Kazakhstan
-
విమాన ప్రమాదంపై పుతిన్ ‘సారీ’
మాస్కో: కజకిస్తాన్లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ శనివారం అజెర్బైజాన్ అధ్యక్షుడు ఇలాహ్మ్ అలియేవ్కు క్షమాపణ చెప్పారు. అది అత్యంత విషాదకర ఘటన అని పేర్కొన్నారు. రష్యాలోని చెచెన్యా రిపబ్లిక్ రాజధాని గ్రోజ్నీలో ల్యాండవ్వాల్సిన విమానం బుధవారం అనూహ్యంగా కుప్పకూలి 38 మంది మరణించడం తెలిసిందే. దీనికి రష్యా గగనతల రక్షణ వ్యవస్థలోని క్షిపణి కారణమంటూ ఆరోపణలు వస్తున్న వేళ పుతిన్ క్షమాపణ చెప్పడం గమనార్హం. అయితే, విమాన ప్రమాదానికి బాధ్యత తమదేనంటూ ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అంగీకరించలేదు. ‘అజెర్బైజాన్ ఎయిర్లైన్స్ విమానం గ్రోజ్నీ విమానాశ్రయంలో ల్యాండయ్యేందుకు పదేపదే ప్రయత్నించడంతో గగనతల రక్షణ వ్యవస్థలు కాల్పులు జరిపాయి’ అని అంతకుముందు అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ కాల్పుల వల్లే విమానం కూలిందంటూ వేరుగా అందులో పేర్కొనలేదు. రష్యా గగనతలంలో ఈ ఘటన చోటుచేసుకున్న కారణంగా అధ్యక్షుడు పుతిన్ అజెర్బైజాన్ ప్రెసిడెంట్ అలియేవ్కు క్షమాపణ చెప్పారని క్రెమ్లిన్ వివరించింది. దీనిని అజెర్బైజాన్ అధ్యక్షుడి కార్యాలయం కూడా ధ్రువీకరించింది. -
రష్యానే కూల్చిందా..?
-
రష్యా క్షిపణి వల్లే కూలిందా?
న్యూఢిల్లీ: కజకిస్తాన్లోని అక్తావ్ సమీపంలో బుధవారం విమానం కూలడానికి వెలుపలి శక్తుల ప్రమేయమే కారణమని అజెర్బైజాన్ ఎయిర్లైన్స్ తెలిపింది. వెలుపలి భౌతిక, సాంకేతిక పరమైన ప్రమేయం వల్లే విమానం కూలినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని శుక్రవారం వెల్లడించింది. ఈ విమానం కుప్పకూలడానికి రష్యా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థే కారణమని అంతకు ముందు వార్తలొచ్చాయి. రష్యా వైమానిక విభాగం ప్రతినిధి యడ్రోవ్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రోజ్నీ, వ్లాడికవ్కాజ్లలోని మౌలిక వసతులు, జనావాసాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులు జరుగుతున్నాయి. అందుకే గ్రోజ్నీలో ల్యాండ్ చేయకుండా విమానాన్ని దారి మళ్లించారని తెలిపారు. ‘దీన్నిబట్టి చూస్తే, ఆ ప్రాంతంలోని గగనతలాన్ని మూసివేసినట్లు అర్థమవుతోంది. అంటే, ఆ జోన్లోకి వచ్చే ఏదైనా విమానం తక్షణమే బయటకు రావాల్సి ఉంటుంది. లేకుంటే ప్రమాదమే’అని విశ్లేషకులు అంటున్నారు. ‘విమానం గ్రోజ్నీలో ల్యాండయ్యేందుకు రెండుసార్లు ప్రయత్నించింది. అయితే, డ్రోన్ దాడుల భయంతో వేరే విమానాశ్రయాల్లో ల్యాండ్ చేయాలని అధికారులు పైలట్కు సూచించారు. అందుకే, పైలట్ అక్తావ్ ఎయిర్పోర్టు దిశగా విమానాన్ని మళ్లించారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో కురుస్తున్న దట్టమైన మంచు ప్రమాదానికి కారణమైంది’అని యడ్రోవ్ వివరించారు. కానీ, రష్యా మీడియా విమాన ప్రమాదం గురించిన అసత్యాలు ప్రచారం చేస్తోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి సిబిహా ఆరోపించారు. క్షిపణి దాడిలో దెబ్బతిన్న విమానంలో ఆనవాళ్లు దొరక్కుండా చేయడానికి రష్యా అధికారులు సముద్రం దాటాలని పైలట్పై ఒత్తిడి చేశారని విమర్శించారు. విమానం కూలిన తర్వాత కేబిన్ నుంచి భారీగా పొగలు వస్తున్నట్లుగా చూపే వీడియోలు, ఫొటోలు కూడా ఇందుకు సాక్ష్యంగా ఉన్నాయన్నారు. విమానం ముక్కలై మంటలు అంటుకోవడం, కాస్పియన్ సముద్ర తీరానికి సమీపంలో నేలను తాకి నల్లని పొగలు కమ్ముకుంటున్న వీడియో ఒకటి ఆన్లైన్లో కనిపిస్తోంది. ఘటనా ప్రాంతంలో విమానం ధ్వంసమైన తీరును గమనిస్తే రష్యా మిలటరీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్లే నేలకూలినట్లు కనిపిస్తోందని యూకేకు చెందిన ఓస్ప్రే ఫ్లైట్ సొల్యూషన్స్ సంస్థ చీఫ్ మ్యాట్ బోరీ విశ్లేషించారని వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. రష్యన్లే ఆ విమానాన్ని కూల్చేశారని ఉక్రెయిన్ జాతీయ భద్రతాధికారి అండ్రీ కొవలెంకో చెప్పారు. యుద్ధం జరుగుతున్న వేళ గ్రోజ్నీ గగనతలాన్ని రష్యా మూసివేయకపోవడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందన్నారు. -
అంత ప్రమాదంలో బతికి బట్టకట్టాడు.. మరో వీడియో వైరల్
ఒక ఘోర ప్రమాదం.. అందులో చావు అంచు నుంచి బయటపడితే ఎవరైనా ఏం చేస్తారు?.. దేవుడికి దణ్ణం పెట్టి అక్కడి నుంచి పరుగులు తీస్తారు. ఇంకాస్త ధైర్యవంతులైతే ఆపదలో ఉన్నవాళ్లకు సాయం చేస్తారు. కానీ, ఇక్కడో ప్రయాణికుడు మాత్రం స్పాట్లో కలియదిరుగుతూ ఆ తీవ్రతను తెలియజేస్తూ ఏకంగా ఓ వీడియో తీశాడు. అజర్ బైజన్ ఎయిర్లైన్స్(Azerbaijan Airlines) ప్రమాదం తాలుకా మరో వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.అజర్ బైజన్ ఎయిర్లైన్స్కు చెందిన జె2-8243 విమానం ప్రమాదానికి గురికావడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదం జరిగాక ఓ ప్రయాణికుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. సుబ్ఖోన్ రఖిమోవ్ అనే ఆ ప్రయాణికుడు అదృష్టంకొద్దీ స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 🚨AZERBAIJAN AIRLINES PASSENGER WHO SURVIVED CRASH FILMS SHRAPNEL DAMAGESubkhon Rakhimov, a passenger on the Azerbaijan Airlines flight that tragically crashed, miraculously survived the incident. He initially filmed a video for his wife as the plane plummeted from the sky.… https://t.co/J9oGZIpGiG pic.twitter.com/0nk9YIbtJV— Mario Nawfal (@MarioNawfal) December 26, 2024అయితే ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే.. తన ఫోన్లో అక్కడి దృశ్యాలను చిత్రీకరించాడు. అయితే విమాన తోకభాగంపై, రెక్కలపై చిన్న చిన్న రంధ్రాలు ఉండడం గమనించవచ్చు. విశేషం ఏంటంటే.. అంతకు ముందు ప్రమాద సమయంలోనూ వైరల్ అయిన వీడియో కూడా ఈయనగారు పోస్ట్ చేసిందే.ప్రమాదం సమయంలో భయాందోళనకు గురైన ప్రయాణికుల హాహాకారాలు వీడియోలో వినిపిస్తున్నాయి. సుబ్ఖోన్ రఖిమోవ్ మాత్రం భగవంతుడ్ని ప్రార్థిస్తూ కనిపించాడు. ఆపై విమానం కూలిన అనంతరం ప్రయాణికులు చెల్లాచెదరుగా పడి ఉన్న దృశ్యాలు కనిపించాయి.The final moments of the Azerbaijan Airlines plane before its crash in Kazakhstan were captured by a passenger onboard.Aftermath also included in the footage. pic.twitter.com/nCRozjdoUY— Clash Report (@clashreport) December 25, 2024బాకు నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా కజకిస్థాన్(Kazakhstan)లోని అక్టౌలో కూలిపోయింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై అంతర్జాతీయ మీడియా పలు కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రమాదం నుంచి 29 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన అజర్బైజన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం నేపథ్యంలో గురువారం ఒక్కరోజు జాతీయ సంతాపం దినంగా పాటించారు.ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. పొగమంచు కారణంగా జరిగిందని.. పక్షిని ఢీ కొట్టడంతో జరిగిందని రకరకాల ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. అయితే ప్రమాదం జరిగిన తీరు.. విమాన రెక్కలకు ఉన్న రంధ్రాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా పనిగా ఊహాజనిత కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడిని తిప్పికొట్టే క్రమంలో రష్యా వైమానిక దళాలు జరిపిన దాడిలో.. ఈ విమాన ప్రమాదం జరిగిందా? అని తొలుత చర్చ నడిచింది. అయితే ఇటు రష్యాతో పాటు అటు కజకస్తాన్.. ఘటనపై దర్యాప్తు పూర్తి కాకుండా ఒక నిర్దారణకు రావడం సరికాదని చెబుతున్నాయి.ఇదీ చదవండి: ఉక్రెయిన్కు బైడెన్ బంపరాఫర్ -
కజకిస్తాన్ ప్రమాదంపై కొత్త ట్విస్ట్.. రష్యానే కారణమా?
