JEE Main
-
పరీక్షల సమరం
సాక్షి, హైదరాబాద్: ఇది పరీక్షల సమయం. భవిష్యత్తును నిర్ణయించే తరుణం. ఇటు వార్షిక పరీక్షలు.. మరోవైపు ప్రవేశ పరీక్షలతో విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అయ్యే కాలం. తీవ్రమైన ఒత్తిడితో గడిపే సీజన్. విద్యార్థుల్లో టెన్షన్..విద్యాసంస్థల్లో హైటెన్షన్. ఇంకోవైపు తల్లిదండ్రుల అటెన్షన్. మొత్తం మీద వేసవికి ముందే వేడి ఊపందుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు పరీక్షల పోరుకు సిద్ధమవుతున్నారు. వీరికి అండగా నిలిచే తల్లిదండ్రులు, పరీక్షల సమరానికి సిద్ధం చేసే అధ్యాపకులు, ఇతరులు కలిపి మరో కోటి మంది ఈ క్రతువులో భాగస్వాములవుతారని అంచనా. ఫైనల్ పరీక్షలు, ఉన్నత చదువులకు సంబంధించిన ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. పరీక్షల సమయంలో పిల్లలకు అందుబాటులో ఉండేందుకు తల్లిదండ్రులు సెలవులు పెట్టడం లాంటి ఏర్పాట్లు చేసుకుంటుంటే, మరోవైపు విద్యాసంస్థలు..ప్రత్యేక తరగతులు, మోడల్ టెస్టులతో ఫలితాల తరాజులో మొగ్గు తమవైపే ఉండేలా విద్యార్థులను సన్నద్ధం చేయడంలో నిమగ్నమయ్యాయి.మార్చి టు జూన్..మార్చి నుంచి జూన్ వరకూ వరుసగా ఎన్నో పరీక్షలు. ముందుగా ఇంటర్మీడియెట్ పరీక్షలు మొదలవుతాయి. మార్చి 5వ తేదీ నుంచి 25 వరకూ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే ప్రాక్టికల్స్ పూర్తయ్యాయి. థియరీ పరీక్షల కోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇంటర్ పరీక్షలు చివరలో ఉండగానే టెన్త్ పరీక్షలు షురూ అవుతాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకూ ఇవి కొనసాగుతాయి. ఓరియంటల్ సబ్జెక్టులు రెండురోజుల పాటు జరుగుతాయి. ఇక ఇంటర్ పూర్తి చేసిన ప్రతి విద్యార్ధికీ కీలకమైన ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షే గేట్ పాస్. ఇది ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకూ జరుగుతుంది. ప్రఖ్యాత ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధించాలనేది లక్షల మంది కల. ఈ మెట్టు ఎక్కాలంటే జేఈఈ పరీక్ష రాయాల్సిందే. తొలి విడత సెషన్ ఇప్పటికే పూర్తయింది. రెండో విడత ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జరుగుతుంది. ఇక ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ మే 18న జరుగుతుంది. ఇక డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి వరుసబెట్టి పరీక్షలున్నాయి. ఐసెట్, పీజీఈసెట్, ఈసెట్, ఎడ్సెట్, లాసెట్.. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే యూజీ, పీజీ నీట్... ఇలా జూన్ వరకూ పరీక్షలే పరీక్షలు. విద్యార్థుల వెనుక కీలకంగా.. రాష్ట్రంలో జరిగే పలు పరీక్షలకు సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా. ఇది మనకు ప్రత్యక్షంగా కని్పంచే సంఖ్య మాత్రమే. ఒక్కో విద్యార్థిని పరీక్షకు సన్నద్ధం చేసేందుకు ఇద్దరు తల్లిదండ్రులు, సగటున మరో ఇద్దరు ఉపాధ్యాయులు తెర వెనుక కృషి చేస్తారు. వీరే కాదు పరీక్షల ఏర్పాట్లలో ఉండే ఉద్యోగులు, విద్యాసంస్థల సిబ్బంది పాత్రా కీలకమే. ఈ లెక్కన సుమారు కోటి మందికి ఇది పరీక్షా కాలమనే చెప్పాలి. విద్యార్థులను సన్నద్ధం చేయడం మొదలుకుని, పరీక్షా కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ప్రశ్నాపత్రాలు పంపడం, వాటిని మూల్యాంకన కేంద్రాలకు చేర్చడం..మొత్తం మీద ఎవరికీ ఈ సీజన్లో కంటి మీద కునుకు ఉండదంటే అతిశయోక్తి కాదు. విద్య, వైద్యం, రెవెన్యూ, రవాణా, పోలీస్... తదితర శాఖలకూ ఇది పరీక్షా కాలమనే చెప్పాలి. ఒక రకంగా ప్రభుత్వానికీ ఇవి ఓ సవాలే. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరుతుంది. దీంతో పరీక్షల దగ్గర్నుంచి ఫలితాల వెల్లడి వరకు టెన్షన్ తప్పని పరిస్థితి. పూర్తిస్థాయిలో రివిజన్ చేయిస్తున్నాం టెన్త్, ఇంటర్ పరీక్షలు కీలకమైనవి. ఇప్పటికే విద్యార్థులను సిద్ధం చేశాం. మరోసారి పూర్తిస్థాయిలో రివిజన్ చేయిస్తున్నాం. విద్యార్థులు పరీక్షలు అంటే కాస్తా టెన్షన్గా ఫీలవ్వడం సహజం. ఇలాంటి వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అందరికీ మంచి మార్కులు వచ్చేలా టీచర్లు ప్రత్యేక తరగతులు తీసుకుంటూ అలుపెరుగకుండా కష్టపడుతున్నారు. – ఆర్.పార్వతీరెడ్డి (హార్వెస్ట్ విద్యాసంస్థలు, ఖమ్మం) ఒకింత టెన్షన్గానే ఉంది గతంలో చాలా పరీక్షలు రాశా. వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయని నమ్మకం ఉంది. అయితే ఒక్కోసారి చదివిందే వస్తుందా? ఇంపార్టెంట్ ఏమిటనే గందరగోళానికి గురవుతున్నా. ముఖ్యమైన చాప్టర్స్ పదేపదే చదవమని టీచర్లు చెబుతున్నారు. నాలో ధైర్యం పెంచేలా తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారు. – ముక్తివరపు శేఖర్ (ఇంటర్ సెకండియర్ విద్యార్థి, హైదరాబాద్) ––––––––––––––––––పరీక్షలయ్యే వరకు ధైర్యం చెబుతున్నాం.. అమ్మాయి చదువుపైనే దృష్టి పెడుతున్నాం. రాత్రి పడుకునే వరకూ ఏం కావాలో అందిస్తున్నాం. పరీక్షలంటే భయం ఉండకుండా ధైర్యం చెబుతున్నాం. ఆరోగ్యం దెబ్బతినకుండా చూస్తున్నాం. కాలేజీకి వెళ్లి లెక్చరర్లతో మాట్లాడి వారి సలహాలు కూడా పాటిస్తున్నాం. – సానియా బేగం (ఇంటర్ విద్యార్ధిని తల్లి, జడ్చర్ల) -
తప్పులు.. సిలబస్లో లేని ప్రశ్నలు
సాక్షి, ఎడ్యుకేషన్: జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్(JEE Main 2025) విషయంలో.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లోపా లతో కూడిన ప్రశ్నల సంఖ్య పెరగడం, తుది ఆన్సర్ కీలో వాటిని తొలగించడం, సిలబస్ పరిధిలో లేని ప్రశ్నలు అడగడం పరిపాటిగా మారింది. ఇటీవల ఫలితాలు విడుదలైన జేఈఈ మెయిన్– 2025 జనవరి సెషన్పై సైతం విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్టీఏ నిబద్ధతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్టీఏ వైఫల్యంతో విద్యా ర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు.సమర్థ నిర్వహణలో వైఫల్యం!జేఈఈ మెయిన్ విషయంలో ఎన్టీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది పలు షిఫ్ట్ లలో నిర్వహించిన పరీక్షల్లో తొలగించిన ప్రశ్నల సంఖ్యనే ఇందుకు నిదర్శనమని సబ్జెక్ట్ నిపుణులు చెబు తు న్నారు. ఈ ఏడాది మొత్తం పది షిఫ్ట్లలో పరీక్ష నిర్వహించగా.. ఏకంగా 12 ప్రశ్నలను తొలగించారు. ఇందులో అత్యధికంగా ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి 8 ప్రశ్నలు ఉంటే.. మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీల నుంచి రెండు చొప్పున నాలుగు ప్రశ్నలు ఉన్నాయి.దీనికి సాంకేతిక లోపం, మానవ తప్పిదం కారణంగా పేర్కొనడం గమనార్హం. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్తో పాటు నీట్ యూజీ, సీమ్యాట్, తదితర పదుల సంఖ్యలో పరీక్షలను నిర్వహిస్తున్న ఎన్టీఏ వాటిని సమర్థంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవ డంలో విఫలమవుతోందని.. ప్రశ్నలు రూపొందిచే ఎగ్జామినర్స్ విషయంలో, అదే విధంగా వాటిని పకడ్బందీగా పరిశీలించే విషయంలో అప్రమత్తంగా ఉండట్లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఏటేటా పెరుగుతున్న తప్పులుజేఈఈ మెయిన్ ప్రశ్నల్లో తప్పుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. 2024 సెషన్–1లో ఆరు ప్రశ్నలు; సెషన్–2లో నాలుగు ప్రశ్నలు తొలగించగా.. 2023లో సెషన్–1లో నాలుగు ప్రశ్నలు, 2022 సెషన్–1లో నాలుగు, సెషన్–2లో ఆరు ప్రశ్నలు తొలగించారు. ఇలా తొలగించిన ప్రశ్నల విషయంలో అభ్యర్థులకు పూర్తి మార్కులు (4 మార్కులు) కేటాయిస్తామని ఎన్టీఏ పేర్కొంటోంది. అయితే ఇలాంటి తప్పుల కారణంగా విద్యార్థులు పరీక్ష హాల్లో సమయం వృథా చేసుకోవాల్సి వస్తోందని సబ్జెక్ట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సిలబస్ నుంచి తొలగించినా.. జేఈఈ మెయిన్ పరీక్షల్లో సిలబస్లోని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. 2025 జనవరి సెషన్ పరీక్షలనే పరిగణనలోకి తీసుకుంటే మొత్తం పది షిఫ్ట్లలో నిర్వహించిన పరీక్షల్లో.. ఫిజిక్స్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ చాప్టర్కు సంబంధించి న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ నుంచి 22 ప్రశ్నలు, అదే విధంగా కార్నెట్ లా నుంచి కూడా ఒక ప్రశ్న అడిగారని అంటున్నారు. అయితే గత ఏడాది నుంచి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ను, అంతకుముందు ఏడాది కార్నెట్ లాను సిలబస్ నుంచి తొలగించారని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారని, ఇది ఫలితంపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.రాధాకృష్ణన్ కమిటీ చెప్పినా.. జాతీయ స్థాయిలో ప్రముఖ ప్రవేశ పరీక్షలైన జేఈఈ మెయిన్, నీట్, సీయూఈటీ, యూజీసీ నెట్ పరీక్షల్లో పారదర్శకత కోసం పలు సిఫారసులు చేసిన ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ.. ఈ పరీక్షల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్టీఏపై ఉందని, అన్ని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఉండేలా ప్రశ్నపత్రం రూపొందించాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఎన్టీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీట్ యూజీపై ఆందోళన జేఈఈ మెయిన్లో తప్పుల నేపథ్యంలో..మే 4న నిర్వహించనున్న నీట్ యూజీ నిర్వహణపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు కూడా దాదాపు పది లక్షల మంది హాజరవుతారు. ప్రశ్నల్లో తప్పులు, అనువాద దోషాలు చోటు చేసుకుంటే అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని.. ఈ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఎన్టీఏ జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకంగా ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణ కోసమే ఎన్టీఏ ఏర్పాటు కావడాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అన్ని పరీక్షల్లో లోపాలు లేనివిధంగా ప్రశ్నలు ఇచ్చేలా ముందుగానే పటిష్ట చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.జేఈఈ మెయిన్ జనవరి సెషన్లో తొలగించిన ప్రశ్నల కోడ్ నంబర్లివే..– ఫిజిక్స్: 656445270, 7364751025, 656445566, 6564451161, 656445870, 7364751250, 564451847, 6564451917– కెమిస్ట్రీ: 656445728, 6564451784– మ్యాథమెటిక్స్: 6564451142, 6564451898ప్రశ్నల డేటాను నిరంతరం సమీక్షించాలికంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో ముందుగానే నిర్దిష్ట అల్గారిథమ్స్ రూపొందించి ప్రశ్నలు అడిగే విధానాన్ని ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అంటే ఏదైనా ఒక చాప్టర్ నుంచి నాలుగు ప్రశ్నలు ఇవ్వాలనుకుంటే ఆ మేరకు ముందుగానే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఒక ప్రశ్న ముందే తప్పుగా ఉంటే అదే పునరావృతం అవుతుంది. ఎప్పటికప్పుడు కొశ్చన్స్ డేటా బ్యాంక్ను సమీక్షిస్తుండటం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. పెన్, పేపర్ విధానంలో స్పష్టంగా రాసే వీలున్న స్క్వేర్ రూట్స్, ఇతర సైంటిఫిక్ సింబల్స్ కంప్యూటర్లో సరిగా ప్రతిబింబించవు. ఇది కూడా ప్రశ్నల్లో తప్పులకు కారణం అవుతోంది. మొత్తంగా 12 ప్రశ్నలను తొలగించడం అనేది అసాధారణ పరిణామమే. – ఆర్వీ శ్రీధర్ (జేఈఈ–మెయిన్ ఫిజిక్స్ సబ్జెక్ట్ నిపుణులు) -
జేఈఈ మెయిన్లో రికార్డు రేంజ్ మార్కులు! కానీ ప్లేస్మెంట్స్కి వెళ్లలేదు..
ఐఐటీ జేఈఈ లాంటి కఠినతరమైన పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవడం అనేది చాలామంది విద్యార్థుల డ్రీమ్. అలాగే ఉత్తీర్ణత సాధించి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో రికార్డు స్థాయి జీతాలతో అందరినీ విస్తుపరుస్తుంటారు కూడా. అలాంటిది ఈ యువకుడు జేఈఈ మెయిన్లో ఎవ్వరూ బ్రేక్ చేయని విధంగా రికార్డు స్థాయిలో మార్కులు తెచ్చుకున్నాడు. మంచి కాలేజ్లో సీటు పొందాడు. పైగా ఇంజీనీరింగ్ విద్యను అకడమిక్ సంవత్సరం కంటే ముందే పూర్తి చేశాడు. అయినా క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్లలేదు. మరీ లక్షల ప్యాకేజ్ల ఉద్యోగాన్ని వద్దనుకుని ఏం చేస్తున్నాడో తెలిస్తే..విస్తుపోతారు. అంతేగాదు అతడి స్టోరీ వింటే గెలుపంటే ఇది కదా అని అనుకుండా ఉండలేరు.ఉదయపూర్లోని మహారాణా భూపాల్కి చెందిన వ్యక్తి కల్పిత్ వీర్వాల్. లక్షలాది మంది డ్రీమ్ ఐఐటీ జేఈఈ2017లో ఉత్తీర్ణత సాధించాడు. దాన్ని కల్పిత్ అత్యంత అలవొకగా సాధించేశాడు. ఇక్కడ కల్పితేమి ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. పెద్ద బ్యాగ్రౌండ్ ఏమి లేదు కూడా. తల్లి ఓ ప్రైవేటు టీచర్ కాగా, తండ్రి కాంపౌడర్. అలాగే కల్పిత్ జేఈఈ ప్రిపరేషన్ కోసం అందరిలా ఏకంగా 16 గంటలు చదివిన వ్యక్తి కూడా కాదు. అలాగే కోచింగ్ సెంటర్లలోనే ఉండిపోయి ప్రిపేరయ్యేలా పలు సంస్థలు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ముందుక వచ్చినా.. వాటిని కూడా ఇష్టపడకుండా తన ఇంటి నుంచి ప్రిపేరయ్యేందుకే మొగ్గు చూపాడు. ఇక జేఈఈ మెయిన్లో ఎవ్వరూ ఊహించని విధంగా, ఎవ్వరూ బ్రేక్ చేయని రేంజ్లో 360/360 మార్కులు సంపాదించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం దక్కించుకున్నాడు. అంతేగాదు అతనికి కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (KVPY) స్కాలర్, నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్ (NTSE) వంటి ఎన్నో ప్రోత్సాహక స్కాలర్షిప్లను సొంతం చేసుకున్నాడు. అయితే అందరిలా IIT బాంబే కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్లో చేరినా.. క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఐఐటీ రెండో సంవత్సరంలోనే ఒక YouTube ఛానెల్ను ప్రారంభించాడు. అక్కడ తన అధ్యయన వ్యూహాలను , JEE ప్రిపరేషన్ చిట్కాలను పంచుకున్నాడు. దీనికి అనతికాలంలోనే అనూహ్యస్పందన వచ్చింది. అతడిచ్చే సలహాలు ఆచరణాత్మకంగా ఉండేవి. విద్యార్థులంతా సాధారణ కోచింగ్ సెంటర్లు బోధించే దానికి భిన్నంగా ఉందంటూ ఇంప్రెస్ అయ్యేవారు. అలా అతని యూట్యూబ్ ఛానెల్కి లక్షకు పైగా సబ్స్క్రైబర్లు, ఫాలోయింగ్ ఉండేది. తన ఛానెల్కి ఉన్న డిమాండ్ దృష్ట్యా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకున్నాడు. అలా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి సహాయపడే ఆన్లైన్ విద్యా వేదిక అయిన AcadBoostను కల్పిట్ ప్రారంభించాడు. మరసుటి ఏడాదే తన తొలి ఆన్లైన్ కోర్సుని డెవలప్ చేశాడు. అది విజయవంతమైంది. అలా అతను తన ఐఐటీ క్యాంపెస్ ప్లేస్మెంట్లలో వచ్చే ప్యాకేజ్లకు మంచి ఆదాయాన్ని ఈ ఆన్లైన్ వేదిక AcadBoostతో ఆర్జించాడు. అలాగే తన ఐఐటీ బాంబే ప్రోగ్రామ్లో ఒక సెమిస్టర్ ముందుగానే ముగించాడు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో అకాడ్బూస్ట్ టెక్నాలజీస్లో పనిచేసేవాడు. దీంతో 2021 నాటికి, లింక్డ్ఇన్ 'టాప్ వాయిసెస్'లో కల్పిత్కి స్థానం ఇచ్చింది. అలా 20 మంది అత్యుత్తమ యువ నిపుణుల జాబితాలో కల్పిత్ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అంతేగాకుండా టెడ్ఎక్స్లో తన జేఈఈ మంచిస్కోర్కి సంబంధించిన సక్సస్ జర్నీని షేర్ చేసుకున్నాడు. ఇక్కడ కల్పిత్ కేవలం విద్యా విషయాలకే కట్టుబడి ఉండలేదు. అతను సీనియర్ NCC క్యాడెట్ అయ్యాడు, కఠినమైన తుపాకీ కసరత్తులు, శిబిరాలు శిక్షణ తర్వాత ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ని కూడా సంపాదించాడు. అలాగే JEEకి సిద్ధమవుతున్నప్పుడు కూడా, అతను క్రికెట్, టీవీ, బ్యాడ్మింటన్, సంగీతం కోసం సమయం కేటాయించేవాడు. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, ఎడ్టెక్ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినా..నిరాకరించాడు. తన కంటూ ఓ అచంచలమైన లక్ష్యంతో విభ్నింగా ఉండాలనుకున్నాడు, అలానే జీవించి ఎందరికో ప్రేరణగా నిలిచాడు. ఇక్కడ విజయం అంటే కేవలం మార్కులు కాదని, దృష్టి, వ్యూహాలకు సంబంధించినదని ప్రూవ్ చేశాడు. ఎన్ని గంటలు చదివామన్నది కాదు..ఎంత బాగా చదువుతున్నాం, ఎంత నాలెడ్జ్ని పొందుతున్నాం అన్నదే ముఖ్యం అని చాటిచెప్పాడు.(చదవండి: ఆరోగ్యకరమైన ఆహారమే అయినా బరువు తగ్గడం లేదు ఎందుకు..?) -
ఏప్రిల్ ఒకటి నుంచి ‘జేఈఈ మెయిన్ సెషన్–2’
గుంటూరు ఎడ్యుకేషన్: దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు అర్హత కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2025 రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు షిఫ్ట్లలో పరీక్షలు నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్ సెషన్–1 పరీక్షలు గత నెల 30న ముగిశాయి. దీంతో ఏప్రిల్లో రెండో సెషన్ పరీక్షల నిర్వహణ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇంటర్మీడియెట్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు బీ.టెక్, బీఈ, బీ.ఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు ఫిబ్రవరి 25లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. జేఈఈ మెయిన్ సెషన్–1కు ఎన్టీఏ సైట్లో రిజి్రస్టేషన్ చేసుకున్న విద్యార్థులు రెండో సెషన్కు దరఖాస్తు చేసుకునేందుకు రిజి్రస్టేషన్ నంబరు, పాస్వర్డ్తో లాగిన్ కావచ్చు. కోర్సు పేపర్ వివరాలు, ప్రశ్నాపత్రం మీడియం, ఎగ్జామినేషన్ సెంటర్ను ఎంపిక చేసుకుని ఫీజు చెల్లించాలి. మొదటి సెషన్కు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు ఎన్టీఏ వెబ్సైట్లో రిజి్రస్టేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని, ఆన్లైన్లోనే దరఖాస్తు ఫారం పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. -
ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈజీ
సాక్షి, ఎడ్యుకేషన్ : జేఈఈ–మెయిన్ తొలి దఫా షెడ్యూల్ శుక్రవారం ముగిసింది. మూడోరోజు పేపర్ల సరళిని పరిశీలిస్తే.. మొదటి షిఫ్ట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ క్లిష్టంగా ఉండడమే కాకుండా ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి. ఫిజిక్స్లో ఫార్ములా ఆధారిత ప్రశ్నలు అడిగినప్పటికీ.. మొత్తం సులువుగా ఉండడంతో విద్యార్థులు కాసింత ఉపశమనం చెందారు. కెమిస్ట్రీ కూడా సులభంగానే ఉంది. మ్యాథమెటిక్స్లో 3డి, వెక్టార్స్, ఏరియాస్, సీక్వెన్స్, సిరీస్, కానిక్స్, ఇంటిగ్రల్ కాలిక్యులస్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంశాలకు ప్రాధాన్యం లభించింది.ఎందులోంచి ఎన్ని ప్రశ్నలు..తొలి సెషన్లో ఫిజిక్స్లో మోడ్రన్ ఫిజిక్స్ నుంచి 3 ప్రశ్నలు, రే, వేవ్ ఆప్టిక్స్ నుంచి 2 ప్రశ్నలు.. హీట్ అండ్ థర్మో డైనమిక్స్ నుంచి 2 ప్రశ్నలు, ఎలక్ట్రిసిటీ నుంచి 2 ప్రశ్నలు అడిగారు. మిగతా టాపిక్స్ నుంచి ఒక్కో ప్రశ్న అడిగారు. మ్యాథమెటిక్స్లో వెక్టార్స్, 3డి, సిరీస్, ఏరియా, మాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, సెట్స్ రిలేషన్, కానిక్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, డెఫినిట్ ఇన్డెఫినిట్ ఇంటిగ్రేషన్ల నుంచి 2 ప్రశ్నలు చొప్పున అడిగారు. కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్; పిరియాడిక్ క్లాసిఫికేషన్; డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్, ఆల్డిహైడ్స్ – ఫినాల్–కార్బాక్సిలిక్ యాసిడ్; కోఆరి్డనేట్ కాంపౌండ్ల నుంచి 2 ప్రశ్నలు చొప్పున, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 3 ప్రశ్నలు అడిగారు.ఉదయంతో పోల్చితే రెండో షిఫ్ట్ క్లిష్టంగా..ఉదయం షిఫ్ట్తో పోల్చితే రెండో షిఫ్ట్ క్లిష్టంగా ఉంది. మ్యాథమెటిక్స్ ఓ మోస్తరు క్లిష్టతతో సుదీర్ఘ ప్రశ్నలతో ఉండగా, ఫిజిక్స్ కూడా క్లిష్టంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. కెమిస్ట్రీ ఓ మాదిరి క్లిష్టతతో ఉంది. కెమిస్ట్రీలో అత్యధిక ప్రశ్నలు ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్, కోఆరి్డనేట్ కాంపౌండ్స్, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, పి–బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి అడిగారు. మ్యాథమెటిక్స్లో ఉదయం మాదిరిగానే టాపిక్స్ ఉన్నాయి. మొత్తం మీద 22 నుంచి 24వ తేదీ వరకు ఆరు షిఫ్ట్లలో నిర్వహించిన పరీక్షల్లో ఆరో షిఫ్ట్ ప్రశ్నపత్రం కష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తం ఆరు షిఫ్ట్లలో మూడు సబ్జెక్ట్లలోనూ సిలబస్ పరిధిలో లేనివి మూడు ప్రశ్నల చొప్పున అడిగారు.వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న పరీక్షలు, అదే విధంగా 30వ తేదీన నిర్వహించనున్న పేపర్–2ఎ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్); పేపర్–2బి (బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్) పరీక్షల అడ్మిట్ కార్డులను ఎన్టీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.ఎన్సీఈఆర్టీ పుస్తకాలను అధ్యయనం చేయాలిఈ నెల 28, 29 తేదీల్లో పరీక్షలకు హాజరవనున్న విద్యార్థులు.. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లోని బేసిక్ కాన్సెప్ట్సŠ, ఫార్ములాలను అధ్యయనం చేయాలి. అలాగే గత ప్రశ్న పత్రాలు ముఖ్యంగా గత నాలుగేళ్ల ప్రశ్న పత్రాలను సాధన చేయాలి. ఇప్పటివరకు వచ్చిన ప్రశ్నలు చూస్తే..యావరేజ్ స్టూడెంట్స్ 40, 45 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే విధంగా ఉన్నాయి. దీంతో ఎన్ఐటీ లేదా ట్రిపుల్ ఐటీల్లో సీటు పొందే అవకాశం ఉంది. 100 నుంచి 105 మార్కులు పొందితే అడ్వాన్స్డ్కు అర్హత సాధించే అవకాశం ఉంది. గత ఏడాది జనరల్ కటాఫ్ 93 శాతంగా ఉంది. అంటే క్లిష్టమైన, సులభమైన పేపర్ల మధ్య 40 నుంచి 60 మార్కుల వ్యత్యాసం ఉంటుందని గుర్తించాలి. – ఎంఎన్ రావు (జేఈఈ–మెయిన్, అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీ) -
రెండు సెషన్లూ క్లిష్టంగానే..!
