-
ఈటలా.. నువ్వే గెలుస్తావ్.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో కాకరేపుతున్నాయి. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మల్లారెడ్డిలు ఓ పెళ్లి వేడుకలో కలుసుకున్నారు. ఈటలను చూసిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన వద్దకు వెళ్లి నువ్వే గెలుస్తున్నవన్నా అంటూ చేసిన వైరల్గా మారాయి.ఈటలను అలింగనం చేసుకోవడమే కాక, ఫోటో తీయండయ్య అన్న తోటి అంటూ ఉత్సాహంగా ఫొటోలు దిగారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. మల్కాజిగిరిలో బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ పడుతుండగా, కాంగ్రెస్ నుంచి పట్నం సునితా మహేందర్రెడ్డి బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతున్న తరుణంలో బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి తమ ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటలనే గెలుస్తున్నారంటూ చెప్పడం చర్చాంశనీయంగా మారింది. -
ఏపీ రాజకీయాలపై హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
గవర్నర్గా హ్యాండిల్ చేయలేననుకున్నారు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/రాయదుర్గం/నిజామాబాద్ అర్బన్: ‘నన్ను గవర్నర్గా నియమించినప్పుడు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని (న్యూబార్న్ బేబీ) హ్యాండిల్ చేయలేనని అందరూ అనుకున్నారు.. కానీ ఓ గైనకాలజిస్టుగా న్యూబార్న్ బేబీకి ఎలా చికిత్స చేయాలో నాకు తెలుసు.. అలా గే పుదుచ్చేరి గవర్నర్గా అదనపు బాధ్యతలు ఇచ్చి నప్పుడు కూడా రెండు రాష్ట్రాలను ఎలా హ్యాండిల్ చేస్తారని అన్నారు.. ఓ డాక్టర్గా ట్విన్స్ (తెలంగాణ, పుదుచ్చేరి)కు ఎలాంటి చికిత్స చేయాలో కూడా తెలుసు.. నాకు ఈ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది చదువే..’అంటూ గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ–హైదరాబాద్లో క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలో మరో రెండు జాతీయ విద్యాసంస్థల్లో భవనాలను ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటీ–హెచ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళిసై ప్రసంగించారు. ప్రభుత్వం ఉన్నత మౌలిక సదుపాయాలతో నెలకొల్పుతున్న ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు దేశం కోసం ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని గవర్నర్ పిలుపునిచ్చారు. సేవా రూపంలో గానీ, నూతన ఆవిష్కరణల రూపంలో గానీ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని సూచించారు. కొలనులో నీటిమట్టం పెరిగితే కమలం పువ్వు పైపైకి వచ్చినట్లుగానే.. సమాజంలో విద్యా సంబంధిత మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందితే.. ప్రజల జీవన ప్రమాణాలు కూడా పైపైకి వస్తాయని వివరించారు. గతంలో ఈ ఆస్తులను తన తండ్రి సంపాదించి ఇచ్చారని పిల్లలు చెప్పుకునే వారని, ఇప్పుడు పరిస్థితి మారిందని, కుటుంబ బాధ్యతలను పిల్లలే తీసుకుంటున్నారని, ఇది ఒక్క విద్యతోనే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, ఐఐటీహెచ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి పాల్గొన్నారు. ‘మనూ’లో రూ.64.41 కోట్లతో భవనాలు మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ)లో రూ.64.41 కోట్ల వ్యయంతో నిర్మించిన వివిధ భవనాలను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. రాయదుర్గం క్యాంపస్లో రూ.11.19 కోట్లతో నిర్మించిన రెండంతస్తుల కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం భవనాన్ని, రూ.25 కోట్లతో మూడంతస్తుల ఇంజనీరింగ్ వర్క్షాప్ భవనాన్ని. రూ.28.22 కోట్లతో నిర్మించిన ఒడిశా కటక్లోని ‘మనూ’పాలిటెక్నిక్ భవనాన్ని మోదీ జాతికి అంకితం చేశారు. ‘మనూ’క్యాంపస్లో నిర్వహించిన ప్రత్యక్ష ప్రత్యేక కార్యక్రమంలో వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్, ఇతర ప్రొఫెసర్లు పాల్గొన్నారు. నిజామాబాద్లో కేవీ నూతన భవనం నిజామాబాద్లో కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నిజామాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ నిజామాబాద్లో 7.5 ఎకరాల్లో రూ. 22 కోట్లు వెచ్చించి అన్ని వసతులతో కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశమంతటా కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటుచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
భర్త, మెగా ఫ్యామిలీపై మెగా కోడలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
కేశినేని నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్
-
రష్మికపై మాజీ లవర్ సంచలన కామెంట్స్ వైరల్
-
ఆ సత్తా ఎన్టీఆర్ కే ఉంది..
-
చిరంజీవిపై ఎమ్మెల్యే ద్వారంపూడి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, కాకినాడ: చిరంజీవిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని అనుకోవడం లేదన్నారు. ‘‘రాజకీయాలకు సరిపోననుకునే మళ్లీ సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. సినిమాల ద్వారా చిరంజీవి ప్రజల్ని అలరించడం మంచి పరిణామం. సినిమాల్లోనే చిరంజీవికి సౌకర్యంగా ఉంది’’ అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి చురకలు అంటించారు. చదవండి: చిరంజీవి ఎందుకు ఉలిక్కిపడ్డారు? అదన్న మాట అసలు సంగతి! మరోవైపు చిరంజీవిపై ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. సినిమా స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ అని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే అంటూ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. చదవండి: చిరంజీవి ఎందుకు ఉలిక్కిపడ్డారు? అదన్న మాట అసలు సంగతి! -
మీరిప్పుడున్నది సముచిత స్థానం కానీ..
