karimnagar disrtrict
-
‘సూటిగా కేసీఆర్ను అడుగుతున్నా మీ ఓట్లెవ్వరికని..?’
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ సభను సక్సెస్ చేసి కరీంనగర్ కాంగ్రెస్ కు కంచుకోట అని నిరూపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. ‘కరీంనగర్ జిల్లాకు దేశంలోనే ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే మూడో ఆర్థికశక్తిగా ఎదగడానికి ఘనత వహించిన పీవీ ఇక్కడివారు. అలాంటివారెందరికో కరీంనగర్ వేదిక. కరీంనగర్ చైతన్యవంతమైన వేదిక ఆనాడు ఆరు పార్లమెంట్, 42 అసెంబ్లీ స్థానాల్లో కేవలం మంథని, సంగారెడ్డిల్లో మాత్రమే మనకు శాసనసభ్యులుండె. అయినా, జీవన్ రెడ్డిని పట్టభద్రులు గెలిపించారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలని బీఆర్ఎస్ కోరుతుంది కదా మరి ఎవరిని వాళ్ళు గెలిపించాలని కోరుతున్నారో సమాధానం చెప్పాలి. సూటిగా కేసీఆర్ ను అడుగుతున్నా మీ ఓట్లెవ్వరికని..?, ఢిల్లీ కాళ్ళ ముందు బీఆర్ఎస్ నాయకులు సాగిలపడ్డారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేని బీఅర్ఎస్ ఉప ఎన్నికలు వేస్తే గెలుస్తామంటోంది. మీ నీతేంది, జాతేందని అడుగుతున్నా . ఈ 14 నెలల్లో మేం టీచర్స్ బదిలీలు, గ్రాడ్యుయేట్స్ కు ఉద్యోగాలు కల్పించకపోతే మాకు ఓటు వేయకండని నేనే చెబుతున్నా. పదకొండు వేల మంది ఉపాధ్యాయులకు ఓట్లెయకుంటే మీరు ఓటెయ్యొద్దని చెబుతున్నా . కేసీఆర్ జీతాలు కూడా ఇవ్వకుండా అడుక్కునేలా చేశాడు ఇవాళ మీ జీతాలు సమయానికి వేస్తున్నాం కదా ఆలోచించి ఓటేయండని కోరుతున్నా. ఐటీఐలను టాటాలతో కలిసి ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేశాం. క్రీడాకారులను ప్రోత్సహించేందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చాం. 60 ఎకరాల్లో 600 కోట్ల కార్పస్ ఫండ్ తో నాణ్యమైన విద్య కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చాం . ఇవన్నీ విప్లవాత్మక నిర్ణయాలు . ఇవన్నీ చూసి ఆలోచించి మాకు ఓటేయండి. నిఖిత్ జరీన్, సిరాజ్ వంటివారిని ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా..?, బీఆర్ఎస్ సీటును గుంజుకున్నామనే బీఆర్ఎస్ అక్కసు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. ప్రభుత్వానికి తెల్వకుండా ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావు నిధులడుగుతున్నామని చెప్పడమేంటి..?, బీఆర్ఎస్ రైతుబంధులో ఇచ్చిన దానికంటే తాలుతప్ప పేరిట ధాన్యం కోత పెట్టి పంచుకుందెక్కువ. పదేళ్లలో నువ్వు చేసిన దుర్మార్గాలు, 12 ఏళ్ల మోడీ నిర్లక్ష్యం పక్కనబెట్టి మమ్మల్ని ఓడగొట్టాలా?, సందెట్లో సడేమియా అన్నట్టు సంజయ్ బయల్దేరిండు. మా పొన్నం తెలంగాణా కోసం కొట్లాడిండు. ఈ సంజయ్ ఏం తెచ్చిండు..? చిల్లిగవ్వ తేలే.ఏం తేలేకపోయినా పర్లేదు.. పెద్ద బీసీ మోదీ, చిన్న బీసీ సంజయ్ బీసీ లెక్కలైనా తేల్చారా కనీసం?, కేసీఆర్ లెక్కలు నమ్మి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అవే చిలుకపలుకులు పలుకుతున్నారు 1979లోనే మండల్ కమిషన్ 29 ముస్లింలలోని తెగలను బీసీల్లో కలిపింది. బండికి అవగాహన లేకుంటే వారి అధికారులను కనుక్కోవాలని చెబుతున్నా. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీల్లో ముస్లింలను చేర్చలేదా.. మోదీ ఆ విషయాలు చెప్పలేదా..?, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వి చావు తెలివితేటలు. మతం పేరిట రెచ్చగొడితే రెచ్చిపోయే సమాజం కాదు తెలంగాణా. బండి సంజయ్ ని ఓర్వలేక అధ్యక్షుడి సీటు గుంజుకుండు. బండారు దత్తాత్రేయను పక్కకు జరిపి తాను సీటెక్కిండు. నేను పీసీసీ ప్రెసిడెంట్ గా పక్కకు జరిగి ఓ బీసీ అయిన మహేష్ గౌడ్ కు సీటు అప్పజెప్పినా. మోదీ కౌగిలిలో మందకృష్ణ నలిగిపోయిండు. ఈ ఎమ్మెల్సీ సీటు పోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయేదేముండదు. కానీ, దీనివెనుక బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర ఉంది’ అని రేవంత్ మండిపడ్డారు. -
పాలనలో ఆమె సంతకం
ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలువురు మహిళా అధికారులు. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో, వారి సమస్యలు పరిష్కరించడంలో ముందు వరుసలో ఉంటున్నారు. పురుష అధికారులతో సమానంగా విధులు నిర్వహిన్నారు. కిందిస్థాయి నుంచి మొదలుకొని జిల్లాస్థాయి అధికారిగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీస్, న్యాయ, రెవెన్యూ, విద్య, వైద్యం, మెప్మా, వ్యవసాయశాఖ తదితర శాఖల్లో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. – సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్ అర్బన్కీలక స్థానాల్లో వారే..ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు శాఖల్లోని కీలకమైన స్థానాల్లో మహిళా అధికారులే ఉన్నారు. ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ప్రతిమ, జగిత్యాల జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నీలిమ, కరీంనగర్ కలెక్టర్గా పమేలా సత్పతి, పెద్దపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా అరుణశ్రీ, పెద్దపల్లి డీసీపీగా డాక్టర్ చేతన, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రినిరెడ్డి, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా చాహత్ బాజ్పేయ్, కరీంనగర్ డీఎంహెచ్వోగా సుజాత, డీఏవోగా భాగ్యలక్ష్మి, జగిత్యాల డీఏవోగా వాణి, కరీంనగర్ సంక్షేమ అధికారిగా సరస్వతి, ఆర్టీసీ ఆర్ఎంగా సుచరిత, రామగుండం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా హిమబిందు సింగ్, పెద్దపల్లి సహకార శాఖ అధికారి శ్రీమాల, పెద్దపల్లి డీఈవోగా మాధవి, ఇంటరీ్మడియట్ నోడల్ అధికారిగా కల్పన, ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ అదనపు కమిషనర్గా నాయిని సుప్రియ.. ఇలా.. వివిధ శాఖల్లో మహిళా అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు.ఆలోచనా విధానం మారాలిజీవితంలో అనేక పాత్రలు పోషిస్తున్నా.. మహిళలపై ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి. ఈ అనాగరిక ధోరణి నుంచి మనిషి ఆలోచనా విధానం మారాలని నిపుణులు సూచిస్తున్నారు. రాజకీయ రంగంలోనూ మహిళలు దూసుకెళ్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుతో వారి ప్రాతినిధ్యం మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఏ సంస్థలోనైనా, ఏ రంగంలోనైనా తగిన శిక్షణ, సానుకూల వాతావరణాన్ని కల్పిస్తే వారు అనూహ్య ఫలితాలు సాధిస్తారు.మహిళల ప్రాతినిధ్యం పెరిగిందిఅటెండర్ నుంచి అంతరిక్షం వరకు ప్రతీ రంగంలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. నాకు అదనపు కలెక్టర్గా సేవలందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మహిళలు రాజకీయాల్లో వెనకబడి ఉన్నారు. సివిల్ సర్వీసులోకి వచ్చేవారు 7 శాతమే. విజయానికి ఆడ, మగ అనే తేడా లేదు. లక్ష్యాలను నిర్దేశించుకొని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఆడపిల్లలను ప్రోత్సహించేవారి సంఖ్య పెరుగుతోంది. అది వంద శాతానికి చేరాలి. – లక్ష్మీకిరణ్, అదనపు కలెక్టర్(రెవెన్యూ), కరీంనగర్యువతుల్లో చైతన్యం కనిపిస్తోందిపరిపాలనలో మహిళల భాగస్వామ్యం పెరిగింది. జిల్లాలో చైతన్యం ఎక్కువ. ఆడపిల్లలంటే ఒకప్పుడు వివక్ష ఉండేది. ఇప్పుడు మార్పు వచ్చింది. వ్యవసాయశాఖకు జిల్లా అధికారిగా పని చే యడం సంతోషంగా ఉంది. పల్లెల్లో సమావేశాల్లో పాల్గొన్నప్పుడు యువతుల్లో చైతన్యం కనిపిస్తోంది. స్వయం ఉపాధి పొందేవారు, ఉన్నత విద్యనభ్యసిస్తున్నవారిని చూస్తే గర్వంగా అనిపిస్తోంది.– భాగ్యలక్ష్మి, డీఏవో, కరీంనగర్చదువుతోనే సాధికారతచదువుతోనే మహిళా సాధికారిత సాధ్యమవుతుంది. ఎంచుకున్న రంగంలో ప్రతిభ చాటేందుకు ఇష్టంగా ముందుకుసాగాలి. ఎవరి జీవితం అనతికాలంలో ఉన్నతస్థానానికి చేరదు. కఠోర శ్రమ అవసరం. లక్ష్య సాధనకు నిర్విరామ కృషి ఉండాలి. ఆడవాళ్లు ఉన్నత చదువులు, ఉద్యోగాలకు పోటీపడాలి. ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో పరిపూర్ణత సాధించాలి. – అరుణశ్రీ, అదనపు కలెక్టర్, పెద్దపల్లిచట్టాలపై అవగాహన ఉండాలిమహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆత్మనిర్భరత, నిర్ణయం తీసుకునే అధికారం కలిగి ఉండాలి. విద్య, వృత్తి, వివాహం, కుటుంబ వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలి. ప్రభుత్వాలు మహిళల కోసం చేసిన చట్టాలు, న్యాయ సేవలపై ప్రతీ ఒక్కరికి అవగా హన ఉండాలి. పోలీస్శాఖలో గతంతో పోలిస్తే మహిళా సిబ్బంది ప్రాతినిధ్యం పెరిగింది.– డాక్టర్ చేతన, డీసీపీ, పెద్దపల్లిఆడపిల్లలను ప్రోత్సహించాలిఆడపిల్లలకు వయసు రాగానే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు. అలా కాకుండా, వారు ఎంచుకున్న లక్ష్యాలు సాధించేవరకు ప్రోత్సహించాలి. లక్ష్యసాధనకు తోడ్పాటునందించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆడవారిని ఎలా గౌరవించాలో నేర్పించాలి. మగ, ఆడ అనే తేడా లేకుండా అందరూ సమానమేనన్న భావన కలిగించాలి.– మాధవి, డీఈవో, పెద్దపల్లిచాలెంజ్గా తీసుకుంటాకోల్సిటీ(రామగుండం): కొన్ని రంగాల్లో మహిళలు చిన్నచూపునకు గురవుతున్నారు. వాటిని పట్టించుకోకుండా ప్రతీ పనిని చాలెంజ్గా తీసుకోవాలి. నేను చాలెంజ్తో ముందుకు సాగుతున్నా. పురుషుల కన్నా మహిళకు ఇల్లు, ఫ్యామిలీ, ఉద్యోగం, అనారోగ్య సమస్యలు చాలా ఉంటాయి. లీడర్షిప్ క్వాలిటీస్ విషయంలో సపోర్ట్ దొరకదు. నిలోఫర్ ఆస్పత్రిలో హెచ్వోడీగా చేస్తున్న నన్ను, ప్రభుత్వం అడిషనల్ డీఎంఈ క్యాడర్ హోదా కల్పిస్తూ ప్రమోషన్ ఇచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన రామగుండంలోని సిమ్స్ కాలేజీకి ప్రిన్సిపాల్గా రెండున్నరేళ్ల క్రితం బాధ్యతలు అప్పగించారు. తొలి ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టిన కొంతకాలం ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రొఫెషనల్ ఒత్తిళ్లతో బిజీగా ఉన్నా కుటుంబానికీ సమయం కేటాయిస్తా. – డాక్టర్ హిమబిందు సింగ్, ప్రిన్సిపాల్, సిమ్స్, గోదావరిఖని -
వరినారుతో మంత్రి కేటీఆర్కు బర్త్డే విషెస్!
కరీంనగర్: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్కు ఆదివారం పాలకుర్తి జెడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన స్వగ్రామమైన లింగాపూర్లో ఇండ్ల నరేష్, స్వప్న పొలంలో వరినారుతో హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అంటూ విషెస్ చెప్పి, కూలీలకు మిఠాయిలు పంచిపెట్టారు. -
Karimnagar: టీటీడీ ఆలయ నిర్మాణ పనులు పరిశీలన..మే 31న భూమి పూజ..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లోని పద్మానగర్లో పది ఎకరాలో స్థలంలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి తరహాలో ఆలయం నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి భూమి పనులను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, స్తపతులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..ఆలయ నిర్మాణ పనుల విషయమై టీటీడీ ఈవో, చైర్మన్ సుబ్బారెడ్డితో సమావేశమయ్యాం. మే 22న ఆలయ ప్రధానార్చకులు ఇక్కడకు వచ్చి భూమి పనులు పరిశీలిస్తారు. ఆ తర్వాత మే 31న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తోపాటు టీటీడీ అధికారుల సమక్షంలో భూమి పూజ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా, టీటీడీ ఏ రాష్ట్రంలోనైనా ఒకటే ఆలయం నిర్మిస్తుంది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఇప్పటికే హైదరాబాద్ హిమయత్ నగర్, జూబ్లీహిల్స్లో ఉన్నపటికీ, కరీంనగర్లోనూ తిరుపతి ఆలయం నిర్మించడానికి టీటీడీ కూడా ముందుకు రావడం విశేషం. కాగా పది ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని పూర్తి రాతితో తిరుమల తిరుపతి తరహాలో నిర్మిచనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. (చదవండి: మా పాప.. కాదు మా పాప!) -
Balagam Success Meet: కరీంనగర్ లో 'బలగం' మూవీ విజయోత్సవ వేడుక ( ఫొటోలు)
-
Telangana: ఎమ్మెస్సార్ మనవడొచ్చాడు.!
దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో MSR పేరు తెలియనివారు లేరు. తెలంగాణ కాంగ్రెస్ దిగ్గజంగా పేరు తెచ్చుకున్న ఎమ్మెస్సార్ మనవడు కరీంనగర్లో అరంగేట్రం చేయబోతున్నారు. కరీంనగర్ను డల్లాస్గా మారుస్తానని చెప్పిన కేసీఆర్ను ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్ సిటీ నాదే అంటున్న MSR మనవడి పోరాటం ఎలా ఉండబోతోందో చూద్దాం.. రోహిత్ పొలిటికల్ ఎంట్రీ కరీంనగర్ జిల్లాలో ఎం. సత్యనారాయణరావు పేరు తెలియనవారు ఉండరు. గాంధీల కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్న ఎంఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు. మంత్రి పదవులు అనుభవించారు. జిల్లాలో చాలా కాలం తర్వాత ఆయన వారసుడు రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎమ్మెస్సార్ మనవడు రోహిత్ రావ్ తాజాగా కరీంనగర్ సిటీ సమస్యలపై గళం ఎత్తుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఓ స్టింగ్ ఆపరేషన్ చేశారు. రెండు గంటల పాటు 15 బృందాలు డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై వీడియోలు, ఫోటోలు తీశారు. రోహిత్ రావ్ ప్రెస్ మీట్ పెట్టి తన స్టింగ్ ఆపరేషన్ వివరాలు వెల్లడించారు. రెండు గంటల్లోనే నగరంలో 300 సమస్యలు గుర్తించామని వెల్లడించారు. స్మార్ట్ సిటీ లక్ష్యం, ఉద్దేశం నెరవేరడం లేదని విమర్శించారు. నగరపాలక సంస్థ విఫలం అయ్యిందని వేలెత్తి చూపుతూ.. మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్లు దీనికి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచే పోటీ చేయబోతున్నట్లు తన కార్యక్రమాల ద్వారా రోహి స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా నుంచి కరీంనగర్ ఆస్ట్రేలియాలో చదువుకున్న ఎమ్మెస్సార్ మనవడు రోహిత్ రావ్ 2007 లోనే ఆస్ట్రేలియన్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కాంగ్రెస్ అనుబంధ సంస్థను స్థాపించారు. కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం కూడా తీసుకున్నారు. తర్వాతికాలంలో ఎమ్మెస్సార్ మరణంతో మనవడు రాజకీయ అరంగేట్రం కొంతకాలం ఆగింది. ప్రస్తుతం ఆయన కరీంనగర్లో ఎంట్రీ ఇచ్చి సీరియస్ రాజకీయాల్లోకి వచ్చేశారు. రాహుల్ గాంధీ వరంగల్ సభకు కేడర్ తో తరలివెళ్లారు. రాహుల్ జోడో యాత్రకు మద్దతుగా అవగాహన కల్పించేందుకు కరీంనగర్ నియోజక వర్గంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర చేశారు. వరదల సమయంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెస్సార్ మనవడిగా రోహిత్ రావ్ పోటీకి ఆసక్తి చూపిస్తున్నా.. టికెట్ రావడం కాంగ్రెస్ పార్టీలో పెద్ద విషయమే. కాని గతంలో ఇక్కడ నుంచి రెండు సార్లు కాంగ్రెస్ పోటీ చేసిన లక్ష్మీకాంతారావు టీఆర్ఎస్లో చేరడం.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం లోక్సభ సీటుపై ఆసక్తిగా ఉండటంతో.. ఈసారి కరీంనగర్ అసెంబ్లీ సీటు రోహిత్రావుకు దక్కవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు వెలమ.. ఇటు పద్మశాలి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి రోహిత్ రావ్ కు దాదాపు లైన్ క్లియర్ అయినట్టేనని భావిస్తున్నారు. ఎమ్మెస్సార్కు పార్టీలో ఉన్న పేరు ప్రతిష్టల కారణంగా ఆయన మనవడికి కాంగ్రెస్ టికెట్ కేటాయించే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఎన్నికల టైంకి టికెట్ ఆశించే వారు మరికొంత మంది ప్రత్యక్షం అవుతారనే టాక్ కూడా వినిపిస్తోంది. రోహిత్ రావ్ భార్య పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు. ఆ వర్గం ఓట్లు కూడా కరీంనగర్ లో ఎక్కువే. అందువల్ల పద్మశాలి వర్గం ఓట్లు తనకే పడతాయని రోహిత్ రావ్ భావిస్తున్నారు. ఒకవైపు తన వెలమ సామాజిక వర్గం...మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. మరి ఎన్నికల నాటికి ఎమ్మెస్సార్ రాజకీయ వారసుడి భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
Telangana: రోడ్లకు రోగం.. పరిస్థితి అధ్వానం!
ఇది యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి నుంచి ఆత్మకూర్ (ఎం) మండలం రాయిపల్లికి వెళ్లే రోడ్డు దుస్థితి. సుమారు 5కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు ఎక్కితే చాలు అంతా దుమ్మే. కొంత దూరంలో ఏముందో కూడా కనబడని పరిస్థితి. ప్రయాణికులతో పాటు రోడ్డుకు సమీ పంలోని ఇళ్లలో ఉంటున్నవారు దుమ్ముతో అనారోగ్యం పాలవుతున్నారు. వానలకు రోడ్డు గుంతలు పడటంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు, వాహనాలు దెబ్బతింటున్నాయి. రెండేళ్ల కిందే రోడ్డు పనులను మొదలుపెట్టినా ఇప్పటికీ పూర్తిచేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇటీవల కాటే పల్లికి చెందిన రాంరెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రికి వెళితే వైద్యులు పరీక్షించి దుమ్ము వల్లే సమస్య అని చెప్పారు. రాంరెడ్డి ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది. ఇప్పుడాయన కుటుంబం రాత్రిపగలు ఇంటి తలుపులు, కిటికీలు పెట్టుకునే ఉంటోంది. ఇక వాహనాల నుంచి వస్తున్న దుమ్ముతో పిల్లలు తరచూ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని, మాస్కులు పెట్టుకుని ఉంటున్నామని కాటేపల్లికి చెందిన పచ్చిమట్ల ప్రమీల వాపోయారు. పిల్లలను బయట ఆడు కోనిచ్చే పరిస్థితి లేదన్నారు. – సాక్షి, యాదాద్రి సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. ఇటీవలి వర్షాల కారణంగా దాదాపు అన్ని జిల్లాల్లో స్థానిక రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. గుంతలు పడి ప్రమాదకరంగా మారాయి. పలుచోట్ల రాష్ట్ర రహదారులు కూడా దెబ్బతి న్నాయి. దీంతో ఓ వైపు ప్రయాణికులు తీవ్రంగా అవస్థలు పడు తుంటే.. మరోవైపు ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,245 కి.మీల రహదారులు రోడ్లు–భవనాల శాఖ పరిధిలో ఉన్నాయి. ఇందులో 3,152 కి.మీ. రాష్ట్ర రహదారులు, 12,079 కి.మీ ప్రధాన జిల్లాలను కలిపే రహదారులు కాగా.. 9,014 కి.మీ ఇతర జిల్లాలను, పట్టణాలను కలిపే రోడ్లు. ఇటీవలి వర్షాల నష్టం నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల పరిస్థితిని ఆర్అండ్బీ అధికారులు పరిశీలించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో సగటున ప్రతీ నియోజకవర్గంలో 25 కిలోమీటర్ల మేర రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరముందని గుర్తించారు. మొత్తంగా 2,975కి.మీ.ల మేర రహదారులకు మరమ్మతులు అవ సరమని అంచనా వేశారు. అన్ని వివరాల మదింపునకు మరో పదిరోజులు పట్టవచ్చని అధికారులు చెప్తున్నారు. ఇక వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి చాలాచోట్ల కల్వర్టులు, కాజ్వేలు దెబ్బతి న్నాయి. వాటికి మరమ్మ తులు చేయ డం, కొత్తగా నిర్మించడం, అవస రమైన చోట బ్రిడ్జీల నిర్మా ణం చేపట్టడంపై అధికారులు దృష్టి సారించారు. రూ.714 కోట్లు అవసరం! సగటున ప్రతి నియోజకవర్గంలో రోడ్ల తక్షణ మరమ్మతుల కోసం కనీసం రూ.6 కోట్లు కావాలని అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా కలిపి రూ.714 కోట్లకుపైగా నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. వీటికి పరిపాలనా పరమైన అనుమతులు రాగానే ప్రభుత్వం జీవో విడుదల చేసి, నిధులు విడుదల చేస్తుందని అధికారులు చెప్తున్నారు. ఇక కుంగిన, కూలిన బ్రిడ్జీ లు, కల్వర్టుల కోసం ప్రత్యేకంగా నిధులు అవసరమని అంటున్నారు. చాలాచోట్ల ఇదే దుస్థితి.. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండా పూర్ వద్ద కాజ్వే వరదలకు కొట్టుకుపోయింది. తాత్కాలికంగా మట్టిరోడ్డు వేసి రాకపోకలు ప్రారంభించారు. వంతెన నిర్మాణం కోసం రూ.5.1 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదల వల్ల ఆర్అండ్ బీ రోడ్లు 109.3కి.మీ. మేర దెబ్బతిన్నాయని, రూ.123 కోట్లకుపైగా నష్టం జరిగిందని అధికారు లు గుర్తించారు. తక్షణ మరమ్మతుల కోసం రూ.22 కోట్లు విడుదల చేసి పనులు చేపట్టినట్టు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్అండ్బీ పరిధిలో 54 పెద్ద రోడ్లు, వందకుపైగా చిన్నరోడ్లు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు.ఆర్మూర్, బాల్కొండ, బోధన్, నిజామాబాద్ రూరల్, అర్బన్ సబ్ డివి జన్ల పరిధిలో రూ.22 కోట్ల అంచనాలతో మర మ్మతుల ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. ఖమ్మం–భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు వద్ద ప్రధాన రహదారి దుస్థితి ఇది. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం అక్కినాపురంతండా వద్ద తల్లాడ–కొత్తగూడెం ప్రధాన రహదారి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినోభానగర్–కొమ్ముగూడెం రోడ్డు కూడా దెబ్బతిని గుంతలు పడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్దవాగు బ్రిడ్జిలో ప్రజల ఇబ్బందులు ఆదిలాబాద్ జిల్లాలో కుప్పకూలిన అందెవెల్లి పెద్ద వాగు బ్రిడ్జి, దీనివల్ల రాకపోకల కోసం వాగులో తిప్పలుపడుతున్న ప్రజల చిత్రాలివి. భారీ వర్షా లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలాచోట్ల రోడ్లు, కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వెంకేపల్లి– చర్లగూడెం మధ్య ప్రధాన రహదారిపై కుంగిపోయిన కల్వర్టు ఇది. అధికారులు ఎన్నికల నేపథ్యంలో కంటి తుడుపు చర్యగా మట్టి పోసి చేతులు దులుపుకొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లె వాగుపై ఉన్న బ్రిడ్జి దుస్థితి ఇది. నల్లగొండ జిల్లాలోని చందంపేట, దేవరకొండ మండలాలకు వెళ్లే రోడ్డుపై ఉన్న ఈ బ్రిడ్జి వరదల వల్ల బాగా దెబ్బతిన్నది. ఇప్పటికీ మరమ్మతులు చేపట్టలేదు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రానికి, వేచరేణి గ్రామానికి మధ్య రోడ్డు ఇది. భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా తెగిపోయింది. వేచరేణి గ్రామస్తులు చుట్టూ తిరిగి చేర్యాలకు వెళ్లాల్సి వస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహము త్తారం మండలం యత్నారం– సింగంపల్లి గ్రామాల మధ్య దెబ్బతిన్న కల్వర్టు ఇది. ఫలితంగా సింగంపల్లి, మోదేడు, కొత్తపల్లి గ్రామాల ప్రజలు కాలినడకనే మండల కేంద్రానికి రావాలి. వాహనాల్లో వెళ్లాలంటే చుట్టూ 40 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. -
మీరు బయట తాగే వాటర్ ప్యూరిఫైడ్గా భావిస్తున్నారా.?
కరీంనగర్ అర్బన్: మీరు బయట తాగే వాటర్ ప్యూరిఫైడ్గా భావిస్తున్నారా.? మీ భావన తప్పు. మీరు అనారోగ్యానికి దగ్గర పడుతున్నారనేదే వాస్తవం. ఆరోగ్యం కోసం శుద్ధి చేసిన నీళ్లు తాగుతుంటే అవి అనారోగ్యానికి కేరాఫ్ అని చెబుతున్నారని అనుకుంటున్నారా.? అదే నిజం. ఒకసారి సరఫరా చేసే శుద్ధ జల కేంద్రానికి వెళితే అర్థం అవుతుంది. కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, కొత్తపల్లి, తిమ్మాపూర్, మానకొండూరు, గంగాధర, రామడుగు, శంకరపట్నం, తదితర ప్రాంతాల్లో సుమారు 800 వరకు శుద్ధ జల సరఫరా కేంద్రాలున్నాయి. పట్టణాల నుంచి పల్లెల దాకా విస్తరించాయి. వీటిలో బీఎస్ఐ అనుమతి ఉన్న కేంద్రాలు కేవలం నాలుగే ఉన్నాయి. మిగతావన్నీ నామమాత్రపు అనుమతితో నడుస్తున్నవే. నాణ్యత ప్రమాణాలు అటకెక్కగా తనిఖీల ఊసే లేదు. దీంఓ నీటి వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. జిల్లా అధికారులుండే కరీంనగరంలోనే వందల సంఖ్యలో కేంద్రాలు నడుస్తుండడం గమనార్హం. విచ్చలవిడిగా కేంద్రాలు.. లక్షల్లో వ్యాపారం జిల్లావ్యాప్తంగా అనధికారికంగా నిర్వహిస్తున్న వా టర్ ప్లాంట్లలో కరీంనగర్ నగర పరిధిలో 300 వర కు ఉన్నాయి. కూల్వాటర్, మినరల్ వాటర్ పేరుతో దందా నిర్వహిస్తున్నారు. ఎటువంటి అనుమ తి లేకుండా విచ్చలవిడిగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లపై ప్రభుత్వ నియంత్రణ కొరవడింది. నీటిని శుద్ధి చేసేందుకు వినియోగిస్తున్న యంత్రాలకు ప్రభుత్వపరంగా ఎటువంటి గుర్తింపూ లేకపోవడం గమనార్హం. గంటకు 2 వేల లీటర్ల నుంచి వెయ్యి లీటర్ల సామర్థ్యం గల వాటర్ ప్లాంట్లు నివాస ప్రాంతాల్లో చిన్న చిన్న గదుల్లో నిర్వహిస్తున్నారు. ∙వాటర్ ప్లాంట్లలో వినియోగించే పైపులు, నిల్వ చేసే ట్యాంకులు స్టీలువి వినియోగించాల్సి ఉండగా ప్లాస్టిక్ వాడుతున్నారు. ప్రతిరోజూ సరఫరా అయ్యే నీటిని తనిఖీలు చేయాల్సి ఉన్నా ఏ ఒక్కచోటా అది జరగడం లేదు. నీటి కోసం మున్సిపల్ శాఖ అనుమతి లేకుండానే బోర్లు వేస్తున్నారు. అక్కడ వచ్చిన నీటిని పరీక్షించి దానికనుగుణంగా యంత్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా అలా జరగడం లేదు. ∙నీటి నిల్వకు కనీసం ఏడు సెంట్ల స్థలం కావాల్సి ఉండగా 200 అడుగుల గదుల్లోనే ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. నామమాత్రంగా శుద్ధి చేసి క్యానుల్లో నింపుతున్నారు. క్యాన్లను వేడి నీటిని ఉపయోగించి ప్రెజర్ బ్రష్లతో చేయాల్సి ఉండగా దానిని పూర్తిగా విస్మరించారు. మున్సిపల్ కుళాయిల్లో వస్తున్న నీటినే క్యాన్లలో నింపి మినరల్ వాటర్ పేరుతో విక్రయించి సొమ్ముచేసుకునే వారూ ఉన్నారు. కేంద్రంలో ఇవి తప్పనిసరి సాధారణంగా వాటర్ ప్లాంట్ను నెలకొల్పాలంటే అందుకు మున్సిపాలిటీల్లో కమిషనర్, గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శి నుంచి ముందస్తుగా నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ విధిగా పొందాలి. ఎన్వోసీ ఆధారంగా ప్లాంటు స్థాపించేందుకు విద్యుత్ శాఖ నుంచి కనెక్షన్ కోసం అనుమతి పొందాలి. శుద్ధజల కేంద్రాన్ని నిర్వహించాలంటే భారత ప్రమాణాల సంస్థ నిర్ణయించిన నిబంధనల ప్రకారం మైక్రో బయోలజిస్టు, కెమిస్టులు ఉండాలి. శుద్ధి చేసిన నీటిలోని పీహెచ్ను పరీక్షిస్తూ ఉండాలి. పీహెచ్ 7.5శాతం కంటే తగ్గితే కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తగా నీటి «శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే కనీసం 10 గదులుండాలి. ఫిల్లింగ్ సెక్షన్, ఆర్వో సిస్టంలో మూడు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన డ్రమ్ములు ఏర్పాటు చేయాలి. శుద్ధి చేసిన నీటిని నిల్వ చేసేందుకు 304 గ్రేడ్ స్టెయిలెస్ స్టీలు డ్రమ్ములు వాడాలి. ఈ నీటికి తప్పకుండా ఓజోనైజేషన్ చేయాలి. మినరల్ వాటర్ను బబుల్స్(క్యాన్)లోకి పట్టే ముందు అల్ట్రావయోలెట్ కిరణాలతో శుద్ధి చేయాలి. క్యాన్లను ప్రతీసారి పొటాషియం పర్మాంగనేట్ లేదా హైపో సొల్యూషన్తో శుభ్రం చేయాలి. వీటిని శుద్ధి చేసిన తేదీ బ్యాచ్ నంబర్ను సీలుపై ముద్రించాలి. శానిటరీ అధికారులతో ప్రతినెలా నీటిని పరీక్షింపజేసి బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)కు పంపించాలి. నాణ్యత ప్రమాణాలను ఫుడ్ కంట్రోల్ శాఖాధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు వాటర్ ప్లాంట్ల వైపు కన్నెత్తి చూడకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమాణాలు పాటించకుంటే రుగ్మతలకు అవకాశం ఆల్కలైన్ తగిన మోతాదులో వాడకపోతే ఎముకల పటుత్వంలో సమస్యలు ఏర్పడుతాయి. సరైన శుద్ధి చేయకుండా నీరు తాగడం వలన గొంతు సంబంధ సమస్యలు, ఒంటినొప్పులు, వివిధ రకాల రుగ్మతలు వస్తాయి. ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్లు, క్యాన్లలో ఎక్కువ కాలం నిలువ ఉంచిన నీరు తాగడం వలన క్యాన్సర్లు వచ్చే ప్రమాదముంది. వాటర్ ప్లాంట్లు పరిశుభ్రత విషయంలో నిబంధనలు పాటించకున్నా వ్యాధులు వస్తాయి. – డా.సాయిని నరేందర్, ఎండీ చెస్ట్ క్రిటికల్ కేర్ -
ఎదురేమొచ్చినా తగ్గేదేలే! రాంగ్ రూట్లో రయ్.. రయ్!