సాక్షి ఎడ్యుకేషన్: జేఈఈ మెయిన్ రెండోరోజు గురువారం రెండు సెషన్ల పరీక్షలూ మొదటి రోజుతో పోల్చితే క్లిష్టంగా ఉన్నా యని సబ్జెక్ట్ నిపుణులు తెలిపారు. మొదటిరోజు మాదిరిగానే రెండోరోజు కూడా మ్యాథమెటిక్స్ ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండడంతో అభ్యర్థులకు సమయం సరిపోలేదు. తొలి సెషన్లో విద్యార్థులు 55 నుంచి 60 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వగలిగారు. ఫిజిక్స్లో కొన్ని సులభంగా, మరికొన్ని ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నాయి. కెమిస్ట్రీలో ప్రశ్నలన్నీ ఓ మోస్తరు క్లిష్టతతో అడిగారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లో ద్వితీయ సంవత్సరం సిలబస్కు ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు.కొన్ని టాపిక్స్కు ఎక్కువ ప్రాధాన్యతరెండు సెషన్లలోనూ.. మూడు సబ్జెక్ట్ల ప్రశ్నలను పరిశీలిస్తే కొన్ని టాపిక్స్కు ఎక్కువ ప్రాధాన్యత కనిపించింది. మ్యాథమెటిక్స్లో సిరీస్ (2 ప్రశ్నలు), ఇంటిగ్రెల్ కాలిక్యులస్ (4 ప్రశ్నలు), 3–డి వెక్టార్ అల్జీబ్రా (3 ప్రశ్నలు), కానిక్స్ (3 ప్రశ్నలు)కు ప్రాధాన్యత ఇచ్చారు. సిరీస్, కానిక్స్, పెర్ముటేషన్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. అయితే ఈ సబ్జెక్ట్లో దాదాపు ఏడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఎక్కువ సమయం పట్టింది. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ (9 ప్రశ్నలు), పిరియాడిక్ టేబుల్ (2 ప్రశ్నలు), అటామిక్ స్ట్రక్చర్ (2 ప్రశ్నలు), కెమికల్ బాండింగ్ (2 ప్రశ్నలు)కు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ఫిజిక్స్లో హీట్ అండ్ థర్మో డైనమిక్స్ (2 ప్రశ్నలు), ఎలక్ట్రిసిటీ (3 ప్రశ్నలు), ఏసీ సర్క్యూట్ (2 ప్రశ్నలు)కు వెయిటేజీ లభించింది. 50% ప్రశ్నలు ఫార్ములా, కాన్సెప్ట్స్ ఆధారంగానే..ఫిజిక్స్, కెమిస్ట్రీలలో దాదాపు 50 శాతం ప్రశ్నలు డైరెక్ట్ ఫార్ములా, కాన్సెప్ట్ ఆధారంగా సమాధానం ఇవ్వాల్సినవే ఉన్నాయి. దీంతో సబ్జెక్ట్ను పూర్తిగా చదివిన వారికే సమాధానం ఇచ్చే నేర్పు ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండోరోజు కూడా 2021, 2022 జేఈఈ మెయిన్ పేపర్స్ నుంచే ఎక్కువ ప్రశ్నలు అడగడం గమనార్హం. అదే విధంగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే అన్ని ప్రశ్నలు ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు ఎంఎన్ రావు తెలిపారు. పరీక్షకు సాధారణ స్థాయిలో ప్రిపరేషన్ సాగించిన విద్యార్థులకు 120 మార్కులు, పూర్తి స్థాయి పట్టు సాధించిన వారికి 270కు పైగా మార్కులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.బెంగళూరు సెంటర్లో రీ షెడ్యూల్ఈ నెల 22వ తేదీన బెంగళూరులోని ఒక పరీక్షా కేంద్రంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా మొదటి సెషన్ పరీక్ష నిలిచిపోయింది. దీంతో ఆ సెంటర్లోని 114 మంది విద్యార్థులకు ఈ నెల 28 లేదా 29న పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. -
రెండు సెషన్లూ క్లిష్టంగానే..!
సాక్షి ఎడ్యుకేషన్: జేఈఈ మెయిన్(JEE Main) రెండోరోజు గురువారం రెండు సెషన్ల పరీక్షలూ మొదటి రోజుతో పోల్చితే క్లిష్టంగా ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు తెలిపారు. మొదటిరోజు మాదిరిగానే రెండోరోజు కూడా మ్యాథమెటిక్స్ ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండడంతో అభ్యర్థులకు సమయం సరిపోలేదు. తొలి సెషన్లో విద్యార్థులు 55 నుంచి 60 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వగలిగారు. ఫిజిక్స్లో కొన్ని సులభంగా, మరికొన్ని ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నాయి. కెమిస్ట్రీలో ప్రశ్నలన్నీ ఓ మోస్తరు క్లిష్టతతో అడిగారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లో ద్వితీయ సంవత్సరం సిలబస్కు ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. కొన్ని టాపిక్స్కు ఎక్కువ ప్రాధాన్యత రెండు సెషన్లలోనూ.. మూడు సబ్జెక్ట్ల ప్రశ్నలను పరిశీలిస్తే కొన్ని టాపిక్స్కు ఎక్కువ ప్రాధాన్యత కనిపించింది. మ్యాథమెటిక్స్లో సిరీస్ (2 ప్రశ్నలు), ఇంటిగ్రెల్ కాలిక్యులస్ (4 ప్రశ్నలు), 3–డి వెక్టార్ అల్జీబ్రా (3 ప్రశ్నలు), కానిక్స్ (3 ప్రశ్నలు)కు ప్రాధాన్యత ఇచ్చారు. సిరీస్, కానిక్స్, పెర్ముటేషన్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. అయితే ఈ సబ్జెక్ట్లో దాదాపు ఏడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఎక్కువ సమయం పట్టింది. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ (9 ప్రశ్నలు), పిరియాడిక్ టేబుల్ (2 ప్రశ్నలు), అటామిక్ స్ట్రక్చర్ (2 ప్రశ్నలు), కెమికల్ బాండింగ్ (2 ప్రశ్నలు)కు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ఫిజిక్స్లో హీట్ అండ్ థర్మో డైనమిక్స్ (2 ప్రశ్నలు), ఎలక్ట్రిసిటీ (3 ప్రశ్నలు), ఏసీ సర్క్యూట్ (2 ప్రశ్నలు)కు వెయిటేజీ లభించింది. 50% ప్రశ్నలు ఫార్ములా, కాన్సెప్ట్స్ ఆధారంగానే.. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో దాదాపు 50 శాతం ప్రశ్నలు డైరెక్ట్ ఫార్ములా, కాన్సెప్ట్ ఆధారంగా సమాధానం ఇవ్వాల్సినవే ఉన్నాయి. దీంతో సబ్జెక్ట్ను పూర్తిగా చదివిన వారికే సమాధానం ఇచ్చే నేర్పు ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండోరోజు కూడా 2021, 2022 జేఈఈ మెయిన్ పేపర్స్ నుంచే ఎక్కువ ప్రశ్నలు అడగడం గమనార్హం. అదే విధంగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే అన్ని ప్రశ్నలు ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు ఎంఎన్ రావు తెలిపారు. పరీక్షకు సాధారణ స్థాయిలో ప్రిపరేషన్ సాగించిన విద్యార్థులకు 120 మార్కులు, పూర్తి స్థాయి పట్టు సాధించిన వారికి 270కు పైగా మార్కులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. బెంగళూరు సెంటర్లో రీ షెడ్యూల్ ఈ నెల 22న బెంగళూరులోని ఒక పరీక్షా కేంద్రంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా మొదటి సెషన్ పరీక్ష నిలిచిపోయింది. ఆ సెంటర్లోని 114 మంది విద్యార్థులకు ఈ నెల 28 లేదా 29న పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. -
అడ్మిట్ కార్డులు రెడీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకూ జరిగే జేఈఈ మెయిన్స్కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అందుబాటులోకి తెచ్చింది. పరీక్ష కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తొలి సెషన్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్టీఏ వెల్లడించింది. గత ఏడాది ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 12 లక్షల మంది హాజరయ్యారు. ఈసారి కూడా దాదాపుగా అంతే సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది ఆన్లైన్ విధానంలో జేఈఈ మెయిన్స్ రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 పట్టణాల్లో పరీక్ష ఉంటుంది. 22, 23, 24 తేదీల్లో పేపర్–1 (బీఈ, బీటెక్లో ప్రవేశానికి) ఉంటుంది. 28, 29, 30 తేదీల్లో పేపర్–2 (బీఆర్క్, ప్లానింగ్లో ప్రవేశానికి) ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ ఒక షిఫ్ట్, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకూ మరో షిఫ్ట్ ఉంటుందని ఎన్టీఏ వెల్లడించింది. అభ్యర్థులు రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చని తెలిపింది. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరని స్పష్టం చేసింది. పెరగనున్న సీట్లు దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఈసారి బీటెక్ సీట్లు పెరిగే వీలుంది. కొత్త కోర్సులు, ఆన్లైన్ విధానం అందుబాటులోకి తేనుండటంతో కనీసం 5 వేల సీట్లు పెరుగుతాయని అధికార వర్గాలు అంటున్నాయి. దేశంలోని 31 ఎన్ఐటీల్లో ప్రస్తుతం 24 వేల సీట్లున్నాయి. ట్రిపుల్ ఐటీల్లో 8,500 సీట్లు ఉన్నాయి. ఎన్ఐటీల్లోని 50% సీట్లు సొంత రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో చేరాలంటే మెయిన్స్ కీలకం. ఇక మెయిన్స్ ర్యాంక్ ఆధారంగా మే 18న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్కు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ సంఖ్య 2.5 లక్షలుగా ఉంటుంది. జాతీయ ఇంజనీరింగ్ సంస్థల్లో సీట్లు పెరుగుతున్న నేపథ్యంలో రెండో దఫా పరీక్షకు ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈసారి చాయిస్ ఎత్తివేత బీఆర్క్కు ఏటా 50 వేలకు మించి దరఖాస్తులు రావడం లేదు. కరోనా సమయం నుంచి సెక్షన్ ‘బీ’లో చాయిస్ ఇస్తున్నారు. కానీ ఈసారి చాయిస్ ఉండదు. ఈ సెక్షన్లో ఐదు ప్రశ్నలే ఇస్తారు. సెక్షన్ ఏ, బీలో మైనస్ మార్కులు ఉంటాయని ఎన్టీఏ తెలిపింది. ఇద్దరు అంతకన్నా ఎక్కువ మందికి సమాన స్కోర్ వస్తే తక్కువ మైనస్ మార్కులు వచి్చన వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తారు.అడ్మిట్ కార్డులు కీలకం విద్యార్థులకు ఎన్టీఏ కొన్ని సూచనలు చేసింది. జామెట్రీ బాక్స్, పెన్సిల్ బాక్స్, హ్యాండ్బ్యాగ్, పర్సు, పేపర్, పుస్తకాలు, మొబైల్, మైక్రోఫోన్, ఇయర్ఫోన్స్, కెమెరా, ఎల్రక్టానిక్ వస్తువులు, వాచీలు, స్కేల్, ఆల్గారిథమ్ బుక్, మెటల్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష పూర్తయ్యాక ఇన్వి జిలేటర్ నుంచి అనుమతి వచ్చే వరకూ గదిలోనే ఉండాలి. కీలకమైన అడ్మిట్ కార్డులో మూడు పేజీలుంటాయి. సెంటర్ వివరాలు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్, ముఖ్యమైన సూచనలు, ఇతర వివరాలు మూడో పేజీలో ఉంటాయి. -
‘జేఈఈ మెయిన్’కు వెళ్దాం ఇలా..
దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు అర్హత కల్పించేందుకు ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2025 మొదటి సెషన్ పరీక్షలు ఈ నెల 22 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఈ నెల 22, 23, 24, 28, 29వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్లలో పేపర్–1(బీఈ, బీటెక్) ప్రవేశ పరీక్షలు జరగనుండగా, ఈ నెల 30న మధ్యాహ్నం పేపర్–2 బీఆర్క్ పరీక్ష జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో ఈ ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసిన విద్యార్థులకు ఏ ఊరిలో పరీక్ష కేంద్రం ఉందనే సమాచారంతో సిటీ ఇంటిమేషన్ వివరాలను సైట్లో ఉంచిన ఎన్టీఏ.. ఆయా తేదీల వారీగా జరిగే పరీక్షలకు మూడు రోజుల ముందుగా అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. ఈ నెల 22, 23వ తేదీల్లో జరగనున్న పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు సంబంధించిన అడ్మిట్ కార్డులను శనివారం విడుదల చేసింది. – గుంటూరు ఎడ్యుకేషన్2 గంటల ముందుగా పరీక్ష కేంద్రానికి..⇒ జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు పొందిన విద్యార్థులు అందులో ఎన్టీఏ పొందుపర్చిన నియమ, నిబంధనలను క్షుణ్ణంగా చదవాలి. పరీక్ష సమయానికి రెండు గంటల ముందుగానే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. ⇒ ఉదయం పేపర్–1 ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష మొదటి షిఫ్ట్ ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో షిఫ్ట్లో మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 6.00 వరకు జరగనుంది. ఉదయం పరీక్షకు 7.00 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంటకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ప్రకటించిన ఎన్టీఏ.. పరీక్ష సమయానికి అరగంట ముందు వరకు విద్యార్థులను అనుమతించిన తర్వాత ప్రధాన గేట్లను మూసివేయనున్నట్లు స్పష్టం చేసింది.⇒ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు నీట్ తరహాలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న ఎన్టీఏ.. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ వ్రస్తాలను ధరించి రావాలని, కాళ్లకు బూట్లకు బదులుగా సాధారణ చెప్పులు ధరించాలని నిబంధనలు విధించింది. ⇒ ఎన్టీఏ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్కార్డు కింది భాగంలో ఇచ్చిన ఒక బాక్సులో కలర్ పాస్పోర్ట్ సైజు ఫొటోను అతికించాల్సి ఉంది. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఫొటోనే అతికించాల్సి ఉండగా.. పక్కన మరో బాక్సులో విద్యార్థి ఎడమ చేతి వేలిముద్ర వేయాలి. పక్కన ఉన్న మూడో బాక్సులో పరీక్ష కేంద్రంలోకి వెళ్లాక ఇని్వజిలేటర్ సమక్షంలో సంతకం చేయాలి.⇒ విద్యార్థి తమ వెంట అడ్మిట్కార్డుతో పాటు అటెండెన్స్ షీట్పై అతికించేందుకు మరో పాస్పోర్ట్ సైజు ఫోటోను తెచ్చుకోవాలి. ప్రతి విద్యార్థి నుంచి బయోమెట్రిక్ హాజరు నమోదు చేయనున్నారు. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్తో పాటు బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను తెచ్చుకోవాల్సి ఉంది. దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఆధార్, పాన్ తదితర ఒరిజినల్ కార్డును విధిగా తీసుకెళ్లాలి. -
జేఈఈ మెయిన్కు దరఖాస్తుల జోరు
సాక్షి, అమరావతి: దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షకు ఈ ఏడాది కూడా దరఖాస్తుల జోరు కొనసాగింది. జేఈఈ మెయిన్–2025 జవనరి సెషన్ కోసం సుమారు 12 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. జవనరి 22 నుంచి 31వరకు తొలి సెషన్, ఏప్రిల్ 1 నుంచి 8 వరకు రెండో సెషన్ పరీక్షలకు షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. విద్యార్థులు జనవరి 19 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం జనవరి సెషన్కు అక్టోబర్ 28 దరఖాస్తుల విండో ప్రారంభమైనా... మొదటి రెండు వారాల్లో కేవలం 5.10లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. కొత్త విధానాలు, అర్హత ప్రమాణాల మార్పులు విద్యార్థులను గందరగోళానికి గురిచేసినట్లు నిపుణులు చెబుతున్నారు. దరఖాస్తు సమయంలో కొన్ని పత్రాలు ప్రత్యేకంగా అప్లోడ్ చేయాల్సి రావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అయినా చివరికి ఈ నెల 22వ తేదీన గడువు ముగిసే నాటికి 12లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. గత ఏడాది కంటే దరఖాస్తులు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తున్నప్పటికీ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్టీఏ ప్రకటించాల్సి ఉంది.ఐచ్ఛిక ప్రశ్నలు, వయసు పరిమితి తొలగింపు..కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన జేఈఈ మెయిన్ పరీక్షల్లో సెక్షన్–బీలోని ఐచ్ఛిక ప్రశ్నల విధానాన్ని ఎన్టీఏ తొలగించింది. ఇప్పుడు సెక్షన్–బీలోని ప్రతి సబ్జెక్టులో పది ప్రశ్నలకు బదులు ఐదు ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. మరోవైపు న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ పద్ధతిని తీసుకొచ్చింది. అంటే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల మాదిరిగానే ప్రతి తప్పు సమాధానానికి మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది. ఎన్టీఏ కొత్తగా వయోపరిమితిని సైతం సడలించింది. 12వ తరగతి విద్యా అర్హత కలిగిన ఎవరైనా ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.టై బ్రేక్ రూల్స్ మార్పు...– జేఈఈ మెయిన్–2025లో ఒకే మార్కులు వచ్చినప్పుడు అభ్యర్థుల ర్యాంకుల టై బ్రేక్ రూల్స్ను ఎన్టీఏ సవరించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం పరీక్ష రాసేవారి వయసు, దరఖాస్తు సంఖ్యను ర్యాంకింగ్ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోరు.– విద్యార్థులు ఒకే మొత్తం స్కోర్ను సాధిస్తే సబ్జెక్టులలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు. – గణితంలో ఎక్కువ స్కోరు సాధించిన అభ్యర్థులు టై సమయంలో ఉన్నత ర్యాంక్ పొందుతారు.– గణితంలోను ఒకే మార్కులు వచ్చినప్పుడు ఫిజిక్స్లో ఎక్కువ స్కోర్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ కూడా ఒకే మార్కులు సాధిస్తే కెమిస్ట్రీ స్కోర్ను పరిగణనలోకి తీసుకుంటారు.– వీటి ద్వారా టై సమస్య కొలిక్కి రాకపోతే అన్ని సబ్జెక్ట్లలో సరైన సమాధానాలకు, సరికాని సమాధానాల నిష్పత్తి తక్కువగా ఉన్న అభ్యర్థులకు ఉన్నత ర్యాంక్ కేటాయిస్తారు. వీటిల్లోను నిష్పత్తి టై అయితే గణితం, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో వరుసగా సరికాని సమాధానాల నిష్పత్తులను గుర్తిస్తారు. – ఈ అన్ని దశల తర్వాత కూడా టై మిగిలి ఉంటే అభ్యర్థులకు అదే ర్యాంక్ కేటాయిస్తారు. దేశ, విదేశాల్లో తగ్గిన పరీక్ష కేంద్రాల నగరాలు..దేశంలో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించే నగరాలను 300 నుంచి 284కి తగ్గించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పరీక్షను నిర్వహించే నగరాలను 24 నుంచి 14 కుదించారు. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, హాంకాంగ్ వంటి దేశాల్లో ఎన్టీఏ పరీక్ష కేంద్రాలను తొలగించింది. కొత్తగా బహ్రెయిన్, జర్మనీ, ఇండోనేషియా, ఏయూఈలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఆంధ్రప్రదేశ్లో 11 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను తొలగించడంతోపాటు మరికొన్ని నగరాల్లో సెంటర్లను తగ్గించారు. తెలంగాణాలో రెండు కొత్తగా రెండు నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.ఏపీలో పరీక్షా కేంద్రాలు ఇవే...అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం.ఏపీలో పరీక్ష కేంద్రాలు తొలగించిన పట్టణాలుఅమలాపురం, బొబ్బిలి, చీరాల, గుత్తి, గుడ్లవల్లేరు, మదనపల్లె, మార్కాపురం, పుట్టపర్తి, పుత్తూరు, తాడిపత్రి, తిరువూరు. -
దర్జాగా సర్టిఫికెట్ల దందా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు మీ సేవ కేంద్రాల్లో సర్టిఫికెట్ల దందా కొనసాగుతోంది. సర్వీసు చార్జీల కింద రూ.45 తీసుకోవాల్సి ఉండగా సర్టిఫికెట్కు రూ.4,000 వరకు వసూలు చేస్తున్నారు. ఎన్ఐటీలు, ఐఐటీలు, జీఎఫ్టీఐలలో ప్రవేశాల కోసం ముందుగా నిర్వహించే జేఈఈ మెయిన్కు అవసరమైన సర్టిఫికెట్ల కోసం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదివే పిల్లల తల్లిదండ్రులు మీ సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని కేంద్రాల నిర్వాహకులు భారీ దందాకు తెరలేపారు. తల్లిదండ్రులకు అవసరం కాబట్టి ప్రాంతాన్ని బట్టి ఒక్కో సర్టిఫికెట్కు రూ.500 నుంచి రూ.1,000 వరకు, కొన్నిచోట్ల రూ.4,000 వరకు కూడా వసూలు చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో కొంతమంది సిబ్బంది, అంటెండర్లతో కుమ్మౖMð్క ఈ దందా కొనసాగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.జేఈఈ మెయిన్ అని కాకుండా సాధారణ రోజుల్లో సైతం తహశీల్దార్ కార్యాలయాల్లో డబ్బులు తీసుకుని కుల, ఆదాయ తదితర ధ్రువపత్రాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ముట్టకపోతే దరఖాస్తులు పెండింగ్లో ఉంచేస్తున్నారని, కొంతకాలం తర్వాత ఏదో ఒక కారణంతో దరఖాస్తును తిరస్కరిస్తున్నారనే ఫిర్యాదులుండటం గమనార్హం. పౌరసేవకు ఎగనామం దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకే సర్టిఫికెట్ల జారీని ప్రభుత్వం పౌరసేవల పరిధిలోకి తెచ్చింది. నామమాత్రపు రుసుంతో సర్టిఫికెట్లు జారీ చేసే విధానం ప్రారంభించింది. అయితే దీనిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు తహసీల్ కార్యాలయాల సిబ్బంది, మీ సేవ నిర్వాహకులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. రూ.45 సర్వీసు చార్జీ ఉండే ఓబీసీ సర్టిఫికెట్ కావాలంటే పట్టణ ప్రాంతాల్లోని పలుచోట్ల రూ.4,000 వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,000 వరకు చెల్లించాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. తామే ఆన్లైన్లో దరఖాస్తు చేసి, ఆ పత్రాలను తహసీల్దార్ కార్యాలయానికి పంపించి, ఆమోదించేలా చూస్తామని చెప్పి వసూళ్లు చేపడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 70 వేల మంది తల్లిదండ్రులపై ప్రభావం అక్టోబర్ 28వ తేదీన జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ జారీ అయింది. అదేరోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 22వ తేదీతో గడువు ముగియనుంది. కాగా ఏదైనా రిజర్వేషన్ వర్తించాలంటే సంబంధిత సర్టిఫికెట్లు కావాల్సిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 95 వేల మంది హాజరు కానుండగా, అందులో దాదాపు 70 వేలమందికి ఈ సర్టిఫికెట్లు అవసరమని అంచనా. దీనిని అసరాగా చేసుకొని మీసేవ కేంద్రాల నిర్వాహకులు, తహసీల్ కార్యాలయాల సిబ్బంది దందాకు తెరతీశారు. సొమ్ము దండుకున్నా దబాయింపులేహైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన శ్రీనివాస్కు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తన కుమారుడి కోసం (జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసేందుకు) ఓబీసీ సర్టిఫికెట్ అవసరమైంది. దరఖాస్తు చేద్దామని స్థానిక మీ సేవా కేంద్రానికి వెళ్లారు. అక్కడి నిర్వాహకుడు.. ‘మేమే దరఖాస్తు చేస్తాం.. దరఖాస్తు ఫారాన్ని మేమే తహసీల్దార్ కార్యాలయంలో ఇచ్చి ఆన్లైన్లో ఆమోదం పొందేలా చేస్తాం.. అందుకు రూ.1,000 ఖర్చు అవుతుంది’అని చెప్పాడు. రూ.45 దరఖాస్తుకు అంత చెల్లించాలా? అని శ్రీనివాస్.. బాలానగర్లోని మరో మీ సేవ కేంద్రానికి వెళ్లి అడగ్గా అక్కడా ఇదే సమాధానం ఎదురైంది. గత్యంతరం లేక రూ.1,000 చెల్లించి దరఖాస్తు చేశాడు. 12 రోజులు గడిచినా దరఖాస్తును కార్యాలయ సిబ్బంది కనీసం ఓపెన్ కూడా చేయలేదు. మీ సేవ కేంద్రం నిర్వాహకుడిని అడిగితే ‘అవుతుందిలే.. చేస్తాం.. తహసీల్దార్ కార్యాలయంలో చేయించే వ్యక్తి బిజీగా ఉన్నాడు..’అంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు. దీంతో శ్రీనివాస్ నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కిషోర్ అనే వ్యక్తిని కలిశారు. అతను ‘మీరు నేరుగా ఎలా వస్తారు..’అంటూ మండిపడ్డాడు. దీంతో శ్రీనివాస్ అక్కడ ఉన్న ఇతర సిబ్బందిని సంప్రదించారు. అంతా కుమ్మక్కే కావడంతో.. ‘మీ దరఖాస్తు ఫారమే లేదు. మీరివ్వలేదు..’అంటూ వాళ్లు బుకాయించారు. రెండురోజులు తిరిగి విసిగిపోయిన శ్రీనివాస్ చివరకు తహసీల్దార్ను కలిసి పరిస్థితి వివరించాడు. ఆన్లైన్ ఫారం ప్రింట్ తీసి ఫైల్ సిద్ధం చేయాలని తహసీల్దార్ కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. అయినా వారు పలు కొర్రీలు పెట్టారు. దీంతో శ్రీనివాస్ మళ్లీ తహసీల్దార్ను కలవడంతో ఎట్టకేలకు సర్టిఫికెట్ జారీ అయ్యింది. -
విద్యార్థులకు ఆధార్.. బాధార్..
ప్రభుత్వం నుంచి పొందే సేవలన్నింటినీ ఆధార్తో ముడిపెట్టడంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నత విద్య, ఉద్యోగ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలోను ఆధార్ కార్డునే పరిగణనలోకి తీసుకుంటుండడం అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. ఆధార్ కార్డును గుర్తింపు ధ్రువీకరణగా మాత్రమే చూడాలని కేంద్రం స్పష్టం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ఆధార్ సమస్య వేధిస్తోంది. జనవరిలో జరగనున్న జేఈఈ మెయిన్–2025 మొదటి సెషన్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు గడువు ఈనెల 22న ముగియనుంది. దరఖాస్తు చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనలు విద్యార్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. ప్రధానంగా ఆధార్ కార్డులోను, టెన్త్ సర్టిఫికెట్లోను విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, చిరునామా ఒకే విధంగా ఉండాలనే నిబంధన చాలా ఇబ్బందిగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 20 వేలమందికిపైగా జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసుకుంటారు. ఆధార్కార్డు, టెన్త్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయగానే నేమ్స్ మిస్ మ్యాచ్ అని చూపిస్తోందని ఎక్కువశాతం మంది విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. –గుంటూరు ఎడ్యుకేషన్ఆధార్ కేంద్రాల వద్ద ఆలస్యం దీంతో జేఈఈ మెయిన్కు సిద్ధమయ్యే విద్యార్థులు ఆధార్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఒక్క గుంటూరు నగరంలోనే వందలమంది విద్యార్థులు నెలరోజులుగా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. పేర్ల సవరణల కోసం ప్రయత్నిస్తున్నారు. పేరులో తప్పుల సవరణ, బయోమెట్రిక్ నమోదు, చిరునామా మార్పు ఒకేసారి చేయడం కుదరదని, మరోసారి రావాలని ఆయా కేంద్రాల సిబ్బంది చెబుతుండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దరఖాస్తుకు గడువు సమీపిస్తుండటం వారిని కలవరపరుస్తోంది. ఆధార్కార్డులో సవరణలకు 15 రోజుల నుంచి నెలరోజుల సమయం పట్టడం కూడా ఇబ్బందిగా మారింది. తగినన్నిఆధార్ కేంద్రాలేవి?జేఈఈ మెయిన్తోపాటు ఇంటర్మీడియెట్, అపార్ నమోదు కోసం ఆధార్లో సవరణలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తగినన్ని ఆధార్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ఎంపిక చేసిన బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనే ఉన్న ఆధార్ కేంద్రాలు ప్రస్తుతం కిటకిటలాడుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చి గుంటూరులోని ప్రైవేటు జూనియర్ కళాశాలల హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆధార్ కార్డులో సవరణలు కోసం ఎక్కడో మారుమూల ఉన్న ఊర్ల నుంచి తల్లిదండ్రులు వచి్చ, పిల్లలను వెంటబెట్టుకుని ఆ«ధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. రోజుల తరబడి ఇక్కడే ఉండాలంటే వారికి కష్టంగా ఉంటోంది. పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సిన విద్యార్థుల సమయం ఆధార్ కేంద్రాల వద్దే గడిచిపోతోంది. దీనికితోడు గుంటూరులో చంద్రమౌళీనగర్లోని పోస్టాఫీసులో ఉన్న ఆధార్ కేంద్రాన్ని ఇటీవల మూసేశారు. విద్యార్థుల కోసం ఆధార్ సవరణలకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన జిల్లా అధికారులు తరువాత పట్టించుకోలేదు. -
‘నన్ను క్షమించండి’.. జేఈఈ పరీక్ష ఫెయిల్ అవ్వడంతో..!
న్యూఢిల్లీ: చిన్న చిన్న కారణాలతోనే విలువైన ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. అమ్మానాన్న తిట్టారని, మొబైల్ కొనివ్వలేదని, పరీక్షలో ఫెయిల్ అయ్యామని, ప్రేమ విఫలమైందని, డిప్రెషన్ వంటి కారణాలతో తనువు చాలిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా యువత నుంచి పెద్దవాళ్ల వరకు క్షణికావేశంలో తమను తామే చంపేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయమే తీసుకుంది.జేఈఈ మెయిన్స్ పరీక్షలో పాస్ కాలేదని మనస్తాపం చెందిన 17 ఏళ్ల యువతి బలవన్మరణానికి పాల్పడింది. బిల్డింగ్పై నుంచి దూకి ప్రాణాలు విడిచింది. దేశ రాజధాని ఢిల్లీలోని జామియా నగర్లో ఈ విషాదం చోటుచేసుకుంది. యువతి తన ఇంటర్ పూర్తికాగానే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈఈ మెయిన్స్కు ప్రిపేర్ అవుతోంది. అయితే చదువులో ఒత్తిడి కారణంగా పరీక్ష పాస్ కాలేదు. ఆమె అనుకున్న అంచనాలను చేరుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపంతో శుక్రవారం రాత్రి షాహిన్ భాగ్లోని బిల్డింగ్లోని ఏడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి వద్ద సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో‘ నన్ను క్షమించండి.. నేను సాధించలేకపోయాను. జేఈఈ పరీక్షను క్లియర్ చేయలేకపోయాను’ అని రాసి ఉంది. అయితే పరీక్షలో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకుంటానని బాలిక గతంలో తన తల్లికి తెలియజేసిందని పోలీసులు తెలిపారు. ఆమె తండ్రి ప్రైవేట్ ఉగ్యోగి కాగా, ఆమె తల్లి గృహిణి. -
మెయిన్లోనూ మనోళ్లు టాప్ గేర్లో
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్)లో ఈ ఏడాది కూడా తెలుగు విద్యార్థుల హవా కొనసాగింది. మొదటి 11 జాతీయ ర్యాంకుల్లో మూడింటిని తెలంగాణ విద్యార్థులు దక్కించుకున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన హందేకర్ విదిత్ ఐదో ర్యాంకు, ముత్తవరపు అనూప్ 6వ ర్యాంకు, వెంకట సాయితేజ మాదినేని 7వ ర్యాంకు దక్కించుకున్నారు. అలాగే, దేశంలో 56 మందికి వందశాతం పర్సంటైల్ వస్తే, వీరిలో 22 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులున్నారు. అందులో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్కు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది అర్హత సాధించగా, తెలుగు రాష్ట్రాల నుంచి 49,532 మంది ఆ జాబితాలో ఉన్నారు. జేఈఈ మెయిన్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి, ఏప్రిల్లో రెండు సెషన్లుగా నిర్వహించింది. ఈ రెండు సెషన్లకు కలిపి 9,24,636 మంది దరఖాస్తు చేస్తే, 8,22,899 మంది పరీక్ష రాశారు. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి వెల్లడించింది. కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు, తుది మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఫలితాల్లో మూడో స్థానంలో తెలంగాణజేఈఈ మెయిన్లో అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన 2,50,284 మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించినట్టు ఎన్టీఏ ప్రకటించింది. వీరిలో ఉత్తరప్రదేశ్ విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ నిలిచాయి. ఈ ఏడాది ఎక్కువ మంది జేఈఈ మెయిన్ రాయడంతో అన్ని కేటగిరీల్లో గత ఏడాదితో పోలిస్తే కటాఫ్ పెరిగింది. జేఈఈ అడ్వాన్స్డ్కు ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుముతో మే 10 వరకు గడువు ఉంది. మే 17 నుంచి 26 మధ్య అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి. మే 26న అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తారు. ఫలితాలను జూన్ రెండో వారంలో విడుదల చేయనున్నట్టు సమాచారం. జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ ద్వారా ఎన్ఐటీల్లో దాదాపు 24 వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్ ఐటీల్లో మరో 16వేల సీట్లను భర్తీ చేస్తారు. వంద పర్సంటైల్ సాధించిన తెలుగు విద్యార్థులు.. వారి ర్యాంకులుతెలంగాణ: హందేకర్ విదిత్(5), ముత్తవరపు అనూప్(6), వెంకట సాయితేజ మాదినేని(7), రెడ్డి అనిల్(9), రోహన్ సాయిబాబా(12), శ్రీయాశస్ మోహన్ కల్లూరి(13), కేసం చెన్నబసవరెడ్డి(14), మురికినాటి సాయి దివ్య తేజరెడ్డి(15), రిషి శేఖర్ శుక్లా(19), తవ్వ దినేశ్ రెడ్డి(24), గంగ శ్రేయాస్(35), పొలిశెట్టి రితిష్ బాలాజీ(39), తమటం జయదేవ్ రెడ్డి(43), మావూరు జస్విత్(49), దొరిసాల శ్రీనివాసరెడ్డి (52). ఆంధ్రప్రదేశ్: చింటు సతీష్ కుమార్ (8), షేక్ సూరజ్ (17), మాకినేని జిష్ణు సాయి(18), తోటంశెట్టి నిఖిలేష్(20), అన్నరెడ్డి వెంకట తనిష్ రెడ్డి(21), తోట సాయికార్తీక్ (23), మురసాని సాయి యశ్వంత్ రెడ్డి(36). ♦ ఈడబ్యూఎస్ విభాగంలో తొలి 6 స్థానాల్లో ఇద్దరు ఆంధ్రా, నలుగురు తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన కేసం చెన్నబసవరెడ్డి మొదటిస్థానంలో నిలవగా, తోటంశెట్టి నిఖిలేష్ మూడో స్థానంలో నిలిచాడు.♦ తెలంగాణ నుంచి ఓబీసీ కోటాలో మరువూరి జస్వంత్ వందశాతం, ఎస్టీ కోటాలో జగన్నాధం మోహిత్ 99 శాతం పర్సంటైల్ సాధించారు. పీడబ్ల్యూడీ కోటాలో చుంకిచర్ల శ్రీచరణ్ జాతీయ ర్యాంకర్గా నిలిచారు. ఐఐటీ–బాంబేలో చదవాలనుంది: హందేకర్ విదిత్జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. మా తండ్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, తల్లి ప్రభుత్వ టీచర్. వారి చేయూతతోనే నేను ముందుకెళ్లాను. నాకు ఐఐటీ–బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవాలని ఉంది. ఆ తర్వాత స్టార్టప్ పెట్టి పదిమందికి ఉపాధి కల్పించాలన్నది నా ఆశయం. క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళికబద్ధమైన ప్రిపరేషన్తోనే ఈ ర్యాంకు సాధించాను. -
