Karthik Subbaraj
-
కోలీవుడ్ ను టెన్షన్ పెడుతున్న అజిత్
-
ప్రేమ,రక్తపాతం 'సూర్య' రెట్రో తెలుగు టీజర్
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కొత్త సినిమా 'రెట్రో' నుంచి తాజాగా తెలుగు టీజర్ విడుదలైంది. గతేడాది కంగువ సినిమాతో అభిమానులను నిరాశ పరిచిన సూర్య.. ఇప్పుడు ప్రేమ, యాక్షన్ అంశాలతో తన కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డేతో సూర్య జంటగా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించారు. భారీ బడ్జెట్తో 2డీ ఎంటర్టైన్మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.కార్తిక్ సుబ్బరాజు సినిమాలన్నీ సమ్థింగ్ డిఫరెంట్ అనేలా ఉంటాయి. సూర్యతో చేసిన 'రెట్రో' టీజర్ చూస్తుంటే హిట్ కళ కనిపిస్తోంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే సూర్యకి హీరోగా కమ్ బ్యాక్ దొరుకుతుంది. ఎందుకంటే గత మూడేళ్లుగా 'కంగువ' కోసం పనిచేశారు. కానీ ఫలితం అనుకున్నట్లు రాలేదు. ఇప్పుడు 'రెట్రో' హిట్ కావడం అనేది సూర్య కెరీర్కి చాలా కీలకం. -
టాప్ దర్శకుడితో జయంరవి కొత్త సినిమా..?
కోలీవుడ్ నటుడు జయంరవి వరుసగా చిత్రాలు చేసుకుంటూపోతున్నారు. వ్యక్తిగత సమస్యలు ఉన్నా, అవి ఆయన వృత్తికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుంటున్నారు. తను నటించిన తాజా చిత్రం బ్రదర్ దీపావళికి తెరపైకి రానుంది. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. ప్రస్తుతం సీనీ, కాదలిక్క నేరమిల్లై చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది తాజా సమాచారం. ఈయన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. కార్తీక్ సుబ్బరాజ్ ప్రస్తుతం నటుడు సూర్య కథానాయకుడిగా ఆయన 44వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2డీ.ఎంటర్టెయిన్మెంట్ సంస్థ, స్టోన్ బెంచ్ స్టూడియోస్ సంస్థ కలిసి నిర్మిస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్టెయినర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ను పూర్తిచేసుకుంది. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా తెరపైకి రానుందని సమాచారం. దీంతో కార్తీక్ సుబ్బరాజ్ జయంరవి హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీన్ని ఆయన తన సొంత నిర్మాణ సంస్థ అయిన స్టోన్ బెంచ్ స్టూడియోస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
రోలెక్స్ని గుర్తుచేసిన సూర్య కొత్త సినిమా టీజర్
తమిళ స్టార్ హీరో సూర్యకి తెలుగులోనూ అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే కొత్త సినిమా వస్తుందంటే చాలు, మనోళ్లు తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు. ప్రస్తుతానికి 'కంగువ' చేస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబరు 10న ఇది థియేటర్లలోకి రానుంది. ఇది కాకుండా స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్తో మూవీ చేస్తున్నాడు. సూర్య పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ పేరిట ఓ వీడియో వదిలారు.(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి')'లవ్, లాఫర్, వార్.. ద వన్' ట్యాగ్ లైన్తో రిలీజ్ చేసిన సూర్య 44మూవీ గ్లింప్స్ వీడియో సింపుల్గా ఉంది. అదే టైంలో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇందులోనూ సూర్య.. డాన్గా కనిపించబోతున్నాడని క్లారిటీ ఇచ్చేశారు. ఇదివరకు ఈ తరహా పాత్రల్లో సూర్య గతంలో ఒకటి రెండుసార్లు చేశారు. ఈ గ్లింప్స్లో సిగరెట్ తాగుతూ, గన్ పట్టుకుని, ఒంటిపై రక్తం మరకలతో నడిచి వస్తుంటే.. 'విక్రమ్' మూవీలో రోలెక్స్.. ఒక్క సెకను అలా వచ్చి వెళ్లిపోయాడా అనిపించింది. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. బహుశా వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాని రిలీజ్ చేస్తారేమో!(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి హిట్ సినిమా)Happy Birthday @Suriya_offl Sir From Team #Suriya44 #HappyBirthdaySuriya #HBDTheOneSuriya pic.twitter.com/PuyM43y4rl— karthik subbaraj (@karthiksubbaraj) July 22, 2024 -
పడమ్ బిగిన్స్
కొత్త సినిమా షురూ చేశారు సూర్య. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జోజూ జార్జ్, జయరామ్, కరుణాకరన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ అండమాన్లో ఆరంభమైంది.సూర్య కెరీర్లోని ఈ 44వ చిత్రం చిత్రీకరణ మొదలైనట్లుగా చెబుతూ, ‘పడమ్ బిగిన్స్’ (సినిమా ఆరంభమైంది) అంటూ చిన్న వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు కార్తీక్ సుబ్బరాజ్. ప్రేమ, యుద్ధం, నవ్వు అంశాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలోని సూర్య లుక్ని బట్టి ఇది పీరియాడికల్ మూవీ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు. -
ప్రముఖ ఆలయంలో సూర్య పూజలు..
సౌత్ ఇండియా స్టార్ హీరో సూర్య తన కొత్త సినిమాను ప్రారంభించాడు. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ సెట్ అయిన విషయం తెలిసిందే. 2డి ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే, అండమాన్ దీవుల్లో ఈ సినిమా తొలి షెడ్యూల్ ప్రారంభమైంది.సూర్య కెరియర్లో ఈ చిత్రం 44వ ప్రాజెక్ట్గా తెరకెక్కుతుంది. వినోదంతో పాటు భారీ యాక్షన్ అంశాలతో ఈ చిత్రం రానున్నట్లు తెలుస్తోంది. అండమాన్ దీవుల్లో తాజాగా ప్రారంభమైన తొలి షెడ్యూల్ దాదాపు 40రోజుల పాటు అక్కడే కొనసాగనుంది. అయితే, ఈ సినిమా షూటింగ్ కోసం ఆండమాన్ వెళ్లే ముందు ఆయన ప్రముఖ ఆలయంలో పూజలు నిర్వహించారు. చెన్నైలో ప్రముఖ ఆలయంగా గుర్తింపు ఉన్న శ్రీ కాళికాంబాల్ (కామాక్షి) సన్నిధిలో సూర్య పూజలు చేశారు. సుమారు 500 ఏళ్లకు పైగానే ఈ ఆలయానికి చరిత్ర ఉంది. 17వ శతాబ్దపు మరాఠా యోధుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ 1677న అక్టోబర్ 3న ఈ ఆలయాన్ని సందర్శించారు. తమిళ చిత్రపరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు ఆ ఆలయాన్ని సందిర్శించినవారే కావడం విశేషం.ఆ ఆలయంతో 'బాబా' సినిమాకు లింక్రజనీకాంత్ బాబా సినిమాకు ముందు ఒకరోజు కాళికాంబాల్ ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆయన సుమారు 20 నిమిషాల పాటు ధ్యానం చేశారు. అయితే, అమ్మవారిని దర్శించుకున్న రజనీ ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆ గుడిని మరిచిపోలేకపాయారట. ధ్యానం చేసిన సమయంలో ఆయన మనసులో ఏమైతే కలిగిందో దానినే బాబా సినిమాకు లింక్ చేశారట. ఆ సినిమా పెద్దగా మెప్పించకపోయిన రజనీకి మాత్రం బాబా చాలా ప్రత్యేకం అని అంటారు. -
అండమాన్లో యాక్షన్
కొద్ది రోజుల పాటు అండమాన్కు మకాం మార్చనున్నారు హీరో సూర్య. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగానే సూర్య అండమాన్ వెళ్లనున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిలింస్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ అండమాన్లో ప్రారంభం కానుంది.నవ్వు, యుద్ధం, ప్రేమ అంశాల నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాను జూన్లో ప్రారంభించనున్నట్లు ‘ఎక్స్’లో ఓ వీడియోను షేర్ చేశారు కార్తీక్ సుబ్బరాజ్. అండమాన్లో ఆరంభించే ఈ తొలి షెడ్యూల్లో ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఇక ఈ మూవీలో హీరోయిన్గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. -
హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!
పూజా హెగ్డే.. కాదు కాదు బుట్టబొమ్మ అంటే తెలుగు ప్రేక్షకులు టక్కున గుర్తుపట్టేస్తారు. కొన్నాళ్ల క్రితం తెలుగులో వరస సినిమాలతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరస ఫ్లాప్స్ దెబ్బకు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఇక ఈమె కెరీర్ ఖతం అని అందరూ ఫిక్సయ్యారు. ఇలాంటి టైంలో ఈమెకి క్రేజీ బంపరాఫర్ చెంతకు చేరింది. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!)కోలీవుడ్లో రేర్ కాంబో సెట్ కాబోతుంది. సూర్య 'కంగువ' మూవీ చేస్తున్నాడు. ఈ ఏడాదే థియేటర్లలోకి రానుంది. మరోవైపు తన 44వ చిత్రాన్ని కూడా రెడీ చేసేస్తున్నాడు. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టెయిన్మెంట్స్, కార్తీక్ సుబ్బరాజ్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. రీసెంట్గానే అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఈ మూవీలోనే పూజా హెగ్డేని హీరోయిన్ అనుకుంటున్నారట.పదకొండేళ్ల క్రితం 'మాస్క్' అనే తమిళ సినిమాతోనే హీరోయిన్ అయిన పూజా హెగ్డే.. మధ్యలో విజయ్తో 'బీస్ట్'తో రీఎంట్రీ ఇచ్చింది. కానీ అది దెబ్బకొట్టింది. ప్రస్తుతం ఫ్లాప్స్ వల్ల పూర్తిగా ఛాన్సుల్లేక సైలెంట్ అయిపోయిన ఈమెకు.. సూర్య మూవీలో ఛాన్స్ అంటే బంపరాఫర్ అనే చెప్పొచ్చు. ఒకవేళ ఇది హిట్ అయితే మాత్రం మళ్లీ సౌత్లో పాగా వేసే ఛాన్స్ ప్లస్ కోరుకున్న బ్రేక్ రావొచ్చు. మళ్లీ రష్మిక లాంటి ట్రెండింగ్ బ్యూటీస్ పోటీ పడొచ్చు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్) -
ప్రేమ... నవ్వు... యుద్ధం
‘లవ్... లాఫ్టర్... వార్...’ అంటూ సూర్య కొత్త చిత్రం అధికారిక ప్రకటన గురువారం వెలువడింది. ‘పిజ్జా, పేటా, జిగర్ తండా, జిగర్ తండా డబుల్ ఎక్స్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. హీరో సూర్యకి ఇది 44వ చిత్రం. అయితే ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. సినిమా ప్రకటించిన సందర్భంగా ‘లవ్... లాఫ్టర్... వార్...’ (ప్రేమ.. నవ్వు.. యుద్ధం) అని ఉన్న పోస్టర్ని ఎక్స్లో షేర్ చేశారు కార్తీక్ సుబ్బరాజు. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తారు. ఈ చిత్రాన్ని సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్, కార్తీక్ సుబ్బరాజు స్టోన్ బెంచ్ క్రియేషన్స్ నిర్మించనున్నాయి. ఇక ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘కంగువ’ చిత్రంలో నటిస్తున్న సూర్య తనకు ‘ఆకాశం నీ హద్దు రా’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన సుధ కొంగర దర్శకత్వంలో ఓ సినిమాకి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. -
'అందంగా లేని హీరోయిన్ను తీసుకున్నారు'.. దర్శకుడి సమాధానమిదే!
రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్తాండ డబుల్ ఎక్స్'. నవంబర్ 10న విడుదలైన ఈ మూవీ పది రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సినిమా సూపర్ సక్సెస్ కావడంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓ రిపోర్టర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నిమిషా సజయన్ అంత అందంగా ఏమీ లేదని వ్యాఖ్యానించాడు. తను బాగోలేకపోయినా సరే తనను సినిమాలోకి తీసుకుని ఆమె నుంచి నటన ఎలా రాబట్టుకున్నారని ప్రశ్నించాడు. అలా అనడం చాలా తప్పు ఈ ప్రశ్నకు ఖంగు తిన్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఘాటుగానే స్పందించాడు. 'ఆమె అందంగా లేదని నువ్వెలా చెప్పగలవు? నీకెందుకలా అనిపించింది? ఒకరు అందంగా లేరని అనేయడం, అలా డిసైడ్ చేసేయడం.. చాలా తప్పు' అని కౌంటరిచ్చాడు. దర్శకుడి సమాధానం విని చిత్రయూనిట్ అంతా చప్పట్లు కొట్టింది. ఇక ఈ సినిమాతో పాటు సక్సెస్ మీట్లోనూ భాగమైన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ఏమీ మారలేదు 'నేను అక్కడే ఉన్నాను. అందం గురించి అతడు పిచ్చి ప్రశ్న అడిగి వదిలేయలేదు. ఏదైనా వివాదాస్పదం అయ్యే ప్రశ్నలు అడగాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలాంటి ప్రశ్నలు అడిగేశాక తనకు తాను గర్వంగా ఫీలయ్యాడు. 9 ఏళ్ల క్రితం జిగర్తాండ మొదటి భాగం వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఏమీ మారలేదు' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఈ హీరోయిన్కు ఏం తక్కువ? అంత బాగా అభినయం చేస్తోంటే ఇలా అవమానించేలా ఎలా మాట్లాడుతారో అని కామెంట్లు చేస్తున్నారు. నటనలో ఘనాపాటి కాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నిమిషా సజయన్ ఈ విజయోత్సవ సభకు హాజరు కాలేదు. ఈమె ఇటీవల వచ్చిన సిద్దార్థ్ చిత్త(చిన్నా) మూవీలోనూ నటతో మెప్పించింది. ఈమె మలయాళ నటి. 2017లో కేరాఫ్ సైరా భాను సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ద గ్రేట్ ఇండియన్ కిచెన్, నాయట్టు, తొండిముతలుమ్ దృక్షాక్షియుమ్.. తదితర హిట్ చిత్రాల్లో నటించింది. జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీలో రాఘవ లారెన్స్ భార్యగా, గిరిజన యువతి మలైయారసి పాత్రలో కనిపించింది. I was there. It was not just about the ridiculous ‘beauty’ question for the reporter. There was a conscious effort from the guy to ask something controversial and he was so proud after asking this. Nothing has changed since the appalling ‘Jigarthanda’ - ‘Figuredhanda’ question 9… https://t.co/ZaVh5lEkK9 — Santhosh Narayanan (@Music_Santhosh) November 18, 2023 చదవండి: అందుకే 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' మూవీ వదులుకున్నా.. భూమికతో గొడవలు.. -
ట్రైలర్ అదిరిపోయింది
‘‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ ఎలా ఉంటుందో మరోసారి ఈ ట్రైలర్తో చూపించాడు. సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందనే గట్టి నమ్మకం ఉంది’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’. కార్తికేయన్ సంతానం నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదలఅవుతోంది. హైదరాబాద్లో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్ మాట్లాడుతూ–‘‘లారెన్స్, ఎస్జే సూర్య వంటి ప్రతిభ ఉన్న నటులు ఈ సినిమాలో నటించారు. కార్తీక్ సుబ్బరాజ్ కల్ట్ డైరెక్టర్. నాకోసం తను త్వరలోనే ఓ స్క్రిప్ట్ తయారు చేస్తాడనుకుంటున్నాను’’ అన్నారు. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ–‘‘తమిళనాడులో నేను ట్రస్ట్ పెట్టి సేవలు చేస్తున్నాను. ఇకపై తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ ట్రస్ట్ సేవలు అందించబోతున్నాను’’ అన్నారు. ‘‘అందరూ మా సినిమాను చూసి ఎంజాయ్ చే స్తారు’’ అన్నారు ఎస్జే సూర్య. ‘‘మా చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అని కార్తికేయన్ సంతానం అన్నారు. ‘‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ నాకు ఎంతో ప్రత్యేకం. నాలుగున్నరేళ్ల తర్వాత థియేటర్స్లోకి విడుదలవుతున్న నా సినిమా ఇది’’ అన్నారు కార్తీక్ సుబ్బరాజ్. ఈ వేడుకలో సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, డైరెక్టర్ శైలేష్ కొలను, నటుడు నవీన్ చంద్ర మాట్లాడారు. -
RC 15: మరో వివాదంలో డైరెక్టర్ శంకర్..