‘కరీంనగర్ పట్టణంలో నివాసం ఉండే విశ్రాంత ప్రభుత్వ లెక్చరర్ పాపారావు దంపతులు ఈనెల 12న పనినిమిత్తం హైదరాబాద్కు కారులో బయల్దేరారు. సిద్దిపేట జిల్లా మల్లారం వద్ద రాంగ్రూట్లో వస్తున్న లారీ వీరి కారును ఢీకొట్టింది. పాపారావు దంపతులతో పాటు కారు డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా విషాదం నింపింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాలు తీసింది.’ ‘కరీంనగర్లోని ఓ కార్ల షోరూంలో పనిచేస్తున్న లక్ష్మణ్ అనే వ్యక్తి వారం రోజుల క్రితం భోజనం చేసేందుకు బైక్పై ఇంటికి వస్తున్నాడు. కోతిరాంపూర్ సమీపంలో రాంగ్రూట్లో వస్తున్న మరో బైక్ ఇతడిని ఢీకొట్టింది. లక్ష్మణ్ తలకు తీవ్రగాయం కాగా.. సకాలంలో ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రాణాలకు ముప్పు తప్పింది.’ కరీంనగర్క్రైం: నిబంధనలు పాటించండి.. ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండంటూ ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా కొందరు వాహనదారుల్లో మార్పురావడం లేదు. రాంగ్రూట్లో రయ్రయ్మంటూ దూసుకెళ్తుండడంతో ఎదురుగా వచ్చేవారు అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిన దుస్థితి. రద్దీగా ఉండే కరీంనగర్ సిటీతో పాటు వేగంగా వాహనాలు దూసుకొచ్చే హైవేల పైనసైతం రాంగ్రూట్లలో వెళ్తూ ప్రాణాలు తీస్తున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం నిండు జీవితాన్ని చీకటిమయం చేస్తుండగా పోలీసులు, రవా ణాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నా వాహనదారుల్లో మార్పురావడం లేదు. కరీంనగర్ పట్టణంలో రాంగ్రూట్ ప్రాంతాలు ► కల్పన హోటల్ నుంచి ఎస్బీఐ కమాన్ బ్రాంచ్ వైపు ► పోచమ్మవాడ నుంచి కమాన్ వైపు ► కోతిరాంపూర్ చౌరస్తా వద్ద ► విద్యుత్ కార్యాలయం, జిల్లా కోర్టు సమీపంలో ఎస్సారార్ కళాశాల సమీపంలో ► బైపాస్ ఎన్టీఆర్ చౌరస్తా ► ఆదర్శనగర్ బోర్డు నుంచి మంచిర్యాల చౌరస్తా వైపు ► రాంనగర్ చౌరస్తా.. మంకమ్మతోట ► తెలంగాణ చౌక్ ప్రాంతం (పోలీసులు మొత్తం 12 రాంగ్రూట్ ప్రాంతాలను గుర్తించారు) నగరంలో యథేచ్ఛగా.. కొన్నాళ్లక్రితం వరకు నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటుచేసి పలు కూడళ్లవద్ద రాంగ్రూట్లలో వెళ్లేవారిపై నిఘాపెట్టేవారు. రాంగ్రూట్లలో వెళ్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించేవారికి ఈ– చలాన్లు విధించేవారు. ఇప్పటికీ పలుచోట్ల ఈ పద్ధతి అమలు చేస్తున్నా.. చాలా వరకు కూడళ్ల వద్ద పోలీసు నిఘా కనిపించని పరిస్థితి నెలకొంది. 12 కూడళ్ల వద్ద రాంగ్రూట్ డ్రైవింగ్ ఎక్కువగా ఉంటోంది. రాజామెస్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు, కోతిరాంపూర్లో, పోచమ్మవాడ నుంచి కమాన్వైపు, కల్పన హోటల్ నుంచి కమాన్ ఎస్బీఐ బ్యాంకు వైపు రాంగ్రూట్లో ఎక్కువగా వెళ్తున్నారు. అదే విధంగా మంకమ్మతోట, గీతాభవన్, విద్యుత్శాఖ కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో రాంగ్రూట్లలో వెళ్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రమాదాల బారిన పడుతుండగా.. సిటీలో మరణాలు తక్కువే. ఇక మెయిన్రోడ్లపై కూడా రాంగ్రూట్ డ్రైవింగ్ ఎక్కువగా ఉంటోంది. ప్రధానంగా హైదరాబాద్ జాతీయరహదారిపై రాంగ్రూట్లో ఎక్కువ వాహనాలు వెళ్తున్నాయి. కాకతీయ కాలువ, ఇంజినీరింగ్ కళాశాలలు, తిమ్మాపూర్ నుంచి మొదలుకుని నుస్తులాపూర్ వరకు కూడా పలు ప్రాంతాల్లో రాంగ్రూట్లలో వెళ్తు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రూట్లో రాంగ్రూట్ మరణాలు సైతం ఎక్కువే. నగరంలోని పలుచోట్ల ఏర్పాటుచేసిన డివైడర్లను రాకపోకలకు అనుగుణంగా మార్చాలని, తద్వారా రాంగ్రూట్ ఇబ్బంది ఉండదని సిటీ ప్రజలు అంటుండగా.. రాంగ్రూట్లో వెళ్లే వాహనాలపై నిఘా పెడుతున్నామని, నిత్యం జరిమానా విధిస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. రాంగ్రూట్.. వెరీ డేంజర్ రాంగ్రూట్లో వెళ్లకుండా పోలీసులు, రవాణాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నా తీరుమారడం లేదు. రోజురోజుకు రాంగ్రూట్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ రెండు,మూడు నెలల్లోనే రాంగ్రూట్ ప్రమాదాలు జిల్లాలో 20కి పైగా చోటుచేసుకున్నాయి. జరిమానాలు విధించినా తీరు మార్చుకోవడం లేదని పోలీసులు చెబుతున్నారు. యువత మద్యం మత్తులో రాంగ్రూట్లో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కరీంనగర్ సిటీతో పాట జిల్లావ్యాప్తంగా రాంగ్రూట్లో వెళ్లేప్రాంతాలను పోలీసులు, రవాణా అధికారులు గుర్తించి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
కరీంనగర్లో దంచికొట్టిన వాన..కుప్పకూలిన 70 అడుగుల లైటింగ్ కటౌట్
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం దంచికొట్టింది. కొన్నిచోట్ల ఈదురుగాళ్లతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. భారీ వర్షంతో కరీంనగర్ పట్టణంలోని గీతా భవన్ సెంటర్లో ఉన్న 70 అడుగుల ఎత్తైన శ్రీ రాముడి పట్టాభిషేక లైటింగ్ కటౌట్ కూలిపోయింది. ఫిబ్రవరిలో జరగబోయే బ్రహ్మోత్సవాల్లో రాముడి పట్టాభిషేకాన్ని ఆవిష్కరించేలా ఆలయ కమిటీ అధికారులు సుమారు రూ. 45 లక్షలు ఖర్చు చేసి ఈ భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. వారం రోజుల నుంచి రాత్రి వేళల్లో కటౌట్ ఆకట్టుకుంటోంది. అయితే సర్కిల్లోనే కట్టెలు కూలడంతో ప్రమాదం తప్పింది. చదవండి: గాంధీ, ఉస్మానియాలో కరోనా కలకలం.. 94 మంది వైద్యులు, సిబ్బందికి పాజిటివ్ గాలుల ధాటికి విద్యుత్ దీపాల అలంకరణ లుమినార్ నేలకొరిగింది. జిల్లాలోని చొప్పదండి, రామడుగు, మానుకొండూరు, పెద్దపల్లి, శంకరపట్నం, జమ్మికుంట మండలలాల్లోనూ భారీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిలఆలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ స్థాయిలో గాలులు వీడయంతో సిరిసిల్ల విద్యానగర్లో విద్యుత్ స్తంబాలు, చెట్లు విరిగిపోయాయి. #Karimnagar, Heavy rains and gales recently installed mark of Sri Venkateshwara Swamy anual fete Rama Pattabhi shekam scaffold illumination structure collapsed, luckily no one injured. few days back installed at Telangana chowk. pic.twitter.com/LT3RzuTmtX — naveenkumar (@naveen_TNIE) January 11, 2022 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రారంభం పదుల్లోనే...!
సాక్షి, హైదరాబాద్: దళితబంధు ఉపాధి యూనిట్ల ప్రారంభం నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అమలు చేసింది. దళిత కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుని స్థిరపడాలనే లక్ష్యంతో యు ద్ధప్రాతిపదికన అమలుకు ఉపక్రమించింది. ఈ క్రమంలో సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రితోపాటు హుజూరాబాద్లో 20వేల దళిత కుటుంబాలకు సాయం అందించేలా నిర్ణయించగా, ఇప్పటివరకు 18,064 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమచేసింది. ఒక్కో లబ్ధిదారు నుంచి దళిత రక్షణ నిధి కింద రూ.10వేల చొప్పున వెనక్కు తీసుకోవడంతో ఒక్కొక్కరి ఖాతాలో రూ.9.90 లక్షలు నిల్వ ఉన్నాయి. లబ్ధిదారు ఏర్పాటుచేసే యూనిట్కు కలెక్టర్ అనుమతితో నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల్లో ఇప్పటివరకు యాభైలోపు యూనిట్లు మాత్రమే ప్రారంభమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎంపికలో జాప్యం... ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భారీగా ఆర్థిక లబ్ధి కలిగే కేటగిరీలో దళితబంధు రెండోది. ఓవర్సీ స్ విద్యానిధి పథకం కింద ఎంపికైన విద్యార్థికి రూ.20 లక్షలు ఆర్థిక సాయం చేస్తుండగా... దళితబంధు కింద రూ.10 లక్షలు ఇస్తున్నారు. అయితే దళితబంధు లబ్ధిదారుల సంఖ్య విద్యానిధి లబ్ధిదారుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. దళితబంధు లబ్ధిదారుడు ఆర్థిక వనరుల అభివృద్ధిలో భాగంగా ఒక ఉపాధిని ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఎస్సీ కార్పొరేషన్ 120 రకాల ఆలోచనలతో లబ్ధిదారులకు అవగాహన కల్పించింది. అయినా చాలామంది ఇప్పటికీ ఉపాధి యూనిట్ను ఖరారు చేసుకోలేదు. కేవలం 6 వేల మంది మాత్రమే కార్లు, ట్రాక్టర్లు, డెయిరీ, పౌల్ట్రీ యూనిట్లను ఎంచుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలను సైతం అధికారులకు ఇవ్వలేదు. ఆయా యూనిట్లు, వాటి నిర్వహణ తదితరాలపై స్పష్టత ఉన్నప్పుడే కలెక్టర్ ఆమోదంతో ఖాతాలోని నిధులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికీ ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉంది. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్తో... హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఆ తర్వాత శాసన మండలి ఎన్నికలు రావడంతో దాదాపు రెండున్నర నెలలు ఎన్నికల కోడ్ అమలైంది. అందువల్ల దళితబంధు యూనిట్ల ఏర్పాటులో జాప్యం జరిగినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కోడ్ తొలగిపోవడంతో నెలాఖరులోగా యూనిట్లను ప్రారంభించే ప్రక్రియను వేగవంతం చేస్తామని అంటున్నాయి. అయితే, మెజార్టీ లబ్ధిదారులు ఇంకా యూనిట్లను ఎంపిక చేసుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో గ్రౌండింగ్ ప్రక్రియ మరింత ఆలస్యంకానుంది. -
పాడెపై తల్లి.. తనయుల ఆస్తి లొల్లి
జమ్మికుంట: అనారోగ్యంతో తల్లి చనిపోతే అంత్యక్రియలు పూర్తిచేయాల్సిన తనయులు శవాన్ని ఇంటిముందే ఉంచుకుని పంపకాల పంచాయితీ మొదలుపెట్టారు. కన్నతల్లి శవాన్ని కాటికి పంపక ముందే ఖర్చుల విషయంలో గొడవపడ్డారు. ఈ అమానవీయ ఘటనను చూడలేకపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో నివసించే సూదం అనసూర్య (85)కు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు. ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిన భర్త రాజవీరు గతంలోనే చనిపోయారు. అప్పటినుంచి డిపెండెంట్ పింఛన్ అధారంగా అనసూర్య జీవనం సాగిస్తోంది. కొన్నినెలల క్రితం అనారోగ్యానికి గురికావడంతో జమ్మికుంటలోని చిన్నకొడుకు వద్ద ఉంటూ.. బుధవారం సాయంత్రం చనిపోయింది. వీణవంక మండలం గన్ముకులలో స్థిరపడిన మిగతా ముగ్గురు కొడుకులు జమ్మికుంటకు చేరుకున్నారు. తల్లి అంత్యక్రియలు, కర్మకాండలకు అయ్యే ఖర్చు, తల్లికి వస్తున్న పింఛన్, నివాసం ఉంటున్న ఇల్లు, ఇతర ఆస్తుల విషయం గురువారం నలుగురు కొడుకుల మధ్య గొడవకు దారితీసింది. చిన్నకొడుకు మిగతా ముగ్గురిని అంత్యక్రియల తరువాత వెళ్లిపోవాలని సూచించడంతో నలుగురి మధ్య పంచాయితీ ఏర్పడింది. తల్లి మృతదేహాన్ని ఇంటిముందు ఉంచుకుని గొడవలేంటని కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై సతీశ్ అక్కడకు చేరుకుని మృతురాలి కుమారులకు కౌన్సెలింగ్ ఇచ్చి కార్యక్రమం పూర్తిచేసేలా చూశారు. -
‘చల్మెడ’లో మరో ఐదుగురికి కరోనా
కరీంనగర్ రూరల్: కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన చల్మెడ ఆనందరావు వైద్య కాలేజీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం మరో 50 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి పాజిటివ్గా తేలింది. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడిన మొత్తం వైద్య విద్యార్థుల సంఖ్య 50కి చేరింది. శనివారం కరోనా లక్షణాలతో ఉన్న వైద్య విద్యార్థులకు ఆదివారం పరీక్షలు నిర్వహించగా.. 45 మందికి పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ, డీఎంహెచ్వో డాక్టర్ జునేరియా మెడికల్ కాలేజీని సందర్శించి యాజమాన్యంతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 500 మంది వైద్య విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. కరోనా బాధితులందర్నీ హోంక్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. -
ధాన్యం తూకం వేయరా
చిగురుమామిడి: ధాన్యం తూకం వేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో కొందరు రైతులు పురుగు మందు డబ్బాతో మంచినీటి ట్యాంకు ఎక్కి నిరసనకు దిగారు. గురువారం ఉదయం కొనుగోలు కేంద్రంలో కాటాలు నిలిచిపోవడంతో ఆగ్రహించిన మరికొందరు రైతులు సెంటర్లోనే ధర్నాకు దిగారు. ఓ వైపు ట్యాంకు ఎక్కిన రైతులు, మరోవైపు కింద రైతుల ధర్నాతో ఏం చేయాలో పాలుపోక కేంద్రం నిర్వాహకులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారుల రాక ఆలస్యం కావడంతో రైతులు ఆగ్రహించారు. తమ ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తూకం వేయడం లేదని, రైసు మిల్లు యజమానులు నూక పేరుతో బస్తాకు మూడు నుంచి నాలుగు కిలోలు కట్ చేస్తున్నారని ఆరోపించారు. నూకలవుతున్నాయనే సాకుతో 43 నుంచి 44 కిలోలు తూకం వేస్తూ రైతులను ముంచుతున్నారని వాపోయారు. రైతు సంఘం మండల కన్వీనర్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు బందెల శ్రీనివాస్, గట్టు జనార్దన్, మురళి, అందె రాయమల్లు, కుట్ల శ్రీనివాస్, గుమ్మడి బాలయ్య, మరో ఇద్దరు రైతులు ట్యాంకు పైనే ఉండగా.. అధికారులు స్పందించకుంటే పురు గు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామని పలుమార్లు హెచ్చరించారు. సమాచారం అందుకున్న చిగురుమామిడి తహసీల్దార్ ముబీన్అహ్మద్, నయాబ్ తహసీల్దార్ చంద్రశేఖర్, చిగురుమామిడి ఎస్ఐ దాస సుధాకర్, ఐకేపీ సీసీ వెంకటేశ్వర్లు తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. ఎలాంటి కొర్రీలు లేకుండా మిల్లర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ట్యాంకు ఎక్కిన రైతులు కిందకు దిగారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అందె స్వామి తదితరులు పాల్గొన్నారు. -
రెండు జిల్లాల్లో ఎన్నికల కోడ్
కరీంనగర్ అర్బన్: హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో మొత్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ గురువారం తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల క్రమంలో కోడ్ పక్కాగా అమలవుతుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని కోరారు. -
రూ. 5 వేల కోట్లు తెచ్చి ఓట్లు అడగండి
హుజూరాబాద్: బీజేపీ నాయకులు ఢిల్లీ వెళ్లి హుజూరాబాద్ అభివృద్ధికి రూ.5 వేల కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని, అప్పుడే ఓట్లు అడగాలని మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తోంది టీఆర్ఎస్ సర్కారేనని తెలిపారు. అందుకే తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్, వీణవంక మండలం నర్సింగాపూర్కు చెందిన పలువురు యువకులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలనుంచి టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి హరీశ్రావు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ ఎంపీగా గెలిచి రెండున్నరేళ్లు అయిందని, వీణవంకలో రూ.10 లక్షల పనైనా చేశారా..? అని ప్రశ్నించారు. ఉప ఎన్నికలో బీజేపీని గెలిపిస్తే లాభం ఏంటో చెప్పాలని, ఈటల గెలిస్తే వ్యక్తిగా ఆయనకు, బీజేపీకి లాభమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయం సాధిస్తే హుజూరాబాద్ ప్రజలకు లాభమని అన్నారు. ఇదిలా ఉండగా జమ్మికుంటలో కూడా మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలనుంచి దాదాపు 500 మంది నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో చేరకముందే హుజూరాబాద్ ప్రాంతం గులాబీ అడ్డాగా ఉండేదని అన్నారు. టీఆర్ఎస్లోకి ఆయన ఒక్కరే వచ్చారని, ఇప్పుడు కూడా ఒక్కరే బయటకు వెళ్లిపోయారని పేర్కొన్నారు. -
ఏడాదిలో ఆదాయం రెట్టింపవ్వాలి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అనుభవం, వృత్తి నైపుణ్యత ఆధారంగా ఏడాదిలోగా రెట్టింపు ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని దళితబంధు లబ్ధిదారులకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. హుజూరాబాద్లో దళితబంధు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా ఆర్థిక సాయం పొందిన 15 మంది లబ్ధిదారులకు మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో కర్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు కింద యూనిట్ల ఎంపికకు తొందరపడొద్దని, వారంపాటు సమయం ఇస్తామని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులు కొత్తగా దళితబంధు ఖాతాలు తెరవాలని సూచించారు. యూనిట్ స్థాపించుకునేందుకు కుటుంబ సభ్యులతో చర్చించి ఎంపిక చేసుకోవాలన్నారు. యూనిట్ల ఎంపికపై జిల్లా అధికారులతో పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ల నిర్వాహణకు 10–15 రోజులు పూర్తి స్థాయిలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఉచితంగా వృత్తి నైపుణ్యత శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. అవగాహన సమావేశానికి హాజరైన 15 మంది లబ్ధిదారుల్లో కొందరు పాడి గేదెలు (డెయిరీ యూనిట్లు), గూడ్స్ ట్రెయిలర్, ట్రాక్టర్ ట్రెయిలర్, కారు, సూపర్ బజార్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, లేడీస్ ఎంపోరియం యూనిట్ ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. వాహనాలు ఎంపిక చేసుకున్న వారికి బుధవారం లెర్నింగ్ లైసెన్సు జారీ చేయాలని డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమాధికారి నేతనియల్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డా.నరేందర్, ఎల్డీఎం లక్ష్మణ్, ఆర్సెటీ మేనేజర్ దత్తాత్రేయ, నాబార్డు ఏజీఎం అనంత్ పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులను కరీంనగర్లోని విజయపాల డెయిరీకి తీసుకెళ్లారు. పాల శీతలీకరణ, పెరుగు, నెయ్యి తయారీ, మజ్జిగ, బట్టర్ మిల్క్, బాదాం మిల్క్ తయారీలు, దాణా, గడ్డి పెంపకం, శిలీంద్ర మొక్కలు పెంపకం, గడ్డి కత్తిరించే యంత్రాలు ఆవుల షెడ్ వాటి నిర్వహణ తదితర విషయాలపై అవగాహన కల్పించారు. -
Huzurabad: ఈటలను దెబ్బకొట్టేందుకు టీఆర్ఎస్ రోడ్మ్యాప్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాషాయ తీర్థం పుచ్చుకునే తేదీ ఖరారైంది. ఈనెల 14న ఢిల్లీలో ఆయన బీజేపీ జాతీయ నాయకుల సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నారు. ఈ మేరకు శామీర్పేటలోని నివాస గృహానికి బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులంతా వచ్చి ఈటలను పార్టీలోకి ఆహ్వానించారు. ఈటలతోపాటు జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ కూడా బీజేపీలో చేరనున్నారు. ఇదంతా ఊహించినదే అయినా.. ఈటల బీజేపీలో చేరిన తరువాత చోటు చేసుకునే పరిణామాలపై ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. బీజేపీలో చేరడానికి ముందే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుండడంతో ఉప ఎన్నికకు శంఖారావం ఊదినట్టే. ఈ పరిస్థితుల్లో గెలుపు కోసం ఈటల తరఫున బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రణరంగంలోకి దిగబోతున్నాయి. ఈటలను హుజూరాబాద్లో ఓడించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ఇప్పటికే పక్కా ప్రణాళికతో రోడ్మ్యాప్ సిద్ధం చేసింది. బీజేపీ కూడా అందుకు రెడీ అయింది. టీఆర్ఎస్ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో హరీశ్రావు నేతృత్వంలోని కమిటీ ఉప ఎన్నికను పర్యవేక్షించనుంది. బీజేపీ తరఫున హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు ఇన్చార్జీలుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను నియమించారు. ఈ నెల 15 నుంచి వీరంతా కార్యరంగంలోకి దిగనున్నారు. పర్యవేక్షకులుగా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఎన్నిక ఆసక్తి రేపుతోంది. సీఎం కేసీఆర్తో గంగుల భేటీ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఖాయమని తేలిన నేపథ్యంలో సీఎం కేసీఆర్తో మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. హుజూరాబాద్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, టీఆర్ఎస్ ముఖ్య నేతలు మండలాల వారీగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు, టీఆర్ఎస్ శ్రేణుల వైఖరి తదితర అంశాలను సీఎంకు వివరించినట్లు సమాచారం. మండలాల వారీగా సమావేశాలు జరుపుతున్నప్పుడు ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల కనిపిస్తున్న అభిమానం, ఈటలపై వ్యతిరేకతను కూడా ఆయన వివరించినట్లు తెలిసింది. హుజూరాబాద్లో విజయమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో పనిచేయాలని సీఎం సూచించినట్లు సమాచారం. కాగా.. 13, 14 తేదీల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో మండలాల వారీగా చేపట్టబోయే కార్యక్రమాల రోడ్ మ్యాప్ను ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులు సిద్ధం చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు వి.సతీశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్రావు, రమేశ్, చల్లా ధర్మారెడ్డి ఐదు మండలాల్లో పర్యటిస్తూ ప్రజలను, కార్యకర్తలను టీఆర్ఎస్కు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నారు. బీజేపీ ఇన్చార్జీల నియామకం ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఖాయం కావడంతో ఆ పార్టీ కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. 14న ఈటల ఢిల్లీలో బీజేపీలో చేరిన వెంటనే హుజూరాబాద్లో కార్యరంగంలోకి దిగాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. శుక్రవారం రాత్రి నియోజకవర్గంలో మండలాల వారీగా బీజేపీ ఇన్చార్జీలను నియమించారు. కమలాపూర్కు ధర్మపురి అర్వింద్, హుజూరాబాద్కు ఎమ్మెల్యే రఘునందన్ రావు, వీణవంకకు సోయం బాపూరావు, జమ్మికుంట, ఇల్లంతకుంటలకు ఎమ్మెల్యే రాజాసింగ్లను నియమించారు. పర్యవేక్షకులుగా బండి సంజయ్, కిషన్రెడ్డి వ్యవహరిస్తారు. చదవండి: ఈటలపై బరిలోకి కౌశిక్రెడ్డి?! -
కొత్త జోన్లు: మన ఉద్యోగాలు ఇక మనకే!
