Jabardasth Comedian
-
కమెడియన్ ఆటో రామ్ప్రసాద్కు యాక్సిడెంట్
సాక్షి, హైదరాబాద్: జబర్దస్త్ కమెడియన్ రామ్ప్రసాద్ రోడ్డుప్రమాదంలో గాయపడ్డాడు. గురువారం (డిసెంబర్ 5) షూటింగ్కు వెళ్తుండగా తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఎప్పటిలాగే షూటింగ్కు వెళ్తుండగా కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనక నుంచి మరో వాహనం ఢీ కొట్టింది. దాంతో రామ్ ప్రసాద్ కారు ముందున్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ధ్వంసమవగా, రామ్ప్రసాద్కు స్వల్ప గాయాలయ్యాయి.‘పుష్ప 2’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ మాట అన్నారు: మూవీ ఈవెంట్లో హరీశ్ రావు
జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్). గరుడవేగ అంజి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య కృష్ణన్ కథానాయికగా నటించారు. రాకింగ్ రాకేష్ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి, తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..'ముఖ్యమంత్రులు వస్తు ఉంటారు. పోతుంటారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు కేసీఆర్. ఆయన పేరు మీద సినిమా తీయడం సంతోషం. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణను సాధించడమే కాదు అద్భుతంగా 10 సంవత్సరాలు పరిపాలించారు. రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు. నేను హైదరాబాద్లో ఉన్నానా? న్యూయార్క్లో ఉన్నానా అని. కేసీఆర్ పల్లెలను, హైదరాబాద్ను ఎంతో అభివృద్ధి చేశారు. మనం చూసే భౌతికమైన అభివృద్దే కాదు. సామాజిక పరంగా సంస్కృతి పరంగా తెలంగాణని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఒక దశ దిశను చూపించారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలబడింది అంటే కేసీఆర్ చేసిన కృషి. అధికారంలో ఉన్న పార్టీ వారి మీద సినిమాలు తీస్తారు. కానీ అధికారంలో లేకపోయినా రాకేష్ ప్రేమతో, దమ్ము ధైర్యంతో ఈ సినిమా తీశారు' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. లంబాడీ వర్గానికి చెందిన ఓ యువకుడి నిజ జీవితం నుంచి స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించారు. -
కెవ్వు కార్తీక్ ఇంట విషాదం.. 'నువ్వు లేకుండా ఎలా బతకాలమ్మా..'
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కార్తీక్ తల్లి క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూసింది. ఈ విషాద వార్తను కమెడియన్ గురువారం సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఎమోషనలయ్యాడు. 'అమ్మా.. గత ఐదు సంవత్సరాల 2 నెలలుగా క్యాన్సరే భయపడే విధంగా దానిపై అలుపెరగని పోరాటం చేశావు. నీ జీవితమంతా యుద్ధమే! కంటికి రెప్పలామమ్మల్ని కన్నావు.. నాన్నకు తోడుగా కుటుంబాన్ని కష్టపరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడావు. ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఒంటరిగా పోరాడాలని నేర్పావు. నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది. అన్నీ నేర్పావు కానీ, నువ్వు లేకుండా ఎలా బతకాలో నేర్పలేదు.. ఎందుకమ్మా..? వారికి పాదాభివందనాలుమా అమ్మ కోసం ప్రార్థించిన అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే తనకు చికిత్స అందించిన వైద్యులకు నా పాదాభివందనాలు' అని ఇన్స్టాగ్రామ్లో తన తల్లి ఫోటోను షేర్ చేశాడు. ఇది చూసిన బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Kevvu Kartheek (@kevvukartheek) -
జబర్దస్త్ కమెడియన్ల బ్రేకప్? గొడవలు నిజమేనన్న నూకరాజు
పటాస్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు నూకరాజు. తర్వాత జబర్దస్త్ షోలో భాగమయ్యాడు. టీమ్లో ఒకరి కింద పని చేసే స్థాయినుంచి టీమ్ లీడర్గా ఎదిగాడు. అతడి ప్రేయసి ఆసియాతో కలిసి కామెడీ షోలో పంచులు పేలుస్తూ ఉంటాడు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న నూకరాజు, ఆసియా కొంతకాలంగా కలిసి కనిపించడం లేదు. దీంతో ఈ లవ్ బర్డ్స్కు ఏమైంది? వీళ్లు బ్రేకప్ చెప్పుకున్నారా? అని అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆసియాకు, నాకు గొడవలు తాజాగా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తూ యూట్యూబ్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు నూకరాజు. అతడు మాట్లాడుతూ.. 'ప్రేమలో గొడవలు, అలకలు, బుజ్జగింపులు సహజమే! అలా ఆసియాకు, నాకు మధ్య చిన్నచిన్న గొడవలు జరిగాయి. తను నాపై అలిగింది. వంద శాతం తప్పు నాదే! మేమిద్దరం మాట్లాడుకోలేదు. అయితే తప్పు ఎవరిదైనా ఆసియానే స్వయంగా వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటుంది. నాపై ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. ఇగో వల్ల.. మొన్న నేను దుబాయ్ వెళ్లాను. ఐదురోజుల తర్వాత తిరిగొచ్చాను. అలా మా మధ్య మాట్లాడుకునే తీరిక కూడా లేకుండా పోయింది. తను ఫస్ట్ మాట్లాడాలని ఎదురుచూశాను. నాకు కాల్ చేసి ఉండొచ్చేమో కానీ దుబాయ్లో ఉండటం వల్ల నా లైన్ కలిసి ఉండకపోవచ్చు. ఇగోతో ఆమెకు బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు. అయినా తనే తర్వాత మెసేజ్ చేసింది. తనే ఫస్ట మెసేజ్ విషెస్ చెప్పనందుకు నా మీద కోపం లేదా? అంటే బాధ మాత్రమే ఉందని చెప్పింది. చిన్న చిన్న ఇగోతో ప్రేమను దూరం చేసుకోకండి. తప్పు ఎవరు చేసినా ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గితే ఆ ప్రేమ పెళ్లిదాకా వెళ్తుంది. తనను ఎంత బాధపెట్టానో అంతే హ్యాపీగా ఉంచాలని నిర్ణయించుకున్నాను. తనకు ఆలస్యంగానైనా సరే బర్త్డే సర్ప్రైజ్ ఇస్తాను' అని నూకరాజు చెప్పుకొచ్చాడు. తమ బంధం ముక్కలు కాలేదని క్లారిటీ ఇచ్చాడు. చదవండి: ఓటింగ్ కేంద్రంలో ఆమె కాళ్లకు నమస్కరించి సెల్ఫీ దిగిన విజయ్ సేతుపతి -
గ్రాండ్గా టాలీవుడ్ కమెడియన్ పెళ్లి.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతోమంది ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా లేడీ గెటప్స్లో ఆడియన్స్ను అలరిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో వినోద్, కొమరం, శాంతి స్వరూప్, మోహన్, తన్మయ్, సాయితేజ, పవన్, అప్పారావు చాలామందే ఉన్నారు. ప్రస్తుతం ఈ కామెడీ షో లేడీ గెటప్స్లో అలరిస్తున్న మోహన్ ఓ ఇంటివాడయ్యారు.తాజాగా మోహన్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకలో జబర్దస్త్ నటులు రాకెట్ రాఘవ, అధిరే అభి, గడ్డం నవీన్, అప్పారావు సహా పలువురు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను జబర్దస్ కమెడియన్ నవీన్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం మోహన్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
గ్రాండ్గా టాలీవుడ్ కమెడియన్ పెళ్లి.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతోమంది ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా లేడీ గెటప్స్లో ఆడియన్స్ను అలరిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో వినోద్, కొమరం, శాంతి స్వరూప్, మోహన్, తన్మయ్, సాయితేజ, పవన్, అప్పారావు చాలామందే ఉన్నారు. ప్రస్తుతం ఈ కామెడీ షో లేడీ గెటప్స్లో అలరిస్తున్న మోహన్ ఓ ఇంటివాడయ్యారు. తాజాగా మోహన్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకలో జబర్దస్త్ నటులు రాకెట్ రాఘవ, అధిరే అభి, గడ్డం నవీన్, అప్పారావు సహా పలువురు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోను జబర్దస్ కమెడియన్ నవీన్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం మోహన్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by jabardasth naveen (@gaddamnaveenofficial) View this post on Instagram A post shared by Harikrishna Jabardasth ❤️ (@harikrishna_jabardasth) -
వాలెంటైన్స్ డే.. ప్రియుడికి బ్రేకప్ చెప్పిన బుల్లితెర నటి
బుల్లితెరపై ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది పవిత్ర. అందులో లేడీ కమెడియన్గా అందరినీ నవ్వించే పవిత్ర త్వరలో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా వాలెంటైన్స్ డే రోజునే తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసి అందరికీ షాకిచ్చింది. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్లో ఆమె అధికారికంగా తెలిపింది. తాను ప్రేమించిన సంతోష్తో పవిత్ర ఉంగరాలు కూడా మార్చుకుంది. ఓ రకంగా ఎంగేజ్మెంట్ జరిగినట్లే అని త్వరలో పెళ్లితో ఒకటి అవుతారని అందరూ అనుకున్నారు. సుమారు రెండేళ్లుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సంతోష్తో విడిపోతున్నట్లు వాలెంటైన్స్ డే సమయంలోనే పవిత్ర ఇలా తెలిపింది. 'మా శ్రేయోభిలాషులందరికీ మా ఇద్దరి పరస్పర అంగీకారం ద్వారా ఈ విషయం చెబుతున్నాను. సంతోష్, నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మా మార్గాలు వేరుగా ఉన్నా.. మేము పంచుకున్న క్షణాలు చాలా ప్రత్యేకం. జీవితంలో మా వ్యక్తిగత ప్రయాణాలలో ఇద్దరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. ఈ కష్ట సమయంలో మాకు మద్దతుతో పాటు గోప్యత ఇవ్వాలని మా శ్రేయోభిలాషులను అభ్యర్థిస్తున్నాము, మేము ముందుకు సాగేందుకు మీ ప్రేమ, మద్దతు ఉంటుంది అని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.' అంటూ ఇన్స్టాలో పవిత్ర తెలిపింది. గతంలో సంతోష్ గురించి పవిత్ర చెప్పిన మాటలు సంతోష్తో ప్రేమలో ఉన్నానంటూ గతంలో పవిత్ర ఇలా తెలిపింది. 'నా జీవితంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం. నా ప్రేమ కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న సంతోష్కు ఓకే చెప్పాను. అతడిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాను. అనుకోకుండా జరిగే కొన్ని పరిచయాలు జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి, మన మనసులోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. సంతోష్.. నాపై లెక్కలేనంత ప్రేమ చూపించాడు.. నా కోసం ఒక సంవత్సరం నుంచి వేచి ఉన్నాడు.. ఇప్పుడా నిరీక్షణ ముగిసింది. నా చివరి శ్వాస వరకు నీ చేయి వదలను. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇద్దరం కలిసి చిరునవ్వుతో ఎదుర్కొందాం. నా జీవితంలో అడుగుపెట్టినందుకు ధన్యవాదాలు. నువ్వు నన్ను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటావు, నన్నొక మహారాణిలా చూసుకున్నావు. నాకు అండగా నిలబడ్డావు. ఇక మీదట మనం కలిసి ప్రయాణిద్దాం..' అని పవిత్ర చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సంతోష్,పవిత్ర ఇద్దరూ విడిపోవడంతో వారిని అభిమానించే వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. కారణాలు ఏమైనా కానీ.. ఇలాంటి సమయంలో ఇద్దరూ మరింత బలంగా ఉండాలని ఆశిస్తున్నారు. గతాన్ని వదిలేసి జీవితంలో కొత్త అడుగులు వేయాలని నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Jabardasth_pavithraa (@jabardasth_pavithraa) -
బిడ్డను కోల్పోవడంపై తొలిసారి పెదవి విప్పిన అవినాష్
గర్భం దాల్చింది మొదలు.. పొట్టలో ఉన్న బుజ్జాయి ఎప్పుడు బయటకు వస్తుందా? ఆ బిడ్డను ఎప్పుడు ఎత్తుకుందామా? అని ఆ మహిళ తెగ ఆరాటపడుతూ ఉంటుంది. ఇక తండ్రి కాబోతున్నానోచ్ అని గాల్లో తేలే భర్త పుట్టబోయే బిడ్డ కోసం అన్నీ ముందస్తుగానే సిద్దం చేసి పెడతాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వారికి తల్లిదండ్రులుగా ప్రమోషన్ లభించినట్లే! జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్- అనూజ కూడా త్వరలోనే అమ్మానాన్న కాబోతున్నామని సంతోషించారు. సీమంతం చేశారు. మెటర్నటీ షూట్ చేశారు. బాధను భరిస్తూ నవ్వించాడు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూశారు. కానీ వారి కలలు కల్లలయ్యాయి. పురిటిలోనే బిడ్డ మరణించింది. ఈ విషాద వార్తను జనవరి 7న సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు అవినాష్. అంతటి బాధను పంటి కిందే భరిస్తూ సినిమాలు, ఈవెంట్లు చేస్తున్నాడు. అందరినీ నవ్విస్తున్నాడు. తాజాగా తొలిసారి ఆ బాధాకర ఘటన గురించి మాట్లాడాడు. 'నా బిడ్డ చనిపోయినప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది కాల్స్ చేశారు. వారికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. దేవుడు మాకలా రాసిపెట్టాడు పైగా నేను మాట్లాడే స్థితిలో లేకపోవడం వల్ల ఎవరి ఫోనూ లిఫ్ట్ చేయలేదు. దీని గురించి అడగొద్దు అని చెప్పినప్పటికీ మానవత్వంతో ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉన్నారు. చాలా ఫోన్లు చేశారు, మెసేజ్లు చేశారు. మా మీద అంత ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా జీవితంలో అదొక కరిగిపోయిన మేఘంలాంటిది. దేవుడు మాకు అలా రాసిపెట్టాడు. భవిష్యత్తులో ఏదైనా ఇంకా బెస్ట్ రాబోతుందేమో చూడాలి! అని చెప్పుకొచ్చాడు. కాగా అవినాష్-అనూజ 2021వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) చదవండి: ప్రజలకు రుణపడి ఉంటా.. చేతనైనంతలో సాయం చేయాలనుకున్నా.. పుష్ప 3 ఉందని రూమర్స్.. అలా చేస్తే చిక్కులు గ్యారంటీ! -
Kiraak RP Marriage: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..