‘అది నా కథ. నాకు తెలియకుండా కొట్టేశారు’ అంటూ అప్పుడప్పుడూ రచయితలో, దర్శకులో ఆరోపించే విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఓ వివాదం హాట్ టాపిక్ అయింది. ఇది శంకర్ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన వివాదం. రామ్చరణ్ (‘ఆర్సీ 15’.. చరణ్కి ఇది 15వ సినిమా) హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ ప్యాన్ ఇండియా మూవీ నిర్మించనున్న విషయం తెలిసిందే. ‘భారతీయుడు 2’ పూర్తి చేశాకే శంకర్ ఈ సినిమా చేయాలని ఆ చిత్రనిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయమూ విదితమే. మరోవైపు ‘అపరిచితుడు’ రీమేక్ వివాదం కూడా ఎదుర్కొన్నారు శంకర్. తాజాగా.. రామ్చరణ్ సినిమా కోసం తయారు చేసిన కథ తనదేనంటూ చెల్లముత్తు అనే రచయిత దక్షిణ భారత సినీ రచయితల సంఘాన్ని ఆశ్రయించారు. కార్తీక్ సుబ్బరాజ్ దగ్గర దర్శకత్వ శాఖలో చేశారు చెల్లముత్తు. ఇటు రామ్ చరణ్ సినిమా, అటు ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ ప్లాన్స్తో బిజీగా ఉన్న శంకర్ ‘ఆర్సీ 15’కి కథ తయారు చేసి ఇవ్వమని కార్తీక్ సుబ్బరాజ్ని కోరారట. ఆ మేరకు కార్తీక్ ఓ కథ తయారు చేసి ఇచ్చారట. ఆ కథ తనదని చెల్లముత్తు ఆరోపిస్తున్నారు. కార్తీక్, చెల్లముత్తులతో మాట్లాడి, అసలు కథేంటి? కథ ఎవరిది? అనే విషయంలో రచయితల సంఘం త్వరలో తీర్పు వెల్లడిస్తుందని కోలీవుడ్ టాక్. చదవండి : డాక్టర్తో డైరెక్టర్ వివాహం.. హాజరైన ప్రముఖులు అల్లు అర్జున్తో డ్యాన్స్.. తెగ కష్టపడుతున్న రష్మిక -
‘మహాన్’గా విక్రమ్.. లుక్ అదిరిందిగా
విక్రమ్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్లుక్ విడుదలైంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మహాన్’అనే టైటిల్ని ఖరారు చేశారు. ఇక లుక్ విషయానికొస్తే... మరోసారి సరికొత్త అవతారంలో కనిపించి సర్ప్రైజ్ చేశాడు విక్రమ్. పొడవాటి జుత్తు, గడ్డంతో చాలా స్టైలీష్గా కనిపించాడు. బుల్లెట్పై హుందాగా కూర్చొని నవ్వుతూ దర్శనం ఇచ్చాడు విక్రమ్. (చదవండి: షాకింగ్.. 100 సెలబ్రిటీల నగ్న వీడియోలు లీక్!) ఆయన వెనకాల కొమ్ములు, 16చేతులు గల ఒక ఆకారం కూర్చొని ఉంది. దాని వెనక ఉన్న రహస్యం ఏంటి? అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే సగ భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంపై త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విక్రమ్ సరసన సిమ్రన్ నటిస్తోంది. ఎస్.ఎస్. లలిత్ కుమరా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంతోశ్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. -
మన హీరోకి హాలీవుడ్ డైరెక్టర్ల విషెస్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. మిగతా భాషల్లోనూ టాలెంటెడ్ హీరోగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. వరుసగా ప్రయోగాత్మక సబ్జెక్టుల్లో యాక్ట్ చేస్తున్న ధనుష్.. లేటెస్ట్గా గ్యాంగ్స్టర్ డ్రామా ‘జగమే తందిరమ్’(జగమే తంత్రం)తో సందడి చేయబోతున్నాడు. ఈ తరుణంలో హాలీవుడ్ దర్శక ద్వయం రుస్సో బ్రదర్స్ ధనుష్కి గుడ్లక్ చెప్పారు. ‘సూపర్ డా తంబీ.. నీతో పనిచేసేప్పుడు ఎగ్జైట్ అయ్యాం. కొత్త సినిమా రిలీజ్కు గుడ్ లక్’ అంటూ ట్రైలర్తో సహా ట్వీట్ చేశారు. దానికి ధనుష్ స్పందిస్తూ థ్యాంక్స్ చెప్పడం, ఆ వెంటనే రుస్సో బ్రదర్స్ మళ్లీ స్పందించడం జరిగిపోయాయి. ఇదిలా ఉంటే జగమే తందిరం ఈ మధ్యాహ్నం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ కాబోతోంది. తమిళ్, తెలుగుతో సహా పదిహేడు భాషల్లో 190 దేశాల్లో ఈ మూవీ అలరించనుంది. Thank you so much. That’s very sweet of you. Means a lot to me. https://t.co/SraBgHztgr — Dhanush (@dhanushkraja) June 17, 2021 ధనుష్ హాలీవుడ్లో ‘ది గ్రేమ్యాన్’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు రుస్సో బ్రదర్స్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ మూవీని కూడా నెట్ఫ్లిక్స్ నిర్మిస్తోంది. ఈ చొరవతో ఈ హాలీవుడ్ దర్శకులు ధనుష్కు విషెస్ చెప్పారన్నమాట. -
సినిమా నుంచి అనిరుధ్ను సైడ్ చేశారు!
చియాన్ విక్రమ్ 60వ సినిమా షూటింగ్ నేడు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్కు స్వాగతం చెప్తూ ట్వీట్ చేశాడు. కానీ ఈ ట్వీట్ అభిమానులను ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. కారణం.. ఈ చిత్రానికి గతంలో అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తాడని ప్రకటించారు. కానీ ఏమైందో ఏమోకానీ సడన్గా అతడిని సైడ్ చేస్తూ సంతోష్ పేరును ప్రకటించారు. "అవును, ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మమ్మల్ని అర్థం చేసుకుని అండగా నిలిచినందుకు అనిరుధ్కు కృతజ్ఞతలు. ఈ రోజే చిత్రీకరణ ప్రారంభమవుతోంది" అంటూ కార్తీక్ సుబ్బరాజు ట్వీట్ చేశాడు. చిత్రయూనిట్ తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం అనిరుధ్ మాస్ బీజీఎమ్ మిస్ అవుతామని కామెంట్లు చేస్తున్నారు. Yes... It's A Santosh Narayanan Musical!! Welcome to the Gang @Music_Santhosh Thanks @anirudhofficial for your understanding & Support ... #Chiyaan60 shoot starts from TODAY... Need all your Support, Blessings and Love 🙏 More updates to follow.... pic.twitter.com/ZqmFKU6J86 — karthik subbaraj (@karthiksubbaraj) March 10, 2021 ఇక మీ సినిమాలో సిమ్రాన్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లలిత్ కుమార్ తన సొంత నిర్మాణ సంస్థ సెవర్ స్క్రీన్ స్టూడియోపై ఈ సినిమా నిర్మిస్తున్నాడు. మరోవైపు విక్రమ్ 'పొన్నియిన్ సెల్వన్' అనే మరో యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నాడు. చదవండి: విక్రమ్కు సవాలు విసురుతున్న ఇర్ఫాన్ పఠాన్ అఖిల్ పేరు ఛాతీ మీద పచ్చబొట్టు వేయించుకున్న ఫ్యాన్ -
రజనీకాంత్ - కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ రిపీట్
రజనీకాంత్– డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందని కోలీవుడ్ టాక్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం ‘పేట్ట’. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా మరోసారి వీరిద్దరూ కలసి పనిచేయనున్నారట. రజనీకాంత్ను రెండోసారి డైరెక్ట్ చేసే అవకాశం ఈ యంగ్ ఫిల్మ్ మేకర్కి వచ్చిందని టాక్. ప్రస్తుతం ‘అన్నాత్తే’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నారు రజనీకాంత్. ఈ సినిమా తర్వాత వీరి సినిమా సెట్స్ మీదకు వెళ్లొచ్చట. ప్రస్తుతం విక్రమ్, ఆయన తన యుడు ధ్రువ్ విక్రమ్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కార్తీక్ సుబ్బరాజ్. ఈ సినిమా పూర్తయ్యాక రజనీ సినిమా ప్రారంభం కానుందట. -
సినిమాను కాపాడండి
‘‘సినిమాను కాపాడండి’’ అంటున్నారు థియేటర్స్ యాజమాన్యాలు. ‘సేవ్ సినిమా’ (సినిమాను కాపాడండి), సపోర్ట్ మూవీ థియేటర్స్ అనే హ్యాష్ట్యాగ్తో ట్వీటర్లో ట్రెండ్ ఆరంభించారు. ఈ విషయం గురించి ‘మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ పలు ట్వీట్స్లో ఇలా పేర్కొంది. ‘‘మన దేశ సంప్రదాయాల్లో సినిమా థియేటర్స్లో సినిమాకు వెళ్లడం ఓ పద్ధతి. మన దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా సినిమా థియేటర్స్ చాలా కీలకం. ఎన్నో వందల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది. చాలా దేశాల్లో సినిమా థియేటర్స్ తెరవడానికి ఆయా ప్రభుత్వాలు అనుమతించాయి. భారత ప్రభుత్వం కూడా మా విన్నపాన్ని మన్నించాలని, సినిమా హాళ్లు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాం. సినిమా చూడటానికి ప్రేక్షకులు వచ్చేలా చేసే బాధ్యత మాది. పరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉంటాం. విమానయానాలు, మెట్రో ట్రైన్స్, రెస్టారెంట్స్ ఓపెన్ చేసేందుకు అనుమతించినట్లుగానే సినిమా హాళ్లకు కూడా ఓ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం’’ అని పేర్కొంది. ఈ విషయంలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మరికొంతమంది సినీ ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. -
‘జగమే తంత్రం’ అంటున్న ధనుష్
కోలీవుడ్ స్టార్ ధునుష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జగమే తంతిరమ్’. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తున్నారు. వైనాట్ స్టూడియోస్ బ్యానర్పై ఎస్. శశికాంత్ నిర్మిస్తున్నారు. తెలుగులో ‘జగమే తంత్రం’అనే పేరుతో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ధనుష్ డిఫరెంట్ గెటప్లో దర్శనమిచ్చాడు. చొక్కా, పంచెతో తమిళ సంప్రదాయంలో కనిపించినా.. చేతిలో గన్నులు భయపెట్టేలా ఉన్నాయి. దీంతో మాస్ ఆడియన్స్కు ఈ సినిమాతో పండగే అని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర బృందం రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ధనుష్కు ఇది 40వ చిత్రం కావడంతో ‘డి 40’అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరిపారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 1న రిలీజ్ కానుంది. -
గ్యాంగ్స్టర్గా దుమ్ములేపిన ధనుష్
యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జగమే తంత్రం’. ధనుష్ గ్యాంగ్స్టర్గా నటిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. ధనుష్ మాస్ లుక్ ఆకట్టుకుంది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ మాస్ ఆడియన్స్ను కట్టిపడేసేలా ఉంది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు జేమ్స్ కాస్మో ఓ కీలక పాత్ర పోషించారు. ఆయనకిది 40వ చిత్రం కావడంతో.. ధనుష్ అభిమానులు D40 పేరుతో హాష్టాగ్ను ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. మే 1న ఈ చిత్రం విడుదల కానుంది. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో ‘జగమే తంత్రం’ నిర్మించాయి. ఎస్. శశికాంత్ నిర్మాతగా, సహ నిర్మాతగా చక్రవర్తి రామచంద్రన్ వ్యవహరించారు. ఇక భిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే కార్తీక్ సుబ్బరాజ్.. ‘పేట’ సినిమాలో రజనీ వయసును 20 ఏళ్లు తగ్గించేశారనే ప్రశంసలను అందుకున్నారు. రజనీకాంత్కు సూపర్ సక్సెస్ ఇచ్చిన కార్తీక్ ధనుష్తో ఛాన్స్ కొట్టేశాడు. జిగర్తండా, కాదల్ సొల్పవదు ఎప్పడి, మెర్కూరి, ఇరైవి కార్తీక్ దర్శకత్వం వహించిన సూపర్హిట్ సినిమాలు. -
లండన్కి బై బై
సెటిల్మెంట్లు, దందాలు చేయడం కోసం గ్యాంగ్స్టర్గా లండన్ వెళ్లారు ధనుష్. అక్కడ పనులన్నీ చక్కబెట్టి తిరిగి ఇండియా బయలుదేరారు. మరి.. సెటిల్మెంట్స్ను ధనుష్ ఏ స్టైల్లో సెటిల్ చేశారో వచ్చే ఏడాది వెండి తెరపై చూపిస్తాం అంటున్నారు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా చిత్రీకరణ ప్యాచ్ వర్క్ మినహా పూర్తయింది. ఇందులో ధనుష్ గ్యాంగ్స్టర్ పాత్ర చేశారు. ఆ మధ్య ఈ సినిమా చిత్రీకరణ యూకేలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘‘నాన్స్టాప్గా 64 రోజులు లండన్లో షూట్ చేశాం. చిత్రీకరణ ముగిసింది’’ అని పేర్కొన్నారు నిర్మాత శాష్. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు జేమ్స్ కాస్మో ఓ కీలక పాత్ర పోషించారు. -
కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణంలో ఐశ్వర్యా రాజేష్
విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజ్ రజనీకాంత్తో పేట చిత్రాన్ని తెరకెక్కించి స్టార్ దర్శకుడిగా మారిపోయారు. ప్రస్తుతం నటుడు ధనుష్తో చిత్రం చేయనున్నారు. కాగా మరో పక్క నిర్మాతగానూ నవ దర్శకులను ప్రోత్సహిస్తున్నారు. తన స్టోన్ బెంచ్ ఫిలింస్ పతాకంపై షార్ట్స్ ఫిలింస్ను నిర్మించారు. తర్వాత వైభవ్, ప్రియాభవానీశంకర్, ఇందుజా నటించిన మేయాదమాన్ చిత్రాన్ని నిర్మించారు. అనంతరం ప్రభుదేవాతో మెర్కూరీ చిత్రాన్ని చేశారు. తాజాగా నటి కీర్తీ సురేశ్ ప్రధాన పాత్రలో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే ప్రారంభం అయ్యింది. స్టోన్బెంచ్ ఫిలింస్ పతాకంపై నటి ఐశ్వర్యారాజేష్ ప్రధాన పాత్రలో మరో చిత్రాన్ని మొదలెట్టారు. ఈ చిత్రం సోమవారం నీలగిరిలో ప్రారంభం అయ్యింది. కల్ రామన్, ఎస్.సోమశేఖర్, కల్యాణ్ సుబ్రమనియన్లు ఈ సినిమాకు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నదీంద్రన్ ఆర్.ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. రోబర్టో సస్సారా ఛాయాగ్రహణం, ఆనంద్ జరాల్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. లేడీ ఓరింయంటెడ్ కథతో తెరకెక్కుతున్న ఈసినిమాలో ఐశ్వర్య కీలక పాత్ర పోషిస్తున్నారు.చిత్ర షూటింగ్ను ఏకధాటిగా నిర్వహించి వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తెరపైకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. -
వదిలేది లేదు