కరీంనగర్ అర్బన్: రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థకు రాజముద్ర పడింది. ఇక నియామకాల్లో నూతన అధ్యాయం మొదలు కానుంది. ఏ స్థాయి పోస్టులైనా 95 శాతం స్థానికులకే అవకాశం దక్కనుంది. ఈ క్రమంలో శాఖల వారీగా ఖాళీ పోస్టుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. నూతన జోన్ల ప్రకారమే పోస్టుల భర్తీ ఉండనుందని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న విధానానికి మంగళం పాడుతూ నూతన విధానాన్ని ప్రవేశపెట్టగా గత లోపభూయిష్ట విధానాలకు చరమగీతం పాడుతూ అటెండర్ నుంచి గెజిటెడ్ అధికారి వరకు అన్ని శాఖల్లో ఒకే విధానముండేలా సవరణలు చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల్లో ఉన్న భయాందోళనలను తొలగిస్తూ పాత ఉద్యోగులు అలాగే ఉండనుండగా జారీ అయ్యే ఉద్యోగ ప్రకటనల దరిమిలా నూతన విధానం కొనసాగనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో స్థానికేతర పోస్టుల్లో గల మూస ధోరణికి అడ్డుకట్ట వేయగా.. ఇక స్థానికులను ఉద్యోగాలు వరించనున్నాయి. మొత్తానికి ఏళ్లుగా ఊరిస్తున్న జోనల్ వ్యవస్థకు పచ్చజెండా ఊపడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉద్యోగులు, అధికారులకు పదోన్నతులు, బదిలీలకు సముచిత స్థానమిస్తూ జిల్లాలను విభజించి జోన్లుగా ఖరారు చేయగా, కరీంనగర్ను రాజన్న జోన్గా ఖరారు చేశారు. మల్టీజోన్లుగా రాజన్న, కాళేశ్వరం, బాసర, భద్రాద్రిని ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా మూడు ముక్కలు జిల్లాల విభజనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలుగా విభజింపబడిన విషయం విదితమే. ఇక హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో కలవగా మంథని డివిజన్లోని పలు మండలాలు భూపాలపల్లి జిల్లాకు, కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు వరంగల్ అర్బన్ జిల్లాలో కలిశాయి. ఈ క్రమంలో మళ్లీ జోనల్ వ్యవస్థ తెరపైకి రావడంతో వివిధ జోన్లలో కలిశాయి. జిల్లాలు విభజింపబడగా బదిలీలు, పదోన్నతులు పాతజిల్లా ప్రకారం ఉండనుండగా కొత్తగా నియామకమైన వారికి నూతన వి«ధానం అమలుకానుంది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలు రాజన్న జోన్లో చేర్చగా పెద్దపల్లి జిల్లాను కాళేశ్వరం జోన్లో, జగిత్యాల జిల్లాను బాసర జోన్లో చేర్చారు. నూతన విధానంతో ప్రయోజనాలు.. ఇప్పటివరకు కొనసాగుతున్న నియామక ప్రక్రియలో జిల్లాస్థాయి పోస్టులకు సంబంధించి 80 శాతం స్థానికత, 20 శాతం ఓపెన్ కేటగిరీ ఉండేది. జోనల్ స్థాయిలో 70 శాతం స్థానికత, 30 శాతం ఓపెన్ కేటగిరీ, రాష్ట్రస్థాయిలో 60 శాతం స్థానికత, 40 శాతం ఓపెన్ కేటగిరీలో పోస్టులను భర్తీ చేసేవారు. దీంతో స్థానికత విషయంలో బాగానే ఉన్నా ఓపెన్ కేటగిరీలో మాత్రం అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయి పోస్టులన్నీ 95 శాతం స్థానికత 5 శాతం స్థానికేతరులకు కేటాయించడంతో మన ఉద్యోగాలు మనకేనని స్పష్టమవుతోంది. ఏ స్థాయి పోస్టులైనా ఇదే విధానం అమలు కానుండటంతో వేల పోస్టులు తెలంగాణ యువతకు దక్కనున్నాయి. రాజన్న జోన్లో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల నూతన కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలు రాజన్న జోన్లో చేరనుండగా 43.09 లక్షల జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు కలిపి రాజన్న జోన్గా ఉండనుండగా జోనల్ పోస్టులన్నింటినీ ఈ పరిధిలో బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు. ఇక అన్ని శాఖలకు ఒకే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. అటెండర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు జిల్లాస్థాయిలో బదిలీలు, పదోన్నతులు నిర్వహించనుండగా సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్లను జోన్ పరిధిలో, గెజిటెడ్ అధికారులు, డీటీలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏటీవో, ఎస్టీవో ఇలా వివిధ రకాల హోదా గల అధికారులకు మల్టీజోన్ వారీగా బదిలీ, పదోన్నతులు ఉండనున్నాయి. ఆర్డీవోలు, జిల్లాస్థాయి అధికారులకు రాష్ట్రస్థాయిలో బదిలీలుండనున్నాయి. రాజన్న జోన్ మల్టిజోన్–1లో ఉండనుంది. చదవండి: సీఎం కేసీఆర్ సంచలనం: ఈటల బర్తరఫ్ -
‘పిల్లగాడు గెలుస్తడా అన్నరు. కానీ గెలిపించిండ్రు’
సాక్షి, హుజూరాబాద్: ‘‘ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు. కానీ అంతిమ విజయం వాటిదే. కులం, డబ్బు, పార్టీ, జెండాలను కాదు.. మనిషిని గుర్తుపెట్టుకోండి. నాకు తెలుసు నేను ఇబ్బంది పడుతుండొచ్చు. కానీ గాయపడినా నా మనసు మార్చుకోను. నాలాంటి వాడు మీముందుకు వచ్చి దేహీ అనే పరిస్థితి మంచిది కాదు..’’అని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల భావోద్వేగంగా మాట్లాడారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘‘నేను చేసిన పనులు చెప్పుకునే అక్కర్లేదు. నేను కొత్తగా వచ్చిననాడు ఈ పిల్లగాడు గెలుస్తడా అన్నరు. కానీ మీరు ఆశీర్వదించి గెలిపించారు. 20 ఏళ్లుగా నా చరిత్ర మీ కాళ్ల దగ్గర పెట్టిన. మళ్లీ ఇప్పుడు వచ్చి పని చేస్తానో లేదో చెప్పుకునే దుస్థితి ఉంటుందా? నేను ఎలాంటి వాడినో, ఎవరి కోసం తపన పడతానో మీకు తెలుసు’’అని ఈటల అన్నారు. పథకాలు పేదరికానికి పరిష్కారం కాదన్నారు. ‘పరిగె ఏరుకుంటే రాదు.. పంట పండితే వస్తుంది’అనే సామెత ఉందని.. అలాగే కల్యాణలక్ష్మి, పెన్షన్లు, రేషన్ కార్డులు పేదరికానికి పరిష్కారం కాని వ్యాఖ్యానించారు. అందరూ తమ కాళ్లమీద తాము నిలబడే సత్తా తీసుకురావాలని.. పని చేయగలమనే కాన్ఫిడెన్స్ రావాలని చెప్పారు. ఊరంతా ఒక దారైతే.. ఊరంతా ఒకదారైతే ఊసరవెల్లిది ఇంకోదారి అన్నట్టు కొందరు ఉంటారని.. బంగారు గొలుసులు, ఉంగరాలు పెట్టుకుంటే గొప్పతనం కాదని, దానం చేసే గుణం ఉండాలని ఈటల పేర్కొన్నారు. మహాభారతంలో కౌరవులు, దుర్యోధనుడు వంటివారు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చిందని.. సమాజంలో అందరూ ఒకే విధంగా ఉండరని చెప్పారు. నాయకులంటే భారీ ఆకారంతో, ఆభరణాలతో, కులంతో పని ఉండదని.. ప్రజల కన్నీళ్లు చూసి స్పందించే వాడే నిజమైన నాయకుడు, నిజమైన మనిషి అని పేర్కొన్నారు. రైతు బాగుంటే ఊరంతా బాగుంటుందని, అలాంటి రైతుకు ఆసరాగా ఉండేందుకే రైతు వేదిక వచ్చిందని చెప్పారు. తాను ఉన్నంత వరకు నియోజకవర్గ ప్రజలకు మచ్చ తీసుకురానని, రుణం తీర్చుకుంటానని ఈటల అన్నారు. చదవండి: కరోనా కేసులతో తెలంగాణ సర్కార్ అలర్ట్ -
ప్రకృతి సేద్యం: పల్లెబాట పట్టిన సాఫ్ట్వేర్ యువ జంట
ఏడేళ్ళ క్రితం ఈ యువ దంపతులు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. మంచి జీతం, మహానగరంలో నివాసం.. ఇవేమీ వారికి తృప్తిని ఇవ్వలేదు. సహోద్యోగి కుమార్తె సహా బంధు మిత్రులలో కొందరు కేన్సర్ మహమ్మారి బారిన పడ్డారు. రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారమే అందుకు మూల కారణమని గ్రహింపు కలిగింది. పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతి స్ఫూర్తినిచ్చి దారిచూపింది. అలా.. ఉద్యోగాలకు స్వస్తి చెప్పి ఆరోగ్యవంతమైన జీవనాన్ని వెతుక్కుంటూ స్వగ్రామానికి మకాం మార్చారు. సమీకృత ప్రకృతి వ్యవసాయం చేపెట్టి విజయపథంలో ముందడుగు వేస్తూ జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకున్నారు.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకూర్మపల్లి గ్రామం ఓ మారుమూల పల్లెటూరు. అయిదు వందల జనాభా కూడా లేని ఈ పల్లెటూరు పేరు ఇటీవల జాతీయ స్థాయిలో వినిపించింది. గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మావురం లక్షా్మరెడ్డి కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. కుమారుడు మల్లికార్జున్ రెడ్డి బీటెక్ చదివి హైదరాబాద్లో స్టాప్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేశారు. ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన సంధ్యతో 2010లో వివాహం జరిగింది. ఎంబీఏ పూర్తి చేసిన సంధ్య కూడా మూడేళ్ళు హైదరాబాద్లో ఉద్యోగం చేశారు. ఈ నేపథ్యంలో మల్లికార్జున్రెడ్డి సహోద్యోగి కుమార్తెకు కేన్సర్ జబ్బుపాలైంది. అదేవిధంగా తమ గ్రామానికి చెందిన వారు ముగ్గురికి కేన్సర్ వచ్చింది. ఇతరత్రా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారెందరో. తమ సహాయం కోసం ఊరి నుంచి వచ్చిన వారితో పాటు ఆసుపత్రులకు వెళ్లినప్పుడు.. రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారమే ఈ జబ్బులకు మూల కారణం అన్న నిశ్చితాభిప్రాయం కలిగింది. అదే కాలంలో పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానం కూడా మల్లికార్జున్రెడ్డి, సంధ్య దంపతులను ప్రభావితం చేసింది. ఉద్యోగాలకు స్వస్తి చెప్పి స్వగ్రామంలో ప్రకృతి సేద్యం చేపట్టారు. విద్యార్థినులతో మల్లికార్జునరెడ్డి తినేవన్నీ సేంద్రియంగా పండించుకున్నవే.. మల్లిఖార్జున్ రెడ్డి, సంధ్యారెడ్డి సొంత భూమి 14 ఎకరాల్లో సమీకృత వ్యవసాయంపై దృష్టి సారించారు. ఇంటికి అవసరమైన ఆహార పదార్థాలన్నిటినీ రసాయనాలు లేకుండా పండించుకుంటున్నారు. ధాన్యంతో పాటు, నూనెల కోసం పల్లీలు, నువ్వులు, పెసర, కంది పప్పులు, మిర్చి, ఉల్లి, ఎల్లి గడ్డలు, కొత్తిమీర, ఆవాలు, అల్లం వంటి పంటలను తగిన మోతాదులో సాగు చేసుకుంటున్నారు. రసాయనాలు లేని అమృతాహారాన్ని స్వీకరిస్తూ ఇంటిల్లపాదీ పిల్లా పాపలతో పాటు ఆనందంగా జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు యువన (7), ఆద్విక (5). వీరి ఆలనా పాలనా చూస్తూనే, ఇంటి పనితో పాటు వ్యవసాయ పనులు కూడా చేస్తున్నారు సంధ్య. ఎకరానికి రూ. లక్ష నికరాదాయం మల్లికార్జునరెడ్డి నిత్యం స్వయంగా పొలం పనిలో నిమగ్నమై ఉంటారు. వరి నాట్ల కాలంలో రోజుకు 23 కి.మీ. మేర నడుస్తూ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇతర కాలాల్లో రోజుకు 7 కి.మీ. మేర నడుస్తూ పొలం పనులు చేస్తుంటారు. వెద పద్ధతిలో వరి విత్తనాన్ని తానే స్వయంగా రోజుకు 3 ఎకరాల్లో విత్తటం, ఆరుతడి పద్ధతిలో వరి సాగు చేయటం ద్వారా ఖర్చును ఎకరానికి రూ. 25 వేలకు తగ్గిస్తున్నానని మల్లికార్జున్రెడ్డి తెలిపారు. ఇతరులకు ఎకరానికి రూ. 50 వేలు ఖర్చవుతోందన్నారు. ప్రస్తుతం 18 ఎకరాల్లో విత్తన కంపెనీలతో ఒప్పందం (క్వింటా రూ. 2 వేలు) చేసుకొని వరి విత్తనాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. పశువుల ఎరువు, మాగబెట్టిన కోళ్ల ఎరువు, జీవామృతం, జీవన ఎరువులు వాడుతున్నారు. తమ భూముల్లో సేంద్రియ కర్బనాన్ని ఏడేళ్లలో 0.5 నుంచి 1.5కి పెంచుకున్నారు. ఎకరానికి ఏటా (2 పంటలు) 60 క్వింటాళ్ల దిగుబడి తీస్తున్నారు. ఎకరానికి రూ. లక్ష వరకు నికరాదాయం పొందుతున్నారు. వర్షపు నీటిని నేల బావిలోకి ఇంకింపజేస్తూ నీటి భద్రతను సాధించారు. పొలంలో మల్లికార్జునరెడ్డి, పశువులకు మేత వేస్తూ.. ఎకరంన్నరలో వస పంట సాగు ఎరంన్నరలో వస కొమ్ములను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. నల్ల నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు కూడా దీని సాగుకు అనుకూలం. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఔషధ మొక్కల విభాగంతో (క్వింటా రూ. 9 వేలు) కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. మరో నెల రోజుల్లో పంట దిగుబడి వస్తుంది. ఎకరానికి కనీసం 20 క్వింటాళ్లు రావచ్చని ఆశిస్తున్నారాయన. పంటలతో పాటు 3 ఆవులు, 10 పొట్టేళ్లు, 54 నల్ల మేకలు, 50 వనరాజా కోళ్లను సాగు చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు ఈ యువ దంపతులు. వ్యవసాయ విద్యార్థులకు 6 నెలలు సాగు పనులు నేర్పిస్తున్నారు. మల్లికార్జునరెడ్డి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ–ఢిల్లీ) బెస్ట్ ఇన్నోవేటివ్ ఫార్మర్ జాతీయ అవార్డును ఇటీవలఅందుకున్న తర్వాత రైతు సందర్శకుల తాకిడి పెరగటం విశేషం. – వెల్మ విజేందర్ రెడ్డి, సాక్షి, చొప్పదండి వద్దన్న వారే అభినందిస్తున్నారు ఏడేళ్ళ క్రితం గ్రామంలో ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని వచ్చాం. పట్టణంలో సాఫ్ట్వేర్ జాబ్ వదిలి పల్లెటూరుకు ఏం పోతారు అని చాలా మంది అన్నారు. సమీకృత వ్యవసాయంతో పంటల సాగును లాభాల బాట పట్టించాం. మా ఆయన ఉదయం నుండి రాత్రి వరకు పంటల సాగుతో పాటు ఆవులు, గొర్రెలు, మేకలు, చేపల పెంపకం, నాటు కోళ్ళ పెంపకం పనుల్లో తలమునకలై ఉంటారు. ఇంటికి కావల్సిన పంటలను పండించడం చేస్తున్నాను. జాతీయ స్థాయిలో మాకు అవార్డు రావడం ఆనందంగా ఉంది. అప్పుడు పల్లెటూరుకు వద్దన్న వారే ఇప్పుడు అభినందిస్తున్నారు. – మావురం సంధ్యారెడ్డి, పెద్దకూర్మపల్లి వరి విస్తీర్ణం తగ్గిస్తా సాగు ఖర్చులు సగానికి సగం తగ్గించుకోవచ్చని నేను రుజువు చేశాను. వెద వరి, నీటి ఆదా తదితర పద్ధతులతోపాటు విత్తన వరి ఒప్పంద సేద్యం ద్వారా ఎకరానికి ఏటా రూ. లక్ష నికరాదాయం పొందుతున్నాను. వరి విస్తీర్ణాన్ని సగం తగ్గించి, ఆరుతడి పంటలు సాగు చేస్తా. పంటలతోపాటు పశువులు, కోళ్లు, చేపలను పెంచితేనే రైతుకు రసాయన రహిత ఆహార భద్రత, ఆదాయ భద్రత ఉంటుంది. నా అనుభవాలతో ఆహార–వ్యవసాయ సంస్థ కోసం పుస్తకం రాస్తున్నా. ఎఫ్.పి.ఓ. ఏర్పాటు చేసి రైతులకు బాసటగా నిలవాలన్నది లక్ష్యం. – మావురం మల్లికార్జునరెడ్డి (97040 90613), ఐఎఆర్ఐ ఉత్తమ ఇన్నోవేటివ్ రైతు అవార్డు గ్రహీత, పెద్దకూర్మపల్లి, చొప్పదండి మం, కరీంనగర్ జిల్లా -
ఒకప్పుడు భయపడేవారు.. ఇప్పుడు ప్రశంసలు!
రామగుండం క్రైం: రోడ్డుపై వంద రూపాయలు దొరికితే.. ఎవరూ చూడకుండా టక్కున జేబులో పెట్టుకునే ఈ రోజుల్లో రామగుండం పారిశ్రామిక ప్రాంత ఆటోడ్రైవర్లు నిజాయితీకి మారుపేరుగా నిలుస్తున్నారు. ప్రయాణికులు హడావుడిలో తమ వాహనాల్లో మరిచిపోయిన సొమ్మును తిరిగి వారికి అప్పగిస్తున్నారు. నగదు, ఆభరణాలు కళ్ల ముందే ఉన్నా కాజేయాలనే ఆలోచన చేయకుండా వాటిని పోగొట్టుకునేవారు పడే బాధను పెద్ద మనసుతో అర్థం చేసుకుంటున్నారు. ఆటో యూనియన్ నాయకులు, పోలీసుల సహకారంతో సొత్తును అప్పగిస్తూ అటు బాధితుల ప్రశంసలు.. ఇటు పోలీసుల అభినందనలు అందుకుంటున్నారు. గతంలో ఈ ప్రాంత ఆటోడ్రైవర్లు అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడేవారనే అపఖ్యాతి ఉండేది. ఇప్పుడు అది చెరిగిపోయింది. క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం చాటుకుంటూ హ్యాట్సాఫ్ అనిపించుకుంటున్నారు. 12 తులాల బంగారు ఆభరణాలు.. గోదావరిఖని తిలక్నగర్ డౌన్కు చెందిన హలీమా శుక్రవారం పనిమీద బస్టాండ్ కాలనీకి వెళ్లింది. అక్కడ 12 తులాల బంగారు ఆభరణాలు బ్యాగులో వేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు మున్సి పల్ ఆఫీస్ వద్ద ఆటో ఎక్కింది. తర్వాత బ్యాగును ఆటోలోనే మరిచిపోయి ఇంటికి వెళ్లింది. కాసేపటికి గుర్తించిన ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే తన ఆటోలో బ్యాగు ఉన్న విషయం గుర్తించిన రమేశ్నగర్ ఆటో అడ్డాకు చెందిన ఆటోడ్రైవర్ మహమ్మద్ అజ్గర్ ఉరఫ్ అజ్జు అడ్డా వద్దకు చేరుకున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన క్రైమ్ పార్టీ పోలీసుల సాయంతో బ్యాగును పోలీస్స్టేషన్లో అప్పగించాడు. పోలీసులు దాన్ని శనివారం ఆటోడ్రైవర్ చేతుల మీదుగా బాధిత మహిళకు అందించారు. నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్ను సీఐ రమేశ్బాబు, ఆటో యూనియన్ నాయకులు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నరసరావు పేటకు చెందిన బంగారం వ్యాపారులు తమ వ్యాపారం నిమిత్తం గత నెల 23న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి కారులో బయలుదేరారు. రామగుండం పోలీస్స్టేషన్ పరిధిలోని మల్యాలపల్లి రైల్వే బ్రిడ్జి కింద మూలమలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంతో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. 108 సిబ్బంది వారిని గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సిబ్బంది తోట రాజేందర్, ఎండీ.చాంద్పాషాలు క్షతగాత్రుల వద్ద లభించిన సుమారు కేజీ బంగారాన్ని పోలీసులకు అందించారు. వారిని సీఐ కరుణాకర్, ఎస్సై మామిడి శైలజ అభినందించారు. పెళ్లికి వస్తూ నగలు మరిచిపోయి.. 2020 డిసెంబర్ 3న కొత్తగూడెం గౌతమీపూర్కు చెందిన కల్లేపల్లి లింగయ్య గోదావరిఖనిలో ఉంటున్న సోదరుడి కూతురు పెళ్లి కోసం వచ్చాడు. తన వెంట బంగారు ఆభరణాలు, నగదు తీసుకొచ్చాడు. ఉదయం గోదావరిఖని బస్టాండ్లో బస్ దిగి గాంధీనగర్కు ఆటోలో వెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత బంగారు ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగ్ ఆటోలో మరిచిపోయినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు బస్టాండ్కు వెళ్లి, సీసీ పుటేజీ ఆధారంగా గొల్ల శ్రీనివాస్ ఆటోగా గుర్తించారు. అతడిని ఫోన్లో సంప్రదించగా, బ్యాగ్ గురించి తనకు తెలియదని.. తన తమ్ముడి ఆరోగ్యం బాగా లేక కరీంనగర్ వచ్చానని తెలిపాడు. ఎందుకైనా మంచిది ఆటోలో సీటు వెనక ఒకసారి చెక్ చేయాలని పోలీసులు సూచించాడు. వారు సీటు వెనక చూడగా 35 గ్రాముల బంగారం, రూ.54 వేలు ఉన్న బ్యాగు దొరికింది. దీంతో బాధితులు కరీంనగర్ వెళ్లి బ్యాగు తీసుకున్నారు. నిజాయితీగా సొత్తు అప్పగించిన ఆటోడ్రైవర్ శ్రీనివాస్ను అభినందించారు. బంధువుల ఇంటికి వస్తూ.. హైదరాబాద్కి చెందిన ఆవుల అజయ్ ఫ్యావిులీతో గోదావరిఖనిలో బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి హాజరయ్యేందుకు 2018 ఫిబ్రవరి 23న సికింద్రాబాద్–కాగజ్నగర్ రైలులో వచ్చారు. రాత్రి రామగుండం రైల్వేస్టేషన్లో దిగి, ఎండీ.తహరొదీ్దన్ ఆటో ఎక్కి గోదావరిఖని బస్టాండ్లో దిగారు. ఈ క్రమంలో బ్యాగును అందులోనే మరిచిపోయినట్లు ఇంటికెళ్లాక గుర్తించారు. అందులో 6 తులాల బంగారు ఆభరణాలు, ఖరీదైన దుస్తులు ఉండటంతో వెంటనే ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ నీలారపు రవికి సమాచారం ఇచ్చారు. అయితే ఆటోడ్రైవర్ తహరొద్దీన్ మరునాడు ఉదయం ఆటోలో బ్యాగును గుర్తించి, యూనియన్ ప్రెసిడెంట్కు తెలిపాడు. వెంటనే ఇద్దరూ ఆటోడ్రైవర్లతో కలిసి బ్యాగుతో ట్రాఫిక్ పోలీస్స్టేషన్కి వెళ్లి పోలీసులకు అప్పగించారు. బ్యాగును తనిఖీ చేసిన బాధితులు అన్నీ సరిగా ఉన్నాయని చెప్పడంతో ఆటోడ్రైవర్ను పోలీసులు అభినందించారు. ఊరికి వెళ్లే తొందరలో.. గోదావరిఖని అశోక్నగర్కు చెందిన కాసర్ల భారతి 2020 జూలై 8న కరీంనగర్ వెళ్లేందుకు గోదావరి ఖని బస్టాండ్కు రావడం కోసం గాంధీ చౌరస్తాలో ఆటో ఎక్కింది. బస్టాండ్లో పాయింట్ వద్ద బస్సు సిద్ధంగా ఉండటంతో ఊరికి వెళ్లాలనే తొందరలో ఆటో దిగుతుండగా ఆమె పర్సు అందులోనే పడిపోయింది. బస్సు ఎక్కిన తర్వాత పర్సు కనిపించకపోవడంతో వెంటనే దిగి ఆటో డ్రైవర్ కోసం గాలి ంచింది. అతను కనిపించకపోవడంతో ట్రాఫిక్ పో లీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాసేపటికి ఆటోడ్రైవర్ బస్టాండ్ ఆటో అడ్డా యూనియన్ ప్రెసిడెంట్ కనుకుంట్ల నారాయణకు తనకు పర్సు దొరికిందని తీసుకెళ్లి ఇచ్చాడు. ఇద్దరూ దాన్ని ఓపెన్ చేయకుండానే పోలీస్స్టేషన్కి వెళ్లి పోలీసులకు అప్పగించా రు. ప్రయాణికురాలి ముందు పర్సు ఓపెన్ చేయగా అందులో తులం బంగారం, రూ.5 వేలు ఉన్నా యి. భారతి అవి తనవే అని చెప్పడంతో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్ల సమక్షంలో బాధితురాలికి అందజేశారు. నారాయణను పోలీసులు, బాధితురాలు అభినందించారు. మహిళ ప్రాణాలు కాపాడి... గోదావరిఖని శివారులోని గోదావరి వంతెన పైనుంచి మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ఓ మహిళ నదిలో దూకింది. ఆ సమయంలో గోదావరిఖని నుంచి ప్రయాణికులను తీసుకొని ఆటోడ్రైవర్ రహ్మత్బేగ్ మంచిర్యాల వైపు వెళ్తున్నాడు. వంతెన వద్ద జనం గుమిగూడి ఉండటంతో ఏం జరిగిందని అక్కడి వారిని ఆరా తీయగా.. మహిళ నదిలో దూ కిందని చెప్పారు. వెంటనే ఆటో దిగి, నదిలో మహిళ కొట్టుకోవడం గమనించాడు. ఆలస్యం చేయకుండా ప్రాణాలకు తెగించి దూకేశాడు. వెంటనే పైన ఉన్నవారు వేసిన తాడు సాయంతో ఈదుకుంటూ మహి ళ దగ్గరకు వెళ్లి కాపాడాడు. తర్వాత పడవ ఎక్కించాడు. అయితే అంతలోతు నీటిలో ఆమెను కాపాడటంతో తాను కూడా అలసిపోయానని బేగ్ తెలి పాడు. చివకు బాధితురాలిని ప్రాణాలతో బయటకు తీసుకురావడం సంతోషంగా ఉందని చెప్పాడు. ఒకప్పుడు భయపడేవారు.. రామగుండం పారిశ్రామిక ప్రాంత ఆటోడ్రైవర్లు అంటే ప్రయాణికులు ఒకప్పుడు భయపడేవారు. కానీ ఇప్పుడు నిజాయితీకి మారుపేరుగా నిలవడం సంతోషంగా ఉంది. పోలీసులు మాకు కౌన్సెలింగ్ ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, సూచనలు ఇస్తున్నారు. డ్రైవర్లు మా యూనియన్ నాయకులకు, యూనియన్కు మంచి పేరు తీసుకురావడం గర్వంగా ఉంది. – నీలారపు రవి, ఆటో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ -
కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్.. అంతా గప్చుప్!
సాక్షి, కరీంనగర్ : రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేసిన స్పష్టమైన ప్రకటన ప్రభావం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో స్పష్టంగా కనిపించింది. ‘కేసీఆర్ తరువాత కేటీఆర్ సీఎం అవుతారు. ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో కేటీఆర్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన సీఎం అయితే తప్పేముంది?’ అని ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వూ్యలో వ్యాఖ్యానించి చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే. ఈ మాటలు సోషల్ మీడియాలో, వార్తా పత్రికల్లో రావడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ‘సీఎంగా కేటీఆర్ సమర్థుడు’ అనే వాదనను తెరపైకి తెచ్చారు. జిల్లాకు చెందిన మరో మంత్రి గంగుల కమలాకర్ కూడా హైదరాబాద్కు చెందిన పశుసంవర్థక శాఖ మంత్రితో కలిసి గత నెలాఖరులో మీడియాతో మాట్లాడుతూ ‘కేటీఆర్ ఎప్పుడు సీఎం అవుతారనే విషయాన్ని పెద్దసారు నిర్ణయిస్తారు’ అని వ్యాఖ్యానించారు. మంత్రి ఈటల రాజేందర్ రెండు రోజుల క్రితం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వూ్యలో సైతం ‘కేటీఆర్ సీఎం అవుతారు అనే మాటకు కట్టుబడి ఉన్నా’ అని పునరుద్ఘాటించారు. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ‘మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటా...’ అని స్పష్టం చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారింది. సోమవారం ఉమ్మడి జిల్లాలో మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా గంభీర వాతావరణంలో కార్యక్రమాలు సాగాయి. చదవండి: కేటీఆర్ సీఎం ప్రచారంపై కేసీఆర్ క్లారిటీ ఏక్ బార్.. అమ్మకముందే భారీ ఆదాయం..! కేంద్ర చట్టాలపై ఆచితూచి మాట్లాడిన ‘ఈటల’ గత వారం హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్మించిన ‘రైతువేదిక’ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల్లో ఉత్సాహం నింపారు. నాలుగు రోజులపాటు సాగిన ఆయన పర్యటనల్లో మాట్లాడుతూ రైతు తాను పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని, కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో 70 రోజులుగా రైతులు సాగిస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. అయితే కేంద్రం ప్రతి పాదించిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఒకరోజు బంద్ నిర్వహించిన టీఆర్ఎస్ తరువాత దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. మంత్రి ఈటల మాత్రమే తన గొంతును బలంగా వినిపించగా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి కూడా ఈటల ను ప్రశంసిస్తూ బహిరంగ ప్రకటన చేశారు. కాగా సోమవారం మంథనిలో రైతువేదిక ప్రారంభోత్సవంతోపాటు మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న ఈటల ఆచితూచి మాట్లాడారు. వ్యవసాయ చట్టాల అమలులో కేంద్రం రైతుల సంక్షేమ బాధ్యత నుంచి తప్పుకోవద్దని సుతిమెత్తగా హెచ్చరించారు. ఢిల్లీలో రైతుల ఆందోళన, సంఘీభావం విషయాలను ఎక్క డా ప్రస్తావించలేదు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం చేసిన కృషిని, కాళేశ్వరం ప్రాజెక్టు, తీరిన విద్యుత్ కొరత వంటి అంశాలపై ప్రసంగంలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు పాలనలో రైతులు పడ్డ బాధల గురించి తనదైన ధోరణిలో విమర్శలు చేశారు. ఎంఎస్పీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయాలని, రైతులకు న్యాయం చేయాలని సుతిమెత్తగా డిమాండ్లు చేయడం గమనార్హం. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశం ప్రభావం మంత్రి ఈటల ప్రసంగంపై పడిందనే అభిప్రాయం వ్యక్తమైంది. సిరిసిల్లలో ఉత్సాహంగా మంత్రి కేటీఆర్ పర్యటన సిరిసిల్ల నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పర్యటన సోమవారం సాగింది. గంభీర్రావు పేట మండలంలోని పలు కార్యక్రమాల్లో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయనతోపాటు హాజరైన ప్రణాళిక సంఘం వైస్చైర్మన్, మాజీ ఎంపీ బి.వినోద్కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు వంటి వారు కూడా మంత్రి వెంట ఆహ్లాదంగా గడిపారు. ప్రసంగాల్లో ఎక్కడా రాజకీయ అంశాలు చోటు చేసుకోలేదు. కేవలం అభివృద్ధి, ముఖ్యమంత్రి చేస్తున్న కృషి గురించి మాత్రమే కేటీఆర్తోపాటు ఇతర నేతలు తమ ప్రసంగాల్లో వివరించారు. కార్యక్రమాలకు హాజరైన నాయకులు, పార్టీ శ్రేణులు కూడా ‘రాజకీయ’ వాతావరణం ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. పార్టీ సభ్యత్వంపైనే అందరి దృష్టి సీఎం మార్పుపై ఊహాగానాలకు తెరపడడంతో పార్టీ ప్రజాప్రతినిధులు సభ్యత్వ నమోదుపైనే దృష్టి సారించారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 12 నుంచి నియోజకవర్గాల వారీగా సభత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లాల వారీగా సభ్యత్వ నమోదుకు ఇన్చారి్జలను నియమించారు. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్కు కోలేటి దామోదర్ గుప్త, పెద్దపల్లికి లోక బాపురెడ్డి, రాజన్న సిరిసిల్లకు కర్ర శ్రీహరి, జగిత్యాలకు ఎమ్మెల్సీ భానుప్రసాద రావును నియమించారు. సీఎం మార్పు ఉండబోదని, తానే మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఎవరూ నోరు మెదపకూడదని కూడా పార్టీ శ్రేణులకు ఆదేశాలు వెళ్లాయి. -
తండ్రి మరణించిన అరగంటకే కుమారుడు..
ఓదెల (పెద్దపల్లి): తండ్రి మరణించిన అరగంటకే కొడుకు మృతి చెందిన ఘటన ఓ కుటుంబంలో విషాదం నింపింది. గ్రామస్తుల కథనం ప్రకారం, ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ మాజీ చైర్మన్, పెద్దపల్లి జిల్లా పెద్దకొమిర గ్రామానికి చెందిన పల్కల బస్వారెడ్డి (78)కి భార్య సత్యవతి, కుమారులు వాసుదేవరెడ్డి, రమేశ్రెడ్డి, కూతురు ఉన్నారు. కొద్దిరోజులుగా బస్వారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని పెద్ద కొడుకు వాసుదేవరెడ్డి వద్ద ఉంటూ చికిత్స పొందుతున్నారు. రెండ్రోజుల క్రితం వాసుదేవరెడ్డి కూడా తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న బస్వారెడ్డి ఆదివారం మరణించారు. తండ్రి మరణ వార్త విన్న వాసుదేవరెడ్డి (44) ఆసుపత్రిలోనే మృతిచెందాడు. ఒకేరోజు తండ్రీకొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. రాత్రి స్వగ్రామంలో ఇద్దరి అంత్యక్రియలు జరిగాయి. వాసుదేవరెడ్డికి భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. -
కాషాయ క్రమ‘శిక్ష’ణ షురూ!
సాక్షి, కరీంనగర్: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర రథ సారథి బండి సంజయ్ సొంత జిల్లా నుంచే పార్టీని గాడిలో పెట్టే చర్యలకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా ఉంటూనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్ద బాధ్యతలు మోస్తున్న సంజయ్ కరీంనగర్ కమలదళం నుంచే కొరడా ఝులిపించే పనిలో పడ్డారు. పార్టీ జిల్లా బాస్గా కీలక బాధ్యతల్లో ఉన్న నాయకుడు పార్టీలోకి కొత్తగా వచ్చిన ఓ మహిళ ట్రాప్లో చిక్కుకున్న వీడియో, ఆడియో గురువారం రాత్రి నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వచ్చే నెలలో దుబ్బాక ఉప ఎన్నికకు పార్టీ సిద్ధమవుతున్న తరుణంలో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా స్థానిక ఛానెల్ ద్వారా సోషల్ మీడియాలో వీడియో ప్రసారం కావడంపై బండి సంజయ్ సీరియస్ అయ్యారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఆయన శుక్రవారం ఉదయం హుటాహుటిన పార్టీ ముఖ్య నాయకులతో ఫోన్లో చర్చించి, ప్రస్తుత పార్టీ అధ్యక్ష పదవి నుంచి బాస సత్యనారాయణను తొలగించారు. ఆ వెంటనే హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన గంగాడి కృష్ణారెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు. ఒక్కరోజులో పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో నాయకులు, కార్యకర్తలు షాక్కు గురయ్యారు. ఉమ్మడి జిల్లాపైనే తొలి దృష్టి పార్టీ జిల్లా అధ్యక్షున్ని తొలగించి వేరొకరికి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాను పూర్తిస్థాయిలో గాడిలో పెట్టాలని భావిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త స్థాయి నుంచి ఏబీవీపీ, బీజేవైఎం, బీజేపీలలో వివిధ స్థాయిల్లో పనిచేసిన సంజయ్కు ఉమ్మడి కరీంనగర్లో పార్టీ నాయకుల జాతకాలన్నీ తెలుసు. కరీంనగర్ నుంచి అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు కొందరు నాయకులు వ్యవహరించిన తీరుపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. సంజయ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇతర జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి ప్రయత్నించారు. సొంత జిల్లా అంతర్గత వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించలేదు. కానీ ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తొలుత సొంత జిల్లాను ప్రక్షాళన చేసే విషయమై దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అధ్యక్షుడే బాస్ బీజేపీలో పార్టీ అధ్యక్షుడే సుప్రీం. రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మండల, గ్రామ అధ్యక్షుడి వరకు ఆయా స్థాయిలో కీలక పాత్ర పోషిస్తారు. అయితే ఇటీవల ఉమ్మడి జిల్లాలో పార్టీ సీనియర్లు, ముఖ్య నాయకులు అని చెప్పుకునే వారు పార్టీ అధ్యక్షులతో సంబంధం లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. కరీంనగర్ జిల్లాతోపాటు పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. దీనిపై అంతర్గత సమావేశాల్లో సంజయ్ అన్యపదేశంగా హెచ్చరికలు చేసినా, ఎవరికి వారే అనే ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు సమాచారం. సంజయ్ కన్నా వయసులో పెద్దవాళ్లు, గతంలో పార్టీలో పలు హోదాల్లో పనిచేసిన వారు గ్రూపులు కడుతున్న వ్యవహారాలు కూడా వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో సొంత జిల్లా(ఉమ్మడి కరీంనగర్) నుంచే క్రమశిక్షణ చర్యలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన నేపథ్యంలో కరీంనగర్కు చేరుకొని పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దే పనికి ఉపక్రమించనున్నట్లు తెలిసింది. బీజేపీ నూతన అధ్యక్షుడిగా గంగాడి కృష్ణారెడ్డి కరీంనగర్ బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడిగా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన న్యాయవాది గంగాడి కృష్ణారెడ్డి నియామకం అయ్యారు. వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో రాజకీయ ఓనమాలు నేర్చుకొని బీజేవైఎం, బీజేపీలలో వివిధ హోదాల్లో పనిచేశారు. కమలాపూర్ నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్గా, జిల్లా కార్యదర్శిగా, మూడు సార్లు జిల్లా ఉపాధ్యక్షునిగా, బీజేపీ జిల్లా సంస్థాగత శిక్షణ కమిటీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కృషి : గంగాడి కృష్ణారెడ్డి బీజేపీలో సామాన్య కార్యకర్తకు కూడా గుర్తింపు ఉంటుందనేది మరోసారి రుజువైంది. నాపై ఎంతో నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహి స్తా. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.కింది స్థాయి కార్యకర్తలు కూడా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే తగిన గుర్తింపు లభిస్తుందని నాతో రుజువైంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కుమార్కు కృతజ్ఞతలు. -
పులి పయనం ఎందాక?