కమెడియన్ కిర్రాక్ ఆర్పీ పెళ్లిపీటలెక్కాడు. ప్రేయసి లక్ష్మీ ప్రసన్న మెడలో మూడు ముళ్లు వేశాడు. బుధవారం (నవంబర్ 29న) నాడు విశాఖపట్నంలో ఇరుకుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ముందస్తు హడావుడి లేకుండా సీక్రెట్గా వివాహం చేసుకున్నాడు ఆర్పీ. రహస్యంగా పెళ్లి చేసుకోవడం గురించి ఆర్పీ మాట్లాడుతూ.. 'అమ్మాయిది వైజాగ్. గతేడాది మా నిశ్చితార్థం జరిగింది. మేము ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటున్నాం. ఎంగేజ్మెంట్, తదితర కార్యక్రమాలకు సెలబ్రిటీలు, ఇతర వీఐపీలు వచ్చారు. ఈసారి కేవలం బంధుమిత్రుల సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని వైజాగ్ ఎంచుకున్నాం. అందుకే పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచాం' అని చెప్పుకొచ్చాడు. కాగా కిర్రాక్ ఆర్పీ, లక్ష్మీ ప్రసన్న మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గతేడాది మేలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకకు ధనరాజ్ సహా తదితరులు హాజరయ్యారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత పెళ్లి చేసుకున్నారు. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించిన ఆర్పీ- లక్ష్మీ ప్రసన్నల జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆర్పీ ఏం చేస్తున్నాడు? జబర్దస్త్ కామెడీ షోలో వందల స్కిట్లు చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు ఆర్పీ. ఆ షో నుంచి తప్పుకున్న తర్వాత అతడు మరే ఇతర షోలలోనూ పెద్దగా కనిపించలేదు. చాలా కాలం తర్వాత హైదరాబాద్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్ బిజినెస్ ప్రారంభించాడు. దీనికి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ వ్యాపారం విజయవంతం కావడంతో ఆర్పీ ముందడుగు వేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట పలు బ్రాంచ్లు ఓపెన్ చేశాడు. చదవండి: ఫినాలే అస్త్ర గెలుపుకు దగ్గర్లో ఉంది ఈ నలుగురే! -
ఏడాదిగా వెయిటింగ్.. ఎస్ చెప్పిన పవిత్ర.. నిశ్చితార్థం ఫోటో వైరల్
బుల్లితెరపై ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది పవిత్ర. అందులో లేడీ కమెడియన్గా అందరినీ నవ్వించే పవిత్ర త్వరలో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతుంది. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అయితే ఆమె ఇప్పటికే తన పెళ్లి విషయంలో రెండుసార్లు ఫ్రాంక్ వీడియోలు చేసింది. కానీ మూడోసారి మాత్రం అలాంటిది ఏమీ లేకుండా నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన ప్రియుడు సంతోష్తో ఉంగరాలు మార్చుకున్న ఫోటోలు షేర్ చేసింది. సంతోష్కు ఓకే చెప్పిన పవిత్ర 'నా జీవితంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం. నా ప్రేమ కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న సంతోష్కు ఓకే చెప్పాను. అతడిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాను. అనుకోకుండా జరిగే కొన్ని పరిచయాలు జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి, మన మనసులోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. సంతోష్.. నాపై లెక్కలేనంత ప్రేమ చూపించాడు.. నా కోసం ఒక సంవత్సరం నుంచి వేచి ఉన్నాడు.. ఇప్పుడా నిరీక్షణ ముగిసింది. నా చివరి శ్వాస వరకు నీ చేయి వదలను. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇద్దరం కలిసి చిరునవ్వుతో ఎదుర్కొందాం. నా జీవితంలో అడుగుపెట్టినందుకు ధన్యవాదాలు. నువ్వు నన్ను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటావు, నన్నొక మహారాణిలా చూసుకున్నావు. నాకు అండగా నిలబడ్డావు. ఇక మీదట మనం కలిసి ప్రయాణిద్దాం..' అని తన పోస్ట్కు క్యాప్షన్ జోడించింది పవిత్ర. ఏడాది నుంచి ఎదురుచూస్తున్న సంతోష్ అలాగే వారి ప్రేమను అంగీకరించిన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. అయితే పవిత్ర అభిమానులకు సంతోష్ కుమార్ ఇదివరకే తెలుసు. గతంలో ఇతడు స్టేజిమీద అందరి ముందే పవిత్రకు లవ్ ప్రపోజ్ చేశాడు. కానీ అప్పుడు ఏ సమాధానమూ చెప్పని పవిత్ర.. తర్వాత సంతోష్ కుమార్తో కలిసి వాలంటైన్స్ డే సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలోనే యాంకర్ వారిని లవ్ ప్రపోజ్ చేసుకోవాలని కోరగా ఆమె తెగ సిగ్గుపడింది. ఎట్టకేలకు అతడితోనే ఏడడుగులు వేసేందుకు రెడీ అవడంతో అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. View this post on Instagram A post shared by Jabardasth_pavithraa (@jabardasth_pavithraa) చదవండి: గిన్నిస్ రికార్డు.. ఆయనే నా సూపర్ హీరో అంటున్న సుమ -
ఈ జబర్దస్త్ కమెడియన్ల జీవితంలో ఇన్ని కష్టాలున్నాయా?
కమెడియన్గా నిలదొక్కుకున్న ఎంతోమంది జీవితంలో కష్టాలను దాటుకుని ముందుకువచ్చినవారే! బుల్లితెర కమెడియన్స్ పృథ్వీరాజ్, రిషి కుమార్ ఈ కోవలోకే వస్తారు. ఈ చైల్డ్ ఆర్టిస్టులిద్దరూ జబర్దస్త్ షోలో నవ్వులు పూయిస్తున్నారు. అయితే తమ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయంటోంది పృథ్వీ, రిషిల తల్లి శ్రీలత. తాజాగా ఆమె తన కుమారులతో కలిసి ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'దేవుడు నా ఇద్దరు పిల్లల్ని మరుగుజ్జులుగా పుట్టించాడు. మూడోసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మళ్లీ వీరిలాగే పుడతారేమోనని ఆపరేషన్ చేసి తీయించేసుకున్నాను. మా ఆయన ఆటో డ్రైవర్. రోజుకు రూ.400 వస్తాయి. మా అమ్మకు యాక్సిడెంట్లో చేయి పోయింది. తనను నేనే చూసుకోవాలి. అటు ఇద్దరు పిలల్ల్ని చూసుకోవాలి. వీళ్లకు జబర్దస్త్ షోలో ఇచ్చే డబ్బులు రానుపోను చార్జీలకే సరిపోతున్నాయి. హైదరాబాద్కు వచ్చిపోవడానికే ఏడువేల రూపాయలు అవుతాయి. రిషికి గుండెలో హోల్ ఉంది.. ఆపరేషన్ చేయించాం. కానీ మూడు నెలలకోసారి చెకప్కు తీసుకెళ్లాలి. అప్పుడో రూ.10 వేలు అవుతాయి. తనకు ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలన్నారు. కానీ మాకున్న స్థోమతకు మంచి ఆహారాన్ని సమకూర్చలేము. నేను కూడా గతంలో జూనియర్ ఆర్టిస్టుగా ఐదేళ్లు కష్టపడ్డాను. ఇప్పుడు నా పిల్లలు కష్టపడుతున్నారు. అయినా అందరూ హేళన చేస్తున్నారు. ఇద్దరు పిల్లల ఆరోగ్యం బాలేకపోవడంతో రూ.5 లక్షల అప్పు చేశాం. వడ్డీ కడుతున్నాం కానీ అప్పు తీర్చేంత డబ్బు మా చేతిలో ఉండట్లేదు. అప్పులవాళ్లేమో తిడుతున్నారు' అంటూ ఏడ్చేసింది శ్రీలత. చదవండి: ఎంగేజ్మెంట్ ఆగిపోవడానికి కారణమిదే! పెళ్లి చేసుకోవాలనుంది.. త్వరలోనే జరుగుతుంది -
అక్కడికెళ్లి కోహ్లీతో ఆడొచ్చు కదా?.. అదిరే అభి వీడియో వైరల్!
జబర్దస్త్ కామెడీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు అభినయ కృష్ణ. అభిమానులను ఆయనను అదిరే అభి అని పిలుస్తుంటారు. తన కామెడీ పంచ్లతో కామెడీ షోతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2002లో వచ్చిన ప్రభాస్ మూవీ ఈశ్వర్లో హీరో ఫ్రెండ్గా తొలిసారిగా నటించారు. ఆ తరువాత విష్ణు, విద్యార్థి, గౌతమ్ ఎస్ఎస్సీ, ఈగ చిత్రాలలో నటించారు. అయితే తాజాగా అదిరే అభి ఓ వీడియోను తన ఇన్స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: చిన్నప్పుడే తండ్రి మరణం.. హోటల్లో వెయిటర్గా.. అత్తారింటికి దారేదీ నటుడి స్టోరీ!) అదిరే అభి వీడియోలో మాట్లాడుతూ..'మొన్ననే పక్కన టీ కొట్టుకు వెళ్లి టీ తాగుతున్నా. అప్పుడే టీ కొట్టు అతను మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఆ లాస్ట్ బాల్ను ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడుంటే సిక్స్ వెళ్లేది అన్నాడు. మిస్ చేశాడు కోహ్లీ అన్నాడు. నేను షాకయ్యా. విరాట్ కోహ్లీకి సిక్స్ ఎలా కొట్టాలో అతను చెబుతుంటే నాకు ఆశ్చర్యమనిపించింది. ఇంకో పక్కనున్న వ్యక్తి దేశంలో, రాష్ట్రంలో ఇలా చేసి ఉంటే వీళ్ల పార్టీ గెలిచేది అని అన్నాడు. అదోక షాక్. ఇంకొంతమంది సినిమాల గురించి చెప్పారు. ఈ సీన్ అలా కాకుండా ఇలా తీసి ఉంటే బాగుండేది అన్నారు.' అని అన్నారు. అనంతరం మాట్లాడుతూ..'నాకు అర్థం కానీ విషయం ఏంటంటే అంత నాలెడ్జ్ ఉన్నోడు ఇక్కడ టీ షాపు దగ్గర మాట్లాడాల్సిన అవసరమేంటి? అక్కడికెళ్లి కోహ్లీతో ఆడొచ్చు కదా? పాలిటిక్స్లో చేరి అధికారంలోకి రావొచ్చు కదా? సినిమాల్లో చేరి డైరెక్షన్ చేయొచ్చు కదా? బేసిక్గా ఏంటంటే మనం మనపని తప్పా అందరి పనులు చేసేస్తాం. అందరికంటే ఎక్కువ మనకే తెలుసనుకుంటాం. ఈరోజు కోహ్లీ ఎందుకు క్రికెట్ గ్రౌండ్లో ఉన్నాడు.. మనం టీ షాపు దగ్గర ఎందుకు ఉన్నామనేది రియలైజ్ చేసుకోవాలి. మనం మనపనిని ఫర్ఫెక్ట్గా చేసుకుంటే చాలు. ఎవరితో అవసరం లేదు. మన పని పక్కనపెట్టి.. అతను అలా ఆడితే బాగుండేది.. వాళ్లు ఇలా చేస్తే బాగుండేది.. అంటే మనల్ని నాశనం చేసుకున్నట్టే. అవతలి వాళ్లు అడిగితే చెప్పండి.. అంతేకానీ అడగకున్నా కూడా మనం మాట్లాడుతున్నామంటే టైం వేస్ట్ చేస్తున్నట్టు' అని అన్నారు. (ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్..!) అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో అదిరే అభి మాటలకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో అలాంటి వాళ్లతో మీకెందుకు అన్నా అని పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది మేధావులకు టైం కలిసిరాక అలా రోడ్లమీద తిరుగుతూ ఉంటారు అన్నా అంటూ నెటిజన్స్ రిప్లై ఇస్తున్నారు. ఏది ఏమైనా అదిరే అభి చెప్పిన మాటలు మనం కూడా ఎక్కడో ఒకచోట అలా మాట్లాడి ఉంటాం అని అనిపిస్తోంది. View this post on Instagram A post shared by Adhire Abhi (@abbhinav_actor) -
జూనియర్ ఎన్టీఆర్తో చిన్నారి.. తెగ ఆరా తీస్తోన్న ఫ్యాన్స్?
టాలీవుడ్ యంగ్ టైగర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే దుబాయ్లో సైమా అవార్డ్స్ వేడుకలకు హాజరైన జూనియన్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో పని చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే తాజాగా ఎన్టీఆర్కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్గా మారింది. అందులో ఓ పాపను ఎంతో అప్యాయంగా తన ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీస్తున్నారు. యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఆ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. అయితే ఆ ఫోటోలో ఎన్టీఆర్తో ఉన్న పాప జబర్దస్త్ కమెడియన్ రాం ప్రసాద్ మేనకోడలు అని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తారక్ అన్నతో నా మేనకోడలు అంటూ రామ్ ప్రసాద్ పోస్ట్ చేశారు. కాగా.. ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర మూవీ గ్లింప్స్, పోస్టర్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. Naa Menakodalu & @tarak9999 anna ❤️ pic.twitter.com/Xh7hsN7JOA — Auto RamPrasad (@RamPrasadAuto) September 30, 2023 -
చనిపోయేవరకు నన్ను వదలవేమో.. ఏడ్చేసిన జబర్దస్త్ కమెడియన్
జీవితంలో కష్టసుఖాలు సర్వసాధారణం. అయితే తన లైఫ్లో మాత్రం చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కష్టాలే తిష్ట వేసుకుని కూర్చున్నాయంటున్నాడు జబర్దస్త్ కమెడియన్ జీవన్. బుల్లితెరపై కమెడియన్గా క్లిక్ అయిన సమయంలో అనారోగ్యానికి గురై షో నుంచి తప్పుకున్నాడు. అనారోగ్య సమస్యలతో చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. చాలాకాలం తర్వాత తాజాగా ఓ షోలో హాజరై తన కన్నీటి కష్టాలను వివరించాడు. ఆటోకు డబ్బుల్లేక నడుచుకుంటూ వెళ్లేవాళ్లం 'ఒక పేరు వచ్చాక కష్టాలకు చెక్ పడుతుందనుకున్నాను. కానీ పేరు వచ్చిన తర్వాత కూడా ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాను. మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చాను. కృష్ణవంశీ 'మహాత్మ' సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి పాట పాడింది మేమే.. కానీ పాడింది మేమేనని ఎక్కడా పేరు వేయలేదు. అలా అక్కడ స్ట్రక్ అయిపోయాను. తర్వాత ఫణి అన్న అభి అన్నకు పరిచయం చేశాడు. అభి అన్న ఇంటికి వెళ్లడానికి డబ్బుల్లేక.. హైపర్ ఆది అన్న, నేను కృష్ణా నగర్ నుంచి బోయిన్పల్లి చౌరస్తా వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ షేర్ ఆటోలో వెళ్లేవాళ్లం. ఆ దేవుడు నాపై కరుణ చూపలేదు జబర్దస్త్ షోలో మంచి పేరొచ్చింది. టీం లీడర్ స్థాయికి వెళ్లాను. కానీ ఎందుకో నామీద దేవుడు కరుణ చూపలేదు. నన్ను చావు అంచుల వరకు తీసుకెళ్లాడు. చిన్నప్పటి నుంచి కష్టాలే.. నేను చనిపోయేవరకు ఈ కష్టాలు నన్ను వదిలిపోవేమో అనిపిస్తోంది' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు జీవన్. అక్కడే ఉన్న ఫణి సైతం తాను పడ్డ బాధలను చెప్పుకొచ్చాడు. సినిమాలు చేద్దామని జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాను. కానీ అక్కడ సినిమాల్లేవు. షోలు చేద్దామంటే అవి కూడా లేవు. ఆ సమయంలోనే నాన్నకు క్యాన్సర్ వచ్చింది అని చెప్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: స్టేజీపై యాంకర్తో నటుడి అనుచిత ప్రవర్తన.. అమ్మాయి నోరు నొక్కేస్తారంటూ మండిపడ్డ చిన్మయి -
సర్జరీ కోసం ఇంటిని అమ్మేసింది.. అప్పుడే సొంతింటికి!
జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన కామెడీతో అభిమానులను అలరించిన శాంతిస్వరూప్కు ఇండస్ట్రీలో జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.. ఇటీవలే తల్లికి ప్రస్తుతం సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో ఏకంగా తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన కల సాకారం కాబోతోంది అంటూ కొత్త వీడియోను పోస్ట్ చేసింది. తన సొంతింటి కల త్వరలోనే నిజం కానుందని వెల్లడించింది. (ఇది చదవండి: నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!) వీడియోలో శాంతి స్వరూప్ మాట్లాడుతూ..' సొంతింటి కల అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇటీవల అమ్మ సర్జరీ కోసం పాత ఇంటిని అమ్మేశా. చాలా ఏళ్లుగా హైదరాబాద్లో అద్దె ఇంట్లోనే ఉంటున్నా. కొందరు నా మంచి కోరేవారు కూడా ఉన్నారు. వారి సహకారంతోనే ఇంటిని నిర్మిస్తున్నా. కూకట్పల్లిలోని భూదేవిహిల్స్లో ఇల్లు ఉంటుంది. త్వరలోనే పూర్తి కానుంది. ' అంటూ సంతోషం వ్యక్తం చేసింది. -
నిర్మాత కావాలన్నదే లక్ష్యం
‘‘కృష్ణ, చిరంజీవిగార్ల సినిమాలు చూసి హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీగార్ల స్ఫూర్తితో హాస్య నటుడిగా నాకంటూ గుర్తింపు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. నిర్మాత కావాలన్నదే నా లక్ష్యం.. అలాగే ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ నిర్మించాలన్నది నా కల’’ అని నటుడు గడ్డం నవీన్ అన్నారు. రామ్చరణ్ ‘గేమ్ ఛేంజర్’, వెంకటేష్ ‘సైంధవ్’ చిత్రాలతో పాటు ‘భైరవ కోన’, ‘మిస్టరీ, ‘వృషభ’, ‘చూ మంతర్’, ‘భూతద్దం భాస్కర్’ వంటి పలు సినిమాల్లో నటిస్తున్న ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ 150 సినిమాలు చేస్తే, వాటిలో 90 చిత్రాల్లో మంచి పాత్రలొచ్చాయి. ఈ ఏడాది సంతృప్తికరమైన ప్రయాణం సాగుతోంది’’ అన్నారు. -
అమ్మాయిగా మారేందుకు సర్జరీ చేయించుకున్న జబర్దస్త్ సాయి?
కమెడియన్స్ తెర వెనుక పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. కెమెరా ముందు నవ్వుతూ నవ్వించే ప్రయత్నం చేస్తున్నా నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా లేడీ గెటప్లు వేసి నవ్వించేవారి బాధలు అన్నీఇన్నీ కావు. అమ్మాయిలా చీర కట్టుకున్నందుకు వారిని సూటిపోటి మాటలతో వేధిస్తుంటారు. కొందరు మాత్రం తమలో ఉన్న ఆడతనాన్ని అర్థం చేసుకుని అచ్చమైన మహిళగా మారిపోతారు. ఆ జాబితాలోకే వస్తుంది ప్రియాంక సింగ్. మెడిసిన్లో సీటు వదిలేసి సాయితేజగా పరిచయమైన ఆమె తర్వాతి కాలంలో సర్జరీ చేయించుకుని ప్రియాంకగా మారిపోయింది. ఆ మధ్య బిగ్బాస్ షోలోనూ పాల్గొంది. ఇదిలా ఉంటే జబర్దస్త్లోని మరో లేడీ కంటెస్టెంట్ సాయిలేఖ కూడా ట్రాన్స్జెండర్గా మారిపోయిందంటూ చాలాకాలంగా ఓ వార్త వైరలవుతోంది. తాజాగా ఈ పుకారుపై సాయి స్పందించాడు. అలాగే తన వ్యక్తిగత విషయాలను ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. సాయి మాట్లాడుతూ.. 'నా అసలు పేరు వెంకటసాయిప్రసన్న కుమార్. ఇంటర్ అయిపోయాక మెడిసిన్లో ర్యాంక్ వచ్చింది. ఓసారి ఈవెంట్కు వచ్చినప్పుడు హైపర్ ఆది అన్నవాళ్లు నువ్వు కూడా యాక్టింగ్ చేయొచ్చు కదా.. సెలబ్రిటీ అయిపోతే నీతో కూడా ఫోటోలు దిగుతారు అని చెప్పాడు. నాన్న చాలా బాధపడ్డాడు అప్పుడు నేను హైదరాబాద్కు వచ్చి రెండు, మూడు ఎపిసోడ్లు చేసి తిరిగి కాలేజీకి వెళ్లిపోయాను. కానీ అక్కడున్నవాళ్లు అప్పుడే అయిపోయిందా? అని హేళన చేశారు. ఆ మాటలు తట్టుకోలేకపోయాను. కష్టమైనా, ఏదైనా సరే అని కామెడీ షోలో రీఎంట్రీ ఇచ్చి అక్కడే కొనసాగుతున్నాను. మొదట్లో మా నాన్న చాలా బాధపడ్డాడు. డాక్టర్ చదవాల్సినవాడు చీర కట్టుకుని మేకప్ వేసుకుని జబర్దస్త్లో చేస్తున్నాడు, మీకేం అనిపించట్లేదా? అని ఇరుగుపొరుగువారు మా నాన్నను సూటిపోటి మాటలనేవారు. అప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటారో నాకు తర్వాత అర్థమైంది. సర్జరీ చేయించుకుంటేనే అమ్మాయా? నేను సర్జరీ చేసుకున్నానా? అని అడుగుతున్నారు. సర్జరీ చేయించుకుంటేనే అమ్మాయిలాగా ఉంటారు, లేదంటే ఉండరు అని కాదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ చీర నేను కట్టుకుంటేనే అందంగా కనిపిస్తాను అనిపించేది. ఇలాంటి ఆలోచనలు నాకు ఊహ తెలిసినప్పటినుంచే మొదలయ్యాయి. ఎదుటివాళ్లు ఎలా అనుకుంటారన్నది నాకు అనవసరం. నేను ఎలా ఉంటే వాళ్లకేంటి? సర్జరీ చేయించుకోవాలని కాదు. కానీ నాకు నచ్చినట్లు బతుకుతున్నాను. డాక్టర్ కాళ్లు పట్టుకున్నాడు ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు నాకు వంశీ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఓ రోజు నాకు రాత్రి ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్లిపోయాను. అప్పుడు వంశీయే ఆస్పత్రిలో జాయిన్ చేశాడు. నేను బతుకుతానో, లేదో కష్టమని..ముందు సంతకం పెట్టాకే చికిత్స ప్రారంభిస్తామన్నాడు డాక్టర్. అతడు మా ఇంటికి ఫోన్ చేసి మా వాళ్లకు ఒకమాట చెప్పి సంతకం చేసి డాక్టర్ కాళ్లు పట్టుకున్నాడు. అతడి దగ్గర ఉన్న రూ.2 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చాకే ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఆరోజు ఆయన అలా సాయం చేయకపోయుంటే ఈరోజు సాయిలేఖ ఉండేదే కాదు. తనంటే నాకు నిజంగానే చాలా ఇష్టం' అని అని చెప్తూ ఎమోషనలయ్యాడు సాయి. చదవండి: జవాన్ సినిమా ఓటీటీ రైట్స్కు రికార్డు ధర.. ఆ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు ఛాన్స్! మిస్ శెట్టి కూడా అక్కడే.. -
హీరో అవ్వాలనుకున్నా, సీక్రెట్గా పెళ్లి.. ఇండస్ట్రీలో కష్టాలు..: గడ్డం నవీన్
జబర్దస్త్ నవీన్.. బుల్లితెరపై, వెండితెరపై నవ్వుల జల్లు కురిపిస్తూనే ఉన్నాడు. జబర్దస్త్ నవీన్, గడ్డం నవీన్, నవీన్ ఇటిక, జూనియర్ రాఘవేంద్రరావు.. ఇలా ఎన్నో పేర్లతో పాపులర్ అయ్యాడు. వరుస సినిమాలతో, విభిన్న పాత్రలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటుడిగా వెలుగొందుతున్న జబర్దస్త్ గడ్డం నవీన్ బర్త్డే నేడు (సెప్టెంబర్ 1). ఈ సందర్భంగా తన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ► ఇది 47వ పుట్టిన రోజు.. 1995లో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాను. అప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు చూశాను. ఈ సంవత్సరం చాలా సంతృప్తికరమైన జర్నీ సాగుతోంది. గేమ్ చేంజర్, సైంధవ్ సహా 10 సినిమాలు చేస్తున్నాను. మా పెద్దబాబు డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ► పుట్టిపెరిగింది సికింద్రాబాద్. మా తల్లిదండ్రులు కృష్ణ, సక్కుబాయి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. అయినా ఆర్థిక కష్టాలు మా కుటుంబాన్ని వెంటాడేవి. చదువుకుంటూనే మెకానిక్ షాపు, బట్టల షాపు, చిరు వ్యాపారాలు చేశాను. ఒకానొక సమయంలో ఆఫీస్ బాయ్గా కూడా పని చేశాను. ఆ క్రమంలోనే 1995 నుంచి సినీ అవకాశాల కోసం ప్రయత్నించాను. అప్పుడే పెళ్లిచేసుకున్నాను. నా భార్య పేరు బబితా. ఇద్దరు కొడుకులు పవన్ దినేష్, అక్షయ్ కుమార్. లోకల్ కాబట్టి సినీఇండస్ట్రీలో ఆకలి బాధలు పడలేదు కానీ.. మిగతా ఇబ్బందులు ఫేస్ చేశాను. ► సినిమాలకు వెళ్ళానుకున్నప్పుడు మా బాబాయ్ శ్రీను ప్రోత్సాహంతో ఓ చిన్న ఎంట్రీ దొరికింది. 'ప్రేమించేది ఎందుకమ్మా' సినిమాకి దర్శకులు సురేందర్ రెడ్డి ఆసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆ సమయంలో నా హెయిర్ స్టైల్ బాగుండేది. సురేందర్ రెడ్డి గారు నన్ను సెలెక్ట్ చేసి అవకాశం ఇచ్చారు. మా వైఫ్ కూడా ఆర్టిస్ట్. అమెను కూడా ఫస్ట్ టైమ్ అక్కడే చూశాను.. సినిమా పూర్తియ్యేసరికి పేరేంట్స్కి తెలియకుండా పెళ్లి చేసుకున్నాం. ఈ విషయం తెలిసి సీరియస్ అయ్యారు.. కానీ తర్వాత అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ► హీరో అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ పై కృష్ణ యాక్షన్ సీన్స్ చూసి బాగా ఫిదా అయ్యాను. ఆ తర్వాత చిరంజీవి సినిమాలు చూశాక మెంటల్ ఎక్కిపోయింది. ప్రతి ఆదివారం సినిమాలు చూడటం అలవాటై సినిమాలపై మక్కువ పెరిగింది. కమెడియన్గా కొంత గుర్తింపు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పటివరకు 150 సినిమాలు చేశాను. నిర్మాత కావాలనేదే నా లక్ష్యం. అంతేకాకుండా ఓ సింగిల్ థియేటర్ నిర్మించాలన్న కల కూడా ఉంది. ► జబర్దస్త్, సినిమాలు, ఈవెంట్స్ చేస్తున్నాను కానీ.. ఆ పేమెంట్ నా కుటుంబ పోషణకు ఉపయోగపడుతుంది. అయితే ఉద్యోగం చేసేవాడిని, కానీ ఇప్పుడు వెళ్లడం లేదు. మా కంపెనీ యాజమానీ దినేష్ గారు.. ఎప్పుడు వెళ్లినా నాకు ఉద్యోగం ఇస్తారు. అందుకే ఆ కంపెనీకి ఇంకా రాజీనామా చేయలేదు. సొంత ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ ఉంది. అప్పటి వరకు మీ సహకారంతో కష్టపడుతూనే ఉంటాను. చదవండి: ఫోటో షేర్ చేసిన మంచు లక్ష్మి.. విష్ణుకు ఎందుకు రాఖీ కట్టలేదంటూ..? -
రాకేష్ మరిన్ని సినిమాలు చేయాలి
‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్లో జరిగింది. తొలి సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ ఎంపీ (రాజ్యసభ) సంతోష్ కుమార్ క్లాప్ ఇచ్చారు. నటుడు తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు సాయికుమార్ మేకర్స్కి స్క్రిప్ట్ అందజేశారు. గ్రీన్ ట్రీ ప్రోడక్షన్స్ పతాకంపై జయలక్ష్మీ సాయి కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకత్వం వహిస్తుండగా, అనన్యా నాగళ్ల హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాప్రా రంభోత్సవంలో రోజా మాట్లాడుతూ– ‘‘రాకేష్కి ఎప్పట్నుంచో లీడ్ రోల్ చేయాలని ఉంది. ఈ సినిమాతో అది నెరవేరడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా విజయం సాధించి, భవిష్యత్లో రాకేష్ మరిన్ని సినిమాలు చేసి, ప్రజలకు వినో దాన్ని పంచాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘నటుడిగా, నిర్మాతగా రాకేష్ మరెన్నో సినిమాలు చేసి, మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు ఎంపీ సంతోష్ కుమార్. ‘‘చిన్న సినిమాలు పెద్దగా అవుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి, రాకేష్ మరో పది సినిమాలు చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు తనికెళ్ల భరణి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: చరణ్ అర్జున్. -
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇల్లు చూశారా? ఎంత బాగుందో!
ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి.. కొందరికి రాయడం ఇష్టం.. కొందరికేమో పాడటం ఇష్టం.. పెయింటింగ్స్ వేయడం.. డ్యాన్స్ చేయడం, నటించడం.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కోటి నచ్చుతుంది. చాలామంది దాన్ని టైంపాస్గా భావిస్తారు. కానీ కళాకారులు మాత్రం వాటినే నమ్ముకుని అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. అలా హాస్యాన్ని నమ్ముకుని, అందరినీ నవ్వించడమే పనిగా పెట్టుకున్నవాళ్లు ఎంతోమంది ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నారు. వారిలో ఒకరే జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్. తన పంచులతో, స్కిట్లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కెవ్వు కార్తీక్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఏడాది క్రితం కొత్త ఇల్లు కొనుక్కున్న కార్తీక్ తాజాగా హోం టూర్ వీడియో చేశాడు. తన ఇంటి గేటు దగ్గరి నుంచి ప్రతీది ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లు తెలిపాడు. 'గతంలో అద్దె ఇంట్లో ఉన్నప్పుడు హోంటూర్ చేశాను. నేను సొంతంగా ఓ ఇల్లు కొనుకున్నాక మళ్లీ హోంటూర్ వీడియో చేయాలనుకున్నాను. ఏడాది క్రితమే ఈ ఇల్లు కొన్నప్పటికీ ఇంటీరియర్, వస్తువులు అన్నీ సమకూర్చుకునేసరికి ఇంత సమయం పట్టింది. ఇన్నాళ్లకు ఇల్లు పూర్తిగా రెడీ అవడంతో వీడియో చేశాను. గతంలో నేను కింద పడుకునేవాడిని. సోఫా కూడా ఉండేది కాదు. నాకంటూ సొంతిల్లు ఉన్నాకే అవన్నీ కొనుక్కోవాలనుకున్నాను. ఇప్పుడు అన్నీ మంచి క్వాలిటీతో ఉన్నవి కొనుక్కున్నాను' అంటూ ప్రతి గదిని క్షుణ్ణంగా చూపించాడు కార్తీక్. హాల్, పూజ గది, డైనింగ్ టేబుల్, కిచెన్, మూడు బెడ్రూమ్స్, బాల్కనీ అన్నింటినీ తనకు నచ్చినట్లుగా ఆర్గనైజ్ చేయించుకున్నాడు. తన అవార్డులు, గృహప్రవేశానికి వచ్చిన బహుమతులను సైతం చూపిస్తూ పోయాడు. తన బాల్కనీని మొత్తం గ్రీనరీతో నింపేశాడు. ఈ ఇంట్లో నెమళ్ల శబ్ధాలు కూడా వినిపిస్తుండటం విశేషం. కాంక్రీట్ జంగిల్లో కాకుండా కాస్త ప్రశాంత వాతావరణం ఉన్న ప్రదేశంలో కార్తీక్ తన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అభిమానులు సైతం ఇల్లు చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎమ్మెల్యేగా పోటీ? స్పందించిన రాహుల్ -
ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్
జబర్దస్త్ కమెడియన్ నవసందీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమపేరుతో యువతిని మోసం చేశాడన్న ఫిర్యాదు మేరకు నవసందీప్ను మధురానగర్లో అరెస్ట్ చేశారు. కాగా ఇటీవల ఓ యువతి.. తనను నవసందీప్ ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు నటుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జబర్దస్త్ నటుడు నవసందీప్ 2018లో ఓ యువతికి ప్రేమకబుర్లు చెప్పి దగ్గరయ్యాడు. నిత్యం వాట్సాప్ చాటింగ్ చేసేవాడు. ఆమెను ఊరి నుంచి హైదరాబాద్కు రప్పించాడు. షేక్పేటలోని ఓ హాస్టల్లో ఆ యువతి నాలుగేళ్లుగా ఉంటోంది. ఈ క్రమంలో త్వరలో పెండ్లి చేసుకుంటానని నమ్మించి తన కోరిక తీర్చుకున్నాడు. తర్వాత ఆమె పెళ్లి ప్రస్తావన తేగానే ముఖం చాటేశాడు. తాను వేరొకరిని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు నవసందీప్ను అరెస్ట్ చేశారు. చదవండి: ‘బెదురులంక 2012’మూవీ రివ్యూ 2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా.. అదెలా? -
కుడికాలి వేలు తీసేశారు.. తొడపై చర్మాన్ని తీసి..: యాదమ్మరాజు
జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు కొద్దిరోజులుగా కాలికి కట్టుతో కనిపిస్తున్నాడు. తాజాగా స్లమ్డాగ్ హజ్బెండ్ ఈవెంట్లో కూడా అతడు చేతికర్ర సాయంతో నడుస్తూ కనిపించాడు. తనకు అంత పెద్ద గాయం ఎలా అయింది? ఏం జరిగిందనే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టాడు కమెడియన్. యాదమ్మరాజు మాట్లాడుతూ.. 'చాయ్ తాగడానికి బయటకు వెళ్లాను. అప్పుడే అటుగా వచ్చిన వ్యక్తి బైక్ స్కిడ్ అవడంతో నన్ను గుద్దేశాడు. కుడికాలి వేలు తీసేశారు. తొడ భాగం నుంచి చర్మం తీసేసి వేలు దగ్గర అతికించారు. ప్రాణం పోయినట్లనిపించింది. ఇప్పటికీ చాలా నొప్పిగా ఉంది. సినిమా ప్రమోషన్స్లో పాల్గొనాలి కదా అని ఈవెంట్స్లో, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాను' అని చెప్పుకొచ్చాడు. ఇంత జరిగినా ప్రమోషన్స్కు వచ్చిన యాదమ్మరాజుపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మునుపటిలా పరుగులు పెట్టకుండా ఇంట్లో ఉండి కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. ఇకపోతే పటాస్ కామెడీ షోతో పాపులరయ్యాడు యాదమ్మ రాజు. తన పంచులు, కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల పెదవులపై నవ్వులు పూయించాడు. జబర్దస్త్ షోతో మరింత మందికి చేరువైన ఈ కమెడియన్ ప్రియురాలి స్టెల్లా రాజ్ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ యూట్యూబ్ వీడియోలతో అభిమానులను అలరిస్తూ ఉంటారు. ప్రస్తుతం బుల్లితెర షోలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు యాదమ్మ రాజు. చదవండి: బిగ్బాస్ 7 ప్రారంభమయ్యేది అప్పుడే! -
ఒకానొక సమయంలో చనిపోదామనుకున్న వర్ష, త్వరలో బిగ్బాస్లోకి!
జబర్దస్త్ కామెడీషోతో పేరుప్రఖ్యాతలు సంపాదించింది వర్ష. అందంతో అలరిస్తూనే కామెడీ స్కిట్లతో నవ్విస్తున్న ఈ ముద్దుగుమ్మ బిగ్బాస్ 7వ సీజన్లో అడుగుపెట్టనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా బిగ్బాస్ షోలో తన ఎంట్రీపై స్పందించింది వర్ష. 'నాకు సినిమా ఛాన్సులు వచ్చాయి. ఒక స్పెషల్ సాంగ్ చేసే ఆఫర్ కూడా వచ్చింది. కానీ బుల్లితెరను వదలడం ఇష్టం లేక అక్కడికి వెళ్లలేదు. త్వరలో పెద్ద షోలో ఎంట్రీ ఇవ్వబోతున్నా అయితే ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్నాను. కానీ హీరోయిన్గా చేయాలన్న ఆశ లేదు. అక్క, వదిన, ఫ్రెండ్.. ఇలాంటి రోల్స్ మాత్రమే చేస్తాను. ఇకపోతే త్వరలో నేను ఓ పెద్ద షోకి వెళ్తున్నాను.. ఏం చదువుకున్నాను? వంటి విషయాలను అక్కడే రివీల్ చేస్తాను. ఇప్పటికే నాకు చెక్కులు కూడా పంపించేశారు' అంటూ పరోక్షంగా బిగ్బాస్ ఎంట్రీ గురించి హింట్లు వదిలింది వర్ష. అన్నయ్యను స్కూటీతో ఢీ కొట్టారు తన జీవితంలో ఎంతగానో బాధపడ్డ సందర్భం గురించి చెప్తూ.. 'నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరు. రెండేళ్లక్రితం నేను సంక్రాంతికి ఊరెళ్లాను. అప్పుడు అమ్మ ఫోన్ చేసి మా చిన్న అన్నయ్యకు యాక్సిడెంట్ అయిందని, త్వరగా రా అని చెప్పింది. మా అన్నయ్యను స్కూటీతో గుద్దారు. అది చాలా చిన్న యాక్సిడెంట్ అనుకున్నాను. తీరా ఆస్పత్రికి వెళ్లాక తన బ్రెయిన్లో రక్తం గడ్డకట్టింది.. బతకడం కష్టం అన్నారు. డాక్టర్ కాలు పట్టుకుని ఏడ్చాను. ఎంత ఖర్చయినా సరే బతికించండి అని బతిమాలాను. రెండు రోజులు వాష్రూమ్ బయటే నిద్ర అన్నయ్య కండీషన్ నాకు మాత్రమే తెలుసు. ఇంట్లో ఎవరికి చెప్పినా వాళ్లు తట్టుకోలేరు. అందుకే ఆ టెన్షన్ అంతా నేనే భరించాను. రెండు రోజులు వాష్రూమ్ బయట పడుకున్నాను. ఆ తర్వాత రోజు అన్నయ్య మెదడులో రక్తం లీక్ అవుతుందని చెప్పడంతో భరించలేకపోయాను. చచ్చిపోదాం అనుకున్నాను. ఇంతలో అంబులెన్స్లో సొమ్మసిల్లి పడిపోవడంతో సెలైన్స్ పెట్టి నాకు ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత అన్నయ్యకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో ఎంతో సంతోషించాను. ఎందుకంటే అన్నయ్య నా పంచప్రాణాలు' అని చెప్పుకొచ్చింది వర్ష. చదవండి: బిగ్బాస్ షో ఫేక్.. జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు: సరయు -
డైరెక్టర్గా జబర్దస్త్ కమెడియన్.. 'ప్రతి సీన్ మనసును కదిలిస్తుంది'!
సాయికుమార్, ఆదిత్యా ఓం, ఐశ్వర్య, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి, దీపాలి రాజ్పుత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నాతో నేను’. శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్ట్ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మించారు. ఈ నెల 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నటుడు సాయి కుమార్ హాజరయ్యారు. (ఇది చదవండి: స్టార్ డైరెక్టర్ కొత్త వెబ్ సిరీస్.. ఈసారి ఇంకెన్ని వివాదాలో?) సాయికుమార్ మాట్లాడుతూ.. 'నాన్న అమ్మ ఇచ్చిన స్వరం, సంస్కారంతో నేను ఈ స్థాయిలో ఉన్నా. చక్కని కథలతో వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా నిలబడ్డా. మనసును కదిలించే కథతో సినిమా రూపొందించారు. ఈ చిత్రంలో ప్రతి సీన్ మనసును కదిలిస్తుంది.' అని అన్నారు. శ్రీనివాస్ సాయి మాట్లాడుతూ..' చక్కని కథాంశంతో ఎమోషన్స్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. టీమ్ అంతా కష్టపడ్డాం. చిన్న సినిమానే కావచ్చు కానీ మంచి ప్రయత్నం.' అని అన్నారు. శాంతికుమార్ మాట్లాడుతూ.. 'జబర్దస్త్ కమెడియన్గా ప్రేక్షకుల ఆదరణ పొందా. నేను దర్శకత్వం వహించే వరకూ వచ్చానంటే నిర్మాతలే కారణం. కథ అన్ని ఓకే అయ్యాక సీనియర్ ఆర్టిస్ట్ సాయికుమార్ సరే అనగానే నేను సక్సెస్ అయ్యాననిపించింది. అన్ని రకాలుగా సహకరించిన నిర్మాతకు కృతజ్ఞతలు.' అని అన్నారు. కరోనా వల్ల కాస్త ఆలస్యమైనా మంచి సమయంలో విడుదల చేస్తున్నామని ఈ చిత్ర నిర్మాత అన్నారు. ఈ చిత్రంలో సమీర్, సీవీఎల్ నరసింహారావు, గౌతమ్ రాజు, ఎమ్మెస్ చౌదరి, భద్రం, సుమన్ శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. (ఇది చదవండి: బిగ్బాస్లోకి ఇండియన్ స్టార్ క్రికెటర్ .. స్టార్ మా ప్లాన్ ఇదేనా?) -
జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్ తల్లి మల్లమ్మ అస్వస్థతకు లోనైంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా గుండెపోటు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. గుండెలో బ్లాక్స్ ఉండటంతో వైద్యులు స్టంట్స్ వేశారు. ఈమేరకు ఓ వీడియోను ముక్కు అవినాశ్ తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాడు. 'ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మ ఇలా ఇబ్బందిపడటం చూడలేకపోతున్నా. తను ముందు నుంచే షుగర్ వ్యాధితో బాదపడుతోంది. ఈ షుగర్ వల్ల నచ్చిన ఫుడ్ కూడా తినలేకపోతోంది. ఈ మధ్యే అమ్మకు గుండెపోటు(హార్ట్ స్ట్రోక్) వచ్చింది. తనను ఊరిలో ఆస్పత్రికి తీసుకెళ్తే అమ్మ గుండె వీక్ ఉందన్నారు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడే ఒక ఆస్పత్రిలో చూపించాను. గుండెలో రెండు పెద్ద బ్లాక్స్ ఏర్పడ్డాయి. ఆంజియోగ్రామ్ చేయించాం, రెండు స్టంట్స్ వేయించాం. తననిప్పుడు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి' అని చెప్పుకొచ్చాడు. తనకు వచ్చిన పరిస్థితిని తలుచుకుని అవినాశ్ తల్లి కన్నీటిపర్యంతమైంది. 'నా కొడుకులు బతికించారు, అందుకే బతికినా. జరగబోయేది నాకు తెల్వదు. మీ దయ వల్ల మంచిగుండి డ్యాన్స్ చేశిన, అన్నీ చేశిన. నాకిప్పుడు ఈ కష్టం వచ్చింది. మీరు లేకుంటే బతకలేను, నా పెద్ద కొడుకు లేకపోయుంటే ఊరిలోనే నా ప్రాణం పోయేది. వాడు తొందరగా నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించడం వల్లే బతికి ఉన్నాను' అంటూ ఏడ్చేసింది. కొద్దిరోజులపాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ముక్కు అవినాశ్ తల్లిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లాడు. చదవండి: శామీర్పేట్ ఘటన.. నాకు సంబంధమే లేదంటున్న నటుడు మనోజ్ -
పెళ్లికి సిద్ధమైన జబర్దస్త్ కమెడియన్ .. అమ్మాయి ఎవరో చెప్పేశాడు!