పుణే: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు నేతలు ఆదివారం పుణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒకే వేదికపై ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘చాలా కాలం తర్వాత మీరిప్పుడు సరైన స్థానంలో ఉన్నారు. కానీ, చాలా ఆలస్యమైంది’అని పేర్కొన్నారు. ‘అజిత్ పవార్తో కలిసి నేను పాల్గొన్న మొట్టమొదటి కార్యక్రమమిది. ఈ సందర్భంగా ఆయనకు ఒక విషయం చెప్పదల్చుకున్నా. చాలా కాలం తర్వాత ఆయన ఇప్పుడు సముచిత స్థానానికి చేరుకున్నారు. ఆయన ఎప్పుడూ ఇదే స్థానంలోనే ఉండటం సబబు. కానీ, ఈ స్థానంలోకి ఆయన చాలా ఆలస్యంగా వచ్చారు’ అని అమిత్ షా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు. నెల క్రితం ఎన్సీపీనీ చీల్చిన అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. అజిత్ పవార్కు డిప్యూటీ సీఎం పదవితోపాటు ఆయన వర్గానికి మంత్రి పదవులు దక్కిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఇండియాకి ఒక్క సెషన్ చాలు రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు
-
షరతులకు అంగీకరిస్తే సంకీర్ణానికి సిద్ధం
శివాజీనగర: ఈసారి కూడా ఫలితాలు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు లేకపోవటంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం హెచ్.డీ.కుమారస్వామి తమ షరతులకు ఆమోదిస్తే సంకీర్ణానికి సిద్ధమనే సందేశాన్ని పంపినట్లు తెలిసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కుమారస్వామి...తమకు 50 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తాము విధించే షరతులకు అంగీకరించే పార్టీలతో పొత్తు సిద్ధమని తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వం ద్వారా రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి..పలు పర్యాయాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఈ నేపథ్యంలో పొత్తుల విషయంలో ఈసారి స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. జేడీఎస్ ఎమ్మెల్యేలకు జలవనరుల, విద్యుత్, ప్రభుత్వ పనుల శాఖలు ఇవ్వాలి. జేడీఎస్ ప్రణాళికా అంశాలను అమలులోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఇవ్వాలని తదితర షరతులు పెట్టనున్నట్లు తెలిసింది. -
భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు మాట్లాడుతూ, సీఎం జగన్ విజన్, లీడర్షిప్, పాలసీలు, ఆలోచనలు, మౌలికసదుపాయాల కల్పనపై పెడుతున్న దృష్టిని ఆయన అభినందించారు. జీఎంఆర్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. అందరికీ నమస్కారం.. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రపంచంలో చాలా ఎయిర్పోర్ట్లు కట్టాను. కానీ మా సొంత ఊరు రాజాం. వైజాగ్ రెండో ఊరు. నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్.. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఫౌండేషన్ వేశారు. ఆయనే సీఎంగా ఉండగానే ప్రారంభించారు.. రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇనాగ్యురేషన్కి కూడా వైఎస్సార్ వచ్చారు.. ఈ రోజున భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ ఆయన తనయుడు జగన్ తన అమృత హస్తాలతో శంకుస్ధాపన చేయడం, వారే మళ్లీ ఇనాగ్యురేట్ చేయాలని భగవంతున్ని కోరుకుంటున్నాను. చదవండి: అటు అదానీ డేటా సెంటర్.. ఇటు భోగాపురం ఎయిర్పోర్టు సీఎం జగన్ విజన్, లీడర్షిప్, పాలసీలు, ఆలోచనలు, మౌలికసదుపాయాల కల్పనపై పెడుతున్న దృష్టి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీ, సీ పోర్ట్లు, ఎయిర్పోర్ట్ల కనెక్టివిటీపై చేసిన పాలసీ, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో వచ్చిన పెట్టుబడులపై సీఎం గారికి నా అభినందనలు. ఆ సమావేశం ఒక అద్భుతం. నేను కూడా అందులో భాగస్వామ్యం అయ్యాను. ప్రపంచంలో మాకిది 12వ ఎయిర్పోర్ట్.. హైదరాబాద్, గోవా తర్వాత మేం నిర్మిస్తున్న మూడో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ప్రపంచస్ధాయి ప్రమాణాలతో మేం నిర్మిస్తాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేసిన కొత్తలో 1999–2000 లో 7 ఎయిర్క్రాఫ్ట్లు ఉండగా, ఇప్పుడు 500కు చేరాయి. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ఎకానమీనే మారిపోయింది. అదే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా కడతాం.. ఇక్కడ కార్గో కూడా ఉండడం వల్ల రైతులకు, మత్స్యకారులకు, ఫార్మా ఇండస్ట్రీకి ఎగుమతులకు ఉపయోగకరంగా ఉంటుంది.. ఇక్కడి సంస్కృతిని చూసి ఈ ఎయిర్పోర్ట్ డిజైన్ చేశాం. మేం ఢిల్లీ ఎయిర్పోర్ట్ తీసుకున్నప్పుడు అధ్వానంగా ఉండేది.. దానిని నెంబర్ వన్ ఎయిర్పోర్ట్గా మార్చాం.. అదే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ను చేస్తాం, భగవంతుడు కూడా వర్షం రూపంలో మనల్ని దీవించారు.. నేను జీఎంఆర్ తరపున 36 నెలల్లో నెంబర్ వన్ ఎయిర్పోర్ట్ కడతానని హామీ ఇస్తున్నాను, మీరే మళ్ళీ ప్రారంభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిరకాల వాంఛ నెరవేరింది: నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అందరికీ నమస్కారం, భోగాపురం ఎయిర్పోర్ట్ చిరకాల వాంఛ. గత ప్రభుత్వం 15 వేల ఎకరాల భూసేకరణ కావాలని ప్రజలందరినీ ఇబ్బంది పెడితే నాడు సీఎం జగన్ మన ప్రాంతానికి వచ్చి మన పక్షాన పోరాడి.. అన్ని వేల ఎకరాలు అవసరం లేదని, 3 నుంచి 5 వేల ఎకరాలతో ఎయిర్పోర్ట్ కట్టవచ్చని మన తరుపున పోరాడారు. 2019లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంగారి చొరవతో అందరికీ నష్టపరిహారం ఇచ్చి, కేసులు ఎత్తివేసి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తున్నారు. సీఎం మాట తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నారు. గతంలో వైఎస్సార్ ఉన్నప్పుడు తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ ఆవశ్యకత చెప్పగానే ఆయన మంజూరు చేశారు. చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు కూడా శంకుస్ధాపన చేస్తున్నారు. స్ధానికంగా ఉన్న కొన్ని సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుకుంటున్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్కు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ప్రకటించాలని.. మా ప్రాంత ప్రముఖులు కొమ్మూరు అప్పడుదొర, పెనుమత్స సాంబశివరాజు గారి పేర్లు పెట్టేందుకు అవకాశం ఉంటే పరిశీలించాలని కోరుతున్నాను. చదవండి: ‘మార్గదర్శి’ జూమ్ మీటింగ్లో ఏం జరిగింది?.. బ్లాక్ మనీ వైట్గా ఎలా మారుతోంది? పాలకులు మంచి వారు అయితే ప్రజలు బాగుంటారు, ఆర్ధిక సమస్యలు ఉన్నా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్, సీఎంగా చిరకాలం సీఎంగా ఉంటే మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి. మల్లికార్జునరావు మన ప్రాంత వాసి. ఆయన సొంత ఊరు రాజాం కూడా విజయనగరం జిల్లాలో ఉంది. జీఎంఆర్ గారు కూడా ఇప్పుడు మా జిల్లా వాసే, ధన్యవాదాలు. -
డైరెక్టర్తో ఏడేళ్లు ప్రేమ, పెళ్లి.. చలపతిరావు వల్లే బతికి బయటపడ్డాను: నటి
సినీ, టీవీ నటి జయలలిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటిగా వెండితెరపై మెప్పించిన ఆమె నెగిటివ్, కమెడియన్, గ్లామర్ రోల్స్తో మంచి గుర్తింపు పొందారు. తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాలు చేసిన ఆమె కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత జంబలకిడి పంబా, ఆ ఒక్కటి అడక్కు వంటి సినిమాల్లో కామెడీ పాత్రలు కూడా చేశారు. అందాల తారగానూ గుర్తింపు పొందిన ఆమె స్టార్ నటిగా ఎదిగారు. ఇక ఆర్థికంగానూ సెటిలైన ఆమె కెరీర్ పీక్స్లో ఉండగానే మలయాళ డైరెక్టర్ వినోద్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడితో ఏడేళ్లు ప్రేమలో మునిగితేలిన ఆమె ఇంట్లో వాళ్లని ఎదిరించి ఆయనతో ఏడడుగుల వేశారు. చదవండి: మై స్వీట్ బ్రదర్ అంటూ ఆసక్తికర ఫొటో షేర్ చేసిన మంచు మనోజ్ అయితే ఆ పెళ్లి మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. పెళ్లయిన వారం రోజులకే భర్త నిజస్వరూపం భయపడింది. అతడి వేధింపులు