సాక్షి, జ్యోతినగర్(రామగుండం): పక్షం రోజులుగా జిల్లాలో తిరుగుతున్న పులి అనువైన ఆవాసం దొరకక ప్రయాణం కొనసాగిస్తోంది. జిల్లాలో రోజుకో ప్రాంతంలో అడుగులు దర్శనమిస్తున్నాయి. స్థానికుల సమాచారంతో అడుగులు కనిపించిన ప్రాంతానికి అటవీశాఖ అధికారులు చేరుకుని పులివే అని నిర్ధారించి వదిలేస్తున్నారు. పులిని పట్టుకుని తరలించే ప్రయత్నంకానీ, అనువైన ఆవాసం కల్పించే ప్రయత్నంకానీ, జిల్లా దాటించే ప్రయత్నం కానీ చేయడం లేదు. దీంతో ప్రజలు ఏరోజు ఎక్కడ పులిని చూడాల్సి వస్తుందో.. ఎవరిపై దాడిచేస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. ఆరు మండలాల్లో సంచారం.. ఈనెల 7వ తేదీన ముత్తారం మండలం ఓడేడు శివారులో భూపాల పల్లి జిల్లా నుంచి పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ప్రయాణం నిరంతరం కొనసాగిస్తోంది. ముత్తారం, రామగిరి, కమాన్పూర్, పెద్దపల్లి, పాలకుర్తి మండలాల మీదుగా, రామగుండం మండలం ఎన్టీపీసీ రిజర్వాయర్ వరకు సాగింది. అయితే ముత్తారం మండలం మచ్చుపేట శివారులోని బగుళ్ల గుట్ట అడవుల్లో ఆవుల మందపై దాడిచేసిన సమయంలో మాత్రమే పెద్దపులి పశువుల యజమానికి కనిపించింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో మంథని–పెద్దపల్లి రహదారి మీదుగా కారులో వెళ్తున్న యువకులు పులి రోడ్డు దాటుతుండగా చూశామని చెబుతున్నారు. ఈరెండేసార్లు మినహా ఎక్కడా ఎవరికీ పులి కనిపించలేదు. బగుళ్ల గుట్టవద్ద మినహా ఎక్కడా పశువులకు, మనుశులకు ఎలాంటి హాని తలపెట్టకుండా తన ప్రయాణం కొనసాగిస్తోంది. ఎన్టీపీసీ రిజర్వాయర్ సమీపంలో పాద ముద్రలు ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు రిజర్వాయర్ సమీపప్రాంతంలో పులి సంచరించినట్లు అటవీ అధికారులు తెలిపారు. పుట్నూరు ప్రాంతంలో నుంచి పులి శనివారం తెల్లవారుజామున బుగ్గ గుట్ట మీదుగా భామ్లా నాయక్ తండా గుండా ఎన్టీపీసీ రిజర్వాయర్ అటవి ప్రాంతానికి చేరుకుందని పేర్కొన్నారు. అక్కడి నుంచి మళ్లీ ఇంధన నిల్వల కేంద్రం, గాడిదల గండి వైపు వెళ్లిందని అడుగుల ఆధారంగా గుర్తించామని అటవీ శాఖ సెక్షన్ అధికారి రహ్మతుల్లా, బీట్ అధికారులు నరేశ్, రమేశ్ వివరించారు. వీరితోపాటు భీమ్లా నాయక్ తండా సర్పంచ్ రాజు నాయక్ కూడా ఉన్నారు. రాజీవ్ రహదారి ఎలా దాటింది..? పులి పుట్నూరు నుంచి బుగ్గ గుట్ట మీదుగా ఎన్టీపీసీ రిజర్వాయర్కు చేరుకునే క్రమంలో నిత్యం రద్దీగా ఉండే రాజీవ్ రహదారిని దాటాలి. రోడ్డు దాటే క్రమంలో ఎవరికీ కనిపించకపోవడం ప్రశ్నగా మారింది. పులి సంచరించినట్లు తెలు పుతున్న అధికారులు పులి ఏ వైపుకు వెళుతుందో.. అటవీ ప్రాంతం వివరాలు అధికారులకు తెలిసినా రాత్రి సమయంలో కాపు కాయకపోవడంతోనే పులి సంచారాన్ని కనుక్కోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పులి బుగ్గ గుట్ట నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి వెళ్లిందా అనే విషయాలపై కూడా పూర్తి స్పష్టత కనిపించడం లేదు. రెండేళ్ల క్రితం కూడా పులి సంచారం.. ఎన్టీపీసీ రిజర్వాయర్ సమీప అటవీ ప్రాంతంలోకి 2018, జూన్లో రెండు పులులు సంచిరించినట్లు అధికారులు ధ్రువీకరించారు. రెండు పులులలో ఒకటి చిన్నది, మరొకటి పెద్దదిగా ఉన్నాయని పాద ముద్రల ఆధారంగా నిర్ధారించారు. ఆ తర్వాత పులులు ఎటు వెళ్లాయో కూడా పూర్తి సమాచారం లేదు. రెండేళ్ల వచ్చిన చిన్న పులి పెరిగి పెద్ద అయి మళ్లీ ఈ ప్రాంతంలో సంచరిస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్టీపీసీ రిజర్వాయర్ ప్రాంతం పూర్తి రక్షిత ప్రాంతం అందులోకి అనుమతి లేకుండా ఎవరు ప్రవేశించరు. ఈ నేపథ్యంలో ఇక్కడ అనువుగా ఉంటే పులి ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ధర్మారం క్రాస్రోడ్డు సమీపంలో.. పాలకుర్తి(రామగుండం): మండల పరిధిలో శుక్రవారం పుట్నూర్ గ్రామంలోని అల్లం రవి పొలంలో పెద్దపులు పాదముద్రలు కనిపించగా, శనివారం ధర్మారం క్రాస్రోడ్డు సమీపంలోని ముత్యాల లింగయ్య పొలం వద్ద పాద ముద్రలను బోడగుట్టపల్లి గ్రామస్తులు గుర్తించారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా రామగుండం సెక్షన్ అధికారి రహ్మతుల్లా వచ్చి పరిశీలించి పెద్దపులివే అని నిర్ధారించారు. నాగులగుట్ట సమీపంలోని పత్తి చేలల్లో కూడా పులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. బుధవారం కన్నాల గ్రామ శివారులోని నాగుల గుట్ట నుంచి రాఘావాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని గుప్తా కోల్వాషరీష్ మీదుగా ఎస్సారెస్పీ డి–83 కాలువ వెంబడి పయనించి బుగ్గగుట్టకు చే రుకుని అక్కడి నుంచి ఈసాలతక్కళ్లపల్లి మీదుగా పుట్నూర్ గ్రామ శివారుకు గురువారం రాత్రి చేరి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం బుగ్గగుట్ట నుంచి కుందనపల్లి ఐవోసీ ఇంధన నిల్వల కేంద్రాల సమీపం నుంచి ఎన్టీపీసీ రిజర్వాయర్ ప్రాంతానికి వచ్చి ఉంటుందని పేర్కొంటున్నారు. -
కోల్బెల్ట్లో టీఆర్ఎస్, బీజేపీ కోల్డ్వార్
కోల్బెల్ట్ ఏరియాలో టీఆర్ఎస్, బీజేపీల నడుమ కోల్డ్వార్ తారాస్థాయికి చేరుకుంది. వైరి రాజకీయ పార్టీలుగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం సహజమే అయినా ఇందుకు వ్యక్తిగత గ్రూప్లు కూడా తోడవడంతో ఓ స్థాయిలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య వార్ సాగుతోంది. అవతలి పార్టీని ఇరుకునపెట్టే ఏ అవకాశాన్నీ రెండు పార్టీలు వదలడం లేదు. ఇటీవల ఆర్ఎఫ్సీఎల్కు కేంద్రమంత్రులు వచ్చిన సందర్భంలో జరిగిన ఘటన కూడా ఈ కోవలోనిదేనంటూ ప్రచారం సాగుతోంది. సాక్షి, పెద్దపల్లి: టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అడ్డుకున్న ఘటనలో పోలీసుల తీరుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డి మండిపడగా, ఒకరిద్దరు పోలీసు అధికారులపై వేటు పడుతోందనే ప్రచారం ప్రస్తుతం ఊపందుకుంది.వైరి పక్షాల్లో చిరకాల ప్రత్యర్థులు రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మధ్య అంతర్గత పోరు దశాబ్దాలుగా సాగుతోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి సోమారపు, రెబల్ అభ్యర్థిగా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కోరుకంటి పోటీపడడం తెలిసిందే. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత చందర్ నేరుగా అధిష్టానం వద్దకు వెళ్లి మళ్లీ గులాబీ గూటికి చేరారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పూర్తిగా చందర్ చేతిలోకి వెళ్లిపోయింది. ఎన్నికల తర్వాత కొద్దిరోజులు టీఆర్ఎస్లోనే ఉన్న సోమారపు తన వర్గంతో బీజేపీలో చేరారు. ఇక మాజీ ఎంపీ జి.వివేక్కు చివరి నిమిషంలో టీఆర్ఎస్ టికెట్ నిరాకరించగా, ఆ తర్వాత ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్లోని తన బెర్త్ లాక్కున్న బొర్లకుంట వెంకటేశ్, వివేక్ల నడుమ ఆధిపత్యపోరు సహజమే. ఇలా పార్లమెంటు, అసెంబీల్లో నియోజకవర్గాల్లో బలమైన నేతలు ప్రత్యర్థి పార్టీల్లో చేరిపోవడంతో, కోల్బెల్ట్లో రాజకీయం ఏదో ఒక అంశంపై నిత్యం రాజుకుంటూనే ఉంటోంది. ఆర్ఎఫ్సీఎల్ ఘటనతో మరోసారి.. మున్సిపల్ కార్పొరేషన్.. సింగరేణి బొగ్గు గనులు.. అంశం ఏదైనా రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆర్ఎఫ్సీఎల్ ఘటనతో మరోసారి టీఆర్ఎస్, బీజేపీల పోరు బహిర్గతమైంది. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్తో టీఆర్ఎస్ ఎంపీ బొర్లకుంట వెంకటేశ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్లు కేంద్రమంత్రులు మాండవ్య, కిషన్రెడ్డిలను అడ్డుకోవడం, వాగ్వాదానికి దిగడం, కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు.. ఉద్రిక్తతకు దారితీయడం తెలిసిందే. స్థానికులకు ఉద్యోగాలు రాకపోవడానికి కేంద్రమే కారణమని చెప్పేందుకు, తద్వారా బీజేపీని ఇరుకున పెట్టేందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కేంద్రమంత్రులు వచ్చిన ప్రతీసారి ఆందోళనలకు దిగుతోంది. అయితే తాము స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెబుతున్నామని, కాని ఉద్యోగాల పేరిట వసూళ్లను అరికట్టాలంటూ బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. ముందుందా!.. ముగిసిందా..! ఆర్ఎఫ్సీఎల్ ఘటనపై అక్కడే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చినా ముందస్తు అరెస్ట్లు చేసే పోలీసులు, తమ పర్యటనలో ఆ విధంగా ఎందుకు వ్యవహరించలేదంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే డీజీపీ ఆదేశం మేరకు సీపీ సత్యనారాయణ ఘటనపై విచారణ పూర్తి చేసి నివేదిక అందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతోనే ఈ వ్యవహారం ముగిసిపోయిందనే ప్రచారం ఉంది. కాని ఒకరిద్దరు పోలీసు అధికారులపై వేటుపడక తప్పదేమోననే అనుమానాన్ని పలువురు పోలీసు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే పోలీసుల అంచనాలు తప్పడంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసుల పోస్టింగ్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల చేతుల్లోకి వెళ్లిన పరిస్థితుల్లో సహజంగానే రాష్ట్ర అధికార పార్టీ ప్రభావం పోలీసులపై ఎక్కువగా ఉంటుంది. దీంతో టీఆర్ఎస్ ఆందోళన పట్ల కాస్త ఉదాసీనత ప్రదర్శించారనే విమర్శ ఉంది. అంతేకాకుండా వినతిపత్రం మాత్రమే ఇస్తారని చెప్పడంతోనే కేంద్రమంత్రులు టీఆర్ఎస్ ఆందోళన వద్దకు వెళ్లినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. కాని కేంద్రమంత్రులను చుట్టుముట్టి నినాదాలు చేయడాన్ని,తోసుకోవడాన్ని పోలీసులు ఊహించలేకపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా కిషన్రెడ్డి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. పరిస్థితిని పసిగడితే మరో ద్వారం గుండా ఆర్ఎఫ్సీఎల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉండేదని పోలీసులు కూడా చర్చించుకుంటున్నారు. కేంద్రప్రభుత్వ సంస్థలు అధికంగా ఉన్న కోల్బెల్ట్లో టీఆర్ఎస్, బీజేపీల ఆధిపత్యపోరు సాగుతోంది. రానున్న సింగరేణి గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో ఇది మరింత ఉధృతం కానుంది. -
‘రంగినేని’ పురస్కారానికి కథా సంపుటాలకు ఆహ్వానం
సాక్షి, సిరిసిల్ల: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో ‘రంగినేని ఎల్లమ్మ’సాహిత్య పురస్కారాన్ని ఏటా అందిస్తున్నామని అవార్డు కమిటీ అధ్యక్షుడు రంగినేని మోహన్రావు ఒక ప్రకటనలో తెలిపారు. 2020 సంవత్సరానికి గాను సాహిత్య పురస్కారం కోసం 2018, 2019, 2020 సంవత్సరాలలో ప్రచురితమైన తెలుగు కథా సంపుటాలు ఐదు ప్రతులు అక్టోబర్ 31లోగా పంపించాలని అవార్డు కమిటీ కన్వీనర్ మద్దికుంట లక్ష్మణ్ కోరారు. రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం కింద రూ.21 వేల నగదు, జ్ఞాపిక, పురస్కార పత్రాన్ని 2021 జనవరిలో అందిస్తామని పేర్కొన్నారు. కథా సంపుటాలు పంపాల్సిన అడ్రస్ రంగినేని ఎడ్యుకేషనల్ ట్రస్ట్, బాలాజీ నగర్, సిరిసిల్ల–505 301, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇతర వివరాలకు 94416 77373ని సంప్రదించాలని కోరారు. -
టీఆర్ఎస్కు బుద్ధి చెబుతాం
సాక్షి, ఇచ్చోడ: సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుంటే రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బుధవారం ఆయన జోడేఘాట్ నుంచి నిర్మల్కు వెళ్తుండగా ఇచ్చోడలో కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఇక ఇది నడవదని, టీఆర్ఎస్ను గద్దె దింపేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గుమ్మడి భీంరెడ్డి, కొల్లురి చంద్రశేఖర్, కేంద్రే నారాయణ, కదం బాబారావు, మాధవ్ ఆమ్టె, తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలొస్తేనే సీఎంకు సింగరేణి గుర్తొస్తది గోదావరిఖని(రామగుండం): ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్కు ప్రజలు, కార్మికులు గుర్తొస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ అన్నారు. రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు మంచిర్యాలకు వెళ్తూ మంగళవారం రాత్రి గోదావరిఖనికి చేరుకున్నారు. స్థానిక ఇల్లెందు గెస్ట్హౌస్లో బసచేశారు. బుధవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ, మాజీ ఎంపీ వివేక్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. త్వరలో సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరగనున్నాయని, టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్కు కార్మికులు బుద్ధిచెప్పాలని కోరారు. గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తన కూతురు కవితను గనుల పైకి పంపి ప్రచారం చేయించి, కార్మికుల మారుపేర్లను రెగ్యులరైజ్డ్ చేస్తామని, రూ. 10లక్షల సొంతింటి కోసం వడ్డీలేని రుణం ఇస్తామని, వారసత్వ ఉద్యోగాలు అమలు చేస్తామని, కొత్త బొగ్గుగనులు ప్రారంభించి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని ఆనేక హామీలిచ్చి గెలిచారన్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినా హామీలు మాత్రం నెరవేరలేదన్నారు. త్వరలో నిర్వహించే గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు ఇచ్చే తీర్పుతో సీఎం కేసీఆర్ మైండ్ బ్లాక్ కావాలన్నారు. ధనబలంతో గెలిచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తాడని, కేసీఆర్ వచ్చే డబ్బులు తీసుకుని బీఎంఎస్ను గెలిపించాలని కోరారు. పీవీ ఇప్పుడు గుర్తొచ్చారా.. మాజీ ప్రధాని పీవీనర్సింహారావు తెలంగాణ గడ్డపై పుట్టిన గొప్ప నేత అని కొనియాడారు. రాష్ట్రం సాధించిన ఆరేళ్లలో ఎన్నడూ పీవీ గురించి మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు శతజయంతి సందర్భంగా ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందన్నారు. ఇది గమనించిన కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి క్రెడిట్ దక్కుతుందనే ఉద్దేశంతో శత జయంతి ఉత్సవాలు ఏడాదంతా నిర్వహించాలని నిర్ణయించి, అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్–17ను అధికారికంగా నిర్వహించాలని అన్నారు. ఎంఐఎంకు బయపడి ఒకవర్గానికి కొమ్ముకాచేందుకు సీఎం కేసీఆర్ తెలంగాణ అమరులను కించపరుస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ఆర్ఎఫ్సీఎల్లో అక్రమాలపై దృష్టి రామగుండంలో పునర్నిర్మిస్తున్న రామగుండం ఎరువుల కార్మాగారంలో స్థానికులకే ఉద్యోగాలిచ్చేలా కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రికి విన్నవిస్తామని తెలిపారు. ఆర్ఎఫ్సీఎల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 54కోట్లు చెల్లించాల్సి ఉందని, నిధులు మంజూరు చేయడంలో కేసీఆర్ జాప్యం చేస్తున్నారని విమర్శించారు. నవంబర్లో ఎరువుల ఉత్పత్తి ప్రారంభించేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. సమావేశంలో నాయకులు దుగ్యాల ప్రదీప్కుమార్, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, బొడిగె శోభ, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, బల్మూరి అమరేందర్రావు, బల్మూరి వనిత, గీతామూర్తి, భానుప్రకాశ్, రాకేష్రెడ్డి, వడ్డెపెల్లి రాంచందర్, రావుల రాజేందర్, మామిడి రాజేష్, కోమల్ల మహేష్, క్యాతం వెంకటరమణ, ప్రవీణ్, జక్కుల నరహరి, పిడుగు క్రిష్ణ, సోమారపు లావణ్య పాల్గొన్నారు. -
ఆన్లైన్ క్లాసు కోసం ఆత్మహత్యాయత్నం
సాక్షి, శంకరపట్నం(మానకొండూర్): ఆన్లైన్ క్లాసు వినేందుకు ఓ విద్యార్ధిని సెల్ఫోన్ లేదని అఘాయిత్యానికి పాల్పడింది. ఈ సంఘటన శంకరపట్నం మండలం ఇప్పలపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. మండలంలోని ఇప్పలపల్లె గ్రామానికి చెందిన 13 ఏళ్ల విద్యార్థిని రాజన్నసిరిసిల్ల జిల్లాలో సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుతోంది. సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వం ఆన్లైన్ క్లాస్లు ప్రారంభించింది. ఈ క్లాసులు వినేందుకు ఇంట్లో కుటుంబసభ్యుల సెల్ఫోన్ను సదరు విద్యార్థిని వాడుకుంటోంది. సదరు విద్యార్థిని సోదరుడు కేశవపట్నంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. ఇద్దరు ఆన్లైన్ క్లాసులు వినేందుకు సెల్ఫోన్కోసం పట్టుబట్టారు. ఇంట్లో స్మార్ట్ఫోన్ ఒక్కటే ఉండడంతో తమ్ముడికి ఫోన్ ఇచ్చారని, నాకు ఇవ్వలేదని ఆన్లైన్ క్లాసులు మిస్సవుతున్నానని ఇంట్లో వరిపొలం కోసం దాచిని పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. -
నిత్య పెళ్లి కొడుక్కి దేహశుద్ధి
సాక్షి, కరీంనగర్ : భార్య, కొడుకు ఉండగానే మరో మహిళతో కాపురం పెట్టిన నిత్యపెళ్లి కొడుక్కి, భార్య తరపు బంధువులు దేహశుద్ధి చేశారు. తాళ్లతో బంధించి చెప్పులతో, కర్రలతో చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. పెద్దపల్లి జిల్లా చిన్న బొంకూర్ గ్రామానికి చెందిన కొండి సంపత్ కరీంనగర్లోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్మెన్గా పనిచేస్తున్నాడు. 2016లో మానకొండూరు మండలం గూడూరుకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహమైంది. వారికి బాబు జన్మించాడు. భార్య కొడుకు ఉండగా సంపత్ మరో మహిళతో కరీంనగర్లో కాపురం పెట్టాడు. విషయం తెలుసుకున్న భార్య భాగ్యలక్ష్మి బంధువులతో కలిసి కరీంనగర్కి వెళ్లి సంపత్ను రెండ్ హ్యాండెడ్గా పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. గతంలో కూడా పెళ్లి పేరుతో నలుగురి మహిళలను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభంచారు. సంపత్,భాగ్యలక్షిల పెళ్లి ఫోటోలు -
అప్రమత్తంగా ఉండండి: ఈటల రాజేందర్
సాక్షి, జమ్మికుంట: ఉత్తర తెలంగాణలో కనివిని ఎరుగని రీతిలో వర్షం కురిసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా నాలుగు రోజుల్లోనే చెరువులు కుంటలు జలాశయాల నిండాయని పలు చోట్ల చెరువులకు, కాలువలకు గండ్లు పడి రోడ్లు దెబ్బతిని చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయిని చెప్పారు. కలెక్టర్ శశాంక, జడ్పి చైర్ పర్సన్ విజయతో కలిసి మంత్రి జమ్మికుంట, హుజురాబాద్ ఏరియాలో వరదల పరిస్థితిని పరిశీలించారు. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీఎం కేసీఆర్ మంత్రులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని తెలిపారు. (మూసీలో చిక్కుకున్న యువకులు) గ్రామాల వారిగా పంట నష్టం, దెబ్బతిన్న రోడ్లు తెగిన చెరువు కుంట కట్టలు, జలాశయాల పరిస్థితిని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించాలని అధికారులను ఆదేశించామని అందులో భాగంగా తాను హుజూరాబాద్, మానకొండూర్ నియోజకవర్గాల్లో పర్యటించినట్లు చెప్పారు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పర్యటించి నష్ట అంచనాలు వేస్తున్నారు. జరిగిన నష్టాన్ని పరిశీలించి వరద తగ్గిన తర్వాత సహాయక చర్యలు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు రైతులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. (ప్రమాదకరంగా హుస్సేన్సాగర్ నాలా..) సీఎం కేసీఆర్ వర్షం, వరదల పై ఈరోజు సమీక్ష ఏర్పాటు చేశారని తెలిపారు. పంట నష్టంపై రైతులను ఆదుకునే విషయం పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశామని, సీఎస్ ఆధ్వర్యంలో కంట్రోల్ సెంటర్ నడుస్తుందన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమాచారం సేకరించి ప్రత్యేక బృందాలు పంపిస్తున్నారని అవసరం ఉన్న చోట ప్రజలను షెల్టర్లకు తరలించి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. రాబోవు 48 గంటల్లో మరోమారు తీవ్రమైన వర్షాలు ఉంటాయని హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల కోరారు. -
గతంలో అన్న.. ఇప్పుడు తమ్ముడు
సాక్షి, చొప్పదండి: రెండు రోజుల్లో పెళ్లి.. కొత్త జీవితం ప్రారంభించాల్సిన ఓ యువకుడిని విధి విద్యుదాఘాతం రూపంలో బలి తీసుకొని పెళ్లింట తీరని విషాదం నింపింది.. గతంలో వివాహం జరగకుండానే మొదటి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఇప్పుడు పెళ్లికి ముందే రెండో కుమారుడూ అనంతలోకాలకు వెళ్లడం ఓ తాపీ మేస్త్రీ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఎస్సై వంశీకృష్ణ కథనం ప్రకారం.. కమ్మర్ఖాన్పేటకు చెందిన పులిపాక అంజయ్య తాపీ మేస్త్రీగా పని చేస్తూ భూపాలపట్నం రోడ్డులోని చర్చి ముందు వీధిలో నివాసం ఉంటున్నాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇంటి వద్దే ఉంటుండగా కుమారుడు పులిపాక హరీష్(27) చొప్పదండిలోని డిష్ ఆపరేటర్ వద్ద కేబుల్, రీచార్జి పనులు చేస్తున్నాడు. ఇతనికి బుధవారం వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం భూపాలపట్నం రోడ్డులో అంబేద్కర్ చౌరస్తా సమీపంలో గల ట్రాన్స్ఫార్మర్ వద్ద డిష్ వైరు సరి చేస్తుండగా, మెయిన్ లైన్ మూలంగా విద్యుదా ఘాతం సంభవించి, కుప్పకూలిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు తమ వాహనంలో నగునూరులోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. గతంలో అన్న.. ఇప్పుడు తమ్ముడు అంజయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు కాగా, కూతురుకి పెళ్లి చేశాడు. పెద్ద కుమారుడు నరేష్ గతంలో రోడ్డు ప్రమాదంలో, చిన్న కుమారుడు హరీష్ ఇప్పుడు విద్యుదాఘాతంతో మృతిచెందారు. కుమారులిద్దరూ పెళ్లి కాకుండానే చనిపోవడంతో బాధిత కుటుంబీకులు రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. వీరి తల్లి కూడా గతంలోనే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. రాఖీ కట్టలేకపోయిన సోదరి రాఖీ పండుగ సందర్భంగా తనకు మిగిలిన ఒక్కగానొక్క సోదరుడికి రాఖీ కట్టాలని హరీష్ సోదరి పుట్టింటికి వచ్చింది. కానీ అతను కేబుల్ పనికి వెళ్లి చనిపోవడంతో తాను రాఖీ కూడా కట్టలేక పోయానని ఆమె రోదించింది. -
తండ్రి అనారోగ్యంతో.. తనయుడు కరోనాతో..
గోదావరిఖని(రామగుండం): అనారోగ్యంతో తండ్రి..కరోనాతో తనయుడు ఇద్దరు పదిరోజుల వ్యవధిలో మృతిచెందడం ఖనిలో విషాదం నింపింది. గోదావరిఖని కళ్యాణ్నగర్లో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్న వొడ్నాల శ్రీనివాస్(35) అనే వ్యాపారిని కరోనా కబలించింది. ఆదివారం హైదరాబాద్లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్సపొందుతున్న అతడి తండ్రి ఈ నెల 10న అనారోగ్యంతో మృతిచెందాడు. అతడి తల్లి ఆరేళ్లక్రితమే మృతిచెందింది. తండ్రి కర్మకాండ నిర్వహించాలల్సిన తనయుడు కరోనా బారినపడ్డాడు. తండ్రి చనిపోయిన దుఖంలో ఉన్న తనయుడిని కరోనావైరస్ వెంటాడింది. శ్రీనివాస్ తండ్రి చనిపోయే ముందు నుంచి స్వల్ప జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 15న కరోనా అనుమానంతో గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి వెళ్లగా లక్షణాలు లేకుండా టెస్ట్ చేయలేమని చెప్పడంతో ఇంటికి తిరిగొచ్చాడు. అదేరోజు రాత్రి విపరీతమైన దగ్గుతో బాధపడ్డాడు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రయివేట్ ఆసుపత్రులో చేర్చుకునేందుకు నిరాకరించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రిపోర్టులు ఉంటేనే చేర్చుకుంటామని యశోద ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో చేసేదేమీ లేక వెనుతిరిగి వచ్చారు. చివరగా శుక్రవారం తెల్లవారుజామున సచివాలయం సమీపంలో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఇంజక్షన్ దొరక్క మరింత విషమం.. శ్రీనివాస్ పరిస్థితి విషమించడంతో ప్రత్యేక ఇంజక్షన్ వేయాలని కుటుంబసభ్యులకు వైద్యులు తెలిపారు. ఆ ఇంజక్షన్ ఎంఆర్పీ ధర రూ.46 వేలు ఉంటే బ్లాక్ మార్కెట్లో రూ.1.40 లక్షల వరకు విక్రయిస్తున్నారని అదికూడా సకాలంలో లభించలేదని పేర్కొన్నారు. డబ్బు ఇచ్చిన తర్వాత నాలుగు గంటలకు ఇంజక్షన్ చేతికి అందిస్తున్నారన్నారు. అయినా కష్టపడి శనివారం మధ్యాహ్నం ఇంజక్షన్ కొనుగోలు చేసి తీసుకువచ్చి వేయించారు. అప్పటికే పరిస్థితి విషమంగా మారడంతో మృతిచెందాడు. ఆసుపత్రిలో రూ.4లక్షల బిల్లు అయ్యిందన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కడసారిచూపునకు నోచుకోని భార్యాపిల్లలు కోవిడ్–19 కరోనా వైరస్తో మృత్యువాతపడిన శ్రీనివాస్ మృతదేహాన్ని కడసారి చూపునకు కూడా నోచుకోని పరిస్థితి ఏర్పడింది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో శవాన్ని తీ సుకెళ్లేందుకు డాక్టర్లు ఒప్పుకోలేదని కుటుంబసభ్యులు వా పోయారు. చేసేదేమీలేక జీహెచ్ఎంసీకి అప్పగించినట్లు పే ర్కొన్నారు. అయితే మృతుడి భార్య, పిల్లలు ఇంటివద్దే ఉండడంతో కడసారి చూపునకు నోచుకోలేకపోయారు. కుటుంబసభ్యులు విలపిస్తున్న తీరు హృదయవిదారకంగా ఉంది. పదిరోజుల కిందటే ఇంటి పెద్ద, ఆదివారం అతడి కుమారుడు మృతిచెందడం స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
అమ్మా.. నన్ను క్షమించు!