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ శుభవార్తను అతడే స్వయంగా ఇన్స్టాగ్రామ్లో వెల్లడించాడు. తనతో కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను అంటూ నోట్ రాసుకొచ్చాడు. తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. అయితే ఇందులో ఆ అమ్మాయి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. అయితే తాజాగా మరోసారి తాను చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేస్తూ మరోసారి ఇన్స్టాలో ఫోటోలు పంచుకున్నారు. ఈ ఫోటోల్లో తనకు కాబోయే అమ్మాయి ముఖ పరిచయం చేశారు. అంతే కాకుండా ఫోటోలతో పాటు ఓ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు కెవ్వు కార్తీక్. ఇది చూసిన పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇది చదవండి: దుబాయ్ నుంచి తిరిగొచ్చిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!) కార్తీక్ తన ఇన్స్టాలో రాస్తూ..'ఫైనల్గా నేను చేసుకోబోయే అమ్మాయి. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని విన్నా. కానీ ఆ సమయంలో నాకు అర్థం కాలేదు. రెండు భిన్నమైన మనసులు, భిన్నమైన జీవితాలు, భిన్నమైన అభిప్రాయాలు, విభిన్న ప్రపంచాలు జీవిత ప్రయాణమనే పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఒకే హృదయంగా మారుతున్నాయి.. వెల్కమ్ టూ మై లైఫ్ సిరి.' అంటూ పోస్ట్ చేశారు. కాగా కెవ్వు కార్తీక్ ఎన్నో కష్టాలు దాటుకుని సెలబ్రిటీ స్థాయికి ఎదిగాడు. ఓ పక్క ఇంజనీరింగ్ చదువుతూనే మిమిక్రీలో డిప్లొమా పూర్తి చేసిన అతడు ఎంటెక్ చేసి ఉద్యోగం సంపాదించాడు. కానీ మిమిక్రీ, కామెడీపై ఉన్న ప్యాషన్తో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తర్వాత హైదరాబాద్ వచ్చి మిమిక్రీ ఆర్టిస్టుగా స్టేజీ షోలు చేశాడు. అనంతరం కామెడీ క్లబ్, జబర్దస్త్ షోలలో మెరిశాడు. జబర్దస్త్లో ఒక టీమ్లో సభ్యుడిగా మాత్రమే ఉన్న కార్తీక్ తర్వాత టీమ్ లీడర్గా మారాడు. (ఇది చదవండి: మరోసారి జంటగా లవ్ బర్డ్స్.. డేటింగ్పై మొదలైన చర్చ!) View this post on Instagram A post shared by Kevvu Kartheek (@kevvukartheek) -
విషమంగా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం.. ఆపరేషన్కు లక్షల్లో ఖర్చు!
జబర్ధస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెగ్యులర్గా డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి లేదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్గా ఉందని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. వీలైనంత త్వరగా అతడికి ఆపరేషన్ చేయాలని, అందుకు చాలా ఖర్చవుతుందని, దాతలు సాయం చేయాలని కోరాడు. పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తూ అతడి యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో నూకరాజు మాట్లాడుతూ.. 'ఎన్నో ఆస్పత్రులు తిరిగాం.. అయినా ప్రసాద్ అన్న ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. మూడు సంవత్సరాల క్రితమే రెండు కిడ్నీలు ఫెయిలవగా అప్పటినుంచి ఆ బాధను అలాగే భరిస్తున్నాడు. ఈ కిడ్నీ సమస్య ఉన్నవారికి ఒకదాని వెనుక ఒకటి జబ్బులు వస్తూనే ఉంటాయి. అన్న విషయంలోనూ అదే జరిగింది. వీలైనంత త్వరగా అతడికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలని వైద్యులు చెప్పారు. లేదంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. కిడ్నీ ఆపరేషన్కు లక్షల్లో ఖర్చవుతుంది. చేతులెత్తి వేడుకుంటున్నా.. దయచేసి మీకు తోచినంత సాయం చేయండి' అని సాయం కోసం అర్థించాడు నూకరాజు. ఈ వీడియోలో పంచ్ ప్రసాద్ ముఖానికి ఆక్సిజన్ మాస్కు పెట్టుకుని కనిపించాడు. చదవండి: డేటింగ్లో బాలీవుడ్ హీరోయిన్ -
Chalaki Chanti: ఇంకా ఐసీయూలోనే చలాకీ చంటి
కమెడియన్, నటుడు చలాకీ చంటి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే! ఈ నెల 21న చంటికి తీవ్రమైన ఛాతీనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు గుండెపోటుగా గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు తేలడంతో డాక్టర్లు స్టంట్ వేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఓ వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది. చంటి ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఇంతవరకు ఎక్కడా స్పందించనేలేదు. కాగా జబర్దస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు చలాకీ చంటి. తనదైన కామెడీ టైమింగ్తో, కడుపుబ్బా నవ్వించే స్కిట్లతో ప్రేక్షకులను అలరించాడు. బిగ్బాస్ ఆరో సీజన్లోనూ పాల్గొన్న అతడు సినిమాల్లోనూ నటించి గుర్తింపు సంపాదించుకున్నాడు. కొంతకాలంగా మాత్రం అతడు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై కనిపించడం లేదు. చదవండి: విరూపాక్ష సినిమా వేయలేదని థియేటర్పై తేజ్ ఫ్యాన్స్ దాడి -
కమెడియన్ చలాకీ చంటికి గుండెపోటు
-
జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటికి సీరియస్? ఐసీయూలో చికిత్స!
జబర్దస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కమెడియన్ చంటి. చలాకీతనం, తనదైన కామెడీ టైమింగుతో అలరించిన చంటి కొంతకాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. పలు కామెడీ షోస్ చేసిన చలాకీ చంటి సినిమాల్లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. బిగ్బాస్ సీజన్-6లోనూ పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. కానీ బిగ్బాస్ నుంచి బయటకు వచ్చాక ఏ షోలోనూ పెద్దగా కనిపించలేదు. అయితే ప్రస్తుతం ఆయన తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. గుండెపోటుతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఐసీయూలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. -
ఐదేళ్లు కష్టాలు అనుభవించా.. అలా ఎవరికీ జరగకూడదు: జబర్దస్త్ కొమరం
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్ కొమరం. కామెడీ పంచులతో అదరగొట్టే కొమరం అంటే ఇండస్ట్రీలో ఎవరూ గుర్తు పట్టలేరేమో. ఎందుకంటే తన పాత్ర కొమరక్కతోనే అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్నారు. తన యాస, భాష, కట్టు బొట్టుతో అందరిని మెప్పించారు. పలు టీవీ ఛానెల్స్లో నటించిన కొమరం.. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయారు. ప్రస్తుతం నాని నటించిన దసరా చిత్రంలో కనిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కొమరం తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. తన కెరీర్లో అన్ని కష్టాలు చూశానని ఎమోషనల్ అయ్యారు. కొమరక్క అని పిలిస్తేనే సంతోషం కొమరం మాట్లాడుతూ.. 'నాపేరు కొమరం కదా.. అందుకే కొమరక్క అని పేరును నా క్యారెక్టర్ పెట్టుకున్నా. కొమరక్క అంటే ఎవరినీ లెక్క చేయదు. అయితే ఈ క్యారెక్టర్ మామూలుగా సక్సెస్ కాలేదు. చాలామందికి కొమరక్క అంటే ఒక మహిళ అని తెలుసు. నన్ను బయట ఎవరైనా చూస్తే కొమరక్క అనే అంటారు. ఆ పేరుతోనే అందరూ ఫిక్సయిపోయారు. కానీ నాకు ఆ పేరుతో పిలిస్తేనే ఇష్టం. నేను పనిచేసే ఛానెల్లో షో ఆపేయడంతో కొమరక్క టీవీ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించా.' అని అన్నారు. అన్ని రకాల పనులు చేశా ఇండస్ట్రీలోకి రాకముందు అన్ని రకాల పనులు చేశానని కొమరం తెలిపారు. ఆయన మాట్లాడుతూ..' హైదరాబాద్లో సిగ్నల్స్ దగ్గర స్కూల్ బ్యాగులు, గొడుగులు అమ్మేవాడినని.. కోఠిలో నిలబడి వస్తువులు అమ్మేవాడిని. అవన్నీ చాలా హ్యాపీగా ఇష్టంతోనే అన్నీ పనులు చేశా. హోటల్లో కూడా పని చేశా. క్యాటరింగ్లో కూడా చేశా. పాత్రలు కడిగేవాడిని. ఇండస్ట్రీలోకి రాకముందు ఇవన్నీ చేశా. ఈ ఫీల్డ్లోకి వచ్చాక కూడా ఇబ్బందులు పడ్డా. కానీ సక్సెస్ అయ్యాను. నా జీవితంలో ఇంత మార్పు వస్తుందని ఊహించలేదు. నేను చదివింది పదో తరగతి మాత్రమే. ఇంత పేరు వస్తుందని నా లైఫ్లో అనుకోలేదు. ప్రస్తుతం మూవీస్తో బిజీ అవ్వడం వల్ల కామెడీ షో నుంచి బయటకొచ్చేశా. ' అని అన్నారు. ఆ ఐదేళ్లు నా లైఫ్లో మళ్లీ రాకూడదని కోరుకుంటా కొమరం మాట్లాడుతూ.. 'ఐదేళ్లు లైఫ్లో ఇబ్బందులు పడ్డా. అలాంటి పరిస్థితులు మళ్లీ రావొద్దని కోరుకుంటా. అవీ తలుచుకుంటే ఏడుపొచ్చేది. మా నానమ్మ చనిపోయినప్పుడు బాధేసింది. మా అమ్మ కూడా సినిమాల్లోకి పోమ్మని చెప్పేది. మా చెల్లెలు అంటే నాకు పిచ్చి. ' అని అన్నారు. ప్రస్తుతం నాని, కీర్తి సురేశ్ నటించిన దసరా చిత్రంలో నటించారు. -
రచ్చ రవి ఇంట్లో బలగం సీన్.. చెల్లె కోసం బోరుమని ఏడ్చిన కమెడియన్
చిన్నచిన్న గొడవలతో అయినవాళ్లకే దూరమవుతున్నాం. ఉరుకుల పరుగుల జీవితంలో బంధాలకు, బంధుత్వాలను మర్చిపోతున్నాం. కానీ అంతా మనవాళ్లే అనుకుని కలిసిమెలిసి ఉంటే అంతకు మంచిన ఆనందం మరొకటి ఉండదు. ఇదే విషయాన్ని బలగంతో నిరూపించాడు దర్శకుడు వేణు. ఈ సినిమాలో జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి కూడా నటించాడు. అయితే రచ్చ రవి నిజ జీవితంలోనూ బలగం సీన్ ఎదురైంది. తను ఎంతగానో ప్రేమించిన చెల్లె మాట్లాడటం లేదని కన్నీరుమున్నీరుగా విలపించాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. '2016లో మా ఇంటి గృహప్రవేశం జరిగింది. అప్పుడు వచ్చిన చెల్లె రజిత ఆ తర్వాత ఎన్నడూ మా ఇంటికి రాలేదు. తనిచ్చిన 123 రూపాయలతో హైదరాబాద్కు వచ్చాను. ఎన్నో తిప్పలు పడి ఈ స్థాయికి వచ్చాను. నాకు సమయం లేక తనతో సరిగా మాట్లాడలేదు. దాన్ని ఆమె తప్పుగా అర్థం చేసుకుంది. ఎన్నిసార్లు బతిమాలినా ఇంటికి రాననే చెప్తుంది. నేనేమైనా తప్పు చేస్తే తిట్టాలి కానీ ఇన్నేళ్లవుతున్నా ఇంటికి రావడం లేదు. రాఖీ పండగ వస్తే నేనే చెల్లె ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకుంటున్నాను, తను మాత్రం మా ఇంటికి రావడం లేదు. ఆమె ఇచ్చిన డబ్బులతోనే సిటీకి వచ్చి ఇంత సంపాదించాను. తను నా ఇంటికి వస్తే చూడాలనుంది. చెల్లె గుర్తుకు వస్తే నాకు కన్నీళ్లు ఆగట్లేదు' అని కంటతడి పెట్టుకున్నాడు రచ్చ రవి. ఇది చూసిన నెటిజన్లు 'మీ అన్న చేసిన బలగం సినిమా చూసి తప్పకుండా వచ్చి కలుస్తావని ఆశిస్తున్నాం', 'ఒక్కసారి వచ్చిపోవమ్మా.. ఆయన ఏడుస్తుంటే మాకు కన్నీళ్లొస్తున్నాయి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
రెండేళ్లు పిచ్చికుక్కలా తిరిగా.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ఆర్పీ
కమెడియన్ కిర్రాక్ ఆర్పీ పేరు ప్రస్తుతం నగరంలో మార్మోగిపోతోంది. ప్రముఖ కామెడీ షో నుంచి బయటకు వచ్చిన ఆయన బిజినెస్లో దూసుకెళ్తున్నారు. ఆర్పీ సొంతంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ బిజినెస్కు అదేస్థాయిలో అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా హైదరాబాద్లోని అమీర్పేట్లో ఆయన తన మూడో బ్రాంచ్ను ప్రారంభించారు. టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ చేతుల మీదుగా ప్రారంభించారు. బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్పీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యాపారంలో లాభాలు రాకున్నా ఫరవాలేదు కానీ.. కస్టమర్ల సంతృప్తి తమకు అంతిమ లక్ష్యమని తెలిపారు. అయితే త్వరలోనే నెల్లూరు చేపల పులుసు ఫ్రాంచైజీలను ఇవ్వనున్నట్లు ఆర్పీ పేర్కొన్నారు. పెళ్లి తేదీపై క్లారిటీ అలాగే తన పెళ్లిపై కూడా కిరాక్ ఆర్పీ క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది నవంబర్ 29న పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న కిరాక్ ఆర్పీ లక్ష్మీ ప్రసన్నను ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నవంబర్లో పెళ్లిబంధంలో అడుగుపెడుతున్నట్లు వెల్లడించారు. అమీర్పేట్లో బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా పెళ్లి తేదీపై క్లారిటీ ఇచ్చారు. ఆర్పీ - లక్ష్మీ ప్రసన్న లవ్ స్టోరీ ప్రేమ పెళ్లిపై ఆర్పీ మాట్లాడుతూ..' నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను పిచ్చికుక్క తిరిగినట్లు ఆమె చుట్టూ రెండేళ్లు తిరిగా. చివరికి వాళ్ల పేరెంట్స్ నా మంచితనం చూసి ఓకే చెప్పారు. ఒక అమ్మాయిని ప్రేమిస్తే తప్పెలా అవుతుంది' అని అన్నారు. లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ..' 'ఆర్సీ రెడ్డి కోచింగ్లో సెంటర్లో ఆయన గెస్ట్గా వచ్చారు. అప్పటి నుంచి మా అమ్మ నంబర్ తీసుకున్నారు. ఆ తర్వాత మా ఫ్యామిలీకి దగ్గరయ్యారు. మా బంధువులెవరో తెలుసుకుని అందరికీ దగ్గరయ్యారు. ఆ తర్వాత వారితో మా అమ్మను పెళ్లికి ఒప్పించారు.' అని అన్నారు. -
నేను ఈ స్టేజ్కు వచ్చానంటే ఆయనే కారణం: సుడిగాలి సుధీర్
ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలంగాణ యాసభాషలతో సాగుతుంది. మంగళవారం బలగం ప్రీరిలీజ్ ఈవెంట్ సిరిసిల్లలోని బతుకమ్మ ఘాట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 'నేను అనేవాడిని ఈ స్టేజీలో ఉన్నానంటే అందుకు వేణు అన్ననే కారణం. నేను, నా కుటుంబ సభ్యులు ఈరోజు మూడు పూటలా తింటున్నామంటే అందుకు ఆయనే కారణం. నాకు జబర్దస్త్లో ఛాన్స్ ఇచ్చి నన్ను ఆదుకుంది వేణన్న! జీవితాంతం తనకు రుణపడి ఉంటాను. ఇప్పటిదాకా వేణు అన్న అందరికీ ఓ కమెడియన్గానే తెలుసు. అలాంటి వ్యక్తి దగ్గర మంచి టాలెంట్ ఉందని గుర్తించి ఆయనకు సినిమా తీసే ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజుకు థ్యాంక్స్. సినిమా చూశాక మన తోబుట్టువులను ఒక్కసారి చూడాలి, వారితో మాట్లాడాలి అనిపిస్తుంది. తల్లిదండ్రులు బతికున్నప్పుడే వారిని బాగా చూసుకోవాలని మీకు అనిపించక మానదు. ఫ్యామిలీతో వెళ్లి చూడండి, సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది' అని చెప్పుకొచ్చాడు సుధీర్. చదవండి: ఫ్యామిలీకి దూరంగా సూర్య దంపతులు? -
కష్టాలతో సావాసం.. పేరెంట్స్కు ఫైమా ఊహించని గిఫ్ట్!