తట్టుకోలేక ఏడాది తిరక్కుండానే విడాకులు తీసుకున్నట్లు గతంలో ఆమె సాక్షికి ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించారు. తాజాగా ఆమె పాత వీడియో వైరల్గా మారింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఓ మూవీ సమయంలో వినోద్తో పరిచయం ఏర్పడింది. ఓ సంఘటనలో ఆయన నన్ను సేవ్ చేశాడు. దీంతో అతడికి కనెక్ట్ అయ్యాను. ఏడేళ్లు ప్రేమించుకున్నాం. కానీ ఆయనను పెళ్లి చేసుకోవద్దని సీనియర్ నటుడు చలపతి రావు, ప్రొడ్యూసర్ జయకృష్ణగారు నన్ను హెచ్చరించారు. ఇక పెళ్లి చేసుకోవాలా? వద్దా? అని ఆలోచిస్తుంటే చచ్చిపోతానంటూ ఆయన నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకోకపోతే విషం తాగి చచ్చిపోతానన్నాడు. దాంతో నా మనసు కరిగి పెళ్లికి ఒప్పుకున్నా. మా ఇంట్లో వాళ్లు ఆయనతో పెళ్లికి అసలు ఒప్పుకోలేదు. దీంతో ఓ గుడిలో పెళ్లి చేసుకున్న. ఇష్టం లేకపోయిన మా వాళ్లు ఆ పెళ్లికి వచ్చారు. అయితే కట్నం ఇవ్వడానికి నా పుట్టింట వాళ్లు ఓ అగ్రిమెంట్ రాయించుకున్నారు. పిల్లలు పుట్టాకే నాకు చెందాల్సిన ఆస్తి ఇస్తామంటూ బాండ్ పేపర్పై నాతో సంతకం చేయించుకున్నారు. పెళ్లయిన వారం రోజులకు ఇది ఆయనకు తెలిసింది. దీంతో నువ్వు ఎందుకు సంతకం చేశాడు.. ఆ బాండ్ క్యాన్సిల్ చేసుకోమంటూ నన్ను వేధించాడు. చదవండి: ఇటీవల భార్యకు ఆ హీరో విడాకులు.. ఇప్పుడు మీనాతో రెండో పెళ్లి! నటుడు సంచలన వ్యాఖ్యలు ఇక అప్పుడే అర్థమైంది ఆస్తి కోసమే ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడని. అలా మూడు నెలలు పంటికింద బాధలను భరించాను. ఆ తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయి. ఇక నీకు నాకు సెట్ అవ్వదు విడిపోదామని చెప్పా. ఏడాది కాకముందే విడిపోయాం. చివరి రోజుల్లో ఆయన నన్ను ఇంట్లో బంధించాడు. యాసిడ్ పోస్తా, చంపేస్తానంటూ చాలా వేధించాడు. నన్ను హౌజ్ అరెస్ట్ చేస్తే చలపతి రావు గారు, గోపాలకృష్ణ నన్ను ఆ ఇంటి నుంచి విడిపించారు. వారే లేకపోతే ఆ ఇంటిలోనే నేను ఏమైపోయేదాన్నో’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. వైవాహిక జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి గతంలో జయలలిత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మంచు విష్ణుతో గొడవపై స్పందించిన మంచు మనోజ్.. ఏమన్నాడంటే..
మంచు వారసుల వివాదం ఇటీవల ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచింది. తన అన్న, మా అధ్యక్షుడు మంచు విష్ణు తన అనుచరులతో గొడవ పడుతున్న వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఇళ్లలోకి వచ్చి ఇలా కొడుతుంటాడు మా వాళ్లను, బంధువులను.. ఇది సిచ్యువేషన్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే కాసేపటికే ఆ వీడియోను మనోజ్ డిలిట్ చేయడం గమనార్హం. తండ్రి మోహన్ బాబు సీరియస్ అవ్వడంతో మనోజ్ ఆ వీడియోను తొలగించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా వివాదంపై మనోజ్ స్పందించాడు. ఓ మూవీ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న మనోజ్కు అన్న మంచు విష్ణు వీడియోపై స్పందించాల్సిందిగా విలేకర్లు ప్రశ్నించారు. దీనికి మనోజ్ స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇది నన్ను అడగకండి. నాకంటే అది మీడియాకే ఎక్కువ తెలుసు. వారినే అడగండి. నన్ను అడగోద్దు’ అంటూ సరదాగా కామెంట్స్ చేశాడు. అనంతరం మాట్లాడుతూ.. ‘నాకు సినిమానే లైఫ్, మీరే నా జీవితం. సినిమా లేకపోతే నాకు ఏం లేదు. మళ్లీ వస్తున్నా. వాట్ ద ఫిష్తో త్వరలోనే మీ ముందుకు వస్తున్నా. నాకు మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలి, ఇటివలె కొత్త జీవితం ప్రారంభించాను. మీ అందరు ఆశీర్వాదించి మాకు సంతోషకరమైన జీవితాన్ని ఇస్తారని కోరుకుంటున్నా’ అంటూ ముగించాడు. చదవండి: మంచు బ్రదర్స్ గొడవలో మూడో వ్యక్తి.. ఎవరీ సారథి? అసలేం జరిగింది.. గర్వంగా ఉంది నాన్న.. తనయుడికి చిరు స్పెషల్ విషెస్ -
అప్పుడు సో కాల్డ్ అంటూ కామెంట్స్.. ఇప్పుడు ఏకంగా రక్షిత్కి క్రెడిట్..