జేఈఈ మెయిన్కు రికార్డు స్థాయిలో హాజరు
సాక్షి, అమరావతి: జాతీయ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. జనవరి 24 నుంచి ఈ నెల 1 వరకు జరిగిన జేఈఈ తొలి సెషన్ పేపర్–1 (బీఈ/బీటెక్) పరీక్ష 95.80 శాతం, పేపర్–2 (బీఆర్క్/బీప్లానింగ్) పరీక్ష 75 శాతం మంది రాయడం విశేషం. చరిత్రలో ఎన్నడూ లేనంతంగా ఈసారి జేఈఈ మెయిన్కు 12,31,874 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 8,24,945 మంది పురుషులు, 4,06,920 మంది మహిళలు, 9 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య 27 శాతం ఎక్కువ. తాజాగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అత్యధికంగా 12,25,529 మంది పరీక్షకు హాజరయ్యారు. 291 ప్రాంతాల్లో 544 పరీక్ష కేంద్రాలు.. ఈ ఏడాది జేఈఈ మెయిన్కు అత్యధికంగా దరఖాస్తులు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్ష కేంద్రాలు పెంచింది. సెషన్–1 కోసం 291 ప్రాంతాల్లో 544 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 21 పరీక్ష కేంద్రాలు విదేశాల్లో ఉండటం విశేషం. దోహా, దుబాయ్, ఖాట్మండు, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్, కువైట్ సిటీ, కౌలాలంపూర్, లాగోస్/అబుజా, కొలంబో, జకార్తా, మాస్కో, ఒట్టావా, పోర్ట్లూయిస్, బ్యాంకాక్, వాషింగ్టన్ డీసీతో పాటు ఈ ఏడాది తొలిసారిగా అబుదాబి, హాంకాంగ్, ఓస్లో నగరాల్లో జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహించారు. రెండో సెషన్ తేదీల్లో మార్పు.. జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షల షెడ్యూల్ను ఎన్టీఏ మార్పు చేసింది. తొలుత ఏప్రిల్ 1 నుంచి 15 మధ్యలో పరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ వాటిని ఏప్రిల్ 4 నుంచి 15 మధ్యలోకి మార్చింది. మార్చి 2 అర్దరాత్రి 11.50 గంటల వరకు సెషన్–2 కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. గతంలోనే రెండు సెషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు రెండో సెషన్కు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అభ్యర్థి సెషన్లో ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్టీఏ హెచ్చరించింది. రెండు సెషన్లలో రాస్తే.. ఎందులో అత్యధిక స్కోర్ వస్తుందో దాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. జేఈఈ మెయిన్లో ప్రతిభ, రిజర్వేషన్లు ఆధారంగా టాప్ 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపిక చేస్తారు. వీరు పోగా మిగిలిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్ఐటీ (ప్రభుత్వ నిధులతో పనిచేసే సాంకేతిక విద్యా సంస్థలు)ల్లో సీట్లను భర్తీ చేస్తారు. -
55,000 వరకు నేషనల్ లెవల్
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు కోసం ఈ నెల 15 వరకు జరిగిన జేఈఈ మెయిన్ ఎంట్రన్స్ ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో తమకు ఏ ర్యాంకు వస్తుంది? ఎక్కడ, ఏ బ్రాంచీలో సీటు వస్తుందనే ఉత్సుకత విద్యార్థుల్లో నెలకొంది. గతేడాది జేఈఈ అంచనాలు, ఈసారి పేపర్ విధానాన్ని పరిశీలిస్తే జేఈఈ మెయిన్లో 55 వేల వరకు ర్యాంకు వచ్చిన వాళ్లకు కూడా జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏదో ఒక కోర్సులో, ఎక్కడో ఒకచోట సీటు ఖాయమని తెలుస్తోంది. ఈడబ్ల్యూఎస్కు 60 వేలు, ఓబీసీలకు 65 వేలు, ఎస్సీలకు 1.20 లక్షలు, ఎస్టీలకు 3 లక్షలు, పీడబ్ల్యూడీలకు 8 లక్షల ర్యాంకు వచ్చినా జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు పొందే వీలుంది. అయితే కంప్యూటర్ సైన్స్, నచ్చిన కాలేజీలో సీటు కోసం మాత్రం పోటీ ఎక్కువే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వరంగల్, సూర్తాల్, తిరుచాపల్లి వంటి ఎన్ఐటీ కాలేజీల్లో సీటు రావాలంటే జేఈఈ మెయిన్లో 5 వేలలోపు ర్యాంకు వరకే ఆశలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. 30 నుంచి దరఖాస్తులకు అవకాశం... ఈ నెల 30 నుంచి జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఉమ్మడి ప్రవేశాల అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ నిర్వహిస్తుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. ఈసారి జేఈఈ మెయిన్ ప్రవేశపరీక్షను దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది రాశారు. వారిలో 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించనున్నారు. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన వారు ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే కాలేజీలతోపాటు రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో బీ–కేటగిరీ సీట్లలో ప్రాధాన్యం పొందుతారు. దేశవ్యాప్తంగా ఈసారి 10 వేల ఇంజనీరింగ్ సీట్లు పెరిగే వీలుంది. కొత్త కోర్సులకు అనుమతించడం, కొన్ని కాలేజీల్లో సీట్లు పెంచడమే దీనికి కారణం. ఐఐటీల్లో 16,053 సీట్లు, ఎన్ఐటీల్లో 24 వేలు, ట్రిపుల్ ఐటీల్లో 16 వేలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో 6,078 సీట్లున్నాయి. గతేడాది పర్సంటైల్ను పరిశీలిస్తే జనరల్ కేటగిరీలో 88.41 పర్సంటేల్ వస్తే జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపికయ్యారు. ఓబీసీ ఎన్సీఎల్కు 67.00, ఈడబ్ల్యూఎస్కు 63.11, ఎస్సీలకు 43.08, ఎస్టీలకు 26.77, పీడబ్ల్యూడీలకు 0.003 పర్సంటేల్తో అడ్వాన్స్డ్ కటాఫ్ ఖరారైంది. ఈసారి కూడా పోటీని బట్టి కటాఫ్ గతేడాదికి కొంచెం అటుఇటుగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆలోచించి అడుగేయాలి.. జేఈఈ మెయిన్లో టాప్ పర్సంటైల్ వచ్చిన వారు సాధారణంగా అడ్వాన్స్డ్కు వెళ్తారు. మెయిన్లో అర్హత పొంది, 55 వేల ర్యాంకు వరకు వస్తే మాత్రం ఎన్ఐటీ కాలేజీల్లో సీటు పొందే వీలుంది. ర్యాంకు ఎంతో తెలిశాక ఆచితూచి అడుగేయాలి. కాలేజీతో ప్రాధాన్యం లేదనుకుంటే ఇప్పటివరకు వస్తున్న ర్యాంకులను బట్టి ముందుకెళ్లాలి. కోరుకున్న కోర్సు, కాలేజీనే కావాలనుకుంటే వచ్చిన ర్యాంకును బట్టి సీటు వస్తుందో లేదో చూసుకోవాలి. లేకుంటే లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకొని వచ్చే ఏడాది మంచి ర్యాంకు సాధించేందుకు ప్రయత్నించడమే మంచిది. – ఎంఎన్ రావు, జేఈఈ మెయిన్ బోధన నిపుణుడు -
జేఈఈ మెయిన్ సిటీ ఇంటిమేషన్ లెటర్లు విడుదల
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ –2023 సెకండ్ సెషన్ పరీక్షలకు సిటీ ఇంటిమేషన్ లెటర్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. విద్యార్థులు ఎన్టీఏ వెబ్సైట్ https:// jee main. nta.nic.in/' నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. మెయిన్ సెకండ్ సెషన్ ఆన్లైన్ పరీక్షలు ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 290 పట్టణాలతో పాటు విదేశాల్లోని 24 పట్టణాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఏపీలో 25 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఎన్టీఏ ఏర్పాటుచేసింది. విద్యార్థులు ఏ పట్టణంలో పరీక్ష రాయాలో తెలియజేసేలా ఎన్టీఏ ఈ సిటీ ఇంటిమేషన్ లెటర్లను ముందుగా విడుదల చేస్తుంది. విద్యార్థులు ముందుగా ఆయా కేంద్రాలను సందర్శించి, పరీక్షల రోజున ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమయానికి చేరుకోవడానికి వీలుగా ఈ ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు వారి దరఖాస్తు నంబరు, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా సిటీ ఇంటిమేషన్ లెటర్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లెటర్లతో పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశానికి అడ్మిట్ కార్డులు జారీ చేస్తారు. వీటిని కూడా త్వరలోనే ఎన్టీఏ విడుదల చేయనుంది. డౌన్లోడ్లో సమస్యలు ఏర్పడితే 011–40759000 ఫోన్ నెంబర్లో లేదా "jeemain@nta.ac.in.' ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని ఎన్టీఏ సూచించింది. విద్యార్థులు ఎన్టీఏ అధికారక వెబ్సైట్లలో వచ్చే సూచనలను అనుసరించాలని సూచించింది. -
జేఈఈ పేపర్ లీక్ కేసు: రష్యన్ వ్యక్తి అరెస్టు
న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) పేపర్ లీక్ కేసులో రష్యన్ వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణలతో సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అదుపులోకి తీసుకుంది. సదరు రష్యన్ వ్యక్తిని మిఖాయిల్ షార్గిన్గా అధికారులు గుర్తించారు. నిందితుడు జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఉపయోగించే ఐలియన్ సాఫ్ట్వేర్ను హ్యాక్ చేయడంలో సహకరించినట్లు సీబీఐ పేర్కొంది. మిఖాయిల్ కజికిస్తాన్లోని అల్మాటీ నుంచి భారత్కు వచ్చేందుకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావడంతో ఇమ్మిగ్రేషన్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతేగాదు జేఈఈ మెయిన్స్తో సహా వివిధ ఆన్లైన్ పరీక్షల్లో కొందరు విదేశీయులు కుమ్మక్కై హ్యాకింగ్లకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ వెల్లడించింది. ఈ మేరకు సీబీఐ మాట్లాడుతూ... జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షను నిర్వహించే ఐలియన్ సాఫ్ట్వేర్ను మిఖాయిల్ షార్గిన్ హ్యాక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సాఫ్ట్వేర్ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) రూపొందించింది. పరీక్ష సమయంలో అనుమానిత అభ్యర్థుల కంప్యూటర్ సిస్టమ్ను హ్యాక్ చేయండలో ఈ నిందితులు సహకరించినట్లు తేలింది. దీంతో అతనికి నోటీసులు జారి చేసినట్లు పేర్కొంది. (చదవండి: విమానం గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపు...దెబ్బకు నాన్ స్టాప్గా ప్రయాణించిన విమానం) -
23 నుంచి జేఈఈ మెయిన్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి మొదటి దశలో నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 20 నుంచి మొదలవ్వాల్సిన పరీక్షను 23కు మార్చారు. తొలి విడత పరీక్షలు ఈ నెల 29 వరకూ జరుగుతాయి. ఆడ్మిట్ కార్డుల డౌన్లోడ్ ప్రక్రియను శనివారం నుంచే అనుమతించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. పూర్తిగా ఆన్లైన్ మోడ్లో దేశవ్యాప్తంగా 501 ప్రాంతాల్లో మెయిన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎవరెవరికి ఎక్కడ పరీక్ష అనే విషయాన్ని జేఈఈ మెయిన్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని ఎన్టీఏ పేర్కొంది. పరీక్ష రాసే పట్టణం పేరు మాత్రమే వెబ్సైట్లో ఉంటుందని, పరీక్ష కేంద్రం ఎక్కడనేది హాల్ టిక్కెట్లో ఇస్తామని తెలిపింది. పరీక్షలోనూ మార్పులు రెండేళ్ళ కోవిడ్ తర్వాత నిర్వహించే జేఈఈ మెయిన్స్ ఈసారి కొంత కఠినంగా ఉండే అవకాశం కన్పిస్తోంది. పరీక్ష విధానంలో మార్పులే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. గత రెండేళ్ళుగా సెక్షన్–ఏలో నెగెటివ్ మార్కింగ్ ఉండేది. ఇప్పుడు దీన్ని సెక్షన్–బీలో కూడా పెడుతున్నారు. ఈ విభాగంలో ఇచ్చే న్యూమరికల్ ప్రశ్నలకు దీన్ని పెట్టడం వల్ల విద్యార్థులు ఆచితూచి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నపత్రం మొత్తం 20 మార్కులకు ఉంటుంది. ఇదిలా ఉండగా, గతంలో మొత్తం 90 (ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు) ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. దీంతో మొత్తం మార్కుల సంఖ్య 360గా ఉండేది. ఇప్పుడు 90 ప్రశ్నల్లో 75కే జవాబు ఇవ్వాలి. మిగతా 15 చాయిస్గా తీసుకోవచ్చు. దీంతో ప్రశ్నపత్రం 300 మార్కులకే ఉండనుంది. సమాన మార్కులు వస్తే టై బ్రేకర్ విధానం 2021లో రద్దు చేసిన టై బ్రేకర్ విధానాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మళ్ళీ తెరమీదకు తెచ్చింది. ర్యాంకుల్లో సమానమైన స్కోర్ సాధించినప్పుడు వయసును కూడా ప్రామాణికంగా తీసుకోవడం ఈ విధానంలో ప్రత్యేకత. ఇద్దరు విద్యార్థులు పరీక్షలో సమానమైన మార్కులు సాధిస్తే ముందుగా గణితం, ఫిజిక్స్, కెమెస్ట్రీల మార్కులను పరిగణనలోనికి తీసుకుంటారు. ఆ తర్వాత తప్పు సమాధానాల నిష్పత్తిని సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తారు. అప్పటికీ సమాన స్థాయిలో మార్కులు ఉంటే వయసును పరిగణనలోనికి తీసుకుంటారు. అప్పుడు కూడా ఇద్దరూ సమానంగా ఉంటే, ముందు ఎవరు దరఖాస్తు చేశారో చూసి ర్యాంకులు నిర్ధారిస్తారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష మొదటి విడత ఈ నెల 23 నుంచి 29 వరకూ , ఆ తర్వాత జూలై 21 నుంచి 30 వరకూ రెండో విడత జరుగుతుంది. కోవిడ్ సమయంలో నాలుగు విడతల పరీక్ష విధానాన్ని రెండు విడతలుగా మార్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది ఈ పరీక్ష రాస్తున్నారు. -
జేఈఈ మెయిన్–2022 నిబంధనల్లో మార్పులు.. నెగెటివ్ మార్కులతో జాగ్రత్త!
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 నిబంధనల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మార్పు చేసినందున విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జేఈఈ మెయిన్లో అన్ని సెక్షన్ల ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ను అమలు చేయనున్నామని ఎన్టీఏ ఇంతకు ముందే ప్రకటించి ఉన్నందున అభ్యర్థులు సరైన సమాధానాలను మాత్రమే గుర్తించాలని, తప్పుడు సమాధానాలు గుర్తిస్తే మార్కుల్లో కోత పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. గతంలో సెక్షన్–ఎ లోని బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలకు మాత్రమే నెగెటివ్ మార్కులుండేవి. ఈసారి సెక్షన్–బి లోని న్యూమరికల్ వేల్యూ ప్రశ్నలకు కూడా నెగెటివ్ మార్కులుంటాయని ఎన్టీఏ స్పష్టం చేసింది. బీఈ, బీటెక్తో పాటు బీఆర్క్కు సంబంధించిన పేపర్ 2ఏలోని సెక్షన్–బిలో ప్రతి ప్రశ్నకూ నెగెటివ్ మార్కు ఉంటుంది. ప్రశ్నల్లో విద్యార్థులకు చాయిస్ కరోనా కారణంగా కాలేజీలు ఆలస్యంగా తెరచుకోవడంతో 2021–22 విద్యా సంవత్సరంలోనూ పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు సిలబస్ను కుదించాయి. అయితే ఎన్టీఏ సిలబస్ కుదించలేదు. అయితే విద్యార్థులకు ఉపశమనంగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. పేపర్1, పేపర్ 2ఏ, 2బీ విభాగాల్లో పార్టు1లలోని ప్రశ్నల్లో చాయిస్ను ఇచ్చింది. ఆయా విభాగాల్లో తమకు వచ్చిన ప్రశ్నలకు విద్యార్థులు జవాబు ఇవ్వవచ్చు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా ఉంటాయి. ప్రాంతీయ భాషా ప్రశ్న పత్రాలు ఆయా రాష్ట్రాల్లో మాత్రమే అందిస్తారు. ఏపీ, తెలంగాణల్లో ఇంగ్లిష్ తో పాటు తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రాలు ఇస్తారు. టై బ్రేకర్ నిబంధనల్లోనూ మార్పు ఈసారి టై బ్రేకర్ నిబంధనల్లోనూ మార్పులు జరిగాయి. సమానమైన స్కోరు సాధించిన వారి విషయంలో వయసును కూడా ప్రమాణంగా తీసుకోవాలని నిర్ణయించింది. 2021లో ఈ పద్ధతిని రద్దు చేసిన ఎన్టీఏ మళ్లీ అమల్లోకి తెచ్చింది. సమాన మార్కులు వచ్చిన విద్యార్థులుంటే మొదట స్కోర్ల వారీగా వరుసగా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అనంతరం తప్పుడు సమాధానాల నిష్పత్తిని అవే సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తారు. అప్పటికీ సమాన స్థాయిలో ఉంటే వయసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ సాధ్యం కాకుంటే ముందస్తు దరఖాస్తుదారులకు ప్రాధాన్యం ఇస్తారు. ఏపీ నుంచి 1.60 లక్షల మంది హాజరు జేఈఈ మెయిన్ను 2021లో నాలుగు విడతలుగా నిర్వహించగా ఈసారి రెండు విడతలకే పరిమితం చేశారు. తొలి విడత ఈనెల 20 నుంచి 29 వరకు, మలివిడత జూలై 21 నుంచి 30 వరకు జరుగుతుంది. ఈనెల 1 నుంచి ప్రారంభమైన మలివిడత దరఖాస్తు ప్రక్రియ 30వ తేదీతో ముగియనుంది. తొలి విడతకు దేశవ్యాప్తంగా 11 లక్షల మంది వరకు హాజరవుతారని భావిస్తున్నారు. ఏపీ నుంచి 1.60 లక్షల మంది మెయిన్ రాసే అవకాశం ఉంది. చిరునామా ఆధారంగా పరీక్ష కేంద్రం కేటాయింపు ఈసారి అభ్యర్థి చిరునామాను అనుసరించి మాత్రమే సమీపంలోని పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవడానికి అవకాశమిచ్చిన ఎన్టీఏ.. వాటిలో ఒకదానిని కేటాయిస్తుంది. గతంలో ఇతర రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలను కూడా ఎంపిక చేసుకొనే విధానముండేది. అయితే 2021 మెయిన్లో కొందరు అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకొని అక్రమాలకు పాల్పడడం, మాస్ కాపీయింగ్ జరగడంతో సీబీఐ విచారణ, అరెస్టులు కూడా చోటుచేసుకున్నందున ఈసారి ఆ విధానాన్ని మార్చారు. పరీక్ష కేంద్రాల సంఖ్యను 334 నుంచి 514కు ఎన్టీఏ పెంచింది. ఆంధ్రప్రదేశ్లో 29 పరీక్ష కేంద్రాల్లో ఈ జేఈఈ మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలు ఇవీ అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం -
ఏప్రిల్ 16 నుంచి జేఈఈ మెయిన్స్
సాక్షి,హైదరాబాద్: జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్) నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను రెండు దఫాలుగా నిర్వహిస్తోంది. మొదటిదఫా పరీక్ష ఏప్రిల్ 16 నుంచి 21 వరకూ, రెండో దఫా పరీక్ష మే 24 నుంచి 29 వరకూ ఉంటుంది. పరీక్ష నెగెటివ్ మార్కులతో ఆన్లైన్ ద్వారానే చేపడతారు. అభ్యర్థులు ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పరీక్షకు సంబంధించిన ఫీజు కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. పేపర్–1 (బీఈ, బీటెక్ విద్యార్థులకు) మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమెస్ట్రీ పేపర్లతో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ మొదటి షిఫ్ట్, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకూ రెండో షిఫ్ట్ ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. పేపర్–2 (బీఆర్క్ విద్యార్థులకు) మేథ్స్, ఆప్టిట్యూట్ టెస్ట్, డ్రాయింగ్ టెస్ట్ ఉంటుందని తెలిపింది. ఈ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు ఉంటుందని పేర్కొంది. పేపర్–2 బి (బీ ప్లానింగ్ విద్యార్థులకు) ఆప్టిట్యూట్ టెస్ట్, ప్లానింగ్పై మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. పూర్తి వివరాలు, బ్రోచర్ ్జ్ఛ్ఛఝ్చజీn.n్ట్చ.nజీఛి.జీn వెబ్సైట్లో లభిస్తాయని ఎన్టీఏ తెలిపింది. -
ఇక ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్స్
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏడాది నుంచి జేఈఈ మెయిన్స్ను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్ను ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ భాషల్లోనే నిర్వహిస్తున్నారు. 2021 నుంచి భారత్లోని పలు ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించాలని జేఏబీ నిర్ణయించిందని మంత్రి గురువారం ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన విద్యా విధానం దిశగా మరిన్ని నిర్ణయాలకు ఇది దారితీయనుంది. ఇక భారత్లో వైద్య విద్య ప్రవేశ పరీక్షల నీట్ను మాత్రమే 11 భాషల్లో నిర్వహించనున్నారు. -
డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తే అంతే!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులారా.. బీ అలర్ట్! ఏప్రిల్లో నిర్వహించే జేఈఈ పరీక్ష రాసేందుకు విద్యార్థి ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పొరపాటున రెండోసారి రిజిస్ట్రేషన్ చేస్తే అతని మొత్తం దరఖాస్తునే తిరస్కరిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త నిబంధ నను ఎన్టీఏ వెలువరించింది. ఆన్లైన్ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం ఉంటుందని.. ఈ అవకాశాన్ని మాత్రమే వినియోగించుకోవాలని సూచించింది. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్టీఐ) ప్రవేశాల కోసం నిర్వహించే రెండో దఫా జేఈఈ మెయిన్ దరఖాస్తులను ఈనెల 8వ తేదీన ప్రారంభించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 7వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, దరఖాస్తుల సబ్మిషన్, 8వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించింది. దీంతో విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. గతంలో.. రిజిస్ట్రేషన్ సమయంలో ఒకసారి ఏమైనా పొరపాట్లు దొర్లితే మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఈసారి ఆ అవకాశాన్ని తొలగిస్తూ.. రెండోసారి దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మొత్తం దరఖాస్తునే తిరస్కరిస్తామని వెల్లడించింది. -
