉంటుంది. మరోవైపున నిర్భాగ్యుల ప్రాణాలు నేలరాలిపోతూనే ఉంటాయి. బుధ, గురు వారాల్లో ముగిసిపోయిన మూడు జీవితాలు ఈ దుర్భర పరిస్థితికి అద్దం పడుతున్నాయి. నెలలు నిండకుండానే పుట్టిన ఇద్దరు పసికందులు... వీరికి జన్మనిచ్చిన తల్లి గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయిన దయనీయ పరిణామాలు ఇక్కడి అభాగ్య పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మలేరియా మహమ్మారితోపాటు రక్తహీనత సమస్య కూడా తోడవడంతో పాడేరు ప్రాంతీయ ఆస్పత్రి సాక్షిగా వీరి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. ముంచంగిపుట్టు మండలం లబ్బూరు ఆరోగ్య కేంద్రం పరిధిలోని వనగుమ్మ గ్రామానికి చెందిన సీసా నీలమ్మ (25) కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతోంది. ఆరు నెలల గర్భవతి కావడంతో ఆమె పరిస్థితి మరింత విషమంగా మారింది. స్థానికంగా వైద్యసేవలు అందకపోవడంతో ఈ నెల 20న కుటుంబ సభ్యులు ఆమెను ముంచంగిపుట్టు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. వైద్యులు పరీక్షలు చేసి మలేరియాగా నిర్ధారించారు. మలేరియా నివారణకు మందులు ఇచ్చారు. అయినా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. రక్తహీనత సమస్య తోడైంది. బుధవారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో తరలించారు. ఇక్కడ వైద్యాధికారి శ్రీనివాసరావు, మిగిలిన వైద్యులు అత్యవసర వైద్యం అందించారు. రాత్రి 7 గంటల సమయంలో ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. బరువు తక్కువగా పుట్టిన వీరు అత్యంత బలహీనంగా ఉండటంతో వైద్య సేవలు కల్పించినా రాత్రి 11.30 సమయంలో మృతి చెందారు. తర్వాత తల్లిపరిస్థితి కూడా విషమంగా మారింది. కేవలం 4 శాతం హిమోగ్లోబిన్ మాత్రమే ఉండడంతో అత్యవసరంగా ఓ యూనిట్ రక్తం ఎక్కించారు. ఇంకా రక్తం అవసరమైనా, ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో ఉన్నత వైద్యసేవలకు కేజీహెచ్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా గురువారం ఉదయం 11 గంటల సమయంలో నీలమ్మ మృతి చెందింది. మృత శిశువులకు తండ్రి పాడేరులో అంతిమ సంస్కారం నిర్వహించిన కాసేపటికే తల్లి కూడా కన్ను మూయడం అందరినీ కదిలించింది. తల్లితోపాటు కడుపులో ఉన్న బిడ్డలకు కూడా మలేరియా సోకడం వల్లే ఈ మరణాలు సంభవించాయని అంటున్నారు. -
కేజీబీవీల్లో కుర్చీలాట
ఎస్వో, ఎంఈవోలతో సిబ్బంది సతమతం రికార్డులు అందజేయని పాత ఎస్వోలు సిబ్బందికి రాని రెండు నెలల జీతాలు కొయ్యూరు : మన్యంలోని 11 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లోనూ కుర్చీలాట కొనసాగుతుంది. గతంలో ఆయా పాఠశాలల్లో పనిచేసిన ప్రత్యేకాధికారి(ఎస్వో), కొత్తగా బాధ్యతలు అప్పగించిన వారి మధ్య వివాదం సాగుతోంది. కొయ్యూరులో డెప్యుటేషన్పై పనిచేసిన మాధురిని తొలగించినట్టుగా అధికారులు చెబుతుంటే ఆమె మాత్రం రికార్డుల్లో సంతకాలు చేస్తున్నారు. మరో రిజిష్టర్లో ఇంఛార్జీగా ఉన్న ఎంఈవో బోడం నాయుడు కూడా సంతకాలు చేస్తున్నారు. పాఠశాలలు తెరచినా ఇంత వరకు వంటపాత్రలు నుంచి ఇతర రికార్డులు ఏవీ కూడా పాత ఎస్వో అందజేయలేదు. దీంతో బాలికలు వస్తే ఎలా వంట చేయాలో తెలియక