66వ జాతీయ అవార్డుల విషయంలో కోలీవుడ్ అసంతృప్తిగా ఉన్నా, ఇతర దక్షిణాది ఇండస్ట్రీలు హ్యాపీ అనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగులో దివంగత నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన మహానటి చిత్రంలో నటనకు గానూ కీర్తీసురేశ్కు ఉత్తమ నటి అవార్డు వరించడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. అతి పిన్న వయసులోనే సావిత్రి అంత గొప్ప నటి పాత్రలో ఎంతో పరిణితి నటనను ప్రదర్శించిన కీర్తీసురేశ్ను అందరూ ప్రసశించారు. అయితే నటి కీర్తీసురేశ్ మాత్రం జాతీయ అవార్డును ఊహించలేదని పేర్కొంది. అనుకోనిది అందుకోవడంలోనే మజా ఉంటుంది. ఆ ఆనందాన్నే కీర్తీసురేశ్ ఇప్పుడు అనుభవిస్తోంది. ఒక మలయాళ నటి తెలుగులో నటించిన చిత్రానికి జాతీయ అవార్డును గెలుచుకోవడం అరుదైన విషయమే. కాగా ఈ అమ్మడు కోలీవుడ్లో నటించి చాలా కాలమే అయ్యింది. ఇంతకు ముందు తమిళంలో విజయ్, విశాల్, విక్రమ్ వంటి ప్రముఖ హీరోలతో వరుసగా నటించిన కీర్తీసురేశ్ ప్రస్తుతం కోలీవుడ్లో ఒక్క చిత్రం కూడా చేయడం లేదు. ఇప్పుడామే టాలీవుడ్, బాలీవుడ్లపై దృష్టి సారిస్తోంది. బాలీవుడ్లో దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న చిత్రం ద్వారా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రం కోసం చాలా కసరత్తులు చేసి స్లిమ్గా మారిపోయింది. ఇక తెలుగులోనూ ఒక లేడీ ఓరియేంటేడ్ కథా చిత్రంలో నటిస్తోంది. అలాంటిది తొలి హిట్ను అందించడంతో పాటు స్టార్ హీరోయిన్ అంతస్తును అందించిన కోలీవుడ్కు దూరం అవుతారా? అంటూ ఒక అభిమాని కీర్తీసురేశ్ను ప్రశ్నించాడు. ఇందుకు బదులిచ్చిన ఈ ఉత్తమ నటి, తాను కోలీవుడ్కు దూరం అయ్యే సమస్యే లేదని, త్వరలోనే తమిళ చిత్రంలో నటించనున్నట్లు చెప్పింది. ఈ అమ్మడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు తెలిసింది. ఇదీ హీరోయిన్ ఓరియన్టెడ్ కథా చిత్రంగానే ఉంటుందట. కమర్శియల్ చిత్రాల్లో బబ్లీగర్ల్ పాత్రల్లో నటించాల్సిన వయసులో కీర్తీసురేశ్ బరువైన పాత్రల్లో చిత్రాలను పూర్తిగా తన భుజాన మోయడానికి ప్రయత్నించడం సాధారణ విషయం కాదు అంటున్నారు విశ్లేషకులు. -
లండన్ ప్రయాణం
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్– ధనుష్ ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇదే సినిమాని పట్టాలెక్కించడానికి రెండుసార్లు ప్రయత్నించి, విఫలమయ్యారు. ఈ ప్రాజెక్ట్ను మళ్లీ స్టార్ట్ చేస్తున్నారని సమాచారం. వై నాట్ స్టూడియోస్ నిర్మించనున్న ఈ సినిమా ఎక్కువ శాతం షూటింగ్ లండన్లో జరగనుందట. రెండు నెలలు పాటు లండన్లో ఏకధాటిగా షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ హాలీవుడ్ నటుడు కీలక పాత్ర చేయనున్నారని తెలిసింది. ప్రస్తుతం ధనుష్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయ్యాక కార్తీక్ సుబ్బరాజ్తో చేయబోయే సినిమా కోసం లండన్ ప్రయాణం కానున్నారు. -
కార్తీక్ సుబ్బరాజ్ చిత్రంలో కీర్తీసురేశ్
యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చిత్రంలో యువ నటి కీర్తీసురేశ్ నటించబోతున్నారన్న టాక్. తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నిజానికి కీర్తీసురేశ్ కోలీవుడ్ చిత్రాల్లో నటించి చాలా కాలమైందని చెప్పవచ్చు. సర్కార్ చిత్రం తరువాత ఈ చిన్నది తమిళంలో నటించలేదు. అంతకు ముందు స్వామీ స్క్వేర్, సండైకోళి–2, సర్కార్ చిత్రాలతో పాటు తెలుగులో మహానటి వంటి చిత్రాలతో క్షణం తీరిక లేకుండా నటించేసిన కీర్తీసురేశ్ నటనకు కాస్త విరామం తీసుకోనున్నట్లు ప్రకటించారు. అయితే మలయాళంలో నటిస్తూనే ఉన్నారు. ఇక తెలుగులోనూ ఈ బ్యూటీకి అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ హిందీ చిత్రాల నిర్మాత, దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ కీర్తీసురేశ్ను బాలీవుడ్కు ఆహ్వానించారు. అక్కడ ఆయన నిర్మించనున్న చిత్రంలో అజయ్దేవ్గన్కు జంటగా నటించే అవకాశాన్ని కల్పించారు. విశేషం ఏమిటంటే ఆ చిత్రంలో కీర్తీసురేశ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలా బాలీవుడ్లో ఎంట్రీతోనే ద్విపాత్రాభినయం చేస్తున్న తొలి దక్షిణాది బహుశా నటి కీర్తీసురేశే అయి ఉంటారు. ఈ చిత్రాన్ని అమిత్శర్మ తెరకెక్కిస్తున్నారు. అదే విధంగా మాతృభాష మలయాళంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో మరక్కార్ అబిరక్కడలిండె సింహం అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో మోహన్లాల్, సునీల్శెట్టి, సుధీప్, అర్జున్, ప్రభు, మంజువారియర్, నెడుముడి వేణు, సుహాసిని మణిరత్నం వంటి స్టార్స్ నటిస్తున్నారు. వీటితో పాటు తెలుగులో నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఒక చిత్రం, నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో ఒక చిత్రం అంటూ బిజీగా నటిస్తున్నారు. ఇలా చూస్తే కీర్తీసురేశ్ నటించిన ఒక్క తమిళ చిత్రం కూడా ఈ ఏడాది తెరపైకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. తాజాగా ఒక తమిళ చిత్ర అవకాశం కీర్తీని వరించిందని తెలిసింది. సూపర్స్టార్కు పేట వంటి సూపర్హిట్ చిత్రాన్నిచ్చిన యువ దర్శకుడు కార్తీక్సుబ్బరాజ్ నటి కీర్తీసురేశ్ను తన చిత్ర కథానాయకిగా ఎంచుకున్నట్లు తెలిసింది. అయితే ఇది ఆయన దర్శకత్వం వహించే చిత్రం కాకుండా సొంతంగా నిర్మించే చిత్రం అవుతుంది. తన స్టోన్ బెంచ్ పతాకంపై ఒక కొత్త దర్శకుడికి కార్తీక్సుబ్బరాజ్ అవకాశం కల్పిస్తున్నట్లు తాజా సమాచారం. అయితే ఇదీ హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంగా ఉంటుందట. ఈ చిత్రానికి సంబంధించిన అధికారికపూర్వక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
అల్లుడి కోసం రజనీ
సక్సెస్ అవకాశాలను కుమ్మరిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పరిస్థితి అలానే ఉంది. ఆ మధ్య మెర్కూరి, ఇరైవి చిత్రాలు కాస్త తేడా కొట్టడంతో నిరాశ చెందిన ఈ యువ దర్శకుడికి సూపర్ స్టార్ రూపంలో భారీ ఆఫర్ వచ్చింది. అదే పేట. ఈ చిత్రం రజనీకాంత్ను ఖుషీ పరచడంతో పాటు ఆయన కెరీర్లో మరో సంచలన చిత్రంగా నమోదు అయ్యింది. పేట చిత్రంలో రజనీకాంత్ను 20 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లి చాలా యూత్గా స్టైలిష్గా చూపించడంతో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ విజయవంతం అయ్యాడు. దీంతో బాగా ఇంప్రెస్ అయిన రజనీ కార్తీక్ సుబ్బరాజ్కు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో సూపర్స్టార్, సుబ్బారాజ్ను పిలిచి తన చిన్నల్లుడు విశాఖన్ హీరోగా ఒక చిత్రంగా చేయాల్సిందిగా కోరినట్లు తాజా సమాచారం. ఈ ఆఫర్కు సుబ్బరాజు వెంటనే ఓకే చెప్పేశారట. విశాఖన్ రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య భర్త అన్న విషయం తెలిసిందే. గతంలో విశాఖన్ వంజగర్ ఉలగం చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించారు. యువ వ్యాపారవేత్త అయిన విశాఖన్కు నటనపై ఆసక్తి అట. దీంతో ఆయన్ను హీరోగా పరిచయం చేయమని తలైవా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ను కోరినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారిక పూర్వకంగా వెలువడాల్సి ఉంది. పేట చిత్రం తరువాత కార్తీక్ సుబ్బరాజ్ ధనుష్తో ఒక చిత్రం చేయబోతున్నారు. దీని తరువాత విశాఖన్తో చిత్రం చేసే అవకాశం ఉంది. అలా రజనీకాంత్ అళ్లుళ్లు ఇద్దరూ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంతో బిజిగా ఉన్నారన్న మాట. -
ఆన్ ద వే!
అంతా సవ్యంగా సాగి ఉంటే ధనుష్ హీరోగా ‘పేట’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం ఈ పాటికే వెండితెరపైకి వచ్చి ఉండేది. కానీ, కొన్ని కారణాలవల్ల ఈ చిత్రం బాగా ఆలస్యం అయ్యింది. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ చిత్రం ఆగలేదు. ఆన్ ద వేలో ఉందని తాజా కోలీవుడ్ ఖబర్. కార్తీక్ సుబ్బరాజ్ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్పైనే వర్క్ చేస్తున్నారని సమాచారం. ధనుష్ ప్రస్తుతం వెట్రీ మారన్ దర్శకత్వంలో ‘అసురన్’ అనే సినిమా చేస్తున్నారు. ఇంకా సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మాణసంస్థలో రెండు సినిమాలకు కమిట్ అయ్యారు. దర్శకునిగా ఓ సినిమా ఉంది. ఇలా వరుస కమిట్మెంట్స్తో ధనుష్ బిజీగా ఉన్నారు. మరి.. ఈ కమిట్మెంట్స్ అన్నింటినీ పూర్తి చేసిన తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ చిత్రం స్టార్ట్ అవుతుందా? లేక ఈ ఏడాదే ఈ చిత్రం సెట్స్పైకి వెళ్తుందా? వెయిట్ అండ్ సీ. -
మామ తర్వాత అల్లుడితో
యువ దర్శకుల్లో కార్తీక్ సుబ్బరాజ్ శైలి భిన్నంగా ఉంటుంది. ఆయన తయారు చేసుకునే కథలు కూడా సమ్థింగ్ స్పెషల్గా ఉంటాయి. జిగర్తండా, కాదల్ సొల్పవదు ఎప్పడి, మెర్కూరి, ఇరైవి ఇలా ఏ చిత్రానికి ఆ చిత్రం భిన్నంగా ఉంటాయి. ఇక ఇటీవల సూపర్స్టార్ రజనీకాంత్కు పేట చిత్రంతో సూపర్హిట్ చిత్రాన్ని ఇచ్చాడు కార్తీక్. అందులో రజనీ వయసు 20 ఏళ్లు తగ్గించేశారనే ప్రశంసలను అందుకున్నారు. అలా రజనీకాంత్కు సూపర్ సక్సెస్ ఇచ్చిన కార్తీక్సుబ్బరాజ్.. ఇప్పుడు ఆయన అల్లుడు, ధనుష్తో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. వును నిజానికి వీరి కాంభినేషన్లో ఇంతకు ముందే చిత్రం రూపొందాల్సి ఉంది. ఆ సమయంలో ధనుష్ వడచెన్నై, మారి–2 చిత్రాలతో బిజీగా ఉండడంతో వాయిదా పడింది. దీంతో వీరి కాంభినేషన్లో చిత్రం ఆగిపోయ్యిందనే ప్రచారం కూడా జరిగింది. అలాంటిది ఇప్పుడు కార్తీక్సుబ్బ రాజ్.. ధనుష్తో చిత్రం చేయడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఆయన కథ రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. జూన్లో ఈ చిత్రం సెట్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను వైనాట్ స్టూడియోస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించనుంది. చిత్ర షూటింగ్ను అధిక భాగం న్యూయార్క్ నగరంలో చిత్రీకరించనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా ధనుష్ ప్రస్తుతం వెట్ట్రిమారన్ దర్శకత్వంలో కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న అసురన్ చిత్రంలో నటిస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించిన ఎన్నై నోక్కి పాయుమ్ తూట్టా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్తో విడుదలకు సిద్ధంగా ఉంది. -
థియేటర్ల మాఫియా ఉంది
‘‘సినిమా కళకి కులం, మతం, జాతి, ప్రాంతం.. ఉండవని నిరూపించారు రజనీగారు. స్వయంకృషితో వరల్డ్ సూపర్స్టార్గా ఎదిగారంటే అది రజనీగారొక్కరే. మన ఎన్టీ రామారావుగారు కూడా చరిత్ర సృష్టించారు. శ్రీకాంత్కూడా స్వయంశక్తితో ఈ స్థాయికి ఎదిగాడు’’ అని నిర్మాత టి.ప్రసన్న కుమార్ అన్నారు. రజనీకాంత్ హీరోగా, త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పేట్టా’. ఈ చిత్రాన్ని ‘పేట’ పేరుతో వల్లభనేని అశోక్ ఈ నెల 10న తెలుగులో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ప్రసన్నకుమార్ మాట్లాడుతూ– ‘‘సినిమా బావుంటే ఎవ్వడూ ఆపలేడు. ఈరోజు థియేటర్స్ మాఫియా ఎలా ఉందంటే మాఫియా డాన్స్ కంటే దారుణాతి దారుణంగా ఉంది. కేవలం ముగ్గురు నలుగురు చేస్తున్న సినిమాలకి మొత్తం థియేటర్స్ పెట్టుకుంటున్నారు. సాంకేతిక నిపుణులను బతకనిచ్చే పరిస్థితిగానీ, కొత్తవాళ్లు వచ్చే పరిస్థితిగానీ లేకుండా చాలా నీచాతి నీచంగా చేస్తున్నారు. సంక్రాంతి అంటే ఆరేడు సినిమాలు రిలీజ్ అయినా చూడగలిగే ప్రేక్షకులున్నారు. కానీ, చూడ్డానికి ఒకటి లేదా రెండు సినిమాలు తప్పితే మిగతా సినిమాలకు అవకాశం లేకుండా చేస్తున్న మాఫియా ఉంది. ఈ మాఫియా ఎండ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడుగార్లకు చెబుతాం. వాళ్ల సినిమాలే ఆడాలని చూస్తున్నారు. మిగతా వాళ్లందర్నీ తొక్కి పారేస్తున్నారు. మా సినిమాలే ఉండాలి అనే ధోరణిలో వెళుతున్నారు. ఇది మంచిది కాదు. దయచేసి ఇది మీకు విజ్ఞప్తి అనుకోండి.. కాదంటే వార్నింగ్ అనుకోండి.. అయిపోతారు... చాలా మందిని చూశాం. విర్రవీగినోళ్లంతా ఆకాశంలోకి వెళ్లిపోయారు.. మీరు కూడా పోతారు. కొంచెం తెలుసుకుని కరెక్టుగా ఉండండి’’ అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల మధ్య.. ‘పేట’ కూడా పెద్ద సినిమానే. వాటి మధ్య ఈ సినిమా విడుదల చేస్తున్నాడు అశోక్. ఆ సినిమాలతో పాటు ‘పేట’ కూడా ఆడాలని కోరుకుంటున్నా. రజనీకాంత్గారి సినిమాలు చూస్తూ పెరిగాం. చిరంజీవిగారు, రజనీగారు నటీనటులకు స్ఫూర్తి’’ అన్నారు. చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్ మాట్లాడుతూ–‘‘ఎందరో మహానుభావులు.. ఇక్కడికి వచ్చిన వారందరికీ వందనాలు. పిలిచినా వస్తానని రాకుండా మమ్మల్ని ఆనందపెట్టిన ఇంకొందరు మహానుభావులకు నా రెండేసి వందనాలు. ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి మధ్య మన సినిమా ‘పేట’ కి థియేటర్స్ తక్కువైనా, బిజినెస్ జరిగినా, జరక్కపోయినా సొంతంగా రిలీజ్ చేద్దామని రిస్క్ తీసుకుని విడుదల చేస్తున్నా’’ అన్నారు. ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ– ‘‘రజనీగారు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఓ చరిత్ర. అలాంటివాళ్లు అక్కడక్కడా వస్తుంటారు. మనకి మన ఎన్టీ రామారావుగారు. ఆయన ఓ చరిత్ర. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో జపాన్లో ఫ్యాన్స్ని సంపాదించుకున్న మొదటి వ్యక్తి రజనీ. సౌత్ ఇండియాలోనూ హీరోలు ఉన్నారని ప్రపం చానికి చాటిన మొదటి హీరో రజనీ ’’అన్నారు. కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ– ‘‘పేట’ చిత్రం మా అందరి డ్రీమ్ ప్రాజెక్ట్. రజనీసార్ అభిమానులకే కాదు, ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుంది. మంచి కథ. ఈ పండక్కి చాలా పెద్ద సినిమాల మధ్య మా సినిమా విడుదలవుతోంది. ఆ సినిమాలతో పాటు మా ‘పేట’ కూడా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. దర్శక–నిర్మాత వైవీఎస్ చౌదరి, నిర్మాత కిరణ్, సంగీత దర్శకుడు అనిరు«ద్, నటీనటులు బాబీ సింహా, మేఘా ఆకాశ్, మాళవికా మోహన్, పాటల రచయితలు భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్రాంతికి ఫిక్స్
ఇందుమూలంగా యావన్మంది ప్రేక్షక లోకానికి తెలియజేయడం ఏమనగా రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘పేట’ సంక్రాంతికి విడుదల అవుతోందహో.. రజనీకాంత్ హీరోగా, త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పేట్టా’. ఈ చిత్రాన్ని ‘పేట’ పేరుతో నిర్మాత వల్లభనేని అశోక్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సర్కార్, నవాబ్’ వంటి భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన మా బ్యానర్లో ‘పేట’ సినిమా హ్యాట్రిక్ హిట్గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. రజనీ అభిమాని అయిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమా తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. అనిరు«ద్ చక్కటి సంగీతం ఇచ్చారు. అటు మాస్, ఇటు క్లాస్ ఆడియన్స్ని కట్టిపడేసే కమర్షియల్ అంశాలున్న మా చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నాం’’ అన్నారు. విజయ్ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితరులు నటించారు. -
