Jaya Prada
-
'ప్రభాస్' ఫౌజిలో... జయప్రద
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ తమిళనాడులోని మధురై, కారైకుడి లొకేషన్స్లోప్రారంభమైంది. అయితే ప్రభాస్ పాల్గొనని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. కాగా ఈ సినిమాలో జయప్రద ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని, ఆల్రెడీ మధురై షెడ్యూల్లో ఆమె జాయిన్ అయ్యారని, ఇమాన్వి–జయప్రదల కాంబినేషన్లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని సమాచారం. అక్టోబరు చివర్లో ఈ సినిమా చిత్రీకరణలో ప్రభాస్ కూడా పాల్గొంటారట. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జయప్రద (ఫొటోలు)
-
హైకోర్టులో జయప్రదకు ఎదురుదెబ్బ
మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదను మార్చి 6వ తేదీలోపు అరెస్ట్ చేయాలని రామ్పుర్ ట్రయల్ కోర్టు తాజాగా ఆదేశించింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తనపై జారీచేసిన నాన్ బెయిలబుల్ వారెంటును నిలిపివేయాలని కోరుతూ జయప్రద దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు తాజాగా కొట్టివేసింది. దీంతో ఆమెకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. (ఇదీ చదవండి: ముందస్తు బెయిల్ కోసం క్రిష్ పిటిషన్ .. విదేశాలకు 'సైంధవ్' నిర్మాత కుమారుడు) 2019 నుంచి కోర్టు విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించినా ఆమె హాజరు కాలేదు.. దీంతో ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా గతంలో కోర్టు ప్రకటించింది. ఆపై నాన్ బెయిలబుల్ వారెంటును కోర్టు జారీ చేసింది. ఈ వారెంటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను ధర్మాసనం తాజాగా విచారించి కొట్టివేసింది. త్వరలో మరిన్ని వాస్తవాలతో తాము మరో పిటిషన్ దాఖలు చేస్తామని జయప్రద తరపు న్యాయవాది కోరడంతో న్యాయమూర్తి అంగీకరించారు. కేసు ఏంటి..? 2019 లోక్సభ ఎన్నికల్లో జయప్రద బీజేపీ తరఫున రాంపూర్ నుంచి జయప్రద బరిలో నిలిచారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఆమె ఓ రోడ్డును ప్రారంభించడంతో స్వార్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు రాంపూర్లోని ఎంపీ- ఎమ్మెల్యే కోర్టులో పెండింగ్లో ఉంది. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినా ఆమె రాకపోవడంతో నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. -
జయప్రద ను తక్షణమే అరెస్టు చేయండి..
-
జయప్రదను అరెస్ట్ చేయండి..
రామ్పూర్(యూపీ): గత లోక్సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగినపుడు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించిన కేసులో మాజీ ఎంపీ, నటి జయప్రదను అరెస్ట్చేయాలని అక్కడి రామ్పూర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అరెస్ట్చేసి మార్చి నెల ఆరోతేదీన తమ ఎదుట ప్రవేశపెట్టాలని సూచించింది. 2019లో ఎన్నికల ప్రవర్తనానిబంధనావళి ఉల్లంఘనపై కేమారి, స్వార్ పోలీస్స్టేషన్లలో జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విషయమై తమ ముందు హాజరుకావాలని ప్రత్యేక ఎంపీ – ఎమ్మెల్యే కోర్టు జయప్రదకు సూచించింది. అయినా ఆమె రాకపోవడంతో ఇప్పటివరకు ఏడుసార్లు నాన్ – బెయిలబుల్ వారెంట్లు జారీఅయ్యాయి. ఇంత జరిగినా ఆమె కోర్టుకు రాకపోవడంతో జయను ‘పరారీలో ఉన్న వ్యక్తి’గా జడ్జి ప్రకటించారు. -
జయప్రద అరెస్ట్ కు రంగం సిద్ధం...
-
జయప్రదను వెంటనే అరెస్ట్ చేయండి
లక్నో: సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తర్ప్రదేశ్లోని ఓ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆమెపై ఇదివరకే రెండు కేసులు నమోదు కాగా, ఆమె విచారణకు హాజరు కావడం లేదు. అందుకే ఆమెను అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరు పర్చాలని కోర్టు ఆదేశించింది. జయప్రద 2019 లోక్సభ ఎన్నికల్లో భాజపా తరఫున రాంపూర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే, విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. ఇప్పటివరకు ఏడుసార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో న్యాయస్థానం ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది. -
ఆమె కోసం స్టార్ హీరోలే వెయిట్ చేసేవారు.. కానీ నిజ జీవితంలో మాత్రం!
Jaya Prada: సీనియర్ హీరోయిన్ జయప్రద పరిచయం అక్కర్లేని పేరు. ఏపీలోని రాజమండ్రిలో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది. టాలీవుడ్తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించారు. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. జయప్రద అసలు పేరు లలితా రాణి. భూమి కోసం' సినిమాతో తన కెరీర్ను ప్రారంభించిన జయప్రద ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటి ప్రముఖ తమిళ దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన అంతులేని కథ చిత్రం ద్వారా ఆమె పేరు జయప్రదగా మారిపోయింది. అప్పట్లో జయప్రదకు తెలుగులో కంటే హిందీ చిత్రాల్లోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. తెలుగు , హిందీ భాషల్లో రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా రాణించింది. తెలుగు నేలపై పుట్టి బాలీవుడ్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. జితేంద్ర, రిషీ కుమార్ వంటి అగ్ర హీరోలే అప్పట్లో ఆమె డేట్స్ కోసం వేయిట్ చేసే వారంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి దిగ్గజాల సరసన నటించింది. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా దిగ్విజయంగా విజయ యాత్రను కొనసాగించింది. దాదాపు అప్పటి స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న జయప్రద.. తన వైవాహిక జీవితంలో కష్టాలను అనుభవించింది. (ఇది చదవండి: సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్!) నిర్మాత శ్రీకాంత్ నహతాతో ప్రేమ పెళ్లి జయప్రద ఫేమ్లో ఉన్నప్పుడే అప్పట్లో ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ నహతాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 22 ఫిబ్రవరి 1986న ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వీరి పెళ్లి జరిగింది. అయితే శ్రీకాంత్కు అప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో వీరి వివాహం వివాదానికి దారి తీసింది. జయప్రదను పెళ్లాడిన తర్వాత కూడా శ్రీకాంత్ తన మొదటి భార్యతోనే ఉంటున్నాడు. అంతే కాదు శ్రీకాంత్ రెండో పెళ్లి తర్వాత మొదటి భార్య మూడో బిడ్డకు జన్మనిచ్చింది. ఆత్మహత్యాయత్నం 1990లో జయప్రద విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమె బెంగళూరులో నివాసముండేవారు. విషం తాగిన జయప్రదను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పట్లో జయప్రదపై ఆత్మహత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. శ్రీకాంత్తో వివాహమైన తర్వాత మొదటి భార్య చంద్ర తన భర్తను వదిలేయాలని జయప్రదపై ఒత్తిడి తెచ్చింది. అందుకే జయప్రద విషం మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందన్న వార్త అప్పట్లో వైరలైంది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నా జయప్రద తన భర్తతో సంతోషంగా జీవితాన్ని గడపలేకపోయింది. కొన్నిసార్లు కలిసినప్పటికీ మొదటి భార్యకు, కుటుంబానికి వారిద్దరూ భయపడేవారట. దీనికి తోడు జయప్రద, శ్రీకాంత్లకు సంతానం కలగలేదు. ఆ బాధతో పాటు జయప్రద సంతానం లేదని చాలా బాధపడేది. అందువల్లే తన సోదరి కొడుకు సిద్ధార్థ్ను ఆమె దత్తత తీసుకున్నారు. జీవితమంతా వివాదాలే.. అయితే ప్రస్తుతం జయప్రదకు సినిమాల కంటే రాజకీయాల్లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. గతంలో ఆమె ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా జయప్రద ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు. ఆత్మహత్యాయత్నం జరిగిన కొన్నేళ్ల తర్వాత జయప్రదకు సంబంధించిన మార్ఫింగ్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అప్పుడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు జయప్రద ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పారు. అంతే కాకుండా సమాజ్వాదీ పార్టీకి చెందిన అమర్సింగ్తో జయప్రదకు రిలేషన్ ఉందంటూ రూమర్స్ కూడా వచ్చాయి. (ఇది చదవండి: పెళ్లికి ముందే పూజలు తెగ చేస్తున్న ఆ హీరోయిన్) 6 నెలల జైలు శిక్ష 2019లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఇటీవలే జయప్రదకు చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు జయప్రదకు 6 నెలల జైలు శిక్ష విధించింది. జయప్రద తన సినిమా థియేటర్ల కార్మికుల జీతాల నుంచి ఈఎస్ఐ సొమ్మును ఇప్పటికీ చెల్లించలేదని కార్మికులు రాష్ట్ర కార్మిక బీమా శాఖకు ఫిర్యాదు చేశారు. జయప్రద సినీ జీవితంలో సక్సెస్ అయినప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఫెయిల్యూర్ అవడం పట్ల ఆమె అభిమానులు బాధపడుతూనే ఉన్నారు. -
జయప్రదకు బిగ్ షాక్.. జైలు శిక్ష విధించిన కోర్టు..
సాక్షి, చెన్నై: సీనియర్ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు చెన్నై కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పును వెల్లడించింది. అలాగే, జరిమానా కూడా విధించింది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని ఎగ్మోర్ కోర్టు జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. అయితే, చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి జయప్రద అన్నారోడ్డులో ఓ సినిమా థియేటర్ను నడిపించారు. కాగా, ఈ సినిమా థియేటర్లో పనిచేసే కార్మికులు నుంచి వసూలు చేసిన ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లించలేదని కార్మిక బీమా కార్పోరేషన్ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. అయితే, దీనిపై విచారణ జరిపిన కోర్టు.. జయప్రదతో పాటుగా మరో ముగ్గురికి ఎగ్మోర్ కోర్టు ఆర్నెళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. ఇదిలా ఉండగా.. జయప్రద తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె.. తెలుగు సహా పలు భాషల చిత్రాల్లో నటించారు. రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా దిగ్విజయంగా విజయ యాత్రను కొనసాగించారు. நடிகை ஜெயப்பிரதாவுக்கு 6 மாதம் சிறை#JayaPrada | #Jail pic.twitter.com/GKUcmO6ViJ — Kumudam Reporter (@ReporterKumudam) August 11, 2023 -
13 ఏళ్లకే సినిమాల్లోకి.. తొలి పారితోషికం రూ.10, ఎవరో గుర్తుపట్టారా?
కాటుక కళ్లతో, ముసిముసి నవ్వులు నవ్వుతున్న ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? ఈమె ఒక క్లాసికల్ డ్యాన్సర్.. టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లోనూ స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. గ్లామర్, యాక్టింగ్.. రెండింటిలోనూ బెస్ట్ అనిపించుకుంది. ఈపాటికే ఆమె ఎవరో తెలిసిపోయుంటుంది. అవును, ఆమె అచ్చతెలుగందం, అందాల తార జయప్రదనే! 15 ఏళ్లకే హీరోయిన్ రాజమండ్రికి చెందిన జయప్రద అసలు పేరు లలిత రాణి. 'భూమి కోసం' (1974) చిత్రంలో మొదటిసారి తెర మీద రెండు మూడు నిమిషాల సేపు కనిపించింది. ఈ చిత్రంలోని ఓ పాట మధ్యలో ఒక వితంతువు తనను చెరబట్టే కామందును హతమారుస్తుంది. ఆ వితంతువు చంద్రమ్మ మరెవరో కాదు జయప్రదనే. ఈ సినిమా చేసే సమయానికి ఆమె వయసు 13 కాగా తను అందుకున్న పారితోషికం రూ.10. ఈ చిత్రంతోనే ఆమె తన పేరు మార్చుకుని జయప్రదగా మారింది. తన పెదవిపై ఉండే పుట్టుమచ్చ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. దీని తర్వాత ఆమె చేసిన పెద్ద చిత్రం అంతులేని కథ. అప్పుడామె వయసు 15 ఏళ్లు. షూటింగ్లో రజనీకాంత్, జయప్రదల మధ్య సన్నివేశంలో జయప్రద నటనకు కె.బాలచందర్ సంతోషంతో క్లాప్స్ కొట్టారట! 300కు పైగా సినిమాలు.. జయప్రద 'అడవి రాముడు' సినిమాతో కమర్షియల్ హీరోయిన్గా మారింది. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి.. హరి.. అంటూ ఆమె తన అందాలు చూపిస్తూ కళ్లతోనే కొంటెగా మాట్లాడింది. తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు అందుకున్న ఆమెకు బాలీవుడ్లోనూ అవకాశాలు తలుపు తట్టాయి. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, రాకేశ్ రోషన్, జితేంద్ర వంటి బడా స్టార్స్తో నటించింది జయప్రద. హిందీలో జితేంద్ర- జయప్రదలది ఎక్కువ హిట్ కాంబినేషన్గా చెప్పుకుంటారు. 'సిరిసిరిమువ్వ', 'భద్రకాళి', 'అడవిరాముడు', 'యమగోల', 'అందమైన అనుభవం', 'సాగర సంగమం', 'దేవత', 'మేఘసందేశం'.. ఇవి కాక.. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో మొత్తం మూడు వందలకు పైగా సినిమాలు చేసింది. ఆమె నటనా కౌశల్యానికి గానూ ఎన్నో అవార్డులు, రివార్డులు ఆమెకు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. హీరోలతో సమాన పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది. ముగ్గురు పిల్లల తండ్రితో పెళ్లి కెరీర్లో ఆకాశమంత విజయాలను చూసిన ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం వివాదాల మేళవింపుగా మిగిలిపోయింది. జయప్రద అప్పటికే పెళ్లై, ముగ్గురు పిల్లల తండ్రైన నిర్మాత శ్రీకాంత్ నహతాను ప్రేమించింది. అతడు మొదటి భార్యకు విడాకులివ్వకుండానే జయప్రదను పెళ్లాడాడు. అప్పట్లో ఈ విషయం పతాక శీర్షికల్లో నిలిచింది. వీరికి పిల్లలు లేరు. పెళ్లి తర్వాత కూడా జయప్రద సినిమాలు చేసింది. కానీ నెమ్మదిగా దర్శకనిర్మాతలు తనను పక్కన పెడుతూ రావడంతో సినిమాల సంఖ్యను తగ్గిస్తూ వచ్చింది. ఆమె చివరగా 2019లో సువర్ణ సుందరి సినిమా చేసింది. చాలాకాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైంది. చదవండి: నా భర్తను ద్వేషిస్తున్నా.. ఎందుకంటే 5 నిమిషాలు కూడా మాట మీద నిలబడడు -
అతని ఆట ఇక ముగిసింది: జయప్రద