అక్కడ సిబ్బంది సతమతం అవుతున్నారు. దీనికితోడు ఈ యేడాది మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసిన ఏడుగురు బాలికలకు టీసీలు ఇచ్చేందుకు కూడా వాటి పుస్తకం లేదు. ఇప్పుడు ఆ పుస్తకం కోసం దరఖాస్తు చేశారు. మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన మాధురి డెప్యూటేషన్పై కస్తూరిబా ఎస్వోగా పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల డెప్యూటేషన్లపై వచ్చిన వారిని తొలగించింది. వారికి బదులుగా పదవీ విరమణ చేసిన వారిని లేదా నిరుద్యోగులను నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆమెను తొలగించారు. అయితే తనకు రావలసిన డైట్ బిల్లులపై ఆమె కోర్టును ఆశ్రయించడంతో వెంటనే వాటిని చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. తనకు బిల్లులు చెల్లించిన తరువాతనే మానేస్తానని, అంత వరకు మానేది లేదని ఆమె అంటూ క స్తూరిబాలో పనిచేశారు. రాజీవ్ విద్యా మిషన్ పీవో నగేస్ ఏప్రిల్లో ఎంఈవోలకు ఇంచార్జీ బాధ్యతలు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎంఈవో ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. 12 మంది సిబ్బంది ఉన్న కస్తూరిబాలో రోజూ ఎంఈవోతో పాటు పాత ఎస్వో కూడా సంతకాలు చేయడం విశేషం. పాత ఎస్వో ఎంఈవోకు ఇంత వరకు రికార్డులను, వంట పాత్రలను కూడా అందజేయలేదు. బాలికలు వస్తే వారిని ఆకలితో ఉంచాల్సి వస్తుందన్న భయం ఒక వైపు.. నిల్వల రిజిస్టర్లు లేనిదే తహశీల్దారు కార్యాలయం నుంచి విడుదల ఆదేశాలు(ఆర్వో) రాదని మరోవైపు భయపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఆర్వీఎం పీవో ఈ సమస్యలను చక్కదిద్దడంలో విఫలమయ్యారు. దీనిపై ఎంఈవో బోడం నాయుడును శుక్రవారం వివరణ కోరగా టీసీల కోసం లేఖ రాశామని, తనకు పాత ఎస్వో ఇంత వరకు రికార్డులు, ఇతర వస్తువులు అందజేయలేదని పేర్కొన్నారు. వాటిని ఆమె నుంచి తీసుకుని బాలికలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఆమె క్యాష్ పుస్తకం ఇస్తే సిబ్బంది జీతాలను కూడా చెల్లిస్తామన్నారు. ఏజెన్సీలోని అన్ని కస్తూర్బా పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
గంటాపై ముప్పేట దాడి
అటు కాంగ్రెస్ చెన్నా దాసు, ఇటు టీడీపీ రెబెల్ అనిత మరో పక్క ఇండిపెండెంట్ డాక్టర్ శ్రీనివాస్.. మాజీమంత్రికి తప్పని ఓట్ల చీలిక వైఎస్సార్ సీపీ అభ్యర్థి సీతారామ్కు అనుకూల పవనాలు పాపం..గంటా సారుకు భీమిలిలో తల బొప్పికట్టక తప్పేలా లేదు. గత్యంతరం లేక ఇక్కడ అసెంబ్లీ బరిలో నిల్చున్న మాజీ అమాత్యులపని కుడితిలో పడ్డ ఎలుకలా అయింది. కాంగ్రెస్ అభ్యర్థి చెన్నాదాసు, టీడీపీ రెబెల్ అనిత, స్వతంత్ర అభ్యర్థిడాక్టర్ శ్రీనివాస్.. ఈ త్రయం భారీగా ఓట్లను చీలుస్తుండటంతో శ్రీనివాసునికి చుక్కెదురు తప్పదన్నది దేశం శ్రేణుల భావన. మొత్తం మీద ఫ్యానుగాలి జోరుగా వీస్తుండటంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి సీతారామ్కు పరిస్థితి సానుకూలంగా ఉంది. తగరపువలస, న్యూస్లైన్ : భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది. కాంగ్రెస్ను వీడిన తరువాత జిల్లాలో ఎక్కడ నుంచి పోటీ చేయాలో చివరి వరకు తేల్చుకోలేక ఒకానొక