మాస్కో: కజకిస్తాన్లో విమాన ప్రయాణం తీవ్ర విషాదం మిగిల్చింది. విమానం కుప్పకూలడంతో మంటలు చెలరేగి దాదాపు 38 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, విమాన ప్రమాదానికి రష్యానే కారణమంటూ సోషల్ మీడియాతో కామెంట్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన జే2–8243 విమానం 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో రష్యాకు బయలుదేరగా మధ్యలో ప్రమాదం సంభవించింది. అజర్బైజాన్ రాజధాని బాకూ సిటీ నుంచి విమానం.. రష్యాలోని నార్త్ కాకస్ ఉన్న గ్రాజ్నీ నగరానికి బయలుదేరింది. అయితే, గ్రాజ్నీలో ల్యాండింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో విమానాన్ని దారి మళ్లించారు. ఈ క్రమంలో అక్టౌకు వెళ్తున్న సందర్బంగా విమానం కూలిపోయింది. అయితే, ఈ విమాన ప్రమాదానికి పక్షి ఢీకొనడమే కారణమని పలువురు చెబుతున్నారు. ఇదే సమయంలో రష్యా దాడి కారణంగానే విమాన ప్రమాదం జరిగిందని మరికొందరు కొన్ని వీడియోలను షేర్ చేస్తున్నారు.Unknown holes in Azerbaijan Airlines E190 that might have been shot down over Russia and has crash landed in Kazakhstan on 25 December.#planecrash #AzerbaijanAirlines #russia #Azerbaijan #ei90 pic.twitter.com/YN0wfJlu8C— Wildly Amusing (@Wildly_Amusing) December 26, 2024 సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. ప్రమాదానికి గురైన విమానం బాడీపై పలుచోట్ల అనుమానాస్పదంగా రంధ్రాలు ఉన్నాయి. దాడులు జరిగితే రంధ్రాలు ఏర్పడినట్టుగా కనిపించడం గమనార్హం. అయితే, ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తున్న సమయంలోనే ఈ విమానంపై దాడి జరిగిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంజిన్ టెక్నికల్ సమస్యల కారణంగా పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోరి ఉంటారని అంటున్నారు. ఇక, విమానం రాడార్ దిశను చూసినప్పుడు విమానం మొదట రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్ మీదుగా వెళ్తోంది. తర్వాత ట్రాకర్ నుండి అదృశ్యమైందని చెబుతున్నారు.🚨‼️Breaking updates! The plane crash today involved an Azerbaijan Airlines Embraer jet flying from Baku to Russia, which went down near Aktau, Kazakhstan. With 67 passengers and 5 crew members on board, initial reports suggest the plane was shot down. See below for more details.… pic.twitter.com/pIJd3vwIv1— MagaVeteran1969 (@LouisCuneo1) December 25, 2024ఇదిలా ఉండగా.. ప్రమాదానికి ముందు విమాన పరిస్థితిని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో విమానం లోపల ఎంతో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితిని చూడవచ్చు. విమానం కూడా కొంత దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.Footage from today’s crash of the Embraer 190 operated by Azerbaijan Airlines. Before the crash, visible damage can be seen on the wing, and afterward, marks on the fuselage suggest it may have been hit by ground fire. pic.twitter.com/jzbooDH9W8— 𝕏 Aliu ™ 𝕏 (@Aliu_312) December 26, 2024 -
కజకిస్తాన్ ప్రమాదంలో రెండు ముక్కలైన విమానం (ఫొటోలు
-
కజకిస్తాన్ ప్రమాదం.. విమానం లోపల ప్రయాణికుడి వీడియో వైరల్
మాస్కో: కజకిస్తాన్లో విమాన ప్రయాణం తీవ్ర విషాదం మిగిల్చింది. విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలడంతో మంటలు చెలరేగి దాదాపు 38 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కజకిస్తాన్లోని అక్తావ్ నగర సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన జే2–8243 విమానం 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో రష్యాకు బయలుదేరగా మధ్యలో ప్రమాదం సంభవించింది. అజర్బైజాన్ రాజధాని బాకూ సిటీ నుంచి రష్యాలోని నార్త్ కాకస్ ఉన్న గ్రాజ్నీ నగరానికి బయలుదేరింది. అయితే, గ్రాజ్నీలో ల్యాండింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో విమానాన్ని దారి మళ్లించారు. ఈ క్రమం అక్టౌలో కూలిపోయింది.అయితే, ఈ ప్రమాదం జరిగే సమయంలో విమానంలోని ఓ ప్రయాణికుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ప్రమాదం సమయంలో భయాందోళనకు గురైన ప్రయాణికుల హాహాకారాలు వీడియోలో వినిపిస్తున్నాయి. విమానం కూలిన అనంతరం ప్రయాణికులు చెల్లాచెదరుగా పడి ఉన్న దృశ్యాలు కనిపించాయి. ఈ ప్రమాదం నుంచి 32 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన అజర్బైజన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం నేపథ్యంలో గురువారం జాతీయ సంతాపం దినంగా ప్రకటించారు.The final moments of the Azerbaijan Airlines plane before its crash in Kazakhstan were captured by a passenger onboard.Aftermath also included in the footage. pic.twitter.com/nCRozjdoUY— Clash Report (@clashreport) December 25, 2024 -
గాలిలో మృత్యు ప్రయాణం
మాస్కో: విమాన ప్రయాణం తీవ్ర విషాదం మిగిల్చింది. విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలడంతో మంటలు చెలరేగి దాదాపు 38 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కజకిస్తాన్లోని అక్తావ్ నగర సమీపంలో బుధవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన జే2–8243 విమానం 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో రష్యాకు బయలుదేరగా మధ్యలో ప్రమాదం సంభవించింది. అజర్బైజాన్ రాజధాని బాకూ సిటీ నుంచి రష్యాలోని నార్త్ కాకస్ ఉన్న గ్రాజ్నీ నగరానికి బయలుదేరింది. అయితే, గ్రాజీ్నలో పొగమంచు కారణంగా ల్యాండింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో విమానాన్ని దారి మళ్లించారు. అక్తావ్ నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలోని మైదానంలో అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయతి్నంచారు. అదుపు తప్పిన విమానం కూలిపోవడంతో మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే అప్రమత్తమైన అత్యవసర సిబ్బంది మంటలను ఆరి్పవేశారు. విమానాశ్రయానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి ఎయిర్పోర్టు అధికారులకు విజ్ఞప్తి చేశారు. వెంటనే అనుమతి రాకపోవడంతో విమానం ఆకాశంలోనే కొద్దిసేపు చక్కర్లు కొట్టింది. చివరకు అదుపుతప్పి నేలపైకి దూసుకొచి్చంది. ప్రమాదాన్ని నివారించడానికి పైలట్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కొందరి పరిస్థితి విషమం ప్రమాదానికి గురైన విమానంలో 42 మంది అజర్బైజాన్ పౌరులు, 16 మంది రష్యా జాతీయులు, ఆరుగురు కజకిస్తాన్ పౌరులు, ముగ్గురు కిర్గిజిస్తాన్ పౌరులు ఉన్నట్లు కజకిస్తాన్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఐదుగురు సిబ్బంది సహా మొత్తం 29 మంది ప్రాణాలతో బయటపడ్డారని, వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారని కజకిస్తాన్ అత్యవసర మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. కానీ, ఇద్దరు పైలట్లు కూడా మరణించారని రష్యా వార్తా సంస్థ ఇంటర్ఫాక్స్ వెల్లడించింది. కనీసం 32 మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని అజర్బైజాన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం స్పష్టంచేసింది. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అజర్బైజాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వివరించింది.పక్షి ఢీకొట్టడం వల్లే ప్రమాదం?ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. రష్యా వైపు విమానం ప్రయాణిస్తుండగా హఠాత్తుగా పక్షి ఢీకొట్టిందని, దాంతో అత్యవసర పరిస్థితి తలెత్తడంతో పైలట్లు అప్రమత్తమయ్యారని, విమానాన్ని దారిమళ్లించడానికి ప్రయతి్నంచారని, కొద్దిసేపు తర్జనభర్జన తర్వాత అక్తావ్ వైపు మళ్లించారని రష్యా పౌర విమానయాన సంస్థ వెల్లడించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. ప్రమాదానికి సంబంధించి మొబైల్ ఫోన్ ఫుటేజీ సైతం సోషల్ మీడియాలో ప్రసారమైంది. విమానం నిట్టనిలువుగా కిందికి దూసుకొస్తున్నట్లు ఇందులో కనిపిస్తోంది. అది భూమిని తాకిన వెంటనే మంటలు చెలరేగాయి. విమాన ప్రధాన భాగం నుంచి రెక్కలు విడిపోయాయి. ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు తమ సహచరులను విమాన శిథిలాలనుంచి బయటకు లాగుతున్న దృశ్యాలు కనిపించాయి. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే అజర్బైజాన్ అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు. రష్యా పర్యటనలో ఉన్న అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్ స్వదేశానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అజర్బైజాన్ విమాన ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ది్రగ్బాంతి వ్యక్తంచేశారు. అలీయేవ్తో ఫోన్లో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక విమానంలో వైద్య సిబ్బందిని, సహాయక సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించామని పుతిన్ చెప్పారు. What just happened to Azerbaijan Airlines Flight 8243?? Flight Radar showed it having an emergency squawk 7700. The flight was erratic in altitude. #azerbaijan #planewatchers #avgeek #flightemergency pic.twitter.com/K6ApRsaPvK— Zach Shapiro (@zrs70) December 25, 2024 ⚠️#BREAKING: #Azerbaijan Airlines E190 Crashes in #Kazakhstan, Survivors ReportedA tragic aviation incident unfolded today as Azerbaijan Airlines Flight #J28243, an Embraer E190AR registered (4K-AZ65)carrying 72 people, crashed near Aktau, Kazakhstan. The flight was en route… pic.twitter.com/QZG3yBcSBh— Abdul khabir jamily (@JamilKhabir396) December 25, 2024Emergency services work on the scene of the Azerbaijan Airlines plane crash in #Kazakhstan#Aktau pic.twitter.com/1ruCG6mlQL— ℂ𝕙𝕖 𝔾𝕦𝕖𝕧𝕒𝕣𝕒 ★ (@cheguwera) December 25, 2024 -
కజకిస్థాన్ వధువు– తమిళ వరుడు
అన్నానగర్: అరియలూరు జిల్లా ముల్లుకురిచ్చి గ్రామానికి చెందిన రామచంద్రన్ కుమారుడు ప్రభాకరన్ (33). ఇతను మార్కిస్టు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు. గత 2 సంవత్సరాలుగా కజకిస్థాన్లోని విమానాశ్రయంలో ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. అతడితో పాటు పనిచేసే కజకస్తాన్కు చెందిన షేక్మెదోవ్ కుమార్తె ఐ దానా(29)కు మధ్య పరిచయం ఏర్పడింది. చివరికి ఈ అది ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తల్లిదండ్రులకు చెప్పారు. వివాహానికి ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపారు. తమిళ సంస్కృతి ప్రకారం ప్రభాకరన్ తమిళనాడులో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దాని ప్రకారం ఐ దానా కుటుంబం అరియలూరుకు వచ్చింది. కాగా, మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ 24వ జిల్లా సదస్సు ఆదివారం కడలూరు జిల్లా పన్నాడంలోని ఓ ప్రైవేట్ హాలులో జరిగింది. ఈ సమావేశ వేదికపై పెళ్లికి ఏర్పాట్లు కూడా జరిగాయి. తమిళ సంçస్కృతి ప్రకారం వరుడు పట్టు పంచె, వధువు పట్టుచీరలో సమావేశ వేదికపైకి వచ్చారు. కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వాసుకి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రభాకరన్, ఐ దానా కి తాళి కట్టారు. ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు, పార్టీ సభ్యులు అందరూ హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. -
చైనా తీరు మారాలి!