స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం చేతి నిండ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో పుష్ప 2తో పాటు హిందీలో పలు ప్రాజెక్ట్స్ చేస్తోంది. కన్నడ నటి అయిన రష్మిక తెలుగులో చక్రం తిప్పుతొంది. ఇక ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తాజాగా ఓ ఇంటర్య్వూలో చేసిన కామెంట్స్ హాట్టాపిక్గా నిలిచాయి. గతంలో తనకు నటిగా తొలి అవకాశం ఇచ్చిన ప్రొడక్షన్ హౌజ్ పేరు చేప్పేందుకు ఆసక్తి చూపని ఆమె ఏకంగా తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టికి క్రెడిట్ ఇచ్చింది. దీంతో రష్మిక కామెంట్స్ దక్షిణాన చర్చనీయాంశమయ్యాయి. చదవండి: ఐశ్వర్య ఇంట్లో చోరీ.. ఆ డబ్బుతో చెన్నైలో ఇల్లు, లగ్జరీ వస్తువులు కొన్నారు.. ఈ మేరకు తాజా ఇంటర్య్వూలో రష్మిక మాట్లాడుతూ.. ‘‘నేను నటిని అవుతానని ఎప్పుడు అనుకోలేదు. కానీ, చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. అందుకే నటిని కావాలని కొన్ని సినిమా ఆడిషన్స్కు వెళ్లేదాన్ని. నిరాశతో వెనక్కి వచ్చేదాన్ని. నటన అనేది నాకు సెట్ కాదని, అది నాకు రాసి పెట్టి లేదని అనుకునేదాన్ని. అలాంటి సమయంలో ఓ అందాల పోటీలో పాల్గొన్నా. ఈ పోటీలో గెలిచి టైటిల్ సొంతం చేసుకున్నా. దీంతో నా ఫొటో అన్ని పత్రికల్లో వచ్చింది. దానిని చూసి పరంవా స్టూడియోస్ (రక్షిత్ శెట్టికి సంబంధించిన నిర్మాణ సంస్థ) నుంచి కాల్ వచ్చింది. వాళ్లు తెరకెక్కిస్తోన్న ‘కిరిక్ పార్టీ’లో నాకు లీడ్ రోల్ ఆఫర్ చేశామని దర్శక- నిర్మాతలు చెప్పారు. అలా, నటిగా నా తొలి అడుగు పడింది’’ అని రష్మిక చెప్పుకొచ్చింది. చదవండి: రష్యా అధ్యక్షుడు పుతిన్ను విమర్శిస్తూ పాట పాడిన ప్రముఖ సింగర్ కన్నుమూత కాగా కాంతార మూవీ సమయంలో రష్మిక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఓ ఇంటర్య్వూలో నటిగా తనకు కెరీర్ ఇచ్చిన ప్రొడక్షన్ హౌజ్ చెప్పకుండ సో కాల్డ్ ప్రొడక్షన్ అని వ్యాఖ్యానించింది. దీంతో కన్నడ నాట ఆమె తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. శాండల్వుడ్ సినీప్రముఖులు సైతం రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె నిర్మాణ సంస్థ పేరు చెప్పడంతో ఎట్టకేలకు రష్మిక దిగొచ్చిందంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే ఆమె ఫ్యాన్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా కిరిక్ పార్టీ సమయంలో ప్రేమలో పడిని రక్షిత్ శెట్టి-రష్మికలు ఎంగేజ్మెంట్ చేసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. -
తారక్ వండర్ కిడ్: ఎన్టీఆర్పై శుభలేఖ సుధాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఈ సినిమాలోని నాటు నాటు ఆస్కార్ రావడంతో గ్లోబల్ స్టార్గా ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ఆయనతో పని చేసిన ప్రతి నటీనటులు తారక్ డాన్స్, నటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. ఎన్ని పేజీల డైలాగ్ అయినా సింగిల్ టేక్లో చెప్పేస్తుంటాడంటూ సర్ప్రైజ్ అవుతుంటారు. అలాగే సీనియర్ నటుడు శుభలేక సుధాకర్ కూడా తారక్ నటన, డైలాగ్ డెలివరి గురించి చెబుతూ వండర్ కిడ్ అని కొనియాడారు. ‘అరవింద సమేత’ సినిమాలో ఎన్టీఆర్తో ఆయన స్క్రిన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘రానా నాయుడు’ సిరీస్పై నటుడు శివకృష్ణ సంచలన వ్యాఖ్యలు ఈ మూవీ సమయంలో ఆయన ఓ యూట్యూబ్ చానల్తో ముచ్చటించిన పాత వీడియో తాజాగా వైరల్గా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ నటన గురించి ఏం చెప్పిన తక్కువే. ఆయన ఎప్పుడు డైలాగ్ చదువుతాడో తెలియదు. టేక్ అనగానే మూడు, నాలుగు పేజీల డైలాగ్ అయినా సింగిల్ టేక్లో చెబుతాడు. సెట్లో ఎప్పుడు సరదగా ఉండే తారక్.. డైలాగ్ పేపర్ చూసుకోవడం నేనెప్పుడు చూడలేదు. ఆయన కెమెరా కోసమే పుట్టారనిపిస్తుంది. ఇదంతా సినిమా పట్ల ఆయనకు ఉన్న కసి, కృషి వల్లేనేమో. చెప్పాలంటే తారక్ వండర్ కిడ్’ అంటూ ఎన్టీఆర్పై ఆయన ప్రశంసలు కురిపించారు. చదవండి: నాటు నాటు సాంగ్ పెడితేనే నా కొడుకు తింటున్నాడు, అది కూడా తెలుగులోనే: కరీనా కపూర్ -