లక్నో: బీజేపీ నేత, రాంపూర్ మాజీ ఎంపీ జయప్రద.. సమాజ్ వాదీ సీనియర్ ఆజాంఖాన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆయన ఎన్నో పాపాలు చేశారని, చేసిన తప్పులకు ఆయన తప్పక శిక్ష అనుభవిస్తారని పేర్కొన్నారు. ఆదివారం మీరట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మాజీ నటి మాట్లాడుతూ.. రాజకీయాల్లో పార్టీల మధ్య వైవిధ్యాలు, విభేధాలు సహజం. కానీ, అధికారం ఉంది కదా అని మహిళలను అగౌరవపరచడం, పేదలకు అన్యాయం చేయడం సరికాదు. అజాం ఖాన్ ఆయన వారసుడు అబ్దుల్లా ఖాన్ లకు మహిళలను గౌరవించడం ఏమాత్రం తెలియదు. ఆజాం ఖాన్ ఆట ముగిసింది. చేసిన పాపాలకు వాళ్లు అనుభవించకతప్పదు అని జయప్రద పేర్కొన్నారు. ఇక వచ్చే ఏడాదిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల గురించి ప్రస్తావించిన ఆమె.. నరేంద్ర మోదీ నాయకత్వంలో మరోసారి బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాంపూర్ కూడా బీజేపీ వశం అవుతుందని జోస్యం చెప్తున్నారామె. ఇదిలా ఉంటే.. జయప్రద, ఆజాంఖాన్ గతంలో పరస్పర విమర్శలతో వివాదాల్లో చిక్కుకున్నారు. 2019 ఎన్నికల్లో జయప్రద రాంపూర్ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దిగగా.. ఆజాం ఖాన్ ‘ఖాకీ అండర్ వేర్‘ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. మరోవైపు ఆ టైంలో ఆయనపై కేసు కూడా నమోదు అయ్యింది. కిందటి ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్ సదర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆజాం ఖాన్. అయితే.. 2019 లోక్ సభ ప్రచారం సందర్భంగా విద్వేష పూరిత ప్రసంగం చేసిన కేసులో ఆజాంఖాన్ కు మూడేళ్ల శిక్ష పడింది. దీంతో చట్ట ప్రతినిధుల నిబంధనల ప్రకారం.. ఆయనపై అనర్హత వేటు పడింది. తాజాగా ఇక ఆయన తనయుడు అబ్దుల్లా ఖాన్ కు(ఆజాంఖాన్ కు కూడా) తాజాగా 2008 నాటి కేసులో కోర్టు రెండేళ్ల శిక్ష విధించగా.. ఎమ్మెల్యే పదవిని అనర్హతతో కోల్పోయారాయన. -
‘సువర్ణ సుందరి’మూవీ రివ్యూ
టైటిల్: సువర్ణ సుందరి నటీనటులు: జయప్రద, పూర్ణ, సాక్షి, ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినిడు, అవినాష్,సత్యప్రకాశ్ తదితరులు నిర్మాణ సంస్థ: ఎస్ టీమ్ పిక్చర్స్ నిర్మాత: ఎమ్.ఎల్. లక్ష్మీ రచన,దర్శకత్వం: సురేంద్ర మాదారపు సంగీతం: సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ: యెల్లుమహంతి ఈశ్వర్ ఎడిటింగ్: ప్రవీణ్ పూడి విడుదల తేది: ఫిబ్రవరి 3, 2023 కథేంటంటే.. ఈ సినిమా కథంతా.. సువర్ణ సుందరి అనే విగ్రహం చుట్టూ తిరుగుతుంది. 300 ఏళ్ల క్రితం కర్ణాటకలోని కాలక్కల్ సంస్థానంలో త్రినేత్రి అమ్మవారి విగ్రహాలను తయారు చేసే ఓ వ్యక్తి ఆ విగ్రహంలో దుష్టశక్తిని నింపుతాడు. దాని కారణంగా ఆ రాజ్యమే నాశనం అవుతుంది. దీంతో గ్రామస్తులంతా సువర్ణ సుందరి విగ్రహాన్ని భూస్థాపితం చేస్తారు. అయితే 300 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తి పొరపాటున ఆ విగ్రహాన్ని బయటకు తీయడంతో అతని ఫ్యామిలీ అంతా చనిపోతుంది. స్వాతంత్రానంతరం ఆ విగ్రహం ఓ పాత బంగ్లా చేరుతుంది. ఆ బంగ్లాలోకి దిగిన కలెక్టర్ భార్య అంజలి(పూర్ణ)కి ఆ విగ్రహం దొరుకుతుంది. ఆమె సువర్ణ సుందరిని టచ్ చేయగానే దుష్టశక్తి ఆమెలో చేరిపోతుంది. దీంతో తన భర్తను, మామను అంజలి చంపేస్తుంది. తన కూతురు విశాలాక్షి (జయ ప్రద)ను కాపాడుకునేందుకు అంజలి ఆ విగ్రహంతో ఆత్మాహుతి చేసుకుంటుంది. కానీ మళ్లీ అంజలి కొన్నేళ్ల తరువాత జన్మిస్తుంది. అలా మళ్లీ అంజలి చేతికే ఆ విగ్రహం దొరుకుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? తన తల్లిని కాపాడుకునేందుకు విశాలాక్షి చేసే ప్రయత్నం ఏంటి? సాక్షి (సాక్షి చౌదరి)కి ఆ విగ్రహంతో ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో పోలీస్ ఆఫీసర్ గుణ (సాయి కుమార్) పాత్ర ఏంటి? విగ్రహం వెనుకున్న రహస్యం ఏంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పురాతన బంగ్లా, సంస్థానం.. అందులో దుష్టశక్తి ఉండడం..దాని వల్ల ప్రజలకు హానీ కలగడం..ఈ తరహా కథలను మనం చూశాం. కానీ సువర్ణ సుందరి కథలో కొత్తదనం ఏంటంటే విగ్రహంలోనే దుష్టశక్తి ఉండడం. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్లు రాక్షసుల్లా మారిపోవడం.. చుట్టుపక్కల వాళ్లను చంపి ఆ రక్తంతో దాహం తీర్చుకోవడం..ఇది వినడానికే ఆసక్తికరంగా ఉంది కదా.. దర్శకుడు సురేంద్ర అంతే ఆసక్తిగా తెరపై చూపించాడు. కథలో లోపాలు ఉన్నప్పటికీ గ్రాఫిక్స్తో వాటిని కప్పిపుచ్చారు. ఫస్టాఫ్ అంతా సువర్ణ సుందరీ విగ్రహం చుట్టే సాగుతుంది. కొన్ని సీన్స్ భయపెడతాయి. మిగతావి సాదాసీదాగా సాగుతాయి. కథ ముందుకు వెళ్తున్న కొద్దీ కాస్త నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్లో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. సువర్ణ సుందరి నేపథ్యం తెలిశాక ప్రేక్షకులు ఆశ్యర్యపోతారు. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ గొప్పగా ఉన్నా..మేకింగ్ విషయంలో కాస్త తడబడ్డాడు. కథని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. హారర్ చిత్రాలను ఇష్టపడే వారికి సువర్ణ సుందరి నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ చిత్రంలో అంజలి రెండు గెటప్పుల్లో కనిపిస్తుంది. ప్రజెంట్ సీన్లలో మోడ్రన్గా కనిపిస్తే.. ప్లాష్బ్యాక్ సీన్లలో ఎంతో నిండుగా, హుందాగా కనిపిస్తారు. సాక్షి అయితే సెకండాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్లో మెప్పిస్తుంది. జయప్రద మరోసారి తన అనుభాన్ని తెరపై చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆమె నటన అదిరిపోతుంది. పోలీసు పాత్రలో సాయి కుమార్ ఎప్పటిమాదిరే ఒదిగిపోయాడు. చర్చ్ ఫాదర్గా కోట శ్రీనివాసరావు, రాజగురువుగా నాగినీడు, మహారాజుగా అవినాష్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాయి కార్తీక్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. యెల్లుమహంతి ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
టాలీవుడ్ హీరోపై మనసు పడిన రాశీఖన్నా
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ 2 టాక్ షోకు రోజురోజుకూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తన మ్యానరిజం,చమత్కారంతో టీఆర్పీ రేటింగ్స్ను పరుగులు పెట్టిస్తున్నారు బాలయ్య. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షో సెకండ్ సీజన్ కూడా సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఇప్పటికే 5 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కాగా, తాజాగా లేటెస్ట్ ప్రోమోను వదిలారు. అలనాటి హీరోయిన్స్ జయసుధ, జయప్రదలతో పాటు యంగ్ బ్యూటీ రాశీఖన్నాలు షోలో సందడి చేయనున్నారు. ఈ క్రమంలో నారీనారీ నడుమ మురారి అంటూ ముగ్గురు హీరోయిన్స్తో బాలయ్య అల్లరి ఏ విధంగా ఉంటుందో ప్రోమోలో చూపించారు. ఇక హీరోయిన్ రాఖీఖన్నా మనసులో చోటు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో గురించి కూడా బయటపెట్టేశారు. నువ్వు నటించిన హీరోల్లో నీ క్రష్ ఎవరు అని బాలయ్య అడగ్గా ఏమాత్రం తడుముకోకుండా విజయ్ దేవరకొండ అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
నటి జయప్రదకు షాక్, మాజీ ఎంపీపై నాన్ బెయిలబుల్ వారెంట్
సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాంపూర్ ప్రత్యేక కోర్టు జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి షాక్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులకు సంబంధించి ఆమెకు వారెంట్ ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది అమర్నాథ్ తివారీ తెలిపారు. వివరాలు.. 2019లో లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల నియయావళిని ఉల్లంఘించినందుకు గాను ఆమెపై వేర్వేరుగా రెండు కేసు నమోదయ్యాయి. చదవండి: తొలిసారి కూతురిని చూసి ఎమోషనలైన సింగర్ రేవంత్, వీడియో వైరల్ ఈ కేసుల విచారణ సమయంలో జయప్రద వరుసగా కోర్టుకు హాజరుకాకపోవడం కోర్టు ఆమె తీరుపై ఆగ్రం వ్యక్తం చేసింది. ఈ కారణంగానే జయప్రదపై తాజాగా రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. అంతేకాదు వచ్చే మంగళవారం విచారణ సందర్భంగా జయప్రదని కోర్టులో హజరుపరచాలని రాంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును కోర్టు ఆదేశించినట్లు న్యాయవాది అమర్నాథ్ తెలిపారు. ఇక ఈ కేసు తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. చదవండి: భారీగా రెమ్యునరేషన్ పెంచిన విజయ్.. తలైవాను అధిగమించాడా? కాగా 2019 ఏప్రిల్ 18న పిపారియా మిశ్రా గ్రామలో జరిగిన ఓ బహిరంగ సభకు సంబంధించి వీడియో నిఘా బృందం ఇన్ఛార్జ్ కుల్దీప్ భట్నాగర్ నమోదు చేశారు. అలానే.. స్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూర్పూర్ గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో 2019 ఏప్రిల్ 19న ఫ్లయింగ్ స్క్వాడ్ మేజిస్ట్రేట్ నీరజ్ కుమార్ జయప్రద మీద మరో కేసు నమోదు చేశారు. ఈ ఎన్నికల్లో రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన జయప్రద.. సమాజ్ వాదీ పార్టీకి చెందిన అజం ఖాన్ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. -
సీనియర్ నటి జయప్రదకు అరుదైన పురస్కారం
సీనియర్ నటి జయప్రదకు అరుదైన గౌరవం లభించింది. ఆమె ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది పురస్కారానికి ఎంపికైంది. ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాల సందర్భంగా అవార్డ్ అందకోనున్నారు. ఈనెల 27న ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరగనుంది. నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో ప్రముఖ రైటర్ డాక్టర్ సాయి మాధవ్ బుర్ర సభా నిర్వహణలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార గ్రహీత అవార్డును ప్రఖ్యాత సినీ నటి జయప్రద అందుకోనున్నారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ గారి చేతుల మీదుగా ఆమెకు పురస్కారాన్ని అందించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జయప్రకాశ్ నారాయణ, దర్శకుడు కోదండరామిరెడ్డి, ఎన్టీఆర్ అభిమాన సత్కార గ్రహీత డాక్టర్ మైధిలి అబ్బరాజు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం పాల్గొననున్నారు. ఈ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలి పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్లో ఏడాది పొడవునా ఎన్టీఆర్ చలన చిత్రాలు ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 28న "అడవి రాముడు" సినిమాను ప్రదర్శిస్తునారు. ఈ చిత్రాన్ని నందమూరి రామకృష్ణ, జయప్రద, కోదండరామిరెడ్డి ప్రేక్షకులతో కలిసి చూడనున్నారు. -
స్టార్ నటుడు చెంప చెళ్లుమనిపించిన జయప్రద? క్లారిటీ ఇచ్చిన దలీప్ తాహిల్
నటి జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటోంది. ఇదిలా ఉంటే ఆమె స్టార్ నటుడు దలీప్ తాహిల్ చెంప చెళ్లుమనిపించిందంటూ తరచూ బాలీవుడ్లో వార్తల చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ వార్తలపై తాజాగా నటుడు దలీప్ తాహిల్ స్పందించాడు. ఈ సందర్భంగా జయప్రద తనని కొట్టినట్లు వస్తున్న వార్తలపై ఆయన వివరణ ఇచ్చాడు. 1986లో అమితాబ్ బచ్చన్-జయప్రద జంటగా ‘ఆఖ్రే రాస్తా’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో దలిప్ తాహిర్ విలన్గా చేశాడని, ఇందులో ఆయన జయప్రదను అత్యాచారం చేసే ఓ సన్నివేశం ఉందట. ఈ సీన్ షూటింగ్ సమయంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో జయప్రద ఆయనను చెంప దెబ్బ కొట్టినట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది. తాజాగా దీనిపై ఆయన వివరణ ఇచ్చాడు. ‘‘జయప్రదతో కలిసి ఓ అభ్యంతరకర సన్నివేశంలో నటించానని, ఆ సీన్ షూటింగ్ సమయంలో ఆమె నన్ను కొట్టినట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను నేను కూడా విన్నాను. నేను కొంచెం దూకుడుగా వెళ్లానని, ఆమె నా చెంప చెళ్లు మనిపించినట్టు అందులో ఉంది. అసలు నేను జయప్రదతో కలిసి ఏ సినిమాలోనూ నటించనేలేదు. ఇది వాస్తవం. ఆమెతో కలిసి నటించాలనే ఆసక్తి ఉన్నా, ఆ అవకాశం మాత్రం రాలేదు. అలాంటప్పుడు ఇక అలాంటి సీన్ చేసే అవకాశమే లేదు కదా? ఈ కథనాలు రాసే వ్యక్తి పట్ల నాకు శత్రుత్వం లేదు. కానీ ఆ సీన్ చూపిస్తే సంతోషిస్తాను. సోషల్ మీడియాలో అసలు లేనివి కూడా పుట్టిస్తున్నారు’’ అంటూ దలీప్ తాహిల్ అసహనం వ్యక్తం చేశాడు. చదవండి: నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి నాన్నా: మహేశ్ ఎమోషనల్ ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్ -
‘మా ఇద్దరిని కలపడానికి ఓ గదిలో పెట్టి తాళం వేశారు’
అందాల తార శ్రీదేవి బాల నటిగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఇండియాలోనే టాప్ హీరోయిన్గా నిలిచారు. అప్పటికే టాలీవుడ్లో టాప్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న జయప్రద, జయసుధలకు.. అటు బాలీవుడ్లో మాధురీ దీక్షిత్కు గట్టి పోటీ ఇచ్చారు శ్రీదేవి. ఆ తర్వాత ఆమె ఇండియాలోనే నంబర్ వన్ హీరోయిన్గా ఎదిగారు. ఇక శ్రీదేవికి, జయప్రదకు మధ్య ఉన్న కోల్డ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మర్యాదపూర్వకంగా పలకరించుకోవడం కానీ.. కనీసం ఒకరిని ఒకరు చూసుకోవడం కానీ చేసేవారు కాదు. ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎందరో ప్రయత్నించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. తాజాగా వీరిద్దరి మధ్య నడిచిన కోల్డ్ వార్కు సంబంధించిన విశేషాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. ఈ సారి ఏకంగా జయప్రదనే దీనిపై స్పందించారు. ఇండియన్ ఐడల్ 12కు గెస్ట్గా వచ్చారు జయప్రద. ఈ వేదిక మీద ఆమె తనకు, శ్రీదేవికి మధ్య నడిచిన కోల్డ్ వార్ను మరోసారి గుర్తు చేసుకున్నారు. జయప్రద మాట్లాడుతూ.. ‘‘ఇలా చెప్పడానికి నేనేం బాధపడటం లేదు. అలా అని మేం ఇద్దరం ఎప్పుడైనా గొడవ పడ్డామా అంటే అది లేదు. కాకపోతే మా ఇద్దరి మధ్య కెమస్ట్రీ మ్యాచ్ కాలేదు. పైగా అప్పటికే మేం ఇద్దరం టాప్ హీరోయిన్లం. నేనేందుకు తగ్గాలంటే.. నేనేందుకు తగ్గాలి అని ఇద్దరం ఫీల్ అయ్యే వాళ్లం. ఎలా ఉండేవాళ్లం అంటే మా ఇద్దరి మధ్య ఐ కాంటాక్ట్ కూడా ఉండేది కాదు’’ అంటూ గుర్తు చేసుకున్నారు. ‘‘ఇక ప్రతి విషయంలో మేం ఒకరి మీద ఒకరం పోటీ పడుతుండేవాళ్లం. డ్రెస్సులు, డ్యాన్స్లు ఇలా అన్ని విషయాల్లో ఒకరిపై ఒకరం పై చేయి సాధించాలని ట్రై చేసే వాళ్లం. తెర మీద మంచి అక్కాచెల్లళ్లలా కనిపించినప్పటికి.. వాస్తవంగా కనీసం పరిచయం ఉన్నవారిలా కూడా ఉండేవాళ్లం కాదు. మేం ఇద్దరం ఎదురుపడిన ప్రతిసారి దర్శకులు, తోటి నటులు మమ్మల్ని ఒకరిని ఒకరికి పరిచయం చేసేవారు. అప్పుడు మాత్రం హలో అని పలకరించుకుని ముందుకు వెళ్లిపోయేవాళ్లం’’ అంటూ చెప్పుకొచ్చారు జయప్రద. ఇక తమ ఇద్దరిని కలపడానికి చాలా మంది ప్రయత్నించారని.. వారిలో రాజేశ్ కుమార్, జితేంద్ర ఖన్నా కూడా ఉన్నారని గుర్తు చేసుకున్నారు జయప్రద. ‘‘ఒకసారి షూటింగ్ లంచ్ టైంలో రాజేశ్ కుమార్, జితేంద్ర మా ఇద్దరిని ఒకే రూమ్లో పెట్టి తాళం వేశారు. దాదాపు గంటసేపు అలానే ఉంచారు. అలా అయినా మేం ఒకరితో ఒకరం మాట్లాడుకుంటామని భావించారు. గంట తర్వాత తలుపు తీసి చూస్తే.. మేం ఇద్దరం ఆ పక్క ఒకరం.. ఈ పక్క ఒకరం కూర్చుని ఉన్నాం. ఆ తర్వాత ఇద్దరం బయటకు వెళ్లిపోయాం’’ అని చెప్పుకొచ్చారు జయప్రద. చదవండి: 'అమ్మాయ్... చింపి.. చింపి.. చంపి పడేశావ్' ఆ నటి గొంతు నాకన్నా ఘోరంగా ఉంది -
స్టార్ స్టార్ సూపర్ స్టార్- జయప్రద
-
అందాల తార జయప్రద గురించి ఈ విషయాలు తెలుసా..?