దశలో పోటీ నుంచి విరమించుకోవడానికే నిర్ణయించా రు. అయితే చంద్రబాబు ఒత్తిడితో విశాఖ పార్లమెంట్కు పోటీ చే యాలని భావించినా వైఎస్సార్సీపీ నుంచి వైఎస్ విజయమ్మ పేరు ఖరారు కావడంతో ఆమెపై నెగ్గడం అంత ఆషామాషీ కాదని వెనక్కు తగ్గారు. అప్పటికే జిల్లాలో టీడీపీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారడంతో భీమిలి అయితే సేఫ్ అని భావించారు. ఇక్కడ మొదటి నుంచి టీడీపీకి అనుకూలంగా ఉన్న 20 వేలమంది మత్స్యకార ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి చెన్నా దాసు వెంట నడుస్తుండటంతో మొదటిసారి కంగుతిన్నారు. టీడీపీ రెబెల్గా దిగిన అనిత గంటాను పత్రికాముఖంగానే పార్టీకి పట్టిన శనిగ్రహమని తిట్టిపోయడంతో చెమటలు పట్టాయి. ఇక రాజు ఫౌండేషన్ పేరుతో భీమిలి నియోజకవర్గంలో పలుసేవా కార్యక్రమాలు చేపట్టిన ఎన్ఆర్ఐ కంటుభుక్త రామానాయుడు తన సోదరుడు డాక్టర్ శ్రీనివాస్ను ఇండిపెండెంట్గా పోటీకి దించారు. ఈయనకు కూడా నియోజకవర్గంలో మెజారిటీ సామాజికవర్గం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా మూడువైపులా టీడీపీ ఓట్లను చీల్చే ఈ ముగ్గురికీ తోడు ఇప్పటికే నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరపున వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకసారి, వైఎస్ విజయమ్మ మూడుచోట్ల నిర్వహించిన ప్రచారాలకు టీడీపీలో వణుకు పుట్టించింది. భీమిలిలో దాదాపు ఓటమి అంచున ప్రయాణిస్తున్న గంటా విశాఖ ఎంపీగా పోటీ చేసి విజయమ్మ చేతిలో ఓటమి పొందినా గౌరవం ఉండేదని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్పీలో చక్రం తిప్పి, కాంగ్రెస్లో మంత్రిగా అజమాయిషీ చెలాయించిన గంటా టీడీపీలో కూడా తన హవా కొనసాగించాలనుకుని మొదటిసారి తప్పుతోవ పట్టారని వినిపిస్తోంది. ఈ ఎన్నికల తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా, వైఎస్ విజయమ్మ విశాఖ ఎంపీగా ఎన్నిక కావడం దాదాపు ఖాయమని ఇప్పుడు కర్రి సీతారామ్ చేతిలో కూడా గంటా ఓటమి చెందితే తమ భవిష్యత్తు ఏమిటని దేశం శ్రేణులు మథనపడుతున్నాయి. ఎన్నికల తరువాత మళ్లీ నియోజకవర్గబాధ్యతలు మోసే నాయకుడు ఐదేళ్ల వరకు టీడీపీకి లభించరని తెలుస్తోంది. టీడీపీలో నియోజకవర్గం మీద అభ్యర్థి నుంచి కార్యకర్త వరకు తమ భవిష్యత్తుపైనే తలపట్టుకుని కూర్చున్నారు. -
తుది సమరం
ప్రాదేశిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత మారుమూల గూడేలకు గుర్రాలపై బ్యాలెట్బాక్సుల తరలింపు విశాఖ రూరల్/పాడేరు, న్యూస్లైన్ : మలి విడత ప్రాదేశిక సమరానికి రంగం సిద్ధమైంది. మన్యంలోని మారుమూల గూడేలకు బ్యాలెట్బాక్సులు, పోలింగ్ సిబ్బంది తరలింపునకు అధికారులు అష్టకష్టాలు పడ్డారు. పెదబయలు మండలం ఇంజరి సెగ్మెంట్లోని చీకుపనస, ఇంజరి కేంద్రాలకు ఎన్నికల సామగ్రి,సిబ్బందిని చేరవేసేందుకు గుర్రాలను ఆశ్రయించారు. స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో అంతటా భయానక వాతావరణం నెలకొంది. 17 మండలాల్లో 38 సమస్యాత్మక,73 అత్యంత సమస్యాత్మక, 189 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 572 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు గట్టి భద్రత చర్యలు చేపట్టారు. కొయ్యూరు మండలం యు.