జేఈఈ మెయిన్ పరీక్ష కేంద్రాలు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జేఈఈ మెయిన్ నిర్వహించే పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పెంచింది. జనవరిలో జరిగిన మొదటి దఫా జేఈఈ మెయిన్ పరీక్షను 7 పట్టణాల్లోని పరీక్ష కేంద్రాల్లో నిర్వహించగా, ఏప్రిల్లో నిర్వహిం చనున్న రెండో దఫా జేఈఈ మెయిన్ పరీక్షను 9 పట్టణాల్లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. జనవరిలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ పట్టణాల్లో పరీక్షలను నిర్వహించిన ఎన్టీఏ ఏప్రిల్లో వాటితోపాటు అదనంగా కోదాడ, నిజామాబాద్లోనూ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్టీఐ) ప్రవేశాలకు ఎన్టీఏ 2 దఫాలుగా జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొదటి దఫా పరీక్షల ఫలితాలను ఇటీవల వెల్లడించింది. ఇక ఏప్రిల్ 7 నుంచి 20 మధ్య నిర్వహించే రెండో దఫా జేఈఈ మెయిన్ దరఖాస్తులను శుక్రవారం ప్రారంభించింది. వచ్చే నెల 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల సబ్మిషన్కు, 8 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లింపునకు చర్యలు చేపట్టింది. ఇక ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేయనుంది. జనవరిలో జరిగిన పరీక్షతోపాటు, ఏప్రిల్లో జరిగే పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఎందు లో ఎక్కువ స్కోర్ లభిస్తే దానిని పరిగణనలోకి తీసుకొని ఆ తర్వాత తుది ర్యాంకులను ప్రకటించనుంది. ఆ ర్యాంకుల ఆధారంగా ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐల్లో ప్రవేశా లు చేపట్టనుంది. ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వ హించే జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హులుగా జేఈ ఈ మెయిన్లో టాప్ పర్సంటైల్ (స్కోర్) సాధించిన 2.24 లక్షల మంది అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోనుంది. జేఈఈ మెయి న్ ఫలితాలు వెల్లడైన మరుసటిరోజు నుంచే జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుల ప్రక్రి యను ఐఐటీ రూర్కీ చేపట్టనుంది. ఆ పరీక్షను మే 19న నిర్వహించనుంది. ఏప్రిల్లోనూ నాలుగు రోజులే! జనవరిలో జేఈఈ మెయిన్ను 4 రోజుల పాటు ప్రతి రోజు 2 షిఫ్ట్లలో నిర్వహించిన ఎన్టీఏ ఏప్రిల్లోనూ 4 రోజుల పాటు ప్రతి రోజు 2 షిఫ్ట్లలో జేఈఈ మెయిన్ను నిర్వహించనుంది. మొదటి దఫా పరీక్షలకు హాజ రుకాని 60 వేల మంది విద్యార్థులు రెండో దఫా పరీక్షకు హాజరుకానున్నారు. వారితోపాటు మొదటి దఫా పరీక్షలకు హాజరైన వారిలోనూ 99% మంది తమ స్కోర్ను పెంచుకునేందుకు రెండో దఫా పరీక్షకు హాజరుకానున్నారు. కొంతమంది కొత్త విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్లో జరిగే పరీక్షకు 10 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఇదీ పరీక్ష షెడ్యూల్.. ఆన్లైన్లో పరీక్షలను ప్రతి రోజు 2 షిఫ్ట్లుగా నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి షిఫ్ట్ పరీక్ష నిర్వహించనుండగా, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో షిఫ్ట్ పరీక్షను నిర్వహించనున్నారు. విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాల్సి ఉంది. ఉదయం పరీక్షకు 8:30లోపు, మధ్యాహ్నం పరీక్షకు 1:30లోపు పరీక్ష కేంద్రంలోకి అనుమతించనుంది. పరీక్ష హాల్లోకి ఉదయం పరీక్షకు 8:45 గంటల నుంచి 9 వరకు, మధ్యాహ్నం పరీక్షకు 1:45 నుంచి 2 వరకు అనుమతిస్తారు. -
జేఈఈ.. దరఖాస్తులు అంతంతేనోయి
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. గడచిన మూడేళ్లలో 1.5 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఓ వైపు జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థలు, మరోవైపు రాష్ట్రాలు తమ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లను జేఈఈ మెయిన్ ద్వారానే భర్తీ చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నా.. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. 2015–16 విద్యా సంవత్సరంలో 12.93 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ రాసేందుకు దరఖాస్తు చేసుకోగా, 2018–19లో 11.35 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం ఇందుకు ఉదాహరణ. ఏదో పరీక్ష రాద్దామనే ఉద్దేశంతో కాకుండా సీరియస్గా ప్రిపేర్ అయ్యే విద్యార్థులే దరఖాస్తు చేసుకుంటున్నారని, దరఖాస్తులు తగ్గడానికి అదే కారణమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఇక ప్రవేశాల విషయానికి వస్తే.. నాలుగేళ్ల కిందటి పరిస్థితితో పోల్చితే కొంత మెరుగైనా ఇంకా సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. ఇంకా మిగులే.. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్టీఐ) ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. గతంలో కంటే సీట్ల మిగులు అధికంగా ఉంటోంది. జేఈఈ మెయిన్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగించడం, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు ఇంటర్ మార్కులు 75% (ఎస్సీ, ఎస్టీలకు 65%) ఉంటే చాలన్న సడలింపు ఇచ్చినా సీట్ల మిగులు తగ్గడం లేదు. సీట్ల మిగులు ఉండకుండా చూసేందుకు మూడేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం వెయిటేజీ తొలగింపు, సడలింపులు వంటి చర్యలు చేపట్టడంతోపాటు ఏడు విడతలుగా ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. అయినప్పటికీ మార్పు రావడం లేదు. 2014–15 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో కేవలం 3 సీట్లు మిగిలిపోగా, 2017–18లో 121 సీట్లు మిగిలిపోయాయి. అడ్వాన్స్డ్కు అర్హుల సంఖ్య పెంచినా.. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన వారి నుంచి జేఈఈ అడ్వాన్స్డ్కు పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల సంఖ్యను క్రమంగా పెంచుతున్నా పరిస్థితి అలానే ఉంది. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన వారిలో టాప్ 1.5 లక్షల మంది విద్యార్థులను గతంలో జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హులుగా తీసుకునేవారు. క్రమంగా దాన్ని టాప్ 2 లక్షలకు, టాప్ 2.2 లక్షలకు, ప్రస్తుతం టాప్ 2.24 లక్షలకు పెంచింది. అయినా సీట్ల మిగులు పెరుగుతోంది. అయితే కాన్పూర్, హైదరాబాద్ ఐఐటీల్లో మాత్రం నాలుగేళ్లుగా ఒక్కసీటు కూడా మిగలకపోవడం విశేషం. -
నేడు జేఈఈ మెయిన్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర జాతీయ స్థాయి సాంకేతిక విద్యా కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 2న నిర్వ హించిన జేఈఈ మెయిన్ ఫలితాలు నేడు (గురువారం) విడుదల కానున్నాయి. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులు హాజరు కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 78 వేల మంది హాజరయ్యారు. ఈ నెల 28 నుంచి మే 2 వరకు మెయిన్లో అర్హత సాధించిన టాప్ 2.20 లక్షల మంది నుంచి జేఈఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తులను స్వీకరించనున్నారు. -
జేఈఈ–2018 నిర్వహణకు నూతన జేఏబీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది (2018లో) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) పరీక్షల నిర్వహణకు జేఈఈ అపెక్స్ బోర్డును (జేఏబీ) కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు ఐఐటీ మద్రాసు మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.ఎస్. అనంత్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని పేర్కొంది. ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో కొనసాగే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం కేంద్రం జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను 2013 నుంచి నిర్వహిస్తోంది. అయితే 2018–19 విద్యా సంవత్సరం నుంచి చేపట్టే ప్రవేశాల కోసం 2018లో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షల నిర్వహణకు కొత్త అపెక్స్ బోర్డును కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ మేరకు మావన వనరుల అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదీ జేఈఈ అపెక్స్ బోర్డు గౌరవాధ్యక్షుడు: ప్రొఫెసర్ ఎం.ఎస్. అనంత్, ఐఐటీ మద్రాసు మాజీ డైరెక్టర్, మెంబర్ సెక్రటరీ: సీబీఎస్ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సభ్యులు: ఐఐటీ బాంబే, కాన్పూర్, ఖరగ్పూర్, ఎన్ఐటీ వరంగల్, ఎన్ఐటీ సూరత్కల్, ఎన్ఐటీ తిరుచ్చి, ట్రిపుల్ఐటీ ఢిల్లీ డైరెక్టర్లు, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, బిట్, మెస్రా, రాంచీ డీమ్డ్ యూనివర్సిటీల ప్రతినిధులు, సీబీఎస్ఈ చైర్మన్, నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ డైరెక్టర్ జనరల్, సీ–డాక్ డైరెక్టర్ జనరల్, ఎంహెచ్ఆర్డీ అదనపు కార్యదర్శి/సంయుక్త కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. -
నేటి నుంచి జేఈఈ మెయిన్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలతోపాటు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వ హించే జేఈఈ మెయిన్- 2017 దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) దృష్టి సారిం చింది. దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించిన ఇన్ఫర్మే షన్ బ్రోచర్ను బుధవారం అర్ధరాత్రి తరువాత లేదా గురువారం ఉదయం జేఈఈ మెయిన్ వెబ్ సైట్(jeemain.nic.in)లో అందు బాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి జనవరి 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకో వచ్చు. పరీక్ష ఫీజును జనవరి 3 వరకు చెల్లించ వచ్చు. ఇక ఈసారి జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో ఆధార్ నంబర్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఆధార్ సహాయక కేంద్రా లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని హైదరా బాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తా మని ప్రకటించింది. ఇంకా ఆధార్ తీసుకోనివారు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సహాయక కేంద్రా ల్లో సంప్రదించి ఆధార్కు ఎన్ రోల్ చేసుకోవచ్చు. ఆ ఎన్రోల్ మెంట్ నంబర్తో జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. ఏదైనా సహాయక కేంద్రంలో ఆధార్ నమోదుకు అవకాశం లేకపోతే వారు ఇచ్చే రిజిస్ట్రేషన్ నంబర్తో కూడా జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. సహాయక కేంద్రాల వివరాలను వెబ్సైట్లో పొందవచ్చు. ఐఐటీల్లో విదేశీ విద్యార్థుల ఫీజు 6లక్షలు ఐఐటీల్లో చేరే విదేశీ విద్యార్థులకు ఫీజును ఐఐటీ కౌన్సిల్ నిర్ణరుుంచినట్లు తెలిసింది. మన దేశ విద్యార్థులకు ఫీజును ఇటీవలే రూ.90 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచిన ఐఐటీ కౌన్సిల్, విదేశీ విద్యార్థుల నుంచి వసూలు చేసే వార్షిక ఫీజును రూ.6 లక్షలుగా నిర్ణరుుంచింది. -
వచ్చే నెలలో జేఈఈ మెయిన్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్కు వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ కానుంది. ఏప్రిల్ 2న జేఈఈ మెయిన్ రాత పరీక్ష నిర్వహించాలని ఇప్పటికే తేదీని ఖరారు చేసిన నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశ ం కల్పించేలా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ప్రవేశాల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఇకపై ఇంటర్మీడియెట్ మార్కులతో పెద్దగా పని లేదు. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీటు కావాలనుకునే విద్యార్థులు ఇకపై జేఈఈ మెయిన్లో ర్యాంకుతోపాటు ఇంటర్లో 75 శాతం (ఎస్సీ, ఎస్టీలైతే 65 శాతం) మార్కులు సాధిస్తే చాలు. ప్రస్తుతం జేఈఈ మెయిన్ ర్యాంకుల ఖరారులో విద్యార్థుల ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ, జేఈఈ మెయిన్ స్కోర్కు 60 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకులను సీబీఎస్ఈ ఖరారు చేస్తోంది. వాటి ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తోంది. అయితే ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని ఐఐటీల కౌన్సిల్ 2015 అక్టోబర్లో నిర్వహించిన సమావేశంలో అభిప్రాయానికి వచ్చింది. దీంతో జేఈఈ పరీక్షలో సంస్కరణలపై కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ జేఈఈ మెయిన్ ర్యాంకుల ఖరారుకు పరిగణనలోకి తీసుకుంటున్న వెయిటేజీని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అలాగే టాప్-20 పర్సంటైల్లో ఉన్నా సరిపోతుందని పేర్కొంది. ఆ సిఫారసుల మేరకు విద్యార్థుల ఇంటర్ మార్కులకు ఇస్తున్న 40 శాతం వెయిటేజీని రద్దు చేస్తూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫీజును పెంచిన నేపథ్యంలో జేఈఈ మెయిన్ పరీక్ష ఫీజును కూడా పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. -
ఏప్రిల్ 2న జేఈఈ మెయిన్!
ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్.. డిసెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్లు సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ రాత పరీక్షను 2017-18 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ 2న నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జారీ చేసే అవకాశముంది. ఇందుకోసం వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. డిసెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. ఏప్రిల్ మొదటి ఆదివారం (2న) జేఈఈ మెయిన్ ఆఫ్లైన్ పరీక్షను నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత నాలుగైదు రోజులకు ఆన్లైన్ పరీక్షలు వరుసగా నాలుగు రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా, మే 21న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తామని ఇటీవల ఐఐటీల కౌన్సిల్ స్పష్టం చేసిన నేపథ్యంలో జేఈఈ మెయిన్ ఫలితాలను ఏప్రిల్ చివరి వారంలోనే ప్రకటించేందుకు సీబీఎస్ఈ కసరత్తు చేస్తోంది. ఫలితాలు వెల్లడించిన రోజు నుంచే జేఈఈ అడ్వాన్స్డ్కు రిజిస్ట్రేషన్ను ప్రారంభించనుంది. -
పర్సంటైల్ నార్మలైజేషన్ విధానమిదీ..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇంటర్ బోర్డుల పరిధిలో చదివిన వి ద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు, ప్రతిభావంతులకే సీట్లు కేటాయించేందుకు ర్యాంకు ఖరారులో పర్సంటైల్ నార్మలైజేషన్ విధానాన్ని సీబీ ఎస్ఈ అమలు చేస్తోంది. దీనిద్వారా వచ్చిన తుది ర్యాంకు ఆధారంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల వంటి విద్యా సంస్థల్లో ప్రవేశాలు చేపడుతోంది. పర్సంటైల్ లెక్కించే విధానం, నార్మలైజేషన్ విధానాన్ని సీబీఎస్ఈ ప్రకటించింది. నార్మలైజ్డ్ బోర్డు స్కోర్ లెకి ్కంపు ఇలా.. (ఓ విద్యార్థిని ఉదాహరణగా తీసుకుంటే..) జేఈఈ మెయిన్లో మొత్తం 360 మార్కులకుగాను గరిష్టంగా వచ్చిన మార్కులు 355 అనుకుందాం (దీనిని బీ1గా పరిగణించాలి). అలాగే జేఈఈ మెయిన్ పరీక్షకు రాష్ట్ర బోర్డు నుంచి హాజరైన విద్యార్థుల్లో ఓ విద్యార్థి ఐదు సబ్జెక్టుల్లో అత్యధికంగా 350 మార్కులు సాధించాడనుకుంటే (దీనిని బీ2గా పరిగణించాలి)... అతని నార్మలైజ్డ్ బోర్డు స్కోరును ‘బీఫైనల్= 0.5(బీ1+బీ2) ఫార్ములాతో లెక్కిస్తారు. అంటే బీఫైనల్ = 0.5(355+350) = 352.5 (ఇది ఆ విద్యార్థి నార్మలైజ్డ్ బోర్డు స్కోరు) జేఈఈ మెయిన్లో వచ్చిన మార్కులకు 60 శాతం వెయిటేజీ (ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది కనుక) ఇచ్చి... దానికి నార్మలైజ్ చేసిన ఇంటర్ బోర్డు స్కోరును కలిపి (60:40 రేషియోలో) ఆ విద్యార్థి కాంపొజిట్ స్కోర్ను నిర్ధారిస్తారు. అన్ని రాష్ట్రాల విద్యార్థులకు కాంపొజిట్ స్కోర్ను లెక్కించి.. ఎక్కువ స్కోర్ వచ్చిన వారి నుంచి మొదలుకొని (టాప్ నుంచి కిందకి) ర్యాంకులు ఖరారు చేస్తారు. ఇక్కడ విద్యార్థికి జేఈఈ మెయిన్లో 350 (అగ్రిగేట్) మార్కులు వచ్చాయనుకుంటే... అతడి కాంపొజిట్ స్కోర్ను (సి=0.6xవిద్యార్థి అగ్రిగేట్ మార్కులు +0.4xబీఫైనల్) ప్రకారం లెక్కిస్తారు. అంటే సీ = 0.6x350+0.4x352.5 = 351 (ఇది ఆ విద్యార్థి కాంపొజిట్ స్కోర్) ► పర్సంటైల్ నిర్ణయించేందుకు మార్కులను వెయ్యిగా కాకుండా ప్రతి సబ్జెక్టులో గరిష్టంగా 100 మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. తెలంగాణ, ఏపీల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లోని ఐదు ప్రధాన సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను 50 శాతానికి తగ్గించి పర్సంటైల్ నార్మలైజేషన్ చేసి, కాంపొజిట్ స్కోర్ను నిర్ధారిస్తారు. -
వెబ్సైట్లో జేఈఈ మెయిన్ కీ
22 వరకు అభ్యంతరాల స్వీకరణ 27న జేఈఈ ఫలితాలు.. అందుబాటులో ప్రశ్నపత్రాలు సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ పరీక్ష కీని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసింది. ఈ నెల 3న జరిగిన ఆఫ్లైన్, 9, 10 తేదీల్లో జరిగిన ఆన్లైన్ పరీక్ష కీ పేపర్లను సోమవారం http://jeemain.nic.in వెబ్సైట్లో ఉంచింది. కీలో ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 22 లోగా తెలియజేయాలని సూచించింది. వాటికి సంబంధించిన ఆధారాలు అప్లోడ్ చేయాలని పేర్కొంది. ఇందుకోసం వేర్వేరుగా లింక్లను ఇచ్చింది. అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పాస్వర్డ్ పొందుపరిచి కీలను పొందొచ్చని తెలిపింది. అలాగే జేఈఈ మెయిన్ పరీక్షల ప్రశ్న పత్రాలను కూడా అందుబాటులో ఉంచింది. ఆఫ్లైన్ పరీక్షకు సంబంధించిన ఈ, ఎఫ్, జీ, హెచ్ కోడ్ ప్రశ్న పత్రాలు, 9, 10 తేదీల్లో జరిగిన ఆన్లైన్ పరీక్ష ప్రశ్నపత్రాలను కూడా వెబ్సైట్లో ఉంచింది. ఇక ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఇక ఆల్ ఇండియా ర్యాంకులను జూన్ 30న లేదా అంతకన్నా ముందే విడుదల చేస్తామని వివరించింది. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి 59,731 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 70 వేలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 29 నుంచి అడ్వాన్స్డ్కు దరఖాస్తులు ఈనెల 29 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ కోసం విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఐఐటీ గువాహటి చర్యలు చేపట్టింది. జేఈఈ మెయిన్లో అత ్యధిక మార్కులు సాధించిన టాప్ 2 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా ప్రకటించింది. ఐఐ టీల్లో ప్రవేశాల కోసం మే 22న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష జరగనుంది. వాటి ఫలితాలను జూన్ 12న ప్రకటించి, జూన్ 20న సీట్లు కేటాయించనుంది. -
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు సిద్ధం
- పేర్లలో తప్పులుంటే ఇంటర్ బోర్డుల ద్వారా సరిదిద్దుంచుకోవాలి సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీలలో ప్రవేశానికి సంబంధించి ఏప్రిల్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కు (జేఈఈ మెయిన్-2016) సంబంధించి ఇ-అడ్మిట్కార్డులను సెంట్రల్బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిద్ధం చేసింది. ఇప్పటికే ఫీజులు చెల్లించిన అభ్యర్ధుల ఇ-అడ్మిట్ కార్డులను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జేఈఈమెయిన్.ఎన్ఐసీ.ఇన్’’ వెబ్సైట్లోకి సీబీఎస్ఈ అప్లోడ్ చేసింది. ఆయా అభ్యర్ధులు తమ, బోర్డుల సమాచారాన్ని అప్లోడ్ చేసి ఈ ఇ-అడ్మిట్కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఇ-అడ్మిట్కార్డుల్లో అభ్యర్ధుల పేర్లలో ఏమైనా తప్పులు దొర్లితే అభ్యర్ధులు బోర్డులో ఏపేరు ఉంటే అదే మాదిరిగా జేఈఈ వెబ్సైట్లోకి అప్లోడ్ చేసి ఇ-అడ్మిట్కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆతదుపరి బోర్డుల ద్వారా పేర్లలోని తప్పులను సరిచేయించుకోవాలి. బోర్డులు ఆయా అభ్యర్ధుల సమాచారాన్ని పంపినప్పుడు జేఈఈ డేటాలోకి వాటిని అప్లోడ్ చేస్తారు. కనుక అభ్యర్ధులు వెంటనే ఇ-అడ్మిట్కార్డులను డౌన్లోడ్ చేసుకొని తప్పులుంటే బోర్డుల ద్వారా సరిచేయించుకోవాలి. ఇ-అడ్మిట్కార్డులు డౌన్లోడ్ కానిపక్షంలో అభ్యర్ధులు సీబీఎస్ఈ హెల్ప్లైన్లు 7042399520, 521, 524, 525, 526, 528లలో ఉదయం పదినుంచి సాయంతరం అయిదున్నరలోపు సంప్రదించాలని సీబీఎస్ఈ పేర్కొంది. -
జేఈఈ అడ్వాన్స్డ్కు వెనుకంజ!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించిన వారిలోనూ ఏటా 30 శాతం మంది ఈ పరీక్షలు రాయడం లేదు. ఏటా జేఈఈ మెయిన్ రాసే దాదాపు 12 లక్షల మందిలో జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు టాప్ 1.50 లక్షల మందిని ఎంపిక చేస్తే అందులోనూ 30 శాతం మంది పరీక్షలకు హాజరు కాకపోవడంతో ఆ ప్రభావం ప్రవేశాలపైనా పడుతోంది. జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు ఎంపిక చేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంటుండగా, అర్హత సాధిస్తున్న వారి సంఖ్య తగ్గిపోతోంది. మరోవైపు అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు ఎంపిక చేసిన వారిలో 20 శాతం నుంచి 30 శాతం మంది పరీక్షకు హాజరు కాకపోవడం ఐఐటీల్లో సీట్లు మిగిలిపోవడానికి ఓ కారణం అవుతోంది. 2015 జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన 1.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు ఎంపిక చేయగా పరీక్షకు 1,17,238 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే 32,742 మంది విద్యార్థులు పరీక్షకే హాజరు కాలేదు. ఇందులో 25,259 మంది జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు రిజిస్టర్ చేసుకోకుండా పరీక్ష రాయకపోగా, మరో 7,503 మంది రిజిస్టర్ చేసుకున్నా పరీక్ష రాయలేదు. ఇదీ గత ఏడాదే కాదు గడిచిన మూడునాలుగేళ్లుగా ఇదే తంతు. ఇలా 2013లో 24 వేల మంది, 2014 జేఈఈ అడ్వాన్స్డ్కు 26 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు. ఇటీవల ఐఐటీలు గత మూడు నాలుగేళ్లలో పరీక్షలు, వాటికి హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య, చేరుతున్న వారి సంఖ్యను బయటకు తీశాయి. ఇలా పరీక్షకు గైర్హాజరవుతున్న తీరు కూడా ఐఐటీల్లో ప్రవేశాలపై ప్రభావం చూపుతోందన్న ఓ అంచనాకు వచ్చాయి. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్డ్ రాసే వారి సంఖ్యను 2016లో 2 లక్షలకు పెంచాలని నిర్ణయించాయి. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన వారిలో టాప్ 2 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు ఎంపిక చేయనున్నాయి. ఏప్రిల్ 3న జరిగే జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన వారిలో టాప్ 2 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా ప్రకటించనున్నాయి. -
ఉద్యోగ సమాచారం