సాక్షి, కోరుట్ల: ‘అమ్మా..మంచిగుండుండ్రి..ఏం టెన్షన్ తీసుకోకు..సరేనా.? నేను పనిచేయలేక సచ్చిపోతలే..అమ్మా .. నా గుండెలో మొత్తం మంచిగ అనిపిస్తలేదు..చచ్చిపోవాలనిపిస్తుంది.. నన్ను ఇక్కడే కాలెస్తరో ఏమో నాకు తెల్వదు. నా కోసం ఎవ్వరు ఏడ్వకుండ్రి..సరేనా.. మంచిగుండుండ్రి.. అక్కలను మంచిగా చూసుకో.. అ మ్మా.. నన్ను క్షమించు అంటూ ఫోన్లో వాయిస్ రికా ర్డు చేసిన జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు ఉపాధి కోసం వెళ్లిన బహ్రెయిన్లో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్కు చెందిన విట్టల వెంకటి–లక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు నవీన్(22) ఆరు నెలల కిందట ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లాడు. అక్కడ లేబర్గా పనిచేస్తూ కొన్నాళ్లు బాగానే ఉన్నాడు. సోమవారం రాత్రి 7 గంటలకు అకస్మాత్తుగా తన గదిలో తాడుతో ఉరేసుకున్నాడు. ఆత్మహత్య కు ముందు తను మాట్లాడింది ఫోన్లో రికార్డు చేసి, దాన్ని తన తల్లికి పంపమని స్నేహితున్ని కోరాడు. అందులో తాను పనిచేయలేక ఆత్మహత్య చేసుకోవడం లేదని, మనసులో ఏదో బా ధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. విషాద స్వరంతో అక్కలను.. నాన్నను మంచిగ చూసుకోవాలని.. ఏడవొద్దని కోరాడు. తన అంత్యక్రియలు బహ్రెయిన్లోనే చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేయడంతో నవీన్కు కరోనా సోకిందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ భయంతోనే మానసిక ఆందోళనకు గురై, ఆత్మహత్య చేసుకున్నాడేమోననే చర్చ స్థానికంగా జరుగుతోంది. నవీన్ మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అతని మృతదేహాన్ని స్వగ్రామం రప్పించాలని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను కోరి నట్లు కోరుట్ల ఎంపీపీ తోట నారాయణ, సర్పంచ్ తోట శారద తెలిపారు. -
మిల్లర్ల దోపిడీ.. నిర్వాహకుల మద్దతు!
కరీంనగర్రూరల్: ధాన్యం కొనుగోలు సీజన్ వచ్చిదంటే రైస్ మిల్లర్లకు పండుగ. కష్టపడి పంట పండించిన రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. మిల్లర్లు మాత్రం తాలుపేరిట దోచుకుంటున్నారు. 40 కిలోల బస్తాకు అదనంగా 2 కిలోలు తూకం వేస్తూ దండుకుంటున్నారు. అధికారుల మౌఖిక ఆదేశాలతోనే అదనంగా 2 కిలోలు తూకం వేస్తున్నామంటూ నిర్వాహకులు రైస్ మిల్లర్లకు పరోక్షంగా సహకరిస్తున్నారు. కరీంనగర్ మండలం రబీ సీజన్లో 6,396 ఎకరాల్లో వరిపంట సాగు చేయగా 2 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని అధికారులు అంచనా వేశారు. 20 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయి తే పలు గ్రామాల్లో పంట చివరిదశలో అగ్గితెగులు, మెడవిరుపు ఆశించడంతో గింజలు వట్టిపోయాయి. తాలుపేరిట జూబ్లీనగర్, నగునూర్ గ్రామాల్లో ధాన్యం తూకం వేయడం లేదంటూ ఇటీవల రైతులు ఆందోళన చేపట్టారు. ఈనెల 24న దుర్శేడు కొనుగోలు కేంద్రంలో 42 కిలోలు తూకం వేయడంపై రైతులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. సాధారణంగా 40 కిలోల చొప్పున వడ్ల బస్తాను తూకం వేస్తారు. సంచి బరువు 600 గ్రాముల నుంచి 800 గ్రాముల వరకు ఉండటంతో కిలో అదనంగా ధాన్యం కాంటా వేస్తారు. అయితే దుర్శేడు సహకార సంఘం పరిధిలోని ఇరుకుల్ల, మొగ్దుంపూర్, గోపాల్పూర్, నల్లగుంటపల్లి, చేగుర్తి కొనుగోలు కేంద్రాల్లో తాలుపేరిట మొత్తం 42 కిలోల ధాన్యం కాంటా పెడుతున్నారు. మేలు రకం ధాన్యం తెచ్చినా అదనంగా 2 కిలోలు తూకం వేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాలుపేరిట మిల్లర్లు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అధికారుల మౌఖిక ఆదేశాలతో తాలుంటే అదనంగా 2 కిలోలు తూకం వేస్తున్నట్లు సంఘం ఉద్యోగి తెలిపాడు. -
కరోనా దెబ్బతో ఊడిన ఉద్యోగాలు
సాక్షి, కరీంనగర్: అవును.. వారు రోడ్డునపడ్డారు. కరోనా ప్రభావం.. నిధుల లేమి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు శాపంగా మారింది. ఈ మేరకు ఉద్యాన శాఖలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే నుంచి విధుల్లోకి రావొద్దని స్పష్టం చేయగా, 15 ఏళ్లుగా సేవలందిస్తున్న సదరు ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వయసు పైబడటం.. ఇతర మార్గాలు లేకపోవడంతో తమ కుటుంబాలను ఎలా పోషించేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15 కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ఉద్యానశాఖలో అమలయ్యే పథకాలకు సర్కారు ఇచ్చే వార్షిక బడ్జెట్లో 5 శాతం నిధులను ఉద్యోగుల జీతభత్యాలకు ఖర్చు చేస్తారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం.. ఏడాదిగా కొత్త పథకాలు లేకపోవడంతో వీరి సేవలు అవసరం లేదని ప్రభుత్వం భావించింది. పైగా లాక్డౌన్ తోడవడంతో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో మే 1 నుంచి విధులకు హాజరు కానక్కర్లేదని సదరు ఔట్సోరి్సంగ్ ఏజెన్సీకి జిల్లా అధికారులు సమాచారమిచ్చారు. ఉమ్మడి జిల్లాలో ఉద్యాన విస్తరణాధికారులు, అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్ ఉద్యోగాలు పోయినట్లే. దశాబ్దానికిపైగా సేవలు.. ఉద్యాన పంటల సాగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా తొలి 5 స్థానాల్లో ఉంది. సాధారణ పంటలకు సమీపంగా ఈ పంటలను పండిస్తున్నారు. ఏటా దాదాపు 75 వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్లు, పూలతోటలను సుమారు 53 వేల మంది రైతులు సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంత ఎక్కువ మొత్తంలో మామిడి దిగుబడి ఉమ్మడి జిల్లాలోనే ఉంది. ఇతర జిల్లాల ప్రజల అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతటి కీలకమైన విభాగంలో ఉద్యోగులను తొలగించడంతో ఉద్యాన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శాఖలో కరీంనగర్ జిల్లాలో జిల్లా అధికారి, ముగ్గురు ఉద్యాన అధికారులు మాత్రమే ఉన్నారు. ఉద్యాన అధికారులు ఒక్కొక్కరూ ఆరేడు మండలాల వ్యవహారాలను చూస్తున్నారు. సుమారు 15 ఏళ్ల కిందట ఉద్యాన విస్తరణా«ధికారులను ఔట్సోరి్సంగ్ విధానంలో విధుల్లోకి తీసుకున్నారు. వీరు ప్రస్తుతం ఒక్కొక్కరు మూడు, నాలుగు మండలాల పరిధిలో సేవలందిస్తున్నారు. ఉన్నపళంగా వీరిని తొలగించడంతో రైతులకు ఇబ్బందే. ఆరు నెలలుగా అందని వేతనాలు.. ఉద్యాన శాఖకు కేటాయించే నిధులతోనే ఔట్సోరి్సంగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తుంటారు. బిందు, తుంపర సేద్యం, పందిరి తోటలు, షెడ్నెట్ ఇతరత్ర పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించడం.. లబి్ధదారులకు సకాలంలో సేవలందేలా చూడటంలో వీరి బాధ్యత గత నవంబర్ నుంచి వీరికి వేతనాలు రాకపోగా ఉద్యోగాల నుంచి తొలగింపు ఉత్తర్వు రావడం ఆందోళనకు గురిచేస్తోంది. రానున్న రోజుల్లో నీటిని పొదుపుగా వాడుకునేలా.. ఉద్యాన పంటలను ప్రొత్సహించేలా చర్యలుంటాయన్న సమాచారంతో తమ ఉద్యోగాలకు భరోసా ఉంటుందని వేతనాల్లేకున్నా విధులు నిర్వహిస్తున్నామని ఔట్సోరి్సంగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయని, మే నుంచి విధులకు రావొద్దని ఔట్సోరి్సంగ్ ఉద్యోగులకు చెప్పామని ఉద్యాన శాఖ అధికారి తెలిపారు. -
ఇండోనేషియన్ల సహాయకులకు కరోనా నెగెటివ్
సాక్షి, కరీంనగర్: ఇటీవల కరీంనగర్కు వచ్చిన ఇండోనేషియాకు చెందిన పది మంది మత ప్రచారకుల బృందానికి సాయం చేసిన ఇద్దరికి కరోనా నెగెటివ్ వచ్చిందని పెద్దపల్లి జిల్లా వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఇండోనేషియా బృందంతో రామగుండం ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు చేయించిన వ్యక్తి, ఇండోనేషియా బృందంతో కలిసి ఎస్–9 బోగీలో ప్రయాణించి రామగుండంలో దిగిన మరో వ్యక్తిని తీసుకెళ్లిన ఆటో డ్రైవర్కు కూడా కరోనా లక్షణాలు లేవని వెల్లడించారు. ఈ మేరకు వారిని ఇళ్లకు పంపించారు. ఈనెల 16న కరోనా లక్షణాలున్న ఇండోనేషియా బృందాన్ని కరీంనగర్ నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారితో ప్రయాణించి రామగుండంలో దిగిన వ్యక్తి ఆటోలో ఇంటికి వెళ్లాడు. దీంతో ఆటో డ్రైవర్తోపాటు, ప్రార్థనలు చేయించిన వ్యక్తిని అనుమానితులుగా ఈనెల 17 నుంచి సుల్తానాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. రెండు దఫాలుగా వారికి పరీక్షలు చేసి కరోనా సోకలేదని నిర్ధారించారు. -
మూడో మేయర్ సునీల్రావు
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించి మేయర్ పీఠం కైవసం చేసుకుంది. మేయర్గా సునీల్రావు, డెప్యూటీ మేయర్గా చల్లా స్వరూపరాణిని ఎన్నుకున్నారు. మేయర్గా సునీల్రావు శనివారం బాధ్యతలను స్వీకరించనున్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈమేరకు కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదోసారి కార్పొరేటర్.. మూడో మేయర్ సునీల్రావు(52) భార్య అపర్ణ మాజీ కార్పొరేటర్. వీరికి కుమారుడు ప్రద్యుమ్నరావు, కూతురు స్వప్నిక ఉన్నారు. 1987లో నగర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1992లో జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, 1995 నుంచి 2001 వరకూ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, 2001 నుంచి 2005 వరకూ కాంగ్రెస్ నుంచి మున్సిపల్ కౌన్సిలర్, 2005 నుంచి 2010 కాంగ్రెస్ మున్సిపల్ కార్పొరేటర్గా, 2005 నుంచి 2009 వరకూ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పని చేశారు. 2014 మున్సిపల్ ఎన్నికల్లో సునీల్రావు కాంగ్రెస్ తరఫున, ఆయన భార్య అపర్ణ ఇండిపెండెంట్గా విజయం సాధించారు. తర్వాత కొద్ది రోజులకే ఇద్దరూ టీఆర్ఎస్లో చేరారు. 2014 నుంచి టీఆర్ఎస్లో చురుకైనా పాత్ర పోషిస్తున్నారు. 2020లో జరిగిన తాజా కార్పొరేషన్ ఎన్నికల్లో 33వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్గా 1997 ఓట్ల భారీ మోజారిటీతో విజయం సాధించారు. కరీంనగర్ తొలి మేయర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి డి.శంకర్ ఎన్నికయ్యారు. 2014లో టీఆర్ఎస్ నుంచి రవీందర్ సింగ్ మేయర్గా ఉన్నారు. -
24 ఏళ్లకే ఐఏఎస్.. మున్సిపల్ కమిషనర్గా
సాక్షి, కరీంనగర్: దేశంలో చిన్న వయస్సులో ఐఏఎస్ సాధించిన వారిలో వెల్లూరి క్రాంతి కూడా ఒకరు. 24 ఏళ్లకే ఐఏఎస్ సాదించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గర్వకారణంగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాకు చెందిన వల్లూరి రంగారెడ్డి, లక్షి్మలకు ఇద్దరు కుమార్తెలు నీలిమా, క్రాంతి ఉన్నారు. క్రాంతి తల్లిదండ్రులు, అక్క అందరూ వైద్యులే. తల్లిదండ్రులు కర్నూల్లో వైద్యులుగా స్థిరపడగా, అక్క నీలిమా అమెరికాలో ఉంటున్నారు. ఇంట్లో అందరూ వైద్యులుగా ఉండడంతో క్రాంతిని చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేసే సర్వీసులో ఉండాలని, అందుకోసం ఐఎఎస్ సాధించాలని తండ్రి రంగారెడ్డి చెప్పేవారు. 10వ తరగతి వరకూ కర్నూల్లో, ఇంటర్ హైదరాబాద్లో పూర్తి చేయగా ఐఐటీ సీట్ రావడంతో ఢిల్లీ ఐఐటీలో చేరారు. అక్కడి నుంచి ఐఏఎస్ కావాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆరునెలలపాటు శిక్షణ పొందుతూ ప్రిపరేషన్ ప్రారంభించారు. 2013లో మొదటిసారి సివిల్స్ రాసి మొదటి ప్రయత్నంలోనే 562 ర్యాంక్ సాధించారు. ఐఆర్టీఎస్(ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్)లో జాయిన్ అయి వడోదర, లక్నోల్లో శిక్షణ కూడా పొందారు. 2014లో రెండవసారి మళ్లీ సివిల్స్ పరీక్షలు రాశారు. ఈసారి 230 ర్యాంక్ సాధించారు. ఐఆర్ఎస్(ఇండియన్ రెవెన్యూ సర్వీస్) వచ్చింది. 2015లో మళ్లీ సివిల్స్ రాశారు. 2016లో ప్రకటించిన తుది ఫలితాల్లో 65 ర్యాంక్తో ఐఏఎస్ సాధించారు. ఇలా 24 ఏళ్లకే ఐఏఎస్ సాధించి రికార్డ్ సృష్టించారు. శిక్షణ అనంతరం క్రాంతిని తెలంగాణ క్యాడర్కు కేటాయించారు. అలా మొదట నిర్మల్ జిల్లాలో పని చేశారు. అనంతరం ప్రత్యేకాధికారిగా మహబూబ్నగర్లో 15 నెలలపాటు పని చేయగా తాజాగా జరిగిన బదిలీల్లో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా వచ్చారు. ఆటలన్నా.. పాటలన్నా ఇష్టం... వల్లూరి క్రాంతికి ఆటలన్నా పాటలన్నా చాలా ఇష్టమని పలు సందర్భాల్లో వెల్లడించారు. చిన్నపుడు బాస్కెట్బాల్ ప్లేయర్ అయిన క్రాంతి తర్వాత టెన్నిస్, బ్యాడ్మింటన్ బాగా ఆడుతారు. ప్రముఖుల బయోగ్రఫీ పుస్తకాలు ఇష్టంగా చదువుతారు. వీటితోపాటు తెలంగాణ పాటలను బాగా ఇష్టపడుతారు. ముఖ్యంగా ఉద్యమ నేపథ్యం, సంస్కృతిపైన వచ్చిన పలు జానపదాలను ఇష్టంగా వింటారు. బతుకమ్మ పండుగను బాగా ఇష్టపడుతారు. -
కులాలు తారుమారు!
సాక్షి, కోల్సిటీ/జ్యోతినగర్(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ కోసం అధికారులు చేపట్టిన కుల గణన సర్వేలో మళ్లీ తప్పులుదొర్లాయి. సోమవారం అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రదర్శనకు పెట్టారు. జాబితాలో డివిజన్ల వారీగా ఫొటో ఓటర్ల జాబితాను సామాజిక వర్గాలవారీగా ప్రదర్శనకు పెట్టారు. మంగళవారం జాబితాను పరిశీలించిన పలువురు ఖంగుతిన్నారు. ఓటర్ల కులాలను తప్పులతడకగా నమోదు చేసిన అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా డివిజన్లలో సామాజిక వర్గాలను గుర్తించడానికి అధికారులు మొక్కుబడిగా సర్వే చేపట్టారని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక సామాజిక కులానికి చెందిన వ్యక్తిని, మరో సామాజిక కులం వ్యక్తిగా తప్పుగా నిర్ధారిస్తూ ఓటర్ల ముసాయిదా జాబితాలో పొందుపర్చడం గమనార్హం. గత జూలైలో కూడా అధికారులు ఓటర్ల సామాజిక వర్గాలను గుర్తించడంలో తప్పులు దొర్లాయని ఆయా సామాజిక వర్గాలకు వారు ఫిర్యాదులు చేశారు. వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి కొత్త జాబితా రూపొందించినట్లు చెబుతున్న అధికారులు, సోమవారం విడుదల చేసిన ఓటర్ల ముసాయిదాలో కూడా తప్పులు దొర్లడంతో చర్చనీయాశంగా మారింది. అధికారులు, సిబ్బంది ఇంటింటికీ తిరిగి సర్వే చేయకుండా... ఒకే దగ్గర కూర్చొని తప్పులతడకగా జాబితా తయారు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. సామాజిక వర్గాల గుర్తింపులో అయోమయం... ఓటర్ల సామాజిక వర్గాల గుర్తింపులో అయోమయం, గందరగోళం నెలకొంది. పలు డివిజన్కు చెందిన బీసీలను ఎస్సీలు, ఎస్టీలుగా నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. బీసీ సామాజిక వర్గానికి ఓల్లాది ఓదెలు అనే వ్యక్తితోపాటు అతని కుటుంబ సభ్యులను ఎస్టీ సామాజిక వర్గంగా, బీసీ సామాజిక వర్గానికి చెందిన బత్తుల భరత్ అనే యువకునితోపాటు అతని కుటుంబ సభ్యులను ఎస్సీలుగా జాబితాలో పొందుపరిచారు. మరో ఓసీ సామాజికవర్గానికి చెందిన కుటుంబ సభ్యులను బీసీలుగా, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలను బీసీలుగా మార్చారు. ఒకే కుటుంబంలో ఒకరిని బీసీలుగా, ఇంకొకరిని ఎస్సీలు జాబితాలో పొందుపరిచారు. హిందూ పేరుతో ఓటర్లు! కొత్తగా ఏర్పడిన మూడో డివిజన్లోని ఓటరు ఐడీ నంబర్లు ఆర్కేకే2238285, ఆర్కేకే2240877, ఆర్కేకే2247336, ఆర్కేకే2240836 ఐడీలలో ఓటరు పేరు ముద్రితం కాకుండా హిందూ హిందూ అని ముద్రితమైంది. ఒకే ఇంటి నంబరులో ఉన్న ఇద్దరు ఓటర్లకు మూడేసి ఓట్లు ఉన్నట్లు వాటికి మూడు రకాల ఐడీ నంబర్లు సైతం ఉన్నాయి. దీంతో ఓటరు జాబితాను తయారు చేసిన తీరుపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటి ఓటరు సర్వే చేసిన వారు ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరికి మూడు ఓట్లు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఓటరు తుది జాబితా వచ్చే లోపు సవరణలు చేపట్టి కచ్చితమైన ఓటరు జాబితాను తయారు చేయాలని పలువురు కోరుతున్నారు.. పురుషులు.. మహిళలుగా.. కోల్సిటీ(రామగుండం): ఈ ఓటరు స్లిప్పై పేరున్న వ్యక్తి కానుగంటి శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. గోదావరిఖనిలో ఉంటాడు. ఇతని పేరు, ఫొటోను చూసి కూడా పురుషుడు అని గుర్తించని ఉద్యోగులు ఓటరు జాబితాలో మహిళగా తప్పుగా నమోదు చేశారు. ఇలా మహిళలను పురుషులుగా గుర్తిస్తూ ఓటరు జాబితాలో పొందుపరిచారు. రామగుండం కార్పొరేషన్లో సోమవారం విడుదల చేసిన ముసాయిదాలో చాలా మంది ఓటర్ల వివరాల నమోదులో తప్పులు దొర్లాయి. మహిళలను పురుషులుగా నమోదు చేసిన అధికారులు, పురుషులను మహిళలుగా గుర్తించారు. కొందరు ఓటర్ల పేర్లు, వారి తల్లిదండ్రుల పేర్లను హిందూ అని నమోదు చేశారు. దీంతో ఓటరు జాబితా ఆధారంగా డివిజన్లలో మహిళలు, పురుషుల సంఖ్యను లెక్కించడంలో తేడాలు ఏర్పడే సమస్యలు ఉన్నాయి. మంగళవారం వీటిని గుర్తించిన బల్దియా అధికారులు, మరోసారి జాబితాను క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. పురుషుల పేర్లు, ఫొటోలను చూసి కూడా ఆడవాళ్లను మగవాళ్లుగా, పురుషులను మహిళలుగా ఓటరుగా నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. -
కేసులు సత్వరం పరిష్కరించాలి
సాక్షి, కరీంనగర్: న్యాయస్థానాల్లో కేసులు త్వరగా పరిష్కరించాలని, ఇందుకు న్యాయమూర్తులతోపాటు న్యాయవాదులు, కక్షిదారుల సహకరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్చౌహాన్ అన్నారు. కరీంనగర్ కోర్టులో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ప్లాంట్, ఫ్యామిలీ కోర్టు మినీగార్డెన్, ఈఫైలింగ్ కోర్టు విభాగాలను హైకోర్టు న్యాయమూర్తులు, కరీంనగర్ పోర్ట్ఫోలియో జడ్జి జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ పి.నవీన్రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసి సమావేశంలో మాట్లాడారు. కోర్టు భవనాలు పటిష్టంగా తయారు చేస్తున్నామన్నారు. కోర్టుల్లో చక్కని వాతవరణం నెలకొల్పి, కోర్టుకు వచ్చేవారికి ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామని తెలిపారు. కరీంనగర్ కోర్టు తెలంగాణలో ఉన్న అన్ని కోర్టులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ దృష్టి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోర్టులో అన్ని సదుపాయాలు కల్పిస్తే కోర్టుకు వచ్చే న్యాయవాదులు, కక్షిదారులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి కావాల్సిన పరిజ్ఞానం అభివృద్ధికి న్యాయమూర్తులకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జనవరిలోగా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా న్యాయవాదుల పరిజ్ఞానం అభివృద్ధికి వర్క్షాప్లు ఏర్పాటు చేయాలన్నారు. దీని ద్వారా చట్టాలపై లోతైన అవగాహన కలుగుతుందని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు న్యాయవాదులు కక్షిదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. కరీంనగర్లో కోర్టులో 762 కేసులు పెండింగ్లో ఉండగా మరో రెండు కోర్టుల్లో 80, 22 కేసులు దాదాపు 10 ఏళ్లకుపైగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అనంతరం కరీంనగర్ పోర్ట్ఫోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం మాట్లాడుతూ కోర్టులు సరైన సమయంలో తీర్పులు ఇవ్వకపోవడంతోనే ప్రత్యేకంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. నిబంధనల మేరకే న్యాయమూర్తులను నియమించడం జరుగుతుందన్నారు. హైకోర్టు పరిధిలో ఉన్న అంశాలను ఎప్పుటికప్పుడు పరిష్కారం చేస్తున్నామన్నారు. అభివృద్ధిలో మార్పు అనేది కింది స్థాయి నుంచి రావాలని, మన చేతిలో ఉన్న చిన్నచిన్న అభివృద్ధి పనులు మనం చేసుకుంటే తప్పుకాదని వివరించారు. హైకోర్టు మరో జడ్జి పి.నవీన్రావు మాట్లాడుతూ కోర్టులో అధునాతన మార్పులు అనందకరమన్నారు. త్వరలో మరిన్ని మార్పులు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి మాట్లాడుతూ కరీంనగర్లో కోర్టులో నూతన మార్పులు అందరి సహకారంతో చేయగలిగామని, సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ మెంబర్ కాసుగంటి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ కోర్టు భవనాలను ప్రముఖ కంపెనీలకు కాంట్రాక్టు అప్పగించాలని అప్పుడే దీర్ఘకాలికంగా మన్నిక ఉంటుందని, సంబందిత కంపెనీలు కూడా బాధ్యతగా పర్యవేక్షిస్తారని సూచించారు. ప్రభుత్వ విభాగాలకు అప్పగిస్తే కట్టి వదిలేస్తున్నారని తర్వాత పట్టించుకోవడం లేదని తెలిపారు. అనంతరం కేసుల విషయంలో పలు సమస్యలను హైకోర్టు న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ.రాజ్కుమార్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని కోర్టు ఆవరణలో న్యాయవాదులకు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్రెడ్డి, ఫారెస్ట్ ఛీప్ కన్జర్వేటర్ అక్బర్, జగిత్యాల, సిరిసిల్ల ఎస్పీలు సింధూశర్మ, రాహుల్హెగ్డే వివిధ కోర్టుల న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లెంకల రాంరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, న్యాయస్థానాల సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తికి ఘనస్వాగతం... ఉదయం కరీంనగర్ కోర్టుకు చేరుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్కు జిల్లా జడ్జి అనుపమచక్రవర్తి ఆధ్వర్యంలో కలెక్టర్సర్పరాజ్ అహ్మద్, కరీంనగర్ పోలీసు కమి షనర్ వీబీ.కమలాసన్ రెడ్డి, వరంగల్ రేంజ్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ అక్బర్ ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. తర్వాత పూర్ణకుంభ స్వాగ తంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ప్లాంట్, ఫ్యామిలీ కోర్టు, చైల్డ్ఫ్రెండ్లీ కోర్టు భవనం, మిని పార్కు ప్రారంభించారు. కోర్టు ఆరవణలో హైకోర్టు న్యాయమూర్తులు బస్టిస్ కోదండరాం, పి,నవీన్రావుతో కలిసి మొక్కలు నాటారు. తర్వాత నూతనంగా ఏర్పాటు చేసిన ఈ–ఫైలింగ్ సెంటర్ను ప్రారంభించారు. కరీంనగర్ ది బెస్ట్... కరీంనగర్ కోర్టును ది బెస్ట్ కోర్టుగా ఆదర్శంగా నిలుపాలని ఆకాంక్షిస్తూ చక్కటి ఆహ్లాదకరమైన వాతావారణం ఏర్పాటు చేసిన జిల్లా జడ్జి అనుపమచక్రవర్తి, జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్తోపాటు ఫారెస్ట్ అధికారులపై ప్రశంసలు కురిపించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఉచితంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు కమిషనర్, సిబ్బందిని అభినందించారు. బార్ అసోసియేషన్ సభ్యులు చక్కటి క్రమశిక్షణతో ఉన్నారని చీఫ్ జస్టిస్ కితాబునిచ్చారు. అనంతరం కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్రెడ్డి, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ అక్బర్, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డికి చీఫ్ జస్టిస్ శాలువాలు కప్పి అభినందించారు. న్యాయవాదులు అంకితభావంతో పనిచేయాలి : హైకోర్టు జడ్జి కోదండరామ్ కమాన్చౌరస్తా(కరీంనగర్): న్యాయవాదులు వృత్తిపై అంకిత భావంతో పనిచేయాలని, సమాజంలో తమ బాధ్యత తెలుసుకుని ఎంచుకున్న పనిలో నైపుణ్యత సాధించి దేశ అభివృద్ధికి పాటుపడాలని తెలంగాణ హైకోర్టు జడ్జి, కరీంనగర్ జిల్లా ఫోర్ట్ ఫోలియో జడ్జి, జస్టిస్ కోదండరామ్ అన్నారు. కరీంనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో రాజ్యాంగ దినోత్సవంలో భాగంగా న్యాయవాద పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ లాపై శనివారం ఉదయం నిర్వహించిన వర్క్షాప్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశం కంటే ఎన్నో దేశాలు వెనుకబడి ఉన్నాయని, చిన్నదేశాల వారు ఎంతో అంకిత భావంతో దేశంపై ప్రేమతో ఉండడం వల్లనే సింగపూర్ వంటి దేశాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. దేశం నాకు ఏం ఇచ్చిందని కాదని దేశానికి నేను ఏం చేయాలో ఆలోచించాలన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ , సీనియర్ న్యాయవాది కాసుగంటి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ రెవెన్యూ చట్టాల వివరాలను న్యాయవ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని, ప్రత్యేక రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది భాస్కర్రెడ్డి రెవెన్యూ చట్టాలపై న్యాయవాదులకు అవగాహన కల్పించారు. సమావేశంలో న్యాయవాద పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు కరూర్ మోహన్, ప్రధాన కార్యదర్శి సునీల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూపల్లి సత్యనారాయణరావ్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణార్జునచారి, వేణుగోపాల్, బార్ కౌన్సిల్ మెంబర్ జయాకర్, కరీంనగర్ జిల్లా కోర్టు ప్రభుత్వ న్యాయవాది కేవీ వేణుగోపాల్రావు, వివిధ బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులు, సీనియర్, జూనియర్, మహిళ న్యాయవాదులు పాల్గొన్నారు. -
దేశంలోనే ‘హరితహారం’ సరికొత్త రికార్డు
సాక్షి, ధర్మారం(ధర్మపురి): దేశంలోనే ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ‘హరితహారం’ కార్యక్రమాన్ని చేపట్టి రికార్డు సృష్టించిందని రాష్ట్ర సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామ శివారులో వానరవనంలో ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ‘30 రోజుల ప్రణాళిక’ను గ్రామగ్రామాన అమలు చేయటం జరుగుతోందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను ఆయా గ్రామాల పాలకవర్గాలతో పాటుగా అధికారులకు అప్పగించి ప్రభుత్వం పకడ్బందీగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటుందన్నారు. నాలుగేళ్లలో కోటి 50 లక్షల మొక్కలను నాటడం జరిగిందన్నారు. కోతుల విధ్వంసంతో పంటలు నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో వనారవనాన్ని ఏర్పాటు చేసి పండ్ల మొక్కలను పెంచుతుందన్నారు. దీంతో గ్రామాల్లో ఉన్న కోతులు అడవిలోకి వెళతాయన్నారు. ఈ వనంలో 180 రకాల పండ్ల మొక్కలను నాటుతున్నామన్నారు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో ఈ కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఫొటోలకు పోజులివ్వటం కాదు.. ‘మొక్కలను నాటి వెళ్ళి పోవటం కాదు.. పెట్టిన ప్రతి మొక్కను రక్షించాలి.. నేను మొక్కను నాటుతుంటే నా వెంట ఉంటూ నిలపడితే సరికాదు. నా వద్ద బెల్లం లేదు.’ అన్నారు. మంత్రి ఈశ్వర్ ఖిలావనపర్తి వానరవనంలో మొక్కలు నాటేందుకు వచ్చిన మంత్రి ఈశ్వర్కు మొక్కను నాటిన తర్వాత సరిపడు మట్టి అందుబాటులో లేకపోవటంతో మంత్రికి కోపాన్ని తెప్పించింది. గుంతలు ఎందుకు తీయలేదని గ్రామస్తులను ప్రశ్నించారు. తాను వెళ్లిన తర్వాత ఇంతే సంగతా అని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం ఎంతో గొప్పదని ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని ఆయా గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలన్నారు. ఎంపీపీ కరుణశ్రీ, జెడ్పీటీసీ పద్మజ, సర్పంచ్ కనకతార, ఎంపీటీసీ సుజాత, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జితేందర్రావు, నాయకులు బలరాంరెడ్డి, రాజేశం, రాజయ్య, బుచ్చిరెడ్డి, మల్లేశం, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా
సాక్షి, కరీంనగర్: ‘అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తాను... తప్పు చేయాల్సి వస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటా... మనిషిని మారను... మాట మారదు.. ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటా’ అని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గంగుల మంత్రి పదవి చేపట్టిన సందర్భంగా బీసీ కులాల ఐక్యవేదిక కన్వీనర్ మెతుకు సత్యం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ పద్మనాయక కల్యాణమండపంలో సోమవాం నిర్వహించారు. సభ ప్రాంగణానికి మంత్రి గంగుల రాగానే వేదమంత్రాలు, పూర్ణకుంభం స్వాగతం పలికారు. ప్రధాన ద్వారం నుంచి మేళతాళాలతో లోనికి తీసుకొచ్చారు. బీసీ కుల సంఘాల ప్రతి నిధులు, సభ్యులు మంత్రి గంగుల కమలాకర్పై అభిమాన పూలజల్లు కురిపించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బడుగులకు బాసటగా నిలిచింది కేవలం టీఆర్ఎస్ సర్కారేనని పేర్కొన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు హైదరాబాద్లో 45 కుల సంఘాలకు 85 ఎకరాల భూమి కేటాయిస్తూ రూ.85 కోట్లు విడుదల చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కార్దేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బీసీ గురుకులాలను ఏర్పాటు చేసి 98 వేల మంది బీసీ బిడ్డలకు చదువుకునే అవకాశం కల్పించారని అన్నారు. విదేశాలకు వెళ్లి చదివేందుకు రూ.20 లక్షల ఆర్థిక సహాయం కింద సంక్షేమ శాఖ నుంచి విదేశీ విద్యా నిధి పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. వెనుకబడ్డ కులాల బిడ్డగా పుట్టడం తన అదృష్టమన్నారు. నమ్ముకున్న వారికి ఎళ్లవేళలా అండగా ఉంటానని ఎవరికీ మచ్చ తీసుకురా కుండా పని చేస్తానని హమీ ఇచ్చారు. గంగుల కమలాకర్ ఒక వ్యక్తి కాదని, వెనుకబడ్డ కులాల శక్తి తనకు అండగా ఉందని అన్నారు. ప్రజల కోసం చేసిన అభివృద్ధి పనులే వరుసగా మూడుసార్లు గెలిపించాయని ప్రజల అభివృద్ధికి సర్వదా కట్టుబడి ఉంటానని చెప్పారు. కరీంనగర్ బిడ్డలకు ఉపాధి కల్పించేందుకు ఐటీ టవర్ నిర్మిస్తున్నామని, పర్యాటకంగా అభివృద్ధి చేసేం దుకు కేబుల్ బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యా యని, భవిష్యత్తులో మానేరురివర్ ఫ్రంట్ కూడా నిర్మిస్తామని స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధికి త్వరలోనే వర్క్షాప్ ఏర్పాటు చేసి అన్ని విషయాలు సమగ్రంగా చర్చిస్తామని ప్రకటిం చారు. సన్మాన కార్యక్రమంలో ఎల్లాపి సంఘం ప్రతినిధి గణేశ్బాబు, గౌడ సంఘం ప్రతినిధి కోడూరి సత్యనారాయణగౌడ్, పూలే బీసీ సంఘం ప్రతినిధి రాచకోండ సత్యనారాయణ, పద్మశాలి సంఘం ప్రతినిధి దూడం లక్ష్మీరాజం, రజక సంఘం ప్రతినిధి దుడ్డెల శ్రీధర్, యాదవ సంఘం ప్రతినిధి గొర్రె అయిలేష్ యాదవ్, గంగుపుత్ర సంఘం ప్రతినిధి చేతి ధర్మయ్య,గంగాధర కనుకయ్య, తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్కుమార్, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, చల్ల హరిశంకర్, బండారి వేణు, బోనాల శ్రీకాంత్, గందె మహేశ్, సింహరాజు కోదండరాములు, మంద నగేశ్, శ్రీధర్రాజు, నీలం మొండయ్య, జయరాం, జక్కం సంపత్, పెండ్యాల మహేశ్కుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
మాకో వైన్స్ కావాలి..!