ఆవిర్భవించిన నాటి లక్ష్యాలు విడిచి చాన్నాళ్లుగా దారీ తెన్నూ లేకుండా మిగిలిపోయిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు కజఖ్స్తాన్లోని ఆస్తానాలో గురువారం ముగిసింది. ఈ సదస్సువల్ల ఇతరత్రా పెద్ద ప్రయోజనం లేకపోవచ్చుగానీ మనతోవున్న సరిహద్దు సమస్యను నాలుగేళ్లుగా దాటవేస్తున్న చైనాతో మన విదేశాంగమంత్రి జైశంకర్ భేటీ కావటం ఉన్నంతలో జరిగిన మేలు. వాస్తవానికి ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావాల్సివుండగా ఆయన బదులు విదేశాంగ మంత్రి వెళ్లారు. ప్రధాని ప్రసంగాన్ని చదివి వినిపించారు. మోదీ గైర్హాజరు ఆ సంస్థనుంచి భారత్ దూరం జరగటానికి సంకేతమనీ, అమెరికా ఒత్తిడే ఇందుకు కారణమనీ చైనా అనుకూల మీడియా ప్రచారం చేసుకుంది. నిరుడు భారత్ ఆధ్వర్యంలో ఆన్లైన్లో ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు జరిగినప్పుడు కూడా ఇలాంటి భాష్యాలే చెప్పారు. చైనాతో నేరుగా సమావేశం కావటం ఇష్టం లేకే ఈ లాంఛనం పూర్తిచేసిందని ఆ భాష్యాల సారాంశం. నిజమే... ప్రపంచంలో 40 శాతం జనాభాతో, ప్రపంచ జీడీపీలో 23 లక్షల కోట్ల మేర వాటాతో ఉన్న దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీఓను విస్మరించటం మంచిది కాదు. కానీ ఆ సంస్థ ఆరంభ కాలంనాటి లక్ష్యాలను గుర్తుంచుకుందా? వాటికి అనుగుణంగా పనిచేస్తున్నదా అంటే లేదనే చెప్పాలి. వర్తక, వాణిజ్యాల్లో దాని ముద్ర లేకపోలేదు. అయితే ఆ సంస్థ పరిధిలోని ప్రాంతాల్లో ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా వగైరా పోకడల గురించి అది సక్రమంగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. మోదీ ప్రసంగంలో ఈ సమస్యలే ప్రధానంగా ప్రస్తావనకొచ్చాయి. 1996లో షాంఘై ఫైవ్గా ఏర్పడ్డ బృందంలో చైనా, రష్యా, కజఖ్స్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్లున్నాయి. 1991లో సోవియెట్ యూనియన్ కుప్పకూలాక ఆ ప్రాంతంలో తెగల ఘర్షణలు పెచ్చుమీరటంతో భద్రతాపరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ బృందం ఆవిర్భవించింది. అంతర్జాతీయ సంస్థగా మలచాలన్న లక్ష్యంతో 2001లో దీన్ని ఎస్సీఓగా మార్చారు. మన దేశానికి సభ్యత్వం ఇవ్వాలన్న రష్యా ప్రతిపాదనను అంగీకరిస్తూనే 2017లో తనకు అనుకూలంగా ఉన్న పాకిస్తాన్ను ఇందులో చేర్చింది చైనాయే. కానీ ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్టు వెల్లడై అనేకసార్లు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అభిశంసనకు గురైన పాక్ను దారి మార్చుకోవాలని చెప్పటంలో చైనా విఫలమైంది. అలాగే పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాదుల జాబితాను మన ప్రతిపాదన పర్యవసానంగా భద్రతామండలి చర్యలు తీసుకుంటున్న తరుణంలో చైనా గండికొట్టింది. సరిగదా తన బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ)ను పాకిస్తాన్ అధీనంలోవున్న ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్లేలా రూపొందించింది. అందుకే 2018లో ఎస్సీఓలో బీఆర్ఐను అందరూ అంగీకరించినా మన దేశం వ్యతిరేకించాల్సి వచ్చింది. నిరుడు జరిగిన ఆన్లైన్ సదస్సులో కూడా మన దేశం బీఆర్ఐ గురించిన పేరా తొలగిస్తే తప్ప ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసేది లేదని చెప్పింది.ఆ సంగతలావుంచి ఎస్సీఓను అమెరికా, పాశ్చాత్య దేశాల నేతృత్వంలోని సంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలనుకుంటున్న చైనా అందుకు అనుగుణమైన నడవడి కనబరచవద్దా? వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద భారీగా సైన్యాన్ని మోహరించి దురాక్రమణకు పాల్పడినప్పుడు ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. 2020లో ఘర్షణలు చెలరేగాక భారత్, చైనాల సైనికాధికారుల స్థాయిలో 20 సార్లు, దౌత్యస్థాయిలో 13 రౌండ్లు చర్చలు జరిగాక ప్యాంగాంగ్ సో సహా అయిదు చోట్ల ఇరు దేశాల సైన్యాలూ వెనక్కి తగ్గటానికి అంగీకరించాయి. తూర్పు లద్దాఖ్లోని ప్రాంతాల్లో పరిస్థితి మారలేదు. దీన్ని పక్కనబెట్టి ఇరు దేశాల సంబంధాలూ సాధారణ స్థితికి తీసుకురావాలని చైనా కోరుతోంది. కానీ అక్కడ 2020 ఏప్రిల్ నాటి స్థితికి చైనా సిద్ధపడితేనే అది అసాధ్యమన్నది మన దేశం వాదన. మన సరిహద్దుకు సమీపంగా ఈ నాలుగేళ్లలో చైనా 600 ‘సంపన్న గ్రామాల’ను నిర్మించింది. మన దేశం కూడా అరుణాచల్లో 60 గ్రామాలు నిర్మిస్తోంది. మున్ముందు అరుణాచల్, హిమాచల్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఇలాంటివి 3,000 గ్రామాలు నిర్మించాలన్నది మన దేశం లక్ష్యం. ఇదిగాక అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం దలైలామాను కలవడానికి మన దేశం అంగీకరించటం, దక్షిణ చైనా సముద్రంలో చైనాతో ఫిలిప్పీన్స్కు వచ్చిన తగాదాలో ఫిలిప్పీన్స్ను సమర్థించటం చైనాకు కంటగింపుగా ఉంది. అటు చైనా మనతో స్నేహసంబంధాలున్న హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలను దువ్వుతూ మనకు వ్యతిరేకంగా కూడగడుతోంది. ఈ నేపథ్యంలో ఎల్ఏసీ సమస్యపై భారత్తో చర్చించి, దాన్ని త్వరగా పరిష్కరించుకోవాలన్న జ్ఞానం చైనాకు ఉండాలి. అసలు ఎల్ఏసీ మ్యాప్లను ఇచ్చిపుచ్చుకుందామన్న మన ప్రతిపాదనకే అది జవాబివ్వటం లేదు. ఆ పని చేస్తే తన పాపం బద్దలవుతుందని దాని భయం. వర్తక వాణిజ్యాలు ముమ్మరంగా పెరిగేలా, కట్టుదిట్టమైన భద్రత ఉండేలా ఎస్సీఓను తీర్చిదిద్దుతామని మాటల్లో చెబుతూనే అతి పెద్ద మార్కెట్గా ఉన్న భారత్ను విస్మరించటం ఏ రకంగా చూసినా చైనాకు తోడ్పడదు. పొరుగుతో సఖ్యతకు రాలేని దేశం ఇటువంటి సంస్థల అభ్యున్నతికి ఏమాత్రం పాటుపడగలదన్న ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతాయి. అందువల్లే మళ్లీ చర్చల పునరుద్ధరణకు చైనా చొరవ తీసుకోవాలి. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ, జైశంకర్ల మధ్య జరిగిన భేటీ ఆ దిశగా తోడ్పడితే మంచిదే. సమస్య పరిష్కారానికి ఇరు దేశాలూ చిత్తశుద్ధితో ప్రయత్నించి సఫలమైతేనే ఎస్సీఓ వంటి సంస్థల నిజమైన లక్ష్యాలు నెరవేరతాయి. -
‘షాంఘై’ సదస్సుకు ప్రధాని దూరం
న్యూఢిల్లీ: కజకిస్తాన్లో వచ్చే నెలలో జరగనున్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు (ఎస్సీవో)కు ప్రధాని మోదీ హాజరవడం లేదు. ఈ సదస్సుకు ప్రధాని స్థానంలో విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ వెళ్లనున్నారు. జులై 3-4 తేదీల్లో జరగనున్న షాంఘై సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతారని తొలుత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా ఆయన వెళ్లడం లేదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ శుక్రవారం(జూన్28) మీడియా సమావేశంలో చెప్పారు. గత ఏడాది ఎస్సీవో సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వగా చైనా, రష్యా ప్రధానులు రాలేమని చెప్పడంతో వర్చువల్గా సదస్సును నిర్వహించారు. -
టైటిల్ పోరుకు తరుణ్
అస్తానా: కజకిస్తాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నెపల్లి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 190వ ర్యాంకర్ తరుణ్ 21–8, 21–7తో ప్రపంచ 78వ ర్యాంకర్ లె డక్ ఫాట్ (వియత్నాం)పై సంచలన విజయం సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ 76వ ర్యాంకర్ సూంగ్ జూ వెన్ (మలేసియా)తో తరుణ్ తలపడతాడు. క్వార్టర్ ఫైనల్లో తరుణ్ 22–20, 21–14తో దిమిత్రీ పనారిన్ (కజకిస్తాన్)ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 15–21, 15–21తో వోంగ్ తియెన్ సి–లిమ్ చియెవ్ సియెన్ (మలేసియా) జంట చేతిలో ఓడిపోగా... సెమీఫైనల్లో మనీషా–సంజయ్ (భారత్) ద్వయం 21–16, 10–21, 21–14తో కొసియెలా–తనీనా (అల్జీరియా) జోడీపై గెలిచి ఫైనల్ చేరింది. మహిళల సింగిల్స్ విభాగంలో భారత్కు టైటిల్ ఖరారైంది. ఫైనల్ పోరు ఇద్దరు భారత క్రీడాకారిణులు అనుపమా ఉపాధ్యాయ, ఇషారాణి బారువా మధ్య జరగనుంది. -
క్వార్టర్ ఫైనల్లో రుత్విక జోడీ
అస్తానా: కజకిస్తాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రుత్విక–రోహన్ కపూర్ (భారత్) జోడీ 22–20, 21–17తో కెన్నెత్–గ్రోన్యా సోమర్విల్లె (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ ఆటగాడు తరుణ్ మన్నెపల్లి 22–24, 21–18, 21–13తో భారత్కే చెందిన శంకర్ ముత్తుస్వామిపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్ లో జాతీయ చాంపియన్ అన్మోల్ 21–11, 21–7తో నూరానీ అజారా (యూఏఈ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
అబ్బాయిలతో కలిసి ఉంటేనే వైద్య విద్య
విశాఖ సిటీ: వైద్యురాలుగా స్థిరపడాలనుకుంది. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయాలని భావించింది. ఎంత ఖర్చయినా తన కుమార్తెను డాక్టర్గా చూడాలని తల్లిదండ్రులు తాపత్రయపడ్డారు. నగరానికి చెందిన కన్సల్టెన్సీ ద్వారా కజకిస్తాన్లో ఒక యూనివర్సిటీలో సీటు సంపాదించారు. కోటి ఆశలతో విదేశీ యూనివర్సిటీలోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే విద్యార్థికి వేధింపులు ప్రారంభమయ్యాయి. అక్కడ హాస్టల్లో అబ్బాయిలతో కలిపి వసతి కల్పించడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. పాశ్చాత్య పోకడలకు ఇమడలేని విద్యార్థిని ఇంటికి వెళ్లిపోతానని వేడుకున్నప్పటికీ.. పాస్పోర్ట్ తీసుకొని మొత్తం ఫీజు చెల్లిస్తేనే పంపిస్తామంటూ బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో విద్యారి్థని తన పరిస్థితిని తల్లిదండ్రులకు చెప్పుకొని దేశం కాని దేశంలో తిండీ, నిద్ర లేకుండా ఇబ్బందులు పడుతోంది. అక్కడి పరిస్థితులను, ఆమె బాధను వివరిస్తూ సెల్ఫీ వీడియో సైతం విడుదల చేసింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు గాజువాక పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన జి.భవాని విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయాలని భావించింది. ఇందుకోసం గాజువాకలో ఉన్న జీవీకే కన్సల్టెన్సీ అనే సంస్థను సంప్రదించారు. దాని ద్వారా కజకిస్తాన్ దేశంలో ఆల్మటీ నగరంలో కాస్పియన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటుకు డబ్బు చెల్లించారు. ఆ సమయంలోనే అక్కడి వసతి ఏర్పాట్లపై భవాని తండ్రి జగదీష్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో స్పష్టంగా మాట్లాడారు. గరŠల్స్, బాయ్స్కు ప్రత్యేక హాస్టళ్లు ఉంటాయని చెప్పడంతో వారు సీటు కోసం డబ్బు చెల్లించారు. భవాని ఈ నెల 11వ తేదీన కజకిస్తాన్కు వెళ్లింది. యూనివర్సిటీలో ఒక భవనంలోనే అబ్బాయిలకు, అమ్మాయిలకు వసతి కలి ్పంచారు. కొద్ది రోజులపాటు సర్దుకున్న భవాని అక్కడి వాతావరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. అబ్బాయిలతో కలిసి ఉండడం, వారు సిగరెట్, ఇతర అలవాట్లను చూసి భరించలేక ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. దీనిపై జగదీష్ కన్సల్టెన్సీ ప్రతినిధులను సంప్రదించారు. తన కుమార్తెను వేరే హాస్టల్కు మార్చాలని కోరాడు. చెప్పిన కొద్దిసేపటికే భవాని రూమ్కు కొంత మంది సీనియర్ అబ్బాయిలు వెళ్లి ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే తప్పనిసరిగా తమతో కలిసే ఉండాలని హెచ్చరించారు. అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరుగా వసతి కల్పించినట్లు చెప్పాలని బలవంతం పెట్టడంతో భయపడిన భవాని మళ్లీ తన తండ్రికి ఫోన్ చేసి వేరే హాస్టల్కు మార్పించినట్లు చెప్పింది. డబ్బు చెల్లిస్తేనే పాస్పోర్ట్ ఇస్తామంటూ.. అక్కడి వాతావరణాన్ని భరించలేని భవాని తాను అక్కడ ఉండలేనని, ఇంటికి పంపించేయాలని కళాశాల వాళ్లను వేడుకుంది. ఫీజు మొత్తం డబ్బు చెల్లిస్తేనే తిరిగి పంపిస్తామంటూ ఆమె పాస్పోర్ట్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. దీంతో ఆమె ఈ విషయాన్ని తండ్రి జగదీష్ కు చెప్పింది. హాస్టల్లో పరిస్థితులు బాగోలేవని, తాను ఇంటికి వెళ్లేందుకు సహాయం చేయాలని అధికారులను కోరుతూ సెల్ఫీ వీడియో తీసి పంపించింది. దీనిపై తండ్రి జగదీష్ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెకు తిరిగి విశాఖకు రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాడు. -
వింత గ్రామం: నిద్ర ముంచుకొచ్చిందా ఇక అంతే!.. ఏకంగా..