ఆమె ఆరేసుకుంటే ప్రేక్షకుడు మనసు పారేసుకున్నాడు. ఈమెతోనే రజనీకాంత్ ‘ఇంక ఊరేల.. సొంత ఇల్లేల ఓ చెల్లెలా’ అన్నది. కమలహాసన్ కళ మద్యపు మురుక్కాలవలో పారుతుంటే ఈమె కదూ దానిని ‘సాగర సంగమం’ చేయించింది. ‘భారతీయ వెండితెర మీద అంత అందమైన ముఖం మరొకటి లేదు’ అని సత్యజిత్ రే పొగిడిన ఏకైక తెలుగు అందం జయప్రదది. ఆమె రాజకీయ ప్రస్థానం ఒకదారి. ఆమె నటనదే ప్రేక్షకుల గుండెదారి. జయప్రద... జయసుధ.. శ్రీదేవి తెలుగు సినీ జగత్తును ఏలిన ఈ ముగ్గురు హీరోయిన్లు ఒకటి రెండు సంవత్సరాల తేడాతో స్టార్లు అయ్యారు. తెలుగు మాట, తెలుగు ఆట, తెలుగు సౌందర్యం తెర మీద చూపారు. శ్రీదేవి గ్లామర్లో బెస్ట్. జయసుధ యాక్టింగ్లో బెస్ట్. జయప్రద ఇటు గ్లామర్, అటు యాక్టింగ్ రెంటిలోనూ బెస్ట్ అనిపించుకున్నారు. రాజమండ్రికి చెందిన లలిత రాణి ‘భూమి కోసం’ (1974)లో మొదటిసారి తెర మీద రెండు మూడు నిమిషాల సేపు కనిపించారు. ఒక పాట మధ్యలో ఒక వితంతువు తనను చెరబట్టే కామందును హతమారుస్తుంది. ఆ వితంతువు జయప్రద. మొట్టమొదటి వేషం అలాంటిది ఎవరూ వేయరు. కాని జయప్రద చేశారు. ఆ సినిమాలోనే పేరు మార్చుకుని అప్పట్లో ‘జయ’ ట్రెండ్ నడుస్తున్నందున జయప్రదగా మారారు. ఆమె పెదవి మీద పుట్టుమచ్చ ఉంటుంది. వెండితెర మీద ఒక అందమైన పుట్టుమచ్చగా ఆమె ప్రేక్షకులకు నచ్చింది. తరం మారుతున్నప్పుడు కొత్త తరం వస్తుంది. వాణిశ్రీ, లక్ష్మి, మంజుల, లత... వీరు సీనియర్లు అవుతున్న కొద్దీ కొత్తవాళ్లు కావాల్సి వచ్చారు. జయప్రద ఆ సమయంలోనే మద్రాసులో అడుగుపెట్టారు. ఏకంగా కె.బాలచందర్ దృష్టిలో పడ్డారు. ఆమె తమిళంలో తీసిన ‘అవల్ ఒరు తోడర్ కథై’లో సుజాత చేసిన పాత్రను జయప్రదకు ఆఫర్ చేశారాయన. సుజాతకు అప్పటికి తెలుగు రాదు. అచ్చతెలుగు అమ్మాయి ఉంటేనే బాగుంటుందని బాలచందర్ ఆలోచన. అందుకు జయప్రద సరైనది అని ఆయన భావించారు. ఒక మధ్యతరగతి గంపెడు సంసారాన్ని తన భుజాల మీద మోసే, తన కలలను చిదిమేసుకుని కుటుంబం కోసం బతికే ఒక సగటు ఆడపిల్ల కథ అది. దాని బరువు ఎక్కువ. జయప్రదది ఆ సమయానికి చిన్న వయసు. కాని ఆమె ఆ పాత్రను అర్థం చేసుకొని పోషించడంతో... ఒక్క కేరెక్టర్లోనే ప్రేమ, కోపం, ఆర్తి, అసహనం చూపడంతో జయప్రద స్టార్ అయ్యారు. ఆ సినిమాయే తెలుగులో రజనీకాంత్కు కూడా తొలి సినిమా. ఆ సినిమాలో ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి పాట’... ఏసుదాస్కు, జయప్రదకు, రజనీకాంత్కు నేటికీ మిగిలిపోయింది. కె.బాలచందర్ దర్శకత్వంలో ఆమె ‘47 రోజులు’, ‘అందమైన అనుభవం’ చేశారు. కేన్సర్ పేషెంట్గా చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు? జయప్రద తప్ప. ‘అడవి రాముడు’తో కె.రాఘవేంద్రరావు జయప్రదను కమర్షియల్ హీరోయిన్ను చేశారు. అప్పటికే జయప్రద కుటుంబం ఎన్.టి.ఆర్కు పరిచయం ఉంది. కొన్నాళ్ల క్రితం సెలవుల్లో వచ్చి ఆయన దగ్గర కూచుని కబుర్లు చెప్పిన స్కూల్ గర్ల్ ఇప్పుడు ఆయన పక్కనే హీరోయిన్ అయ్యింది. వేటూరి రాయగా కె.వి.మహదేవన్ స్వరపర్చగా బాలూ, సుశీల పాడిన ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ పాట జయప్రదను సకల ప్రేక్షకులకు పరిచయం చేసేసింది. జయప్రద అంటే ఒక సుందరమైన సౌందర్యవంతమైన రూపం. ప్రేక్షకులు అలానే కోరుకున్నారు. ఆమె నేటికీ అలానే ఉన్నారు. ఇప్పుడు ఆమె ఒక తెలుగు సినిమా లో నటిస్తున్నారు. మరోసారి జయప్రద జయప్రదంగా మన ముందుకు రావాలని కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
విమర్శలు... వ్యంగ్యాస్త్రాలు
‘బాలీవుడ్ డ్రగ్స్ మత్తులో ఉంది’ అని నటుడు, యంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలు ఓ కొత్త వివాదానికి దారి తీసిన విషయం, ఆయన మాటల్ని నటి, యంపీ జయా బచ్చన్ ఖండించిన విషయం తెలిసిందే. జయ మాటలకు ఇండస్ట్రీ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆమె మాటలు కరెక్ట్ అని చాలామంది అన్నారు. కొందరు కొట్టిపారేశారు. కంగనా రనౌత్ అయితే అస్సలు ఏకీభవించలేదు. జయ కామెంట్స్ను తిప్పి కొట్టారు. అయితే కంగనా మాట్లాడిన విషయాన్ని ఊర్మిళ తప్పుబట్టారు. ఇదంతా బుధవారం వరకూ జరిగిన మాటల యుద్ధం. జయా బచ్చన్ వ్యాఖ్యలకు గురువారం వ్యంగ్యంగా బదులిచ్చారు నటుడు రణ్వీర్ షోరే. తన మీద ఊర్మిళ చేసిన కామెంట్స్ను తిప్పికొట్టారు కంగనా రనౌత్. ఈ విషయాల గురించి జయప్రద, పూజా భట్ మాట్లాడారు. క్యూట్ గాళ్ నిధీ అగర్వాల్ కూడా ‘నెపోటిజమ్’ గురించి మాట్లాడారు. ఆ విశేషాలు. ఊర్మిళ కేవలం శృంగార తార! – కంగనా ‘డ్రగ్స్ హిమాచల్ ప్రదేశ్లోనే మొదలయ్యాయి. ముందు నీ ప్రాంతాన్ని శుభ్రం చేసుకో’ అని కంగనా రనౌత్కు కౌంటర్ ఇచ్చారు నటి ఊర్మిళ. ఈ కౌంటర్కి ఘాటుగా సమాధానం ఇచ్చారు కంగనా. ‘ఊర్మిళగారి ఇంటర్వ్యూ చూశాను. నా గురించి, నా ప్రయాణం గురించి తక్కువ చేస్తూ మాట్లాడారామె. ఇదంతా నేను రాజకీయాల్లో సీట్ కోసం చేస్తున్నాను అని అంటున్నారామె. ఊర్మిళ సాఫ్ట్ పోర్న్ స్టార్ (శృంగార తార). ఆమె యాక్టింగ్కి ఆమె పాపులర్ అవ్వలేదు. మరి దేనికి పాపులరయ్యారు? అంటే... సాఫ్ట్ పోర్న్ చేయడం వల్లే కదా. ఆమెకే టికెట్ వచ్చినప్పుడు నాకెందుకు రాదు?’ అని కౌంటర్ ఇచ్చారు కంగనా. అయితే కంగనా చేసిన ఈ వ్యాఖ్యలకు బాలీవుడ్లో పలువురు ప్రముఖులు ఊర్మిళకు మద్దతుగా ట్వీట్ చేశారు. మా దగ్గర ఉన్న ప్రతిదీ మా కష్టార్జితమే! – రణ్వీర్ షోరే ‘ఇండస్ట్రీలో పని చేస్తూ ఇండస్ట్రీనే తప్పుపట్టడమంటే అన్నం పెట్టిన చేతినే నరకడం వంటిది’ అన్నారు జయా బచ్చన్. ఈ కామెంట్ను కంగనా తిప్పి కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు రణ్వీర్ షోరే కూడా స్పందించారు. ‘ఖరీదైన ప్లేట్లలో మీ పిల్లలకు మీరు భోజనం సమకూరుస్తారు. మాకు మాత్రం చివాట్లు. మా భోజనాన్ని మేమే తయారుచేసుకుని బాక్స్ కట్టుకొని పనికి వెళ్తాం. మాకు ఎవ్వరూ ఎప్పుడూ ఏదీ ఇవ్వలేదు. మా దగ్గర ఏముందో అది మాదే. దాన్ని మా నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. ఒకవేళ తీసుకునే వీలుంటే దాన్ని కూడా వాళ్ల పిల్లలకే పెడతారు’ అని ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్ సైడర్స్ (బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లు/బయటినుంచి వచ్చినవాళ్లు) టాపిక్ను చెప్పకనే చెబుతూ ట్వీట్ చేశారు రణ్వీర్ షోరే. వాళ్ల గురించీ ఆలోచించండి – పూజా భట్ ప్రస్తుతం డ్రగ్స్ పై జరుగుతున్న చర్చ గురించి నటి, దర్శక–నిర్మాత పూజా భట్ కూడా మాట్లాడారు. తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారామె. ‘‘ప్రస్తుతం అందరూ బాలీవుడ్లో డ్రగ్స్ ఉన్నాయి. బాలీవుడ్లోనే ఉన్నాయి.. వాటిని తొలగించాలి అని అంటున్నారు. కన్న కలల్ని సాధించలేక, ఆశలన్నీ కూలిపోయి జీవితాన్ని భారంగా గడుపుతూ కలల వెనక పరిగెత్తేవాళ్లు కూడా మత్తు పదార్థాల వెనక పరిగెడుతున్నారు. దారిద్య్రంలో ఉంటూ జీవించడమే భారంగా అనిపించి, మత్తులో తేలుతూ ఈ భారాన్నంతా తేలిక చేసుకుంటున్నవాళ్ల గురించి కూడా ఆలోచించండి. వాళ్లను మామూలు మనుషుల్లా మార్చే ప్రయత్నాలు చేయండి’’ అన్నారు పూజా భట్. నెపోటిజమ్ నా ప్రయాణాన్ని ఆపలేదు – నిధీ అగర్వాల్ ‘అవును.. బాలీవుడ్లో నెపోటిజమ్ (బంధుప్రీతి) ఉంది. ఎప్పటికీ ఉంటుంది. అది ఉన్నంత మాత్రాన అవుట్సైడర్గా నా ప్రయాణం ఆగిపోదు’ అన్నారు ‘ఇస్మార్ట్ శంకర్’ హీరోయిన్ నిధీ అగర్వాల్. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘మా నాన్నగారు వ్యాపారవేత్త. నేను సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని వచ్చాను. ఒకవేళ నేనూ మా నాన్నగారి వ్యాపారంలో ఉంటే ఆయన వారసురాలిగా నన్నే సీఈఓని చేస్తారు. అలానే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లకు కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయి. వాళ్లను గైడ్ చేసేవాళ్లు ఉంటారు. ఎలాంటి నిర్ణయాలు శ్రేయస్కరమో సూచిస్తుంటారు. దీనివల్ల నేను (అవుట్సైడర్) స్టార్ని అవ్వలేనని కాదు. కొంచెం సమయం పడుతుందేమో కానీ కచ్చితంగా స్టార్ని అవుతాను. కష్టపడితే, ప్రేక్షకులు ఆదరిస్తే కచ్చితంగా ఎవ్వరైనా ఇండస్ట్రీలో ఎదగగలరు’’ అన్నారు నిధీ అగర్వాల్. జయా జీ రాజకీయం చేస్తున్నారు – జయప్రద డ్రగ్స్ వివాదం గురించి ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద మాట్లాడుతూ – ‘‘రవికిష¯Œ గారు మాట్లాడిన పాయింట్తో నేను ఏకీభవిస్తాను. ఆయన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. యువతను డ్రగ్స్ బారినపడకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ విషయం మీద మనందరం పోరాటం చేయాలి. జయా బచ్చన్గారు మా అందరికంటే పెద్దావిడ.. ఆమె మీద మా అందరికీ గౌరవం ఉంది. కానీ ఆమె ఈ విషయాన్ని (డ్రగ్స్) రాజకీయం చేస్తున్నారనిపించింది’’ అన్నారు. -
జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్
లక్నో: సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు రాంపూర్ కోర్టు ఆమె నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. కాగా గతంలో సమాజ్వాదీ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందిన జయప్రద.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కాషాయ పార్టీ తరఫున రాంపూర్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జయప్రద.. ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. దాదాపు లక్ష ఓట్ల తేడాతో పరాజయం చెందారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా జయప్రద ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ అప్పట్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శనివారం ఆమెకు స్థానిక కోర్టు వారెంట్ జారీ చేసింది. కాగా ఎన్నికల ప్రచారంలో ఆజంఖాన్ జయప్రదపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘అమ్రపాలి (నృత్యకారిణి), నాచ్ నే వాలీ’అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. జయప్రద పార్టీ మారిన సమయంలో.. ‘జయప్రదను నేనే రాంపూర్కు తెచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను’ అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. A non bailable warrant has been issued by a Rampur court against veteran actor and BJP leader Jaya Prada in a violation of model code of conduct case of 2019. Next hearing is on April 20. (file pic) pic.twitter.com/CA3xesRwlU — ANI UP (@ANINewsUP) March 7, 2020 -
‘ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడితే మంచిది’
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు మహిళా నేతల గురించి అడ్డమైన చెత్త వాగుడు వాగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ విషయంపై ఇంతవరకూ అధికార పార్టీతో సహా ఇతర పార్టీ ముఖ్య నాయకులేవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంపై స్పందించడమే కాక.. నాయకులు కాస్తా బుర్ర పెట్టి స్పృహలో ఉండి మాట్లాడితే మంచిదంటూ సూచించారు. ఏఎన్ఐకిచ్చిన ఇంటర్వూలో ఆమె ఈ విధంగా మాట్లాడారు. ‘చర్చలో భాగమైనా కాకపోయిన ఓ మహిళ గురించి కామెంట్ చేయడం చాలా ఈజీ. ఓ వర్గానికి చెందిన వారి గురించి వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా సులువు. ఇలాంటివి చూసినప్పుడు కనీస ఆలోచన లేకుండా ఇంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతారు అనిపిస్తుంటుంది. అందుకే అందరికి చెప్పేదొకటే.. మాట పెదాలను దాటకముందే దాని గురించి కాస్తా బుర్ర పెట్టి ఆలోచిస్తే మంచిది. ఇలాంటి మాటలు మాట్లాడి మన ముందు తరాలకు ఏం సందేశం ఇస్తున్నాం అనే విషయాన్ని మైండ్లో ఉంచుకుని మాట్లాడితే మంచిద’ని సూచించారు. ఎస్పీ నాయకుడు ఆజం ఖాన్.. జయప్రద గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోన్నప్పటికి.. ఆ పార్టీ నాయకులు ములాయం సింగ్ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ స్పందించకపోవటం గమనార్హం. అదే విధంగా కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ని పరామర్శించటం గురించి నిర్మలా సీతారామన్ని ప్రశ్నించగా.. ‘నేను విమానాశ్రయానికి తిరిగి వెళ్తున్నాను. ఆ సమయంలో ఆస్పత్రిలో ఉన్న శశి థరూర్ని పరామర్శిస్తే బాగుంటుంది అనిపించిది. అందుకే ఆస్పత్రికి వెళ్లాను. దీని గురించి నా పార్టీకి చెందిన వ్యక్తులతో సహా ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రచారంలో భాగంగా శశి థరూర్కి ఆలయంలో తులాభారం నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిదే. -
నేను చస్తే.. నీ కళ్లు చల్లబడతాయా?: జయప్రద