చీడిపాలెం, బూదరాళ్ళ, జీకేవీధి మండలం గుమ్మరేవుల, గాలికొండ, జర్రెల, వంచెల, దేవరాపల్లి, పెదవలస, చింతపల్లి మండలం కుడుముసారి, తమ్మెంగుల, జి.మాడుగుల మండలం లువ్వాసింగి, కోరాపల్లి, బీరం, బొయితిలి, పెదబయలు మండలం ఇంజరి, జామిగుడ, బొంగరం, ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు, కుమడ, లక్ష్మిపురం, రంగబయలు, బుంగాపుట్టు వంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు బ్యాలట్ పత్రాలు, బాక్సుల తరలింపు కత్తిమీద సామైంది. చాలా మంది సిబ్బంది కాలినడకనే పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఏర్పాట్లు పూర్తి : 17 జెడ్పీటీసీ, 273 ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జెడ్పీటీసీ స్థానాలకు 100 మంది, ఎంపీటీసీలకు 1062 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 6,84,825 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 3,33,545 మంది పురుషులు, 3,51,279 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరి కోసం మొత్తం 795 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1624 బ్యాలెట్ బాక్సులను వినియోస్తున్నారు. ఎన్నిల నిర్వహణకు 874 మంది పీవో, 874 మంది ఏపీవో, 2620 మంది వోపీవో మొత్తంగా 4368 మంది సిబ్బందిని నియమించారు. వీరు గురువారం మధ్యాహ్నం ఆయా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. వారి కోసం అధికారులు ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. 29 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ : సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉన్న పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ సరళిని జిల్లా కేంద్రం నుంచి స్వయంగా పర్యవేక్షించేందుకు 29 కేంద్రాల్లో ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అలాగే ఇంటర్నెట్ సదుపాయం లేని 519 కేంద్రాల్లో పోలింగ్ను వీడియో తీసేందుకు వీడియోగ్రఫర్లను, స్టాటిక్ ఫోర్స్ను నియమించారు. 41 కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లతో ప్రశాంతం వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నారు. రెవెన్యూ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్లు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు మే 7వ తేదీ తరువాత జరగనుంది. దీంతో అప్పటి వరకు బ్యాలెట్ బాక్సులను రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో భద్రపరచాలని అధికారులు నిర్ణయించారు. పోలింగ్ అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ఆయా మండలాల రిసెప్షన్ సెంటర్కు తీసుకువచ్చి అక్కడ నుంచి పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. అనకాపల్లి డివిజన్కు ఏఎంఏఎల్ కాలేజీలోను, నర్సీపట్నం డివిజన్తో పాటు పాడేరులో మూడు మండలాల బ్యాలెట్ బాక్సులను నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోను, పాడేరులో మిగిలిన 8 మండలాలకు సంబంధించి పాడేరు ప్రభుత్వ డిగ్రీకాలేజీలో స్ట్రాంగ్రూమ్లు ఏర్పాటు చేశారు. -
ఇండిపెండెంట్గా పోటీ చేస్తా..