నిద్ర అనేది మని షి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అలా అతిగా నిద్రపోయినా ప్రమాదమే. దీని వల్ల ఆరోగ్యానికే కాదు, దైనందిన జీవితానికి ఆటంకంగానే ఉంటుంది. అలాంటి నిద్ర ఓ గ్రామంలోని ప్రజలకు శాపంగా మారింది. వారికి నిద్ర ఏదోమైకం కమ్మినట్లుగా ముంచుకొచ్చి ఎక్కడపడితే అక్కడే మత్తుగా నిద్రపోతారట. పైగా చాలా రోజుల వరకు లేవరట. ప్రయత్నించిన ప్రయోజనం ఉండదట. చెప్పాలంటే మన రామాయణ ఇతిహాసంలో ఉండే కుంభకర్ణుడి మాదిరి నిద్రపోతారు. ఆ వింత గ్రామం ఎక్కడుందంటే.. కజకిస్తాన్లో కలాచి అనే ఊరు ఉంది. అక్కడ ప్రజ ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా చాలా నెలల పాటు నిద్రపోతూనే ఉంటారు. ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తి దాదాపు నెల పాటు నిద్రపోతాడు. ఇలా నిద్ర పోయిన వ్యక్తి మళ్లీ నెల పాటు మేల్కోడట. అందుకే ఈ ఊరును "స్లీపీ హోల్" అని అంటారు. వారి దగ్గర బాంబు పేల్చిన కూడా నిద్రలేవరట. నిజానికి వాళ్లు నిద్రపోవాలని అనుకోరు. కానీ వారికి తెలియకుండానే వచ్చేస్తుంది. ఈ నిద్ర వల్ల ఆ ఊరి ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారట. కొన్ని సార్లు రోడ్డు మీద కూడా నిద్ర పోతారట. ఇలా ఎక్కడపడితే అక్కడే నిద్ర ముంచుకొస్తే గనుక ఏకంగా నెల రోజులు అక్కడే అలాగే పడుకుంటారట ఆ ఊరి ప్రజలు. ఈ కలాచి గ్రామంలో సుమారు 600 మంది ప్రజలు ఉన్నారు. ఇందులో 14 శాతం మంది ఇలాంటి సమస్యతోనే బాధ పడుతుండటం బాధకరం. అయితే 2010లో ఓ పాఠశాలలో జరిగిన సంఘటన వల్ల ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. కొందరు విద్యార్థులు క్లాసులోనే నిద్రపోయి ఎంతకీ నిద్రలేవలేదట. ఉపాధ్యాయులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో.. ఈ విషయం బయటకు పొక్కింది. అలా ఈ వ్యాధితో దాదాపు 14 శాతం మంది బాధపడుతున్నారని తెలిసింది. దీని గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కానీ ఇది ఏదో వ్యాధి వల్లే ఇలా జరుగుతుందని భావించారట. అయితే ఆ వ్యాధి ఏంటన్నది కనిపెట్టలేకపోయారు. దీంతో ఈ విషయం ఓ అంతు చిక్కని మిస్టరీలా ఉండిపోయింది. మొత్తం మీత కలాచి గ్రామం ఓ వింత వ్యాధి వల్ల ఇలా ప్రజలు నెలల తరబడి నిద్రపోతున్నట్లు తెలుస్తోంది. (చదవండి: రిజర్వాయర్ని వేలానికి పెట్టడం గురించి విన్నారా?) -
గనిలో అగ్ని ప్రమాదం
లండన్: కజఖిస్తాన్లోని కొస్టెంకో బొగ్గు గనిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 32 మంది కార్మికులు చనిపోగా మరో 14 మంది గల్లంతయ్యారు. లగ్జెంబర్గ్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ ఈ విషయం తెలిపింది. శనివారం ప్రమాద సమయంలో గనిలో 252 మంది కారి్మకులు పనిచేస్తున్నారని వివరించింది. మీథేన్ గ్యాస్ వెలువడటం వల్లే గనిలో మంటలు చెలరేగాయని తెలిపింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారు ఆర్సెలర్ మిట్టల్. ఈ సంస్థకు అనుబంధంగా కజఖిస్తాన్లో ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ పనిచేస్తుంది. ఘోర ప్రమాదం నేపథ్యంలో కజఖ్ ప్రభుత్వం ..దేశంలో ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ ఆధ్వర్యంలో ఉన్న ఉక్కు కర్మాగారాలు, బొగ్గు, ఇనుప ఖనిజం గనులను జాతీయం చేసింది. -
సుదీర్ఘ అంతరిక్షయాత్ర చేసి సురక్షితంగా భూమికి
మాస్కో: నాసాకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు, రోస్కోస్మొస్కు చెందిన మరో శాస్త్రవేత్త సుదీర్ఘ అంతరిక్ష యాత్రను ముగించుకుని క్షేమంగా భూమికి చేరారు. వీరు ప్రయాణించిన స్పేస్క్రాఫ్ట్ సోయుజ్ ఎంఎస్-23 కజకిస్తాన్లోని జెజ్కజ్గాన్ నగరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. రోస్కోస్మొస్ వ్యోమగాములు సెర్గె ప్రొకొపియేవ్, దిమిత్రి పెటెలిన్ నాసా వ్యోమగామి ఫ్రాన్సిస్ రూబియో సెప్టెంబర్ 21, 2022లో సోయుజ్ ఎంఎస్-23 స్పేస్క్రాఫ్ట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణమయ్యారు. వ్యోమగాములు క్షేమంగా భూమి మీదకు చేరిన విషయాన్ని రోస్కోస్మొస్, నాసా సంస్థలు ధృవీకరించాయి. రష్యా వ్యోమగాములు సెర్గె ప్రొకొపియేవ్, దిమిత్రి పెటెలిన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 370 రోజుల 21 గంటల 22 నిముషాలు గడిపినట్లు ప్రకటించగా నాసా తమ వ్యోమగామి ఫ్రాన్సిస్కో రూబియో 371 రోజుల పాటు అంతరిక్షంలో గడిపినట్లు ఎక్స్(ట్విట్టర్)లో ప్రకటించింది. వాస్తవానికి వీరు ఆరు నెలల క్రితమే భూమికి చేరుకోవాల్సి ఉండగా చిన్న ఉల్క తాకిడికి స్పేస్క్రాఫ్ట్లో లీక్ చోటుచేసుకోవడంతో అది సాధ్యపడలేదు. సిబ్బంది లేకుండా మాస్కో మరో రాకెట్ పంపడంతో దానిలో ముగ్గురు వ్యోమగాములు తిరుగుప్రయాణమయ్యారు. సెప్టెంబర్ 27, 2023కి భూమికి చేరుకొని కజకిస్తాన్లో క్షేమంగా ల్యాండ్ అయ్యారు. #SoyuzMS23Landing@roscosmos cosmonauts and commander of the Soyuz-MS23 spaceship 👨🏻🚀Sergey Prokopyev is out from the spacecraft. pic.twitter.com/vHbeOpSBr4 — The Space Pirate🥷🏻👨🏻🚀 💫🪐🚀 (@TheSpacePirateX) September 27, 2023 🇺🇸🇸🇻 | El astronauta Frank Rubio, estadounidense de origen salvadoreño, se vio obligado a quedarse en órbita debido a una falla en su nave. Ahora, tras 371 días y 5.963 vueltas alrededor de la Tierra, su nave ha aterrizado y reunirá con su familia. pic.twitter.com/VezH1FHdV4 — El Salvador Avanza (@SvAvanza) September 27, 2023 ఇది కూడా చదవండి: USA : ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు -
సమయానికి దేవుడిలా రక్షించారు! లేదంటే ఆ చిన్నారి..
ఓ చిన్నారి ఎనిమిదో అంతస్తు కిటికి నుంచి వేలాడుతున్నాడు. ఆ చిన్నారి తల కిటికిలో ఇరుక్కుపోవడంతో అలా వేలాడుతున్నాడు. ఏ క్షణంలో పడిపోతాడో అని నరాలు తెగే ఉత్కంఠ సాగుతుండగా.. అనూహ్యంగా ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కజికిస్తాన్లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఓ మూడేళ్ల చిన్నారి అకస్మాత్తుగా ఎనిమిదో అంతస్తు కిటికీ గుండా పడిపోయాడు. ఐతే అతడి తల ఇరుక్కుపోవడంతో అలా వేలాడుతూ ఉన్నాడు. ఆ ఇంటిలోని వారు సైతం ఆ చిన్నారిని గమనించకపోవడంతో.. ఆచిన్నారి అలా చాలా సేపు ఏ చేయాలో తెలియక ఇబ్బంది పడ్డాడు. ఇంతలో కింద అంతస్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు దీన్ని గమనించారు. ఐతే ఆ కుర్రాడిని రక్షించేందుకు ఏం చేయాలో తొలుత వారికి అర్థం కాలేదు. ఎందుకంటే ఆ పిల్లాడి తల విండోలో ఇరుక్కుపోయింది. కాబట్టి అతన్ని కిందకి లాగితే ఆ చిన్నారికి ప్రమాదం. కాబట్టి కింద ఏ స్టూలో వేసి సాయం చేసి.. ఆ చిన్నారిలో ఉత్సాహం నింపాలనుకున్నారు. అనుకున్నట్లుగానే రెండు స్టూల్స్ని ఆ చిన్నారి కాళ్ల వద్ద ఉంచారు. కానీ ఆ చిన్నారి మాత్రం స్పృహ కోల్పోయాడు. ఎంతసేపు ఆ స్టూల్పై కాళ్లు నిలబడకుండా వేలాడిపోతుంటాయి. దీంతో వారు కూడా ఆ భవనంపై స్టూల్స్ పట్టుకుని ఆ చిన్నారి స్పృహలోకి వచ్చేంత వరకు అలా నుంచొని ఉంటారు. సరిగ్గా ఇంతలో ఆ చిన్నారి పేరెంట్స్ వచ్చి కంగారుపడుతూ, అరుస్తూ.. ఆ చిన్నారిని కిటికి గుండా పైకి లాగే యత్నం చేస్తారు. దీంతో ఆ చిన్నారి స్పృహలోకి వస్తాడు. హమ్మయ్యా! ఆ చిన్నారి బతికే ఉన్నాడనుకుని ఆ ఇద్దరు వ్యక్తులు ఊపిరి పీల్చుకుంటారు. ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు తెరదించుతూ.. ఆ పిల్లాడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ ఇద్దర్ని రియల్ హీరోలు అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. Amazing men🙏 pic.twitter.com/WOQNoFP8ZB — Tansu YEĞEN (@TansuYegen) April 26, 2023 (చదవండి: సోనియా గాంధీ విషకన్య!: బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్) -
‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుదే చెస్ టైటిల్
అస్తానా: కజకిస్తాన్, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మహిళల జట్ల మధ్య జరిగిన చెస్ టోర్నమెంట్లో ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టు పైచేయి సాధించి టైటిల్ దక్కించుకుంది. బుధవారం ముగిసిన టోర్నీలో ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టు బ్లిట్జ్ ఈవెంట్లో 38.5–25.5 పాయింట్ల తేడాతో... ర్యాపిడ్ ఈవెంట్లో 34.5–29.5 పాయింట్ల తేడాతో కజకిస్తాన్ జట్టును ఓడించింది. భారత గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ద్రోణవల్లి హారిక, తమిళనాడుకు చెందిన మహిళా గ్రాండ్మాస్టర్ (డబ్ల్యూజీఎం) సవితాశ్రీ ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. హారిక, సవితాశ్రీలతోపాటు నానా జాగ్నిద్జె (జార్జియా), హూ ఇఫాన్ (చైనా), గునె మమద్జాదా (అజర్బైజాన్), సోకా గాల్ (హంగేరి), అఫ్రూజా ఖమ్దమోవా (ఉజ్బెకిస్తాన్), నుర్గుల్ సలిమోవా (బల్గేరియా) కూడా ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కజకిస్తాన్ జట్టు తరఫున దినారా, బిబిసారా, మెరూర్ట్, జన్సాయా అబ్దుమలిక్, జెనియా బలబయేవా, లియా, అలువా నుర్మనోవా, జరీనా పోటీపడ్డారు. చదవండి: IPL 2023: సిక్సర్ల వర్షం కురిపించిన అర్జున్ టెండూల్కర్.. వీడియో వైరల్ -
Miami Open 2023: 13వ ప్రయత్నంలో సఫలం
ఫ్లోరిడా: ఎట్టకేలకు చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ పెట్రా క్విటోవా నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 ప్రీమియర్ టోర్నమెంట్లో 33 ఏళ్ల క్విటోవా తొలిసారి చాంపియన్గా అవతరించింది. గతంలో 12 సార్లు ఈ టోర్నీలో పాల్గొని ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయిన క్విటోవా 13వ ప్రయత్నంలో ఏకంగా టైటిల్ సాధించడం విశేషం. ప్రపంచ ఏడో ర్యాంకర్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్)తో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ క్విటోవా గంటా 42 నిమిషాల్లో 7–6 (16/14), 6–2తో విజయం సాధించింది. క్విటోవా కెరీర్లో ఇది 30వ సింగిల్స్ టైటిల్కాగా, డబ్ల్యూటీఏ–1000 విభాగంలో తొమ్మిదోది. ఈ గెలుపుతో క్విటోవా 2021 సెప్టెంబర్ తర్వాత మళ్లీ ప్రపంచ టాప్–10 ర్యాంకింగ్స్లోకి రానుంది. రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో విజేతగా నిలిచి సూపర్ ఫామ్లో ఉన్న రిబాకినా ఫైనల్లో తొలి సెట్లో గట్టిపోటీ ఇచ్చింది. చివరకు 22 నిమిషాలపాటు జరిగిన టైబ్రేక్లో క్విటోవా పైచేయి సాధించి తొలి సెట్ను దక్కించుకుంది. రెండో సెట్లో క్విటోవా దూకుడుకు రిబాకినా చేతులెత్తేసింది. కేవలం రెండు గేమ్లు మాత్రమే ఆమె గెల్చుకుంది. విజేతగా నిలిచిన క్విటోవాకు 12,62,220 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 10 కోట్ల 36 లక్షలు), రన్నరప్ రిబాకినాకు 6,62,360 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 5 కోట్ల 43 లక్షలు) లభించాయి. -
ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ టోర్నీకి జ్యోతి
ఈనెల 10 నుంచి 12 వరకు కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జరిగే ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 25 మందితో కూడిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్కు చెందిన స్టార్ స్ప్రింటర్ జ్యోతి యర్రాజీకి చోటు లభించింది. విశాఖపట్టణానికి చెందిన జ్యోతి 60 మీటర్లు, 60 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్స్లో పోటీపడుతుంది. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన మిరామస్ ఎలైట్ ఇండోర్ ట్రాక్ అథ్లెటిక్స్ మీట్లో జ్యోతి 60 మీటర్ల హర్డిల్స్లో జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకం సాధించింది. -
హంపికి గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం
-
ప్రపంచపు అత్యంత భారీ కార్పెట్ ఇదే...