పటాస్, జబర్దస్త్ వంటి కామెడీ షోలతో బాగా క్లిక్కైంది ఫైమా. స్కిట్లతో కడుపుబ్బా నవ్వించే ఫైమా తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూసింది. ఎన్నో అడ్డంకులను దాటుకుని ఈ స్టేజీదాకా రావడానికి కారణం తన పేరెంట్స్ సపోర్టేనని తరచూ చెప్తూ ఉంటుంది. చిన్నప్పుడు అద్దె ఇంట్లో కష్టాలు పడ్డ ఫైమా తన పేరెంట్స్కు ఎప్పటికైనా ఒక ఇల్లు కొనివ్వాలని కంకణం కట్టుకుంది. కాగా తన కష్టార్జితంతో తన కుటుంబానికోసం ఓ ఇల్లు కొన్నానని, ప్రస్తుతం దాని ఇంటీరియర్ డిజైన్ జరుగుతోందంటూ గుడ్న్యూస్ చెప్పిందీ కమెడియన్. అలాగే తన పేరెంట్స్ కోసం ఓ కారు కూడా కొంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ మేరకు యూట్యూబ్లో ఓ వీడియో షేర్ చేసింది. 'మా ఇంట్లో అబ్బాయిలు లేరు. చుట్టుపక్కల వాళ్లు తమ కొడుకు కారులో ఎక్కిపోతుంటే మా పేరెంట్స్ ముఖంలో బాధ చూశాను. అప్పుడు ఆ బాధను తగ్గించేందుకు స్కూటీ తీసుకుని దానిపై వాళ్లను తిప్పాను. కానీ వాళ్లను కూడా ఏదో ఒకరోజు కారులో ఎక్కించుకుని తిరగాలనుకున్నాను. అదిప్పుడు నిజం కాబోతోంది' అంటూ ఎమోషనలైంది. షోరూమ్కు వెళ్లి కారును సెలక్ట్ చేసిన ఫైమా త్వరలో కారులో తిరగబోతున్నామంటూ సంతోషం వ్యక్తం చేసింది. చదవండి: రష్మీపై చేతబడి, యాసిడ్ దాడి చేస్తామంటూ పోస్టులు -
నాన్న తాగుబోతు, తినడానికి కూడా తిండి లేని పరిస్థితి: పవిత్ర
ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే కాదు, ఎదుటివారిని కూడా నవ్విస్తుంది. తన పంచులతో, అల్లరితో, స్కిట్లతో కామెడీ పంచే లేడీ కమెడియన్స్ లిస్టులో పాగల్ పవిత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు పులుముకునే ఆమె జీవితంలో ఎంతో విషాదం ఉంది. తాజాగా ఆ విషాదాలను గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది పవిత్ర. 'నాన్న లారీ డ్రైవర్. అమ్మ మహిళా రైతు. పని చేస్తే కానీ పూట గడవని ఫ్యామిలీ మాది. మూడు పూటలు తినడానికి కూడా ఆలోచించేవాళ్లం. నాన్న తాగుడుకు బానిసై మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు. ఇంటర్ వరకు చదవడానికి కూడా మా పిన్ని సాయం చేసింది. ఇంకా వాళ్లను కష్టపెట్టడం ఎందుకని చదువు మానేసి హైదరాబాద్కు వచ్చి సెలూన్ పెట్టుకున్నాను. అనుకోకుండా జబర్దస్త్లో ఛాన్స్ వచ్చింది. సెలూన్ రన్ అవకపోవడంతో దాన్ని తీసేసి ఆ డబ్బుతో సొంతూరిలో మాకంటూ ఓ ఇల్లు కొనుక్కున్నాం. అప్పటిదాకా మాకు సొంతిల్లనేదే లేదు. తాగుడుకు బానిసయ్యాడని నాన్నతో 13 ఏళ్లు మాట్లాడలేదు. ఆయన ముఖం చూడటానికి ఇష్టపడేదాన్ని కాను. ఏడాది క్రితమే ఆయన చనిపోయారు. ఆ క్షణం నేను సంతోషంగా ఫీలయ్యాను' అని చెప్తూనే కంటతడి పెట్టుకుంది పవిత్ర. చదవండి: భర్తకు దూరంగా ఉంటున్న దివ్యవాణి? నటి ఏమందంటే? -
జబర్దస్త్ వినోద్కి ఏమైంది? ఇలా మారిపోయాడేంటి?
జబర్దస్ధ్ షో ద్వారా కమెడియన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్లలో వినోద్ ఒకరు. ముఖ్యంగా లేడీ గెటప్స్తో పాపులర్ అయిన వినోద్ ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం బాలేక బక్కచిక్కి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తాజాగా ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనారోగ్యం వెనకున్న కారణాన్ని బయటపెట్టాడు. 'నాకు లంగ్స్(ఊపిరితిత్తులు)లో ఇన్ఫెక్షన్ వచ్చింది. దీనివల్లే ఇలా వీక్ అయ్యాను. ఎక్కువగా ప్రయాణాలు చేయడం, ఏసీలో ఎక్కువసేపు ఉండటం, చల్లటీ నీళ్లు తాగడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల ఇలా అయ్యింది. ఈ సమస్య వచ్చిన కొత్తలో నడవడం కూడా కష్టమైపోయింది. ఆ సమయంలో నాకు ఫ్యామిలీ అండగా నిలబడింది. మెడిసిన్స్ వల్ల హెయిర్ లాస్ కూడా అయ్యిందని, అయితే ప్రస్తుతం తాను కోలుకుంటున్నాను' అని పేర్కొన్నాడు. -
వర్ష తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ఇమ్మానుయేల్
-
జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే?
జబర్దస్త్ కమెడియన్ ‘పంచ్’ ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా కిడ్నీ ఫెయిల్యుర్ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. అతడి వెన్ను భాగం నుంచి కాళ్లకు చీము రావడంతో ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నాడు. పంచ్ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల కమెడియన్ నూకరాజు వ్లాగ్ చేసి పంచ్ ప్రసాద్ యూట్యూబ్లో చానల్లో పోస్ట్ చేశాడు. దీంతో పంచ్ ప్రసాద్ కోలుకోవాలని బుల్లితెర ప్రేక్షకులు, అతడి ఫాలోవర్స్ కోరుకున్నారు. చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే తాజాగా నూకరాజు మరో వీడియో షేర్ చేశాడు. ఇందులో పంచ్ ప్రసాద్ కొద్ది కొద్దిగా రికవరి అవుతున్నట్లు చెప్పాడు. ఇప్పటి వరకు కనీసం సొంతంగా లేవలేని స్థితిలో ఉన్న ప్రసాద్ ఇప్పుడు కర్ర, ఒకరి సాయంతో నడవగలుగుతున్నట్లు తెలిపాడు. కాగా గత నాలుగు రోజులుగా ఆయనకు చికిత్స జరుగుతుందని, అప్పటి నుంచి రోజంత సైలెన్స్ ఎక్కుతున్నట్లు చెప్పాడు. అంతేకాదు ప్రత్యేకంగా ఓ నర్స్ ఇంట్లోనే ఉండి 24 గంటలు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు నూకరాజు పేర్కొన్నాడు. మరో నాలుగు రోజుల వరకు ఇలాటే చేయాల్సి ఉంటుందన్నాడు. సైలెన్స్ ద్వారా పంచ్ ప్రసాద్కి యాంటిబయోటిక్స్ ఇస్తున్నారని నూకరాజు తెలిపాడు. ఇక హాస్పిటల్కు వెళ్లి పంచ్ ప్రసాద్ స్కానింగ్ కూడా చేయించుకున్నాడు. మరో వారం గడిచిన తర్వాతే ప్రసాద్ నడవగలడా? లేదా? అనే విషయం చెబుతామని డాక్టర్స్ చెప్పినట్లు విషయం చెబుతామని ఈ వీడియోలో డాక్టర్స్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వీడియోపై పంచ్ ప్రసాద్ ఫ్యాన్స్, ఫాలోవర్స్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో.. పంచ్ ప్రసాద్ భార్య నిజంగా గ్రేట్, పెళ్లికి ముందే ప్రాబ్లమ్ తెలిసినా.. -
పంచ్ ప్రసాద్ భార్య నిజంగా గ్రేట్, పెళ్లికి ముందే ప్రాబ్లమ్ తెలిసినా..
నవ్వించడం అందరికీ చేతకాదు.. అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. చిన్న నవ్వు.. కష్టాలను, ఒత్తిడిని మర్చిపోయేలా చేసి స్వాంతన చేకూర్చుతుంది. కానీ అలా నవ్వించేవారి జీవితాల్లో ఎంతో విషాదం ఉంటుంది. అయినా దాన్ని పెదాల చాటునే బిగబట్టుకుని ఆపేస్తారు. వారి కష్టాలను కూడా కామెడీ చేసి నవ్విస్తారు. కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆ కోవలోకే వస్తాడు. ఓపక్క తనకున్న వ్యాధితో పోరాడుతున్నా పైకి మాత్రం నవ్వుతూ నవ్విస్తూ ఉన్నాడు. తాజాగా అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. కనీసం తనంతట తానుగా నాడవలేకపోతున్నాడు. ఇంతకీ పంచ్ ప్రసాద్కు వచ్చిన వ్యాధి ఏంటి? ఎంతకాలం నుంచి దానితో పోరాడుతున్నాడనే విషయాలను ఈ కమెడియన్ కొంతకాలం కిందట ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అందులో ఆయన ఏమన్నాడంటే.. 'మాది లవ్ మ్యారేజ్. నా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కిడ్నీ సమస్య బయటపడింది. నాతో సహా మా ఇంట్లో వాళ్లు కూడా ఈ పెళ్లి వద్దని అమ్మాయికి నచ్చజెప్పాం. కానీ ఒక్కరోజు నాతో ఉన్నా చాలని చెప్పి అందరినీ ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక మేము మణికొండలో అవినాష్ వాళ్ల ఇంటిపై పోర్షన్లో ఉండేవాళ్లం. ఓసారి పైన ఉన్నప్పుడు నాకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. అప్పుడు నా భార్య గర్భవతి. ఆమెకు చెప్తే కంగారు పడుతుందని కిందకు వచ్చి కూర్చున్నా. నా ముక్కు, నోటి నుంచి రక్తం ధారగా కారింది. అప్పుడే అటుగా వచ్చిన గెటప్ శ్రీను నా భార్యను పిలిచి రూ.50 వేలిచ్చి వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ చేయించాడు. నేను ఐసీయూలో ఉన్నప్పుడు కూడా ఆస్పత్రిలోనే ఉండిపోయేది. ఒకానొక సమయంలో ఈ ఖర్చులు, నొప్పి భరించడం నావల్ల కాదని చనిపోదామనుకున్నా. కానీ నాకు కిడ్నీ ఇవ్వడానికి కూడా నా భార్య సిద్ధమైంది. ఇప్పటికీ నా ఆరోగ్యం గురించి పూర్తిగా ఆవిడే చూసుకుంటుంది' అని చెప్పుకొచ్చాడు. పంచ్ ప్రసాద్కు కిడ్నీలు పాడయ్యాయని తెలిసినా పెళ్లి చేసుకుని అతడిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుందంటే ఆ ఇల్లాలు నిజంగా గ్రేట్ అంటున్నారు నెటిజన్లు. చదవండి: నడవలేని స్థితిలో పంచ్ ప్రసాద్ పబ్లిక్గా అసభ్యంగా తాకాడు, అప్పుడు ఏం చేశానంటే: సుష్మితా సేన్ -
ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో..