కాజీపేట, న్యూస్లైన్ : కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలు చేసి తక్షణమే తనకు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ నాయకుడు రాజారపు ప్రతాప్ హెచ్చరించారు. కాజీపేట 36వ డివిజన్ సిద్ధార్థనగర్లోని ఆయన స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతాప్ మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం శ్రమిస్తున్న తనను అధిష్టానం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. అధికార పద వుల కోసం నిన్న, మొన్న పా ర్టీలో చేరిన వ్యక్తులకు ఎమ్మెల్యే టి కెట్లు కేటాయిం చడం విచారకరమన్నారు. 24 గంటల్లోగా తనకు పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని తెలిపారు. అలాగే జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థు ల ఓట మికి కృషి చేస్తామని హెచ్చరించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు బుధవారం స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా నామినేషన్ వేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎంపీపీ యాదగిరి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కె.నర్సింహరెడ్డి, నాయకులు దండం చంద్రమౌళి, జైపాల్రెడ్డి, అంజయ్య, స్వప్న, జగదీష్చందర్రెడ్డి పాల్గొన్నారు. ప్రతాప్ ఇంటిలో సిరిసిల్ల రాజయ్యకు పరాభవం.. స్టేషన్ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన రాజార పు ప్రతాప్ను బుజ్జగించేందుకు వరంగల్ ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సిద్ధార్థనగర్లోని ప్రతాప్ ఇంటికి రాజయ్య మంగళవారం తన అనుచరులతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ప్రతాప్ అనుచరులు రాజయ్యను అడ్డుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. రాజయ్య.. గోబ్యాక్.. అంటూ నిన దిస్తూ కాం గ్రెస్ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలను దహనం చేసి ఆందోళనకు దిగారు. పనిచేసే కార్యకర్తలకు కాం గ్రెస్లో స్థానం లేదని నిన్న, మొన్న వచ్చిన వ్యక్తులకు టిక్కెట్ ఎలా ఇస్తారంటూ ఒక దశలో బూతుపురాణం అందుకున్నారు. అయితే ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ఎంపీ అభ్యర్థి రాజ య్య ఎంత ప్రయత్నించినా వారు వినలేదు. దీం తో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. -
పులివెందులలో వైఎస్ఆర్ సీపీ బోణీ
11వ వార్డు అభ్యర్థి సుజాత ఏకగ్రీవం నామినేషన్లను ఉపసంహరించుకున్న అభ్యర్థులు పులివెందుల, న్యూస్లైన్ : వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో పోలింగ్కు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ బోణీ కొట్టింది. పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించి 11వ వార్డు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి పి.సుజాతనాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11వ వార్డులో టీడీపీ తరపున ఇద్దరు అభ్యర్థులతోపాటు ఇండిపెండెంటుగా ఒక అభ్యర్థి నామినేషన్లు వేశారు. బొగ్గుడుపల్లె, బసిరెడ్డిపల్లె, వెలమవారిపల్లె గ్రామాలు 11వ వార్డు పరిధిలోకి వస్తాయి. సుమారు 1300లకుపైగా ఓటర్లు ఉన్న ఈ వార్డులో వైఎస్ఆర్ సీపీ తరపున ఈనెల 13వ తేదీన రమేష్, శేఖర్నాయుడులతో కలిసి సుజాత నామినేషన్ వేశారు. సుజాత సరైన అభ్యర్థి అని భావించిన టీడీపీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు.. స్వతంత్య్ర అభ్యర్థి సోమవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో సుజాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగ్లవారం వరకు గడువు ఉండటంతో అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
ఇండిపెండెంట్గా పోటీ చేస్తా