World Largest Carpet ప్రపంచంలోనే అతిపెద్ద కార్పెట్ మన దేశంలో రూపుదిద్దుకుంది. కార్పెట్ సిటీగా పేరొందిన ఉత్తరప్రదేశ్లోని భదోహిలో పటోడియా కాంట్రాక్ట్ అనే సంస్థ ఈ భారీ కార్పెట్ను సాకారం చేసింది. మధ్య ఆసియాలో అతి పెద్ద మసీదు అయిన కజకిస్తాన్లోని నుర్–సుల్తాన్ మసీదు కోసం ఈ ప్రాజెక్ట్ చేపట్టి ప్రపంచంలోనే అతి పెద్ద హ్యాండ్మేడ్ కార్పెట్ను అందించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. విశేషాలివే... మొత్తంగా 12వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ కార్పెట్ను తీర్చిదిద్దారు. ఈ కార్పెట్లో మెడాలియన్ 70 మీటర్ల వ్యాసార్థంతో ఉండగా, 80 టన్నుల నిఖార్పైన న్యూజిలాండ్ ఊల్ స్పన్ వినియోగించారు. దీనిని వెయ్యి మందికి పైగా కార్మికులు ఆరు నెలల పాటు నిర్విరామంగా శ్రమించి తీర్చిదిద్దారు. ఈ కార్పెట్లో ప్రధానంగా రెండు డిజైన్లు ఉంటాయి. మసీదులో కోర్ట్యార్డ్ సెంటర్పీస్గా వృత్తం, దానిచుట్టూ 8 గొడ్డళ్లు ఉంటే, జన్నత్ ఉల్ ఫిరదౌస్ స్ఫూర్తితో ఇంకో డిజైన్ ఉంటుంది. అతిపెద్ద కార్పెట్ కళ... ప్రపంచంలో ఇంతవరకూ ఎప్పుడూ ఇంతటి భారీ స్ధాయిలో హ్యాండ్మేడ్ కార్పెట్ను తీర్చిదిద్దిన సందర్భం లేదు. ఈ కార్పెట్కు సంబంధించి యార్న్ స్పిన్నింగ్ మొదలు, సైట్లో దాని ఇన్స్టాలేషన్ వరకూ మొత్తం కార్యక్రమాన్ని పటోడియా కాంట్రాక్ట్ నిర్వహించింది. నెలకు 25వేల చదరపు మీటర్ల కార్పెట్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన పటోడియా ప్రతి దశలోనూ నాణ్యత నియంత్రణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. మధ్య ఆసియాలో అతి పెద్ద మసీదు కోసం చేసిన ఈ కార్పెట్ రూపకల్పనలో అనేక జాగ్రత్తలను తీసుకుంది. మసీదు నిర్మాణానికి సంబంధించి ప్రతి సూక్ష్మ అంశమూ అంటే ముఖ్యమైన చాండ్లియర్, కార్నర్స్, ఫ్లోరింగ్, కన్వర్జింగ్ వాల్స్, పిల్లర్లు వంటివి పరిగణలోకి తీసుకుని కార్పెట్ తీర్చిదిద్దారు. పటోడియా కాంట్రాక్ట్ కంపెనీ 1881 నుంచి కార్పెట్ తయారీ రంగంలో ఉంది. ప్రపంచంలో అగ్రగామి కార్పెట్ డిజైనర్లతో కలిసి పనిచేస్తోంది. -
World Athletics Championships: జెరుటో జోరు...
ఈవెంట్ ఆరో రోజు రెండు విభాగాల్లో ఫైనల్స్ జరిగాయి. మహిళల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో నోరా జెరుటో (కజకిస్తాన్)కు స్వర్ణం దక్కింది. రేస్ను ఆమె 8 నిమిషాల 53.02 సెకన్లలో పూర్తి చేసి కొత్త చాంపియన్షిప్ రికార్డును నమోదు చేసింది. వెర్కుహ గెటాచూ (ఇథియోపియా – 8 నిమిషాల 54.61 సె.) రజతం సాధించగా, మెకిడెస్ అబీబీ (ఇథియోపియా – 8 నిమిషాల 56.08 సె.) కాంస్యం గెలుచుకుంది. ఈ ఈవెంట్లో టాప్–3లో నిలిచిన ముగ్గురు అథ్లెట్లు కూడా పరుగును 9 నిమిషాల్లోపే పూర్తి చేయడం వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ చరిత్రలో తొలి సారి కావడం విశేషం. జూనియర్ స్థాయిలో కెన్యాకు ప్రాతినిధ్యం వహించి గత ఏడాది కజకిస్తాన్కు వలస వెళ్లిన జెరుటో ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశాన్ని కూడా కోల్పోయింది. అయితే ఇప్పుడు వరల్డ్ చాంపియన్షిప్ బరిలోకి దిగి కజకిస్తాన్కు ఈ క్రీడల చరిత్రలో తొలి స్వర్ణాన్ని అందించింది. మహిళల డిస్కస్త్రోలో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత వలరీ అల్మన్ (అమెరికా)కు నిరాశ ఎదురైంది. డిస్క్ను 68.30 మీటర్లు విసిరిన అల్మన్ మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకుంది. చైనాకు చెందిన బిన్ ఫింగ్ స్వర్ణం గెలుచుకుంది. 69.12 మీటర్లతో ఆమె అగ్ర స్థానంలో నిలిచింది. సాండ్రా పెర్కోవిక్ (క్రొయేషియా – 68.45 మీ.)కు రజతం దక్కింది. -
Wimbledon Tennis tournament: ‘క్వీన్’ రిబాకినా
లండన్: కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ ఫైనల్ ఆడుతున్న ఒత్తిడికి తలొగ్గకుండా... తొలి సెట్ కోల్పోయినా ఆందోళన చెందకుండా... ఆద్యంతం పట్టుదలతో పోరాడిన కజకిస్తాన్ క్రీడాకారిణి ఎలీనా రిబాకినా తన ‘గ్రాండ్’కలను సాకారం చేసుకుంది. శనివారం జరిగిన వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో 23 ఏళ్ల రిబాకినా చాంపియన్గా అవతరించింది. గంటా 48 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్ రిబాకినా 3–6, 6–2, 6–2తో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆన్స్ జబర్ను ఓడించింది. ఈ క్రమంలో గ్రాండ్స్లామ్ టైటిల్ గెలిచిన తొలి కజకిస్తాన్ ప్లేయర్గా రిబాకినా చరిత్ర సృష్టించింది. విజేతగా నిలిచిన రిబాకినాకు 20 లక్షల బ్రిటిష్ పౌండ్లు (రూ. 19 కోట్ల 7 లక్షలు), రన్నరప్ జబర్కు 10 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 10 కోట్లు) ప్రైజ్మనీగా లభించాయి. తడబడి... నిలబడి ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న జబర్ ఫైనల్లోనూ జోరు కొనసాగించింది. వైవిధ్యభరిత డ్రాప్ షాట్లు, పాసింగ్ షాట్లతో చెలరేగిన జబర్ మూడో గేమ్లో, తొమ్మిదో గేమ్లో ప్రత్యర్థి సర్వీస్లను బ్రేక్ చేసి 32 నిమిషాల్లో సెట్ను దక్కించుకుంది. తొలి సెట్ కోల్పోయినా రిబాకినా పట్టుదల కోల్పోలేదు. రెండో సెట్లోని తొలి గేమ్లోనే జబర్ సర్వీస్ను బ్రేక్ చేసిన రిబాకినా అదే జోరులో ఐదో గేమ్లోనూ బ్రేక్ సాధించి 4–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత శక్తివంతమైన సర్వీస్లు, ఫోర్హ్యాండ్ షాట్లతో విజృంభించిన రిబాకినా 39 నిమిషాల్లో సెట్ను నెగ్గి మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లోని తొలి గేమ్లో మళ్లీ జబర్ సర్వీస్ను బ్రేక్ చేసిన రిబాకినా... ఆ తర్వాత ఏడో గేమ్లో మరోసారి జబర్ సర్వీస్ను బ్రేక్ చేసింది. ఎనిమిదో గేమ్లో రిబాకినా తన సర్వీస్ను నిలబెట్టుకొని సెట్తోపాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది. నేడు జొకోవిచ్ (సెర్బియా), కిరియోస్ (ఆస్ట్రేలియా) మధ్య పురుషుల సింగిల్స్ ఫైనల్ జరుగుతుంది. ఫైనల్ గణాంకాలు రిబాకినా ఆన్స్ జబర్ 4 ఏస్లు 4 3 డబుల్ఫాల్ట్లు 1 17/36 నెట్ పాయింట్లు 7/14 4/6 బ్రేక్ పాయింట్లు 2/11 29 విన్నర్స్ 17 33 అనవసర తప్పిదాలు 24 86 మొత్తం పాయింట్లు 80 -
కజకిస్తాన్లో కర్నూలు యువకుడి మృతి
కర్నూలు(సెంట్రల్): కజకిస్తాన్లో ఎంబీబీఎస్ చదువుతున్న కర్నూలు యువకుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈతకు వెళ్లగా ఈ ఘటన జరిగినట్లు కాలేజీ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పొట్లపాడుకు చెందిన పి.ప్రసాదు, మేరీ కుమారి దంపతులకు ఇద్దరు సంతానం. వీరి కుమారుడు పి.వినయ్కుమార్(23) కజకిస్తాన్లోని ఆల్మమట్టి నగరంలో ఉన్న కజక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం మూడో సంవత్సరం పరీక్షలు ముగిశాయి. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం గురువారం స్నేహితులతో కలసి సమీపంలో ఉన్న కుంటలో ఈతకు వెళ్లాడు. అయితే నీటిలోకి దూకే సమయంలో అదుపు తప్పి రాయికి తలకొట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని మొదట స్నేహితులు వినయ్కుమార్ తల్లిదండ్రులకు తెలిపారు. తరువాత మెడికల్ కాలేజీ యూనివర్సిటీ కూడా యువకుడి మరణాన్ని ధ్రువీకరించి సమాచారం ఇచ్చింది. జేసీ ఎస్.రామ్సుందర్రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న వినయ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఉన్నత చదువు కోసం కజకిస్తాన్ వెళ్లిన వినయ్కుమార్ మృతి చెందడాన్ని తల్లిదండ్రులు, బంధుమిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కుమారుడిని తలుచుకొని విలపిస్తున్న తల్లిని నిలువరించడం బంధుమిత్రులకు సాధ్యం కావడంలేదు. కడసారి చూపుకోసం తమ కుమారుడి మృతదేహాన్ని రప్పించాలని ఉన్నతాధికారులకు తల్లిదండ్రులు విన్నవించారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జేసీ ఎస్.రామ్సుందర్రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. విదేశాంగ శాఖతో మాట్లాడిన కలెక్టర్... ఎంతో భవిష్యత్ ఉన్న పి.వినయ్కుమార్ కజకిస్తాన్ లో చనిపోవడంపై కలెక్టర్ విచారం వ్యక్తం చేశారు. వెంటనే అతడి మృతదేహాన్ని ఇండియాకు తెప్పించేందుకు చర్యలు చేపట్టారు. విదేశాంగ శాఖ అధికారులు, ఏపీ భవన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు కజకిస్తాన్లోని ఎంబసీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు కలెక్టర్ తెలిపారు. వినయ్కుమార్ మృతదేహాన్ని స్వస్థలానికి తెప్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
సిమ్రన్జిత్ శుభారంభం..!