పండక్కి పేట లేనట్టే
రజనీకాంత్ సినిమా అంటే హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్, చెన్నైలోని టీ నగర్లో ఏకకాలంలో రిలీజ్ కావాల్సిందే. అది రజనీ క్రేజ్. అదేనండీ.. అక్కడా ఇక్కడా అన్ని ఏరియాల్లోనూ ఆయన బొమ్మ పడాల్సిందే. తమిళ, తెలుగు భాషల్లో రజనీకాంత్కి అంత క్రేజ్ ఉంది. ‘బాబా’ (2002) నుంచి దాదాపు రజనీకాంత్ ప్రతి సినిమా తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కావడం ఆనవాయితీ అయ్యింది. కానీ ఈసారి పండక్కి (సంక్రాంతికి) ‘పేట్టా’ (తెలుగులో ‘పేట’) లేనట్టే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన చిత్రం ‘పేట్టా’. సన్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో త్రిష, సిమ్రాన్ కథానాయికలు. ఈ సినిమాను తమిళంలో పొంగల్కి రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ తెలుగులో సంక్రాంతికి ఈ చిత్రం విడుదలపై అనుమానాలు ఏర్పడ్డాయి. ఆల్రెడీ సంక్రాంతి సీజన్కు బాలకృష్ణ ‘ఎన్టీఆర్: కథానాయకుడు’, రామ్చరణ్ ‘వినయ విధేయ రామ’, వెంకటేశ్, వరుణ్తేజ్ ‘ఎఫ్2’(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) చిత్రాలు రిలీజ్ కానున్నాయి. థియేటర్స్ ఇబ్బంది అవుతుందనో లేక మరేదైనా కారణమో కానీ ‘పేట’ను జనవరి 25 లేదా ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం తెలుగు ఆడియో గురువారం రిలీజ్ అయింది. కాగా ఈ చిత్రం తెలుగు విడుదల హక్కులు సి. కల్యాణ్ పొందారని వార్త వచ్చింది. అది నిజం కాదని కల్యాణ్ స్పష్టం చేశారు. -
‘పేట్ట’ తెలుగు రిలీజ్ ఎప్పుడు?
ఇటీవల 2.ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్స్టార్ రజనీకాంత్ షార్ట్ గ్యాప్లో మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. 2.ఓ ఆలస్యంగా రిలీజ్ కావటంతో కేవలవం రెండు నెలల గ్యాప్లో రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు రజనీ. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీ హీరోగా తెరకెక్కిన పేట్ట సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా తెలుగు రిలీజ్పై మాత్రం అనుమానాలు ఏర్పడ్డాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇంతవరకు తెలుగు వర్షన్ ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం ప్రారంభించలేదు. దీంతో తమిళ్తో పాటు తెలుగులోనూ పేట్ట రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ ఈ సినిమా తెలుగు రైట్స్ ను సొంతం చేసుకున్నారు. తెలుగులో యన్.టి.ఆర్, వినయ విధేయ రామ, ఎఫ్ 2 సినిమాలు సంక్రాంతి బరిలో పోటి పడుతున్నాయి. దీంతో పేట్ట టీం టాలీవుడ్లో రిలీజ్ ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రజనీ సరసన త్రిష, సిమ్రాన్లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహాలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
మిస్టర్ సింగార్ సింగ్
విలక్షణ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ‘పేట్టా’ సినిమాతో సౌత్కు వస్తున్నారు. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘పేట్టా’ చిత్రాన్ని ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీంతో ఈ సినిమాలో కీలక పాత్రలు చేసిన నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్సేతుపతి, బాబీ సింహా ఇలా ఒక్కొక్కరి లుక్ను విడుదల చేస్తున్నారు. ఇటీవల విజయ్సే తుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ లుక్స్ను రిలీజ్ చేశారు. జీతూ పాత్రలో విజయ్సేతుపతి నటించగా, సింగార్ సింగ్ పాత్రలో నవాజ్ కనిపిస్తారు. అలాగే ఈ సినిమాలోని ‘మరణ మాస్..’ అనే సాంగ్ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇప్పుడు ఈ సినిమాలోని మరో సాంగ్ ‘ఉల్లాలా...’ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ కానుంది. త్రిష, సిమ్రాన్, మేఘా ఆకాష్, మాళవికా మోహనన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. -
పొంగల్కు పేట్ట
ఈ నెలాఖరు నుంచి రజనీకాంత్ వారోత్సవాలు మొదలవుతున్నాయి. ఆయన అభిమానులకు పండగలే పండగలు. రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రకటన గురించి ఏమోగానీ, ఆయన సినీ అభిమానులకు మాత్రం ఇక ఖుషీనే. సూపర్స్టార్ నటించిన కాలా చిత్రం కాస్త నిరాశ పరచినా, దాన్ని మరపించేందుకు వరసుగా రెండు భారీ చిత్రాలు తెరపైకి వచ్చి పండగ వాతావరణాన్ని తీసుకురానున్నాయి. రజనీకాంత్, శంకర్ల కాంబినేషన్లో భారీ, బ్రహ్మాండ చిత్రం 2.ఓ ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. సూపర్స్టార్ నటించిన మరో చిత్రం పేట్ట కూడా వెనువెంటనే తెరపై సందడి చేయనుంది. యువ దర్శకుడు కార్తీక్సుబ్బరాజ్ తెరకెక్కించిన ఇందులో రజనీకాంత్కు జంటగా నటి త్రిష, సిమ్రాన్ నటించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను యమ స్పీడ్గా జరుపుకుంటోంది. ఈ చిత్ర సింగిల్ ట్రాక్ను డిసెంబర్ 3న, రెండో సింగిల్ట్రాక్ పాటను అదే నెల 7న విడుదల చేయనున్నారు. ఇక చిత్ర ఆడియోను రజనీకాంత్ పుట్టినరోజు పురస్కరించుకుని డిసెంబర్ 9న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు కార్తీక్సుబ్బరాజ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. పేట్ట చిత్రం సంక్రాంతికి తెరపైకి రానుందని ఇంతకు ముందే చిత్ర వర్గాలు వెల్లడించినా, ఆ తరువాత చిత్రం వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. పేట్ట చిత్ర విడుదల పొంగల్కు ఖాయం అని తాజాగా చిత్ర దర్శకుడు స్పష్టం చేశారు. 2.ఓ విజువల్స్ ట్వీట్ అయితే పేట్ట రజనీ స్టైల్స్ ట్వీట్గా ఉంటుంది. దీంతో రజనీకాంత్ అభిమానులకు ఈ నెల 29 నుంచి పొంగల్ వరకూ పండగే పండగన్న మాట. -
తలైవరిజమ్తో నింపాం
సరికొత్త ట్యూన్స్తో తమిళ ఇండస్ట్రీని డ్యాన్స్ చేయిస్తున్న సంగీత దర్శకుడు అనిరుద్. సినిమాలోని పాటలను తనదైన మేనరిజమ్తో మరో లెవల్కు తీసుకెళ్లే హీరో రజనీకాంత్. ఇప్పుడు వీళ్ల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘పేట్టా’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆడియో డిసెంబర్ 9న విడుదల కానుంది. డిసెంబర్ 3న ఫస్ట్ సాంగ్, 7న రెండో సాంగ్, 9న మొత్తం ఆల్బమ్ను రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. ‘‘పేట్టా ఆల్బమ్తో తలైవరిజమ్ చూపిస్తాం. సిద్ధంగా ఉండండి’’ అని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ ఆరోగ్యం బాగాలేక చెన్నెలోని హాస్పిటల్లో జాయిన్ అయ్యారని కోలీవుడ్లో ఓ వార్త షికారు చేసింది. అయితే రజనీకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. -
రజనీ ‘పేట్టా’ ఆడియో వస్తోంది!
సూపర్స్టార్ రజనీకాంత్ ‘2.ఓ’తో ఇంకొద్దిరోజుల్లోనే ప్రేక్షకుల ముందకు రానున్నాడు. శంకర్ డైరెక్షన్లో రాబోతోన్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక దీని తరువాత రజనీ తదుపరి సినిమాను కూడా లైన్లో పెట్టేస్తున్నాడు. పిజ్జా ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో రాబోతోన్న ‘పేట్టా’ చిత్రం ఆడియో రిలీజ్ డేట్ను ఫిక్స్ చేశారు మేకర్స్. డిసెంబ ర్ 9న పాటలను విడుదలచేయనున్నట్లు ప్రకటించారు. సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. #PettaAudiofromDec9th The first single will be released on 3rd and second single on 7th!@rajinikanth @karthiksubbaraj @anirudhofficial @VijaySethuOffl @SimranbaggaOffc @Nawazuddin_S @SasikumarDir @trishtrashers pic.twitter.com/DzI1V2K58Z — Sun Pictures (@sunpictures) November 23, 2018 -
‘రజనీతో నేను.. నమ్మలేకపోతున్నా’
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పెట్ట. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. రజనీ డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా సీనియర్ హీరోయిన్ సిమ్రన్ రజనీకాంత్ సరసన హీరోయిన్గా నటిస్తున్నారు. రజనీతో తాను ఉన్న పోస్టర్ను సోషల్ మీడియా పేజ్లో ట్వీట్ చేసిన సిమ్రన్ ‘నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. నన్ను నేను గిచ్చుకొని చూసుకున్నా’ అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నవాజుద్ధీన్ సిద్ధిఖీలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. I'm super happy OMG I can't believe its happening just pinched myself 😊😊💃💃💃💃#PettaPongalParaak @rajinikanth @karthiksubbaraj @anirudhofficial @VijaySethuOffl @Nawazuddin_S @SasikumarDir @trishtrashers @sunpictures pic.twitter.com/0XzUDZEfZs — Simran (@SimranbaggaOffc) 14 November 2018 -
మార్కెట్లో మస్తీ
రజనీకాంత్ తన స్టైల్లో పాటలకు స్టెప్పులు వేస్తే థియేటర్స్లో అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవాల్సిందే. ఇప్పుడు తన లేటెస్ట్ సినిమా కోసం కూడా ఇలాంటి స్టెప్స్ వారణాసిలో వేస్తున్నారట. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పేట్టా’. సిమ్రాన్, త్రిష కథానాయికలు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వారణాసిలో జరుగుతోంది. రీసెంట్గా ఫైట్ సీన్స్ను కంప్లీట్ చేసిన చిత్రబృందం తాజాగా రజనీకాంత్పై మార్కెట్ సెట్లో ఓ సాంగ్ను చిత్రీకరిస్తున్నారట. ఇది రజనీకాంత్ పరిచయ గీతం అని టాక్. ఈ పాటలో రజనీతో పాటు విజయ్ సేతుపతి కూడా ఉన్నారట. ఆల్రెడీ రిలీజ్ చేసిన లుక్స్లో రజనీ చాలా యంగ్గా కనిపిస్తున్నారు అని ఆయన ఫ్యాన్స్ పుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు షూటింగ్ స్పాట్లో ఫొటోలు లీక్ అవ్వడంతో చిత్రబృందం టెన్షన్ అవుతోంది. ‘ఈ ఫొటోలను షేర్ చేయొద్దు అని కోరుకుంటున్నాను. కొన్ని చానల్స్ ఈ షూటింగ్ వీడియోలు చూపించడం బాధాకర ం. కొన్ని రోజుల తర్వాత సినిమాని పైరసీ చేసేసి చానల్స్లో వేసేస్తారేమో’’ అని చిత్రదర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీత దర్శకుడు. -
అదిరింది తలైవా
రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పేట్టా’. సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటిస్తున్నారు. సన్పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అండ్ టైటిల్ను సెప్టెంబర్లో రిలీజ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా రజనీకాంత్ సెకండ్ లుక్ను గురువారం రిలీజ్ చేసి రజనీ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు టీమ్. ఫస్ట్ లుక్లో రజనీకాంత్ ఫుల్ మాస్గా కనిపిస్తే, సెకండ్ లుక్లో క్లాస్గా కనిపించారు. ఈ లుక్స్ని బట్టి సినిమాలోని రజనీకాంత్ క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయని అర్థం అవుతుంది. అలాగే సెకండ్ లుక్ 1980 కాలంనాటిదిగా ఉంది. అంటే ఈ సినిమా 1980 బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోందా? అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం ‘పేట్టా’ సినిమా చిత్రీకరణ వారణాసిలో జరుగుతోందని సమాచారం. రజనీ, విజయ్సేతుపతి, త్రిషలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని కోలీవుడ్ టాక్. నవాజుద్ధీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా, డైరెక్టర్ శశి, మేఘా ఆకాశ్, సనత్ రెడ్డి కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరు«ద్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఇక ఆ బాధ అక్కర్లేదు
‘‘రజనీకాంత్గారితో కలిసి నేనెప్పుడు పని చేస్తాననే ప్రశ్న నన్ను ఎంతకాలం నుంచో బాధపెడుతోంది. ఇక బాధపడక్కర్లేదు. ‘పేట్టా’ సినిమాలో ఆయనతో కలిసి సిల్వర్ స్క్రీన్ పంచుకునే అవకాశం నాకు దక్కింది. సోమవారం నుంచి వారణాసిలో జరిగే తాజా షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొంటాను’’ అన్నారు త్రిష. ఎందుకు ఇంతలా ఆమె భావోద్వేగానికి గురయ్యారంటే... త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు గడిచిపోయాయి. కానీ ఇప్పటివరకు రజనీకాంత్తో త్రిష కలిసి నటించలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆ అవకాశం వచ్చినందుకు ఆనందపడుతున్నారామె. అన్నట్లు.. ఈ చిత్రంలో సిమ్రాన్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అసలు సిమ్రాన్, త్రిష కాంబినేషన్ సన్నివేశాలు లేవట. దీన్నిబట్టి ఈ చిత్రం ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో ఓ కథానాయిక ఉంటారని ఊహించవచ్చు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధికీ, బాబీ సింహా, మేఘా ఆకాశ్, మాళవికా మోహనన్ కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
నవ్వు చెబుతోంది
అభిమాన తారలతో ఫొటోలో బందీ అయిపోవాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ అందరి కలలు నిజం కావు. అయితే కథానాయిక మేఘా ఆకాశ్ కల నిజమైంది. ఆమెకు ఎంతో ఇష్టమైన సూపర్స్టార్ రజనీకాంత్తో కలిసి ఫొటో దిగారు. ‘‘నా కల నిజమైంది. కొన్ని సార్లు నక్షత్రాలను అందుకునే అవకాశం వస్తుంది. నా ఆనందాన్ని నా నవ్వు చెబుతోంది’’ అంటూ ఇక్కడ ఉన్న ఫొటోను షేర్ చేశారు మేఘా ఆకాశ్. ఈ సంగతి ఇలా ఉంచితే... కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘పేట్టా’ సినిమాలో మేఘా ఆకాశ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోతో ఆ విషయం కన్ఫార్మ్ అయ్యిందని కోలీవుడ్ మీడియా చెబుతోంది. ఈ సినిమాలో సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా తదితరులు నటిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుందట. -
లీకైన సూపర్ స్టార్ సినిమా సీన్స్..!