ఆ సంఘటన చాలా భయపెట్టింది, రెండు నెలలు నిద్రపట్టలేదు: నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న విడుదలకు సిద్ధమైంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని పూర్థి స్థాయి మాస్ లుక్లో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్తో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న మూవీ విశేషాలను పంచుకున్నాడు. చదవండి: నా తమ్ముడే నన్ను చంపాలని చూశాడు.. స్లో పాయిజన్ ఇచ్చాడు: నటుడు ఈ సందర్భంగా దసరాలోని ఓ సన్నివేశం తనని చాలా ఇబ్బంది పెట్టిందని, దాని వల్ల రెండు నెలల సరిగా నిద్రపోలేదంటూ ఆసక్తిర విషయాన్ని బయటపెట్టాడు. ఈ మేరకు నాని మాట్లాడుతూ.. ‘డంపర్ ట్రక్ బోగ్గును తీసుకుని వెళ్లి డంప్ చేస్తుంటుంది. దీనిక సంబంధించిన సీన్లో నేను ఆ డంపర్ ట్రక్లో నుంచి కిందపడితే ఆ బొగ్గు నాపై పడాలి. దీని కోసం సింథటిక్ బొగ్గు రెడీ చేశారు. అది మొత్తం డస్ట్తో ఉంటుంది’ అన్నాడు. అలాగే ‘ఆ సీన్లో నేను ఆ డంపర్లో నుంచి క్రింద పడిపోయాను. చదవండి: చిరంజీవి వల్లే బతికాను, ఏదో చిన్న సాయం చేస్తారనుకుంటే..: నటుడు సింథటిక్ కోల్స్ కింద నుంచి నన్ను పైకి లాగడానికి కొంత సమయం పడుతుంది. ఆ గ్యాప్లో నేను గాలి పీల్చకుండా ఉండాలి. పీల్చితే డస్ట్ అంతా లోపలికి వెళ్లిపోతుంది. ఈ సీన్ షూటింగ్ అయ్యాక చాలా రోజుల పాటు డంప్లో నుంచి బొగ్గుతో పాటు నేను పడటం.. బొగ్గు నాపై పడటం.. నన్ను పైకి లాగడం.. ఇవన్నీ నాకు పదే పదే గుర్తుకొచ్చేవి. అది గుర్తోచ్చినప్పుడల్లా లోపల ఏదో ఇబ్బందిగా అనిపించేది. ఈ క్రమంలో తెలియకుండానే నేను శ్వాస ఆపడం చేస్తుండేవాడిని. దాని నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పట్టింది. దీనివల్ల రెండు నెలల పాటు సరిగా నిద్రపట్టలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. -
ఈ ఏడాది చరణ్ దే: భర్తపై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు
తన భర్త మెగా పవర్ స్టార్ రామ్ చరణ్పై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సామాజిక కార్యక్రమాలతో పాటు సినిమాలకు సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలో సైతం ఆమె యాక్టివ్గా ఉంటారు. తన సంబంధించిన విషయాలను, ఫొటోలను ఎప్పటికప్పుడు నెట్టింట పంచుకుంటారు. త్వరలోనే తల్లికాబోతున్న ఆమె తాజాగా ఓ చానల్తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె హీరోగా చరణ్ సాధిస్తున్న విజయాలు, అందుకుంటున్న అవార్డుల గురించి చెబుతూ మురిసిపోయింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా చరణ్ నాకు మద్దతు ఇస్తుంటాడు. అలాగే నేను కూడా ప్రతి విషయంలో తనకి సపోర్ట్గా ఉంటాను. వృత్తిపరంగా, వ్యక్తిగతంగానూ నేను చర్రి వెన్నంటే ఉంటాను. షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా, ఎలాంటి సందర్భంలోనైనా వీలైనంత వరకు తనకి సాయం చేస్తూంటా. ఇక ఈ ఏడాది చరణ్కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. తన వర్క్ పరంగానూ, వ్యక్తిగతంగానూ 2023 ఆయనకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన అందుకుంటున్న అవార్డులు, ప్రశంసలతో చరణ్ చాలా ఆనందంగా ఉన్నాడు. ముఖ్యంగా తన వర్క్ పరంగా చాలా సంతృప్తిగా ఉన్నాడు. మీరే చూస్తున్నారు ఆయనకు అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ సంవత్సరం తను ఎన్నోప్రశంసలు అందుకున్నాడు. చూస్తుంటే ఈ ఏడాది చరణ్దే అనిపిస్తోంది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. కాగా ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినప్పుడు ఈ మూవీ టీంతో పాటు ఉపాసన కూడా అమెరికాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. చదవండి: దీన స్థితిలో ప్రముఖ నిర్మాత, అండగా నిలిచిన స్టార్ హీరో ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న నటి, శరీరమంతా కమిలిపోయి.. -
ఈ రాజకీయాలు టార్చర్ అనిపిస్తున్నాయి: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో సహా నేతలెవరైనా సరే ప్రజాదరణ ఉన్నంత వరకే రాజకీయాల్లో ఉంటామంటూ పేర్కొన్నారాయన. మెదక్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఛత్రపతి శివాజీలా బతకాలని.. శంభాజీ చనిపోవాలన్నదే తన కల అని రాజాసింగ్ పేర్కొన్నారు. ఈ రాజకీయాలు టార్చర్లా అనిపిస్తున్నాయని పేర్కొన్నారాయన. -
చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని చెప్పా: జగపతి బాబు షాకింగ్ కామెంట్స్