ఎలోర్డా కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత మహిళా బాక్సర్ సిమ్రన్జిత్ కౌర్ శుభారంభం చేసింది. కజకిస్తాన్లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన 60 కేజీల విభాగం తొలి రౌండ్లో సిమ్రన్జిత్ 5–0తో ఇస్చనోవా (కజకిస్తాన్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది. పురుషుల 54 కేజీల విభాగం తొలి రౌండ్లో అనంత చొపాడె 3–2తో గన్బోల్డ్ (మంగోలియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరాడు. చదవండి: Wimbledon 2022: పోరాడి ఓడిన సెరెనా విలియమ్స్..! -
యాపిల్ పుట్టినిల్లు ఎక్కడో తెలుసా? ఆ పండ్లు చిన్నగా, చేదుగా ఉండేవా!
హాలిఫాక్స్: యాపిల్ పండును వర్ణించమంటే ఎలా వర్ణిస్తాం? ఎర్రగా, తియ్యగా, పెద్దగా ఉంటుంది అంటాం. కానీ నిజానికి పురాతన కాలంలో యాపిల్ ఇలా ఉండేది కాదట! చాలా చిన్నగా, చేదుగా ఉండేదని కెనడా పరిశోధకులు చెప్తున్నారు. వేలాది సంవత్సరాల కాలంలో రకరకాల పద్ధతుల ద్వారా ఇప్పుడున్న ఆకారం, రంగు, రుచికి తీసుకొచ్చారని తేల్చారు. యాపిల్ పుట్టినిల్లు ఇప్పటి కజకిస్తాన్లోని తియాన్షెన్ కొండలు. ఆ దేశంలోని అతి పెద్ద నగరమైన అల్మాటీ పేరు యాపిల్ నుంచే పుట్టింది. అల్మాటౌ అంటే కజక్ భాషలో యాపిల్ కొండ అని అర్థం. మానవులు గత 5,000 సంవత్సరాలుగా యాపిల్ను సాగు చేస్తున్నారు. పురాతన కాలంలో యాపిల్ విత్తనాలను సిల్క్ రూట్ గుండా ఆసియా అంతటికీ రవాణా చేశారు. తర్వాత ఇవి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకూ చేరాయి. అప్పట్లో యాపిల్స్ చాలా చిన్నవిగా, చేదుగా ఉండేవి. కజకిస్తాన్ కొండల్లో సహజంగా యాపిల్ చెట్లు పెరుగుతుంటాయి. వాటికి కాసే పండ్లు చిన్న, చేదుగా, ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ అటవీ జాతి యాపిల్స్తో పోలిస్తే మనుషులు సాగు చేసే పండ్లు 3.6 రెట్లు అధిక బరువు, 43 శాతం తక్కువ అమ్లత్వాన్ని కలిగి ఉన్నట్లు పరిశోధకులు కనిపెట్టారు. చేదుకు కారణమయ్యే ఫినోలిక్ కాంపౌండ్ 68 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అందువల్లే చేదు చాలావరకు తగ్గిపోయినట్లు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో గత 200 ఏళ్లుగా యాపిల్స్లో కొత్త రకాలను సృష్టించడంలో వేగం పెరిగింది. ఎక్కువ కాలం నిలువ ఉండే పండ్లను సాగు చేస్తున్నారు. అందులో తీపి శాతాన్ని పెంచుతున్నారు. -
ఎల్పీజీ ధరల పెంపుతో... భగ్గుమన్న కజకిస్తాన్
మాస్కో: మధ్య ఆసియా దేశమైన కజకిస్తాన్లో ఎల్పీజీ గ్యాస్ ధరల్ని భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు చేస్తున్న నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. దేశంలోని అతి పెద్ద నగరమైన అల్మటీలో నిరసనకారులు ప్రభుత్వ భవనాలపై జరిపిన దాడులు రక్తపాతాన్ని సృష్టించాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందగా, 12 మంది పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఒక పోలీసు అధికారి తల తెగి రోడ్డుపై పడి ఉండడం భయోత్పాతాన్ని రేపింది. అత్యవసర పరిస్థితుల్ని తోసిరాజని బుధవారం రాత్రికి రాత్రి ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి అధ్యక్ష భవనం, ఇతర ప్రభుత్వ భవనాలను ముట్టడించడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు పోలీసు శాఖ పోలీస్ శాఖ తెలిపింది. కజకిస్తాన్ ప్రజలు ఎల్పీజీ గ్యాస్ని ఎక్కువగా కార్లలో వినియోగిస్తారు. ఎలక్ట్రానిక్ వాహనాలు వినియోగించాలన్న ఉద్దేశంతో పెట్రో ధరలపై ప్రభుత్వం సబ్సిడీలను ఎత్తేయడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు గత ఆదివారం నుంచి నిరసనలకి దిగారు. పరిస్థితులు చెయ్యి దాటిపోతూ ఉండడంతో టోకయేవ్ రష్యా సాయాన్ని కోరారు. ఆయన అభ్యర్థన మేరకు రష్యా, దాని మిత్ర దేశాలు కజకిస్తాన్కు శాంతి బలగాలను పంపించనున్నాయి. -
Syeda Falak: బరువు తగ్గడం కోసమే కరాటే క్లాసులో చేర్చారు... కట్చేస్తే!
Syeda Falak: ఆకాశమే హద్దుగా...రేపు (డిసెంబర్ 17) మొదలయ్యే ‘ఆసియా కరాటే చాంపియన్షిప్’ పోటీలకు వేదిక కజకిస్థాన్. మధ్య ఆసియా దేశంలో జరిగే ఈ కరాటే పోటీలకు మనదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది సాయెదా ఫలక్. కరాటేలో 22 అంతర్జాతీయ పతకాలు, 20 జాతీయస్థాయి పతకాలను సాధించిన ఫలక్ ఈ రోజు కజకిస్థాన్కు బయలుదేరుతోంది. సాక్షితో మాట్లాడుతూ... భారత్కు మరో పతకాన్ని తీసుకు వస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పింది. అంతా కాకతాళీయం హైదరాబాద్లో పుట్టి పెరిగిన సాయెదా ఫలక్ బీఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్ తర్వాత ఇప్పుడు ఎల్ఎల్బీ చేస్తోంది. తన పన్నెండేళ్ల వయసులో కాకతాళీయంగా మొదలైన కరాటే ప్రాక్టీస్ తన జీవితంలో భాగమైపోయిందని చెప్పింది. ‘‘నేను సెవెన్త్ క్లాస్లో ఉండగా మా స్కూల్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో భాగంగా కరాటేని పరిచయం చేశారు. నేను బొద్దుగా ఉండడంతో బరువు తగ్గడం కోసమే కరాటే క్లాసులో చేర్చారు. ప్రాక్టీస్ మొదలైన పదిరోజుల్లోనే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్కి పేరు ఇచ్చేశారు మా స్కూల్ వాళ్లు. ఆ పోటీల్లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఆ తర్వాత ఏడాదే బ్లాక్ బెల్ట్ వచ్చింది. నా తొలి ఇంటర్నేషనల్ మెడల్ నేపాల్లో జరిగిన ఇంటర్నేషనల్ చాంపియన్షిప్లో వచ్చింది. అప్పుడు నాకు పదమూడేళ్లు. నిజానికి అప్పటి వరకు కరాటే పట్ల పెద్ద సీరియెస్గా లేను. కోచ్ చెప్పినట్లు ప్రాక్టీస్ చేయడం, అమ్మానాన్నలు పోటీలకు తీసుకువెళ్తే నా వంతుగా హండ్రెడ్ పర్సెంట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం వరకే ఉండేది. స్కూల్లో, బంధువుల్లో నన్ను ప్రత్యేకంగా గుర్తించడం, నా ప్రతి సక్సెస్నీ మా అమ్మానాన్న సంతోషంగా ఆస్వాదించడం, మీడియాలో కథనాలు రావడం... వంటివన్నీ నన్ను బాగా ప్రభావితం చేశాయి. కరాటేతో ఐడెంటిఫై అవ్వడం కూడా అప్పటి నుంచే మొదలైంది’’ అని గుర్తు చేసుకుంది ఫలక్. అడ్డంకులు లేవు కరాటే ప్రాక్టీస్ చేయడానికి మతపరమైన నిబంధనలు తనకు అడ్డుకాలేదని చెప్తూ ‘‘నాకంటే ముందు మా అక్క అయ్మాన్ స్పోర్ట్స్ ప్రాక్టీస్లో ఉంది. మా అమ్మానాన్నలిద్దరూ విశాల దృక్పథం ఉన్నవాళ్లే. దాంతో ఏ ఇబ్బందీ రాలేదు. కానీ, అప్పట్లో ‘కరాటే అనేది మగవాళ్ల రంగం, అమ్మాయి కరాటే ప్రాక్టీస్ చేయడం ఎందుకు’ అనే భావన మాత్రం వ్యక్తమయ్యేది. అది పద్నాలుగేళ్ల కిందటి మాట. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. పైగా ఇది స్వీయరక్షణ సాధనం అని అందరూ గుర్తిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో షీ టీమ్తో కలిసి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ వివరిస్తూ వీడియో చేశాను. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో స్టూడెంట్స్కి కరాటే నేర్పిస్తున్నాను. పూర్తిస్థాయిలో కరాటే అకాడమీ స్థాపించి వీలయినంత ఎక్కువ మంది అమ్మాయిలకు స్వీయరక్షణ కోసం కరాటేలో శిక్షణ ఇవ్వాలనేది నా ఆకాంక్ష’’ అని చెప్పిందామె. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ప్రధాన స్రవంతిలో ఆకాశమే హద్దుగా దూసుకుపోవాలని కోరుకుంటోంది సాయెదా ఫలక్. ఫలక్ అంటే ఆకాశం అని అర్థం. స్టార్ క్యాంపెయినర్ సాయెదా ఫలక్ తాను సాధించిన పతకాలను చూసుకుంటూ అన్నింటికంటే ఎక్కువ సంతోషాన్నిచ్చింది ‘యూఎస్ ఓపెన్ మెడల్’ అని 2016లో లాస్వేగాస్లో గెలుచుకున్న పతకాన్ని చూపించింది. క్రీడాకారిణిగా రాణిస్తున్న ఫలక్ అణగారిన వర్గాల మహిళల్లో చైతన్యం కలిగించడానికి రాజకీయరంగంలో అడుగుపెట్టి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎమ్ఐఎమ్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేసింది. ‘రాజకీయ రంగం అంటే మగవాళ్ల రంగం అనే భావన మహిళల్లో ఉందనే వాస్తవాన్ని ఆ ప్రచారం ద్వారానే తెలుసుకోగలిగాను. ఈ ధోరణిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను’ అని చెప్పింది సాయెదా ఫలక్. – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల View this post on Instagram A post shared by Syeda Falak (@falaksyeda7) View this post on Instagram A post shared by Syeda Falak (@falaksyeda7) -
చైనా ముందే చెప్పింది.. అయినా వినలేదు!