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెట్ట’. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యింది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. భారీ సెక్యూరిటీ మధ్య చిత్రీకరణ జరుగుతున్నా.. ఈ సినిమాకు కూడా లీకుల బెడద తప్పటం లేదు. గతంలో సినిమాలో రజనీ లుక్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా లక్నోలో జరుగుతున్న షూటింగ్ లొకేషన్ నుంచి రెండు సీన్స్ కూడా లీకైనట్టుగా చిత్రయూనిట్ గుర్తించారు. దీంతో షూటింగ్ లోకేషన్లో సెక్యూరిటీని మరింత పెంచినట్టుగా తెలుస్తోంది. దాదాపు 500 మంది నటీనటులు సాంకేతిక నిపుణులు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. -
ఫుల్ ప్రొటక్షన్
పాతికమంది పోలీసులు, దాదాపు నలభై మంది బౌన్సర్స్ రజనీకాంత్కు ప్రొటక్షన్గా ఉన్నారు. ఇది సినిమాలోని సీన్ కాదండీ బాబు. రియల్ సీన్. సూపర్స్టార్ రజనీకాంత్కు ఉన్న క్రేజ్ అలాంటిది. ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా ‘పేట్టా’. సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ చిన్నది కాదు. దాదాపు నెల రోజుల పాటు సాగుతుంది. ఈ షెడ్యూల్లోనే ప్రధాన తారాగణంతో పాటు సుమారు 500 మంది బ్యాక్డ్రాప్లో వచ్చే సీన్స్ను కూడా చిత్రీకరిస్తున్నారు. లక్నోలోనే కాకుండా వారణాసి, సోన్బాద్రా ఏరియాల్లో కూడా షూటింగ్ ప్లాన్ చేశారు. అలాగే సినిమాకు సంబంధించిన ఫొటోలు లీక్ అవుతున్నాయని సెట్లోకి సెల్ ఫోన్స్ను నిషేధించారట టీమ్. సూపర్ స్టార్కి ఫుల్ ప్రొటక్షన్ ఏర్పాటు చేశారట.. అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుందని కోలీవుడ్ టాక్. -
కొత్త లుక్ దేనికోసం?
సిల్వర్ స్క్రీన్పై మెరిసే తారలు ఏదైనా కొత్త స్టైల్లోకి మారితే హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు వార్తల్లో నిలిచారు త్రిష. కారణం జుట్టుని కురచగా కత్తిరించుకోవడమే. ఉన్నట్లుండి త్రిషకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అనే చర్చ జరుగుతోంది. పైగా చేతిలో సినిమాలు లేకపోతే ఏదో సరదా కోసం చేశారనుకోవచ్చు. ఇటీవల కమిట్ అయిన రజనీకాంత్ సినిమాతో కలిపి ఈ బ్యూటీ చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. రజనీ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్ ఆరంభమై కొన్ని రోజులైంది. ఇంకా హీరోయిన్ త్రిష ఎంటర్ అవ్వలేదు. త్వరలో ఎంటర్ కానున్నారు. ఈ సమయంలో హెయిర్ కట్ చేయించుకున్నారంటే రజనీ సినిమా కోసమే అని, ఇందులో త్రిష కొత్త లుక్లో కనిపిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఊహలు నిజం అవ్వొచ్చు.. అవ్వకపోనూ వచ్చు. కొన్నాళ్లు ఆగితే అసలు కథేంటో తెలుస్తుంది. అన్నట్లు ఇప్పటివరకూ త్రిషను ఏ సినిమాలోనూ ఇలా చూడలేదు. సో.. సరికొత్త త్రిషను చూడబోతున్నామన్న మాట. -
ప్రొఫెసర్కి కోపం వస్తే...
కామ్గా క్లాస్లు చెప్పేవాడు అనుకొని తక్కువ అంచనా వేశారు ప్రొఫెసర్ రజనీకాంత్ని. కానీ అతని ఫ్లాష్బ్యాక్ తెలియక తన్నులు తిన్నారు రౌడీ గ్యాంగ్. ఇదంతా రజనీకాంత్ లేటెస్ట్ సినిమా షూటింగ్ విశేషాలే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, సిమ్రాన్ కథానాయికలు. ఆల్రెడీ నార్త్ ఇండియాలో రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారట దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ ఈ ఫైట్ సీన్ను కొరియోగ్రఫీ చేశారు. ఇందులో రజనీకాంత్ ఫ్రొఫెసర్ పాత్రలో కనిపిస్తారని, ఫ్లాష్బ్యాక్ పోర్షన్లో డాన్లా కనిపిస్తారని సమాచారం. ఇందులో విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, మేఘా ఆకాశ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అనిరు«ద్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
కలలా ఉంది!
కన్ఫ్యూజన్ క్లియర్ అయింది. సూపర్ స్టార్తో యాక్ట్ చేసే హీరోయిన్ ఎవరో కన్ఫార్మ్ అయింది. రజనీకాంత్ నెక్ట్స్ సినిమాలో ఆయన సరసన యాక్ట్ చేస్తున్న హీరోయిన్ ఎవరంటూ? కొన్ని రోజులుగా గందరగోళం ఏర్పడింది. తలైవర్తో డ్యాన్స్ చేసేది త్రిష అని కొంతమంది అంటే.. కాదు మాళవికా మోహనన్ అని కొందరు వాదించారు. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేశారు సన్ నెటవర్క్ సంస్థ ప్రతినిధులు. రజనీకాంత్ సరసన నటించనున్న హీరోయిన్ త్రిష అని అఫీషియల్గా ప్రకటించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సిమ్రాన్ ఓ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ‘‘సూపర్స్టార్ రజనీకాంత్కి జోడీగా నటించబోతున్నది త్రిష అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు సన్ నెటవర్క్ ప్రతినిధులు. ‘‘కొన్ని సార్లు నిద్రలేచినా కూడా ఇంకా కలలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఈ వార్త నాకు అలాంటిదే’’ అని త్రిష ఆనందాన్ని పంచుకున్నారు. అన్నట్లు.. కొన్ని రోజుల క్రితం రజనీతో త్రిష జోడీ కుదిరింది అని ‘సాక్షి’ ప్రచురించిన సంగతి గుర్తుండే ఉంటుంది. విజయ్ సేతుపతి విలన్గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరు«ద్ స్వరకర్త. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. -
సింహం సింగిల్గా...
ఐదు వందల మంది స్టూడెంట్స్తో ఆ ప్రాంగణమంతా కిటకిటలాడిపోతోంది. అక్కడికొచ్చిన రజనీ కాంత్ మైక్ అందుకుని స్టూడెంట్స్ని ఉద్దేశిస్తూ స్పీచ్ స్టార్ట్ చేశారు. విద్యార్థులంతా రజనీ స్పీచ్కి ఇంప్రెస్ అయిపోయి ఈలల కొట్టసాగారు. ఏంటీ రజనీకాంత్ రాజకీయ సభ గురించి ప్రస్తావిస్తున్నాం అనుకుంటున్నారా? కాదు. కార్తీక్ సుబ్బరాజ్ సినిమా కోసం షూట్ చేసిన ఓ సన్నివేశాన్ని వివరిస్తున్నాం. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సన్ నెట్వర్క్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో సిమ్రాన్ ఒక కథానాయికగా నటిస్తున్నారు. మరో కథానాయికగా త్రిష, మాళవికా మోహనన్ పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్ ప్రొఫెసర్గా కనిపిస్తారట. అందులో భాగంగానే సుమారు 500 మంది స్టూడెంట్స్కి ఉపన్యాసం ఇస్తున్నటువంటి ఓ సన్నివేశాన్ని షూట్ చేశారట దర్శకుడు కార్తీక్. స్టేజ్ మీద సింహంలా సింగిల్గా డైలాగ్స్ పలికే ఈ సీన్ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని సమాచారం. మరి సినిమా మొత్తం ప్రొఫెసర్గానే రజనీకాంత్ కనిపిస్తారా అంటే? కాదు.. ఫ్లాష్బ్యాక్లో డాన్గా కనిపిస్తారట. విజయ్ సేతుపతి, నవాజుద్ధిన్ సిద్ధిఖీ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. అనిరు«ద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. -
క్యా తలైవా టీచింగా?
రజనీకాంత్ స్టూడెంట్స్కు పాఠాలు చెబితే ఎలా ఉంటుంది? రౌడీలను కంట్రోల్లో పెట్టాల్సిన మాస్ హీర్ క్లాస్గా స్టూడెంట్స్కు క్లాస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే. రజనీకాంత్ హీరోగా ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫస్ట్ టైమ్ రజనీకాంత్ çసరసన సిమ్రాన్ హీరోయిన్గా కనిపించనున్న చిత్రం ఇది. ఇందులో రజనీకాంత్ కాలేజ్ ప్రొఫెసర్గా కనిపిస్తారని చెన్నై టాక్. ఇటీవల విడుదలైన రజనీ ‘కాలా’లో క్యారే సెట్టింగా? డైలాగ్ గుర్తు చేసుకుంటే, క్యా తలైవా.. క్లాసా? అని రజనీ మాస్ అభిమానులు ఆందోళన పడే అవకాశం ఉంది. బాధపడక్కర్లేదు. ‘రజనీకాంత్ సినిమాలో ఉండాల్సిన మాస్ అంశాలు మిస్ కాకుండా జాగ్రతపడుతున్నాం’ అని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అంటున్నారు. ఫ్లాష్బ్యాక్ సీన్స్లో డాన్లా అలరిస్తారట. ఇందులో మూడు మేజర్ యాక్షన్ సీన్స్ ఉంటాయట. ఈ సినిమా డెహ్రాడూన్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం చెన్నైలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సనత్ రెడ్డి, మేఘా ఆకాశ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
సూపర్ స్టార్ సినిమాలో...