లక్నో : తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమాజ్వాదీ పార్టీ నాయకుడు.. ఒకప్పటి తన స్నేహితుడు, ప్రస్తుత ప్రత్యర్థి ఆజంఖాన్పై సినీ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, మహిళల రక్షణ కోసం ఆజంఖాన్ను ఎన్నికల్లో పోటీచేయనివ్వద్దన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను చచ్చిపోతే.. నీవు సంతృప్తి పడతావా?’ అంటూ ఆజంఖాన్ ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘నన్ను భయపడితే రాంపూర్ వదిలి వెళ్తానని అనుకుంటున్నావ్.. కానీ ఎన్ని చేసినా నేను ఇక్కడి నుంచి వెళ్లే ముచ్చటే లేదు. ఇలాంటి వ్యక్తిని ఎన్నికల్లో అనుమతించకూడదు. ఒక వేళ ఇతను గెలిస్తే ప్రజాస్వామ్యం ఏమవుతోంది. మహిళల పరిస్థితి ఏంటి?’ అని ప్రశ్నించారు. ఇక 2004లో సమాజ్వాదీ పార్టీ తరఫున రాంపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జయప్రద ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో ఆమె విజయానికి ఆజంఖాన్ కృష్టి చేశారు. అనంతరం వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఆమె పార్టీని వీడారు. ఇటీవల బీజేపీలో చేరిన జయప్రద ప్రస్తుతం ఆ పార్టీ తరఫున రాంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా ఆజంఖాన్ బరిలోకి దిగారు. దీంతో వీరి మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ఆదివారం ఓ ఎన్నికల ప్రచారసభలో ఆజంఖాన్ మాట్లాడుతూ.. ‘జయప్రదను నేనే రాంపూర్కు తీసుకొచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా, పల్లెత్తు మాట అనకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే(మీడియా) సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను.’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మహిళల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని ఆజంఖాన్పై కేసు కూడా నమోదైంది. మహిళా కమిషన్ సైతం ఆజం ఖాన్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి అతనికి నోటీసులు జారీ చేసినట్టు పేర్కొంది. (జయప్రదపై ఆజం దిగజారుడు వ్యాఖ్య) -
‘ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది.. భీష్ముడిలా ఉండకండి’
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రదపై ఎస్పీ నాయకుడు ఆజం ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయమై ట్విటర్ వేదికగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ములాయం సింగ్ యాదవ్ భాయ్.. మీరు సమాజ్వాదీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. మీ దగ్గరల్లోని రాంపూర్లో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతోంది. అయితే మీరు మాత్రం భీష్ముడి మాదిరి మౌనం వహించి పోరాపాటు చేయవద్ద’ని పేర్కొన్నారు. అంతేకాకుండా జయప్రదపై ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. మరోవైపు ఒక మహిళ మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆజం ఖాన్పై సోమవారం రాంపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ ఘటనపై జయప్రద కూడా స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆజం ఖాన్ హద్దులు మీరి ప్రవర్తించారని విమర్శించారు. ఒకవేళ ఆజం ఖాన్ గెలిస్తే మహిళల పరిస్థితి ఎంటని ప్రశ్నించారు. మహిళకు సమాజంలో రక్షణ ఉండదని తెలిపారు. ఆజం ఖాన్కు నోటీసులు జారీ చేసిన మహిళ కమిషన్ జాతీయ మహిళ కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ.. ఆజాం ఖాన్ గతంలో పలుమార్లు మహిళలపై అసభ్య పదజాలం ఉపయోగించారని అన్నారు. ఆజం ఖాన్ ఈ ఎన్నికల్లో మహిళ నాయకురాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి అని తెలిపారు. అందుకే అతడి పై కఠిన చర్యలు తీసుకోవాలని తాము ఎన్నికల సంఘానికి లేఖ రాశామని చెప్పారు. ఆజం ఖాన్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోని అతని నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. ఆదివారం ఓ ఎన్నికల ప్రచారసభలో ఆజం ఖాన్ మాట్లాడుతూ.. ‘జయప్రదను నేనే రాంపూర్కు తెచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాన’ని అన్నారు. అయితే ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. -
జయప్రదపై ఆజం దిగజారుడు వ్యాఖ్య
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ప్రచారంలో మరో దిగజారుడు వ్యాఖ్య వినిపించింది. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎస్పీ తరఫున పోటీ చేస్తున్న ఆజం ఖాన్, తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో పదేళ్లపాటు రాంపూర్కు జయప్రద ఎస్పీ తరఫున ప్రాతినిధ్యం వహించగా, ఇటీవలే ఆమె బీజేపీలో చేరి ప్రస్తుతం ఆమె అదే స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచారు. దీనిపై ఆజం ఖాన్ మాట్లాడుతూ ‘జయప్రదను నేనే రాంపూర్కు తెచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను’ అని ఖాన్ ఓ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్తో జయ ప్రద సంబంధాలపై చర్చ లేవనెత్తేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆజంఖాన్ వ్యాఖ్యలు అపకీర్తికరమైనవనీ, ఆయనకు అతి త్వరలోనే నోటీసులు పంపనున్నామని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ తెలిపారు. ఆయనను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కూడా తాము కోరతామన్నారు. -
ఆజంఖాన్ నుంచి విముక్తికే పోటీ
లక్నో: తన ప్రత్యర్థి ఆజంఖాన్ నుంచి రామ్పూర్ ప్రజలకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని సినీనటి, రాజకీయ నాయకురాలు జయప్రద అన్నారు. రామ్పూర్ లోక్సభ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగారు. ‘రామ్పూర్ ప్రజల కోసం పనిచేయడానికే ఉన్నాను. ఆజం తాను పాల్పడుతున్న అక్రమాలను చట్టబద్ధం చేసేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కానీ నేను ఈ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను’ అని పీటీఐ వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఆజం తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘ఆయన ఏదైనా మాట్లాడగలడు. ఆయనకు మహిళల పట్ల గౌరవం లేదు. అటువంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటు. కానీ రామ్పూర్ ప్రజలకు ఆయన గురించి బాగా తెలుసు. ఓట్ల ద్వారానే వారు ఆయనకు గట్టి సమాధానం చెప్తారు. 2004లో నేను ముంబై నుంచి పోటీ చేసినప్పుడు ఆయన నా తరపున ఆయన ప్రచారం చేశారు. అప్పుడు ఆయనకు నేనెవరో తెలీదా? ఇప్పుడు నన్ను ‘అమ్రపాలి (నృత్యకారిణి), నాచ్ నే వాలీ’అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు’అని అన్నారు. -
బీజేపీలోకి జయపద్ర.. ఆజంఖాన్పై పోటీ?
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సినీ నటి జయప్రద బీజేపీలో చేరే అవకాశముందని తెలుస్తోంది. ఆమె సోమవారం బీజేపీలో చేరుతారని, యూపీలోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఆమెను కమలం పార్టీ బరిలోకి దింపే అవకాశముందని జాతీయ మీడియా పేర్కొంది. గతంలో సమాజ్వాదీ పార్టీలో కొనసాగిన జయప్రద.. రాంపూర్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఎస్పీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ రాంపూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. గతంలో ఒకే పార్టీలో కొనసాగిన జయప్రద-ఆజం ఖాన్ మధ్య బద్ధ వైరం నెలకొని ఉంది. తనపై యాసిడ్ దాడి చేసేందుకు ఆజంఖాన్ ప్రయత్నించాడంటూ.. ఆయనపై జయప్రద గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జయప్రద.. అనంతరం చంద్రబాబునాయుడితో విభేదించి.. ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీలో చేరారు. అప్పటికే బాలీవుడ్ నటిగా మంచి పేరు ఉండటంతో 2004లో ఆమెకు రాంపూర్ టికెట్ను ఎస్పీ కేటాయించింది. దీంతో మొదటిసారి ఎంపీగా గెలుపొందిన ఆమె.. అనంతరం ఎస్పీ అధినాయకత్వంతో విభేదించి తన సన్నిహితుడైన అమర్సింగ్తో కలిసి పార్టీని వీడారు. రాజకీయాల్లో అమర్సింగ్ను తన గాడ్ఫాదర్గా జయప్రద చెప్పుకుంటారు. వీరి సన్నిహిత్యంపై పలు విమర్శలు వచ్చినా.. ఆమె పెద్దగా పట్టించుకోరు. -
మూడు జన్మల కథ
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ చిత్రం మార్చి రెండో వారంలో విడుదల కానుంది. సూర్య మాట్లాడుతూ– ‘‘మూడు జన్మల కాన్సెప్ట్తో హిస్టారికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్కే ఏడాది పట్టింది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో తెరకెక్కిన మా సినిమా ట్రైలర్కు పదిలక్షలు వ్యూస్కి పైగా లభించాయి. మార్చి తొలివారంలో పాటలను, రెండోవారంలో సినిమాను తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల చేయటానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు’’ అన్నారు. ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎల్లు మహంతి. -
నాకు ఇది సక్సెస్ ఫుల్ రీ ఎంట్రీ – జయప్రద
‘‘నేను కొంచెం గ్యాప్ తర్వాత సినిమా చేయాలనుకున్నప్పుడు ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. నరసింహారావుగారు వచ్చి ‘శరభ’ కథ చెప్పారు. వినగానే సినిమా తప్పకుండా క్లిక్ అవడంతో పాటు నాకు సక్సెస్ ఫుల్ రీ ఎంట్రీ అవుతుందనిపించి చేశా’’ అని నటి జయప్రద అన్నారు. ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా, జయప్రద ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘శరభ’. యన్. నరసింహారావు దర్శకత్వంలో ఎ.ఎస్.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో జయప్రద మాట్లాడుతూ –‘‘నటిగా దాదాపు మూడు వందల సినిమాలకు చేరువ కాబోతున్నాను. ఈ తరుణంలో నాకీ సినిమా ఓ మలుపు తీసుకొస్తుందని అనుకుంటున్నాను. చాలా వేరియేషన్స్ ఉన్న పాత్ర నాది. అశ్వనీకుమార్గారు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ధైర్యంగా మూడేళ్లు ఈ సినిమా నిర్మించారు’’ అన్నారు. ‘‘నరసింహారావుగారికి ఇది తొలి సినిమా అయినా కూడా ఇంత పెద్ద సబ్జెక్ట్ను చక్కగా డీల్ చేశారు. జయప్రదగారు ఈ సినిమాలో తల్లి పాత్రలో అద్భుతంగా నటించారు’’ అన్నారు చిత్రసంగీత దర్శకుడు కోటి. ‘‘మంచి విజువల్ గ్రాఫిక్స్ ఉన్న సినిమా ఇది. ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతి ఇస్తుంది’’ అన్నారు అశ్వనీకుమార్ సహదేవ్. హీరో ఆకాశ్ పాల్గొన్నారు. -
జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు
-
జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు
లక్నో : సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదపై సమాజ్వాదీ పార్టీ నేత ఆజామ్ ఖాన్ నోరు జారారు. తనను ఖిల్జీగా అభివర్ణిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ క్రమంలో ఆమెను ఓ డాన్సర్గా అభివర్ణించిన ఆయన ఆపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం సాయంత్రం ఓ కార్యక్రమానికి హాజరైన మాట్లాడుతూ.. ‘పద్మావత్ చిత్రం వచ్చింది. ఖిల్జీ పాత్ర చెడ్డదని విన్నా. ఖల్జీ రాకముందే పద్మావతి ప్రాణ త్యాగం చేసింది. కానీ, ఇప్పుడు ఓ డాన్సర్ నాపై వ్యాఖ్యలు చేస్తోంది. మరి ఈ డాన్సర్ పాడే పాటను వినుకుంటూ కూర్చుంటే.. రాజకీయాలపై నేనెలా దృష్టిసారిగలను? అంటూ అజామ్ వ్యాఖ్యానించారు. కాగా, ‘పద్మావత్’ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను చూస్తే తనకు ఆజామ్ ఖాన్ గుర్తుకువచ్చాడని ఆమె పేర్కొన్న విషయం విదితమే. అజాం వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. అభ్యంతరకర వ్యాఖ్యలపై అజామ్ క్షమాపణలు చెప్పాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఖిల్జీని చూస్తే అతనే గుర్తుకొచ్చాడు: నటి
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ఎంపీ, ప్రముఖ నటి జయప్రద కొంతకాలం కిందటివరకు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సమాజ్వాదీ పార్టీ తరఫున రాంపూర్ నియోజకవర్గం నుంచి ఆమె రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఆమె ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగుతున్న సమయంలో సొంత పార్టీ ఎస్పీ సీనియర్ నేత ఆజంఖాన్ నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నారు. ఎన్నికల సమయంలో తన పట్ల దుష్ప్రచారం చేస్తున్నారని కూడా అప్పట్లో ఆరోపించారు. తాజాగా ‘పద్మావత్’ సినిమా చూస్తే ఆనాటి జ్ఞాపకాలు ఆమెను వెంటాడినట్టు ఉన్నాయి. అందుకే ‘పద్మావత్’ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను చూస్తే తనకు ఆజంఖాన్ గుర్తుకువచ్చాడని, ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నప్పుడు అతను తనను ఎంతోగానే వేధించాడని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆజంఖాన్ను ఖిల్జీతో పోల్చారు. -
రజనీ, కమల్ హాసన్లను హెచ్చరించిన నటి
సాక్షి, చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్, సినీ నటుడు రజనీకాంత్, కమల్ హాసన్ల రాజకీయ రంగ అరంగేట్రాన్ని తాను స్వాగతిస్తున్నట్లు సినీనటి, మాజీ ఎంపీ జయప్రద చెప్పారు. అయితే రజనీ, కమల్ వెళ్లేదారి పూలదారి మాత్రం కాదని, ఎన్నో ముళ్లుంటాయి, రాళ్లుంటాయని చూసి అడుగేయాలంటూ ఆ నటులను జయప్రద హెచ్చరించారు. రాజకీయాలంటే కేవలం రెండున్నర గంటల సినిమా మాత్రం కాదన్నారు. సినిమాలకు, రాజకీయాలకు సంబంధం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నాయకురాలు జయలలిత మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో శూన్యత ఏర్పడిందన్నారు. ఈ సీనియర్ నటుల రాజకీయ అరంగేట్రంపై మాట్లాడుతూ.. రజనీ, కమల్ రాణిస్తారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. తన రాజకీయ పునరాగమనం ఎప్పుడనేది త్వరలోనే వెల్లడిస్తానని మాజీ ఎంపీ జయప్రద అన్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - జయప్రద.