క్రిప్టోకరెన్సీకి భారీ మార్కెట్ అవుతుందేమోనని భావించిన చైనా.. దానిని పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. క్రిప్టో అనేది ఫ్లాట్ కరెన్సీ కాదంటూ బ్యాన్తో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మూర్ఖంగా ముందుకు పోతోందంటూ విమర్శలు సైతం వినిపించాయి. అయితే ఆ నిర్ణయం సరైందేమో అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి ఇప్పుడు కొన్ని దేశాలు. ఈ ఏడాది మే నెలలో చైనా స్టేట్ కౌన్సిల్ ఏకంగా బిట్కాయిన్ మైనింగ్ను మూసేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ ఉత్పత్తి వల్ల కర్బన ఉద్గారాలు వెలువడుతాయని ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుందని, పైగా ఎనర్జీ విపరీతంగా ఖర్చై కరెంట్ కొరతలు ఏర్పడతాయని ప్రకటించుకుంది చైనా. ఆపై ఏకంగా క్రిప్టోకరెన్సీలను మొత్తంగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో క్రిప్టోకరెన్సీ తయారీ కోసం ఇంతకాలం చైనాలో థర్మల్ కేంద్రాలపై ఆధారపడ్డ క్రిప్టోకరెన్సీ కంపెనీలు.. నిషేధం దెబ్బకు వేరే దేశాలకు క్యూ కట్టాయి. ఇదే ఇప్పుడు కొత్త సమస్యకు కారణమైంది. చైనాకు పొరుగున ఉన్న దేశాలతో ఖర్చు ఎంతైనా పర్వాలేదనుకుని ఒప్పందాలు చేసుకుంటున్నాయి క్రిప్టో కంపెనీలు. అయితే ఒప్పందాలు చేసుకున్న దేశాలు ఇప్పుడు నాలిక కర్చుకుంటున్నాయి. సాధారణంగా క్రిప్టోకరెన్సీ ఉత్పత్తికి భారీ స్థాయిలో ఎనర్జీ అవసరం పడుతుంది. ఇది ఊహించని కజకిస్తాన్ లాంటి దేశాలు కరెంట్ కోతలను అనుభవిస్తున్నాయి. కంప్యూటర్ ఫామ్లకు నెలవైన కజకిస్తాన్లో ఇప్పుడు పట్టుమని నాలుగైదు గంటల సేపు కూడా పవర్ ఉండడం లేదు. దీనికితోడు ఏర్పడిన కోతలను అధిగమించేందుకు రష్యా నుంచి అధిక ధరలు చెల్లించి విద్యుత్ను కొనుగోలు చేస్తోంది కజకిస్తాన్. ఊహించని పరిణామాల నడుమ నష్టనివారణ చర్యలు చేపట్టింది కజకిస్తాన్ ప్రభుత్వం. 2022 జనవరి నుంచి క్రిప్టోమైనింగ్కు అవసరమైన విద్యుత్ సప్లయ్కి కఠిన నిబంధనలను విధించబోతోంది. రేషన్ విధానంలో క్రిప్టో మైనర్లకు విద్యుత్ అందిస్తామని కజకిస్తాన్ గ్రిడ్ ఆపరేటర్ స్పష్టం చేసింది.ఒక్క కజకిస్తాన్ మాత్రమే కాదు.. ముప్ఫైకి పైగా దేశాలు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. క్లిక్ చేయండి: తెలివైన అడుగు.. అగ్నిపర్వతాల నుంచి బిట్కాయిన్ల తయారీ -
FIFA World Cup 2022: ఫ్రాన్స్ అర్హత.. బెల్జియం, క్రొయేషియా కూడా
FIFA World Cup 2022: France Qualified For Tourney After Beat Kazakhstan: వచ్చే ఏడాది ఖతర్లో జరిగే ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్కు డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ జట్టు అర్హత సాధించింది. ఫ్రాన్స్తోపాటు ప్రపంచ నంబర్వన్ బెల్జియం, 2018 ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా జట్టు కూడా ఈ మెగా ఈవెంట్కు బెర్త్లను ఖరారు చేసుకున్నాయి. యూరోప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భాగంగా ఫ్రాన్స్ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రపంచకప్ బెర్త్ దక్కించుకుంది. కజకిస్తాన్తో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్లో ఫ్రాన్స్ 8–0తో ఘనవిజయం సాధించింది. ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియాన్ ఎంబాపె ఏకంగా నాలుగు గోల్స్ చేయగా... కరీమ్ బెంజెమా రెండు గోల్స్... రాబియోట్, గ్రీజ్మన్ ఒక్కో గోల్ సాధించారు. గ్రూప్ ‘డి’లో ఏడు మ్యాచ్లు ఆడిన ఫ్రాన్స్ నాలుగు విజయాలు, మూడు ‘డ్రా’లతో 15 పాయింట్లు సాధించి గ్రూప్ విజేత హోదాలో ప్రపంచకప్కు అర్హత పొందింది. గ్రూప్ ‘ఇ’లో ఎస్తోనియాతో జరిగిన మ్యాచ్లో బెల్జియం 3–1తో నెగ్గింది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించిన బెల్జియం 19 పాయింట్లతో గ్రూప్ ‘ఇ’ విజేతగా అర్హత పొందింది. గ్రూప్ ‘హెచ్’లో క్రొయేషియా 23 పాయింట్లతో టాపర్గా నిలిచి బెర్త్ దక్కించుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో క్రొయేషియా 1–0తో రష్యాను ఓడించింది. రష్యా ప్లేయర్ కుద్రయెశోవ్ 81వ నిమిషంలో సెల్ఫ్ గోల్ చేసి క్రొయేషియాను గెలిపించాడు. 32 జట్లు పాల్గొనే 2022–ప్రపంచకప్ టోరీ్నకి ఇప్పటివరకు ఆతిథ్య ఖతర్ జట్టుతోపాటు జర్మనీ, డెన్మార్క్, బ్రెజిల్, బెల్జియం, ఫ్రాన్స్, క్రొయేషియా అర్హత పొందాయి. -
భారత్, కజకిస్తాన్ క్వార్టర్స్ తొలి మ్యాచ్ ‘డ్రా’
సిట్గెస్ (స్పెయిన్): ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్షిప్లో భాగంగా గురువారం కజకిస్తాన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ తొలి మ్యాచ్ను భారత్ 2–2తో ‘డ్రా’గా ముగించింది. జన్సయ అబ్దుమాలిక్తో జరిగిన గేమ్ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక 80 ఎత్తుల్లో... దినార సదువాకసోవాతో గేమ్ను ఆర్ వైశాలి 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. అనంతరం భక్తి కులకర్ణి 52 ఎత్తుల్లో కమలిదెనోవా చేతిలో ఓడింది. చివరగా జరిగిన గేమ్లో మేరీఆన్ గోమ్స్ 85 ఎత్తుల్లో గుల్మిరాపై నెగ్గడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. చదవండి: టీ20 ప్రపంచకప్లో భారత తుది జట్టులో అతడికి చోటు దక్కకపోవచ్చు.. -
తెలంగాణ కుర్రాడు.. స్నేహిత్ ఖాతాలో రెండు పతకాలు
సాక్షి, హైదరాబాద్: కజకిస్తాన్ ఓపెన్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ కుర్రాడు సూరావజ్జుల స్నేహిత్ పురుషుల సింగిల్స్ విభాగంలో రజతం... డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 6–11, 9–11, 3–11, 11–9, 6–11తో 46వ ర్యాంకర్ కిరిల్ జెరాసిమెంకో (కజకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశాడు. డబుల్స్ సెమీఫైల్లో స్నేహిత్–సుదాన్షు గ్రోవర్ (భారత్) జోడీ 11–8, 2–11, 6–11, 12–10, 5–11తో జెరాసిమెంకో–అలెన్ (కజకిస్తాన్) జంట చేతిలో ఓడి కాంస్య పతకం దక్కించుకుంది. చదవండి: RCB Vs KKR: కోహ్లి డబుల్ సెంచరీ.. ఆర్సీబీ కెప్టెన్ ఖాతాలో మరో రికార్డు -
ఆర్చర్లు అద్భుతం చేసేనా?
టోక్యో ఒలింపిక్స్ క్రీడల మూడో రోజు తొమ్మిది క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే మూడింటిలో (ఆర్చరీ, షూటింగ్, ఫెన్సింగ్) మాత్రమే మనోళ్లు పతకాల కోసం పోటీపడనున్నారు. పురుషుల ఆర్చరీ టీమ్ విభాగంలో అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్దీప్ రాయ్లతో కూడిన భారత బృందం తొలి రౌండ్లో కజకిస్తాన్తో ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా జట్టుతో టీమిండియా ఆడాల్సి ఉంటుంది. 1988 సియోల్ ఒలింపిక్స్లో తొలిసారి టీమ్ ఈవెంట్ మొదలయ్యాక దక్షిణ కొరియా పురుషుల జట్టు ఐదుసార్లు స్వర్ణ పతకం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో కొరియాపై భారత్ అద్భుతం చేస్తే సెమీఫైనల్ చేరుకొని కాంస్య పతకం రేసులో నిలుస్తుంది. పురుషుల టీమ్ విభాగం తొలి రౌండ్: భారత్ x కజకిస్తాన్ (ఉదయం గం. 6 నుంచి) -
కజకిస్తాన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్ : ఉన్నత విద్య కోసం కజకిస్తాన్ వెళ్లిన తెలంగాణ విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. కరోనా కారణంగా యూనివర్సిటీలు తాత్కాలికంగా యూసివేయడంతో తిరిగి సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే తెలుగు విద్యార్థులకు రవాణా సదుపాయాలు లేకపోడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కజకిస్తాన్లోని ఓ ఏజెన్సీ తెలంగాణకు పంపిస్తామని తమ వద్ద 45 వేల రూపాయలు కట్టించుకొని తర్వాత తమకు ఎలాంటి రవాణా సదుపాయం కల్పించలేదని మెడికల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమను సొంత రాష్ట్రానికి తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నత చదువులు అభ్యసించేందుకు 300 మంది విద్యార్థులు కజకిస్తాన్కు వెళ్లారు. కజకిస్తాన్ ఎయిర్పోర్టు వద్ద ఏషియన్ మెడికల్ ఇనిస్టిట్యూట్కు చెందిన తెలంగాణ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. (టిక్టాక్ అవుట్; స్వదేశీ పరిజ్ఞానంతో ‘పాప్-ఇన్’ యాప్) చైనా హెచ్చరికలు.. ఖండించిన కజకిస్థాన్! అమెరికాలోని తెలుగు విద్యార్థులకు ప్రభుత్వ అండ -
చైనా హెచ్చరికలు.. ఖండించిన కజకిస్థాన్!