తనదైన కామెడీ, పంచ్ డైలాగ్స్తో బుల్లితెర ప్రేక్షకులను నవ్వించిన పంచ్ ప్రసాద్ నిజ జీవితంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. కనీసం ఆయనకు వచ్చిన ఆ జబ్బు ఎంటో కూడా తెలియని స్థితితో బాధపడుతున్నారు. కాగా ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ తో ప్రసాద్ కమెడియన్గా గుర్తింపు పొందాడు. తనదైన స్పాంటేనిటి పంచ్లతో ‘పంచ్’ ప్రసాద్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు. కొంతకాలంగా ఆయన కిడ్నీ ప్రాబ్లమ్తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తనకున్న వ్యాధిని కూడా చాలా సందర్భాల్లో స్కిట్లో వాడి అందరిని నవ్వించాడు. చదవండి: అద్దె ఇంట్లో ఉండేవాళ్లం, రెంట్ కట్టలేక 2 నెలలకో ఇల్లు మారేవాళ్లం: రష్మిక ఎప్పుడు ఏ షోలో కనిపించినా ఫుల్ కామెడీ చేస్తూ కడుబ్బా నవ్వించే ప్రసాద్ను గత కొన్నేళ్ల నుంచి కిడ్నీ సమస్య వేధిస్తోంది. అయినా సరే షోల్లో యాక్టివ్గా ఉంటూ కామెడీ చేస్తూ వస్తున్నాడు. ప్రతివారం డయాలసిస్ చేసుకుంటున్నా సరే తన బాధను బయటకు చెప్పకుండా నవ్వించాడు. అలాంటి పంచ్ ప్రసాద్ పరిస్థితి ప్రస్తుతం దారణంగా మారింది. కనీసం నడలేవని స్థితిలో అతడు ఉన్నాడు. తాజాగా తన యూట్యూబ్ చానల్ షేర్ చేసిన వీడియోలో పంచ్ ప్రసాద్ తీవ్ర నొప్పితో బాధపడుతూ కనీసం లేవలేని స్థితిలో కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక పంచ్ ప్రసాద్ యూట్యూబ్ చానల్లో కమెడియన్ జోడీ నూకరాజు వ్లాక్ చేసి ఈ వీడియోను పోస్ట్ చేశాడు. చదవండి: నేరుగా ఓటీటీకి వచ్చేస్తున్న రష్మిక మూవీ! అప్పటి నుంచి స్ట్రీమింగ్? ఇందులో తన ఆరోగ్య పరిస్థితిని బయటకు చెప్పేందుకు పంచ్ ప్రసాద్ ఇష్టం చూపించలేదు. అయినా చాటుగా ఈ వీడియో తీసి ఆయన ఆరోగ్య పరిస్థిని చూపించాడు నూకరాజు. ఇక పంచ్ ప్రసాద్ భార్య చెప్పిన దాని ప్రకారం.. ఓరోజు షూటింగ్ తర్వాత ఫీవర్గా ఉందని ఇంటికొచ్చిన ప్రసాద్.. నడుము నొప్పితో చాలా బాధపడ్డాడు. అలా నడవలేక చాలా ఇబ్బందిపడ్డారు. డాక్టర్స్ కూడా ఫస్ట్ ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదని, టెస్టులు చేస్తే నడుము వెనక వైపు కుడికాలి వరకు చీము పట్టేసినట్లు తెలిసింది’ అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రసాద్కి ఇష్టం లేకపోయినా సరే ఈ మొత్తాన్ని షూట్ చేసి యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసినట్లు నూకరాజు చెప్పుకొచ్చాడు. అభిమానులు కూడా ప్రసాద్కి సపోర్ట్ చేయాలని కోరాడు. -
పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర బ్యూటీ!.. ఫొటోలు వైరల్
Jabardasth Lady Comedian Rithu Chowdary Getting Married: బుల్లితెర షో జబర్దస్త్తో ఫేమ్ సంపాదించిన వారిలో రీతూ చౌదరి ఒకరు. లేడీ కమెడియన్గా ప్రేక్షకులను ఆకట్టుకున్న రీతూ చౌదరి పలు సీరియల్స్తోనూ తెలుగు ఆడియెన్స్కు దగ్గరైంది. గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు తదితర సీరియల్స్లో నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అప్పుడప్పుడు గ్లామర్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ నెటిజన్స్ను అట్రాక్ట్ చేస్తోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా రీతూ పెట్టిన ఓ పోస్ట్ హాట్ టాపిక్గా మారింది. ఈ ఫొటో చూసిన వారంతా రీతూ చౌదరి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని ఊహిస్తున్నారు. అయితే ఆమె ఈ విషయాన్ని అధికారికంగా చెప్పలేదు కానీ, ఈ ఫొటోకు రితూ ఇచ్చిన క్యాప్షన్ చూస్తే దాదాపు ఆమె పెళ్లి కాయమైనట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తితో రీతూ దిగిన ఫొటోను షేర్ చేస్తూ 'మా బంధం కంటే గొప్పగా ఇంకేదీ ఉండదు' అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో పలువురు నెటిజన్స్ ఆమెకు విషెస్ చెబుతున్నారు. చదవండి: స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్ పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ ఫొటోలో రీతూతో ఉన్నది ఎవరా ? అనే ఆసక్తి నెటిజన్స్లో మొదలైంది. వివరాల్లోకి వెళితే రీతూతో ఉన్న వ్యక్తి పేరు శ్రీకాంత్ అని, అతను సంపన్న వ్యాపారస్థుడని, ప్రస్తుతం రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. చదవండి: రామ్ గోపాల్ వర్మకు షాక్.. 'లడ్కీ' సినిమాపై కోర్టు స్టే.. బ్యాడ్ న్యూస్ చెప్పిన నటి వరలక్ష్మి శరత్ కుమార్.. View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
అవమానించారు, అందుకే జబర్దస్త్ నుంచి తప్పుకున్నాను: అప్పారావు
'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన కమెడియన్లలో అప్పారావు ఒకరు. అయితే కొంతకాలంగా ఆయన ఈ షోలో కనిపించడం లేదు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఆ షోలో 7-8 సంవత్సరాలుగా ఉన్నాను. షూటింగులకు ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా వెళ్లేవాడిని. కానీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత నా వయసును దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ కొంతకాలం వెయిట్ చేయమన్నారు. కానీ ఆ తర్వాత వాళ్లు నన్ను పిలవలేదు. చెప్పుడు మాటలు విని నా పేరు హోల్డ్ లో పెట్టారు. స్కిట్స్లో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు కూడా చేశాను. ఒకప్పుడు టీమ్ లీడర్గా చేసిన నేను ఆ తర్వాత కాలంలో ఒక కంటెస్టెంట్కు ఇచ్చిన గుర్తింపు కూడా ఇవ్వలేదు. ఆ షోలో సీనియర్ని అయినప్పటికీ నాకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అలా పరోక్షంగా అవమానించారు. అందుకే తప్పుకోవాల్సి వచ్చింది. వెళ్లేటప్పుడు కూడా కనీసం ఎందుకు వెళ్తున్నారని ఒక్క మాట కూడా అడగలేదు. ఏదైతేనేం, ఇప్పుడు మరో కామెడీ షో చేస్తున్నాను. డబుల్ పేమెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు నా పరిస్థితి బాగుంది అని చెప్పుకొచ్చారు. -
'జబర్దస్త్' కమెడియన్తో బిగ్బాస్ బ్యూటీ లవ్ ట్రాక్.. త్వరలోనే పెళ్లి
Rocking Rakesh And Jordar Sujatha All Set To Tie Knot: ప్రేమ..ఎప్పుడు ఎలా అయినా పుట్టొచ్చు. ఇక నటీనటుల మధ్య ప్రేమ సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని జోడీలు కేవలం షో కోసం లవ్ ట్రాక్ నడిపితే మరికొందరేమో నిజంగానే లవ్లో పడతారు. అలాంటి జోడీనే రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాతలు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ షోలో పాల్గొన్న వీరిద్దరూ తమది రియల్ జోడీనే అని ప్రకటించారు. ఇక రాకేశ్ అయితే రింగ్ పెట్టి మరీ ప్రపోజ్ చేయగా సుజాత సిగ్గుతో నవ్వేసింది. త్వరలోనే తమ పెళ్లి ఉంటుందంటూ ఇద్దరూ హింట్ కూడా ఇచ్చేశారు. కాగా యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన సుజాత బిగ్బాస్ సీజన్-4లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్న సుజాత ప్రస్తుతం టీవీ షోలు చేస్తుంది. ఈ క్రమంలోనే రాకింగ్ రాకేష్తో కలిసి పలు స్కిట్లు చేసింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, వీరి పెళ్లికి ఇరు వర్గాల కుటుంబసభ్యులు ఇప్పటికే అంగీకరించినట్లు తెలుస్తుంది. ఈ ఏడాదే వీరి పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు సమాచారం. -
20 ఏళ్లుగా ప్రయత్నిస్తే అప్పుడు జబర్దస్త్లో అవకాశం : కమెడియన్
కశింకోట: ప్రముఖ హస్య నటునిగా ప్రేక్షకుల మదిలో సుస్థిరస్థానమే తన లక్ష్యమని జబర్దస్త్ సత్తిపండు (పీఎన్వీ సత్యనారాయణ) పేర్కొన్నారు. కశింకోటలో ఆదివారం ఒక కార్యక్రమంలో తన బృందంతో సందడి చేశారు. భార్యాభర్తల అన్యోన్యతపై స్కిట్ ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపజేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. జబర్దస్త్లో సుమారు 250 వరకు స్కిట్లు ప్రదర్శించినట్టు చెప్పారు. చదవండి: రహస్యంగా పెళ్లి చేసుకున్న యాంకర్ రష్మీ? అబ్బాయి ఎవరంటే.. సుమారు 20 ఏళ్లుగా సినిమాలు, టీవీల్లో ప్రదర్శన కోసం ప్రయత్నిస్తే ఆరేళ్ల క్రితం జబర్దస్త్లో అవకాశం వచ్చిందన్నారు. అంతకు ముందు నాటకాలు వేసినట్టు పేర్కొన్నారు. దృశ్యం–2, ఆర్డీఎక్స్ లవ్, విజేత, హలో శ్యామ్, ప్రేమ కోసం తదితర సినిమాల్లో నటించినట్టు సత్తిపండు పేర్కొన్నారు. ప్రస్తుతం హలో ఆది, అతిథి దేవోభవ, గీతా ఆర్ట్స్లో అల్లు శిరీష్ సినిమాతోపాటు కల్యాణ్రామ్ సినిమాలో నటిస్తున్నట్టు చెప్పారు. చదవండి: అమ్మాయిలు షూటింగ్ చేయడం కరెక్ట్ కాదు: నటుడు -
జబర్దస్త్ రాకేష్ ఇంట్లో పెళ్లి సందడి
-
అభిజిత్కే ఓటేస్తా: జబర్దస్త్ కమెడియన్
బిగ్బాస్ నాల్గో సీజన్ ఫినాలేలో చోటు దక్కించుకునేందుకు రేసు మొదలైంది. కంటెస్టెంట్లు బంధాలు, అనుబంధాలను పక్కకు నెట్టి పూర్తిగా గేమ్పైనే ఫోకస్ పెడుతున్నారు. పంతొమ్మిది మందితో మొదలైన ఈ ప్రయాణంలో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్లు.. అఖిల్, అభిజిత్, అరియానా, అవినాష్, మోనాల్, సోహైల్, హారిక మాత్రమే మిగిలారు. టాప్ 5లో చోటు దక్కించుకోవడమే కాకుండా ట్రోఫీని ఎగరేసుకుపోవడమే లక్ష్యంగా కష్టపడుతున్నారు. అయితే వీరు లోపలెంత కష్టపడుతున్నారో వారిని గెలిపించేందుకు అంతకన్నా ఎక్కువే కష్టపడుతున్నారు వారి అభిమానులు. ఇక బిగ్బాస్ ప్రయాణం ముగింపుకు వస్తున్న తరుణంలో సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగుతూ వారి ఫేవరెట్ కంటెస్టెంట్లకే సపోర్ట్ చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే పలువురు సీరియల్ నటీనటులు అఖిల్కు ఓటేయాలని కోరుతుండగా హీరో సందీప్ కిషన్ తన ఫుల్ సపోర్ట్ సోహైల్కే అని మొదట్లోనే చెప్పేశాడు. (చదవండి: ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్బాస్లోకి వెళ్లను : యాంకర్) అవినాష్కు జీవితాన్ని ప్రసాదించిన జబర్దస్త్ యూనిట్ కూడా ఈ ప్రచారంలోకి దిగింది. ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను.. అవినాష్కు ఓటేసి గెలిపించాలని కోరారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు మాత్రం అవినాష్ చివరి వరకు ఉండాలని కోరుకుంటూనే అభిజిత్ అంటే ఇష్టమని చెప్పారు. అభి ఎమోషన్స్ బాగా కంట్రోల్ చేసుకుంటూ మొదటి నుంచి ఒకేలా ఉంటున్నాడంటూ అతడికి కూడా సపోర్ట్ చేశారు. తాజాగా బుల్లెట్ భాస్కర్ సైతం అభిజిత్కే మద్దతు తెలిపాడు. 'అందరూ బాగా ఆడుతున్నారు, కానీ నా ఫేవరెట్ మాత్రం అభిజిత్. అతడే గెలవాలని కోరుకుంటున్నా. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటాడు. నిజాయితీగా ఉంటాడు. సహనంగా ఉండటం చాలా గొప్ప. అయితే జబర్దస్త్ ఆర్టిస్ట్గా అవినాష్ గెలవాలని ఆశిస్తాను. కానీ ఓటు మాత్రం అభిజిత్కే" అని స్పష్టం చేశాడు. (చదవండి: వారిద్దరిలో ఎవరు గెలిచినా నాకు ఓకే : నాగబాబు) -
విశాఖలో ఇద్దరు జబర్దస్త్ ఆర్టిస్టుల అరెస్టు!