సిరిసిల్ల: మరో పన్నెండు రోజుల్లో మద్యం లైసెన్స్ల గడువు ముగియనుంది. ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ ఏవిధంగా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొందరు వ్యాపారులు, యువకులు సైతం ఈసారి మద్యం లైసెన్స్లు పొందేందుకు జతకడుతున్నారు. జిల్లాలో 42 మద్యం దుకాణాలు ఉండగా.. వీటికి 2017 సెప్టెంబరులో లైసెన్స్ జారీచేశారు. అదే ఏడాది అక్టోబరు ఒకటే తేదీన వైన్స్లు తెరిచారు. కలిసొచ్చిన ఎన్నికలు.. మద్యం వ్యాపారులకు గతరెండేళ్లు కలిసి వచ్చింది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో పాటు, గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పార్ల మెంట్ ఎన్నికలు వరుసగా రావడంతో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. జిల్లాలో 42 దుకాణాలు ఉండగా.. రెండేళ్లలో రూ.560. 50 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 8,29,882 ఐఎంఎల్ బాక్స్లు, 17,27,113 బీర్ బ్యాక్స్లు అమ్ముడుపోయాయి. సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. ఊరూరా కిక్కు.. జిల్లాలోని 42 మద్యం దుకాణాలకు అనుబంధంగా అనేక గ్రామాల్లో బెల్ట్ షాపులు తెరిచారు. సుమారు వెయ్యికిపైగా బెల్ట్షాపులు ఉన్నాయని తెలుస్తోంది. ఎల్లారెడ్డిపేటలోని ఓ వైన్స్లో రెండేళ్లలో రూ.23.05 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 25.1 శాతం అమ్మకాలతో టాప్లో నిలిచింది. ఎల్లారెడ్డిపేట, రాచర్ల గొల్లపల్లి వైన్స్ షాపుల్లోనూ వరుసగా రూ.18.80కోట్లు, రూ.18.77 కోట్లతో రెండు, మూడు స్థానంలో నిలిచాయి. ఇల్లంతకుంటలోని ఓ వైన్స్ షాప్లో రూ.17.54కోట్ల మద్యం విక్రయించి నాలుగో స్థానం దక్కించుకుంది. సిరిసిల్ల, తంగళ్లపల్లి, గంభీరావుపేట వైన్స్ షాపులు వరుసగా పదో స్థానం వరకు ఉన్నాయి. వేములవాడలో ఓ వైన్స్ షాపు రూ.14.50 కోట్ల మద్యం విక్రయించి 11వ స్థానంలో ఉండగా రెండేళ్లలో రూ.10 కోట్లలోపు మద్యం విక్రయించి వేములవాడలోని ఓ మూడు వైన్స్ షాపులు చివరిస్థానంలో నిలిచాయి. కొత్త పాలసీపై కోటి ఆశలు వచ్చే అక్టోబర్ ఒకటి నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. దరఖాస్తు ఫీజు, ఈఎండీలో ఏమైనా మార్పులు ఉంటాయా అనే ఉత్కంఠ లిక్కర్ వ్యాపారుల్లో నెలకొంది. ఇప్పటికే మద్యం వ్యాపారులు సన్నిహితులతో జతకడుతూ సిండికేట్గా మారుతున్నారు. 10 మంది జతగా ఉండి దరఖాస్తు చేసుకుని ఏ ఒక్కరికి లక్కీ డ్రాలో మద్యం షాపు వచ్చినా అందరూ పంచుకునేలా ఒప్పందాలు చేసు కుంటున్నారు. రెండేళ్ల క్రితం ఆబ్కారీ పాలసీ దరఖాస్తు ఫీజు రూ.లక్ష ఉండగా, ఈఎండీ లైసె న్స్ ఫీజులో 10 శాతం ఉంది. అంటే మండల కేంద్రాల్లో రూ.4.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.50లక్షలు నిర్దేశించారు. జనాభా ప్రాతిపదికన ఆబ్కారీ విధానం రూపొందించారు. గతంలో జిల్లాలోని 42 వైన్స్ షాపులకు 672 దర ఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.6.72 కోట్ల ఆదాయం సమకూరింది. లిక్కర్కు ‘రియల్’ ఎఫెక్ట్... జిల్లాలో మద్యం వ్యాపారంపై రియల్ ఎస్టేట్ భూం ప్రభావం ప్రధానంగా ఉంటుంది. సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దందా ఎక్కువగా ఉంది. భూముల ధరలు పదింతలు అవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ ఎత్తున లిక్కర్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం గా ఉన్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీ రాగానే రూ. కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమవుతున్నారు. రెండు, మూడు రోజుల్లో కొత్త ఆబ్కారీ విధానానికి నోటిఫికేషన్ వెలువడుతుందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ఈసారి అన్ని వైన్స్ లకు భారీగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. -
'స్మార్ట్' మిషన్.. స్టార్ట్ !
సాక్షి, కరీంనగర్: కరీంనగరాన్ని సుందరీకరించే ‘స్మార్ట్’ పనుల్లో ఎట్టకేలకు వేగం పెరగనుంది. నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు గంగుల కమలాకర్ రాష్ట్ర కేబినెట్లో స్థానం సంపాదించుకోవడంతో స్మార్ట్ రోడ్లకున్న ఆటంకాలు తొలగాయి. మంత్రిగా స్మార్ట్సిటీ పనులను త్వరితగతిన పూర్తి చేయడమే తొలి ప్రాధాన్యతగా ఆయన ఎంచుకున్నారు. రూ.1878 కోట్లతో కరీంనగర్ను స్మార్ట్సిటీగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం అనుమతిచ్చి మూడేళ్లు అవుతున్నా... స్థానికంగా నెలకొన్న రాజకీయాల కారణంగా ఒక అడుగు కూడా సవ్యంగా ముందుకు పడలేదు. ఇప్పటి వరకు మూడు విడతల్లో కరీంనగర్ స్మార్ట్సిటీ కోసం రూ.271.70 కోట్లు మంజూరైనప్పటికీ, అరకొర పనులు తప్ప ఏ ఒక్క పని పూర్తికాలేదు. స్మార్ట్సిటీ కింద అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి పనులు, ఆర్ట్స్ కాలేజీ, సర్కస్ గ్రౌండ్స్ల్లో చేపట్టిన అభివృద్ధి పనులు కొంత మేర సాగుతున్నా... స్మార్ట్ రోడ్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియలోనే పనులు నిలిచిపోయాయి. మూడు ప్యాకేజీల్లో రూ.228.70 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక రూపొందించి తొలిసారి టెండర్లు పిలవగా, ఎవరూ ముందుకు రాలేదు. రెండోసారి టెండర్లు ఆహ్వానిస్తే రూ.53 కోట్ల విలువైన మూడో ప్యాకేజీ పనులకు మాత్రమే కాంట్రాక్టర్ను ఎంపిక చేశారు. రూ.164 కోట్ల విలువైన మొదటి, రెండో ప్యాకేజీ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించడంతో రద్దయ్యాయి. మూడో విడత టెండర్లపై కూడా కోర్టులో దావా వేయగా, గత నెలలో స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా చొరవ తీసుకొని కేసులను ఉపసంహరింప జేయడంతో స్మార్ట్ రోడ్లకు గ్రహణం తొలిగింది. మూడో ప్యాకేజీ పనులను దక్కించుకున్న నమిత కన్స్ట్రక్షన్స్ కంపెనీకి ఆరునెలల క్రితమే వర్క్ ఆర్డర్ వచ్చినప్పటికీ, ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. వివాదాల నడుమ రూ.164 కోట్ల విలువైన ఒకటి, రెండో ప్యాకేజీలను దక్కించుకున్న రాజరాజేశ్వరి కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సోమవారమే వర్క్ ఆర్డర్ వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం నుంచే స్మార్ట్ రోడ్ల పనులు మొదలు కాబోతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా వెల్లడించడం గమనార్హం. నేడు అధికారులతో సమావేశం స్మార్ట్రోడ్ల పనులకు సంబంధించి తొలి అడుగుగా బుధవారం అధికారులతో మంత్రి గంగుల సమావేశం కానున్నారు. మూడో ప్యాకేజీ కింద వర్క్ ఆర్డర్లు వచ్చినా హౌసింగ్బోర్డు కాలనీలో పనులు సాగకపోవడానికి వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం కూడా కారణమని స్పష్టమైంది. హౌసింగ్ బోర్డులో 7.5 కిలోమీటర్ల మేర వేయాల్సిన రోడ్లతోపాటు ఒకటి, రెండు ప్యాకేజీల్లో 27.5 కిలోమీటర్ల పొడవునా రోడ్లు నిర్మించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రోడ్ల నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న చెట్లు తొలగించడం, విద్యుత్ స్తంభాల స్థల మార్పిడి, మిషన్ భగీరథ పనులు, భూగర్భ డ్రైనేజీ పనులు మొదలైన వాటితో ఆటంకాలు ఎదురు కాకుండా ఎంపిక చేసిన రోడ్లలో సమన్వయంతో అన్ని శాఖలు పనిచేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్, మునిసిపల్ కమిషనర్తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొనే ఈ సమావేశంలో స్మార్ట్సిటీ పనులతోపాటు మిషన్ భగీరథ, ఆర్అండ్బీ, పంచాయితీ రాజ్, యూజీడీ, సీఎం హామీ పనులకు సంబంధించి ప్రోగ్రెస్ను తెలుసుకోనున్నారు. ప్రధానంగా స్మార్ట్రోడ్లకు అడ్డంకులను తొలగించి రహదారులను సుందరీకరించడం, సీఎం హామీ కింద జరుగుతున్న రూ.347 కోట్ల పనుల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవడమే ఈ సమావేశం ప్రధాన ఉద్ధేశం. తగ్గనున్న రాజకీయ జోక్యం స్మార్ట్రోడ్లకు సంబంధించి రెండు కంపెనీలకు వర్క్ ఆర్డర్లు కూడా జారీ కాగా, మంత్రి గంగుల స్వయంగా పర్యవేక్షించనుండడంతో పనుల్లో రాజకీయ జోక్యం తగ్గనుంది. మునిసిపల్ కౌన్సిల్ కూడా రద్దయిన నేపథ్యంలో మాజీ కార్పొరేటర్లు కొంత మేర ఆజమాయిషీ చలాయించాలని చూసినా, మంత్రి దృష్టి పెడుతుండడంతో కాంట్రాక్టర్లకు ఇబ్బందులు చాలా వరకు తగ్గనున్నాయి. వర్క్ ఆర్డర్లు కూడా వచ్చిన నేపథ్యంలో అభివృద్ధి పనులను అడ్డుకునే సాహసం ఇతర రాజకీయ పార్టీల నుంచి కూడా ఉండదని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులు సమన్వయంతో పనిచేస్తే స్మార్ట్రోడ్లతోపాటు ఇతర స్మార్ట్సిటీ పనులు కూడా వేగంగా సాగే అవకాశం ఉంది. -
చొప్పదండి ఎమ్మెల్యేకు చుక్కెదురు.!
సాక్షి, బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని మాన్వాడలోని శ్రీరాజరాజేశ్వర (మిడ్మానేరు) ప్రాజెక్టు పరిసరాల్లో సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను నీలోజిపల్లి, కుదురుపాక గ్రామానికి చెందిన నిర్వాసితులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మిడ్మానేరు ప్రాజెక్టు కట్ట పరిసరాల్లో ఎంపీ సంతోష్కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటేందుకు ఎమ్మెల్యే వచ్చారు. మొదట ప్రాజెక్ట్ సమీపంలోని ప్రైవేట్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం తనను నిర్వాసితులు అడ్డుకుంటారనే ముందస్తు సమాచారంతో నిర్వాసితులు ఉన్న ప్రాంతం నుంచి కాకుండా మిడ్మానేరు కట్టపై నుంచి గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొనేందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమాచారం అందుకున్న నిర్వాసితులు అక్కడికి వెళ్లి ఎమ్మెల్యే వాహనం ఎదుట బైఠాయించారు. వెంట ఉన్న పోలీసులు నిరసనకారులను అడ్డుతప్పించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే రావాలని నిర్వాసితులు పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే తన వాహనం దిగి నిర్వాసితులు కూర్చున్న స్థలం వద్దకు వచ్చి కూర్చున్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఇళ్ల నిర్మాణాలకు రూ.5.04 లక్షలు పరిహారం ఇస్తామని సీఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని, 18 ఏళ్లు నిండిన యువతులకు రూ.2 లక్షల ప్యాకేజీతోపాటు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ను బతిమిలాడి నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి, ఇప్పుడు మాట ఎందుకు మారుస్తున్నారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో సమస్యలపై మాట్లాడేందుకు రావాలని ఎమ్మెల్యే వారిని కోరినా స్పందించకపోవడంతో బైఠాయించిన నిర్వాసితులను పోలీసులు పక్కకు తొలగించడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పత్తాలేని అండర్–19 రాష్ట్ర పోటీలు...
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి జిల్లా క్రీడారంగం కుదేలైందా.. జిల్లాలో క్రీడా పోటీల నిర్వహణ క్రమంగా తగ్గిపోతోంది.. క్రీడలను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. క్రీడల్లో పాల్గొనేవారి సంఖ్య కూడా తగ్గుతోంది. 2019–20 విద్యాసంవత్సరంలో నిర్వహించే పోటీలను చూస్తుంటే క్రీడారంగం దయనీయ పరిస్థితికి అద్దం పండుతోంది. మొన్ననే రాష్ట్ర పాఠశాలల, కళాశాలల క్రీడాసమాఖ్య తెలంగాణలోని 31 జిల్లాలకు వివిధ క్రీడల్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించే క్రీడలను ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో అండర్ – 14, 17 విభాగంలో కేవలం ఆరు అంశాల్లోనే పోటీలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఒక్క క్రీడాంశంలో కూడా రాష్ట్ర పోటీల నిర్వహాణ జరుగలేదు. ఇక అండర్–19 విభాగంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోటీలకే దిక్కు లేకుండా పోవడం కొసమెరుపు. కరీంనగర్ జిల్లా క్రీడారంగం తెలంగాణ రాష్ట్రానికే తలమానికం. గతంలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పాఠశాలల, కళాశాలల క్రీడలతోపాటు వివిధ క్రీడా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పలు క్రీడల్లో విజయఢంకా మోగించి కరీంనగర్ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. అంతేకాకుండా ఎప్పుడూ ఏదో ఒక క్రీడలో రాష్ట్ర, జాతీయ పోటీల నిర్వహణ పోటాపోటీగా జరుగడంతో క్రీడాహబ్గా కరీంనగర్ అభివృద్ధి చెందుతుందనే సంకేతాలు వచ్చాయి. ఈ క్రమంలో గతేడాది నుంచి క్రీడల నిర్వహణ తగ్గుతోంది. గతేడాది సుమారు 10కిపైగా క్రీడల్లో రాష్ట్ర పోటీలు, ఒక క్రీడలో జాతీయస్థాయి పోటీలు జరిగాయి. ఈయేడు ఆ సంఖ్య ఆరుకు పడిపోయింది. పత్తాలేని అండర్–19 రాష్ట్ర పోటీలు... స్కూల్ గేమ్స్ పరంగా చూస్తే అండర్ 14, 17 విభాగాల్లో సుమారు ఆరు క్రీడాంశాల్లో రాష్ట్ర పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న ఉమ్మడి జిల్లా అండర్–19 విభాగానికి వచ్చే సరికే పత్తా లేకుండా పోయింది. నాలుగు జిల్లాల్లో కనీసం ఒక్క క్రీడలో రాష్ట్ర పోటీలు నిర్వహించే బాధ్యతను ఆ సమాఖ్య కార్యదర్శి తీసుకోకపోవడం గమనార్హం. గతేడాది పలు క్రీడల్లో రాష్ట్ర పోటీలతోపాటు జాతీయ స్థాయి పోటీలను నిర్వహించిన అండర్–19 కార్యదర్శి మధు జాన్సన్ ఈసారి ఒక్క క్రీడలో పోటీలు నిర్వహించలేదు. ముందుకు రాని కార్యదర్శులు... పాఠశాలల, కళాశాలల క్రీడల్లో భాగంగా నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో ఎక్కువ క్రీడల్లో పోటీలు నిర్వహించడానికి స్కూల్ గేమ్స్ కార్యదర్శులు ముందుకు రాలేదు. కరీంనగర్లో రెండు, జగిత్యాలలో రెండు, పెద్దపల్లిలో మూడు రాష్ట్రస్థాయి పోటీలు మాత్రమే జరుగనుండగా రాజన్నసిరిసిల్లా జిల్లాలో ఒక్క అంశంలో కూడా క్రీడాపోటీలు నిర్వహించలేదు. స్కూల్ గేమ్స్పై కొన్నేళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యం చూపడం.. నిధులు మంజూరు కాక పోవడం.. సొంత ఖర్చులతో పోటీల నిర్వహించాల్సి రావడం తదితర కారణాలతో ఈఏడాది పోటీల నిర్వహణకు పలువురు కార్యదర్శులు ఆసక్తి చూపలేదని సమాచారం. సిరిసిల్ల జిల్లాలో నిల్.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఈ యేడు పాఠశాలల, కళాశాలల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించలేదు. రెండు రోజుల క్రితం రాష్ట్ర ఎస్జీఎఫ్ కార్యదర్శి విడుదల చేసిన అండర్ 14, 17, 19 మూడు విభాగాల జాబితాలో ఒక్క క్రీడలో కూడా ఈ ఏడాది పోటీలు నిర్వహించలేదు. మొత్తం 96 క్రీడాంశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోటీల నిర్వహాణ మూడు కేటగిరీలలో పోటీలు జరుపాల్సి ఉంది. కానీ, సిరిసిల్ల జిల్లాలో ఒక్క కేటగిరిలో కూడా పోటీలు జరుగకపోవడం గమనార్హం. మూడేళ్లుగా విడుదల కాని నిధులు.. నిజానికి మూడేళ్ల నుంచి స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల నిర్వహాణకు ఇచ్చే నిధులు విడుదలకాలేదు. దీంతో జిల్లాలో గతంలో పలువురు కార్యదర్శులు నిర్వహించిన పోటీల బడ్జెట్ ఇంతవరకు విడుదల కాలేదు. ఈ క్రమంలో ఈసారి పోటీల నిర్వహాణకు దూరం ఉన్నారు. అండర్ 19 విభాగంలో గతంలో నిర్వహించిన పోటీలకు సుమారు రూ.20 లక్షలు, అండర్ 14, 17 విభాగంలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలకు సుమారు రూ.42 లక్షలు బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే పోటీల నిర్వహణకు ఇటీవల కొత్తగా నియామకమైన పలువురు కార్యదర్శులు దూరంగా ఉన్నట్లు సమాచారం. -
‘జూనియర్స్’ రాజీనామా
సాక్షి, కరీంనగర్: నిరుద్యోగ యువతకు జూనియర్ పంచాయతీ కార్యదర్శి కొలువు దొరికిన సంబరం లేకుండా పోతోంది. బాధ్యతల బరువు, ఒత్తిడి తట్టుకోలేక రాజీనామాకు సిద్ధం అవుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం గతంలో కార్యదర్శులకు ఉన్న చెక్పవర్ తొలగించడంతోపాటు అదనంగా హరితహారం, పారిశుధ్య నిర్వహణ, ఓడీఎఫ్, ప్రభుత్వ పథకాల అమలు బాధ్యతలు అప్పగించింది. మరో వైపు సర్పంచులు, అధికార పార్టీ నాయకులు తమ పనుల కోసం ఒత్తిళ్లు తేవడమే కాకుండా దాడులకు పాల్పడుతున్నారు. రెండువైపుల నుంచి ఒత్తిళ్లు భరించలేక కొందరు కార్యదర్శులు కొత్త ఉద్యోగాల్లో చేరగా.. మరికొందరు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. గతనెల 23న కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి పద్మపై సర్పంచు భర్త బలుసుల శంకరయ్య దౌర్జన్యం చేయడం జిల్లాలో వివాదాస్పదంగా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై కార్యదర్శులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం పనిచేసే అవకాశం లేకుండా పోతుందంటూ పలువురు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12మంది రాజీనామా.. కరీంనగర్ జిల్లాలో మొత్తం 313 గ్రామ పంచాయతీలుండగా ప్రభుత్వం ఏప్రిల్ 12న మొత్తం 205మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను కేటాయించింది. వీరిలో 197మంది మాత్రమే ఉద్యోగాల్లో చేరగా మిగతా 8మంది వివిధ కారణాలతో బాధ్యతలు చేపట్టలేదు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్లో కొందరు రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక ఉద్యోగాన్ని వదులుకుంటున్నారు. కార్యదర్శులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే ప్రభుత్వం నియమించడంతో క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. విధినిర్వహణపై అవగాహన లేకపోవడంతోపాటు కొత్తపంచాయతీరాజ్ చట్టంతో బాధ్యతలు పెరగడం, పనిభారంతో ఆందోళనకు గురవుతున్నారు. మూడేళ్ల వరకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో మంచి ఉద్యోగాలు రావడంతో కార్యదర్శి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం కార్యదర్శులకు జీతాలు సైతం చెల్లించలేదు. ఇటీవల ప్రకటించిన ఎస్సై, ఫారెస్ట్బీట్ ఆఫీసరు ఉద్యోగాలకు పలువురు కార్యదర్శులు ఎంపికయ్యారు. దీంతో వెంటనే కార్యదర్శి పోస్టులకు రాజీనామా చేసి ఆయా ఉద్యోగాల్లో చేరిపోయారు. ప్రస్తుతం జిల్లాలో 12మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ పదవులకు రాజీనామా చేశారు. త్వరలో ప్రకటించే గ్రూప్–2, కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మరికొందరు కార్యదర్శులు సైతం రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. -
లైంగికదాడి కేసులో జీవితఖైదు
సాక్షి, కరీంనగర్ : ముగ్గురు బాలికలపై లైంగికదాడి చేసిన కేసులో లింగంపల్లి కిషన్(42)కు జీవితఖైదుతోపాటు రూ.లక్షా 50వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి (బాలబాలికలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం) ఎస్.శ్రీనివాస్రెడ్డి సంచనల తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం చొప్పదండి మండలం కాట్నపల్లికి చెందిన లింగంపల్లి కిషన్కు ఎల్కే బ్రిక్స్ ఇండస్ట్రీ ఉంది. అతడి వద్ద ఇటుక తయారీ పని కోసం ఓరిస్సా రాష్ట్రం బారాగౌడ్ జిల్లా బాయిడ్పల్లి గ్రామానికి చెందిన బలరాం సాహూ (55) భార్య, కూతురుతోపాటు వచ్చాడు. వారితో పాటు ఒరిస్సాకు చెందిన దాదాపు 50మంది కిషన్ ఇటుకబట్టీలో పనిచేస్తున్నారు. బట్టీల వద్దే తాత్కాళిక గుడిసెలు వేసుకొని నివాసముంటున్నారు. 2014 మార్చి 16న రాత్రి సాహూ అతడి భార్య గుడిసెలో నిద్రిస్తుండగా, కూతురు (16) బయట నిద్రిస్తోంది. అక్కడికి వచ్చిన కిషన్ బయట నిద్రిస్తున్న బాలికను బలవంతంగా తన ఆఫీస్కు తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. 2014 ఏప్రిల్ 14న ఇలాగే బయట నిద్రిస్తున్న మరో ఇద్దరు బాలికల(14), (11)ను ఆఫీస్కు తీసుకెళ్లి వారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈవిషయాన్ని బాలికలు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెళ్లి కిషన్ను నిలదీయగా, ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. దీంతో వారు ఒరిస్సాలోని బంధువులకు సమాచారం అందించారు. వారి బంధువులు అక్కడి స్వచ్ఛంద సంఘాల వారితో కలిసివచ్చి 2014 ఏప్రిల్ 19న బాధితులతో చొప్పదండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు ఎస్సై రియాజ్పాషా లింగంపల్లి కిషన్పై ఐపీసీ బాలబాలికలపై లైంగిక వేధింపుల నిరోధర చట్టం, బాల కార్మిక చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ టి.సత్యనారాయణ కేసు దర్యాప్తును ఏపీపీ వి.వెంకటేశ్వర్లు విచారించారు. 21మంది సాక్ష్యులను విచారించిన న్యాయమూర్తి సోమవారం నేరస్తుడైన కిషన్కు జీవితఖైదు, రూ.లక్షా 50వేలు జరిమానా విధించారు. జరిమానా డబ్బును బాధితులు ఒక్కొక్కరికి రూ.50వేలు చొప్పున చెల్లించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. తీర్పు నఖలు కాపీని జిల్లా న్యాయసేవాధికారి సంస్థకు పంపించాలని, సంస్థ ద్వారా ప్రభుత్వం నుంచి బాధితులకు పరిహారం అందేలా చూడాలని తీర్పులో పేర్కొన్నారు. కిషన్ నడిపిస్తున్న ఇటుకబట్టి పరిశ్రమకు గ్రామపంచాయతీ, కార్మికశాఖ అనుమతులు లేవని సమాచారం. -
కన్నారంపై కమలం కన్ను
సాక్షి, కరీంనగర్ : పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన అనూహ్య విజయాలతో పట్టణాల్లో పాగా వేయాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీ భారీ మెజారిటీ సాధించడానికి కారణమైన అసెంబ్లీ సెగ్మెంట్లలోని పురపాలికలను తొలుత బీజేపీ నేతలు టార్గెట్ చేసుకున్నారు. పట్టణాల్లో బీజేపీకి అంతో ఇంతో బలం ఉండడం, తాజాగా పార్లమెంటు ఎన్నికల్లో ‘పువ్వు’ గుర్తు జనాల్లోకి వెళ్లడంతో పురపాలక సంఘాలను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. దీనికి తోడు కరీంనగర్ నుంచి విజయం సాధించిన ఎంపీ బండి సంజయ్కుమార్ కరీంనగర్ కార్పొరేషన్తోపాటు పార్లమెంటు పరిధిలోని మెజారిటీ మునిసిపాలిటీల్లో కాషాయజెండా ఎగురవేయించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం తొలుత కరీంనగర్ కార్పొరేషన్ను టార్గెట్గా చేసుకున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చిన చొప్పదండి, కొత్తపల్లి, వేములవాడ మునిసిపాలిటీల్లో సానుకూల ఫలితాలు పొందే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మునిసిపాలిటీల్లోని వార్డుల్లో గెలిచే స్థాయి నాయకులు ఎంత మేరకు ఉన్నారనేది ఇప్పుడు పార్టీ నేతలను తొలుస్తున్న ప్రశ్న. హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంటతోపాటు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లపై బీజేపీకి పెద్దగా ఆశలు లేకపోయినా, ఇక్కడ కూడా అభ్యర్థులను నిలిపి బలం పెంచుకునే ఆలోచనతో ఉన్నారు. కరీంనగర్ బల్దియాపై కాషాయమే లక్ష్యంగా.. మైనారిటీ వర్గాల ప్రభావం అధికంగా ఉన్న కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్లో డివిజన్ల సంఖ్య 50 నుంచి 60కి పెరిగింది. కొత్తగా కలిసిన 8 గ్రామాలతో పది వార్డులు పెరిగాయి. అదే సమయంలో మైనారిటీ వర్గాల ప్రభావం ఉన్న డివిజన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్ మెజారిటీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మిత్రపక్షాలుగా ఉన్న టీఆర్ఎస్, ఎంఐఎంలకు ఓటు వేయడం వల్ల కరీంనగర్ ఇమేజ్ దెబ్బతింటుందని ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని విభిన్న రీతుల్లో ప్రచారం చేసి ధర్మం పేరుతో ‘హిందుత్వ’ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈసారి కూడా ఇదే అంశాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. స్మార్ట్సిటీ ప్రచార అస్త్రంగా... కరీంనగర్ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే స్మార్ట్సిటీగా ప్రకటించిందని, నిధులను సక్రమంగా వెచ్చించడంలో ఇప్పటివరకు బల్దియాను ఏలిన టీఆర్ఎస్ విఫలమైందనే ప్రచారానికి బీజేపీ తెరలేపింది. కార్పొరేషన్లో బీజేపీ అధికారంలో ఉంటే మరిన్ని నిధులు తీసుకురావడంతోపాటు నగరాన్ని అభివృద్ధి చేస్తామని సంజయ్ తన ప్రసంగాల్లో చెబుతున్నారు. ఒక రకంగా రేపటి ఎన్నికల్లో ఇదే ప్రధాన ప్రచారాస్త్రంగా మారనుందన్న మాట. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఎంపీ వినోద్కుమార్ వల్లనే కరీంనగర్ను స్మార్ట్సిటీ జాబితాలో చేర్చినట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే కమలాకర్ ఓ అడుగు ముందుకేసి ‘పేరుకే స్మార్ట్సిటీ తప్ప రూపాయి రావడం లేదు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి లేదు’ అని బాహాటంగానే విమర్శిస్తున్నారు. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా టీఆర్ఎస్ను టార్గెట్ చేయాలని వ్యూహాత్మకంగా బీజేపీ నేతలు ముందుకు సాగుతున్నారు. పట్టణాల్లో బీజేపీకి గెలిచే కేడర్ ఎక్కడ..? కరీంనగర్లో సంజయ్ ఇమేజ్కు తోడు మోదీ హవాతో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ ప్రభావం కొంత మేర పట్టణాల్లో ఇప్పటికి ఉన్నప్పటికీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించే స్థాయిలో పనిచేస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కరీంనగర్లో గత మునిసిపల్ ఎన్నికల్లో సంజయ్తోపాటు విజయ మాత్రమే బీజేపీ నుంచి కార్పొరేటర్లుగా గెలుపొందారు. ఇప్పుడు కరీంనగర్ మునిసిపాలిటీని కైవసం చేసుకోవాలంటే కనీసం 31 మంది కార్పొరేటర్లు గెలవాలి. కరీంనగర్లో కొంత మేర సంజయ్ ఎఫెక్ట్ ఇప్పటికీ ఉన్నా, మిగతా మునిసిపాలిటీల్లో పరిస్థితి అంత ఈజీగా లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. హుజూరాబాద్, జమ్మికుంట మునిసిపాలిటీల్లో మంత్రి ఈటల ప్రభావం ఎక్కువగా ఉంది. సిరిసిల్ల మునిసిపాలిటీలో ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న చేసిన అభివృద్ధి పనులే అడుగడుగునా కనిపిస్తున్నాయి. చొప్పదండి, కొత్తపల్లి కొత్త మునిసిపాలిటీలే. వేములవాడ మునిసిపాలిటీలో మాత్రం ఈసారి బీజేపీ బలం పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు సభ్యత్వంతోపాటే ఎన్నికల సందడి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా శనివారం హైదరాబాద్లో ప్రారంభించారు. కరీంనగర్లో ఆదివారం సభ్యత్వ నమోదుకు ఎంపీ సంజయ్కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ ముహూర్తం నిర్ణయించారు. మహబూబ్నగర్ మాజీ ఎంపీ జితేందర్రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అనంతరం సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బల్దియా ఎన్నికల్లో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాన్ని పార్టీ యంత్రాంగానికి వివరించనున్నారు. -
కాటేసిన కరెంట్
సాక్షి, కరీంనగర్ : పర్యవేక్షణాధికారుల తప్పిదం ఓ హెల్పర్కు ప్రాణసంకటంగా మారింది. డబుల్బెడ్రూం కాలనీలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా చేయడంతో అదృష్టవశాత్తు ప్రాణాలతో బతికి బయటపడ్డ సంఘటన గురువారం సిరిసిల్ల పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సెస్ పరిధిలోని సిరిసిల్ల టౌన్–2కు కిష్టయ్య హెల్పర్గా పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం స్థానిక శాంతినగర్లో కొత్తగా నిర్మిస్తున్న డబుల్బెడ్రూం కాలనీలొ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేయాలని ఉన్నతాధికారులు, పర్యవేక్షణాధికారులు ఆదేశించారు. ముందస్తు రక్షణ చర్యలు లేకుండానే అధికారులు కిష్టయ్యను పనులకు పంపించినట్లు సిబ్బంది తెలిపారు. కిష్టయ్య ట్రాన్స్ఫార్మర్పై పని చేస్తుండగా హఠాత్తుగా కరెంటు సరఫరా కావడంతో షాక్కు గురై కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు ఏరియాస్పత్రికి తరలించగా..చికిత్స చేస్తున్నారు. ఏలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా హెల్పర్ను పనులకు పంపించడంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సెస్ ప్రాతినిధ్య సభ్యుడు, తదితరులు డిమాండ్ చేశారు. కిష్టయ్యకు ప్రాణహాని జరిగితే బాధ్యులెవరని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుదాఘాతంతో మహిళ మృతి ధర్మపురి: స్నానం కోసమని బాత్రూంలోకి వెళ్లగా మీటరువైరుకు ప్రమాదవశాత్తు చేయి తగలడంతో విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందిన సంఘటన కోస్నూర్పల్లెలో విషాదం నింపింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జైనా గ్రామానికి చెందిన బోర్లకుంట లక్ష్మి(55) గురువారం స్నానం చేయడానికి బాత్రూమ్కు వెళ్లింది. స్నానం చేసే ప్రయత్నంలో బాత్రూమ్లో ఉన్న మీటరు వైరు చేతికి తగిలి ఎర్త్ రాగా విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు ధర్మపురికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి భర్త రాజలింగం ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వహీద్ తెలిపారు. బాధితురాలిది నిరుపేద కుటుంబమని, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఎల్లారెడ్డిపేటలో వృద్ధుడు.. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేటకు చెందిన ఓలాద్రి పద్మారెడ్డి (68) బుధవారం రాత్రి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన గ్రామంలో విషాదం నింపింది. గురువారం సంఘటన స్థలాన్ని ఎస్సై ప్రవీణ్కుమార్ పరిశీలించారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..రాత్రి ఇంట్లో లైట్ వెలగడం లేదని ఓల్డర్ను పట్టుకొని బల్బును పరిశీలిస్తుండగా షాక్కు గురయ్యాడు. షాక్తో కిందపడ్డ పద్మారెడ్డిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇంట్లో చిన్న బల్బును సరిచేస్తున్న క్రమంలో నిండుప్రాణం పోవడంపై కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి భార్య హేమలత అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతిచెందింది. సంఘటన స్థలాన్ని తోట ఆగయ్య, చీటి లక్ష్మణ్రావు, హసన్ సందర్శించి కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మానాలలో వలస కూలీ.. చందుర్తి (వేములవాడ): విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి చెందిన సంఘటన రుద్రంగి మండలం మానాల గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని మరవల్ కడ్విట్ గ్రామానికి చెందిన దినేష్సంతుసకుమ్(22) విద్యుత్ సబ్స్టేషన్లో కెపాసిటర్ల ఇన్స్టాలేషన్స్ పని చేసేందుకు మానాలకు వచ్చాడు. ఇన్స్టాలేషన్ గ్రూపునకు వంట చేసే పనిలో నిమగ్నమైన దినేష్సంతుసకుమ్కు పక్కనే ఉన్న విద్యుత్ వైరు తగిలి షాక్కు గురయ్యాడు. గమనించిన సదరు సిబ్బంది వెంటనే విద్యుత్ వైరు తొలగించారు. ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్ వైద్యం కోసం బాధితుడిని కోరుట్ల పట్టణానికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ప్రాజెక్టు అధికారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
తెల్లవారితే దుబాయ్ ప్రయాణం
సాక్షి, ధర్మారం(కరీంనగర్) : ధర్మారం మండలంలోని నందిమేడారం బైపాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి లారీ ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందినట్లు ధర్మారం ఎస్సై ప్రేమ్కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం శాకాపూర్ గ్రామానికి చెందిన కుదిరే ప్రశాంత్ (23), తనుగుల మనోజ్ (21)లు బైక్పై మేడారం నుంచి పెద్దపల్లికి వెళ్తుండగా లారీ ఢీకొని మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. ప్రశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు శాఖాపూర్ గ్రామంలో విషాదం వెల్గటూరు(ధర్మపురి): మండలానికి చెందిన ఇద్దరు యువకులు శనివారం అర్ధరాత్రి ధర్మారం మండలం మేడారం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో శాఖాపూర్ విషాదం నెలకొంది. యువకుల అంత్యక్రియలు ఆదివారం నిర్వహించగా ఊరంతా నివాళి అర్పించింది. తనుగుల మల్లేశ్,పుష్ప అనే దంపతుల కుమారుడైన మనోజ్ కుదిరె తిరుపతి భూమక్కల కుమారుడైన ప్రశాంత్ను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. చేతికి అంది వచ్చిన కొడుకులు అకాలమరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తెల్లవారితే మనోజ్ దుబాయ్ విమానం ఎక్కేవాడు తనుగుల మనోజ్ కుదిరె ప్రశాంత్ ఇద్దరు స్నేహితులు. మనోజ్ దుబాయ్ వెళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. ధర్మారం మండలం వనపర్తిలో మనోజ్ అక్కను కలిసి, ప్రశాంత్ అక్క పెద్దపల్లిలో జరుపుకుంటున్న పోచమ్మ బోనాలకు వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. వీరితో గణేశ్ అనే మరో యువకుడు మరోబైక్పై బయల్దేరారు. పెద్దపల్లికి చేరకముందే ఇద్దరు స్నేహితులను మేడారం వద్ద లారీ బలితీసుకొంది. ఈ ప్రమాదంతో భయాందోళన చెందిన గణేశ్ గ్రామానికి చేరుకొని సమాచారమిచ్చాడు. కుటుంబసభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి తరలి వెళ్లారు. ఇరు కుటుంబాల్లో ఒక కొడుకు ఒక కూతురు కావడం గమనార్హం. నవయువకుల మృతి తల్లిదండ్రులకు తీరని లోటు మిగిల్చింది. -
‘కేఎఫ్’ కావాలి.. కరీంనగర్లో కలపండి!