ఆలూరు రూరల్, న్యూస్లైన్: వచ్చే ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని స్వర్గీయ కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు కుమార్తె బొజ్జమ్మ తెలిపారు. మంగళవారం ఆమె ‘న్యూస్లైన్’తో మాట్లాడుతూ గతంలో తన తండ్రి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. చివరికి ప్రాణాలను కూడా కోల్పోయారన్నారు. పదవులను ఆశించకుండా కేఈ బ్రదర్స్ రాజకీయ ఎదుగుదలకు అహర్నిశలు శ్రమించాడన్నారు. వారి విజయాల కోసం దేవనకొండ మండలంలో ప్రత్యర్థులతో పోరాడారన్నారు. తమ తండ్రి మరణానంతరం తాను రాజకీయాల్లో రాణించాలని ఉన్నా కేఈ బ్రదర్స్ అడుగడుగునా అడ్డుకట్ట వేస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలూరు టీడీపీ టికెట్ తనకు ఇప్పించాలని వారిని కోరినా పట్టించుకోలేదని విమర్శించారు. చివరికి చంద్రబాబునాయుడిని సోమవారం హైదరాబాద్లో కలిసి తనకు టికెట్ కేటాయించాలని కోరినా ఫలితం లేకపోయిందన్నారు. చంద్రబాబునాయుడు బీసీలను మోసం చేస్తున్నాడని ఆమె వాపోయారు. పార్టీని నమ్ముకున్న తన కుటుంబానికి, తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. ప్రజలు తనను ఆదరిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. -
మళ్లీ అలజడి
మన్యంలో మావోయిస్టుల బీభత్సం గుల్లేలులో పట్టపగలు పొక్లెనర్ దగ్ధం రోడ్డు మిల్లర్, సిమెంట్ పైపులు ధ్వంసం పనులు ఆపేయాలంటూ బ్యానర్లు బిక్కు బిక్కుమంటున్న ప్రజాప్రతినిధులు పెదబయలు, న్యూస్లైన్: మన్యం వాసులు మరోసారి ఉలిక్కి పడ్డారు. మావోయిస్టులు మళ్లీ ఉనికిని చాటుకోవడంతో మారుమూల పంచాయతీల సర్పంచ్లు, ఇతర ముఖ్య నా యకులు ఎప్పడేమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పెదబయలు, జి.మాడుగుల,ముంచంగిపుట్టు మండలాల్లో భయాం దోళనలు నెలకొన్నాయి. పెదబయలు మండ లం మారుమూల గుల్లేలు గ్రామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయం లో పట్టపగలు బీభత్సం సృష్టించారు. సాయుధులైన 30 మంది దళసభ్యులు రోడ్డు పనికి ఉపయోగించిన పొక్లెనర్ను పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. అలాగే మిల్లర్ను, కల్వర్టులకు ఉపయోగించే సిమెంటు పైపులను ధ్వంసం చేశారు. పొక్లెనర్తో పనులు నిర్వహిస్తుం డగా డ్రైవర్ను దింపి, దానిపై పెట్రోలు పోసి దగ్ధం చేశారు. పనులు నిలిపివేయాలని కూలీలను హెచ్చరించారు. ‘అభివృద్ధి అంటే అందరికీ అన్నం పెట్టేదిగా ఉండాలని, కాంట్రాక్టర్లు, దళారులకు ఉపయోగపడేదిగా ఉండకూడద ని, బాక్సయిట్ కంపెనీలకు ఉపయోగపడే రోడ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటాం’ అంటూ కోరుకొండ ఏరియా కమిటీ పేరిట బ్యానర్లు కట్టారు. రోడ్డు నిర్మాణానికి సహాకరిస్తున్న నాయకులు, దళారులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సుమారు గంటపాటు సంఘటనా స్థలంలో దళసభ్యులు చెలరేగిపోయినట్టు కూలీలు తెలిపారు. మూడేళ్లుగా మావోయిస్టులు ఈ మండలంలో రోడ్డు పనులకు ఎటువంటి ఆటంకం కల్పించలేదు. శుక్రవారం నాటి సంఘటనతో కాంట్రాక్టర్లు బిక్కు బిక్కు మంటున్నారు. గుల్లేలు పంచాయతీ కేంద్రం మినహా దాని పరిధిలోని మిగిలిన 11 గ్రామాలకు ఎంతో కాలంగా రోడ్డు సదుపాయం లేదు. ఈ రోడ్డు నిర్మాణం జరిగితే అన్ని గ్రామాలకు రహదారి సదుపాయం కలిగేది. మావోయిస్టుల చర్యలతో ప్రారంభంలోనే రోడ్డు పనులు నిలిచిపోయాయని పంచాయతీ ప్రజలు వాపోతున్నారు. మావోయిస్టుల చెరలో ఇద్దరు గిరిజనులు? పాడేరు: ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు అధికమవ్వడంతో గిరిజనులు భయాందోళనలు చెందుతున్నారు. పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి దళసభ్యులు ప్రజాకోర్టు నిర్వహించినట్టు ఆలస్యంగా తెలిసింది. ముఖ్యనేతలు ఈ ప్రజాకోర్టు నిర్వహించి,పలు హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. దీనికి హజరైన ముగ్గురు గిరిజనులను తమ వెంట తీసుకుపోయారు. వారిలో ఒకరయిన మాజీ సర్పంచ్ను హెచ్చరించి గురువారం విడిచిపెట్టారు. ఇంజరి పంచాయతీ సర్పంచ్ భర్త పూజారి సత్యారావు,అతని అనుచరుడు గెమ్మెలి మోహనరావులను తమ అధీనంలో ఉంచుకున్నట్టు తెలిసింది. మూడు రోజులుగా ఇద్దరినీ విడిచిపెట్టక పోవడంతో ఈ పంచాయతీలోని గిరిజనులంతా ఆందోళన చెందుతున్నారు. మూడు నెలల క్రితం కిల్లంకోట ప్రాంతంలోనూ మావోయిస్టుల ప్రజాకోర్టు నిర్వహించి మాజీ సర్పంచ్పై దాడి చేసిన విషయం తెలిసిందే. -
అంతంత మాత్రమే!