రజనీకాంత్ హీరోగా ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తారని, నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేయనున్నారని ఇటీవల చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు నటి సిమ్రాన్, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీలు ఈ సినిమా యూనిట్లోకి జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సిమ్రాన్ని ఏ పాత్రకు తీసుకున్నారనేది బయటపెట్టలేదు. అయితే కోలీవుడ్ ఊహల ప్రకారం ఆమెకు రజనీ సరసన నటించే గోల్డెన్ చాన్స్ దక్కిందట. ఈ సినిమాలో బాబీ సింహా, సానత్ రెడ్డి, మేఘా ఆకాశ్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. -
రజనీకాంత్ విల్లా
‘రజనీకాంత్ విల్లాని రెండు రోజులకు బుక్ చేస్తాం. తలైవర్ స్పెషల్ టీ ఇవ్వాలి’ అని అడగాలట అలిట్టా హోటల్లో. ఏంటి చెన్నైలో రజనీకాంత్ అభిమానులెవరైనా ఆయన పేరుతో హోటల్ ఓపెన్ చేశారా? అంటే కాదు. ఇది వెస్ట్ బెంగాల్లోని స్టోరీ. రజనీకాంత్ ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ఓ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వెస్ట్ బెంగాల్లో జరుగుతోంది. షూటింగ్లో భాగంగా రజనీకాంత్ ఓ విల్లాలో పది రోజులు ఉన్నారట. ఆయన గుర్తుగా ఆ రిసార్ట్లోని ఒక విల్లాకు రజనీకాంత్ పేరు పెట్టింది హోటల్ మేనేజ్మెంట్. అలాగే అక్కడ రజనీకాంత్కి నచ్చిన టీను ‘తలైవర్ స్పెషల్’గా ఇక మీదట సర్వ్ చేయనున్నారట. విల్లాలో బస చేసినందుకు గుర్తుగా రజనీకాంత్ ఆ రిసార్ట్లో ఒక మొక్కను నాటడం విశేషం. -
పండక్కి పండగే
క్యారే సెట్టింగా..? అంటూ ఓ పక్క థియేటర్లలో సందడి చేస్తూనే మరో సినిమాలో బిజీ అయిపోయారు రజనీకాంత్. ‘కాలా’ చిత్రం గత శుక్రవారం రిలీజ్ అయింది. అదే రోజున కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాను డెహ్రాడూన్లో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లేలోగా ఈ సినిమాను కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట రజనీ. అందుకే సినిమాకు ఫుల్ డేట్స్ కూడా కేటాయించేసారట. వచ్చే ఏడాది సంక్రాతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తోందట సన్ నెట్ వర్క్ సంస్థ. విశేషం ఏంటంటే 2019 సంక్రాంతికి శంకర్ దర్శకత్వంలో రజనీ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘2.0’ కూడా విడుదల కావాలి. వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం 2019 సంక్రాంతికి కూడా రాకపోవచ్చు అని చెన్నై టాక్. సో.. కార్తీక్ సుబ్బరాజ్ సినిమా కూడా ‘2.0’ కంటే ముందే ఆడియన్స్ని పలకరించొచ్చు అని ఊహాగానాలు విని పిస్తున్నాయి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా పూర్తి పొలిటికల్ టచ్తో ఉండబోతోందనే వార్తలు వినిపించినప్పటికీ ‘‘పొలిటికల్ టచ్ ఉండదు. కానీ రజనీకాంత్ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించే చిత్రమిది’’ అని పేర్కొన్నారు కార్తీక్ సుబ్బరాజ్. పొంగల్కి ‘2.0’ కాకపోతే కార్తీక్ సుబ్బరాజ్ సినిమా. ఏదైతేనేం.. పొంగల్కి తలైవర్ సినిమా తోడైతే అభిమానులకు పండగే. అన్నట్లు.. ‘2.0’ని వచ్చే ఏడాది రిప్లబిక్ డేకి రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఒకవేళ సంక్రాంతికి కార్తీక్ సుబ్బరాజ్తో చేస్తున్న సినిమా వచ్చి, ఆ వెంటనే ‘2.0’ కూడా వస్తే.. ఫ్యాన్స్కి డబుల్ ఫెస్టివల్. అయినా.. కలెక్షన్స్ డివైడ్ అవుతాయి కాబట్టి.. వారం పది రోజుల గ్యాప్లో రెండు రజనీ సినిమాలు వచ్చే చాన్సే లేదు. -
సూపర్స్టార్ సినిమా షూటింగ్ ప్రారంభం
సూపర్స్టార్ రజనీకాంత్ ‘కాలా’ సినిమా నేడు (జూన్ 7) విడుదలైంది. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ‘2.o’ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్ను ప్రకటించే అవకాశం ఉంది. ఇక తలైవా ప్రస్తుతం తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్తో రజనీ ఓ సినిమాను చేయబోతున్నాడన్నసంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాబీ సింహా, విజయ్ సేతుపతి కీలకపాత్రల్లో నటించనున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ను నేడు డార్జిలింగ్లో ప్రారంభించారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ సంస్థ ట్విటర్ ద్వారా తెలిపింది. ఈ మూవీలో మేఘా ఆకాష్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నారు. Shooting commences for #SuperStarWithSunPictures pic.twitter.com/bhBXyfE7SJ — Sun Pictures (@sunpictures) June 7, 2018 -
ఛల్ మేఘన రంగా
.. అంటూ దూసుకుపోతున్నారు హీరోయిన్ మేఘా ఆకాశ్. నితిన్ సరసన నటించిన ‘లై, ఛల్ మోహన రంగా’ అనుకున్న ఫలితాన్ని సాధించనప్పటికీ క్రేజీ ఆఫర్స్తో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఏకంగా సూపర్స్టార్ రజనీకాంత్ సినిమాలో యాక్ట్ చేసే లక్కీ చాన్స్ కొట్టేశారీ బ్యూటీ. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. సన్ నెట్వర్క్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. విజయ్ సేతుపతి, బాబీ సింహా, సనంత్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా మేఘా ఆకాశ్ను ఓ కీలక పాత్రకు తీసుకున్నారు. మేఘ నటించిన రెండు తమిళ చిత్రాలు ‘ఒరు పక్క కతై, ఎన్నై నోక్కి పాయుమ్ తొట్టా’ రిలీజ్ కాకముందే సూపర్ స్టార్ సినిమాలో అవకాశం రావడమంటే నిజంగా లక్కీనే కదా. పైగా ఇందులో మంచి పాత్ర -
రజనీ సినిమాలో మేఘా ఆకాష్?
లై, ఛల్మోహన్ రంగా సినిమాలు ఆశించినంతగా ఆడకపోయినా హీరోయిన్ మేఘా ఆకాష్కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మేఘా తన అందం,నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా.. ఈ భామ తరువాతి సినిమాకు సంబంధించిన ఓ వార్త హల్చల్ చేస్తోంది. సూపర్స్టార్ రజనీకాంత్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మేఘా ఆకాష్ నటించబోతోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం కానీ, మేఘా ఆకాష్ కానీ ఇప్పటికీ వరకు స్పందించలేదు. సన్ నెట్వర్క్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, బాబి సింహా కీలకపాత్రల్లో నటించనున్నారు. మేఘా ఆకాష్ ప్రస్తుతం ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. -
రజనీ సినిమాలో మరో విలక్షణ నటుడు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కాలా రిలీజ్కు రెడీ అవుతుండగా, రజనీ తరువాత చేయబోయే సినిమా పనులు చకచకా జరిగిపోతున్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఇప్పటికే తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్రలో నటించేందుకు అంగీకరించాడు. రజనీ సరసన హీరోయిన్గా ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ను ఫైనల్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్లో మరో నటుడు చేరాడు. కోలీవుడ్లో విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న బాబీ సింహా, రజనీకాంత్ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు. కాలా రిలీజ్, ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తయిన తరువాత రజనీ కొత్త సినిమా షూటింగ్కు హాజరుకానున్నారు. -
ఆ వార్త నేనూ విన్నా
తెలుగు అమ్మాయి అంజలి సౌత్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె ఇండస్ట్రీకి వచ్చి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారామె. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కథానాయికగా అంజలి పేరు వినిపించింది. ఈ విషయాన్ని కోలీవుడ్ మీడియా ఆమె దగ్గర ప్రస్తావించగా.. ‘‘రజనీకాంత్గారి సినిమాలో నేను నటించనున్నాన్న వార్తలను విన్నాను. కానీ, ఆ విషయం గురించి ఇప్పుడేం మాట్లాడను’’అని చెప్పారు. మరి.. అధికారికంగా అనౌన్స్మెంట్ వస్తే కానీ హీరోయిన్ విషయంలో క్లారిటీ రాదు. అంతేకాదు... నటుడు జై తో మీ రిలేషన్షిప్ ఏంటి? అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ..‘‘ఉయ్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్’’ అన్నారు. -
నెక్ట్స్ సినిమాకు రజనీ రెమ్యూనరేషన్ ఎంతంటే..?
సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తమిళనాట మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా రజనీకాంత్ సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తాయి. రోబో తరువాత రజనీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. రజనీ స్టైల్స్కు బాలీవుడ్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే రజనీకాంత్ సినిమాకు టాక్తో సంబంధం లేకుండా భారీగా కలెక్షన్లు వస్తుంటాయి. అందుకు తగ్గట్టుగా రజనీకాంత్ రెమ్యూనరేషన్ కూడా భారీగా అందుకుంటున్నాడు. ప్రస్తుతం కాలా, 2.ఓ సినిమాల రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న తలైవా, త్వరలో యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు రజనీకాంత్ 65 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. కేవలం 40 రోజుల షూటింగ్కు గాను రజనీ ఈ మొత్తం అందుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తుండగా విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. -
అఫీషియల్ : రజనీ మూవీలో విజయ్
సాక్షి, చెన్నై ; క్రేజీ కాంబోలో ఎట్టకేలకు మూవీ ఖరారైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంలో టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి నటించటం ఖాయమైపోయింది. గత కొంతకాలంగా విజయ్ ఈ ప్రాజెక్టులో నటించబోతున్నాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. పిజ్జా, జిగరతాండ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మ్యూజిక్ అనిరుధ్ అందిస్తుండగా.. ఇప్పుడు విజయ్ నటించబోయే వార్తను అనౌన్స్ చేసేశారు. వరుస హిట్లతో జోరు మీదున్న విజయ్కు ఇది మంచి అవకాశమే. కాలా, రోబో తర్వాత రజనీ నటించబోతున్న చిత్రం కావటం, పైగా కార్తీక్ సుబ్బరాజ్ లాంటి టాలెంటెడ్ దర్శకుడు కావటంతో తలైవా ఫ్యాన్స్లో అంచనాలు మొదలయ్యాయి. మరోవైపు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి చిరంజీవి సైరాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. We are happy to announce that for the first time, Vijay Sethupathi will be acting with Superstar Rajini in #SuperstarWithSunPictures. #VijaySethupathiWithSuperstar pic.twitter.com/RZnt6ClGjm — Sun Pictures (@sunpictures) 26 April 2018 -
సెమీ సాలిడ్.. సెమీ లిక్విడ్.. మెర్క్యూరీ
మెర్క్యూరీ.. కార్పోరేట్ శక్తుల ఆశకు బలవుతున్న జీవితాలను తెరకెక్కించే ప్రయత్నం చేసిన చిత్రం. తొలి మూకీ థ్రిల్లర్గా ట్యాగ్ వేసుకుంది. 1987లో సింగీతం శ్రీనివాసరావు తీసిన మూకీ చిత్రం.. లవ్, రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘పుష్పక్’ (తెలుగులో ‘పుష్పక విమానం’)కు మించిన అంచనాలతో వచ్చింది. కథ.. చెవిటి, మూగ అయిన అయిదుగురు స్నేహితులు (నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి) ఓ వారాంతం ఒక టీ ఎస్టేట్లో కలుసుకుంటారు. ఆ రోజే అమ్మాయి బర్త్డే ఉండడంతో బర్త్డే పార్టీ కూడా చేసుకుంటారు. ఈ కథలో ముందుకు వెళ్లాలంటే దీని మూలమైన చిన్న ఫ్లాష్బ్యాక్ తెలుసుకోవాలి. ఈ సినిమా నడిచే కాలానికి పదేళ్ల క్రితం.. తమిళనాడులోని ఒక ఊళ్లో కార్పోరేట్ ఎర్త్ అనే సంస్థ ఓ కెమికల్ ఫ్యాక్టరీ పెడుతుంది. అందులోని విషవాయువు లీక్ అయ్యి ఆ చుట్టుపక్కల ప్రాంతంలోని దాదాపు 80 మంది చనిపోతారు. ఇంకా చాలామంది దాని దుష్ప్రభావాలకు లోనవుతారు. ఈ అయిదుగురు స్నేహితులు కూడా ఆ బాధితులే. ఆ విషవాయువు వల్లే వీళ్లకు వినికిడి లోపం వస్తుంది. దానివల్ల మాట్లాడలేకుండా అవుతారు. ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. టీ ఎస్టేట్లో పార్టీ చేసుకొని కార్పోరేట్ ఎర్త్ ఫ్యాక్టరీ వల్ల చనిపోయిన 80 మంది స్మారక చిహ్నం వద్దకు వెళ్లి నివాళులర్పిస్తారు. ఆ దారిలోనే ఉన్న మూతబడ్డ ఆ ఫ్యాక్టరీ మీద రాళ్లు విసిరి తమ కోపాన్ని, బాధను, నిస్సహాయతనూ వెళ్లగక్కుతారు. అక్కడే ఓ కొండ మీద ఆ నలుగురులోని ఓ అబ్బాయి ఆ అమ్మాయి పట్ల తనుకున్న ప్రేమను చెబుతాడు కానుకనిచ్చి. అమ్మాయీ ఆ ప్రేమను సమ్మతిస్తుంది. రాత్రయిపోతుంది.. తిరిగి టీ ఎస్టేట్లోని తామున్న బసకు బయలుదేరుతారు అయిదుగురు. అమ్మాయి డ్రైవ్ చేస్తుంటుంది. ఆమెను ప్రేమిస్తున్న అబ్బాయి పక్క సీట్లో.. మిగిలిన ముగ్గురూ వెనకాల కూర్చుంటారు. ఆ అబ్బాయి తన ప్రేమికురాలిని ఆటపట్టించేందుకు హెడ్ లైట్లు ఆఫ్ చేసి ఆన్ చేస్తుంటాడు. ఈ ఆటకు వెనకాలున్న ఓ అబ్బాయీ జత కలుస్తాడు. అలా ఓ రెండుమూడు సార్లు ఆడుతుంటే అమ్మాయి ముద్దుగానే తన ప్రేమికుడిని విసుక్కుంటుంటుంది. నాలుగోసారీ అలాగే లైట్లు ఆఫ్ చేసి ఆన్ చేసేసరికి చీకట్లో దారి కనపడక బండి అదుపు తప్పుతుంది. అప్పుడే ఓ కుక్క దారికి అడ్డు వస్తుంది. అసలే కొండదారి.. రాత్రి.. వేగం.. భయపడ్డ ఆమె ప్రేమికుడు లైట్లు ఆన్చేసి కంట్రోల్ తప్పిన వెహికిల్ను కంట్రోల్లోకి తెస్తాడు. సడెన్ బ్రేక్తో వెహికిల్ ఆగుతుంది. అంతా ఊపిరి పీల్చుకుంటారు. రోడ్డుకు కాస్త పక్కకు వెళ్లిన వెహికిల్ను రివర్స్గేర్తో సరిచేసి మళ్లీ స్టార్ట్ చేస్తుంది అమ్మాయి. కొంత దూరం వెళ్తుందో లేదో ఎవరో చైన్ వేసి లాగినట్టయి బండి ఆగిపోతుంది. అందరూ దిగి చూస్తారు. నిజంగానే వెహికిల్ వెనక సైలెన్సర్కు ఓ గొలుసు కనపడుతుంది. భయంతో షాక్ అవుతారు వీళ్లు. ఆ చైన్ రెండో కొన పక్కనే ఉన్న పొదలోకి చొచ్చుకొని ఉంటుంది. ఆ అయిదుగురిలో ఒక అబ్బాయి ధైర్యం చేసి చూస్తాడు. అక్కడ ఈ చైన్ రెండో కొనను చేయికి చుట్టుకొని రక్తం మడుగులో పడి ఉన్న ఒక వ్యక్తి (ప్రభుదేవా)కనపడ్తాడు. కళ్లు తేలేసి ఉంటాయి. మిగిలిన వాళ్లనూ పిలుస్తాడు ఆ అబ్బాయి. అతనూ బాధితుడే.. ఆ అయిదుగురూ తమ వెహికిల్కున్న ఆ గొలుసును తీయడానికి ప్రయత్నిస్తారు. కాని రాదు. దాంతో ఆ వ్యక్తి చేతికున్న కొసను తీయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ లోపు ఆ దారిలోనే మరో వెహికిల్ వస్తున్న శబ్దం రావడంతో గబగబా ఆ శవాన్ని తీసి వెహికిల్ వెనక భాగంలో పెట్టేస్తారు. దారిలో ఓ జలపాతం దగ్గర బండి ఆపి.. శవాన్ని అందులో పడేయాలనుకుంటారు. కాని అక్కడ సర్వైలెన్స్ కెమెరా ఉండడంతో ఆ ప్రయత్నాన్ని ఆపేసుకొని బండిని ముందుకు తీసుకెళ్తారు. అంతకుముందు వాళ్లు రాళ్లేసిన మూతపడ్డ కార్పోరేట్ ఎర్త్ ఫ్యాక్టరీ గ్రౌండ్లో ఉన్న గొయ్యిలో శవాన్ని ఆకులు, తుప్పలు, కర్రలతో కప్పేస్తారు. కాటేజ్కు వెళ్లిపోతారు. అయితే ఈ క్రమంలో ఆ అయిదుగురిలో ఒక అబ్బాయి తన ఐపాడ్ను ఎక్కడో పారేసుకుంటాడు. అది వెతుక్కోవడానికి తెల్లవారి మళ్లీ ఈ గొయ్యి దగ్గరకు వచ్చి చూస్తారు. అక్కడ ఐపాడ్ దొరుకుతుంది కాని శవం ఉండదు. అలాగే ఆ అమ్మాయీ మాయం అవుతుంది. ఆ అమ్మాయి ఆచూకీ కనుక్కోవడానికి ఫ్యాక్టరీకి వెళ్తారు. అక్కడే శవం కనపడుతుంది. ఆ శవం ఈ అయిదుగురిలో ముగ్గురినీ చంపేస్తుంది. అలా చంపేటప్పుడు తెలుస్తుంది ఆ శవం గుడ్డిదని. చివరకు ఆ అమ్మాయి, ఆమె ప్రేమికుడు ఇద్దరే మిగులుతారు. ప్రేమికుడినీ చంపుతుంటే ఆ అమ్మాయి అడ్డుపడుతుంది చంపొద్దని. అప్పటికే అతను చనిపోయి ఉంటాడు. అప్పుడు చెప్తుంది ఆ అమ్మాయి ఆ వ్యక్తి తనకెంత ముఖ్యమైన వాడో.. ఆ ఇద్దరూ ఒకరినొకరు ఎంత ఇష్టపడ్తున్నారో అని. తాము అయిదుగురూ చెవిటి, మూగ వాళ్లమని. అప్పుడు ఆ శవానికీ తన గతం గుర్తొస్తుంది. ఆ అమ్మాయికి చెప్తుంది. ఆ శవమూ గతంలో ఆ ఫ్యాక్టరీలో లీక్ అయిన విషవాయువు బాధితుడే. అతనికి కళ్లు పోతాయి. తన ప్రేమికురాలు అతనికి కళ్ల ఆపరేషన్ చేయించడానికి ట్రై చేస్తుంటుంది. తెల్లవారితే ఆపరేషన్.. ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టక పెంపుడు కుక్క సహాయంతో బయటకు వస్తాడు. వీళ్ల వెహికిల్తో యాక్సిడెంట్ అవుతుంది. వీళ్లు తమ వెహికిల్ను రివర్స్తీసుకున్నప్పుడు ప్రభుదేవాకు యాక్సిడెంట్ అవుతుంది. అతను గుడ్డి వాడు కాబట్టి కనపడదు.. వీళ్లంతా చెవిటి వాళ్లు కాబట్టి అతని ఆర్తనాదం వీళ్లకు వినపడదు. అలా అందులో ఎవరి తప్పూ ఉండదు. అకారణంగా వాళ్లను శిక్షించినందుకు ప్రభుదేవా పశ్చాత్తాపపడ్తాడు. అంతలోకే ఆ అమ్మాయి శరీరంలోకి వెళ్లి తన ప్రేయసిని.. తన ప్రాంతాన్ని కళ్లతో చూడాలనుకుంటాడు. అమ్మాయి శరీరంలోకి అతని ఆత్మ ప్రవేశించి అన్నీ చూసుకొని... ఆస్వాదించి ఆ ఆత్మ వెళ్లిపోతుంది. వెళ్లిపోతూ ఆ అమ్మాయికి వినికిడి శక్తిని ఇస్తుంది. గొంతూ వస్తుంది. ఇదీ మెర్క్యూరీ కథ. corporate earth లోంచి corpor తీసేసి ate earth అని ఎండ్ చేస్తాడు సినిమాను దర్శకుడు. ఈ సినిమా ద్వారా ఆయన చెప్పదల్చుకుంది కూడా అదే. ఈ భూమ్మీద మనుషులతోపాటు సమస్త జీవులకూ జీవించే హక్కు అంతే ఉంది. కాని హద్దులు మరిచిన కార్పోరేట్ శక్తులు తమ దురాశతో భూమిని మింగేస్తున్నాయి అని. ఈ సందేశం మూకీ థ్రిల్లర్ ద్వారా ప్రేక్షకులను చేరిందా? ఆ విషయాన్ని చెప్పడానికి ఇంత సీన్ క్రియేట్ చేయాలా? ప్రేక్షకులే నిర్ణయించాలి. మెర్క్యూరీ ప్రస్తుతం అన్ని థియేటర్స్లో ఆడుతోంది. ఆసక్తి ఉన్న వాళ్లు చూడొచ్చు. ఈ చిత్రదర్శకుడు.. కార్తిక్ సుబ్బరాజ్.. పిజ్జా ఫేమ్! – శరాది -
‘మెర్క్యూరి’ మూవీ రివ్యూ
టైటిల్ : మెర్క్యూరి జానర్ : సైలెంట్ హర్రర్ థ్రిల్లర్ తారాగణం : ప్రభుదేవా, సనంత్రెడ్డి, దీపర్ పరమేష్, శశాంక్ పురుషోత్తం, అనీష్ పద్మనాభన్, ఇందుజా, గజరాజ్ సంగీతం : సంతోష్ నారాయణన్ దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాత : స్టోన్ బెంచ్ ఫిలింస్, పెన్ స్టూడియోస్ 30 ఏళ్ల క్రితం కమల్ హాసన్ హీరోగా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో ‘పుష్పక విమానం’ పేరుతో ఓ మూకీ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు మరోసారి యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అదే ప్రయోగం చేశాడు. మూకీ హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మెర్క్యూరి సినిమాలో ప్రభుదేవా కీలక పాత్రలో నటించాడు. పిజ్జా, జిగర్తాండ, ఇరైవి లాంటి ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించిన కార్తీక్, ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు. మూడు దశాబ్దల తరువాత భారతీయ వెండితెర మీద సందడి చేసిన మూకీ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? గతంలో ఎన్నడూ కనిపించనంత కొత్త అవతారంలో కనిపించిన ప్రభుదేవ భయపెట్టడంలో సక్సెస్ అయ్యాడా..? కార్తీక్ మరోసారి తన మార్క్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో అలరించాడా..? కథ : కార్పొరేట్ ఎర్త్ అనే కంపెనీలో జరిగిన మెర్య్కూరి పాయిజనింగ్ కారణంగా ఆ దగ్గరలోని ఓ గ్రామంలో 84 మంది చనిపోతారు. అంతేకాదు ప్రమాదం కారణంగా ఎంతోమంది చిన్నారులు మూగ చెవిటి వారిగా, అంధులుగా పుడతారు. మెర్య్యూరి పాయిజనింగ్ కారణంగానే బధిరులైన నలుగురు కుర్రాలు, ఓ అమ్మాయి కాలేజ్ లో జరిగిన అలూమ్ని పార్టీ లో పాల్గొని తరువాత కొద్దిరోజులు ఫ్రెండ్స్ తో ఆనందంగా గడపడానికి అక్కడే ఉండిపోతారు. అలా ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేస్తూ కారులో వెళ్తూ ఓ యాక్సిడెంట్ చేస్తారు. ఆ యాక్సిడెంట్లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి చనిపోతాడు. చనిపోయిన వ్యక్తిని అక్కడే వదిలేసి వెళ్తే పోలీసులు పట్టుకుంటారన్న భయంతో ఆ శవాన్ని మోర్య్కూరి పాయిజనింగ్ కు కారణమైన ఫ్యాక్టరిలో పడేస్తారు. తరువాత ఆ కుర్రాళ్లు అదే ఫ్యాక్టరికీ ఎందుకు వెళ్లారు..? వారు యాక్సిడెంట్ చేసి చంపేసిన వ్యక్తి ఎవరు..? ఆ కుర్రాళ్లు ఒక్కొక్కరుగా చనిపోవటానికి కారణం ఏంటి..? చివరకు ఎంత మంది మిగిలారు..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : దాదాపు 30 ఏళ్ల తరువాత ఇండియన్ స్క్రీన్ మీద మూకీ సినిమాను చూపించిన కార్తీక్ సుబ్బరాజ్ ధైర్యాన్ని ప్రశంసించాల్సిందే. అది కూడా డ్యాన్సర్ గా, లవర్ భాయ్గా మంచి ఇమేజ్ ఉన్న ప్రభుదేవాను పూర్తిగా డిఫరెంట్ రోల్లో, డిఫరెంట్ గెటప్లో చూపించి మెప్పించాడు కార్తీక్. సందేశాత్మక అంశాన్ని హర్రర్ థ్రిల్లర్గా మలిచి ఆకట్టుకున్నాడు. అయితే రొటీన్ కమర్షియల్ సినిమాలో ఉండే అంశాలేవి లేకపోవటం, తొలి భాగంలో లీడ్ యాక్టర్స్ మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకులకు అర్ధం కాకపోవటం లాంటివి కాస్త ఇబ్బంది పెడతాయి. దర్శకుడు సృష్టించిన పాత్రకు ప్రభుదేవా వందశాతం న్యాయం చేశాడు. తనకు జరిగిన అన్యాయానికి పగతీర్చుకునే పాత్రలో ప్రభుదేవా నటన చాలా సందర్భాల్లో భయపెడుతుంది. అదే సమయంలో ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్లో కంటతడి కూడా పెట్టిస్తుంది. ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోయినా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం. ఒక్క డైలాగ్ కూడా లేని సినిమాను పూర్తిగా తన నేపథ్య సంగీతంతో ఆసక్తికరంగా మార్చాడు సంతోష్. తిరు అందించిన సినిమాటోగ్రఫి సినిమాలోని ఫీల్ ను క్యారీ చేసింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : ప్రభుదేవా లుక్, నటన కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ మైనస్ పాయింట్స్ : బధిరుల భాషలో చెప్పించిన సంభాషణలు అర్ధం కాకపోవటం స్లో నేరేషన్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
విలన్ పాత్రకి ఎవరి స్ఫూర్తీ లేదు – ప్రభుదేవా
‘‘ఎంటర్టైనింగ్, మాస్ అంశాలతో తెరకెక్కిన మంచి చిత్రం ‘మెర్క్యురి’. నా కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలింగా ఉంటుంది. విలన్గా చేయడం ఎగ్జయిట్మెంట్ అనిపించింది. ఆ పాత్ర చేయడానికి ఎవరి స్ఫూర్తీ లేదు. కార్తీక్ సుబ్బరాజ్పై నమ్మకంతోనే చేశా. సినిమా చూస్తున్నంత సేపు పాత్రలు మాత్రమే కనపడతాయి’’ అని ప్రభుదేవా అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెర్క్యురి’. పెన్ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిలింస్ సమర్పణలో కార్తికేయన్ సంతానం, జయంతి లాల్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 13న విడుదలవుతోంది. తెలుగులో కె.ఎఫ్.సి. ప్రొడక్షన్ విడుదల చేస్తున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుకను హైదరాబాద్లో నిర్వహించారు. కార్తికేయన్ సంతానం మాట్లాడుతూ– ‘‘యూనిక్ పాయింట్తో తెరకెక్కిన చిత్రమిది. కమల్హాసన్గారి ‘పుష్పకవిమానం’ తర్వాత వస్తోన్న మూకీ సినిమా ‘మెర్క్యురి’. కమర్షియల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. ఇండియన్ సినిమాను తర్వాతి లెవల్కు తీసుకెళ్లేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘నా తొలి చిత్రం ‘పిజ్జా’ తెలుగులోనూ మంచి హిట్ అయింది. ‘మెర్క్యురి’ లాంటి వైవిధ్యమైన సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇందులో పాటలు, డ్యాన్సులు ఉండవు’’ అన్నారు కార్తీక్ సుబ్బరాజ్. -
ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు – కార్తీక్ సుబ్బరాజ్
‘‘రెండు రోజుల్లో జరిగే కథే ‘మెర్క్యూరీ’. ‘పుష్పక విమానం’ తర్వాత సైలెంట్ ఫిల్మ్ రాలేదు. ఈ చిత్రంలో కొత్త ప్రభుదేవాని చూస్తారు. ప్రేక్షకులు మా సినిమాని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అన్నారు. ప్రభుదేవా ముఖ్య పాత్రలో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెర్క్యూరీ’. స్టోన్బెంచ్ ఫిల్మ్స్, పెన్ స్టూడియోస్ సమర్పణలో కార్తికేయన్, సంతానం, జయంతి లాల్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ– ‘‘మనకు మొదట్లో సైలెంట్ ఫిల్మ్స్ మాత్రమే ఉండేవి. ఆ తర్వాత టాకీ సినిమా వచ్చింది. సైలెంట్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘మెర్క్యూరీ’. డైలాగ్స్ చాలా తక్కువగా ఉండే సినిమా తీయాలని దర్శకుణ్ణి అయిన కొత్తలో అనుకున్నా. అది ఈ చిత్రంతో నెరవేరింది. ప్రభుదేవాగారు విలన్ పాత్రలో కనిపించనున్నారు. కథ విన్నప్పుడు డైలాగ్స్ లేకుండా వర్కవుట్ అవుతుందా? అని అడిగారు. ఛాలెంజింగ్గా తీసుకొని చేశాం. బంద్ ముగిసే వరకు తమిళనాడులో సినిమా రిలీజ్ చేయం. నా తర్వాతి సినిమా రజనీకాంత్ సార్తో చేస్తున్నా. రెండు మూడు నెలల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు. -
14 కాదు.. కొన్నే!
అవును. పధ్నాలుగు కాదు.. కొన్నే! ఏంటీ కన్ఫ్యూజ్ అవుతున్నారా? మరేం లేదు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘కాలా’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 14 కట్స్ ఇచ్చిందని, ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చిందనే వార్త జోరుగా ప్రచారమవుతోంది. పా. రంజిత్ దర్శకత్వంలో వండర్బార్ ఫిల్మ్స్ పతాకంపై హీరో, రజనీ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వండర్బార్ ఫిల్మ్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినోద్ స్పందిస్తూ – ‘‘మా సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ రావడం వాస్తవమే. కానీ ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారనీ, సెన్సార్ బోర్డ్ 14 కట్స్ చెప్పారని వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. సెన్సార్ బోర్డ్ సభ్యులు కొన్ని కట్స్ చెప్పారు కానీ 14 మాత్రం కాదు’’ అని పేర్కొన్నారాయన. ‘కాలా’ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. మరోవైపు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో సన్ పిక్చర్స్ బ్యానర్కు రజనీకాంత్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని కోలీవుడ్ టాక్. ఇది నిజం కాదని కార్తీక్ సుబ్బరాజ్ స్పష్టం చేశారు. ‘‘తలైవర్తో (రజనీకాంత్) నేను చేయబోయే సినిమా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఉండదు. అది పూర్తి ఫిక్షన్ స్టోరీ. ఫ్యాన్స్ రజనీసార్ నుంచి ఏం కోరుకుంటారో అవన్నీ సినిమాలో ఉంటాయి’’ అని పేర్కొన్నారు కార్తీక్ సుబ్బరాజ్. -
లక్కీ గర్ల్ ఎవరు?