సాక్షి, జగిత్యాల: బీర్బల్ కథలు వినే ఉంటారు. ‘బీర్’బాబుల లేఖ ఎప్పుడైనా చదివారా? వేసవిలో మందుబాబుల దాహం తీర్చే ‘బీర్’కాయల కోసం జగిత్యాల వాసులు ఏకంగా తమ జిల్లాను త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. కిక్కిచ్చే ‘కింగ్ఫిషర్’ కోసం కరీంనగర్ జిల్లాకు మారిపోతామంటున్నారు! తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల సందర్భంగా ఈ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల రాయికల్ మండలం మూటపల్లి గ్రామంలోని బ్యాలెట్ బాక్స్ లోంచి బయటపడ్డ ఉత్తరం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ జిల్లాను తిరిగి కరీంనగర్ జిల్లాలో విలీనం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావును కోరుతూ జగిత్యాల వాసుల పేరుతో ‘బీర్’కాయుడెవరో ఈ లేఖ రాశారు. మంగళవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా ఇది బయటపడింది. తమకెంతో ఇష్టమైన బీర్ జగిత్యాల జిల్లాలో లభ్యంకానందున తమ జిల్లాను కరీంనగర్లో కలిపేయాలని లేఖలో కోరారు. కింగ్ఫిషర్(కేఎఫ్) బీర్ను అందుబాటులో ఉంచాలని పనిలో పనిగా అభ్యర్థించారు. ఈ లెటర్ చదివి జనాలు తెగ నవ్వుకుంటున్నారు. అయితే ఈ లేఖ బ్యాలెట్ బాక్స్లో రాలేదని, ఇదంతా ఫేక్ అని స్థానికులు అంటున్నారు. -
16 ఎంపీ స్థానాలు గెలిచే సత్తా టీఆర్ఎస్దే..
కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 స్థానాలు గెలువబోతుందని, కేంద్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం శ్వేత హోటల్లో కరీంనగర్ నియోజకవర్గస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనెల 17న సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగసభకు కనీవినీ ఎరుగని రీతిలో జనసమీకరణ చేయాలని కోరారు. రెండున్నర లక్షల మందితో పార్లమెంటరీ నియోజకవర్గస్థాయి బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. కరీంనగర్ నియోజకవర్గం నుంచి 50 వేల మందికిపైగా కార్యకర్తలను సమీకరించాలని సూచించారు. అన్నివర్గాలు టీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకత గురించి నిర్ణయానికి వచ్చాయని అన్నారు. దేశరాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని, కాంగ్రెస్, బీ జేపీలు సొంతగా అధికారంలోకి వచ్చే పరిస్థితి అ సలే లేదని చెప్పారు. 16 సీట్లు గెలిస్తే ఢిల్లీలో టీఆ ర్ఎస్ చక్రం తిప్పే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎంపీ వినోద్కుమార్ మాట్లాడుతూ 70 ఏళ్లల్లో చేయని అభివృద్ధి నాలుగున్నరేళ్లల్లో చేసి చూపించిన ఘనత టీఆర్ఎస్దేనన్నారు. ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆ ర్కు కరీంనగర్ సెంటిమెంట్ జిల్లా అని, మొదటి బహిరంగసభను కరీంనగర్ గడ్డపై నుంచే మొదలు పెట్టారని, ఐదు లక్షల పైచిలుకు మెజార్టీతో కరీంనగర్ ఎంపీగా వినోద్కుమార్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మేయర్ రవీందర్సింగ్, ఎంపీపీ వాసాల రమేశ్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, నియోజకవర్గ ముఖ్య నాయకులు జమీలోద్దీన్, కాశెట్టి శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, తుల బాలయ్య, సర్పంచ్లు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు హాజరయ్యారు. -
ఆన్లైన్.. ఆగమాగం
సాక్షి, చొప్పదండి : మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటికీ అప్గ్రేడ్ అయిన చొప్పదండిలో నూతన గృహ నిర్మాణదారులకు చిక్కులు తప్పడం లేదు. పురపాలన ప్రారంభమై ఆరునెలలు దాటినా ఇప్పటికీ ఒక్క నూతన నిర్మాణానికి కూడా అనుమతి రాకపోవడం పురపాలనలో నూతన గృహ నిర్మాణదారులకు తెచ్చిన కష్టాలను తెలియజేస్తోంది. ప్రభుత్వం రెండున్నరేళ్ల క్రితం పురపాలనలో ఆన్లైన్ విధానం తీసుకువచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన చొప్పదండిలోనూ దీన్ని వర్తింపజేస్తున్నారు. దీంతో నూతన గృహ నిర్మాణ ఆశావహులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్లో దరఖాస్తులు గతంలో నూతన గృహ నిర్మాణదారులు పంచాయతీ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకొనేవారు. భూమిపూజ చేసుకొని ఇంటి నిర్మాణం ప్రారంభించాక కూడా పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో 2016 నుంచి ఆన్లైన్ ద్వారా నిర్మాణ అనుమతుల మంజూరు విధానం ప్రవేశపెట్టారు. నూతన నిర్మాణాలను చేపట్టేవారు లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అనుమతి వచ్చాకే నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు నిర్మాణాలను రూపొందించాలంటే ఇండ్లు కట్టడం పలువురికి గగనంగా మారింది. ఇబ్బందిగా నిబంధనలు మున్సిపల్ నూతన చట్టంలోని నిబంధనలు చిన్న స్థలాలు కలిగిన గృహ నిర్మాణదారులకు ఇబ్బందిగా పరిణమించాయి. జీవో 168 ప్రకారం మున్సిపాలిటీల్లో ఇండ్లు నిర్మాణం చేసే వారికి పలు నిబంధనలు రూపొందించారు. దీంతో గృహ నిర్మాణదారులు ఆన్లైన్లో లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా దరఖాస్తు చేసేందుకే రూ. పదివేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక అనుమతి వచ్చేందుకు ఫీజులు ఏ మేరకు బాదుతారో తెలియని పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులు నిర్ధేశించిన ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణదారులకు వచ్చిన మొదటి ఇబ్బంది రోడ్ల వెడల్పుతోనే. గతంలో తొమ్మిది ఫీట్ల నుంచి మొదలుకొని పన్నెండు ఫీట్ల రోడ్లనే ఎక్కువగా గ్రామస్తులు ఉపయోగించేవారు. నిర్మాణ అనుమతుల సమయంలో రోడ్లు ముప్పై అడుగులు ఉంటేనే అనుమతి ఇస్తారు. పైగా మూడు అడుగులు సెట్ బ్యాక్ కోసం కూడా వదులాల్సి ఉంటుంది. దీంతో ఉన్న స్థలమంతా రోడ్లకే పోతే తాము ఎక్కడ నిర్మాణాలు చేయాలని చిన్న చిన్న ప్లాట్లు గల యజమానులు వాపోతున్నారు. ఇప్పటి వరకు మున్సిపాలిటీ నుంచి ఒక్క అనుమతి కూడా ఇవ్వకపోగా, దరఖాస్తులు మాత్రం అయిదు వరకు వచ్చినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. దీంతో మున్సిపాలిటీ ఏర్పడిన ఆరునెలల్లో ఒక్క అనుమతి కూడా బయటకు వెళ్లక పోవడంతో ఇండ్ల నిర్మాణాలు చేసేదెట్లా అంటూ నిర్మాణ ఆ శావహకులు లబోదిబో మంటున్నారు. రెండేళ్లుగా కొనసాగుతోంది రెండేళ్లుగా మున్సిపాలిటీల్లో ఆన్లైన్ విధానం కొనసాగుతోంది. తమకు డిజిటల్ కీ రావడానికి ఆలస్యమైంది. దరఖాస్తుల విధానం ఆన్లైన్లో ఉండటం వల్ల నిబంధనలను ఖచ్చితంగా పాటించేందుకు దోహదపడుతోంది. మున్సిపల్ చట్టం ప్రకారం మేము వ్యవహరిస్తాం. – రాజేందర్ కుమార్, కమిషనర్ -
పక్కా భవనాల నిర్మాణమెప్పుడో..?
కొడిమ్యాల: 500 జనాభా ఉన్న గ్రామాలు, గిరిజన తండాలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఇక తమ సమస్యలన్నీ స్థానికంగానే పరిష్కరించుకోవచ్చని నూతన గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలు సంతోషించారు. ఐతే వారి ఆశలు నిజం కావడానికి మరింత సమయం పట్టేలా ఉంది. నూతన పంచాయతీలు 21 కొడిమ్యాల మండలంలో హిమ్మత్రావుపేట, శనివారంపేట, దమ్మయ్యపేట, చింతలపల్లి, గంగారాంతండా, అప్పారావుపేట, కొండాపూర్, తుర్కకాశీనగర్ గ్రామాలు, గంగాధర మండలంలో చిన్న ఆకంపెల్లి, ఇస్లాంపూర్, మంగపేట, చెర్లపల్లి, లింగంపల్లి, నర్సింహులపల్లి, మధురానగర్, ముప్పిడిపల్లి, వెంకంపల్లి, మల్యాల మండలంలో గొర్రెగుండం, గుడిపేట గ్రామాలు, రామడుగు మండలంలో పందికుంటపల్లి, చొప్పదండి మండలంలో సాంబయ్యపల్లి గ్రామం కొత్త పంచాయతీలుగా ఏర్పడ్డాయి. అద్దె భవనాల్లోనే పాలన పాలనాధికారాల వికేంద్రీకరణతో అభివృద్ధి వేగవంతం కానుందని ఆనందపడ్డారు. ఐతే కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు లేకపోవడంతో పరిపాలనా నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు గ్రామాల్లో కుల సంఘ భవనాలు, పాఠశాలల్లోని అదనపు గదులు, నిరుపయోగంగా ఉన్న పాత ప్రభుత్వ భవనాలను గ్రామ పంచాయతీ కార్యాలయాలుగా ఉపయోగించుకుంటున్నారు. అధిక గ్రామాల్లో అద్దె భవనాలనే పంచాయతీలకు పరిపాలనా భవనాలుగా ఉపయోగిస్తున్నారు. కొత్త జీపీల నిర్వహణకు నిధుల లేమి కారణంగా అద్దె భవనాలకు అద్దె కూడా చెల్లించలేని స్థితిలో గ్రామ పంచాయతీలున్నాయి. కానరాని కారోబార్లు.. కార్మికులు నూతన గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు కారోబార్లు, పారిశుధ్య కార్మికులు, వాటర్ పంప్మెన్లు, ఎలక్ట్రీషియన్లను నియమించలేదు. నిధులు లేకపోవడంతో తాత్కాలికంగా పని చేసేవారిని నియమించుకోలేకపోతున్నారు. దీంతో ఆయా పంచాయతీల్లోని ప్రజలు అరకొర వసతులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుధ్య కార్మికులు లేక గ్రామాల్లో చెత్త పేరుకుపోతోంది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్లు వారి డబ్బులతోనే పనులు చేపడుతున్నారు. నిధులు మంజూరయ్యే దాకా కొత్త పాలకవర్గాలు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. కార్యదర్శుల నియామకంలో ఆలస్యం పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష నిర్వహించి నెలలు గడుస్తున్నా.. ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో గ్రామాల్లో పాలన గాడి తప్పుతోంది. ప్రస్తుతమున్న కార్యదర్శులను నాలుగు నుంచి ఐదు గ్రామాలకు ఇన్చార్జీలుగా నియమించారు. దీంతో ఏ ఒక్క గ్రామానికి సరైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ఏ ఒక్క గ్రామ పంచాయతీకి వారంలో రెండు రోజుల సమయాన్ని కూడా కేటాయించలేకపోతున్నారు. ప్రజలు వివిధ రకాల ధ్రువపత్రాలు పొందడంలో ఆలస్యమవుతోంది. పన్నుల వసూళ్ల లక్ష్యం నెరవేరడం లేదు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. కోర్టు సమస్యలు త్వరలోనే పరిష్కరించబడతాయని, కార్యదర్శుల నియామకాలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు. కలెక్టర్కు వినతి నూతన గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించాలని కోరుతూ కొడిమ్యాల మండలంలోని 21 గ్రామాల సర్పంచ్లు జగిత్యాల జిల్లా కలెక్టర్కు వినతిపత్రాన్ని సమర్పించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలకు నిధులు మంజూరయ్యేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్కు వారు విన్నవించారు. జేబులో నుంచే.. ఇప్పటివరకు మా తండాకు ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. కొత్త గ్రామ పంచాయతీలకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. తండాలో పారిశుధ్యం, రోజూవారీ ఇతర పనుల నిర్వహణకు ప్రస్తుతానికి జేబులో నుంచే ఖర్చు చేస్తున్నా. – భూక్యా భోజ్యనాయక్, సర్పంచ్, గంగారాంతండా నిధులు మంజూరు చేయాలి కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. ముందుగా గ్రామ పంచాయతీ భవనాలకు నిధులందించాలి. తర్వాత ఇతర పనులపై దృష్టి సారించాలి. నిధులు లేక ఏ పని చేపట్టలేకపోతున్నాం. – గరిగంటి మల్లేశం, సర్పంచ్, అప్పారావుపేట -
సైనికుల్లా పనిచేయండి
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఇందిరాగార్డెన్లో పట్టణంలోని 50 డివిజన్లకు చెందిన బూత్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఎంపీగా ఉన్న సమయంలో పూర్తిస్థాయిలో పట్టణంపై దృష్టిసారించలేకపోయానని అప్పుడు పరిధి 31 మండలాలు, ఐదు పట్టణాలు విస్తీర్ణం ఉండడం వల్ల సమయం సరిపోలేదన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే అందుబాటులో ఉండి పట్టణంలోని కార్యకర్తలకు పూర్తి సమయాన్ని కేటాయిస్తానని హమీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ జిమ్మిక్కులను ప్రజల్లో వివరించి కాంగ్రెస్కు ఓట్లు వేయించేలా బూత్ లెవల్లో కష్టపడాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ సంతోష్కుమార్, చల్మెడ లక్ష్మినర్సింహారావు, కర్ర రాజశేఖర్, ఆమ ఆనంద్, గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి, బుచ్చిరెడ్డి, రహమత్, ఆకుల ప్రకాష్, ఉమాపతి, ఆరీఫ్, ఉప్పరి రవి, దిండిగాల మధు, తాజ్, చెర్ల పద్మ, కన్న కృష్ణ, అంజనీకుమార్, ప్రసాద్, శ్రీనివాస్, రవికుమార్, దండి రవీందర్ పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రజల్లో సంతోషం
సాక్షి, కరీంనగర్అర్బన్: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం ఓ ఫంక్షన్లో పట్టణ నాయీబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్కు మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సభలో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేశ్, కార్పోరేటర్లు బండారి వేణు, సంఘం నాయకులు గడ్డం మోహన్, నీలం మొండయ్య, పగడాల జయరాం, రాజేశ్, కంది వెంకటేష్, జంపాల సంపత్, లక్ష్మినారాయణ, కుమార్, గుంజపడుగు రాజు పాల్గొన్నారు. మహాకూటమి కుట్రలను తిప్పికొట్టాలి సాక్షి,కరీంనగర్రూరల్: తెలంగాణను దోచుకునేందుకు వస్తున్న మహాకూటమి కుట్రలను తిప్పికొట్టేందుకు ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్, మందులపల్లి గ్రామాల్లో మంగళవారం ఇంటింటా తిరుగుతూ ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ మరోసారి టీఆర్ఎస్కు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరారు. ఆయా గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వృద్ధురాలైన పూరెల్ల ఎల్లమ్మ వృద్ధాప్య పింఛన్ నెల డబ్బులు రూ.1000 ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం కమలాకర్కు అందించి ఎమ్మెల్యేగా గెలవాలని ఆశీర్వదించింది. మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణగౌడ్, జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ జె.రాజేశ్వర్రావు, ఎంపీటీసీ రాంచంద్రారెడ్డి, భద్రయ్య, ఆర్టీఏ సభ్యుడు పెద్ది రమేశ్, దుర్శేడ్ సింగిల్విండో చైర్మన్ మంద రాజమల్లు, ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్ కె.శ్రీనివాస్, మాజీ ప్రజాప్రతినిధులు పి.శ్యాంసుందర్రెడ్డి, జె.సాగర్, ఎస్.సంపత్రావు, దాది సుధాకర్, సాయిలు, పెద్దన్న, ఆనందరావులతోపాటు తదితరులు పాల్గొన్నారు. -
‘కాళేశ్వరం’తో మానేరుకు జీవం
సాక్షి, సిరిసిల్ల: ‘కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నర్మాల ఎగువ మానేరులోకి నీళ్లు తీసుకు వస్తం.. ఏడాదిపొడవునా ఇందులో నీళ్లుంటే.. మానేరువాగుకు జీవం వస్తుంది. మధ్యమానేరు, ఎల్ఎండీ నుంచి పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని గోదావరి నదిలోకి నిరంతరం నీటిపారకం ఉంటుంది.. ఈ పరీవాహక ప్రాంతంలోని వ్యవసాయ రంగానికి నీటిసమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది..’ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. సిరిసిల్లలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ తెలంగాణలోనే ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి నియోజకవర్గానికో ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఐకేపీ ద్వారా పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి కల్తీలేని నాణ్యమైన సరుకులను రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందిస్తామన్నారు. రేషన్ డీలర్లను ఆదుకుంటామని, ఐకేపీ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని స్పష్టం చేశారు. నేతన్నలకు భరోసా కల్పించాం.. సిరిసిల్ల నేతన్నలకు ప్రభుత్వం భరోసా కల్పించిందని, ఇప్పుడు ఆత్మహత్యలు ఆగాయని, నేత కార్మికులకు మెరుగైన ఉపాధి కల్పించడం తనకు సంతోషాన్నిచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు. అపెరల్ పార్క్లో ఉత్పత్తి చేసిన గుడ్డ రెడిమెడ్ వస్త్రాలుగా తయారై అమెరికా మార్కెట్లో అమ్మే స్థాయికి చేరుకోవాలన్నారు. సిరిసిల్ల నుంచి ఉద్యమ సమయంలో వెళ్తున్నప్పుడు ఆత్మహత్యలు వద్దని గోడలపై రాతలు కనిపించాయని, అప్పుడు నిజంగానే నేతన్నల బాధలు చూసి ఏడ్చానన్నారు. కేటీఆర్ లేకుంటే సిరిసిల్ల 50 ఏళ్లయినా జిల్లా అయ్యేది కాదన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి వేములవాడ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు వచ్చే ఏడాది నుంచి కృషి చేస్తానని కేసీఆర్ అన్నారు. మొన్నటివరకు యాదాద్రి అభివృద్ధిపై దృష్టిసారించామని, ఇక రాజన్న దయతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే కొంత భూసేకరణ జరిగిందని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇస్తున్నామన్నారు. కులవృత్తులను కాపాడేందుకు గొర్రెల పంపిణీ, గీతకార్మికుల చెట్టుపన్ను రద్దు, మత్స్యకార్మికులకు, నాయీబ్రాహ్మణులకు, రజకులకు చేయూతనిస్తున్నామన్నారు ఇసుక దొంగలను అరికట్టాం.. ‘నేను చెప్పేది వాస్తవమైతే సిరిసిల్ల, వేములవాడలో చెరో లక్ష మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి.. లేకుంటే డిపాజిట్లు పోగొట్టాలి’ అని కేసీఆర్ అన్నారు. పదేళ్లు పాలించిన కాంగ్రెస్ హయాంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కేవలం రూ.9.56 కోట్లని, అదే టీఆర్ఎస్ హయాంలో నాలుగేళ్లలో వచ్చిన ఆదాయం రూ.2,057 కోట్లని కేసీఆర్ స్పష్టం చేశారు. పదేళ్లపాటు ఇసుక ఆదాయాన్ని మింగిన దొంగలెవరో చెప్పాలన్నారు. ఇప్పటికే సిరిసిల్ల, వేములవాడలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని, ఎకోన్ముఖంగా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సభలో ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీలు భానుప్రసాద్రావు, నారదాసు లక్ష్మణ్రావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ఎస్ జిల్లా కో ఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ రీజినల్ కో ఆర్డినేటర్ గుగులోతు రేణ, డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్రావు, మార్క్ఫెడ్ చైర్మన్ గోక బాపురెడ్డి, సెస్ వైస్చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, అర్బన్ బ్యాంకు చైర్మన్ దార్నం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే తెలంగాణ నంబర్వన్ : కేటీఆర్ మంత్రి దేశంలోనే తెలంగాణ అన్నిరంగాల్లో నంబర్ వన్గా ఉందని కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల సభలో మాట్లాడుతూ కార్మిక, ధార్మిక, కర్శక క్షేత్రమైన జిల్లాలో అన్ని రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారున. ఆశీర్వాద సభకు ఇంత భారీ సంఖ్యలో వచ్చిన సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల ప్రజలకు ధన్యవాదాలని పేర్కొన్నారు. రూ.3వేల కోట్లతో వేములవాడ అభివృద్ధి: చెన్నమనేని రమేశ్బాబు, వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి వేములవాడలో రూ.3వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని వేమువాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమేశ్బాబు అన్నారు. 40 వేల ఎకరాలకు గోదావరి జలాలు ఎల్లంపల్లి ద్వారా వచ్చాయని, సూరమ్మ చెరువుతో కొన్ని సాగునీటి ఇబ్బందులు తీరాయన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.400 కో ట్లు వచ్చాయని పేర్కొన్నారు. ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరించి మధ్యమానేరు నిర్వాసితులకు ఉపాధి చూపాలని రమేశ్బాబు కోరారు. -
ఆశీర్వదించండి.. అన్నీ సాధిద్దాం..!