ఇండస్ట్రీలో సీనియర్ నటుడు జగపతి బాబుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 90లో ఫ్యామిలీ హీరోగా అలరించిన ఆయన ప్రస్తుతం విలన్గా మెప్పిస్తున్నారు. అయితే జగపతి బాబుతి విభిన్న శైలి అనే విషయం తెలిసిందే. ఎలాంటి అంశంపైన అయిన స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న జగపతి బాబు తాజాగా ఓ యూట్యూబ్ చానల్తో ముచ్చటించారు. చదవండి: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే తన పిల్లలు, వారి పెళ్లిళ్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద అమ్మాయి పేరు మేఘన.. అమెరికన్ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తాను అమెరికాలో సెటిల్ అయ్యింది. చిన్న కూతురికి ఇంకా పెళ్లి కాలేదు. తనకి పెళ్లి చేసుకోవద్దనే చెప్పా. ఒకవేళ తను చేసుకుంటానంటే మాత్రం కాబోయే భర్తను తానే వెతుక్కోమని చెప్పాను. నేను మాత్రం అబ్బాయిని చూడనని చెప్పాను. పెద్ద అమ్మాయికి పెళ్లి చేసి తప్పు చేశానని ఫీల్ అవుతున్నా’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఎయిర్పోర్ట్ వివాదం: విజయ్ సేతుపతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం అనంతరం మాట్లాడుతూ.. ‘నా పిల్లలు అంటూ మన ఆశలను వారిపై రుద్దడం తప్పు. వారికంటూ ఓ జీవితం, స్వతంత్య్రం ఉంటుంది. మన స్వార్థం కోసం పిల్లలను పెళ్లి చేసుకోమనడం, పిల్లలను కను అనడం స్వార్థం అవుతుంది. తండ్రిగా పెళ్లి చేయడం నా బాధ్యత అని అనడం నా దృష్టిలో తప్పు. అది స్వార్థం అవుతుంది. నీ ఇష్టం.. నీకు నచ్చినంటూ నువ్వు ఉండు అని చెప్పడం ప్రేమ’ అంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. అదే విధంగా తన పెద్ద అమ్మాయి పిల్లలను కనని చెప్పిందని, కుక్కలు, పిల్లులను పెంచుకుంటానందని చెప్పిందన్నారు. తను అలా చెప్పడంతో వెంటనే సరే.. నీ ఇష్టమని చెప్పానని జగపతి బాబు పేర్కొన్నారు. -
ప్రేమ దేశం చిత్రంలో నటించడం నా అదృష్టం: నటి మధుబాల
‘‘ప్రేమదేశం’ వంటి మంచి సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీకాంత్ సిద్ధం చెప్పిన కథ, నా పాత్ర నచ్చి ఈ సినిమా చేశా’’ అన్నారు నటి మధుబాల. త్రిగున్, మేఘా ఆకాష్, మధుబాల ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమదేశం’. శిరీష సిద్ధం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ‘హిట్ 1, 2’ డైరెక్టర్ శైలేష్ కొలను అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మధుబాల మాట్లాడుతూ.. ‘‘మా నాన్న నన్ను డాక్టర్గా చూడాలనుకున్నారు. అయితే నాకు ‘ఫూల్ ఔర్ కాంటే’ సినిమాకి చాన్స్ రావడం, అది హిట్టవడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని షార్ట్ ఫిలింగా తీద్దామనుకున్నాను. అయితే నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడంతో పెద్ద సినిమా అయింది’’ అన్నారు శ్రీకాంత్ సిద్ధం. -
అది నా అదృష్టం: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమారంగంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి వరుస విజయాల బాటలో కొనసాగుతున్న హీరోయిన్ రష్మిక మందన్నా. శాండిల్వుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈమె హవా కొనసాగిస్తోంది. కోలీవుడ్లో తాజాగా రష్మిక నటించిన తమిళ-తెలుగు చిత్రం వారిసులో నటుడు విజయ్తో రొమాన్స్ చేసింది. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా రష్మిక తన అనుభవాలను మీడియాతో పంచుకుంది. తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 6 ఏళ్లు అయిందని, ఎంతోమంది ప్రతిభావంతమైన, అందమైన నటీమణులు ఉన్నా కూడా తనకు అన్ని భాషల్లోనూ అవకాశాలు లభించడం తన అదృష్టమని చెప్పింది. చదవండి: చిరంజీవి మెసేజ్లను అవాయిడ్ చేసిన స్టార్ యాంకర్! అసలేం జరిగిందంటే.. తన శ్రమకు తోడు దర్శక నిర్మాతల సహకారం, ప్రేక్షకుల అభిమానం, అన్నిటికీ మించి భగవంతుని ఆశీస్సులతోనే ఇన్ని విజయాలు వరించాయనంటోంది. తాను ఇతరుల సమయాన్ని, ప్రయత్నాలను గౌరవిస్తాను అని, ఒక నటిగా నిత్యం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటానని తెలిపింది. సాధ్యమైనంత వరకు అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటానని చెప్పింది. నటుడు విజయ్కి తాను వీరాభిమానిననీ, అలా నచ్చిన నటుడితో వారిసు చిత్రంలో నటించడం ఎంతో సంతోషాన్ని కలిగిందని రష్మిక మందన్న చెప్పుకొచ్చింది. -
‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ రివ్యూ, మూవీ చూసి సెన్సార్ బోర్డు ఏమన్నదంటే..!