బీటౌన్ బ్యూటీనా..! చెన్నై పొన్నా! అచ్చ తెలుగు అమ్మాయా! సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించబోయేది ఎవరు? అనే చర్చ ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. రజనీకాంత్ హీరోగా ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సన్పిక్చర్స్ పతాకంపై ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా స్క్రిప్ట్ వర్క్ గురించి రజనీకాంత్ను కలిశారట సుబ్బరాజ్. ఈ సినిమాలో కథానాయికప్లేస్ కోసం రేస్ మొదలైంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్, చెన్నై సుందరి త్రిష, తెలుగు అమ్మాయి అంజలి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ‘కొచ్చడయాన్’ సినిమాలో రజనీకాంత్ సరసన దీపికా పదుకోన్ నటించారు. త్రిష, అంజలి ఇంతవరకు ఆయన సరసన నటించలేదు. కాకపోతే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిర ‘ఇరైవి’ చిత్రంలో హీరోయిన్గా నటించారు అంజలి. మరి.. ఈ ముగ్గురి ముద్దుగుమ్మల్లో రజనీతో జోడీ కట్టేదెవరు? అనేది చూడాలి. లేక కొత్తగా ఎవరైనా వచ్చి ఈ చాన్స్ను కొట్టేస్తారా? అన్న డౌట్స్కు ఫుల్స్టాప్ పడాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుద్ రవిచంద్రన్. -
త్రిష దరఖాస్తు చేశారట!
తమిళసినిమా: చెన్నై చిన్నది త్రిష దరఖాస్తు పరిశీలనకు వస్తుందా? ఈ బ్యూటీ చిరకాల ఆశ నెరవేరుతుందా? ఇలాంటి ప్రశ్నలపై కోలీవుడ్లో ఆసక్తి నెలకొంది. ఎప్పుడో 19 ఏళ్ల కిందట జోడి చిత్రంలో సహ నటిగా తమిళ తెరకు పరిచయమైన నటి త్రిష. 2002లో మౌనం పేసియదే చిత్రం ద్వారా కథానాయకిగా మెరిశారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి క్రేజీ హీరోయిన్గా రాణిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ అంటూ బహుభాషా నటిగా పేరుగాంచారు. కోలీవుడ్లో కమలహాసన్, విజయ్, విక్రమ్, తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, కన్నడంలో పునీత్రాజ్కుమార్ ఇలా పలు భాషల్లో స్టార్ హీరోలతో జత కట్టారు. అయితే ఒక్క రజనీకాంత్తో మాత్రం నటించే అవకాశం ఇప్పటికీ రాలేదు. చాలా సార్లు త్రిష పలు వేదికలపై రజనీకాంత్తో ఒక్క సన్నివేశంలోనైనా నటించాలన్నది తన చిరకాల కోరిక అని బహిరంగంగానే వెల్లడించారు. ప్రస్తుతం రజనీ నటనకు స్వస్తి చెప్పడానికి సిద్ధం అవుతున్నారు. ఆయన నటించిన కాలా, 2.ఓ చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. తాజాగా కార్తీక్సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించే చిత్రమే చివరిదనే ప్రచారం జరగుతోంది. ఇందులో హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేయాలన్న లిస్ట్లో నటి త్రిష పేరు కూడా ఉందట. దీంతో త్రిష ఆశలు చిగురిస్తున్నాయి. అయితే దర్శకుడు కార్తీక్సుబ్బరాజ్ త్రిష చిరకాల ఆశను నెరవేర్చగలరా? అన్నదే ప్రశార్థకంగా మారింది. త్రిష మాత్రం తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందట. ఇప్పుటికే చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్లో దరఖాస్తు పెట్టుకున్నారట. అది పరిశీలనలోకి వస్తుందా? అన్నదే ఆసక్తిగా మారింది. త్రిష ప్రస్తుతం మోహిని, గర్జన, 1818, చతురంగవేట్టై, పరమపథం విళైయాట్టు అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారన్నది గమనార్హం. -
అంచనాలు పెంచుతున్న మూకీ మూవీ టీజర్
సాక్షి, హైదరాబాద్: డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మెర్క్యూరి టీజర్ తాజాగా విడుదలైంది. టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ టీజర్కు సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. ఎలాంటి సంభాషణలు లేకుండా మూకీ మూవీ కావడంతో ఈ సైలెంట్ థ్రిల్లర్పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. గతంలో కమల్ హాసన్ హీరోగా సింగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన పుష్పక విమానం మూవీ తరహాలోనే ‘మెర్క్యూరి’ మూవీలో పాత్రలు మాట్లాడవు. కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే మూవీ కొనసాగనుంది. ఇంతవరకూ డైలాగ్స్, సౌండ్ ఎఫెక్ట్స్తో ప్రేక్షకులను దర్శకులు భయపెట్టారు. కానీ ఇందులో ప్రభుదేవా లుక్ చూశాక.. డైలాగ్స్ లేని సైలెంట్ థ్రిల్లర్ను కేవలం ఆ నటీనటుల హావభావాలతో ఎంజాయ్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. పిజ్జా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సైలెంట్ థ్రిల్లర్గా మెర్క్యూరి తెరకెక్కింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సైలెంట్ హార్రర్ థ్రిల్లర్ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సంతోష్ నారాయణ్ సంగీతం మూవీకి ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. మెర్క్యూరి ఈ ఏప్రిల్ 13న విడుదలకు సిద్ధంగా ఉంది. -
విలన్ కాదు సోదరుడు..!
తమిళసినిమా: సూపర్స్టార్ రజనీకాంత్ నూతన చిత్రంలో ఆయనకు ప్రతినాయకుడిగా యువ నటుడు విజయ్సేతుపతి నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది నిజమా? అని సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. చిన్న సహాయ నటుడి స్థాయి నుంచి సక్సెస్ఫుల్ హీరో స్థాయికి ఎదిగిన నటుడు విజయ్సేతుపతి. ప్రస్తుతం కథానాయకుడిగా వరుస విజయాలతో మంచి జోరుమీదున్నారు. చేతి నిండా చిత్రాలున్నాయి. పైగా నిర్మాతగా కూడా మారి జుంగా అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తూ హీరోగా నటిస్తున్నారు. తెలుగులో చిరంజీవితో కలిసి భారీ చారిత్రాత్మక చిత్రంలో నటిస్తునారు. ఇలాంటి తరుణంలో రజనీకాంత్ తాజా చిత్రంలో ఆయనకు ప్రతినాయకుడిగా మారనున్నారనే ప్రచారం హల్చల్ చేస్తోంది. రజనీకాంత్ 2.ఓ, కాలా చిత్రాల తరువాత యువ దర్శకుడు కార్తీక్సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక రాజకీయ నేపథ్యంతో కూడిన చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. ఇందులో రజనీకాంత్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్న విషయం ఇంకా ఒక కొలిక్కి రాకపోయినా, విలన్గా మాత్రం విజయ్సేతుపతి నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో విజయ్ విలన్గా కాదు రజనీకి తమ్ముడిగా నటించనున్నారట.నిజానికి ఈ విషయం గురించి చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించలేదు. -
రజనీకాంత్ మరో కొత్త చిత్రం
సాక్షి, చెన్నై: సూపర్స్టార్ రజనీకాంత్ మరో కొత్త చిత్రాన్ని ఖరారు చేశారు. ఇప్పటికే రెండు చిత్రాలు నటిస్తున్న రజనీ తన తర్వాతి చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మాణంలో నటించనున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పిజ్జా, ఇరైవి వంటి వైవిద్య చిత్రాలను తెరెక్కించిన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడిగా పని చేయనున్నారు. త్వరలోనే ఈచిత్రం పట్టాలెక్కనుందని నిర్మాత కళనిధి మారన్ తెలిపారు. ఇప్పటికే రజనీకాంత్ కాలా, 2.ఓ చిత్రాలతో బిజీగా ఉన్నారు. సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ 14న కాలా విడుదల కానుంది. సుప్రసిద్ధ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 2.ఓ చిత్రం కూడా తుది దశకు వచ్చింది. కాలా తరువాత ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రభుదేవా మూకీ సినిమా ‘మెర్క్యూరి’
డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మెర్క్యూరి. పిజ్జా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సైలెంట్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో కమల్ హాసన్ హీరోగా సింగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన పుష్పక విమానం సినిమా తరహాలోనే ఈ సినిమాలోని పాత్రలు కూడా మాట్లాడవని తెలుస్తోంది. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టైటిల్తో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. సంతోష్ నారాయణ్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
నిర్మాతగా మారిన యువ దర్శకుడు
తమిళ దర్శకులు డైరెక్షన్ తో పాటు నిర్మాణ రంగంలోనూ సత్తాచాటుతున్నారు. యువ దర్శకుడు కార్తీక్సుబ్బరాజ్ కూడా అదే బాటలో పయనించడానికి సిద్ధమయ్యాడు. 2014లోనే స్టోన్ బెంచ్ సంస్థను ప్రారంభించిన కార్తీక్ ఈ సంస్థ ద్వారా బెంచ్ ఫ్లిక్స్, షార్ట్ ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్, బెంచ్ క్యాస్ట్ అనే విభాగాల్లో సినీ సేవలందిస్తున్నారు. ఈ శాఖల ద్వారా ఇప్పటికే 150 చిత్రాలకు సబ్టైటిల్స్ను, 200 లఘు చిత్రాల డిస్ట్రిబ్యూషన్, 25 చిత్రాలకు క్యాస్టింగ్ను సమకూర్చారు. యూఎస్ఏకు చెందిన కల్రామన్, సోమశేఖరలతో కలిసి స్టోన్ బెంచ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై రెండు సినిమాలను, ఒక వెబ్ సిరీస్ను నిర్మిస్తున్నారు. అందులో ఒక చిత్రానికి మెయ్యాద మాన్ అనే టైటిల్ను నిర్ణయించారు. కొత్త దర్శకుడు రత్నకుమార్ పరిచయం అవుతున్న ఈ సినిమాలో నటుడు వైభవ్, ప్రియ భవానీశంకర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రెండో చిత్రానికి మెర్కురీ అనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో డాన్సింగ్స్టార్ ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్నాడు. ప్రభుదేవా హీరోగా నటించనున్న సినిమాకు కార్తీక్సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలకు జాతీయ అవార్డు గ్రహీత తిరు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. వీటితో పాటు కళ్లసిరిప్పు అనే వెబ్ సిరీస్ను నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ లో రోహిత్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాల పరిచయ కార్యక్రమం శుక్రవారం చెన్నై గిండీలోని ఒక స్టార్ హోటల్లో నిర్వహించారు. దర్శకుడు మణిరత్నం, భారతీరాజ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
దిల్ రాజు... దమ్ముంటే కాస్కో!
సిద్ధార్థ్కు తెలుగునాట క్రేజ్ తెచ్చిన సినిమా - ‘బొమ్మరిల్లు’. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం సిద్ధూ కెరీర్కి ఉపయోగపడింది. మరి.. ఆయన్ను దమ్ముంటే కాస్కో అని ఈ లవర్బోయ్ ఎందుకు అంటున్నారు? గత ఏడాది ఆయన నటించిన తమిళ చిత్రం ‘జిగర్ తండా’ ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి తెలుగులో ‘దిల్’ రాజు అని టైటిల్ పెట్టి, దమ్ముంటే కాస్కో అనేది ఉపశీర్షిక అట. మరి.. ఈ టైటిల్ ఎందుకు పెట్టారో? ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. -
వరల్డ్ కప్తో భయం లేదు
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్కప్ క్రికెట్ ఫీవర్ సాగుతోంది. ముఖ్యం భారత్జట్టు వరుసగా రెండు సార్లు గెలిచి విజయపథంలో దూసుకుపోతుండడంతో వరల్డ్కప్ టోర్నీపై మరింత ఆసక్తి నెలకొంది. సరిగ్గా ఇలాంటి సమయంలో ఎనక్కుల్ ఒరువన్ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సిద్ధమవుతున్నారు ఆ చిత్ర యునిట్ . పైగా వరల్డ్ కప్పోటీల వల్ల తమకు ఎలాంటి భయం లేదంటున్నారు ఆ చిత్ర యూనిట్. ఈ విషయం గురించి చిత్ర హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ, కన్నడంలో విశేష విజయాన్ని సాధించిన లూషియా చిత్రానికి రీమేక్ ఈ చిత్రం అన్నారు. దీపా సన్నిధి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు శిష్యుడు ప్రసాద్ మర్రార్ దర్శకత్వం వహించారన్నారు. విబిన్న కథా చిత్రాల్లో నటించాలన్న ఆకాంక్ష ఈ చిత్రంతో నెరవేరిందన్నారు. ఎనకుల్ ఒరువన్ చిత్రంలో తాను ద్విపాత్రాభినయం చేయడం కొత్త అనుభవంగా పేర్కొన్నారు. వీటిలో ఒక పాత్రను పల్లెటూరి యువకుడిగా నటించనున్నారు. అందానికి మించి బలమైన పాత్రగా ఇది ఉంటుందన్నారు. ప్రేక్షకులు ఆశించే అన్ని కమర్షియల్ అంచనాలతో ఎనకుల్ ఒరువన్ చిత్రం ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని మార్చి ఆరో తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. వరల్డ్ కప్ ఫీవర్ ప్రపంచం అంతా ఉన్నా, తమ చిత్రానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న నమ్మకాన్ని సిద్ధార్థ్ వ్యక్తంచేశారు. -
సుబ్బురాజ్ చిత్రంలో ఎస్జే సూర్య
కథా నాయకుడిగా మారిన దర్శకుల్లో ఎస్జె సూర్య ఒకరు. ఖుషి వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన ఆ తరువాత హీరోగా అవతారమెత్తారు. అయితే నటుడిగా కొన్ని చిత్రాలు నిరాశ పరచడంతో కొంత గ్యాప్ తీసుకున్న ఎస్జె సూర్య తాజాగా ఇసై చిత్రంతో తానేమిటో మరోసారి నిరూపించుకున్నారు. ఇందులో ఆయన హీరో, దర్శకుడిగానే కాకుండా అదనంగా సంగీత దర్శకుడిగా కూడా అవతారమెత్తి తన సత్తా చాటుకున్నారు. ఇసై చిత్రం నిర్మాణంలో జాప్యం జరిగినా విడుదలానంతరం మంచి ప్రజాదరణ పొందింది. దీంతో ఎస్ జె సూర్యకు మళ్లీ అవకావాలు వస్తున్నాయి. తాజాగా జిగర్తండా వంటి మంచి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్ తాజా చిత్రంలో హీరోగా నటించే అవకాశం ఎస్ జె సూర్యను వరించింది. ఈ విషయాన్ని దర్శకుడు స్పష్టం చేశారు. అయితే తన తాజా చిత్ర వివరాలను వెల్లడించడానికి ఇంకా చాలా టైమ్ ఉందని ఆయన అంటున్నారు. ఈ చిత్రంలోనే యువ నటులు విజయ్ సేతుపతి, బాబి సింహా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు అనధికార సమాచారం. ఇదే కనుక నిజం అయితే ఇదో చిన్న మల్టీస్టారర్ చిత్రం అవుతుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతాన్ని అందిస్తున్నారు. -
పిజ్జా దర్శకునితో యాక్షన్ డ్రామా
సిద్దార్థ్, లక్ష్మీమీనన్ జంటగా ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘జిగర్తతండా’ చిత్రం రూపొందుతోంది. తెలుగు వెర్షన్ని ఎస్.కె.పిక్చర్స్, వి.ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఒక షెడ్యూలు మినహా చిత్రం పూర్తయింది. ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ -‘‘కార్తీక్ సుబ్బరాజ్ ప్రతిభ ఏంటో ‘పిజ్జా’తోనే అందరికీ అర్థమైంది. ఇదొక వినూత్న కథాంశం. నగర నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా’’ అని చెప్పారు. మరో నిర్మాత వి.ఎస్.రామిరెడ్డి మాట్లాడుతూ -‘‘ఇందులో సిద్దార్థ్ పాత్ర అన్ని వర్గాలకూ నచ్చే విధంగా ఉంటుంది. ఓ ప్రముఖ తెలుగు హీరో ఈ చిత్రంలో కీలకపాత్ర చేయబోతున్నారు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: గేవ్ మిక్ యు యారీ.