మన్యానికి అందని మందులు ఆశ కార్యకర్తల వద్ద ఔషధాల కొరత ఆరోగ్య కేంద్రాల్లోనూ అదే స్థితి గిరిజనులకు తప్పని ఇక్కట్లు పీహెచ్సీల వైద్యుల నిర్లక్ష్యం పర్యవసానం గోరంత దీపం కొండంత వెలుగన్నది ఆశ కార్యకర్తలకు అక్షరాలా సరిపోతుంది. మన్యంలో అనారోగ్యం చీకట్లు కమ్ముకున్న వేళ వారి చేయూత కారణంగా గిరిజనులకు ఎంతో ఊరట లభిస్తుంది. వ్యాధులు వేధిస్తూ ఉంటే, ఆశ కార్యకర్తల ద్వారా ప్రాథమిక వైద్యం సాధ్యమవుతుంది. కానీ ఆపాటి చికిత్సకూ వారి దగ్గర మందులు నిండుకుంటే? మారుమూల గ్రామాల్లో గిరిజనులకు ఆపాటి సాయం కూడా అందే దారేది? మన్యంలోని పీహెచ్సీల వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోంది. సకాలంలో మందులు సరఫరా కాక గిరిజనుల ఆరోగ్యం ఒడిదుడుకుల్లో పడేట్టు కనిపిస్తోంది. పాడేరు, న్యూస్లైన్: మన్యంలో గిరిజనులకు వైద్య సాయం అందేదే స్వల్పం.. అనారోగ్యం వేధిస్తున్నా చాలామందికి సాయం శూన్యం. కొద్దిపాటి చేయూత కూడా అందని పరిస్థితి ఏర్పడింది. ఏజెన్సీలోని గ్రామాలకు మందుల కొరత ఎదురవుతోంది. కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో కూడా పూర్తిస్థాయిలో మందుల నిల్వలు లేవు. ఏటా నాలుగు దఫాలుగా రూ. 3 కోట్ల బడ్జెట్తో మందులు విశాఖ సెంట్రల్ డ్రగ్స్టోర్ నుంచి అందాల్సి ఉంది. అయితే జనవరి మొదటి వారానికే చివరి విడత మందులు ఆరోగ్య కేంద్రాలకు చేరాల్సి ఉన్నప్పటికీ ఫిబ్రవరి నెలాఖరుకు కూడా ఏజెన్సీకి వైద్య ఆరోగ్యశాఖ నుంచి మందుల ఇండెంట్లు సెంట్రల్ డ్రగ్ స్టోర్కు చేరలేదు. దాంతో మూడో దఫాలో అక్టోబర్లో పంపిణీ చేసిన మందులనే ఆస్పత్రులు, గ్రామాల్లోని ఆశ కార్యకర్తలు వినియోగిస్తున్నా రు. పూర్తిస్థాయిలో మందుల నిల్వలు లేకపోవడంతో వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలకు వెళ్లే వైద్య బృందాల వద్దకు కూడా అరకొరగానే మందులు ఉంటున్నాయి. బాధ్యతారాహిత్యం ఏజెన్సీలోని 3,200 మంది ఆశ కార్యకర్తల వద్ద జ్వరం, విరేచనాల మందులు, యాంటిబయోటిక్ మాత్రలు పదుల సంఖ్యలోనే ఉంటున్నాయి. ప్రతీ నెల ఆశ కార్యకర్తలకు ఆరోగ్య కేంద్రాల్లో 50కి మించి జ్వరం నివారణ బిళ్లలు పంపిణీ చేయడం లేదు. దీంతో గ్రామాల్లో జనాభాకు తగ్గట్టుగా ఆశ కార్యకర్తల వద్ద మందులు ఉండడం లేదు. డిసెంబర్ రెండో వారానికే ఏజెన్సీలోని 36 ఆరోగ్య కేంద్రాల వైద్యులు చివరి దఫా మందుల ఇండెంట్ను వైద్య ఆరోగ్యశాఖకు, ఐటీడీఏ డ్రగ్స్టోర్లకు అందజేయాల్సి ఉన్నప్పటికీ ఫిబ్రవరి ముగుస్తున్నా చాలా చోట్ల నుంచి ఇండెంట్ అందలేదు. కిలగాడ, ముంచంగిపుట్టు, సుంకరమెట్ట, అనంతగిరి, భీమవరం, యు.