-
స్టార్ లీడర్
‘ఒకప్పటి’ అనే మాట జయప్రదకు ఎప్పటికీ వర్తించదేమో! సినిమాల్లో ఉన్నా, లేకున్నా.. గ్లామర్లో ఆమె స్టార్. రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా, ఆ పార్టీకి ఆమె బ్రాండ్ లీడర్. పన్నెండేళ్ల వయసుకే సినిమాల్లోకి, ముప్పై రెండేళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చేశారు జయప్రద. పెళ్లి కూడా అంతే! చిన్న వయసులోనే జరిగిపోయింది. ఇరవైనాలుగేళ్లన్నది పెళ్లికి చిన్న వయసేం కాదు. అయితే సినిమాల్లో బిజీగా ఉన్న ఒక స్టార్ నటికి అది బాల్య వివాహమే! జయప్రద తొలి సినిమా ‘భూమికోసం’. తొలి పార్టీ ‘తెలుగుదేశం’. ఇవి రెండూ ఆమెను మరికొన్ని సినిమాలకు, మరికొన్ని పార్టీలకు నడిపించాయి. పెళ్లే.. ఆమెను ఏడడుగులకు మించి ముందుకు నడిపించలేకపోయింది. జయప్రదకు పిల్లల్లేరు. వద్దనుకుంటే లేకపోవడం కాదు. పుట్టే భాగ్యం లేక లేకపోవడం కాదు. మరి ఎందుకు? బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 సమీపంలోని జయప్రద విడిది గృహంలో కొన్నాళ్ల క్రితం సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఆమెను కలిశారు. ఆ రోజు మిగతా మీడియా ప్రతినిధులెవరూ లేరు. జయప్రద, సాక్షి. అంతే. అదొక అపూర్వమైన సందర్భం. జయప్రద ఎన్నో సినిమాల్లో నవ్వి ఉంటారు. ఆ రోజు నవ్విన నవ్వు ఏ సినిమాలోనూ లేనిది. చిన్న పిల్ల నవ్వినట్టు పడీ పడీ నవ్వారు. ఆమె పోటీ నటి శ్రీదేవి ‘పదహారేళ్ల వయసు’ సినిమాలో ‘కట్టుకథలు సెప్పి నేను కవ్విస్తే.. నేను నవ్విస్తే..’ అనే పాటలో నవ్విన నవ్వేం పనికొస్తుంది? అలా నవ్వారు. అంత నవ్వూ.. ‘మీకు పిల్లలెందుకు లేరు?’ అన్న ప్రశ్న దగ్గర సడన్గా ఆగిపోయింది! ‘మీరు పిల్లలెందుకు వద్దనుకున్నారు?’ అని నేరుగా అడగలేకపోయారు సాక్షి ప్రతినిధి. అందుకే ‘మీకు పిల్లలెందుకు లేరు?’ అని అడిగారు. జయప్రద గ్రహించారు. ‘మీరు నేరుగా అడగలేని ప్రశ్నకు సమాధానం కూడా నేను నేరుగా చెప్పలేనిదే’ అన్న భావం సాక్షి ప్రతినిధికి ఆమె మౌనంలో ధ్వనించింది. జయప్రద గత సోమవారం షిర్డీ దర్శనానికి వచ్చి వెళ్లారు. ఆలయ ప్రాంగణం బయట ఈ సౌందర్యరాశి కొన్ని నిమిషాలపాటు అభిమానులకు దర్శనమిచ్చారు. ఆమెలో నేటికీ ‘పూర్వపు నటి’ ఛాయలు మొదలు కాలేదు! సినిమాలు చేస్తే మళ్లీ చూస్తారు. రాజకీయాల్లోకి వస్తే మళ్లీ రాణిస్తారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్లో ఉన్నారు! దేశంలో కాంగ్రెస్ ఉండీ లేనట్లు ఉన్నట్లే, జయప్రద కాంగ్రెస్లో ఉన్నారు. బీజేపీ ఆహ్వానిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్నటి వరకు జయప్రద పార్టీ ఆర్.ఎల్.డి. రాష్ట్రీయ లోక్ దళ్. 2014లో యూపీలోని బిజ్నోర్ నుంచి ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అది అజిత్సింగ్ పార్టీ. అంతకు ముందు ఆమె పార్టీ ఆర్.ఎల్.ఎం. రాష్ట్రీయ లోక్ మంచ్. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు. అప్పటికి ఆమె సమాజ్వాదీ పార్టీ నుంచి రెండోసారి రాంపూర్ ఎంపీగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ అమర్సింగ్తో పాటు, అతడికి బహిరంగ మద్దతు ఇచ్చిన జయప్రదనూ పార్టీ నుంచి బహిష్కరించడంతో అమర్సింగ్ సొంత పార్టీ పెట్టుకుని (అదే ఆర్.ఎల్.ఎం) జయప్రదను కూడా కలుపుకున్నారు. రీ ఎంట్రీ? నో ఎంట్రీ? సమాజ్వాదీ పార్టీలోకి రాకముందు టీడీపీలో ఉన్నారు జయప్రద. ఎన్టీఆర్ ఆమెను రాజకీయాల్లోకి తెచ్చారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఆమెను తన రాజకీయాల్లోకి తెచ్చుకున్నారు. తెలుగు మహిళను చేశారు. రాజ్యసభకూ పంపారు. చివరికి పార్టీ నుంచే బయటికి పంపేశారు. అక్కడి నుంచి సమాజ్వాదిలోకి వెళ్లిపోయారు జయప్రద. సినిమా ప్రొఫైల్ కన్నా, రాజకీయాల్లో జయప్రద ప్రొఫైల్ చాలా పెద్దది! మూడు వందల సినిమాల్లో నటించారు కదా అనిపించవచ్చు. ఒకవేళ నరేంద్రమోదీ కనుక 2019 ఎన్నికల కోసం ఆమెను పార్టీలోకి తీసుకోదలిస్తే ఆమె నటించిన సినిమాలన్నిటినీ ముందేసుకుని చూడమని మాత్రం అమిత్షాకు కచ్చితంగా పురమాయించరు. ఆరేళ్లు రాజ్యసభ సభ్యురాలిగా, పదేళ్లు ఎంపీగా జయప్రద అతి కీలకమైన అనేక ప్రభుత్వ కమిటీలలో సభ్యురాలిగా ఉన్నారు. అదొక పెద్ద జాబితా. మోదీకి పరిశ్రమలు ముఖ్యం. విదేశీ వ్యవహారాలు ముఖ్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్యం. ఇక ముఖ్యం అయినా కాకున్నా.. ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఆయనకు ముఖ్యం. ఈ కమిటీలన్నింటిలోనూ పనిచేసిన అనుభవం జయప్రదకు ఉంది. అది మోదీ ఇమేజీకి ఉపయోగపడుతుంది. జయప్రద కూడా ఇప్పుడు మోదీ పాలనా విధానాలను సమర్థిస్తున్నారు. మొన్న షిర్డీ వచ్చినప్పుడు మోదీ నోట్ల ఉపసంహరణ నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడారు. అయితే ఈ మాట్లాడ్డం ఒక ఎత్తుగడగా జరిగిందని మాత్రం అనుకోవడానికి లేదు. జయప్రదలోని రాజకీయ విజ్ఞత ఇంకా అంత ‘ఎత్తుకు’ ఎదగలేదు. ఇరవై ఆరేళ్ల రాజకీయ జీవితంలోనూ ఎక్కడా ఆమె తన ఉద్దేశాలను, ఉద్వేగాలను దాచుకోలేదు. కోపం వస్తే అరిచేశారు. భయం వేస్తే ఏడ్చేశారు. తను నమ్మినవాళ్ల వెంట వెళ్లిపోయారు. తనను నమ్ముకున్న వాళ్ల వెంట వచ్చేశారు. ఎన్నికల కోడ్ని కూడా చూసుకోకుండా.. మహిళా ఓటర్ల నుదుటిపై ఆప్యాయంగా బొట్టు పెట్టారు. ఇప్పుడు కూడా, తను మోదీ వైపు మాట్లాడుతున్నప్పటికీ.. మోదీకి రాజకీయ ప్రత్యర్థులైన ములాయంని కానీ, అఖిలేశ్ని కానీ ఆమె విమర్శించడం లేదు. ములాయం తనను పార్టీ నుంచి బహిష్కరించారన్న బాధ ఆమెలో లేదు. అఖిలేశ్ నాకు తమ్ముడి లాంటి వాడు. ములాయం నాకు తండ్రి లాంటి వారు అంటున్నారు. అలాగని ఆ తండ్రీకొడుకుల పాలనలో యూపీ భలే బాగుందని అనడం లేదు. ఆ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని జయప్రద ఏమాత్రం సంశయం గానీ, సంకోచం గానీ లేకుండా అంటున్నారు. రాజకీయాల్లో ఇది అరుదైన గుణం. ఈ గుణం బీజేపీకైనా, ఇంకొక పార్టీకైనా ఎంతవరకు పనికొస్తుందనేదాన్ని బట్టి మాత్రమే జయప్రద రాజకీయ పునఃప్రవేశం అన్నది సంభవం అవుతుంది. అంతులేని కథ ‘భూమికోసం’ చిత్రం తర్వాత జయప్రద నటించిన పెద్ద సినిమా ‘అంతులేని కథ’. అప్పుడు ఆమె వయసు పదిహేనేళ్లు. డైరెక్టర్ కె.బాలచందర్! తమిళంలో హిట్ అయిన సినిమానే తెలుగులో తీస్తున్నారు ఆయన. తమిళ్లో సుజాత చేసిన పాత్రను ఇక్కడ జయప్రద వెయ్యాలి. అంత నిండైన పాత్రను ఈ అమ్మాయి చెయ్యగలదా? పెళ్లీడు దాటిపోయిన అమ్మాయిగా కనిపించాలి. కనిపించగలదా? సందేహాలన్నీ ఎగరగొట్టేశారు జయప్రద. బాలచందర్ ఎప్పుడో గానీ చప్పట్లు కొట్టరట. షూటింగ్లో రజనీకాంత్, జయప్రదల మధ్య సన్నివేశంలో జయప్రద నటనకు ఆయన క్లాప్స్ కొట్టారు. ‘సినిమాలకు పనికొస్తానా?’ అని ముందు భయపడిన జయప్రద.. ‘అంతులేని కథ’ విడుదలయ్యాక సినిమాలే జీవితంగా స్క్రీన్ మీదికి వచ్చేశారు. సిరిసిరిమువ్వ, భద్రకాళి, అడవిరాముడు, యమగోల, అందమైన అనుభవం, సాగర సంగమం, దేవత, మేఘసందేశం.. ఇవి కాక.. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో మొత్తం మూడు వందలకు పైగా సినిమాలు చేశారు. ఇప్పటికీ అలాగే! జయప్రద ఆరోగ్యంగా ఉంటారు. అదే ఆమె అందం. ఆ అందానికి కారణం మాత్రం ఆమె తీసుకునే ఆహారం, తీసుకోని ఆహారం కూడా! ఎప్పుడోగానీ జయప్రద లంచ్లో, డిన్నర్లో రైస్ ఉండదు. పండ్లు, పండ్ల రసాలు, తాజా కూరగాయలు, ఎగ్ వైట్ ఆమ్లెట్ తీసుకుంటారు. సూప్స్ తాగుతారు. పూర్తిగా ఆకలి వేసే వరకు ఆగరు. కడుపు నిండా తినరు. పొట్ట తేలిగ్గా ఉంటే, ఒళ్లు హుషారుగా ఉంటుందట. ఈ ఆహార నియమాలతో పాటు యోగా చేస్తుంటారు. జిమ్కు వెళుతుంటారు. తొలి పారితోషికం 10 రూపాయలు ‘భూమికోసం’ చిత్రంలో చెల్లి చంద్రమ్మగా చిన్న వేషం వేశారు జయప్రద. తొలిషాట్ నెల్లూరులో. పొలాల మధ్య నుంచి తలపై బుట్ట పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంటుంది. ఆ సినిమాకు ఆమెకు వచ్చిన రెమ్యునరేషన్ పది రూపాయలు. పోటా పోటీ జయప్రద, శ్రీదేవి ఇంచుమించు ఒకే ఈడు వారు. ఒక స్క్రీన్ కడుపున పుట్టిన తోబుట్టువుల్లా కనిపించేవారు. శోభన్బాబు నటించిన ‘దేవత’ సినిమాలో వీళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లుగా కూడా నటించారు. అయితే బయట మాత్రం ఒకరితో ఒకరు ముభావంగా ఉండేవారు! ఎందుకనో దగ్గరితనం ఉండేది కాదు. ‘పోటీ ఉండేది కాబట్టి అలా ఉండేవాళ్లమేమో’ అని అనేవారు జయప్రద. రెండేళ్ల క్రితం 2015 నవంబర్ 27న హైదరాబాద్లో జయప్రద దత్తపుత్రుడు సిద్ధార్థ్ పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి శ్రీదేవి వచ్చారు. ఆ సందర్భంలో వాళ్లిద్దరూ చాలా ఆత్మీయంగా కనిపించారు. పదవులు–బాధ్యతలు 1996–2002 : రాజ్యసభ సభ్యురాలు 1996–97 : పరిశ్రమలు, విదేశీ వ్యవహారాలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, సంప్రదింపులు, సమాచారం–ప్రసారాలు.. ఈ కమిటీలన్నింటిలో సభ్యురాలు. 2004 : ఎంపీగా ఎన్నిక. (యూపీలోని రాంపూర్ నియోజకవర్గం) 2004–09 : సమాచార సాంకేతిక పరిజ్ఞానం, మహిళా సాధికారత, జల సంరక్షణ, నిర్వహణలపై పార్లమెంటరీ ఫోరం.. ఈ కమిటీలన్నింటిలో సభ్యురాలు. 2009 : రెండోసారి ఎంపీగా ఎన్నిక (మళ్లీ అదే నియోజకవర్గం) 2009 : ఫైనాన్స్ కమిటీలో సభ్యురాలు. ఇవన్నీ కాక.. 2014 వరకు ప్రభుత్వ, ప్రైవేటు సామాజిక సేవాకార్యక్రమాలలో చురుకైన పాత్ర. వ్యక్తిగతం జయప్రద (54): నటి, రాజకీయ నాయకురాలు అసలు పేరు: లలితారాణి జననం: 3 ఏప్రిల్ 1962 జన్మస్థలం: రాజమండ్రి (ఆం.ప్ర) తల్లిదండ్రులు: కృష్ణారావు, నీలవేణి చదువు: బి.ఎ. భర్త: శ్రీకాంత్ నహతా సంతానం: లేరు ఉండడం: ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్ అభిరుచులు: మ్యూజిక్, డ్యాన్స్, చిత్రలేఖనం - మాధవ్ శింగరాజు -
ఎస్పీ తప్ప ఏ పార్టీలోనైనా చేరతా
షిర్డీ: సమాజ్వాదీ పార్టీలోకి తప్ప ఏ పార్టీ ఆహ్వానించినా అందులో చేరతానని సమాజ్వాదీ బహిష్కృత నేత, మాజీ ఎంపీ జయప్రద అన్నారు. షిర్డీలో సోమవారం ఆమె మాట్లాడుతూ సమాజ్వాదీ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలో మహిళలకు ఎలాంటి గౌరవ మర్యాదలు లేవన్నారు. సమాజ్వాదీ పాలనలో యూపీ గుండారాజ్గా మారిపోయిందన్నారు. అజంఖాన్ వంటి నేతలున్న సమాజ్వాదీ పార్టీలో ఎప్పటికీ వెళ్లనని చెప్పారు. మోదీని ఉద్దేశించి అఖిలేశ్ గాడిద అని సంబోధించడం సరికాదన్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నా.. మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సరైందని కొనియాడారు. -
‘పెద్దాయన’ ఇంటికి జయప్రద
న్యూఢిల్లీ: సమాజ్ వాదీ పార్టీ సంక్షోభం నేపథ్యంలో అలనాటి సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద మళ్లీ తెరపైకి వచ్చారు. చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా జయప్రద మంగళవారం ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ‘పెద్దాయన’ ములాయం సింగ్ యాదవ్ నివాసానికి వచ్చారు. తన కుమారుడిపై జాతీయ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించిన ములాయం తన నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ములాయం సన్నిహితుడు అమర్ సింగ్ ఈ భేటీకి హాజరయ్యారు. లండన్ నుంచి హుటాహుటిన వచ్చిన ఆయన నేరుగా ములాయం నివాసానికి చేరుకున్నారు. ఈ సమావేశానికి జయప్రద కూడా హాజరుకావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కష్టకాలంలో ‘నేతాజీ’కి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో ఆమె వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాకే మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని గతేడాది ప్రకటించిన జయప్రద.. సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో మళ్లీ తెరపైకి వచ్చారు. ములాయం వెన్నంటే నడుస్తారా, ఆమె భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ తెలుగులో!
దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిని కూడా తన అందం, అభినయంతో ఉర్రూతలూగించిన కథానాయికల్లో జయప్రద ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ప్రేక్షకులతో నీరాజనాలందుకున్న జయప్రద తన రెండో ఇన్నింగ్స్లో అడపా దడపా కీలక పాత్రలు చేస్తున్నారు. ‘మహారథి’ తర్వాత తెలుగులో ఆమె వేరే చిత్రాల్లో నటించలేదు. దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఓ తెలుగు చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. పాప్కార్న్ స్పోర్ట్స్ ఎంటర్టైన్ మెంట్స్, వి.ఎస్.వి ప్రొడక్షన్స్ పతాకంపై నీరజ్వాలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చీరాలలో ప్రారంభమైంది. ‘‘తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొం దుతున్న ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నా. ఈ చిత్రనిర్మాత బాలగిరి నాకెప్పట్నుంచో తెలుసు’’ అన్నారు. చక్కని హాస్యం నేపథ్యంలో సాగే హారర్ మూవీ ఇదని దర్శకుడు తెలిపారు. సంగీతదర్శకుడు డబ్బూ మాలిక్ అందించిన కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆయన తనయుడు అమాల్ మాలిక్ పాటలు స్వరపరుస్తున్నారు. -
ఆ హీరోయిన్లు ఆలింగనం చేసుకున్నారు!