సాక్షి, కరీంనగర్/హుజూరాబాద్: దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని, మరోసారి ఆశీర్వదిస్తే అనుకున్నది సాధిద్దామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణకు తలమానికంగా మారిన కరీంనగర్ భవిష్యత్లో వాటర్ జంక్షన్గా మారనుందని, జిల్లా అంతా కూడా సస్యశ్యామలంగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో హుజూరాబాద్ ప్రాంత ప్రజలు చురుకైన పాత్ర పోషించారన్న కేసీఆర్, ఆ ఉద్యమంలో సోదర సమానుడు ఈటల రాజేందర్, పితృసమానులైన కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మీరంతా కూడా నా వెనుక అడుగులో అడుగేసి నడిచారని’ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ మండలం ఇందిరానగర్–శాలపల్లిలో మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతాంగం 70 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారని, వచ్చే జూన్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభమైతే ఈ ప్రాంతానికి డోకా ఉండదన్నారు. 50 టీఎంసీల ప్రాజెక్ట్లు మన హుజూరాబాద్ నెత్తిమీదనే ఉన్నాయని, ఎల్ఎండీ కావొచ్చు.. మిడ్ మానేరు కావొచ్చని, మంత్రి రాజేందర్ అన్నట్లుగా వాటి వల్ల కరీంనగర్ జిల్లా వాటర్ జంక్షన్ కాబోతోందని స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో వెన్నంటి ఉన్నారు.. ఈ ప్రాంతానిది కీలక పాత్ర.. తెలంగాణ ఉద్యమ సందర్భంగా హుజూరాబాద్ ప్రాంత ప్రజలంతా తనకు వెన్నుదన్నుగా నిలిచారని ఇందిరానగర్ సభలో సీఎం కేసీఆర్ ఉద్యమ రోజులను నెమరు వేసుకున్నారు. ‘2001లో అద్భుతమైనటువంటి చైతన్యం చూపించిన ప్రాంతం ఇదని, తెలంగాణ వచ్చేనాడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు పడుతూ కష్టపడి పోరాటం చేశామని అన్నారు. ఆ సమయంలో ఈటల రాజేందర్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇద్దరు ఉద్యమంలో ప్రతీ మలుపులో తోడుగా చివరి వరకు ఉన్నారని, వారితో మీరందరూ పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆ రోజు ఈ ప్రాంత ప్రజలు ఇచ్చిన ధైర్యంతో కొట్లాడి కొట్లాడి చివరకు రాష్ట్రం ఏర్పాటు కలను సాకారం చేసుకున్నామని కేసీఆర్ అన్నారు. ఉద్యమ సమయం నుంచి హుజూరాబాద్ ప్రాంతంతో తనకు విడదీయరాని బంధం ఉందన్న కేసీఆర్, జమ్మికుంట ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడిన భిక్షపతి సంఘటనను గుర్తు చేశారు. ‘తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు భిక్షపతి అనే మిత్రుడు కరెంట్ బిల్లు చెల్లించలేక హెండ్రిన్ (పురుగులు మందు) తాగి చనిపోయాడు.. మేమంతా జమ్మికుంటకు వచ్చాం.. బాధపడ్డాం, కన్నీరు పెట్టుకున్నాం.. అలాంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకుని మీ అందరి దీవెనలతో కంటిరెప్పపాటు కూడా కరెంట్ పోకుండా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం’ అని కేసీఆర్ వివరించారు ఈటల రాజేందర్ నా కుడిభుజం.. హుజూరాబాద్ను అద్భుతంగా మలిచాడు.. ‘ఈటల రాజేందర్ మీ అందరికీ తెలుసు.. ఆయన నా కుడి భుజం, బలహీన వర్గాల నుంచి వచ్చి ఇంత ఎత్తుకు ఎదిగినా ఆయన హుజూరాబాద్లో ఉండడం మీ అదృష్టం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘నేను, నా కుడి భుజం బలంగా ఉండాలంటే ఆయనను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని’ ప్రజలను కోరారు. రాజేందర్ కనీవినీ ఎరుగని రీతిలో హుజూరాబాద్ను అభివృద్ధిలో అద్భుతంగా మలిచాడని కేసీఆర్ కితాబిచ్చారు. వందల కోట్లు ఖర్చు పెట్టి ఈటల రాజేందర్ కష్టపడి చెక్డ్యాంలు కట్టించారన్నారు. యుద్ధ ప్రాతిపదికన నిర్మించిన చెక్ డ్యాంలు రాజేందర్ దక్షతకు నిదర్శనమని, అవన్ని ఎప్పుడూ నీళ్లతో 365 రోజులు నిండే ఉంటాయని, ఎండిపోయే పరిస్థితే ఉండదన్నారు. అందువల్ల ఈ ప్రాంతంలో భవిష్యత్లో నీటి కష్టాలే ఉండవన్నారు. ఆయన పనితీరుపై తనకు ఇప్పుడే సర్వే రిపోర్టు వచ్చిందని, ఆ సర్వేలు 80 శాతం ఓట్లు వచ్చి గెలుస్తాడాని చెప్తున్నాయన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఈటల రాజేందర్ అద్భుతంగా అభివృద్ధి చేశాడని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఇందిరానగర్ సభ సక్సెస్.. టీఆర్ఎస్లో కేసీఆర్ జోష్.. హుజూరాబాద్ మండలం ఇందిరానగర్–శాలపల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. భారీగా తరలివచ్చిన జనం ఉద్దేశించి కేసీఆర్ చేసిన ప్రసంగం గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. హుజూరాబాద్ నుంచి సభాస్థలి, జమ్మికుంట అంతా కూడా గులాబీమయమైంది. ప్రాంగణం గులాబీ జెండాలు.. నినాదాలతో మార్మోగింది. సభ అనుకున్న సమయం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకే మొదలు కాగా, వేలాదిగా జనం సభకు తరలి వచ్చారు. కేసీఆర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో కూడా ప్రజల తాకిడి పెరుగుతూ వచ్చింది. సభా ప్రాంగణానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు బతుకమ్మలు, కోలాటాలు, బోనాలు, డప్పు చప్పుళ్ల ప్రదర్శనతో తరలివచ్చారు. యువత బైక్ ర్యాలీలతో సందడి చేస్తూ సభావేదికకు వచ్చారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 2.20 గంటలకు ఇందిరానగర్ సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక బలగాల పర్యవేక్షణ మధ్యన సభాస్థలికి చేరుకున్నారు. ఆయనతోపాటు ఎంపీ, టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు, దేశిపతి శ్రీనివాస్ వేదికపైకి వచ్చారు. మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే, జెడ్పీ మాజీ చైర్మన్ కేతిరి సాయిరెడ్డి, ఈద శంకర్రెడ్డి, కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు తదితరులు కేసీఆర్కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ఉత్సాహభరితంగా ప్రసంగించారు. ఇందిరానగర్–శాలపల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ భారీ బందోబస్తు మధ్య సాగింది. రెండు రోజులుగా పోలీసులు, భద్రతా సిబ్బంది సభా ప్రాంగణంతోపాటు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందిరానగర్ సభ సక్సెస్ కావడం గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ను పెంచింది. ప్రజా ఆశీర్వాద సభలో టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు, మంత్రి ఈటల రాజేందర్, కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి, దేశిపతి శ్రీనివాస్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శులు బండ శ్రీనివాస్, చొల్లేటి కిషన్రెడ్డి, చందా గాంధీ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, హుజూరాబాద్ ఎంపీపీ సరోజినీ దేవి, తుమ్మేటి సమ్మిరెడ్డి, పరిపాటి రవీందర్రెడ్డి, కొండాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తృటిలో తప్పిన పెను ప్రమాదం
సాక్షి, కరీంనగర్ : వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హాజ్ సమీపంలో ఓ కొత్త బెలెనో కారు అదుపు తప్పి డివైడర్ గోడ ఎక్కింది. ప్రదాన రోడ్డులో డివైడర్ ఎక్కకుండా ముందుకు దూసుకెళ్తే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు అభిప్రాయపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు. ఈ కారు సిరిసిల్లకు చెందిన రవీందర్దిగా గుర్తించారు. కారులో ఆయనతోపాటు డ్రైవర్ ఉండగా వారికి ఏలాంటి గాయాలు కాలేదు. -
ఇద్దరు కుమారులతో తల్లి ఆత్మహత్య
మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూరులో ఇద్దరు కొడుకులతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో విషాదాన్ని నింపింది. మృతులను వంగర లక్ష్మి, ఆమె కుమారులు వెంకటరమణ, శ్రీనివాస్ గా గుర్తించారు. వెంకటరమణకు వివాహం కాగా భార్య అందుబాటులో లేదు. గోల్డ్ స్మిత్ కుటుంబానికి చెందిన ముగ్గురూ పన్నెండేళ్లుగా ఊటూరులో ఎవ్వరితో సంబంధాలు లేకుండా శిథిలావస్థలో ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్నారని స్థానికులు తెలిపారు. మృతదేహాలు కుళ్లిపోయి, దుర్వాసన వస్తుండడంతో వీరు నాలుగైదు రోజుల క్రితమే మృతిచెందినట్లు భావిస్తున్నారు. లక్ష్మికి ఒక కూతురు ఉందని, ఆమె వస్తే కానీ పూర్తి వివరాలు తెలియవని స్థానికులు అంటున్నారు. వీరి స్వగ్రామం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్. -
ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది
తాడ్వాయి/దోమకొండ, న్యూస్లైన్: అప్పటి వరకూ ఆనందంతో గ డిపిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. దేవుడిని దర్శిం చుకుని, మొక్కులు సమర్పించుకుని, ఎంతో ఉత్సాహంతో ఇంటికి తిరుగు పయనమైన వారిని రోడ్డు ప్రమాదం కకావికలం చేసింది. నవ్వుల స్థానంలో రోదనలు మిన్నంటాయి. కరీంనగర్ జిల్లా వేములవాడలో రాజన్నను దర్శించుకుని తిరిగి వస్తున్న జిల్లావాసులు నలుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం రెండు కుటుంబాలలో తీరని విషాదాన్ని మిగిల్చింది. తాడ్వాయి మండలం నందివాడకు చెందిన కమ్మరి రజిత (28), ఆమె కుమారుడు రాకేష్ (10), కూతురు అశ్విని ఈనెల 18న దోమకొండలో ఉండే తమ అమ్మమ్మ కంది సుగుణ (60) ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి బంధువులతో కలిసి సోమవారం ఆ టోలో వేములవాడకు వెళ్లి, రాజన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నా రు. మంగళవారం ఉదయం దోమకొం డకు బయల్దేరారు. గంభీరావుపేట మండలం గజసింగవరం వద్ద వీరి ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. సుగుణ, ఆటోడ్రైవర్ స్నేహితుడు అబ్రబోయిన ప్రవీణ్ (18) అక్కడికక్కడే మరణించారు. రజిత, రాకేష్ సిరి సిల్ల ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణిం చారు. సుగుణ కూతురు విజయ, రజి త కూతురు అశ్విని, ఆటో డ్రైవర్ రాజుతీవ్రంగా గాయపడ్డారు. ఒకేసారి నలుగురు మరణించడంతో నందివాడ, దోమకొండలలో విషాదం నెలకొంది. బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. దేవుడిని చూసి వస్తూ దేవుడి దగ్గరికే వెళ్లిపోయారని గ్రామస్తులు కంటతడి పెట్టారు. మృతుల ఇళ్ల వద్దకు చేరుకుని విచారం వ్యక్తం చేశారు. స్నేహితుడి కోసం వెళ్లి ప్రవీణ్ డ్రైవర్ రాజు గౌడ్కు మిత్రుడు. తనతో రావాలని రాజు కోరడంతో ప్రవీణ్ ఆటోలో వెళ్లాడని తెలిసింది. ప్రమాదంలో ప్రవీణ్ మృతి చెందడంతో అతడి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను సిరి సిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు. -
నిజాం సేనలపై నిప్పుల తూటా
* రణధీరుడై నిలిచిన అనభేరి ప్రభాకర్రావు * తొలి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు * ప్రజలకోసం ప్రాణాలర్పించిన 12 మంది వీరులు * నేడు 69వ వర్ధంతి హుస్నాబాద్, న్యూస్లైన్: పోలంపల్లి ముద్దు బిడ్డ.. పోరుతల్లి తొలిబిడ్డ.. అమరుడా అనభేరి ప్రభాకరా.. అందుకో పోరుదండాలు.. అంటూ ఆ పల్లెల్లో విప్లవ గీతాలు మార్మోగుతాయి. నాజీలను మించిన నైజాముపై రణం జేసిన ఆ వీరుడి జ్ఞాపకాలను పల్లెప్రజలు నెమరు వేసుకుంటారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పేదల పక్షాన నిలిచి పోరాడిన ఆ యోధుడిని తులుచుకుంటూ కమ్యూనిస్టులు సెల్యూట్ చేస్తారు. రజాకార్ల అకృత్యాలకు వంతపాడే జాగీర్దార్లు, భూస్వాముల మధ్య నలిగిపోయిన ప్రజలకోసం బందూకు పట్టిన తొలి యోధుడికి నివాళులర్పిస్తారు. 1948 మార్చి 14వ తేదీన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గుట్టల్లో నిజాం సేనలతో భీకర పోరాటం చేసి నేలకొరిగిన అనభేరి ప్రభాకర్రావుతో పాటు 11 మంది వీరులను స్మరించుకుంటారు. శుక్రవారం వారి 69వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరిపోసిన ఆ ఘట్టం పాఠకుల కోసం.. నిజాం పాలనలో పల్లెలు విలవిలలాడుతున్న రోజులు. ప్రజలపై రజాకార్ల అకృత్యాలకు అంతు లేకుండాపోయింది. భూస్వాముల ఆగడాలు మితిమీరిపోయాయి. దీనిని ప్రశ్నించేవారే లేకుండాపోయారు. ఇలాంటి తరుణంలో ఓ యువకుడు నిజాం పీడనలో మగ్గుతున్న ప్రజల్లో తిరుగుబాటు లేవనెత్తాడు. సత్తువ చచ్చిన ప్రజలు పిడికిలి బిగించేలా చేశాడు. ఆయనే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లికి చెందిన అనభేరి ప్రభాకర్రావు. 1913లో అనభేరి వెంకటేశ్వర్రావు, రాధాబాయి దంపతులకు జన్మించిన ఆయన చిన్నతనం నుంచే అభ్యుదయ భావాలను అలవర్చుకున్నాడు. నిజాం పెట్టే బాధలకు ప్రజలు తల్లడిల్లడం దగ్గరి నుంచి చూసేవాడు. తన కుటుంబం, బంధువులు మిన్నకున్నా ఆయన అన్యాయాలను ప్రశ్నించేవాడు. ప్రజల్లోనూ ప్రశ్నించే తత్వాన్ని బోధించేవాడు. కుటుంబసభ్యులు వారించినా గ్రామాల్లో సభలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేశాడు. రజాకార్లను గ్రామాలకు రాకుండా తరిమికొట్టాడు. భూస్వాముల చేతుల్లో ఉన్న భూములన్నీ పేదలకు పంచాడు. ఈ క్రమంలో నిజాం సేనలు మరింత పటిష్టమై గ్రామాల్లో దాడులకు దిగాయి. వారిని ఎదురించేందుకు అనభేరి ప్రభాకర్రావు ఆయుధాలు చేతబట్టి దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దళంలో సింగిరెడ్డి భూపతిరెడ్డి, ముస్కు చుక్కారెడ్డి, ఏలేటి మల్లారెడ్డి, అయిరెడ్డి భూంరెడ్డి, తూమోజు నారాయణ, బి.దామోదర్రెడ్డి, ఇల్లందుల పాపయ్య, పోరెడ్డి రాంరెడ్డి, నల్లగొండ రాజారాం, సిక్కుడు సాయిలు, రొండ్ల మాధవరెడ్డిని చేర్చుకున్నారు. వీరు ఎప్పటికప్పుడు నిజాం సేనలను పసిగడుతూ ప్రజలను కాపాడేవారు. ఉత్తర తెలంగాణలో పోరాటం విస్తృతం కావడంతో నిజాం సేనలు మరింత రెచ్చిపోయాయి. అనభేరి దళాన్ని మట్టుబెట్టాలనే వ్యూహంతో కదులుతున్నాయి. అయితే ప్రజలు ఆ దళాన్ని కాపాడుతూనే ఉన్నారు. అది 1948 మార్చి 14వ తేదీ. అనభేరి ప్రభాకర్రావు దళం సైదాపూర్ మండలం దుద్దెనపల్లిలో ప్రజలతో సమావేశమై వారిలో ధైర్యం నూరిపోసింది. అక్కడి నుంచి మహ్మదాపూర్ సమీపంలోని గుట్టల్లో విశ్రాంతి తీసుకుంటుండగా రజాకార్ల తొత్తు అయిన ఓ వ్యక్తి ఆ సమాచారాన్ని నిజాం సేనలకు అందించాడు. దీంతో ఆ సేనలు గుట్టలను చుట్టుముట్టాయి. కాల్పులు ప్రారంభించడంతో అప్రమత్తమైన అనభేరి దళం రెండుగా చీలింది. ఒకవైపు అనభేరి ప్రభాకర్రావు, మరోవైపు సింగిరెడ్డి భూపతిరె డ్డి నాయకత్వం వహిస్తూ నిజాం సేనలపై ఎదురు కాల్పులు జరిపారు. ఉన్నది 12 మంది అయినా నిజాం సేనలను గడగడలాడించారు. హోరాహోరీ పోరులో ముందుగా సింగిరెడ్డి భూపతిరెడ్డి నేలకొరిగాడు. రజాకార్ల తూటాలకు కిందపడ్డ ఆయన తుపాకీని అనభేరి వైపు విసిరేశాడు. దానిని అందుకొని రెండు తుపాకులతో అనభేరి కాల్పులు సాగించాడు. అయినా వందలాది నిజాం సేనలు 12 మంది వీరులను చంపేశాయి. కాగా, వీరులు నేలకొరిగిన మార్చి 14వ తేదీన ఏటా మహ్మదాపూర్ గుట్టల్లో సీపీఐ ఆధ్వర్యంలో వర్ధంతి సభ నిర్వహిస్తారు. చారిత్రక ప్రదేశంగా మారేనా? వీరుల రక్తంతో తడిచిన మహ్మదాపూర్ గుట్టల ప్రాంతాన్ని చారిత్రక ప్రదేశంగా మార్చుతామన్న నేతల హామీలు నెరవేరలేదు. సీపీఐ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించినా ఫలితం లేకుండాపోయింది. ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రూ.వంద కోసం భార్యను చంపాడు
హుస్నాబాద్, న్యూస్లైన్: భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. వంద రూపాయల కోసం ఘర్షణ పడి భార్యకు ఉరివేసి, కిరోసిన్పోసి తగులబెట్టాడు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలో అక్కన్నపేటలో ఈ ఘటన జరిగింది. వరంగల్ జిల్లా మద్దూర్ మండలం దూళిమిట్టకు చెందిన కొండూరి శ్రీనివాస్కు తన మేన మరదలైన హుస్నాబాద్ మండలం అక్కన్నపేటకు చెందిన రేణుకతో ఏడేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి నాగచైతన్య (6) అనే కుమారుడు ఉన్నాడు. హైదరాబాద్లో ఉంటూ కూలీ పనులు చేసుకునేవారు. నాలుగేళ్ల క్రితం రేణుక పుట్టిల్లయిన అక్కన్నపేటకు వచ్చి ఉంటున్నారు. శ్రీనివాస్ ఏ పనీ చేయకుండా భార్య కూలీ పని చేసి తీసుకొచ్చిన డబ్బులతో మద్యం తాగి, ఆమెను వేధించేవాడు. మంగళవారం రాత్రి రూ.వంద విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కుటుంబసభ్యులు ఓ గదిలో నిద్రిస్తుండగా రేణుకను వంటగదిలోకి రప్పించి కొంగుతో ఉరేశాడు. అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. పొగలు రావడంతో చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకోగా అప్పటికే రేణుక చనిపోయి ఉంది. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తులే రేణుక అంత్యక్రియలు నిర్వహించారు. -
లగడపాటీ.. నీ భరతం పడుతం: హరీశ్రావు
హుజూరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంపీ లగడపాటి రాజగోపాల్ భరతం పడతామని, ల్యాంకో అక్రమాలపై విచారణ జరిపి ప్రజల దగ్గర దోచుకున్న సొమ్మంతా కక్కించి, కటకటాల వెనక్కు పంపిస్తామని టీఆర్ఎస్ శాసనసభపక్ష ఉపనేత హరీశ్రావు హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లగడపాటికి దమ్ముంటే.. ల్యాంకో వ్యవహారాలపై బహిరంగ చర్చకు రావాలని, విజయవాడలోనే వేదిక సిద్ధంచేసి, తేదీ నిర్ణయించాలని హరీష్ సవాల్ చేశారు. తెలంగాణ ఏర్పడితే దోపిడీకి అవకాశం ఉండదనే భయంతోనే.. లగడపాటి సమైక్యాంధ్ర ఉద్యమం అంటున్నాడని మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో ఉండి, తెలుగు ప్రజలు చీకట్లో ఉంటే... ల్యాంకోలో ఉత్పత్తి అయిన విద్యుత్ను ఇతర రాష్ట్రాలకు ఎలా అమ్ముకున్నారు? అని ప్రశ్నించారు. సమ్మెతో రూ.వంద కోట్లు సంపాదించిన ఘనాపాటి లగడపాటే అన్నారు. ఇలాంటి దోపిడీ దొంగల మీద ఉద్యమం చేయాలని సీమాంధ్రులకు హితవు పలికారు. రూ.900 కోట్లు తాగునీటికి, రూ.187 కోట్లు మహిళా మెడికల్ కళాశాలకు ఎలాంటి కేబినెట్, శాసనసభ తీర్మానం లేకుండా సీఎం కిరణ్ చిత్తూరు జిల్లాకు నిధులు తీసుకెళ్తుంటే తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైకోర్టుకు వెళ్తామని చెప్పారు. సీమాంధ్ర నాయకులు విభజనకు సహకరించాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధికి అందరం కలిసి పాటుపడదామని కోరారు. -
ఎన్టీపీసీపై నీలి నీడలు
గోదావరిఖని: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో బొగ్గు సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. సమయానికి బొగ్గు అందే పరిస్థితి కనుచూపు మేర కనిపించకపోవడంతో విస్తరణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఎన్టీపీసీలో ప్రస్తుతం ఏడు యూనిట్లుండగా, వాటి ద్వారా 2,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ మేరకే సింగరేణి నుంచి బొగ్గు రవాణ అవుతోంది. ఎన్టీపీసీని విస్తరణలో భాగంగా మరో 1,320 మెగావాట్లతో రెండు యూనిట్లను ఏర్పాటు చేయడానికి సంస్థ ప్రణాళిక రూపొందించింది. బొగ్గు లింకేజీ సాధ్యం కాకపోవడంతో ఈ కొత్తపాట్ల ఏర్పాటు కష్టసాధ్యంగా మారుతోంది. ఎన్టీపీసీకి కోల్ లింకేజీ ప్రకారం సింగరేణి రోజుకు సుమారు 35 నుంచి 40 వేల టన్నుల బొగ్గును రవాణా చేస్తోం ది. ఇది ప్రస్తుత ఏరోజు అవసరాలకు ఆ రోజు సరిపోతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఇతర కారణాలతో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గింది. దీంతో ఎన్టీపీసీకి రోజుకు 20 నుంచి 25 వేల టన్నుల బొగ్గుమాత్రమే రవాణా జరుగుతోంది. బొగ్గు సరిపోకపోవడంతో ఎన్టీపీసీ పలు యూనిట్లలో లోడ్ తగ్గించి విద్యుత్ ఉత్పత్తి చేయగా, పలు సందర్భాల్లో ఏకంగా యూని ట్లనే మూసివేసింది. ఇలా బొగ్గు లేక యూనిట్లను మూసివేయడం ఎన్టీపీసీ చరిత్రలోనే ప్రథమమని చెప్పవచ్చు. ముందుకు సాగని నాల్గో దశ.. ఐదేళ్లకోసారి ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్లను విస్తరించాలన్న ప్రభు త్వ నిర్ణయం అమలుకు నోచుకోవడం లేదు. దీంతో రామగుం డం ఎన్టీపీసీ ప్లాంట్లో నాల్గో దశ విస్తరణ కింద చేపట్టాల్సిన 8,9 యూనిట్ల ప్రారంభం ముందుకు సాగడం లేదు. 2004లో 500 మెగావాట్ల ఏడో యూనిట్ను ప్రారంభించిన సంస్థ ఆనాటి నుంచి నేటి వరకు 1,320 మెగావాట్లతో 8,9 యూనిట్ల ప్రారంభానికి కుస్తీ పడుతూనే ఉంది. అనువైన స్థలం, నీరు, రైల్వే లైన్, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం బొగ్గు లింకేజీ లేకపోవడమే ఎన్టీపీసీ విస్తరణకు ప్రధాన అడ్డంకిగా మారిందని సంస్థ సీఎండీ అరూప్రాయ్ చౌదరి ఇటీవల రామగుండం ఎన్టీపీసీని సందర్శించిన సమయంలో అంగీకరించారు. ప్రయత్నాలు ముమ్మరం... ఫలితం శూన్యం కొత్త యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన 20వేల టన్నుల బొగ్గు కోసం ఎన్టీపీసీ ఇటీవల కోల్ ఇండియా పరిధిలోని వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ యాజమాన్యంతో చర్చలు జరిపింది. అయితే ఐదేళ్లు మాత్రమే ఎన్టీపీసీకి బొగ్గు రవాణా చేయగలుగుతామని అక్కడి అధికారులు ఖరాఖండిగా తేల్చిచెప్పారు. దీంతో ఐదేళ్ల తర్వాత బొగ్గు కోసం ఏం చేయాలనేది సమస్యగా మారింది. సింగరేణి సంస్థ పరిధి గోదావరిఖనిలోని మేడిపల్లి ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు కాలాన్ని 20 ఏళ్ల పాటు పెంచేందుకు వీలుగా విస్తరించాలని గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎన్టీపీసీకి సమీపంలో ఉండే మేడిపల్లి ఓసీపీ ఎల్ఈపీ (లైఫ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు)ను సింగరేణి నుంచి తీసుకుని క్యాప్టివ్ (సొంత అవసరాల కోసం ఉపయోగించుకునేందుకు) మైన్గా రూపాంతరం చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనకు ఎన్టీపీసీ యాజమాన్యం వచ్చింది. కానీ సింగరేణి యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం అధికారులను నిరాశపర్చింది. తెలంగాణ ఏర్పడితేనే.. రామగుండం ఎన్టీపీసీలో ఉత్పత్తి చేస్తున్న 2,600 మెగావాట్ల విద్యుత్లో 27 శాతం మాత్రమే ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తున్నా రు. తెలంగాణలో పంపుసెట్లపై వ్యవసాయం నడుస్తుండగా.. కేటాయిస్తున్న ఈ విద్యుత్ సరిపోవడంలేదు. అదే సమయంలో విశాఖపట్టణం జిల్లాలోని సింహాద్రి వద్దగల ఎన్టీపీసీ ప్లాంట్లో మూడు యూనిట్ల ద్వారా 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా.. అందులో వెయ్యి మెగావాట్లు కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతానికే వినియోగిస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రకమైన ఒప్పందం ఎన్టీపీసీ యాజమాన్యంతో చేయించారు. ఈ ప్రాజెక్టుకు బొగ్గును ఒరిస్సాలోని తాల్చేర్ నుంచి, నీటిని సముద్రం నుంచి వినియోగిస్తున్నారు. కానీ తెలంగాణలోని బొగ్గు, నీటిని వినియోగిస్తూ ఈ ప్రాంతానికి తక్కువ విద్యుత్ కేటాయిస్తున్న విషయాన్ని తెలంగాణవాదులు పదేపదే కేంద్రానికి గుర్తుచేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమవుతున్న తరుణంలో రాబోయే కాలంలో అప్పటి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఎన్టీపీసీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. లేకపోతే రాబోయే రోజుల్లో ఎన్టీపీసీకి బొగ్గు రవాణా ఇబ్బందిగా మారడంతో పాటు విస్తరణ ముందుకు సాగే అవకాశాలుండవు. -
వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం పొలాస వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ మూడో ఏడాది చదువుతున్న అజ్మీరా మంజుల(20) ఆత్మహత్య చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం రావోజీపేటకు చెందిన ఆమె శనివారం రాత్రి హాస్టల్లో తోటి విద్యార్థులతో కలిసి నిద్రించినా, ఆదివారం ఉదయం కనిపించలేదు. దీంతో వారు హాస్టల్లో వెతకగా.. ఖాళీగా ఉన్న మరో గదిలో ఫ్యాన్కు చున్నీ, నైలాన్ తాడుతో ఉరివేసుకుని కనిపించింది. కాగా, మంజుల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థినులు, అధ్యాపకులు పేర్కొన్నారు. కానీ, మంజుల మృతిపై ఆమె తల్లిదండ్రులు లక్ష్మీబాయి, పంతులునాయక్ అనుమానం వ్యక్తం చేశారు. తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, అంతటి అనారోగ్య సమస్యలేవీ ఆమెకు లేవన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రెండు జిల్లాలు!
సాక్షి, కరీంనగర్ : జిల్లాల పునర్విభజన ప్రతిపాదన మరోసారి తెరమీదకొచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ అంశంపై చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్ర విభజనకు అతీతంగానే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన డిమాండ్లు ఇప్పటికే బలంగా ఉన్నాయి. అనేక రకాల ప్రతిపాదనలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజన జరిగింది. పరిపాలన సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ ద్వారా మెరుగైన సేవలను అందించేందుకు కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్లలో మాత్రమే పూర్తి స్థాయిలో జిల్లాల పునర్విభజన జరగలేదు. జిల్లా కేంద్రాలకు బాగా దూరంగా ఉన్న మండలాల నుంచి ప్రజలే కాకుండా అధికారులు ప్రతి అవసరానికీ అనేక వ్యయప్రయాలకోర్చి రావడం ఇబ్బందిగా ఉంటోంది. జిల్లా అధికారులు రోజువారీ వ్యవహారాలను పరిశీలించడం, క్షేత్ర పర్యటనలకు వెళ్లడం భారంగా మారుతోంది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఆయా ప్రాంతాల ప్రజల నుంచి గట్టి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న డిమాండ్ల మేరకు కొత్తగా ఏడెనిమిది జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలోనే 24 జిల్లాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. ఈ లెక్కన పునర్విభజన జరిగితే కరీంనగర్ జిల్లా రెండుగా విభజన జరిగే అవకాశం ఉంది. సిరిసిల్ల ప్రాంతంలోని మూడు మండలాలు సిద్దిపేట కేంద్రంగా ఏర్పడే జిల్లాలోకి వెళ్తాయని, మంథని నియోజకవర్గాన్ని ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పేరిట భూపాలపల్లి కేంద్రంగా ఏర్పడనున్న జిల్లాలో కలపాలన్న ప్రతిపాదన ఉన్నట్టు సమాచారం. అలాగే ఐదారు అసెంబ్లీ నియోజకవర్గాలతో జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వస్తోంది. ప్రస్తుతం 57 మండలాలతో 11 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో కరీంనగర్ జిల్లా విస్తరించి ఉంది. జిల్లా కేంద్రం నుంచి మంథని నియోజకవర్గంలోని మహదేవపూర్, మహాముత్తారం మండలాలు సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అంతదూరం వెళ్లడం అధికారులకు, అక్కడ నుంచి జిల్లా కేంద్రానికి రావడం ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. మంథని నియోజకవర్గం భూపాలపల్లి జిల్లాలో కలిస్తే ఆ మండలాలు జిల్లా కేంద్రానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. పునర్విభజన జరిగితే పరిపాలనపరంగా సమస్య కొంత వరకు తీరుతుందన్న వాదన ముందుకు వస్తోంది. అలాగే కరీంనగర్ నుంచి కోరుట్ల 75 కిలోమీటర్లు, మెట్పల్లి 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జగిత్యాల జిల్లా ఏర్పడితే ఈ రెండు ప్రాంతాల వారికి జిల్లా కేంద్రం 50కిలోమీటర్ల లోపే ఉంటుంది. అలాగే సిద్దిపేట జిల్లా అయితే గంభీరావుపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట మండలాల వారికి అతి దగ్గరగా, అన్నింటికీ అనుకూలంగా ఉంటుంది. అందరికీ సౌకర్యంగా, ఆమోదయోగ్యంగా జిల్లాల విభజన జరగాలన్న ఆలోచనతో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ప్రస్తుతం వినిపిస్తున్న ప్రతిపాదనలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. విభజన విషయంలో ఇంకా స్పష్టత లేకపోయినా చర్చలు జోరుగా సాగుతున్నాయి. పజలకు, పాలనకు సౌలభ్యంగా ఉండే విధంగా విభజన కోసం విస్తృతంగా సంప్రదింపులు జరుగుతాయని నిఫుణులు చెప్తున్నారు. లోక్సభ నియోజకవర్గ పరిధితోనే జిల్లాలను ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన కోసం భారీ కసరత్తు జరిగినందున కొత్తగా ఏర్పడిన శాసనసభ, లోకసభ నియోజకవర్గాల పరిధిపై అభ్యంతరాలు వచ్చే అవకాశాలు ఉండవన్నది వారి వాదన. ఈ ప్రాతిపదికన విభజన ఎంతవరకు సాధ్యమో పరిశీలించాల్సి ఉంటుంది.