చీడిపాలెం, ధారకొండ, డౌనూరు, కె.డి.పేట, కంఠవరం, లుంగపర్తి తదితర పీహెచ్సీల నుంచి మందుల ఇండెంట్ను వైద్యులు పంపలేదు. సమయానికి మందులు రప్పించుకోవాల్సిన బాధ్యతను కూడా కొంతమంది వైద్యులు విస్మరిస్తున్నారు. అన్ని ఆస్పత్రుల నుంచి ఇండెంట్లు వస్తేనే పాడేరు డ్రగ్స్టోర్ నుంచి అధికారులు ఈ మందుల వివరాలను ఆన్లైన్ చేసి విశాఖపట్నంలోని సెంట్రల్ డ్రగ్స్టోర్కు పంపుతారు. అక్కడినుంచి మందులను పాడేరుకు తరలిస్తారు. అయితే ఇండెంట్ లేక పాడేరు డ్రగ్స్టోర్ అధికారులు కూడా సమయానికి మందులు తెప్పించలేకపోయారు. మందులు పుష్కలంగా అందుబాటులో ఉంచామని అధికారులు ప్రకటిస్తున్నా బడ్జెట్ ప్రకారం సమయానికి మందులను కూడా పొందలేని పరిస్థితిలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఉన్నారు. -
వేటగాళ్ల ఉచ్చులో ఆలుగులు
మన్యంలో విసృ్తతంగా వేట బలైపోతున్న వన్యప్రాణులు గూడెంకొత్తవీధి, న్యూస్లైన్ : అడవుల్లో కనిపించే అరుదైన ఆలుగులు వేటగాళ్ల ఉచ్చులకు చిక్కుతున్నాయి. ఆలుగు వీపుపై ఉండే పెంకుల్లాంటి చిప్పలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు ఆలుగుల వేటకు గిరిజనులను ప్రోత్సహిస్తున్నారు. శరీరంపైన గట్టిగా పొలుసుల మాదిరిగా ఉంటాయి. కిలో చిప్పలకు రూ.3-4 వేలు ధర పలుకుతుంది. ఇదే అంతర్జాతీయ మార్కెట్లో రూ.25 వేల వరకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఇవి పగలంతా నేలలో బొరియల్లో నివసిస్తూ రాత్రి సమయాల్లోఆహారం కోసం బయటికి వస్తుంటాయి. ఇవి సొంతంగా బొరియలు తయారు చేసుకుని వాటిలో నివాసం ఉంటాయి. అయితే ఈ బొరియలను బట్టి వాని నివాసాలను గిరిజనులు గుర్తించి వేటాడుతున్నారు. ఆ బొరియల్లో మంటలు పెడతారు. ఈ పొగకు తాళలేక అవి బయటకురాగానే పట్టుకుంటారు. అంతేకాకుండా బొరియల వద్ద ఉచ్చులు అమర్చడం ద్వారా సైతం వాటిని పట్టుకుంటారు. ఒక్కో ఆలుగుపై 3-5 కిలోల చిప్పలు లభ్యమవుతాయి. ఈ ఆలుగుకు అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా లక్ష వరకూ ధర ఉంటుందని తెలుస్తోంది. దీంతో స్మగ్లర్లు వాటి కోసం గిరిజనులను మచ్చిక చేసుకుంటున్నారు. అంతరించిపోతున్న ఈ అరుదైన జీవుతను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.