ఒకప్పుడు టాలీవుడ్ తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమకు స్టార్ హీరోయిన్స్ శ్రీదేవి, జయప్రద. అప్పట్లో వీరిమధ్య తెరమీదే కాదు తెరవెనుక బద్ధశత్రుత్వం ఉందని చెప్పుకొనేవారు. అయితే వీరిద్దరు కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఇటు దక్షిణాదిలోనే కాకుండా అటు బాలీవుడ్లోనూ తమ హవా కొనసాగించారు. 'దేవత', 'ఆఖిరీ రాస్తా', 'ఔలాద్' వంటి విజయవంతమైన చిత్రాల్లో జయప్రద, శ్రీదేవి కథానాయికలుగా మెప్పించారు. అయితే వారిద్దరి మధ్య సత్సంబంధాలు ఉండేవి కావని ఓ ప్రముఖ దర్శకుడు కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ చెప్పారు. అయితే వారిద్దరు కలిసి నటించే సీన్లు విషయంలో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా అలనాటి అందాల తారలు శ్రీదేవి, జయప్రద ఇటీవల ఒకే వేదికపై తళుక్కుమన్నారు. ఆత్మీయంగా హత్తుకొని సరదాగా మాట్లాడుకున్నారు. ఈ అరుదైన ఘట్టానికి జయప్రద కొడుకు సిద్ధార్థ వివాహ రిసెప్షన్ వేదిక అయింది. ఈ వేడుకకు భర్త బోనీ కపూర్తో హాజరైన శ్రీదేవి ప్రత్యేక ఆకర్షణగా నిలువగా.. కంచీవరం పట్టుచీర కట్టుకున్న జయప్రద వారికి స్వాగతం పలికారు. రిసెప్షన్ వేదికపై సరదా గడిపిన ఇరువురు తారలు ప్రస్తుతం తమ మధ్య ఉన్న ఆత్మీయతను చాటుకున్నారు. -
పోలీసులపై నటి జయప్రద ఆగ్రహం
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో సినీ నటి జయప్రద పోలీసులు, మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో మాదాపూర్ వైపు నుంచి ఫిలింనగర్ వైపు వెళుతున్న జయప్రద కారును ఆపి డ్రైవర్కు పరీక్షలు నిర్వహించారు. డ్రైవర్ మద్యం సేవించలేదని పరీక్షల్లో వెల్లడైంది. జయప్రద సెలబ్రిటీ కావడంతో ఆమె కారు డ్రైవర్ కు మరోమారు పరీక్షలు నిర్వహిస్తే ఆ దృశ్యాన్ని చిత్రీకరిస్తామని మీడియా ప్రతినిధులు పోలీసులను కోరారు. దాంతో మరోమారు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయడానికి యత్నించారు. జయప్రద కారు దిగి.. సెలబ్రిటీల ఫొటోలు పెద్ద పెద్దగా వేసి తమాషా చేసేందుకే రెండోసారి టెస్టులు చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారును కూడా ఆపాలా అని పోలీసులను ఉద్దేశించి అన్నారు. వీడియో చిత్రీకరిస్తున్న కెమెరామెన్లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, శనివారం రాత్రి అయిదు చోట్ల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 60 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా 43 బైక్లు, ఒక ఆటో, 16 కార్లు నడుపుతున్న వ్యక్తులు పట్టుబడ్డారు. వీరందరిపై కేసు నమోదు చేసి సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి మంగళవారం కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. -
జయప్రదకు టీఎస్సార్ కళాపరిషత్ పురస్కారం
-
ఇక దేశవ్యాప్తంగా అంబికా అగర్బత్తీస్
బ్రాండ్ అంబాసిడర్గా జయప్రద హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అగర్బత్తీల తయారీలో ఉన్న అంబికా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, పశ్చిమబెంగాల్లో అమ్మకాలను సాగిస్తున్న ఈ సంస్థ.. 2020 నాటికి అన్ని రాష్ట్రాల్లో అడుగు పెట్టాలని లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రదను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రూ.300 కోట్ల విలువైన అగర్బత్తీల విపణిలో వ్యవస్థీకృత రంగం వాటా రూ.200 కోట్లు. ఇందులో తమ కంపెనీ 60% వాటాతో అగ్ర స్థానాన్ని కొనసాగిస్తోందని అంబికా సీఎండీ అంబికా కృష్ణ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. 15-16లో రూ.180 కోట్లు.. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.160 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2015-16లో రూ.180 కోట్లు లక్ష్యంగా చేసుకుంది. రోజుకు 80 లక్షల అగర్బత్తీల తయారీ సామర్థ్యం ఉందని కంపెనీ డెరైక్టర్ అంబికా రామచంద్రరావు తెలిపారు. 100 రకాల పరిమళాలను సొంతంగా అభివృద్ధి చేశామన్నారు. అగర్బత్తీల తయారీకి కావాల్సిన వెదురును దేశీయ కంపెనీలు ఇండోనేషియా, చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రభుత్వ పాలసీల కారణంగా ఏటా రూ.400 కోట్ల విదేశీ మారక ద్రవ్యం కోల్పోతున్నామని అంబికా కృష్ణ అన్నారు. వెదురు చెట్ల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. కాగా, 70వ వసంతంలోకి కంపెనీ అడుగు పెడుతున్న సందర్భంగా జయప్రదతో చిత్రీకరించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. -
రంగురంగుల నలుపు
చూడచూడ బాధల జాడ వేరు. నిజమే కదా. మహిళ కష్టాలకు ఎన్ని కారణాలు! ఎన్ని కోణాలు! ఎన్ని నలుపులు! ఎన్ని నలుపులేంటీ?! మహిళకు కష్టం ఒక చీకటి అయితే, చీకటి రంగు నలుపు అయితే... ఆ నలుపునకు ఎన్ని రంగులు ఉంటాయో ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది. అందుకే ఇది అంతులేని కథ... అంతుచిక్కని వ్యథ. సినిమా చూస్తూ ఉంటే మెల్లగా ఓ తెలియని వెలితి ఏదో గుండెను నింపేస్తుంది. ఇది ఒక పొయెటిక్, ఫిక్షనల్ కథనం అయినా... మహిళల జీవితాలలో ఎప్పటికీ తెగని, తగ్గని కష్టానికి అద్దం పడుతుంది. సెన్సిటివ్ వ్యూయర్కి మాత్రం... అనాదిగా మహిళ కడుపులో తిప్పే బాధ, వ్యథ... సమాజం ఒడిలో ప్రసవించినట్టు అనిపిస్తుంది. సినిమా నిడివికి అంతు ఉంది. కాని అది చెప్పే కథ అంతులేనిది. మళ్లీ చూడండి ప్రతి అమ్మాయిలోనూ ఒక జయప్రద ఉంటుంది. నాన్న చేతులెత్తేసినప్పుడో, అన్న చేతకానితనంలోనో ఆమె బయటికొచ్చి కుటుంబం కోసం ఓ చెయ్యి వేస్తుంది. స్త్రీ తనను తానైనా వదిలించుకుంటుంది కానీ, బాధ్యతలను వదిలించుకుని వెళ్లిపోలేదు. అది ఆమె బలమా? బలహీనతా? లేక సహజ గుణమా?‘పెద్దపులి, పొగరుబోతు, గయ్యాళి, కొరకురాని కొయ్య, గర్విష్టి! ఇవన్నీ రోజూ సరిత పొందే బిరుదులు. (సరితంటే జయప్రద).జగమంత కుటుంబం ఆమెది!పిరికిభర్తకు భార్యగా, పసుపు కుంకుమలతో ఉన్న వితంతువు... తల్లి పార్వతి. ఆమె రెండవ కూతురు, సరిత చెల్లెలు భారతి. అక్క కన్నా ముందు తొందరపడి తలంబ్రాలు పోయించుకుని, అంతకన్నా తొందరగానే తలమాసి కూర్చున్న కన్నెపిల్ల. అన్నెం పున్నెం ఎరుగని మరో చెల్లెలు సుమతి. కన్న ఇంటికే కన్నం వేయడానికీ వెనుకాడని ప్రబుద్ధుడు అన్న మూర్తి (రజనీకాంత్). భరించలేని భర్తకు భార్యగా, ఆ ఇంటికో బరువుగా బ్రతుకు లాగుతున్న ఇద్దరు పిల్లల తల్లి కనకం. పుట్టించినవాడు పెట్టక మానడని ఏ కొరతా తెలియక పెరుగుతూన్న పసి హృదయాలు సీత, కుమార్. కళ్లు లేకున్నా కలలకు కరువు, ఆశలకు అదుపు లేని గుడ్డి తమ్ముడు రాజు. ఈ నిస్సహాయులకు, నిర్భాగ్యులకు తన నీడనంతా పంచి, తనకొక నీడను చూసుకోవాలనే తలంపును చంపుకుని ఎనిమిదేళ్లుగా ఆ కుటుంబలోనే వేళ్లు పాతుకుపోయిన మహావృక్షం, మనసుగల వృక్షం సరిత. ఆమె జీవితానికి గమ్యం ఎక్కడో, ఆమె త్యాగానికి అంతం ఎప్పుడో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఆమె కథ... అంతులేని కథ’. సినిమా ప్రారంభంలో జయప్రద ఇంట్రడక్షన్ ఇది. నిజానికి సినిమాలోని ప్రతి సీన్... ఆమె ఇంట్రడక్షన్లాగే ఉంటుంది. రాత్రి 1.25. మంచంపై పడుకుని ‘పోర్ట్నాయ్స్ క ంప్లైంట్’ పుస్తకం చదువుతోంది జయప్రద! ఇరవయ్యిల్లో ఉన్న జయప్రద. తొమ్మిది మంది ఉన్న ఇంట్లో ఒక్కటే అయిపోయిన జయప్రద. నిద్ర పట్టక ఆమె చదవడం లేదు. నిద్ర పట్టడానికీ చదవడం లేదు. చదువుతోంది అంతే. అవునూ... ఆమె చేతుల్లో ఆ పుస్తకమే ఎందుకు ఉంది? పుస్తకం తెరవగానే ఫస్ట్ పేజీలోనే... లోపల ఏం ఉందో చెప్పేస్తాడు పుస్తక రచయిత ఫిలిప్ రోత్. ‘అంతులేని కథ’... ఎవరి కథో సినిమా మొదట్లోనే కె.బాలచందర్ చెప్పేసినట్టు.ఒక్క ముక్కలో : నైతిక కట్టుబాట్లకు, భౌతిక పట్టువిడుపులకు మధ్య సాగే సిగ్గులేని సంఘర్షణ... పోర్ట్నాయ్స్ కంప్లైంట్. బాలచందర్ ఎవర్నీ నేరుగా చూపించరు. వేరేచోట్నుంచి బయటికి లాగుతారు. ఇక్కడ ఆయన చూపించదలచుకుంది జయప్రదను కాదు. రజనీకాంత్ని. అంత రాత్రప్పుడు లస్ట్-రిడెన్గా ఉన్న రజనీకాంత్ని రిప్రెజెంట్ చేయడానికి జయప్రద చేతిలో ఆయన ఆ పుస్తకం పెట్టారని.. సీన్ కొనసాగింపులో తడుతుంది. జయప్రద బుక్ చదువుతోంది. బయట చంటిపిల్లాడి ఏడుపు వినిపిస్తోంది. వాడు ఏడుపు ఆపడం లేదు. ఎవరూ వాడి ఏడుపును ఆపడం లేదు. జయప్రద బయటికి వస్తుంది. మంచాల మధ్య... నేలపై చాప. చాపపై పిల్లాడు. గుక్కపట్టి ఏడుస్తుంటాడు. ‘వదినా.. వదినా....’ అని పిలుస్తుంది జయప్రద. వదిన రాదు. పక్కనే ఉన్న చెల్లి మేల్కొంటుంది. ‘వదినెక్కడ’? అని అడుగుతుంది చెల్లిని. ‘అక్కడే పడుకుని ఉండాలే’ అని అంటుంది చెల్లి. వాణ్ని చేతుల్లోకి తీసుకుని మళ్లీ ‘వదినా’ అని పిలుస్తుంది. వదిన రాదు. వదిన భర్త రజనీకాంత్ గది బయటికి వచ్చి తలుపుకు ఆనుకుని నిలబడతాడు. ఒంటి మీద చొక్కా లేకుండా. వట్టి లుంగీతో. జయప్రద అసహ్యంగా చూస్తుంది. రజనీకాంత్ నిర్లక్ష్యంగా చూస్తాడు. పిల్లాడు ఏడుపు ఆపడు. ‘వదినా’ అని ఇంకోసారి పిలుస్తుంది. కొన్ని క్షణాల తర్వాత అదే గదిలోంచి (రజనీకాంత్ వచ్చిన గది) చీరను భుజం చుట్టూ కప్పుకుంటూ వచ్చి ఆడపడుచు చేతుల్లోంచి బాబును అందుకుని వెళ్లిపోతుంది. ఎక్కడి వాళ్లు అక్కడ మళ్లీ పడకల్లోకి సర్దుకుంటారు. జయప్రద తన గదిలోకి వెళుతుంది. వెళ్లి, వెనక్కు తిరిగి రజనీకాంత్ను చూస్తుంది. ‘హు.. డబ్బు దాహం తీర్చడానికి ఒక చెల్లెలు, ఆకలి, దాహం తీర్చడానికి ఒక తల్లి, కామదాహం తీర్చడానికి ఒక పెళ్లాం. ఛీ.. సిగ్గులేని జన్మ’ అని ముఖం మీదే తలుపులు దడేల్మని వేస్తుంది. పరిస్థితులతో వెక్స్ అయిపోయిన అమ్మాయి అలాగే మూసేస్తుంది. తనను తనూ మూసేసుకుంటుంది. అంతులేని కథ 1976లో విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరికి 40 ఏళ్లు. కథంతా ముందే చెప్పేసి, కథనంతో సినిమాను ప్లే చేశారు బాలచందర్. క్లాసిక్గా నిలబడి పోయింది. కథ ఎం.ఎస్.పెరుమాళ్. మాటలు పాటలు ఆచార్య ఆత్రేయ. సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్. స్వరామృతం జేసుదాస్, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్పీబీ, ఆనంద్. అంతా కలిసి సినిమాను నిలబెట్టారు. సినిమాతో పాటు నిలిచిపోయారు. రజనీకాంత్కి, నారాయణరావుకు ఇది తొలి చిత్రం. జయప్రదకు, ఫటాఫట్ జయలక్ష్మికి, శ్రీప్రియకు, చిన్నాచితక చిత్రాల తర్వాతి చిత్రం. కమలహాసన్... ఇలా వచ్చి, అలా వెళ్లిపోయే గెస్ట్ రోల్ చేసిన చిత్రం. ఫైట్లు లేవు. డ్యూయెట్లు లేవు. సెట్టింగులు లేవు. హీరోల్లేరు. విలన్లు లేరు. కేవలం మనుషులు, వారి స్వభావాలు మాత్రమే ఉన్నాయి అంతులేని కథలో. షూటింగ్ కూడా ఒకేచోట వైజాగ్లో ఒక మామూలు మధ్యతరగతి ఇంట్లో జరిగింది.