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీసు వద్ద సందడి చేయబోతున్నాడు. ఆయన నటించి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య జవవరి 13న థియేటర్లోకి రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ప్రచార పోస్టర్లకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎక్కడ చూసిన వాల్తేరు వీరయ్య హావానే కనిపిస్తుంది. దీంతో ఈ పండగా చిరు ఫ్యాన్స్కి ఫీస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్గా విడుదలైన పూనకాలు లోడింగ్ సాంగ్ చూస్తుంటే థియేటర్లో ఆడియన్స్కి పూనకాలు తెప్పించడం కాయం అనిపిస్తోంది. చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన పునర్నవి మాస్ మసాలా మూవీగా రాబోతున్న ఈ చిత్రంపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు.. యూ/ఏసర్టిఫికెట్ ఇచ్చారు. ఆ పోస్టర్ ని కూడా మూవీ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ తాజా బజ్ ప్రకారం.. ఈసారి చిరు వాల్తేరు వీరయ్యతో థియేటర్లో రచ్చ చేయబోతున్నాడంటూ కొనియాడారని తెలుస్తోంది. చదవండి: వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి? త్వరలోనే అధికారిక ప్రకటన! ‘బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం రికార్డు బ్రేక్ చేయడం ఖాయం. రీఎంట్రీ తర్వాత చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకున్నారో ఈ మూవీ అలా ఉండబోతోంది. ఎమోషనల్, యాక్షన్స్ సీన్స్ ఈ చిత్రానికి హైలెట్గా నిలుస్తాయి. చిరంజీవి-రవితేజ కాంబినేషన్లో ఉండే సన్నివేశాలు అయితే ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించేలా డైరెక్టర్ డిజైన్ చేశారు’ అంటూ బోర్డు సభ్యులు ప్రశంసలు కురిపించారట. ఇక చిరంజీవి మాస్ స్టెప్పులకు వారు ఫిదా అయినట్లు తెలుస్తోంది. కాగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించింది. Its a U/A for #WaltairVeerayya 💥🤘🏾 Sankranthi ki ROUGH AADINCHESTADU 🔥❤️🔥#POONAKAALULOADING 🔥💣#WaltairVeerayyaOnJan13th Mega ⭐ @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/qeLc5q2hMr — Mythri Movie Makers (@MythriOfficial) January 2, 2023 -
‘కాంతార’ మూవీపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ ప్రాంతీయ సినిమాగా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 400కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. కంటెంట్ ఉంటే అది చిన్న సినిమా అయిన ప్రేక్షకులు ఆదరిస్తారని కాంతార మరోసారి రుజువు చేసింది. చదవండి: సరికొత్త హంగులతో ఏషియన్ తారకరామ థియేటర్, త్వరలో పున:ప్రారంభం తొలుత కన్నడ చిత్రం విడుదలైన ఈ మూవీ ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ అయి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు ప్రతి ప్రేక్షకులు ఫిదా అయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా కాంతార మూవీ బడ్జెట్ను ఉద్దేశిస్తూ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘చిన్న సినిమాలు కూడా భారీ కలెక్షన్స్ తెస్తాయని కాంతార సినిమా నిరూపించింది. భారీ బడ్జెట్ సినిమాలు ప్రత్యేకమే. చదవండి: అషు కాలును ముద్దాడటంపై ఆర్జీవీ క్లారిటీ, ట్రోలర్స్కు వర్మ గట్టి కౌంటర్ కానీ చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చిన కాంతార మూవీ కలెక్షన్లతో మ్యాజిక్ చేసింది. దీంతో సినిమా మేకింగ్ భారీగా ఉండాలి అనుకునే నాలాంటి వాళ్ళని ఇరుకున పెట్టింది ఈ సినిమా. నా లాంటి భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకులని ఆలోచలనలో పడేసింది కాంతార. సినిమా నిర్మాణ వ్యయాన్ని మరోసారి సమీక్షించుకునేలా చేసింది. ఇక నుంచి మేం సినిమా మొదలుపెట్టేటప్పుడు బడ్జెట్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని కాంతార సినిమా తెలిపింది’ అని రాజమౌళి పేర్కొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- పోక్సో కేసు.. కర్నూలు కోర్టు సంచలన తీర్పు
- హై రిటర్న్స్ కోసం ఆశపడితే మీకూ ఇదే జరగొచ్చు..!
- శ్రీదేవికి ఇష్టమైన ఆలయంలో జాన్వీ కపూర్.. ఫోటోలు వైరల్!
- సీఎం రేవంత్పై మంత్రి ఉత్తమ్కు అనుమానం: బీజేఎల్పీ మహేశ్వర్ రెడ్డి
- Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
- IPL 2024: వారికి భారీ నజరానా.. బీసీసీఐ కీలక ప్రకటన
- ఈవీఎం ట్యాంపర్ అయిందా? లేదా?.. చెక్ లిస్ట్తో చూసుకోండిలా..
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక: కొనసాగుతున్న పోలింగ్
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- మౌంట్ ఎవరెస్ట్పై భారీగా ట్రాఫిక్జామ్!
Advertisement