ఐఓసీఎల్లో 98 పోస్టులు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్).. పారాదీప్ రిఫైనరీ ప్రాజెక్ట్లో వివిధ విభాగాల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 98. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 21. వివరాలకు www.iocl.comచూడొచ్చు బీహెచ్ఈఎల్లో 50 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్లు బెంగళూరులోని బీహెచ్ఈఎల్ (భారత్ హెవీ ఎలక్ట్రిక ల్స్ లిమిటెడ్).. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 50. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 14. వివరాలకు www.bheledn.comచూడొచ్చు. ఎయిమ్స్లో జూనియర్ రెసిడెంట్స్ రాయ్పూర్లోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 29. ఇంటర్వ్యూ తేది డిసెంబర్ 7. వివరాలకు www.aiimsraipur.edu.inచూడొచ్చు. కేరళ వెటర్నరీ వర్సిటీలో తాత్కాలిక పోస్టులు కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సెన్సైస్ యూనివర్సిటీ.. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిసెంట్ ప్రొఫెసర్స, టీచింగ్ అసిస్టెంట్స్, ల్యాబ్ అసిస్టెంట్స్, ఆఫీస్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 13. ఇంటర్వ్యూ తేది డిసెంబర్ 10. వివరాలకు www.kvasu.ac.inచూడొచ్చు. టాటా మెమోరియల్ సెంటర్లో ఫీల్డ్ వర్కర్లు టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఫీల్డ్ వర్కర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 8. ఇంటర్వ్యూ తేది డిసెంబర్ 7. వివరాలకు www.actrec.gov.inచూడొచ్చు. ఎన్సీఈఆర్టీలో స్పెషల్ రిక్రూట్మెంట్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ).. వికలాంగుల కోటాలో లోయర్ డివిజన్ క్లర్క పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 5. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 20. వివరాలకు www.ncert.nic.inచూడొచ్చు. బెనారస్ హిందూ వర్సిటీలో ఖాళీలు బెనారస్ హిందూ యూనివర్సిటీ.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్, డేటా కలెక్షన్/కోడింగ్ ఇన్వెస్టిగేటర్, డేటా ఎంట్రీ అండ్ ఎనాలిసిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 4. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 17. వివరాలకు www.bhu.ac.inచూడొచ్చు. 145 డీఎడ్ కాలేజీలకు అనుమతులు రెండు రోజుల్లో డీఈఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్)లో ప్రవేశాలకు చ ర్యలు మొదలయ్యాయి. 145 ప్రైవేటు డీఎడ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తూ సంబంధిత ఫైలుపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం సంతకం చేశారు. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో కాలేజీల్లో 2015-16 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఆ వెంటనే డీఈఈసెట్-2015 ప్రవేశాల షెడ్యూల్ను జారీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. వీలైతే ఈ నెల 5 నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించే అవకాశం ఉంది. డీఈఈసెట్లో అర్హత సాధించిన 71 వేల మంది దీని కోసం ఎదురుచూస్తున్నారు. కళాశాల విద్యా కమిషనర్గా కిషన్కు బాధ్యతలు కళాశాల విద్యా కమిషనర్ వాణిప్రసాద్ సెలవులో ఉండడంతో ప్రభుత్వం... పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్కు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 28 వరకు ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. 8 వరకు ఓపెన్ వర్సిటీ పరీక్ష ఫీజు గడువు హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పీజీ మొదటి, రెండో సంవత్సరం, ఎంబీఏ మొదటి, రెండో, మూడో సంవత్సర వార్షిక పరీక్షలు డిసెంబర్, జనవరిలో జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ నెల 8లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ వార్షిక పరీక్షలు కూడా డిసెంబర్ ఆఖరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో జరుగుతాయని తెలిపారు. తెలంగాణ, ఏపీలోని స్టడీ సెంటర్లలో ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. 5న నిమ్స్లో డిప్లొమా కోర్సులకు కౌన్సెలింగ్ హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో పారామెడికల్ డిప్లొమా పీజీ కోర్సులకు రెండో విడ త కౌన్సెలింగ్ ఈ నెల 5న నిర్వహించనున్నట్లు నిమ్స్ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5న నిమ్స్ పాత భవనం మొదటి అంతస్తులోని లె ర్నింగ్ సెంటర్లో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు www.nims.edu.inవెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. సిబ్బంది వివరాలు అప్లోడ్ చేయాల్సిందే జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు ఆదేశం... 15 వరకు గడువు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో అక్రమాలను అరికట్టేందుకు ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. అర్హులైన బోధన సిబ్బంది లేకపోయినా నెట్టుకొస్తున్న కాలేజీలను గాడిలో పెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది వివరాలను(బయోడేటా) తమ వెబ్సైట్లో ఈ నెల 15 లోగా అప్లోడ్ చేయాల్సిందేనని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. కాలేజీల ప్రిన్సిపాళ్లు ఇందుకవసరమైన చర్య లు చేపట్టాలని ఆదేశించింది. వెబ్సైట్లో జేఈఈ మెయిన్ దరఖాస్తుల లింకు సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఆన్లైన్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా వెబ్సైట్లో దరఖాస్తుల లింక్ను మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ నోటిఫికేషన్లో అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన టాప్ 2 లక్షల మందిని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొనగా, మెయిన్ నోటిఫికేషన్ లో మాత్రం 1.5లక్షల మందినే అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా తీసుకుంటారంది. -
వెబ్లో జేఈఈ దరఖాస్తుల విధానం
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 3న నిర్వహించనున్న జేఈఈ మెయిన్కు వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభించనున్న ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియను జేఈఈ మెయిన్ వెబ్సైట్లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పొందుపరించింది. అడ్మిషన్ నోటీసులో వివరాలను వెల్లడించింది. అభ్యర్థులు జాగ్రత్తగా వాటిని అనుసరిస్తూ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రక్రియ * ముందుగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులోని అంశాల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. * ఆన్లైన్ దరఖాస్తుల ఫార్మాట్లోని అన్ని అంశాలను ముందుగా చూసుకోవాలి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు, సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలి. * స్కాన్ చేసిన ఫొటో కాపీలు, స్కాన్ చేసిన సంతకం కాపీ, ఎడమ చేతి బొటన వేలి ముద్రను స్కాన్ చేసిన కాపీలను జేపీఈజీ ఫార్మాట్లో అందుబాటులో ఉంచుకోవాలి. ఆ తరువాత ఆన్లైన్లో దరఖాస్తును పూర్తి చేయాలి. ఫొటో, సంతకం, ఎడమ చేతి బొటన వేలి ముద్ర కాపీలను అప్లోడ్ చేయాలి. * ఆ తరువాత పరీక్ష ఫీజును క్రెడిట్/డెబిట్ కార్డు ఉపయోగించి చెల్లించాలి. లేదా ఈ-చలానా జనరేట్ చేసుకొని, ఫీజు చెల్లించాక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. * అక్నాలెడ్జ్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రతి విద్యార్థి తన మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని ఆన్లైన్ దరఖాస్తు ఫారంలో కచ్చితంగా పొందుపరుచాలి. -
జేఈఈ మెయిన్ ప్రవేశాల నోటిఫికేషన్ జారీ
* డిసెంబరు 1 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు * అదే రోజు పూర్తి వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్ బులెటెన్ విడుదల * ఈసారి ఇంటర్మీడియట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ యథాతథం * 2016 ఏప్రిల్ 3న ఆఫ్లైన్ పరీక్ష * అదే నెల 9, 10 తేదీల్లో ఆన్లైన్ పరీక్ష సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 2016లో ఇంజనీరింగ్ (బీటెక్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్కుకేషన్ (సీబీఎస్ఈ) ఈ ప్రవేశాల నోటీసును (నోటిఫికేషన్) బుధవారం జారీ చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలను జేఈఈ మెయిన్ వెబ్సైట్లో (jeemain.nic.in) అందుబాటులో ఉంచింది. డిసెంబరు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని అందులో వెల్లడించింది. పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం, సిలబస్, అర్హతలు, పరీక్ష ఫీజు, పరీక్ష కేంద్రాలు, వయో పరిమితి, నార్మలైజేషన్ విధానం, రిజర్వేషన్లు తదితర అన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ను డిసెంబరు 1న వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని వివరించింది. అంతేకాదు 2016-17 విద్యా సంవత్సరం ప్రవేశాల్లో ఇంటర్మీడియట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుందని స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ, జేఈఈ మెయిన్ స్కోర్కు 60 శాతం వెయిటేజీ ఇచ్చి నార్మలైజేషన్ చేసి తుది ర్యాంకును ఖరారు చేసి, వాటి ఆధారంగా ప్రవేశాలు చేపడతామని వివరించింది. జాతీయ స్థాయి విద్యా సంస్థలతోపాటు వివిధ రాష్ట్రాలు జేఈఈ మెయిన్ స్కోర్ ద్వారా ఇంజనీరింగ్లో ప్రవేశాలను చేపడుతున్నాయి. ఈసారి గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, నాగాలాండ్, ఒడిషా రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు చేపట్టేందుకు ముందుకు వచ్చాయని వివరించింది. ఇదీ జేఈఈ మెయిన్కు పరీక్షలకు సంబంధించిన వివరాలు.. - 2016 ఏప్రిల్ 3న ఆఫ్లైన్ (పెన్ను పేపరు బేస్డ్) పేపరు -1 పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష ఉంటుంది. - ఏప్రిల్ 9, 10 తేదీల్లో బీఈ/బీటెక్లో ప్రవేశాల కోసం ఆన్ పరీక్షలు (కంప్యూటర్ ఆధారిత) ఉంటాయి. ఈ పరీక్షలను రెండు షిఫ్ట్లుగా నిర్వహించనుంది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 2 గంటల వరకు రెండో షిప్టులో పరీక్ష నిర్వహిస్తుంది. - బీఈ/బీటెక్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు జేఈఈ మెయిన్ పేపరు-1 పరీక్ష రాయాల్సి ఉంటుంది. - బీఆర్క్/బీప్లానింగ్ కోర్సుల్లో చేరాలనుకునే వారు పేపరు-2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. లేదా రెండు పేపర్లు రాయవచ్చు. - బీఈ/బీటెక్ కోసం పేపరు-1లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. - బీఆర్క్/బీప్లానింగ్ కోసం నిర్వహించే పేపరు-2లో మ్యాథ్స్ పార్ట్-1, ఆప్టిట్యూడ్ టెస్టు - పార్ట్2, డ్రాయింగ్ టెస్టు-పార్ట్-3 పేపర్లు ఉంటాయి. - 2014, 2015 సంవత్సరాల్లో 12వ తరగతి / తత్సమాన (మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్) పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఈ పరీక్షలు రాసేందుకు అర్హులు. 2016 ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోయే వారు కూడా అర్హులే. - 2013లో, అంతకంటే ముందు ఇంటర్మీడియట్లో పాస్ అయిన వారు 2016 జేఈఈ మెయిన్ రాసేందుకు అర్హులు కాదు. వారు 2017 లేదా ఆ తరువాత రాసుకోవాలి. - 2013లో ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయి, 2014లో ఇంటర్మీడియట్లో పాస్ అయిన వారు కూడా 2016 జేఈఈ మెయిన్ రాసేందుకు అనర్హులే . - 2016లో 12వ తరగతి/ఇంటర్మీడియట్లో ఇంప్రూవ్మెంట్ రాసే వారు ఐదు సబ్జెక్టుల్లో రాయాల్సి ఉంటుంది. పర్సంటైల్ ఖరారులో ఒకే సంవత్సరంలో పాసైన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. - జేఈఈ మెయిన్ను ఒక విద్యార్థి మూడుసార్లు మాత్రమే రాయవచ్చు. - పరీక్ష ఫీజును క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఈ-చలనా రూపంలోనూ చెల్లించవచ్చు. జేఈఈ మెయిన్ (ఆఫ్లైన్) పేపరు-1, పేపరు-2లలో ఏదో ఒక పరీక్షకు జనరల్, ఓబీసీ బాలురు రూ. 1000, బాలికలైతే రూ. 500 ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు ఎవరైనా రూ. 500 చెల్లించాలి. పేపరు-1, పేపరు-2 రెండూ రాయాలనుకుంటే జనరల్, ఓబీసీ బాలురు రూ. 1,800, బాలికలు రూ. 900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ. 900 చెల్లించాలి. - ఆన్లైన్ పరీక్షకు అయితే ఏదో ఒక పేపరుకు జనరల్, ఓబీసీ విద్యార్థుల్లో బాలురు రూ. 500, బాలికలు రూ. 250 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు ఎవరైనా రూ. 250 చెల్లించాలి. రెండు పేపర్లు రాయాలనుకుంటే జనరల్, ఓబీసీ బాలురు రూ. 1,300, బాలికలు రూ. 650 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ. 650 చెల్లించాలి. - ఈ పరీక్షలకు హాజరయ్యే జనరల్ విద్యార్థులు 1991 అక్టోబరు 1వ తేదీన లేదా ఆ తరువాత తరువాత జన్మించిన వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు అయితే 1986 అక్టోబరు 1వ తేదీన లేదా ఆ తరువాత పుట్టిన వారై ఉండాలి. -
మే 22న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
♦ పరీక్ష తేదీని ప్రకటించిన గౌహతి ఐఐటీ ♦ అడ్వాన్స్డ్కు 2 లక్షల మంది ఎంపిక సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను 2016 మే 22న నిర్వహిస్తామని గౌహతి ఐఐటీ ప్రకటించింది. తొలుత మే 22 లేదా 24న ఈ పరీక్ష ఉండొచ్చని ఐఐటీ వర్గాలు పేర్కొన్నప్పటికీ మే 22నే పరీక్ష జరుపుతామని గౌహతి ఐఐటీ స్పష్టం చేసింది. ఇప్పటివరకు జేఈఈ మెయిన్లో టాప్ 1.5 లక్షల మంది విద్యార్థులనే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హులుగా ప్రకటిస్తుండగా ఇకపై జేఈఈ మెయిన్లో అత్యధిక మార్కులు సాధించిన టాప్ 2 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా గౌహతి ఐఐటీ పేర్కొంది. మరోవైపు ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2016 నోటిఫికేషన్ త్వరలోనే జారీ కానుంది. ప్రస్తుతం జేఈఈ మెయిన్ తుది ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు (స్కోర్) ఇస్తున్న 40 శాతం వెయిటేజీని (మరో 60 శాతం జేఈఈ మెయిన్ స్కోర్కు ఇస్తారు) రద్దు చేయాలని నిపుణుల కమిటీ కేంద్రానికి సమర్పించిన సిఫార్సు నివేదికలో పేర్కొనగా.. దీనిపై కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మరో మూడు, నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. ఆ తరువాత సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) జేఈఈ మెయిన్-2016 నోటిఫికేషన్ను జారీ చే సే అవకాశం ఉంది. మరోవైపు జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులకు సంబంధించిన వివరాలను రెండు, మూడు రోజుల్లో గౌహతి ఐఐటీ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
విరబూసిన ‘గిరి’ కుసుమాలు
పేదరికాన్ని జరుుంచారు.. ఒకరు డాక్టర్.. మరొకరు ‘జేఈఈ’ జాతీయ ర్యాంకర్ కష్టజీవుల ఇంట జన్మించారు.. ఇష్టపడి చదివారు.. ఉన్నత ర్యాంకులు సాధించారు.. తల్లిదండ్రులు లేకున్నా ఒకరు అనుకున్న లక్ష్యానికి చేరుకుని డాక్టర్ అయ్యూరు.. అమ్మానాన్న ఉన్న ఓ బిడ్డ ఆలిండియూ జేఈఈ మెరుున్స్లో మొదటి ర్యాంకు సాధించాడు.. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్న ‘జేఈఈ’ ర్యాంకర్ దాతలు ముందుకొస్తేనే చదువు సాగుతుందంటున్నారు.. గురిచూసి చదివిన గిరిజన బిడ్డలకు పలువురు సాయం అందించాలని కోరుతున్నారు. నర్సంపేట : జఫర్గఢ్ మండలం ఓబులాపూర్తండాకు చెందిన బానోతు మంగ్తు, కమలి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. రెండో కొడుకు వెంకన్న 2015 జేఈఈ ఎస్టీ కేటగిరీ వికలాంగ విభాగంలో ఆలిండియూ నంబర్-1 ర్యాంక్ సాధించాడు. 1 నుంచి 5 వరకు దేవరుప్పులలోని సెరుుండీ జాండీ స్కూల్, 6 నుంచి 10 వరకు వరంగల్లోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదివాడు. ఇంటర్మీడియట్ నర్సంపేటలోని కాకతీయు జూనియుర్ కళాశాలలో పూర్తి చేశాడు. జేఈఈ ఫలితాల్లో ఎస్టీ పీడబ్ల్యూడీ విభాగంలో ఆలిండియూ మొదటి ర్యాంక్ సాధించిన విషయుం విదితమే. వెంకన్న తన కుటుంబ ఆర్థిక నేపథ్యాన్ని గురువారం ‘సాక్షి’కి వివరించారు. తమకు నాలుగెకరాల వ్యవసాయు భూమి ఉంది. అమ్మానాన్నలు ఇద్దరు అక్కల పెళ్లిళ్లు చేశారు. అన్నయ్య శివకువూర్ ఏఐఈఈ ఈలో 150వ ర్యాంక్ వచ్చింది. ఎంటెక్లో తమిళనాడులోని తిరుచ్చిలో సీటు వచ్చినా ఆర్థిక స్తోవుత లేక ఈ ఏడాది ఏమి చేయూలో తెలియుని పరిస్థితి. ప్రస్తుతం నేను జాతీయు స్థారుులో మొదటి ర్యాంక్ సాధించినా నాలుగేళ్లకు రూ.4లక్షలు అవసరం కావాల్సి వస్తుండటంతో కుటుంబం ఆలోచనలో పడిందని వివరించాడు. కాగా, ఆర్థిక సాయం చేయదలచిన దాత లు సెల్ నం.8608571733కి ఫోన్ చేయూలని కోరాడు. కాగా, కాక తీయు కళాశాలకు చెందిన వెంకన్న ర్యాంక్ సాధించడంతో ఆర్డీఓ రావుకృష్ణారెడ్డి, డెరైక్టర్ గోగుల ప్రభాకర్రెడ్డి, సృజనారెడ్డి, వీరవుళ్ల వూధవరెడ్డి, వీరారెడ్డితోపాటు పలు వురు ఘనంగా సన్మానించారు. రుణం తీర్చుకుంటా.. తల్లిదండ్రుల కష్టాలను దగ్గరుండి చూశా. కష్టం చేసి అన్నను, నన్ను చదివించారు. వుంచి ర్యాంక్లు సాధించి వారికి కొంత సంతోషం కలిగించాం. భవిష్యత్లో వురెన్ని కష్టాలు ఎదురైనా వుంచి ఉద్యోగాన్ని సాధించి తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటా. - బానోతు వెంకన్న మరిపెడ : మరిపెడ మండలం వీరారం శివారు కేలోతుతండాకు చెందిన కేలోతు భీముడు, భద్రి దంపతులు. వారికి ముగ్గురు కొడుకులు వెంకన్న, హరినాయక్, సిరినాయక్, ముగ్గురు కుమార్తెలు సక్కు, కౌసల్య, మంగాదేవి ఉన్నారు. పెద్ద కొడుకు వెంకన్న పదకొండో ఏటనే తల్లిదండ్రులిద్దరూ అనారోగ్యంతో మృతిచెందారు. అప్పుడు హరి, సిరి చిన్నపిల్లలు. తండ్రి మృతిచెందిన తర్వాత వెంకన్న తీవ్రంగా కలత చెందాడు. పట్టుదలతో ఇద్దరు తమ్ముళ్లలో ఒకరిని డాక్టర్ను చేయాలనే పట్టుదలతో నాలుగెరాల భూమిలో పంట పండిస్తూ.. ఇద్దరు తమ్ముళ్లను ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. పెద్ద తమ్ముడికి ఉద్యోగం వచ్చే వరకు మూడెకరాల భూమి పోయి.. ఎకరం మాత్రమే మిగిలింది. అన్న కష్టాన్ని, తల్లిదండ్రుల మరణాన్ని గుర్తు చేసుకుంటూ నిరంతరం కష్టపడి చదివిన సిరినాయక్ ఇటీవలే ఆలిండియా ఎస్టీ కేటగిరీలో 25వ ర్యాంక్ సాధించాడు. ఆలిండియా వైద్య కళాశాల(ఏఐఐఎంఎస్) ఢిల్లీలో ఎండీ(ఓబీఎస్, గైనిక్)లో ప్రవేశం పొంది జిల్లాకే వన్నె తెచ్చాడు. 1 నుంచి 5వ తరగతి వరకు వీరారం ప్రభుత్వ పాఠశాల, 6 నుంచి 10 వరకు జనగామలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఇంటర్మిడియట్ ఏపీఆర్జేసీ కృష్టా జిల్లా నిమ్మకూరు, ఎంబీబీఎస్ హైదరాబాద్లోని కామినేనిలో పూర్తి చేశాడు. ఇదే ఏడాది ఏఐఐఎంఎస్కు ఎంట్రన్స్ రాసి ర్యాంక్ సాధించాడు. అయితే తన రెండో అన్న హరి ముందుగానే ఉద్యోగంలో చేరి.. సిరికి పెద్దన్న వెంకన్నతోపాటు చేదోడు వాదోడుగా నిలిచాడు. హరి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో సివిల్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నతస్థాయికి ఎదగడంతో తండావాసులతోపాటు మండల ప్రజలు హర్షిస్తున్నారు. -
పాత పద్ధతిలోనే ఎంసెట్ ర్యాంకులు: కడియం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న విడుదల చేయనున్న ఎంసెట్ తుది ర్యాంకులను పాత పద్ధతిలోనే వెల్లడిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇంటర్ మార్కులకు వెయిటేజీనిచ్చాకే తుది ర్యాంకులను ఖరారు చేస్తామన్నారు. టెన్త్ ఫలితాలను విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి ఏపీలో ఇంటర్ ఫలితాలు పెరిగినందున జేఈఈ మెయిన్ తరహాలో పర్సంటైల్ నార్మలైజేషన్ విధానంలో ఎంసెట్ తుది ర్యాంకులను ఖరారు చేయాలన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ మేరకు స్పష్టతనిచ్చారు. ఎంసెట్ను కొనసాగించేదీ లేనిదీ తర్వాత ఆలోచిస్తామన్నారు. ‘ఎంసెట్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. విద్యార్థులు కౌన్సెలింగ్ ద్వారా తమకు నచ్చిన కాలేజీని ఎంచుకునే విధానం ఉంది. ఎంసెట్ లేకపోతే ఇది సాధ్యం కాదు. మరోవైపు రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల కంటే ఎంసెట్లో అర్హత సాధిస్తున్న విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. కాబట్టి ఇంజనీరింగ్కు ఎంసెట్ అవసరమా అన్న వాదనలు ఉన్నాయి. దీనిపై తర్వాత ఆలోచిస్తాం. తెలంగాణ యూనివర్సిటీ యాక్ట్ ప్రస్తుతం సీఎం పరిశీలనలో ఉంది. త్వరలోనే నిర్ణయం వెలువడుతుంది. ఆ తర్వాత వర్సిటీలకు వైస్ఛాన్స్లర్లను నియమిస్తాం’ అని చెప్పారు. -
జేఈఈ మెయిన్లో అందరికీ 4 మార్కులు
హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ రాత పరీక్షలో సెట్-ఎ పేపర్లో 10వ ప్రశ్నకు(ఫిజిక్స్) ఇచ్చిన ఆప్షన్లన్నీ తప్పులేనని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గుర్తించింది. దీంతో ఆ ప్రశ్నకు సంబంధించి 4 మార్కులను పరీక్ష రాసిన విద్యార్థులందరికీ ఇవ్వాలని నిర్ణయించింది. సెట్-బి పేపర్లో 87వ ప్రశ్నకు, సెట్-సిలో 51వ ప్రశ్నకు, సెట్-డిలో 17వ ప్రశ్నకు సంబంధించి విద్యార్థులందరికీ 4 మార్కులు ఇస్తామని పేర్కొంది. అలాగే సెట్-ఎ పేపర్లో 15వ ప్రశ్నకు 3, 4వ ఆప్షన్లు రెండూ సరైనవేనని స్పష్టం చేసింది. పరీక్ష తుది కీని వెబ్సైట్లో విడుదల చేస్తూ ఈ వివరాలు తెలిపింది. ఏప్రిల్ 10న జరిగిన ఆన్లైన్ పరీక్షలో 3, 9, 23వ ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో సరైన సమాధానాలు లేవని, ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున విద్యార్థులందరికీ 12 మార్కులను ఇస్తామని పేర్కొంది. -
జేఈఈ మెయిన్-2015 రాత పరీక్ష ప్రారంభం