జయప్రద వర్కింగ్ ఉమెన్. ఇంట్లోవాళ్లందరి కోసం తనొక్కతే కష్టపడి పనిచేస్తుంటుంది. తన గురించి మర్చిపోతుంది. త్యాగానికి కూతురు, త్యాగానికి చెల్లి, త్యాగానికి అక్క, త్యాగానికి అత్త... అన్నీ అవుతుంది. భార్యగా త్యాగమూర్తి కావడమే మిగిలింది. సినిమా ఎండింగులో ఆ త్యాగాన్ని కూడా చేస్తుంది. భర్తగా కాబోయే కమలహాసన్ను ఆఖరి నిమిషంలో (రజనీకాంత్ని ఎవరో చంపేశారన్న వార్త తెలిసిన నిమిషంలో) ఒప్పించి అదే ముహూర్తానికి చెల్లికి భర్తను చేస్తుంది. సినిమాలో జయప్రద సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. అంతులేని కథలో ఆమెను చూస్తుంటే... ఆమెలోని హోప్ మీద, డిటర్మినేషన్ మీద చచ్చేంత అట్రాక్షన్ కలుగుతుంది. స్ట్రాంగ్ విల్డ్ ఉమన్. అంత స్ట్రాంగ్గా ఉన్న మనిషికి తన దారి తను చూసుకునే ధైర్యం కూడా ఉంటుంది. సంపాదిస్తోంది కనుక. కానీ ఆలా చూసుకోలేదు. తండ్రి వదిలించుకుని వెళ్లిన బాధ్యతల కోసం, అన్న భుజంపై వేసుకోని బరువుల కోసం స్ట్రాంగ్గా నిలబడింది. మొదట్లో జయప్రదను ఇంట్రడ్యూస్ చేసినప్పుడే... రీ ఇంట్రడ్యూస్ కూడా చేస్తాడు బాలచందర్. మంచులా కరిగిపోయే సరిత మనసు ఎందరికి తెలుసు? నిజాయితీలో నిప్పులా, నియమాలలో కత్తిలా, కర్తవ్య నిర్వహణలో కటిక పాషాణంలా కనిపిస్తుంది. కానీ రాళ్లల్లో కూడా నీళ్లుంటాయని తెలిసినవాళ్లెందరు? ఆమె కళ్లల్లో కన్నీళ్లు, ఆమె మనసులో మంచితనం చూడగలవాళ్లెవ్వరూ లేరు... అంటారు.. జయప్రదకు నా అన్నవారు ఎవరూలేరా? ఒక స్నేహితుడు ఉంటాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ తను పెళ్లిచేసుకుని వెళ్లిపోతే తన ఫ్యామిలీ ఎలా అని ఆలోచిస్తుంది. ఆ స్నేహితుడి మనసు క్రమంగా ఆమె చెల్లి (వితంతువు శ్రీప్రియ) వైపు మళ్లుతుంది. ఆమెకు ప్రేమలేఖ కూడా రాస్తాడు. ఇది తెలిసి వాళ్లిద్దరికీ పెళ్లి చేస్తుంది జయప్రద. (ఆ తర్వాతే కమల్ ప్రపోజల్ వస్తుంది). సినిమా ప్రారంభంలో ఆమె జీవితం ఎలా మొదలవుతుందో... సినిమా ముగింపులోనూ అదే విధంగా మొదలౌతుంది. మార్పు లేదు. అంతిమ తీర్పూ లేదు. - సాక్షి ఫ్యామిలీ మరపురాని పాటలు దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి (జేసుదాస్) కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు (ఎస్.జానకి) అరె ఏమిటి లోకం... (ఎల్.ఆర్.ఈశ్వరి) తాళికట్టు శుభవేళ (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) ఊగుతోంది నీ ఇంట ఉయ్యాల(పి.సుశీల) -
తైక్వాండో పోటీల ముగింపులో పాల్గొన్న జయప్రద
-
తమిళ సినిమా తల్లితో సమానం
తమిళసినిమా తల్లిలాంటిదని సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద పేర్కొన్నారు. తమిళ చిత్రపరిశ్రమలో నినైత్తాలే ఇనిక్కుమ్(తలుచుకుంటేనే మధురం) అనే పాట వింటుంటే కమల్, రజినీలతో పాటు గుర్తుకొచ్చే నటి జయప్రద. అంతగా తమిళ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న నటి జయప్రద. తమిళం, తెలుగుభాషల్లో ప్రముఖ నాయికగా వెలుగొంది అటు పిమ్మట బాలీవుడ్ రంగప్రవేశం చేసి అక్కడా టాప్ హీరోయిన్గా వెలిగారు. ఆ తరువాత రాజకీయ రంగప్రవేశం చేసి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రజాసేవకు అంకితమైన జయప్రద తాజాగా తన కొడుకు సిద్ధూను హీరోగా పరిచయం చేస్తూ ఉయిరే ఉయిరే అనే చిత్రాన్ని స్టూడియో9 మోషన్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మించారు. నటి హన్సిక హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రాజశేఖర్ దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం సత్యం సినీ కాంప్లెక్స్లో జరిగింది. చిత్ర గీతాలను ప్రముఖ రాజకీయ నాయకుడు అమర్సింగ్ సమక్షంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్కపూర్ ఆవిష్కరించారు. తొలి ప్రతిని తెలుగు ప్రముఖ నటుడు మోహన్బాబు, పారిశ్రామికవేత్త టి.సుబ్బరామిరెడ్డి, నటి రాధిక, శ్రీప్రియలు అందుకున్నారు. చి త్రం ప్రచార చిత్రాన్ని అమర్సింగ్ ఆవిష్కరిం చి వేదికపైనున్న వారందరికి అందించారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ ఈ వేది కపై దర్శకుడు కె.బాలచందర్ ఉంటే బాగుండేదన్నారు. అయినా ఆయన ఆశీస్సులు తన కొడుక్కి ఉంటాయని భావిస్తున్నానన్నారు. బాలచందర్ తన చేతిని పట్టుకుని సినిమాను నేర్పించారని గుర్తు చేసుకున్నారు. తన కొడుకు సిద్ధూను తమిళంలో ఎందుకు పరిచయం చేస్తున్నారని చాలా మంది అడుగుతున్నారన్నారు. తమిళసినిమా తనకు కన్నతల్లిలాంటిదని వివరించారు. పేరు, ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందీ తమిళసినిమానేనన్నారు. అలాంటి ఈ పరిశ్రమలో తన కొడుకు ఎదగాలనే పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. ఇతర చిత్రాల కంటే ఈ ఉయిరే ఉయిరే చిత్రంలో సిద్ధూ, హన్సికల జంట చూడ ముచ్చటగా, అందంగా ఉన్నారని జయప్రద పేర్కొన్నారు. నటుడు మోహన్బాబు, సుబ్బరామిరెడ్డి, రాధిక, శ్రీప్రియ, సుమలత, అమర్సింగ్ తదితరులు చిత్ర యూనిట్కు శుభాశీస్సులు అందించారు. చివరగా నటుడు అనిల్కపూర్ సినిమా ఎంటర్టైన్ అంటూ జయప్రద, హన్సిక, రాధిక, సుమలత తదితరులతో సరదాగా స్టెప్స్ వేసి అందర్నీ అలరించారు. -
మళ్లీ వెండితెర మీదకు జయప్రద
తెలుగు తెరను కొన్ని దశాబ్దాల పాటు ఏలి.. ఇక్కడి నుంచి బాలీవుడ్కు వెళ్లి అక్కడ కూడా రాజ్యమేలి.. తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన జయప్రద.. మళ్లీ ఇప్పుడు ముఖానికి మేకప్ వేసుకుని వెండితెరమీద దర్శనం ఇవ్వబోతున్నారు. సంజయ్ శర్మ దర్శకత్వంలో రాబోతున్న థ్రిల్లర్ మూవీలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం 5 పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ తనలోని టాలెంట్ ఏమాత్రం తగ్గలేందంటున్న జయప్రద.. చిట్టచివరిసారిగా కంగనా రనౌత్తో కలిసి 2013లో రజ్జో అనే సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు కొత్త సినిమాలో చేయడానికి తాను చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జయప్రద అంటున్నారు. రాణీ సాహిబా అనే తన పాత్ర చాలా గ్లామరస్గా ఉంటూనే అందులో నెగెటివ్ షేడ్ కూడా ఉంటుందని ఆమె చెప్పారు. నేటి ప్రేక్షకులు భిన్నమైన కథలు కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పటివరకు తాను ఇలాంటి పాత్ర ఏదీ చేయలేదని, అందుకే ఈ సినిమా చాలా ధైర్యంగా చేయాల్సి వస్తోందని జయ అన్నారు. ఈ సినిమా షూటింగ్ మలేసియా, శ్రీలంక, నేపాల్ దేశాల్లో సాగుతోంది. ఈ హిందీ సినిమాతో పాటు ఓ మళయాళం సినిమాలో కూడా జయప్రద చేస్తోంది. -
మోడరన్ క్వీన్!
రాణి పాత్రలు చేయాలంటే అందుకు తగ్గట్టు అందం ఉండాలి. ఎంత అందంగా అంటే.. అచ్చంగా జయప్రదలా అనొచ్చు. ఫిఫ్టీ ప్లస్ ఏజ్లోనూ తరగని అందంతో తళుకులీనుతుంటారు జయప్రద. అందుకే, ఆమెను రాణి పాత్రకు తీసుకున్నారు సంజయ్ శర్మ. ఇంకా పేరు ఖరారు కాని ఓ హిందీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారాయన. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో ‘మోడరన్ క్వీన్’ పాత్రకు జయప్రదను తీసుకున్నారు. ఇది లీడ్ రోల్. ఇప్పటివరకూ ఇలాంటి పాత్ర చేయలేదని జయప్రద అంటున్నారు. రాణి సాహిబా పాత్రను సవాల్గా తీసుకున్నానని ఆమె పేర్కొన్నారు. దర్శకుని మీద నమ్మకంతో ఈ సినిమా అంగీకరించానని కూడా అన్నారు. కంగనా రనౌత్ నటించిన ‘రజ్జో’లో ఓ పాత్ర చేసిన జయప్రద, మళ్లీ రెండేళ్ల తర్వాత హిందీలో అంగీకరించిన చిత్రం ఇదే! -
జయప్రదకు 'కళాశ్రీ'
ముంబై: ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు దాదా సాహెబ్ ఫాల్కె ఫిల్మ్ ఫౌండేషన్ కళాశ్రీ అవార్డు ప్రదానం చేసింది. సినీ రంగానికి జయప్రద చేసిన సేవలకు గుర్తింపు ఈ అవార్డును ప్రకటించింది. ముంబైలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో జయప్రదకు కళాశ్రీ అవార్డును అందజేశారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు తనకు ఇవ్వడం సంతోషంగా ఉందని జయప్రద అన్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ బాషల్లో దాదాపు 200కు పైగా సినిమాల్లో జయప్రద నటించారు. -
సెలబ్రిటీలకే సెలబ్రిటీలు!
ఫొటో స్టోరీ ‘వాటితో కొంతసేపు గడిపితే మన నేచర్ మారిపోతుంది. కొంత పెడితే సంతోషిస్తాయవి. మనుషులకే ఎంత పెట్టినా చాలదు...’ పెట్స్ గురించి, అంతర్లీనంగా మనుషుల గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ ఫిలాసఫీ ఇది. మనుషుల గురించి అందరికీ తెలుసు. పెట్స్ గురించి మాత్రం వాటితో గడిపినప్పుడే తెలుస్తుంది. అలా గడిపేవారికే పూరి ఫిలాసఫీలోని గాఢత అర్థం అవుతుంది. సెలబ్రిటీల జీవితంలో ఖరీదైన దుస్తులు, కార్లు, వాచీలు ఎలాగో... ఈ ఖరీదైన కుక్కపిల్లలు కూడా అలాగే! ఇంకా చెప్పాలంటే ఇవి ఆ సెలబ్రిటీలకే సెలబ్రిటీలు. ఇక్కడ ఈ సినిమా వాళ్ల గురించే కాదు... పెట్స్ గురించి కూడా చెప్పాలి. ఏ జాతివి అయితేనేం, ఏ దేశం నుంచి దిగుమతి చేసుకొన్నవైతేనేం... సృష్టిలో కెల్లా విశ్వాసం గలవి అనే జాతికి చెందినవి. తమను పెంచిపోషిస్తున్న వారిపై అపారమైన ప్రేమను కురిపిస్తాయి. పూరి జగన్నాథ్, మంచు లక్ష్మి, జయప్రద, మంచు మనోజ్కుమార్... తమ తమ పెట్స్తో మురిపెంగా ప్రేమాభిమానాలను పంచుకొంటున్నప్పుడు క్లిక్మనిపించినవి ఈ ఫోటోలు. ఇవి చాలు మూగజీవులతో అనుబంధం ఎంత ఆనందాన్నిస్తుందో చెప్పడానికి! -
'మోదీ పాలన చూసి ఆకర్షితురాలినయ్యా'
న్యూఢిల్లీ: బీజేపీలో చేరే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని మాజీ ఎంపీ జయప్రద ప్రకటించారు. గురువారం న్యూఢిల్లీలో బీజేపీ అధ్యక్షడు అమిషాతో జయప్రద భేటీ అయ్యారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.... ప్రధాని మోదీ పాలన చూసి తాను ఆకర్షితురాలినయ్యాయని ఆమె తెలిపారు. పాలనలో మార్పు తీసుకువచ్చే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారని నరేంద్ర మోదీకి ఈ సందర్బంగా జయప్రద కితాబు ఇచ్చారు. -
కేజ్రీవాల్పై రె'ఢీ': జయప్రద
-
కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలి: జయప్రద
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.. చంద్రశేఖర్రావు అపాయింట్మెంట్ ఇప్పించాల్సిందిగా ప్రముఖ సినీనటి జయప్రద ఇరిగేషన్శాఖ మంత్రి టి. హరీశ్రావును కోరారు. శుక్రవారం హరీశ్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సందర్భం గా ఆమె ఈ విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ రాజ్భవన్కు వచ్చి గవర్నర్ నర్సింహన్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
కోలీవుడ్ అయితే ఓకే!