-
నవ్వడం.. నవ్వించడం.. ఓ వరం
సాక్షి, అరసవల్లి : సహజంగా అందరూ నవ్వుతారు. అయి తే నవ్వడంతో పాటు నవ్వించడం కూడా పెద్ద వరంలాంటిదే.. అని యువ కమేడియన్, ‘జబర్దస్త్’ త్రినాథ్ అన్నారు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. అంతరాలయ దర్శనం అనంతరం ఆయన ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. చిన్ననాటి కష్టాలతో పాటుగా పెరిగిన సినీ ఆసక్తి, ప్రస్తుతం వస్తున్న అవకాశాల వివరాలు ఆయన మాటల్లోనే... సాక్షి: ఈ రంగాన్ని ఎంచుకోవడానికి కారణం? త్రినాథ్ : మాది విజయనగరం జిల్లా చీపురుపల్లి. అమ్మ కాటుక డబ్బాలు అమ్ముతూ.. నన్ను పెంచింది. కటిక పేదరికం నుంచి ఈ స్థాయికి వచ్చాను. ఆ కష్టాలేవీ మరిచిపోలేదు. ప్రాథమిక విద్య అంతా నవోదయ స్కూల్లో చదివినప్పటికీ.. ఆ తరువాత సినిమాలపై ఇష్టంతో బీఏ వరకు చదివాను. కాలేజీ చదువుల నుంచి సిని మాలపై ఆసక్తి ఎక్కువ ఉండేది. మా ఊరి నుం చి గొప్ప ఆర్టిస్ట్గా అందరి అభిమానం పొం దాలనేది నా కోరిక. అందరినీ నవ్వించి మెప్పిం చాలని మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలన్నదే లక్ష్యం. సాక్షి: కమేడియన్గా ఎలా అవకాశం వచ్చింది? త్రినాథ్:: చిన్నప్పటి నుంచి మిమిక్రీపై ఆసక్తి ఉం డేది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో పాటు సాయికుమార్ గొంతులను అనుకరించేవాడిని. ఇదే బేస్తో జబర్దస్త్ వంటి సూపర్ కామెడీ షోలో అడుగుపెట్టాను. ఇప్పటికి 240 వరకు స్కిట్స్ చేశాను. ఇందులో మంచి స్కిట్స్తో నవ్వించడంతో పేరు, గుర్తింపు వచ్చాయి. దీంతో నా ఇంటి పేరే జబర్దస్త్ అయ్యింది. అలాగే జూలకటక అనే కామెడీ షో కూడా చేస్తున్నాను. సాక్షి: శ్రీకాకుళం యాస బాగా వంట పట్టించుకున్నారు? త్రినాథ్ : అలా ఏమీ లేదు. ఇది నా సొంత యాస ని గర్వంగా చెప్తుంటాను. శ్రీకాకుళం యాసకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకత ఉంది. నాకు గుర్తింపు తెచ్చింది మన మాటలే. ఈ ప్రాంత యాసను ఎవరు తప్పు పట్టినా ఊరుకునేది లేదు. కామెడీ షోల్లో నా మాటలకే నాగబాబు, రోజాగారు ఇంప్రెస్ అవుతున్నారంటే.. అది ఇక్కడి మాటతీరు గొప్పతనం. ఇంతవరకు షకలక శంకర్ అద్భుతంగా శ్రీకాకుళం యాసతో మెప్పించి, ప్రస్తుతం హీరో స్థాయికి ఎదిగారు. సాక్షి: సినిమా చాన్సుల సంగతేంటి? త్రినాథ్ : సినిమా చాన్స్లు వస్తున్నాయి. ఇంతవరకు 15 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. బాబు బంగారం, కల్యాణ్రామ్ ఎంఎల్ఏ, నందినీ నర్సింగ్హోం, మీలో ఎవరు కోటీశ్వరుడు?, అంతర్వేది టు అమలాపురం తదితర చిత్రాల్లో నటించాను. జిల్లాలోని పలాసలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ‘పలాస 1978’ సినిమాలో రెండో విలన్గా నటిస్తున్నాను. ఇందులో ఓ ఐటమ్ సాంగ్ కూడా చేశాను. ఈసినిమా నవంబర్లో విడుదల కానుంది. అలాగే నమిత లేడీ ఓరియంటెడ్గా చేస్తున్న సినిమాలో ఆమె వెంట ఉండే కానిస్టేబుల్ పాత్ర కూడా చేస్తున్నాను. ఇలా మొదలైంది ప్రేమకథ అనే సినిమా ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. సాక్షి: ఎటువంటి పాత్రల్లో నటించడం మీకిష్టం? త్రినాథ్ : నాకు వర్తమానం అంటే ఇష్టం. ఇప్పుడు ఎలా.. ఎంత బాగా చేస్తున్నామో అని మాత్రమే ఆలోచిస్తాను. అవకాశాలన్నీ భవిష్యత్లో రావాలంటే ఇప్పుడు బాగా చేయాలి కదా. లేదంటే రేపు ఏం జరుగుతుందో అని టెన్షన్ ఒక్కటే మిగులుతుంది. నా గురువు గారు దర్శకుడు వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఎంఎస్ రాజు గారి కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా ఓ చిత్రాన్ని చేస్తున్నాను. ఇది నాకు చాలా ప్రాధాన్యమైన ప్రాజెక్టు. సాక్షి: సంతృప్తి ఇచ్చిన సంఘటనలేమైనా ఉన్నాయా? త్రినాథ్ : నిజంగా ఇదే చెప్పాలనుకుంటున్నా. 2 విషయాల్లో నాకు చాలా ఆనందం కలిగింది. మా గురువుగారు వి.ఎన్.ఆదిత్య ప్రోత్సాహం తో అమెరికా తానా మహాసభల్లో పాల్గొని ప్రదర్శన ఇవ్వడం మర్చిపోలేను. అంతకంటే ముఖ్యం గా ఎన్నో కష్టాలు పడి, నన్ను పెంచి, పెద్ద చేసిన నా తల్లిని, సొంత కారులో ఎక్కించుకుని తిప్పడం జీవితంలో మరిచిపోలేనిది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేశా: జబర్దస్త్ ఫేం అభి
సాక్షి, భీమవరం (ప్రకాశంచౌక్): నటనపై ఆసక్తితో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకున్నానని, జబర్దస్త్ షోతో బాగా గుర్తింపు లభించిందని నటుడు అదిరే అభి పేర్కొన్నారు. నటనలో చిరంజీవి అంటే ఎంతో ఇష్టమన్న ఆయన తనకు దర్శకత్వం అంటే కూడా ఎంతో ఇష్టమని, బాహుబలి–2కి రాజమౌళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశానని చెప్పారు. భీమవరం వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రశ్న: మీ పూర్తి పేరు? ఏం చదువుకున్నారు? అభి: నాపేరు అభినవకృష్ణ, ఎమ్మెసీ చదివాను. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడిని. ప్రశ్న: సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ఎందుకు బుల్లితెర వైపు వచ్చారు? అభి: నేను 2016 వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడం జరిగింది. ఉద్యోగం చేస్తుండగానే యాంకరింగ్ షోలు చేసేవాడిని. అదే సమయంలో కొన్ని సినిమాల్లోనూ నటించారు. నటనపై ఉన్న ఆసక్తితో 2017లో ఉద్యోగం వదలిపెట్టాను. జబర్దస్త్లో అవకాశం రావడంతో మంచి పేరు వచ్చింది. ప్రశ్న: ఇప్పటివరకు ఏఏ సినిమాల్లో నటించారు? అభి: నేను మొదటిసారిగా ప్రభాస్ ఈశ్వర్ సినిమాలో ఆయనకు ఫ్రెండ్గా నటించాను. గౌతమ్ ఎస్ఎస్సీ సినిమాలో నటించడం జరిగింది. ప్రశ్న: జబర్దస్త్ షో గురించి చెప్పాలి అంటే? అభి: జబర్దస్త్ షో ప్రతిభ ఉన్న వారికి వారి ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి ప్లాట్ఫామ్. అప్పారావు, శంకర్, శ్రీను, నరేష్, నాకు జబర్దస్త్ షో వల్లే మంచి నటులుగా గుర్తింపు వచ్చింది. సినిమా అవకాశాలు కూడా ఈ షో వల్ల మాకు వస్తున్నాయి. ప్రశ్న: మీకు ఇష్టమైన నటుడు, దర్శకుడు? అభి: నాకు చిరంజీవి అంటే ఇష్టం ఆయన నాకు ఆదర్శం. దర్శకులు సంజయ్ బన్సాలీ అంటే ఇష్టం. ప్రశ్న: నటన కాకుండా ఇతర శాఖలో ఆసక్తి ఉందా? అభి: దర్శకత్వం అంటే ఇష్టం అందుకే బహూబలి–2కి రాజమౌళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ప్రశ్న: నూతన సినిమాలు ఏం చేస్తున్నారు.? అభి: దర్శకుడు శ్రీనివాసరెడ్డి తీస్తున్న రాగల 24 గంటలు అనే సినిమాలో నటిస్తున్నాను. ప్రశ్న: భీమవరం గురించి చెప్పాలి అంటే? అభి: భీమవరం వాసుల అపాయ్యతలకు, అభిమానానికి హద్దులు ఉండవు. ఎంతో గౌరవంగా అభిమానంగా చూస్తారు. ముఖ్యంగా ఇక్కడ సీఫుడ్ భోజనం అంటే నాకు చాలాచాలా ఇష్టం. దటీజ్ భీమవరం. -
జబర్దస్త్ అవినాష్పై జగిత్యాల వాసుల ఫైర్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాంపై మరో వివాదం నెలకొంది. గతంలో ఓ కులాన్ని కించపరిచే విధంగా కమెడియన్ వేణు, అనాథ పిల్లలను అవమానించే విధంగా ఆది చేసిన స్కిట్లపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక వేణుపై భౌతికంగా దాడి కూడా జరిగింది. ఈ కామెడీ షోలో హాస్యం కన్నా బూతులు ఎక్కువగా ఉన్నాయని మహిళా సంఘాలు కేసులు కూడా నమోదు చేశాయి. అప్పట్లో ఈ స్కిట్స్ చేసిన కమెడియన్లు క్షమాపణలు కూడా తెలియజేశారు. షో నిర్వహకులు సైతం ఆ స్కిట్లను యూట్యూబ్ నుంచి తొలిగించారు. అయితే తాజాగా ముక్కుఅవినాష్ చేసిన స్కిట్పై నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ వాసులు, గల్ఫ్ కార్మికులు ముక్కు అవినాష్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత శుక్రవారం ప్రసారమైన షోలో ముక్కు అవినాష్ చేసిన స్కిట్ వారి మనోభావాలు దెబ్బతిసిందని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కిట్లో ఏముందంటే.. జగిత్యాల బోర్డు పెట్టి మరీ చేసిన ఈ స్కిట్లో అసభ్యకర డైలాగ్స్ ఉన్నాయి. ఒక తల్లి(అవినాశ్) పనీపాటా లేని తన కొడుకు రాజు(కార్తీక్)ను తిడుతుంది. పక్కింటి సురేశ్ భార్యను వదలి గల్ఫ్ వెళ్లి పని చేసుకుంటున్నాడని, నువ్వు పడుకుని నిద్రపోతున్నావని అంటుంది. దీంతో రాజు ‘వాడు జాబ్ చూసుకుంటున్నాడు, వాడి పెళ్లాన్ని నేను చూసుకుంటున్నాను..’ అనే జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తాడు. దీనిపై తెలంగాణ ప్రజలతో పాటు హక్కుల సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. పొట్టకూటి కోసం పరాయి దేశాలకు వెళ్తున్న పేదలను అవమానించడం సరికాదని, జబర్దస్త్ నిర్వాహకులు, ముక్కు అవినాష్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాయలేని పదాలతో సోషల్ మీడియా వేదికగా అవినాశ్ను తిడుతున్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. -
హాస్య నటుడిగా స్థిరపడాలన్నదే లక్ష్యం
మామిడికుదురు (పి.గన్నవరం): తెలుగు చిత్రసీమలో హాస్య నటుడిగా గుర్తింపు పొందాలన్నదే తన లక్ష్యమని వర్ధమాన హాస్యనటుడు మహేష్ ఆచంట పేర్కొన్నారు. సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు పెదపట్నంలంక వచ్చిన మహేష్ మంగళవారం స్థానిక విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’,.. వీవీ వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్తేజ్ నటిస్తున్న చిత్రంతో పాటు.. అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ‘ఒక్క క్షణం’ , ‘మహానటి సావిత్రి’ చిత్రాల్లో ప్రస్తుతం తాను నటిస్తున్నాని చెప్పారు. మలికిపురం మండలంలోని శంకరగుప్తం తమ స్వగ్రామమని తెలిపారు. మలికిపురంలో ఇంటర్ పూర్తిచేసి హైదరాబాద్లో ఎంబీఏ పూర్తి చేశానని మహేష్ పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో ఎంబీఏ చేస్తూనే సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించానన్నారు. ఆ ప్రయత్నంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నానని చెప్పారు. ఇంత వరకూ 65 సినిమాల్లో నటించానని, 80కి పైగా టీవీ ఎపిసోడ్స్లో నటించానని చెప్పారు. ‘ఖైదీ నెంబర్–150’, ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాలు తనకు మంచి గుర్తింపును తీసుకు వచ్చాయని మహేష్ పేర్కొన్నారు. చిన్నాన్న బోనం అంజి, సోదరుడు రేకపల్లి బాబీ తనను ఎంతో ప్రోత్సహించారన్నారు. -
జబర్దస్త్ హాస్యనటుడి పై కేసు
బంజారాహిల్స్: వినోద కార్యక్రమం చేస్తానని అడ్వాన్స్ తీసుకొని కార్యక్రమానికి హాజరుకాకుండా మోసం చేసిన కమెడియన్ మాస్ అవినాష్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..కర్నూలు జిల్లాకు చెందిన వేణుగోపాల్రెడ్డి కేటీ క్రియేషన్స్ పేరుతో ఈవెంట్స్ నిర్వహిస్తుంటాడు. మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 24న కార్యక్రమం నిర్వహించేందుకు బుల్లితెర కమెడియన్ మాస్ అవినాష్తో ఒప్పందం కుదర్చుకొని ఈనెల 14న రూ.10 వేలు అడ్వాన్స్గా ఇచ్చాడు. అయితే ఒప్పందం ప్రకారం అతను కార్యక్రమానికి హాజరుకాకపోగా సెల్ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసుకున్నాడు. ఈ కారణంగా అతిథులు నిరాశకు లోనయ్యారని, తమ ఈవెంట్ కంపెనీకి చెడ్డపేరు వచ్చిందని బాధితుడు తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.