హైదరాబాద్: ఎన్ఐటీ/ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్-2015 రాత పరీక్ష శనివారం నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. పేపరు-1 పరీక్ష ఉదయం 9:30 గంటలకు, పేపరు-2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. నిర్ణీతసమయం తరువాత వచ్చే వారిని నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. తెలంగాణ నుంచి ఈ పరీక్షకు 70 వేల మందికిపైగా విద్యార్థులు హాజరుకానున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను సీబీఎస్ఈ ఏర్పాటు చేసింది. విద్యార్థులూ మరచిపోవద్దు.. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ క్వాలిఫైయింగ్(ఇంటర్) పరీక్షలకు సంబంధించిన ఆధారం (డాక్యుమెంట్) మరిచిపోవద్దు. దానిని ఇన్విజిలేటర్కు అందజేయాలి. 2013, 2014ల్లోనే ఇంటర్ పాసైన వారైతే మార్కుల షీట్ జిరాక్స్ కాపీని అందజేయాలి. 2013, 2014ల్లోనే ఇంటర్మీడియట్ పాస్ అయినా ప్రస్తుతం అన్ని సబ్జెక్టుల్లో ఇంప్రూవ్మెంట్ రాస్తున్న వారైతే ఇంప్రూవ్మెంట్కు సంబంధించిన హాల్టికెట్ను అందజేయాలి. ప్రస్తుతం (2015లో) ఇంటర్మీడియట్ పరీక్షలను మొదటిసారిగా రాస్తున్న వారైతే తమ హాల్టికె ట్ను అందజేయాలి. -
నేడు జేఈఈ మెయిన్
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ/ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్-2015 రాత పరీక్ష శనివారం జరగనుంది. ఈ పరీక్ష సందర్భంగా విద్యార్థులను అరగంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. పేపరు-1 పరీక్ష ఉదయం 9:30 గంటలకు, పేపరు-2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. నిర్ణీతసమయం తరువాత వచ్చే వారిని నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. తెలంగాణ నుంచి ఈ పరీక్షకు 70 వేల మందికిపైగా విద్యార్థులు హాజరుకానున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను సీబీఎస్ఈ ఏర్పాటు చేసింది. విద్యార్థులూ మరచిపోవద్దు.. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ క్వాలిఫైయింగ్(ఇంటర్) పరీక్షలకు సంబంధించిన ఆధారం (డాక్యుమెంట్) మరిచిపోవద్దు. దానిని ఇన్విజిలేటర్కు అందజేయాలి. 2013, 2014ల్లోనే ఇంటర్ పాసైన వారైతే మార్కుల షీట్ జిరాక్స్ కాపీని అందజేయాలి. 2013, 2014ల్లోనే ఇంటర్మీడియట్ పాస్ అయినా ప్రస్తుతం అన్ని సబ్జెక్టుల్లో ఇంప్రూవ్మెంట్ రాస్తున్న వారైతే ఇంప్రూవ్మెంట్కు సంబంధించిన హాల్టికెట్ను అందజేయాలి. ప్రస్తుతం (2015లో) ఇంటర్మీడియట్ పరీక్షలను మొదటిసారిగా రాస్తున్న వారైతే తమ హాల్టికె ట్ను అందజేయాలి. -
4న జేఈఈ మెయిన్ ఆఫ్లైన్ పరీక్ష
10, 11 తేదీల్లో ఆన్లైన్ పరీక్షలు అరగంట ముందుగా పరీక్షకు అనుమతి సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక జాతీయ ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్-2015 పరీక్ష టైం టేబుల్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) జారీ చేసింది. వచ్చే నెల 4న ఆఫ్లైన్, 10, 11 తేదీ ల్లో ఆన్లైన్ ద్వారా నిర్వహించే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పలు సూచనలు చేసింది. ఆఫ్లైన్ పరీక్షకు విద్యార్థులను అరగంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని తెలిపింది. ఉదయం 9:30 గంటలకు బీఈ/బీటెక్ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష పేపర్-1 ప్రారంభమవుతున్నందున విద్యార్థులను అరగంట ముందుగానే(9 గంటలకు) పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్/బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష పేపర్-2 ప్రారంభమవుతుందని, దీనికి అరగంట ముందుగానే (మధ్యాహ్నం 1:30 గంటలకు) పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని వెల్లడించింది. నిర్ణీత పరీక్ష సమయం తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. తెలంగాణ నుంచి దాదాపు లక్ష మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 10, 11 తేదీల్లో జరిగే ఆన్లైన్ పరీక్ష ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అవుతుందని, విద్యార్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని తెలిపింది. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఏర్పాటు చేసే పరీక్ష కేంద్రాల్లో ఆఫ్లైన్ రాత పరీక్షతోపాటు ఆన్లైన్ పరీక్షలు ఉంటాయి. కరీంనగర్, మహబూబ్నగర్, నల్లగొండలో ఆన్లైన్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కంచికచర్ల, కర్నూలు, నరసారావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఆన్లైన్ కేంద్రాలు, గుంటూరు, తిరుపతిలో ఆఫ్లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఆందోళన వద్దు.. ఆప్షన్ మార్చుకోండి
‘జేఈఈ’పై తెలంగాణ ఇంటర్ బోర్డుకు సీబీఎస్ఈ లేఖ సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో సవరణ గడువు నేటితో (ఈనెల 31తో) ముగిసినా.. విద్యార్థులు ఆందోళన చెందవద్దని, వీలైతే ఇప్పుడు తెలంగాణ ఇంటర్ బోర్డుకు సంబంధించిన ఆప్షన్ను అదర్స్లో మార్పు చేసుకోవాలని, వీలుకాకపోయినా ఇబ్బందేమీ లేదని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తెలంగాణ ఇంటర్ బోర్డుకు తెలియజేసింది. ఈమేరకు తెలంగాణ ఇంటర్ బోర్టుకు శుక్రవారం లేఖ రాసింది. జేఈఈ ర్యాంకుల ఖరారు కోసం ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి విద్యార్థుల మార్కుల జాబితా తమకు వచ్చినప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకొని తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థులుగా సవరణ చేసి, తుది ర్యాంకులను ఖరారు చేస్తామన్నారు. జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో తెలంగాణ ఇంటర్ బోర్డు ఆప్షన్ లేకపోవడం, సవరణల లింక్లోనూ తెలంగాణ బోర్డు ఆప్షన్ లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనలో పడిన సంగతి తెలిసిందే. -
నేటి నుంచి జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం 2015 ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించే ఆఫ్లైన్ పరీక్ష, అదే నెల 9, 11, 12, 19 తేదీల్లో నిర్వహించే ఆన్లైన్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పరీక్ష ఏర్పాట్లను చూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఫీజు చెల్లింపునకు కూడా అవకాశం కల్పించింది. ఇందుకోసం వెబ్ పోర్టల్ను (jeemain. nic.in/jeemainapp/root/loginpage.aspx) ఏర్పాటు చేసింది. సమగ్ర వివరాలతో కూడిన జేఈఈ మెయిన్ సమాచార బ్రోచర్ను సీబీఎస్ఈ శుక్రవారం నుంచి అందుబాటులో ఉంచనుంది. విద్యార్థులు వెబ్పోర్టల్లోకి వెళ్లి వివరాలను పొందవచ్చు. దరఖాస్తు విధానానికి సంబంధించిన కొన్ని సూచనలను కూడా ఇన్స్ట్రక్షన్స్ అనే ప్రత్యేక లింక్లో పొందుపరిచింది. 12వ తరగతి/ తత్సమాన/ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదు వుతున్న విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీర్/ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కోసం పేపరు-1 పరీక్షను, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్/బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోసం జేఈఈ మెయిన్ పేపరు-2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. విద్యార్థులు రిజిస్ట్రేషన్ సమయంలో పరీక్ష ఫీజును క్రెడిట్కార్డు/డెబిట్కార్డు/ఈ-చలానా రూపంలో చెల్లించవచ్చు. -
సీమ్యాట్
సీమ్యాట్ 2015-16 (రెండో పరీక్ష) అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ(10+2+3) ఉండాలి. చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: జనవరి 5 వెబ్సైట్: www.aicte-cmat.in జేఈఈ మెయిన్ - 2015 ఐఐటీ, నిట్, ఐఐఐటీ, ఇతర కేంద్ర ప్రభు త్వ విద్యా సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (మెయిన్)-2015 నోటిఫికేషన్ వెలువడింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) - 2015 అర్హతలు: ఇంటర్ (ఎంపీసీ) ఉత్తీర్ణులై ఉం డాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: 24 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 18 వెబ్సైట్: http://jeemain.nic.in/ -
జేఈఈ మెయిన్ - 2014 టాపర్ల మనోగతాలు
ఐఐటీ-ముంబైలో సీఎస్ఈ లక్ష్యం సోదరి స్ఫూర్తి.. అమ్మానాన్న తోడ్పాటు.. ఐఐటీ లక్ష్యంగా నిరంతర కృషి.. వెరసి జేఈఈ మెయిన్లో 355 మార్కులతో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం. ‘ఫలితం గురించి ఆలోచిస్తూ.. ఆందోళన చెందకుండా.. సబ్జెక్టుల్లో పట్టు సాధించేందుకు కృషిచేస్తే విజయం తథ్యం’ అంటు న్నాడు వాకచర్ల ప్రమోద్. ఆయన సక్సెస్ స్పీక్స్.. ఆరో తరగతి నుంచే ఐఐటీ లక్ష్యంగా..ఉన్నత విద్యా సంస్థలో సైన్స్ సంబంధిత కోర్సులు చేయాలన్న ఆశయం..ఇందుకు సరైన మార్గం ఐఐటీ అని కుటుంబ సభ్యుల నుంచి లభించిన తోడ్పాటుతోనే జేఈఈ-మెయిన్లో జాతీయ స్థాయిలో టాప్-2లో నిలిచానంటున్న మహమ్మద్ అక్రమ్ ఖాన్ సక్సెస్ స్పీక్స్... జేఈఈ మెయిన్ జాతీయ స్థాయి టాపర్ (355 మార్కులు) స్వస్థలం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు అక్కడే విద్యాభ్యాసం. నేను ఐఐటీలో చదవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకునేలా చేసినవారు సోదరి హర్షిత. ఆమె ఐఐటీలో సీటు లభిస్తే కలిగే ప్రయోజనాల గురించి చెప్పారు. అమ్మానాన్న భగవాన్, జయశ్రీలు కూడా నేను లక్ష్యం దిశగా పయనించేలా ప్రోత్సహించారు. దాంతో ‘కచ్చితంగా ఐఐటీలో సీటు సాధించాలి’ అనే లక్ష్యం మదిలో నిలిచింది. దానికి అనుగుణంగా తొలి అడుగువేస్తూ గుడివాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9, 10 తరగతులు చదివాను. అక్కడ ఐఐటీ కాన్సెప్ట్ ఓరియెంటేషన్తో సాగిన బోధన ఎంతో ఉపయోగపడింది. జేఈఈ మెయిన్ పరీక్ష ప్రిపరేషన్కు బలమైన పునాది లభించింది. ఇంటర్తోపాటు.. జేఈఈ లక్ష్యంగా: ఇంటర్మీడియెట్లోనూ ఐఐటీ ఇంటెన్సివ్ బ్యాచ్లో చేరడం ఎంతో లాభించింది. అంతేకాకుండా ఇంటర్మీడియెట్లో మా బ్యాచ్ నుంచి కొత్త సిలబస్ తీసుకురావడం.. అది ఎన్సీఈఆర్టీ, సీబీఎస్ఈ సిలబస్లకు అనుగుణంగా ఉండటంతో.. ఒకేసమయంలో ఇంటర్మీడియెట్, జేఈఈ పరీక్షకు సన్నద్ధం కావడం సులువైంది. ప్రిపరేషన్ సరళి: ఇంటర్మీడియెట్, జేఈఈ రెండు పరీక్షల సిలబస్ ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ పరీక్ష విధానంలో రెండింటికీ తేడా ఉంటుంది. జేఈఈలో కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ. కాబట్టి ఇంటర్మీడియెట్ పాఠ్యాంశాలను చదివేటప్పుడే జేఈఈ కోణంలో కాన్సెప్ట్, అప్లికేషన్ ఓరియెంటేషన్తో ప్రిపరేషన్ సాగించాను. తరగతిగదిలో శ్రద్ధతో పాఠాలు వింటే 50 శాతం అంశాలు మెదడులో నిక్షిప్తమవుతాయి. ఫలితంగా స్వీయ సన్నద్ధత సమయంలో అప్పటికే క్లాస్రూంలో నేర్చుకున్న అంశాలపై ప్రాక్టీస్కు ఎక్కువ సమయం కేటాయించడానికి వీలవుతుంది. ఇదే ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాను. తొలుత మ్యాథమెటిక్స్ చాలా కష్టంగా ఉండేది. కానీ మెంటార్స్ సహకారంతో ఆ సమస్యను అధిగమించాను. చివరి దశ.. ప్రతి రోజు పది గంటలు: జేఈఈ-మెయిన్ పరీక్ష తేదీకి మూడు నెలల ముందు నుంచి రోజుకు పది గంటలు ప్రిపరేషన్ సాగించాను. ప్రతిరోజు ప్రణాళికా బద్ధంగా కెమిస్ట్రీకి నాలుగు గంటలు, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్లకు మూడు గంటలు చొప్పున కేటాయించేలా టైం మేనేజ్మెంట్ పాటించాను. అంతేకాకుండా కళాశాలలో నిరంతరం నిర్వహించే ప్రాక్టీస్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు కూడా ఉపకరించాయి. అడ్వాన్స్డ్పైనే దృష్టి: లక్ష్యం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీటు. కాబట్టి అందుకు నిర్వహించే అడ్వాన్స్డ్పైనే ఇప్పుడు దృష్టంతా. ఈ పరీక్షకు నిర్దేశించిన సిలబస్ను ఇప్పటికే పూర్తి చేశాను. మొదట్నుంచీ కొంచెం కష్టంగా భావించే మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్కు ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను. కచ్చితంగా అడ్వాన్స్డ్లోనూ విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రాధాన్యం: అడ్వాన్స్డ్లో ర్యాంకు ఆధారంగా ఐఐటీ-ముంబైలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో చేరడమే తొలి ప్రాధాన్యం. ఆ తర్వాత విదేశాల్లో రీసెర్చ్ కోర్సులు అభ్యసించడం అకడెమిక్ లక్ష్యాలు. ఇక కెరీర్ పరంగా భవిష్యత్తులో ఎంటర్ప్రెన్యూర్షిప్ దిశగా అడుగులు వేసి, సొంతంగా సంస్థను నెలకొల్పాలని ఉంది. ఆందోళన అనవసరం: జేఈఈ ఔత్సాహిక విద్యార్థులు.. పరీక్ష గురించి ఆందోళన చెందక్కర్లేదు. ముఖ్యంగా ఇప్పటి ఇంటర్మీడియెట్ సిలబస్ ప్రకారం- జేఈఈని జయించడం సులభమే. క్లాస్రూంలో పాఠాలు వినే సమయంలో ఫోకస్డ్గా ఉండాలి. సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. లేదంటే చివరి నిమిషంలో ఒత్తిడికి గురవుతాం. జేఈఈ పరీక్ష విధానానికి అనుగుణంగా ప్రాక్టీస్ చేయాలి. రెండేళ్లపాటు ప్రిపరేషన్ కోసం శ్రమించిన దానికంటే పరీక్ష జరిగే మూడు గంటల సమయంలో చూపించిన ప్రతిభ కీలకం. పరీక్ష సమయంలో ఫలితం గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందకుండా అన్ని అంశాలకు సమాధానాలిచ్చేలా అకడెమిక్గా, మానసికంగా సన్నద్ధత పొందితే విజయం ఖాయం. జేఈఈ మెయిన్ జాతీయ స్థాయి రెండో స్థానం (350 మార్కులు) మాది ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట. నాన్న ఉద్యోగ రీత్యా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో స్థిరపడ్డాం. నాన్న ఎజాజుల్లా ఖాన్ కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్లో సివిల్ ఇంజనీర్. దీంతో చిన్నప్పటి నుంచి ఇంట్లో అకడెమిక్ సపోర్ట్ బాగుండేది. మా సోదరి కూడా ప్రస్తుతం బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. వాస్తవానికి నాలోని ఆసక్తిని గమనించి ఐఐటీని లక్ష్యంగా చేసుకోవాలంటూ ఆమె ప్రోత్సహించింది. దీనికి అనుగుణంగా ఆరో తరగతి నుంచే ఐఐటీ లక్ష్యంగా అడుగులు వేశాను. 8 నుంచి పదో తరగతి వరకు హైదరాబాద్లో ఓ ప్రైవేటు స్కూల్లో చదివాను. అక్కడ ఐఐటీ ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ వల్ల కచ్చితంగా ఐఐటీలో సీటు పొందాలి అనే లక్ష్యం బలపడింది.జేఈఈ మెయిన్ పరీక్ష రాశాక మంచి మార్కులు వస్తాయని భావించాను. కానీ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలుస్తానని ఊహించలేదు. ఇప్పుడు అడ్వాన్స్డ్లో మంచి మార్కులు సాధించడంపైనే దృష్టి సారించాను. కలిసొచ్చిన ఉమ్మడి పాఠ్యాంశాలు: పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్లో ఐఐటీ ఇంటెన్సివ్ బ్యాచ్లో చేరాను. జేఈఈ సిలబస్, ఇంటర్మీడియెట్ సిలబస్ ఒకే మాదిరిగా ఉండటం.. అత్యధిక శాతం అంశాలు ఉమ్మడిగా ఉండటం జేఈఈ ప్రిపరేషన్కు ఎంతో లాభించాయి. ఫలితంగా ఇంటర్మీడియెట్ బోర్డ్ పరీక్షలకు, జేఈఈకు సమాంతరంగా ప్రిపరేషన్ సాగించడం సులువైంది. ప్రతి రోజు పది గంటలు : ఇంటర్మీడియెట్లో చేరిన తొలిరోజు నుంచే బోర్డ్ పరీక్షలు, జేఈఈ లక్ష్యంగా ప్రిపరేషన్ సాగించాను. ప్రతిరోజు సగటున పది గంటలు చొప్పున కేటాయించాను. కెమిస్ట్రీకి కచ్చితంగా ఐదు గంటలు కేటాయించాను. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ విషయంలో ఆయా సందర్భాలు, పాఠ్యాంశాలు వాటిలో పరిజ్ఞానం ఆధారంగా సమయాన్ని సర్దుబాటు చేసుకున్నాను. కెమిస్ట్రీలో ఇనార్గానిక్ కెమిస్ట్రీ విభాగం క్లిష్టంగా ఉండేది. అందువల్ల ఈ సబ్జెక్ట్కు ఎక్కువ సమయం కేటాయించి ఆ సమస్యను అధిగమించాను. అనుకూలించే సెల్ఫ్ స్టడీ మెటీరియల్: జేఈఈ ప్రిపరేషన్ విషయంలో సెల్ఫ్స్టడీ మెటీరియల్ ఎంతగానో అనుకూలిస్తుంది. నేర్చుకున్న అంశాలకు సంబంధించి ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్లతో సొంత నోట్స్ తయారు చేసుకుంటే.. రివిజన్ సమయంలో బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా సమయం ఆదా అవుతుంది. నేను ఇదే ఫార్ములాను అనుసరించి ప్రిపరేషన్ సాగించాను. జేఈఈలో విజయానికి సమయపాలన ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రిపరేషన్ వ్యూహాలు అనుసరించాలి. అప్పుడే విజయం దిశగా అడుగులు పడతాయి. కెమిస్ట్రీపై ఫోకస్తో అడ్వాన్స్డ్కు: మరికొద్ది రోజుల్లో జరగనున్న అడ్వాన్స్డ్లో విజయానికి కెమిస్ట్రీపై ఫోకస్డ్ ప్రిపరేషన్ సాగిస్తున్నాను. ఇప్పటికీ కెమిస్ట్రీ అంటే కొంచెం క్లిష్టంగా భావిస్తున్నాను. ఆ భయాన్ని ప్రిపరేషన్ సమయంలో మదిలో మెదలకుండా జాగ్రత్త పడుతున్నాను. మెయిన్ విషయంలోనూ ఇలానే సాగాను. ఆ భయం ప్రిపరేషన్ సమయంలోనూ వీడకపోతే ఫలితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఐఐటీ-ముంబైలో సీఎస్ఈలో: అడ్వాన్స్డ్లో మంచి మార్కులు సాధించి తద్వారా ఐఐటీ-ముంబైలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సీటు పొందడమే ప్రస్తుత లక్ష్యం. ఆ తర్వాత ఉన్నత విద్య పరంగా మేనేజ్మెంట్ పీజీ చేయాలని ఉంది. భవిష్యత్తులో కొద్ది రోజులు ఉద్యోగ అనుభవం గడించాక సొంతగా ఏదైనా సంస్థను నెలకొల్పడం ప్రధాన లక్ష్యం. ‘ముందు’ చూపుతో: జేఈఈ ఔత్సాహిక విద్యార్థులు ముందు నుంచే లక్ష్యంపై గురి పెట్టి ప్రణాళికబద్ధంగా ప్రిపరేషన్ సాగించాలి. సిలబస్ను పరిశీలించి వాటిలో తమకు అనుకూలమైన, ప్రతికూలమైన అంశాలను గుర్తించి కష్టంగా భావించే అంశాలను ముందుగా పూర్తి చేసుకోవాలి. ఫలితంగా లాస్ట్ మినిట్ టెన్షన్ నుంచి తప్పించుకోవచ్చు. తరగతిగదిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ.. అప్లికేషన్ ఓరియెంటెడ్గా ప్రిపరేషన్ సాగిస్తే జేఈఈ సక్సెస్ సాధ్యమే. అకడెమిక్ ప్రొఫైల్ 2012లో పదో తరగతిలో 9.7 జీపీఏతో ఉత్తీర్ణత. 2014లో ఇంటర్మీడియెట్లో 977 మార్కులతో ఉత్తీర్ణత. ఇతర విజయాలు: ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఏఎంటీఐలో విజయం. పదో తరగతిలో ఉన్నప్పుడు సౌత్ ఇండియా మ్యాథ్స్ ఒలింపియాడ్లో విజయం. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజనకు ఎంపిక. -
వెబ్సైట్లో ‘జేఈఈ మెయిన్’ హాల్టికెట్లు
ఏప్రిల్ 6న రాత పరీక్ష సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ ఆఫ్లైన్ రాత పరీక్షను ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తెలిపింది. విద్యార్థులు జేఈఈ మెయిన్ వెబ్సైట్ (www.jeemain.nic.in) నుంచి హాల్టికెట్లు(అడ్మిట్ కార్డు) డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. 150 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. ఇక ఆన్లైన్ పరీక్షను ఏప్రిల్ 9, 11, 12, 19వ తేదీల్లో 281 పట్టణాల్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించింది. హాల్టికెట్ల డౌన్లోడ్లో సమస్యలు ఎదురైతే సీబీఎస్ఈ హెల్ప్లైన్ కేంద్రాన్ని 8506061072, 8506061073, 8506061075, 8506061076, 8506061077 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించింది. అభ్యర్థులకు హాల్టికెట్లను పంపించడంలేదని, వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. అర్హతలకు సంబంధించిన వివరాలు, పత్రాలను పరీక్ష రోజున ఇన్విజిలేటర్కు అందజేయాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లోని అంశాలను సమపాళ్లలో తీసుకొని నిపుణులు ఈ ప్రశ్న పత్రాన్ని రూపొందించారని వివరించింది. తేలిక, మధ్యస్తం, క్లిష్ట పద్ధతిలో వీటిని రూపొందించినట్లు వెల్లడించింది. గత ఏడాదిలాగే ఈసారి కూడా ప్రశ్నపత్రాలను రూపొందించినట్లు తెలిపింది. నేడు ‘గేట్’ ఫలితాలు సాక్షి, హైదరాబాద్: ఐఐటీ వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకుగాను నిర్వహించిన గేట్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్టు ఐఐటీ ఖరగ్పూర్ గురువారం తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నెల 2 వరకు గేట్ ఆన్లైన్ పరీక్షలను నిర్వహించింది. ఫలితాలను ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టు వెబ్సైట్లో పేర్కొంది. వెబ్లో.. ‘అబ్జర్వర్స్’ జాబితా సాక్షి, హైదరాబాద్: ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ విభాగంలో అబ్జర్వర్స్(ఇంజినీరింగ్) పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ఏపీపీఎస్సీ తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు జాబితాలను చూసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు గురువారం ఇక్కడ ఓ ప్రకటన విడుదల చేసింది. టెన్త్ సోషల్ స్టడీస్ పేపర్-2 పరీక్ష వాయిదా? సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికలు ఏప్రిల్ 11న నిర్వహించడానికి సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. అదే రోజున పదో తరగతి సోషల్ స్టడీస్ పేపర్-2 నిర్వహణ మీద విద్యాశాఖ తర్జన భర్జన పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,658 కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఒకవైపు ఎన్నికలు జరుగుతుండగా పరీక్ష నిర్వహించడం సాధ్యమయ్యే పనికాదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 11న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసి, 16న నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. పరీక్ష వాయిదా గురించి ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల సంఘం నుంచి ఉత్తర్వులు రాతపూర్వకంగా అందిన తర్వాతే... పరీక్ష వాయిదా గురించి చర్చిస్తామని అధికారులు చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల సాధ్యాసాధ్యాల గురించి చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 12న ఓపెన్ స్కూల్ పదోతరగతి పరీక్ష మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2, 15న వొకేషనల్ కోర్సు థియరీ పరీక్ష ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 13న ఆదివారం, 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. టెన్త్ పరీక్షల తొలి రోజు 98.9 శాతం విద్యార్థులు హాజరు పదో తరగతి పరీక్షల తొలి రోజు 98.9 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. గురువారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయి. మాల్ప్రాక్టీస్కు పాల్పడుతున్న 50 మంది విద్యార్థులను గుర్తించామని అధికారులు తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో గరిష్టంగా 19 మందిని పట్టుకున్నామని చెప్పారు. -
ప్రాక్టీస్తోనే మెరుగైన మార్కులు..