సినీ వినీలాకాశంలో తమిళ సినిమాకు ఒక ప్రత్యేక స్థానం ఉందనడం అతిశయోక్తి ఏ మాత్రం కాదు. బలమైన కథా బలం ఉన్నా చిత్రాలతో పాటు, అచ్చెరువు చెందే సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన చిత్రాలు తెరకెక్కించడంలోను కోలీవుడ్ తనకు తానే సాటిగా నిలిచింది. ప్రపంచ సినిమా తన వైపు చూసే స్థాయికి కోలీవుడ్ ఎదుగుతోంది. ఒకప్పుడు తమిళనాడు వరకే పరిమితమైన తమిళ సినిమాలు నేడు ప్రపంచ స్థాయికి విస్తరించాయన్నది ఎవరూ కాదనలేని నిజం. ఇంతకు ముందు బాలీవుడ్నే బడాగా భావించే విదేశీ సినీ మార్కెట్ వర్గాలు ఇప్పుడు కోలీవుడ్ చిత్రాల వ్యాపారంపై మక్కువ పెంచుకుంటున్నాయి. తమిళ సినిమా సత్తాను హిందీ చిత్ర పరిశ్రమ గుర్తిం చింది. అందుకు పలువురు హీరోయిన్లు, విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు తమిళ చిత్రాలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు ఒకప్పుడు బాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి అధిక ఆసక్తి చూపేవారు. అలా దక్షిణాదికి చెందిన వైజయంతి మాలా బాలి, హేమమాలిని, జయప్రద, శ్రీదేవి వంటి నటీమణులు బాలీవుడ్లో టాప్ హీరోయిన్లుగా ఏలారు కూడా. అలాంటిది తాజాగా ఉత్తరాది బ్యూటీలు దక్షిణాది చిత్రాలు, ముఖ్యంగా తమిళ చిత్రాల్లో నటించడానికి ఉవ్విళ్లూరుతుండడం విశేషం. ఇప్పటికే ఉత్తరాదికి చెందిన హన్సిక, కాజల్, తాప్సీ, యామి గౌతమ్ తదితరులు కోలీవుడ్లో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్నారు. అంతేకాదు బాలీవుడ్ క్రేజీ హీరోయిన్లుగా ప్రకాశిస్తున్న దీపిక పదుకొనే, ఐశ్వర్యారాయ్, సోనాక్షి సిన్హా వంటి హీరోయిన్లు కోలీవుడ్ ఆఫర్ అయితే ఓకే అంటూ రెండో ఆలోచన లేకుండా అంగీకరించడానికి సిద్ధం అవుతున్నారు. ఆరంభం ఇక్కడే ప్రపంచ సుందరి కిరీటం పొందిన ఐశ్వర్యారాయ్ సినీ జీవితం ఆరంభమయిందే కోలీవుడ్లో. మణిరత్నం ఇరువర్ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమై ఆ తరువాత జీన్స్, కండుకొండేన్ కండుకొండేన్ చిత్రాలతో తమిళ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారు. ఆ తరువాతనే బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. తమిళ చిత్ర అవకాశం అంటే సాధ్యమయినంతవరకు ఐశ్వర్యారాయ్ వదులుకోవడానికి ఇష్టపడరు. సుమారు పదేళ్ల తరువాత మణిరత్నం చిత్రం రావణన్, శంకర్ దర్శకత్వంలో రజనీ కాంత్కు జంటగా ఎందిరన్ చిత్రాల్లో మెరిశారు. తాజాగా కొన్ని ఆటంకాలు ఎదురయినా మరోసారి మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. మరో భామ రెడీ మరో బాలీవుడ్ టాప్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తమిళ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు. నిజానికి ఈ ముద్దుగుమ్మ ఇంతకు ముందే కమల్ హాసన్ సరసన విశ్వరూపం చిత్రంలో నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఆ తరువాత అంజాన్ చిత్రంలో సూర్యతో సింగిల్ సాంగ్కు చిందేయనున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ బ్యూటీ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించడానికి సిద్ధం అవుతున్నారు. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం జూన్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీరితోపాటు నటి కంగనా రనౌత్ ధామ్ ధూమ్ చిత్రం ద్వారా, ప్రియాంక చోప్రా తమిళన్ చిత్రంతోను, లారాదత్త అరసాట్చి, డేవిడ్ చిత్రాలతోను, మనీషా కొయిరాలా బాంబే, ఆలవందాన్, ముదల్వన్, బాబా, ముంబాయి ఎక్స్ప్రెస్ తదితర చిత్రాలతోను, టబు కాదల్ దేశం, కండుకొండేన్ కండుకొండేన్ చిత్రాల్లో, సుస్మితా సేన్ రక్షకన్ చిత్రం ద్వారా, కాజోల్ మిమ్సార కనవు చిత్రం లోను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. మరి కొందరు కోలీవుడ్ చిత్రాలపై కన్నేశారు. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. ఎంట్రీ ఇప్పటికే దీపికపదుకొనే కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. కోచ్చడయాన్ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించా రు. ఈ చిత్ర విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీ రజనీకాంత్ సరసన నటించడం గొప్ప అనుభూతిగా పేర్కొన్నారు. హాలీవుడ్ చిత్రాలు అవతార్, టిన్టిన్ చిత్రాల తరహాలో మోషన్ క్యాప్చరింగ్ ఫార్మెట్లో రూపొందిన తొలి భారతీయ 3డీ చిత్రం కోచ్చడయాన్. ఈ చిత్రం మే నెల 9న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. -
'ఆ హీరోహీరోయిన్ల సినిమాలు నిషేధం'
ఎన్నికల బరిలో నిలిచిన హీరో హీరోయిన్లకు ఉన్నతాధికారులు మరో ఝలక్ ఇచ్చారు. సదరు హీరోహీరోయిన్లు నటించిన చిత్రాలు జాతీయ టెలివిజన్ ఛానల్ దూరదర్శన్లో ప్రసారం చేయకుండా నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారులు గురువారం లక్నోలో వెల్లడించారు. హీరోయిన్లు హేమమాలిని, జయప్రద, నగ్మ,స్మృతి ఇరానీ, హీరో రాజ్ బబ్బార్తోపాటు జావెద్ జాఫ్రీ నటించిన చిత్రాలపై నిషేధం విధించినట్లు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో ఆ హీరోహీరోయిన్లు నటించిన చిత్రాలు టీవీలో ప్రసారం చేస్తే ఓటర్లపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. రాజ్ బబ్బార్, నగ్మా (కాంగ్రెస్ పార్టీ ) , జయప్రద (రాష్ట్రీయ లోక్ దళ్ ), హేమమాలిని, స్మృతి ఇరానీ (బీజేపీ), జావేద్ జాఫ్రీ (ఆప్) పార్టీల తరపున లోక్ సభ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఎన్టీఆర్ విలువలకు వెన్నుపోటు: జయప్రద
* చంద్రబాబుపై సినీనటి జయుప్రద ఫైర్ * చంద్రబాబును లౌకికవాదులు క్షమించరు : జయప్రద * నాడు బీజేపీతో పొత్తుపై పశ్చాత్తాపం వ్యక్తం చేసి.. * ఇప్పుడు వుళ్లీ ఆ పార్టీ పంచన చేరుతారా? * మోడీని చూసి ముస్లింలు భయుపడిపోతున్నారు వైఎస్ రాజశేఖరరెడ్డి పేదోడి గుండె చప్పుడయ్యారు * జనం జగన్పై పూర్తి విశ్వాసంతో ఉన్నారు.. అధికారంలోకి వచ్చి * వైఎస్లా పని చేయాలని వారు కోరుకుంటున్నారు తెలుగు, హిందీ సినీ వినీలాకాశంలో మెరిసిన తార జయప్రద. రాజకీయరంగ ప్రవేశం చేసి ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం అజిత్సింగ్ ఆధ్వర్యంలోని ఆర్ఎల్డీలో చేరి ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మంగళవారంతో అక్కడ ప్రచారం ముగిసిపోయింది. గురువారం (ఈనెల 10న) ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇంతటి బిజీ షెడ్యూల్లోనూ ప్రచారం నిర్వహిస్తూ మధ్యమధ్యలో ఆమె ’సాక్షి‘కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు..రాష్ర్ట రాజకీయాలపై తన మనోగతం ఆమె మాటల్లోనే.... బీజేపీతో పొత్తు దారుణం చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం దారుణం. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం తప్పని గతంలో చెప్పారు. పశ్చాత్తాప పడ్డారు. ఇప్పుడు మళ్లీ పొత్తు పెట్టుకున్నారు. అంటే ఆయన పశ్చాత్తాపానికి అర్థం లేదా? టీడీపీకి ఒక విధానమంటూ లేదా? మోడీ గాలి ఉత్తదే దేశంలో మోడీ గాలి వీస్తోందని అందరూ అంటున్నారు. కానీ అలాంటి పరిస్థితి లేనే లేదు. ముఖ్యంగా దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్లో భిన్నమైన సమీకరణాలు ఉన్నాయి. గుజరాత్ రాజకీయాలు వేరు. దేశ రాజకీయాలు వేరు.. పేదోడికి ఆసరా వైఎస్సే.. వైఎస్ పేరు చెబితే పేదవాడి గుండె కదులుతుంది. ఆయన చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఎంతోమంది పేదలను బతికించింది. ఫీజు రీయింబర్స్మెంట్ పేద బిడ్డలకు ఉన్నత చదువులు అందించింది. పెన్షన్ల పథ కం వృద్ధులకు ఆసరా అయింది. ఇలా అనేక పథకాలు పేదలను రక్షించాయి. ఈ సంక్షేమ పథకాల ద్వారా వైఎస్ పేదోడి గుండె చప్పుడు అయ్యారు. జగన్లో వైఎస్ను చూసుకుంటున్నారు జగన్ అధికారంలోకి వస్తే వైఎస్సార్లా పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైఎస్ చేసిన మంచి పనులన్నీ సీమాంధ్రలో జగన్కు కలిసి వస్తాయి. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే సీమాంధ్రలో జగన్ సీఎం కావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనం జగన్లో వైఎస్ను చూసుకుంటున్నారు. బొల్లోజు రవి, ఎలక్షన్ సెల్: చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం దారుణం. గతంలో బీజేపీతో పొత్తుపెట్టుకున్నందుకే అతన్ని నమ్మిన ముస్లింలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. అలా పొత్తు పెట్టుకోవడం తప్పని తర్వాత పశ్చాత్తాప పడిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ పొత్తు పెట్టుకోవడం విచారకరం. గతంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు ఆయనే ధిక్కరించారు. తన పశ్చాత్తాపానికి అర్థం లేదా? ఒక విధానమంటూ టీడీపీకి లేదా? ఇలా చేస్తే ప్రజల్లో విశ్వాసం పోతుంది. ఎన్టీఆర్ లౌకికవాది. ఆయన అల్లాను, ఈశ్వరుడినీ కొలిచేవారు. ఆయన స్థాపించిన టీడీపీ ఆశయాలకు, విలువలకు వెన్నుపోటు పొడిచేలా చంద్రబాబునాయుడు వ్యవహరించడం సమంజసం కాదు. ఎన్టీఆర్ ప్రభుత్వం రావడానికి ముందు పాతబస్తీలో నిరంతరం మత ఘర్షణలు జరిగేవి. ఎన్టీఆర్ లౌకికవాది కావడం వల్ల వాటిని ఆపగలిగారు. ఆ తర్వాత చంద్రబాబు వామపక్షాలతో పొత్తు అన్నారు. కానీ బీజేపీ నేతృత్వంలోని వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి లౌకికవాదానికి తూట్లు పొడిచారు. తర్వాత ఆ పొత్తు తప్పన్నారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ పంచన చేరడాన్ని ముస్లింలు క్షమించరు. ఎన్టీఆర్ ఆలోచనలకు చంద్రబాబునాయుడు గౌరవం ఇవ్వాలి. విభజన విషయంలోనూ... చంద్రబాబునాయుడు రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చారు. తర్వాత ఆయనే అన్యాయంగా రాష్ట్రాన్ని చీల్చారని విమర్శిస్తున్నారు. సీమాంధ్ర, తెలంగాణ విషయంలో ఆయన ద్వంద్వ వైఖరి ప్రదర్శించారు. ఎటుచేసి ముఖ్యమంత్రి కావాలన్నదే ఆయన కల. అందుకే బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. కేంద్రంలో బీజేపీ వస్తుందన్న భ్రమతో పొత్తు పెట్టుకొని లాభపడాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. కులం, మతం పేరుతో ప్రజలను చీల్చడాన్ని నేను గట్టిగా వ్యతిరేకిస్తాను. అయినా ఆంధ్రలో బీజేపీ ఎక్కడుంది? బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ. రెండు ప్రాంతాల్లో ఉన్న ముస్లింలు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతారు. ఇది టీడీపీకి నష్టం. సీమాంధ్రలోనూ... తెలంగాణలోనూ ముస్లిం ఓట్లు చాలా కీలకం అనేది గుర్తించాలి. మోడీగాలి ఉత్తదే:: నరేంద్ర మోడీ బీజేపీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థి అయినా ఆ స్థాయికి తగ్గట్లు ఆయన మాట్లాడటం లేదన్న చర్చ ప్రజల్లో జోరుగా సాగుతోంది. ప్రధాని అభ్యర్థి సెక్యులర్ అయి ఉండాలి. దేశ ఆర్థిక అభివృద్ధి, దేశ భవిష్యత్తు, సమగ్రత, సమైక్యత గురించి ఆలోచించాలి. అంతర్జాతీయంగా వివిధ దేశాలతో మన విదేశీ విధానం ఎలా ఉండాలో తెలిసి ఉండాలి. డాలర్కు దీటుగా రూపాయిని ఎలా పటిష్టపరచాలో తెలిసి ఉండాలి. కానీ ఇవన్నీ మోడీలో లేవు. అసలు ఏ ఎజెండాతో వాళ్లు ప్రజల వద్దకు వస్తున్నారు. ముస్లింలపై వారి వైఖరి ఏంటి? అసలు మోడీని చూస్తేనే ముస్లింలు భయపడిపోతున్నారు. ఒకవేళ మోడీ ప్రధాని అయితే తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని వారు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తారా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు? దేశంలో మోడీ గాలి వీస్తోందని అందరూ అంటున్నారు. మీడియా ఊదరగొడుతోంది. కానీ అలాంటి పరిస్థితి లేనేలేదు. గుజరాత్ రాజకీయాలు వేరు. దేశ రాజకీయాలు వేరు. ఉత్తరప్రదేశ్లో ముస్లిం ఓట్లు కీలకం. ఈ రాష్ట్రంలో ప్రజలంతా మోడీపై మండిపడుతున్నారు. నేను పోటీ చేసే నియోజకవర్గంలో ముజఫర్పూర్ కూడా వస్తుంది. అక్కడ ఇటీవల మత అల్లర్లు జరిగాయి. దాని ద్వారా లాభపడేందుకు కొన్ని మతతత్వ శక్తులు ప్రయత్నించాయి. దాన్ని నేను అడ్డుకోగలిగాను. ముజఫర్పూర్లో శరణార్థులకు న్యాయం చేసేందుకు పోరాడాను. న్యాయం కోసమే ఇదంతా చేశాను. ధర్మం కోసం పని చేశాను. అటు బీజేపీ, ఇటు సమాజ్వాదీ పార్టీ పట్ల ముస్లింలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. నేను తటస్థురాలిని కాబట్టి నాకు ఇక్కడ మంచి స్పందన వస్తోంది. ఇక్కడ మహిళలంతా నా వైపే ఉన్నారు. నాపై పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన మిగతా ముగ్గురు పురుషులు కాబట్టి మహిళలు నన్ను ఆదరిస్తున్నారు. రాంపూర్లో నేను చేసిన అభివృద్ధి ఇక్కడ ప్రచారంలో ఉపయోగపడుతోంది. ప్రజలంతా ఆదరిస్తున్నారు. జగన్పై జనం విశ్వాసం వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు చెపితే పేదవాడి గుండె కదులుతుంది. ఆయన చేపట్టిన ఆరోగ్యశ్రీ ఎంతోమంది పేదలను బతికించింది. ఫీజు రీయింబర్స్మెంట్ పేద బిడ్డలను ఉన్నత చదువులకు తీసుకెళ్లగలిగింది. పెన్షన్ స్కీం వయోవృద్ధులకు ఆసరా అయింది. ఇలా అనేక పథకాలు పేదలను రక్షించాయి. వైఎస్ పేదోడి గుండె చప్పుడు అయ్యారు. తండ్రి పేరును... ఆయన చేపట్టిన పథకాలను జగన్ నెరవేరుస్తారని ప్రజలు పూర్తిస్థాయిలో విశ్వాసంతో ఉన్నారు. జగన్ మీద ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నాయి. ఒకవిధంగా తెలియని బరువును ఆయన మోయాల్సి ఉంది. అధికారంలోకి వస్తే వైఎస్సార్లా ఆయన పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైఎస్ చేసిన మంచి పనులన్నీ సీమాంధ్రలో జగన్కు కలిసి వస్తాయి. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే సీమాంధ్రలో జగన్ సీఎం కావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనం జగన్లో వైఎస్ను చూసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడు కాదు... పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడు కాదు. పార్టీ పెట్టి నరేంద్రమోడీకి ఎందుకు మద్దతు ఇచ్చాడో అర్థం కావడం లేదు. అలా ఎందుకు ప్రకటించాడో కూడా అంతుబట్టడం లేదు. సినీతారల ప్రచా రం ఓటు రూపం దాల్చడానికి ఏ మేరకు అవకాశం ఉంటుందన్నది సందేహమే. సినీ తారల సభలకు పెద్ద ఎత్తున జనం వస్తారు. అంతమాత్రాన వారు చెప్పిన వారికే ఓటేస్తారన్న నమ్మకం లేదు. మనం ఎంతో మంది మహామహులైన సినీ తారలు ఎలా దెబ్బతిన్నారో చూశాం. పవన్ భవిష్యత్తు రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి. ఆంధ్ర రాజకీయాల్లోకి రావాలనుకున్నా... ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచే పోటీ చేద్దామనుకున్నా. కానీ నిర్ణయం తీసుకోవడానికి సమయం చాల్లేదు. అందుకే ఆర్ఎల్డీలో చేరి ఇక్కడ్నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నా. ఉత్తరప్రదేశ్లో 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇక్కడ నాకు బలమైన క్యాడర్ ఉంది. ఇంత తక్కువ సమయంలో మన రాష్ట్రంలోకి వచ్చి క్యాడర్ను తయారు చేసుకొని ఎన్నికల్లోకి వెళ్లేందుకు వీలు కుదరదనే ఉత్తరప్రదేశ్ నుంచే మళ్లీ బరిలోకి దిగాను. -
టాలీవుడ్- బాలీవుడ్ తారల క్రికెట్
-
రేపిస్టులను చచ్చేదాకా ఉరి తీయాలి: జయప్రద
పణజి: మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారిని చచ్చేదాకా ఉరి తీయాలని ప్రముఖ సినీ నటి, ఉత్తర్ప్రదేశ్లోని రాంపూర్ ఎంపీ జయప్రద అన్నారు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం గోవా వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ ఉదంతంపై స్పందిస్తూ మహిళలపై అకృత్యాలకు పాల్పడేవారిని చచ్చే వరకూ ఉరేయాలన్నారు. ఉత్తరప్రదేశ్ సహా ముంబై, ఢిల్లీలోనూ మహిళలకు రక్షణ లేదన్నారు. యూపీలో హింస పెరిగిందని జయప్రద ఆందోళన వ్యక్తం చేశారు. సమాజ్వాది పార్టీ పాలన మహిళలు, పిల్లలకే కాదు సామాన్య ప్రజలకు కూడా రక్షణ కరువయిందన్నారు. హింస కంటే అవినీతే నయమని యూపీ ప్రజలు వాపోతున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన ముజాఫర్ నగర్ హింసాత్మక ఘటనలే దీనికి నిదర్శనమని జయప్రద అన్నారు. -
రేపిస్టులను ఉరి తీయాలి: జయప్రద
పణాజి: అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరి తీయాలని లోక్సభ ఎంపీ జయప్రద అభిప్రాయపడ్డారు. తెహాల్కా మాజీ ఎడిటర్ తేజపాల్పై వచ్చిన అత్యాచార ఆరోపణలపై మీడియా అడగ్గా ఆమె పై విధంగా స్పందించారు. ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే వారికి ఉరిశిక్షే సరైనదన్నారు. ఒకవేళ అలాకాకపోతే జీవిత ఖైదు విధించాలన్నారు. అవినీతికి కంటే నేరాలే ప్రమాదమన్నారు. ఒక సినిమా నిర్మాణ పనుల్లో భాగంగా గోవాకు వచ్చిన ఆమె ఐఎన్ఎస్ తో మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్ లో నేరాలు హెచ్చరిల్లుతున్న నేపథ్యంలో ములాయం సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. అక్కడ పెరుగుతున్న నేరాలతో మహిళలు, పిల్లలు భయ భ్రాంతులకు గురౌతున్నారని తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలపై ప్రజలు ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉందని ఆమె తెలిపారు. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే మహిళకు భద్రత కరువైందని అనడం లేదని, ముంబై, కోల్కతా వంటి నగరాల్లో కూడా మహిళకు రక్షణ లేదన్నారు.