పి. ఎస్. రవికుమార్ సీనియర్ ఫ్యాకల్టీ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎంసెట్ .. జేఈఈ మెయిన్.. జేఈఈ అడ్వాన్స్డ్.. ఇంటర్ తర్వాత లక్షలాది విద్యార్థులు ఎదుర్కొనే పోటీ పరీక్షలు. ఇవి ఉన్నత విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కలల కోర్సుల్లో చేరేందుకు బాటలు వేస్తాయి. ఇంటర్ తొలి ఏడాదిలో అడుగుపెట్టినప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగిస్తేనే పోటీ పరీక్షల్లో మెరుగైన మార్కులు చేజిక్కుతాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలతో పాటు ఎంసెట్, జేఈఈలకు మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకు సంబంధించిన దీర్ఘ కాలిక ప్రిపరేషన్ వ్యూహాలు.. విద్యార్థి ఎదుర్కొనే పరీక్ష ఏదైనప్పటికీ ప్రిపరేషన్ ప్రారంభించే ముందు ఆ పరీక్షకు సంబంధించిన సిలబస్పై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి. ఎన్ని అధ్యాయాలున్నాయి? ఏ అధ్యాయానికి ఎంత వెయిటేజీ ఉందో తెలుసుకోవాలి. మొత్తం అధ్యాయాలను సులభమైనవి, కఠినమైనవిగా విభజించుకోవాలి. విద్యార్థులు తొలుత సులువైన టాపిక్స్ను త్వరగా పూర్తిచేయడం వల్ల సబ్జెక్టుపై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ఇది కఠినమైన సబ్జెక్టులపై ఆసక్తిని పెంచేందుకు, ఏకాగ్రతతో చదివేందుకు తోడ్పడుతుంది. ఏదైనా అధ్యాయాన్ని చదివేటప్పుడు తొలుత అందులోని కాన్సెప్టులను ఆకళింపు చేసుకోవాలి. సిద్ధాంతాలను, సూత్రాలను బాగా చదివిన తర్వాత సమస్యల్ని సాధించడంపై దృష్టిసారించాలి. గత పరీక్షలకు సంబంధించిన పేపర్లను పరిశీలించి, ఆ తరహా ప్రశ్నల్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్ పరీక్షల విషయంలో గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం ప్రధానం. ఇంటర్ ప్రిపరేషన్: ఏ పోటీ పరీక్ష అయినా ఇంటర్ సిలబస్ ఆధారంగా ఉంటుంది కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యం ఉంది. వివిధ పోటీ పరీక్షలకు ఇంటర్ మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నందున వంద శాతం మార్కులను సాధించే దిశగా సిద్ధమవాలి. ముందు సులభమైన, వెయిటేజీ ఎక్కువగా ఉన్న యూనిట్లతో ప్రిపరేషన్ ప్రారంభించాలి. సాధారణంగా అతిస్వల్ప, స్వల్ప సమాధాన ప్రశ్నలు ఎక్కువగా కాన్సెప్టులపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల వాటిపై ఎక్కువ శ్రద్ధపెట్టాలి. మ్యాథ్స్లో మంచి మార్కులు రావాలంటే ప్రాక్టీస్కు మించిన మార్గం మరొకటి లేదు. ఏదైనా సమస్యను ప్రాక్టీస్ చేసేముందు అందులో ఉపయోగించిన సూత్రాలు, ఇతర అంశాలను నిశితంగా పరిశీలించి, తర్వాత చూడకుండా చేయాలి. అతిస్వల్ప సమాధాన ప్రశ్నల్లో చాయిస్ లేదు కాబట్టి ఈ విభాగంపై ఎక్కువ దృష్టిసారించాలి. ఇందులోని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు ఉపయోగపడతాయి. 2- ఎ మ్యాథ్స్: సెకండియర్ విద్యార్థులు కొంత సమయాన్ని ప్రాక్టికల్స్కు కేటాయించాల్సి ఉంటుంది. అందువల్ల వీరు ప్రిపరేషన్ను తొందరగా ముగించి, పునశ్చరణ ప్రారంభించాలి. 2-ఎ టాపిక్స్లో వర్గ సమీకరణాలు, సమీకరణ వాదాలను ఒక యూనిట్గా; ప్రస్తారాలు, సంయోగాలు, సంభావ్యత చాప్టర్లను ఒక యూనిట్గా;స్టాటిస్టిక్స్, యాదృచ్ఛిక చలరాశులు, సంభావ్యతా విభాజనాలను ఒక యూనిట్గా; సంకీర్ణ సంఖ్యలు, డీమోవియర్స్ సిద్ధాంతం చాప్టర్లను మరో యూనిట్గా, ద్విపద సిద్ధాంతం, పాక్షిక భిన్నాలను మరో యూనిట్గా విభజించుకోవాలి. వీటిలో విద్యార్థి తనకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకొని ప్రిపరేషన్ ప్రారంభించాలి. గత రెండుమూడేళ్ల ప్రశ్నపత్రాల ఆధారంగా కేవలం ఇంపార్టెంట్ ప్రశ్నలకే పరిమితం కాకుండా వీలైనన్ని ఎక్కువ అంశాలకు ప్రిపరేషన్ను విస్తరించాలి. అప్పుడే ప్రశ్న ఏ మూల నుంచి వచ్చినా సమాధానం రాయగలం. గత పరీక్షల్లో బెర్నూలీ సిద్ధాంతాన్ని ప్రవచించి, నిరూపించండి? అనే ప్రశ్న వచ్చింది. ఇది చాలా సులభమైన ప్రశ్న. కానీ, విద్యార్థులు ఈ కోణంలో ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల సమాధానం రాయలేకపోయారు. ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. 2- బి మ్యాథ్స్: 2-బిలో వృత్తాలు, వృత్తసరణిని ఒక యూనిట్గా; శాంకవాలను ఒక యూనిట్గా; అనిశ్చిత సమాకలని, అవకలన సమీకరణాలను ఒక యూనిట్గా; నిశ్చిత సమాకలని, ప్రదేశాలు, వైశాల్యాలను ఒక యూనిట్గా విభజించుకొని ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఈ పేపర్కు కొంత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. నిరూపక జ్యామితిలో సిద్ధాంతాలు, వాటి నిరూపణలతో పాటు వాటిపై ఆధారపడిన ప్రశ్నల్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రశ్నలను పరిశీలించి ఏ విధంగా ఇచ్చారో అర్థం చేసుకోవాలి. కలన గణితంలో ఫార్ములాలు ఎక్కువగా ఉంటాయి. ఏ ఫార్ములాను ఎక్కడ, ఏ విధంగా ఉపయోగించాలో నేర్చుకోవాలి. వైశాల్యాలను నేర్చుకునేటప్పుడు వక్రాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలించాలి. 1- ఎ మ్యాథ్స్: 1-ఎ పేపర్ సులభమైనప్పటికీ అప్రమత్తంగా లేకుంటే మార్కులు కోల్పోయే ప్రమాదముంది. మాత్రికలు, గణితానుగమనం, ప్రమేయాలతో ప్రిపరేషన్ ప్రారంభించాలి. మార్కుల పరంగా మాత్రికలు యూనిట్ ప్రధానమైంది. త్రికోణమితిలో త్రికోణమితి పరావర్తనాలు, త్రిభుజ ధర్మాలు చాలా ముఖ్యమైనవి. వీటి తర్వాత త్రికోణమితి సమీకరణాలు, విలోమ ప్రమేయాలను ప్రాక్టీస్ చేయాలి. విలోమ ప్రమేయాల్లోని అన్ని అంశాలను చదవాలి. ఇది ఆబ్జెక్టివ్ పరీక్షలకు కూడా ప్రధానమైనది. త్రికోణమితిలోని మిగిలిన చాప్టర్లను వాటి మార్కుల ప్రాధాన్యతను బట్టి ప్రాక్టీస్ చేయాలి. ఇక సదిశలు భాగం చాలా సులువైనది. అయితే ఏకాగ్రత సాధన ముఖ్యం. ఎందుకంటే ఇందులోని అంశాలు ఫిజిక్స్, 3-డి జామెట్రీలోనూ ఉపయోగిస్తారు. 1- బి మ్యాథ్స్: ఒక అధ్యాయాన్ని చదవడం ప్రారంభించినప్పుడు తొలుత అందులోని కాన్సెప్టులను ఆకళింపు చేసుకోవాలి. సిద్ధాంతాలను, సూత్రాలను బాగా చదివిన తర్వాత సమస్యల సాధనపై దృష్టిసారించాలి. 1-బి విషయానికి వస్తే బిందుపథం, అక్ష పరివర్తన చాప్టర్లు చిన్నవి కాబట్టి తొందరగా పూర్తిచేయొచ్చు. సరళరేఖలు, సరళరేఖాయుగ్మాల చాప్టర్లకు సంబంధించి విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా సరళరేఖాయుగ్మాల్లో దీర్ఘ సమాధాన ప్రశ్నలు పెద్దవిగానూ, కొంచెం కష్టంగానూ ఉంటాయి. ఈ రెండు చాప్టర్లకు వెయిటేజీ ఎక్కువ కావున వీలైనన్ని సార్లు పునశ్చరణ చేయాలి. 3-డి జ్యామితి కొంచెం సులువైన అంశం అయినప్పటికీ దిక్ సంఖ్యలు, దిక్ కొసైన్లకు అధిక సమయం కేటాయించాలి. కలనగణితంలో అవధులు, అవిచ్ఛిన్నతల్లో ఎడమ, కుడి అవధుల సమస్యల్ని జాగ్రత్తగా సాధన చేయాలి. అవధులను ఎన్ని రకాలుగా, ఏ విధంగా కనుగొంటారు, వాటి నియమాలపై దృష్టిపెట్టాలి. అవకలనాలు చాలా ప్రాముఖ్యమున్న చాప్టర్. మూలసూత్రంపై ప్రశ్నలు, అవకలనాలను కనుగొనే పద్ధతులు, వాటిపై ఆధారపడిన ప్రశ్నల్ని ఎక్కువ సాధన చేయాలి. అవకలనాల అనువర్తనాల్లో స్పర్శరేఖ; అభిలంబరేఖ; గరిష్ట-కనిష్ట విలువలు, ఎర్రర్స - అప్రాక్షిమేషన్స ప్రశ్నలపై ఎక్కువ ప్రాక్టీస్ అవసరం. 1-బి పేపర్ సుదీర్ఘమైనది కాబట్టి ప్రిపరేషన్లో టైం మేనేజ్మెంట్ కీలకమైంది. ఎంసెట్ ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు ప్రిపరేషన్తో పాటు ఆబ్జెక్టివ్ ప్రశ్నల సాధన పూర్తయ్యేటట్లు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎంసెట్కు ప్రిపరేషన్ మొదలుపెట్టే ముందు మొత్తం సిలబస్ను యూనిట్లుగా విభజించాలి. ఒక్కో యూనిట్కు ఎంత సమయం అవసరమవుతుందో చూసుకుని ప్రణాళిక వేసుకోవాలి. రెండో సంవత్సరం విద్యార్థులు ఐపీఈ ప్రిపరేషన్తో పాటు ఆబ్జెక్టివ్ ప్రశ్నల సాధన పూర్తయ్యేటట్లు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇలా చేస్తే ఐపీఈ పరీక్షల తర్వాత అందుబాటులో ఉన్న స్వల్ప వ్యవధిలో మెరుగైన పునశ్చరణకు అవకాశముంటుంది. ఎంసెట్లో ఫార్ములా ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫార్ములాలు, కాన్సెప్టులపై పట్టు సాధించాలి. బాగా కష్టంగా ఉన్న టాపిక్స్కు ఎక్కువ సమయం వెచ్చించకుండా వాటిలోని ముఖ్యమైన అంశాలను మాత్రమే ప్రిపేర్ కావాలి. పాత అంశాలపై పూర్తిస్థాయి పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. ప్రతిక్షేపణ పద్ధతుల్ని ఎప్పుడు అనుసరించాలనే దాన్ని నిశితంగా గమనించాలి. ఫార్ములాల అనువర్తనాలపై దృష్టిపెట్టాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి కాబట్టి ఆ దిశగా ప్రాక్టీస్ చేయాలి. పరీక్ష పది రోజులు ముందుకు జరిగిందనుకొని సిలబస్ను పూర్తిచేయాలి. ఆ పది రోజుల్లో మరోసారి ముఖ్యమైన అంశాలను పునశ్చరణ చేయగలిగితే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలించి, ఏ చాప్టర్లకు ఎక్కువ వెయిటేజీ ఇస్తున్నారో పరిశీలించి, వాటిపై శ్రద్ధపెట్టాలి. ఎంసెట్లో నెగటివ్ మార్కులు లేవు కాబట్టి అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. కష్టంగా ఉన్న ప్రశ్నకు సమాధానం గుర్తించే క్రమంలో సమయం వృథా చేయకూడదు. సక్సెస్ సోపానాలు: విద్యార్థులు సానుకూల ధోరణిని అలవరచుకొని, లక్ష్యం దిశగా పయనించాలి. ఇతరులతో పోల్చుకోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. ప్రిపరేషన్ లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి, సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నారో వాటిపై ఎక్కువ దృష్టిపెట్టాలి. సాధనకు లొంగనిది ఏదీ ఉండదనే విషయాన్ని గుర్తించాలి. వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేస్తూ, ప్రాక్టీస్ టెస్ట్లు ఎక్కువగా రాయాలి. టైం మేనేజ్మెంట్ను అలవరచుకొని, స్వీయ క్రమశిక్షణతో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఏ పరీక్షలోనైనా 30- 40 శాతం కష్టతరమైన, 25 శాతం సులభమైన, మిగిలినవి మధ్యస్థంగా ఉంటాయని భావించి ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలపై ఇప్పుడే దృష్టిపెట్టాలి. సెకండియర్లో చూసుకుందాంలే! అని అనుకోవద్దు. ఇప్పుడు ఆబ్జెక్టివ్పై శ్రద్ధ కనబర్చకుంటే సెకండియర్లో ఒత్తిడిని కోరికోరి ఆహ్వానించిన వారవుతారు. Self Confidence, Hard Work and Will Powerఅనేవి ఓ విద్యార్థిని విజయానికి దగ్గర చేసే మార్గాలని గుర్తుంచుకోవాలి. జేఈఈ పరీక్ష జేఈఈ మెయిన్: ఐపీఈ పరీక్షల తర్వాత చాలా తక్కువ వ్యవధిలో జేఈఈ మెయిన్ పరీక్ష ఉంటుంది. అందువల్ల మొత్తం సిలబస్ను డిసెంబర్ నాటికి పూర్తిచేయాలి. ఈ పరీక్ష సిలబస్కు, ఎంసెట్ సిలబస్కు కొంత తేడా ఉంది. దీన్ని గమనించి ప్రాధాన్యత గల చాప్టర్లను బాగా చదవాలి. జేఈఈ మెయిన్లో గంటలో 30 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. నెగటివ్ మార్కులు కూడా ఉన్నాయి. అందువల్ల ఎన్ని ప్రశ్నలకు సమాధానాల్ని గుర్తించామనే కన్నా ఎన్నింటికి కచ్చితమైన సమాధానాలు గుర్తించామన్నదే ముఖ్యం. స్టాటిస్టిక్స్, సరళరేఖలు (3-డి), మధ్యమ విలువల సిద్ధాంతాలు, మ్యాథమెటికల్ రీజనింగ్, సమితులు- సంబంధాలు చాప్టర్లను క్షుణ్నంగా ప్రాక్టీస్ చేయాలి. వీటి నుంచి ఒక్కో ప్రశ్న వస్తోంది. సంకీర్ణ సంఖ్యలు; మాత్రికలు; ప్రస్తారాలు, సంయోగాలు, సంభావ్యత; అవకలనం- వాటి అనువర్తనాలు; నిశ్చిత సమాకలనం; వైశాల్యాలు; అవకలన సమీకరణాలు; వృత్తాలు, శాంకవాలు; సదిశలు, సరళరేఖలు, త్రికోణమితి సమీకరణాలు, విలోమ త్రికోణమితి ప్రమేయాలు, త్రిభుజ ధర్మాలు నుంచి కచ్చితంగా రెండు, అంతకంటే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి వీటిని పూర్తిగా చదవాలి. గత ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే చాలా వరకు సులభమైన ప్రశ్నలు వచ్చాయి. ఎంసెట్తో పోల్చితే ఇందులో కొంత ఎక్కువ సమయం అందుబాటులో ఉంటుంది కాబట్టి కచ్చితమైన ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగిస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్: మిగిలిన పరీక్షలతో పోలిస్తే జేఈఈ అడ్వాన్స్డ్ కొంత భిన్నమైనది. ఇందులో కాన్సెప్ట్ల ఆధారిత ప్రశ్నలు వ స్తాయి. జేఈఈ అడ్వాన్స్డ్లో రెండు పేపర్లుంటాయి. దీని సిలబస్.. మెయిన్ సిలబస్ను పోలి ఉంటుంది. కానీ, ప్రశ్నలు ఇచ్చే విధానంలో తేడా ఎక్కువగా ఉంటుంది. పరీక్ష రాసేటప్పుడు ఏ ప్రశ్నలకు నెగటివ్ మార్కులున్నాయి? వేటికి లేవు? అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మెయిన్లో ప్రాధాన్యమున్న సబ్జెక్టులకే అడ్వాన్స్డ్లోనూ ప్రాధాన్యం ఉంది. గతేడాది ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే క్లిష్టంగా ఉండే ప్రశ్నలు దాదాపు 40 శాతం వరకు ఉన్నాయి. మెయిన్ పరీక్ష పూర్తయ్యాక అందుబాటులో ఉన్న సమయంలో అధ్యాపకుల సహాయంతో అన్ని అధ్యాయాల్లోని అంశాలనూ పునశ్చరణ చేయాలి. జేఈఈ మెయిన్తో పోలిస్తే అడ్వాన్సడ్ ప్రశ్నల తీరులో చాలా తేడా ఉంటుంది. అడ్వాన్సడ్ ప్రశ్నలు లోతుగా ఉండి, ఎక్కువ అంశాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి సబ్జెక్టుపై పట్టు సాధించాలి.