నూర్ సుల్తాన్/బీజింగ్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ చైనా మరో బాంబు పేల్చింది. సరిహద్దు దేశం కజకిస్థాన్లో అంతుపట్టని వ్యాధితో వందలాది మంది మృత్యువాత పడుతున్నందున జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. గుర్తుతెలియని వైరస్ సోకి న్యుమోనియాతో గత నెలలో దాదాపు 600 మంది మరణించినట్లు వెల్లడించింది. కోవిడ్-19 కంటే అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ దేశంలో నివసిస్తున్న చైనీయులను హెచ్చరించింది. (భయపెట్టే వార్త చెప్పిన చైనా!) ఈ మేరకు.. ‘‘కజకిస్థాన్లో ప్రాణాంతక కరోనా వైరస్ కంటే అంతుపట్టని న్యుమోనియాతో సంభవిస్తున్న మరణాలే ఎక్కువగా ఉన్నాయి. గత ఆర్నెళ్లుగా 1772 మంది మరణించారు. ఒక్క జూన్ నెలలోనే 628 మంది మృతి చెందారు. ఇందులో చైనీయులు కూడా ఉన్నారు. ఈ దేశ వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వైరస్ ఆనవాలును కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంతరకు దానిని గుర్తించలేకపోయారు. అందరూ జాగ్రత్తగా ఉండండి’’అని కజకిస్థాన్లోని చైనా రాయబార కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. (కరోనాతో మరో ముప్పు) ఖండించిన కజకిస్థాన్ ఈ విషయంపై స్పందించిన కజికిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. చైనా మీడియాలో ప్రచారమవుతున్న వార్తలు వట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. ఈ మేరకు శుక్రవారం.. ‘‘కజకిస్థాన్లో సరికొత్త రకమైన న్యూమోనియా ప్రబలుతోందని కొన్ని చైనా మీడియా సంస్థలు ప్రచురించిన సమాచారం సరైంది కాదు’’అని ఓ ప్రకటన విడుదల చేసింది. బాక్టీరియా, ఫంగల్, వైరల్ న్యూమోనియా కేసులు నమోదవుతున్నాయని.. తాము ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనాపై విమర్శలు కొనసాగుతుండగా.. కజకిస్థాన్లో కోవిడ్-19తో అనారోగ్యం బారిన పడిన వారి కంటే.. గుర్తు తెలియని వైరస్ కారణంగా మరణించేవారే ఎక్కువగా ఉన్నారంటూ డ్రాగన్ మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. చైనా ఎంబసీ హెచ్చరికలపై కజకిస్థాన్ విదేశాంగ మంత్రిని వివరణ కోరగా వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదని పేర్కొంది. కాగా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కజకిస్థాన్లో మార్చి 16న లాక్డౌన్ విధించగా.. మే నెలలో నిబంధనల్లో భారీ సడలింపులు ఇచ్చారు. ఈ క్రమంలో మరోసారి కేసుల సంఖ్య పెరగడంతో దేశంలో సెకండ్ వేవ్ మొదలైందని కజకిస్థాన్ అధ్యక్షుడు కసీం- జొమార్ట్ తోకాయేవ్ పేర్కొనడం గమనార్హం. -
కజకిస్తాన్తో భారత్ తొలి పోరు
మనీలా (ఫిలిప్పీన్స్): కరోనా వైరస్ భయాందోళనల్ని పక్కనబెట్టి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు భారత పురుషుల జట్టు సిద్ధమైంది. ఈ ఈవెంట్లో భారత్ పూర్తిస్థాయి జట్టుతో తలపడనుంది. ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య విజేత భమిడిపాటి సాయిప్రణీత్, హెచ్.ఎస్.ప్రణయ్, శుభాంకర్ డే, లక్ష్యసేన్లు ఒలింపిక్ ఏడాది సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. నాలుగేళ్ల క్రితం 2016లో భారత పురుషుల జట్టు కాంస్యం నెగ్గింది. ఇప్పుడు ఈ పతకం వన్నె మార్చాలనే లక్ష్యంతో ఆటగాళ్లు పోటీ పడనున్నారు. ముందుగా భారత్కు క్లిష్టమైన డ్రా ఎదురైంది. రెండు సార్లు చాంపియన్ అయిన ఇండోనేసియా, ఫిలిప్పీన్స్లతో కలిసి గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత్ కరోనా పుణ్యమాని ఇప్పుడు మలేసియా, కజకిస్తాన్లతో గ్రూప్ ‘బి’కి మారింది. వైరస్ ప్రభావమున్న చైనా, హాంకాంగ్లను ఫిలిప్పీన్స్ ప్రభుత్వం నిషేధించడంతో ‘డ్రా’ షెడ్యూలును మార్చారు. బ్యాడ్మింటన్లో కజకిస్తాన్ కష్టమైన ప్రత్యర్థి కాదు. దీంతో ఈ జట్టుతో మంగళవారం జరిగే పోరులో భారత్ గెలుపు ఖాయమవుతుంది. అయితే గురువారం మలేసియాతోనే భారత్కు కష్టాలు తప్పవు. ఆ జట్టులో ప్రపంచ 14వ ర్యాంకర్ లీ జి జియా, 2014 యూత్ ఒలింపిక్స్ చాంపియన్ చీమ్ జున్ వీ, ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో మూడుసార్లు రన్నరప్ అయిన హవ్ లియాంగ్ జున్లు ఉండటంతో భారత్ చెమటోడ్చాల్సిన అవసరముంది. కాగా... ప్రాణాంతక వైరస్ భయంతో భారత మహిళల జట్టు ఈ టోర్నీకి దూరమైంది. ఇకపై ఆకర్షణీయంగా ‘బాయ్’ టోర్నీలు న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీలను మరింత రసవత్తరంగా, ఆకర్షణీయంగా నిర్వహించేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సిద్ధమవుతోంది. మ్యాచ్ల్లో పోటీ పెంచేందుకు కేటగిరీల వారీగా నిర్వహిస్తుంది. అలాగే ప్రైజ్మనీని కూడా భారీగా పెంచింది. మొత్తం రూ. 2 కోట్ల ప్రైజ్మనీతో ఏడాది పొడవునా మూడు దశల్లో బాయ్ ఈవెంట్లు జరుగనున్నాయి. లెవెల్ 1, 2, 3 టోర్నీలు నిర్వహించాలని బాయ్ ఆదివారం జరిగిన ఎగ్జిక్యూటీవ్ కమిటీలో నిర్ణయించింది. సీనియర్ కేటగిరీలో ‘బాయ్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీ’ని లెవెల్ 1 స్థాయిలో నిర్వహిస్తారు. లెవెల్ 2లో నాలుగు ‘బాయ్ సూపర్ సిరీస్ టోర్నీలు’ జరుగుతాయి. ఇక లెవెల్ 3లో ఆరు ‘బాయ్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ’లను నిర్వహిస్తారు. మేటి ర్యాంకింగ్ల ఆధారంగా ఆయా టోర్నీల్లో నేరుగా మెయిన్ డ్రా ఆడే అవకాశం కల్పిస్తారు. అగ్రశ్రేణి క్రీడాకారులు జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొనేందుకు ముందుగా రావాలనేది కూడా కొత్త ప్రణాళికలో భాగం. -
కజకిస్థాన్లో విమాన ప్రమాదం
అల్మేటీ: కజకిస్తాన్లో శుక్రవారం జరిగిన ఒక విమాన ప్రమాదంలో 12 మంది మరణించారు. దేశంలోని అతిపెద్ద నగరం అల్మేటీ నుంచి ఉదయం ఏడు గంటల ప్రాంతంలో సుమారు వంద మందితో టేకాఫ్ తీసుకున్న విమానం ఆ తరువాత కొద్దిసేపటికే కూలిపోయింది. బెక్ ఎయిర్ అనే విమానయాన సంస్థకు చెందిన ఈ విమానం రాజధాని నూర్ సుల్తాన్కు వెళ్లాల్సి ఉంది. అయితే టేకాఫ్ తరువాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే విమానం రాడార్లో కనిపించకుండా పోయిందని, అల్మేటీ సరిహద్దుల్లోని ఓ రెండంతస్తుల భవనంపై కూలిపోయిందని విమానాశ్రయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విమానం కూలిపోయిన ధాటికి విమానం రెండు ముక్కలైందని, ప్రాణాలతో ఉన్న వారిని శకలాల నుంచి వెలికి తీసేందుకు సహాయక బృందాలు పనిచేస్తున్నాయని వివరించింది. విమానంలో మొత్తం 95 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉండగా కెప్టెన్తోపాటు 11 మంది మరణించినట్లు ఆ ప్రకటన వివరించింది. ఈ దుర్ఘటనలో 53 మంది గాయపడ్డారని, వీరిలో తొమ్మిది మంది పిల్లలూ ఉన్నారని తెలిపింది, ఘటనపై విచారణ జరపడంతోపాటు, బెక్ ఎయిర్ సంస్థ వాడుతున్న ఫొక్కర్ మోడల్ విమానాలపై కజకిస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. విమానం టేకాఫ్ తీసుకునే సమయంలోనే దాని తోకభాగం రన్వేను రెండుసార్లు తాకిందని, ఇది పైలట్ తప్పిదమా? లేదా సాంకేతికపరమైన సమస్య? అన్నది తేల్చాల్సి ఉందని ఉప ప్రధాని స్కైలార్ చెప్పారు. -
కజికిస్ధాన్లో కూలిన విమానం
-
టేకాఫ్ అవుతుండగానే ఘోర ప్రమాదం
నూర్ సుల్తాన్ : కజకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఆల్మటీ ఎయిర్పోర్ట్ నుంచి టెకాఫ్ అవుతున్న సమయంలోనే విమానం అదుపు తప్పి కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 95 మంది ప్రయాణికులతో పాటు, 5గురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 9 మంది మృతి చెందినట్టుగా అధికారులు ధ్రువీకరించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం కజకిస్తాన్లోని ప్రధాన నగరం ఆల్మటీ నుంచి రాజధాని నూర్ సుల్తాన్కు బెక్ ఎయిర్కు చెందిన విమానం బయలుదేరింది. అయితే టేకాఫ్ అవుతున్న సమయంలోనే విమానం గ్రౌండ్ కంట్రోల్తో సంబంధాలు కొల్పోయింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే రెండతస్తుల బిల్డింగ్ను ఢీ కొట్టింది. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన భద్రత సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 9 మంది చనిపోగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై కజకిస్తాన్ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. -
హైదరాబాద్లో కజికిస్తాన్ కాన్సులేట్
సాక్షి, హైదరాబాద్: కజికిస్తాన్ దేశానికి సంబంధించిన కాన్సులేట్ కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆ దేశ రాయబారి యెర్లాన్ అలింబాయేవ్ వెల్లడించారు. ఎంఏకే ప్రాజెక్ట్స్ ఎండీ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ను గౌరవ కాన్సూల్ జనరల్గా నియమించనున్నట్లు తెలిపారు. గురువారం నగరాన్ని తొలిసారిగా సందర్శించిన ఆయన గవర్నర్ తమిళిసైతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భేటీలో రాష్ట్రంతో సంబంధాలను మరింత మెరుగుపర్చేందుకు గల అవకాశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. తొలుత నగరంలోని పార్క్ హోటల్లో విలేకరులతో యెర్లాన్ మాట్లాడుతూ.. కజికిస్తాన్తో వాణిజ్య సంబంధాలు పెంపొందించడానికి తెలంగాణ, ఏపీలకు అపార అవకాశాలున్నాయన్నారు. గనులు, ఆయిల్ రిఫైనరీ, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ యంత్రాల ఉత్పత్తిలో భారత్ నుంచి పెట్టుబడులను ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని రాంకీ గ్రూప్ చైర్మన్ అయోధ్య రామిరెడ్డి, రెడ్డీ ల్యాబ్ సీఈవో జీవీ ప్రసాద్, సినీ నిర్మాత అల్లు అరవింద్, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డిలతో సమావేశమైనట్టు తెలిపారు. ఈ సమావేశంలో అలీఖాన్, కజక్ ఇన్వెస్ట్ కంపెనీ ప్రాంతీయ డైరెక్టర్ అయిగుల్ సురాలినా తదితరులు పాల్గొన్నారు. -
డేవిస్ కప్ పోరు: భారత్ x పాకిస్తాన్
అంతర్జాతీయ క్రీడా వేదికపై ఎక్కడైనా భారత్, పాకిస్తాన్ మధ్య పోరు అంటే అమితాసక్తి రేగడం సహజం. ఇప్పుడు ఈ రెండు జట్లు టెన్నిస్ కోర్టులో సమరానికి సన్నద్ధమయ్యాయి. ప్రతిష్టాత్మక డేవిస్ కప్ మ్యాచ్ సమరంలో దాయాదులు తలపడబోతున్నాయి. ఈ పోరుకు తటస్థ వేదికగా కజకిస్తాన్లోని నూర్–సుల్తాన్ను ఎంపిక చేశారు. మ్యాచ్లు ఇండోర్లోనే జరుగుతున్నా... దాదాపు మైనస్ 20 డిగ్రీల వరకు ఉంటున్న స్థానిక ఉష్ణోగ్రతతో కూడా ఆటగాళ్లు పోరాడాల్సి వస్తోంది. నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్ 1 పోరులో భాగంగా నేటినుంచి జరిగే సమరంలో పాకిస్తాన్తో భారత్ తలపడుతోంది. తొలి రోజు రెండు సింగిల్స్ మ్యాచ్లు, శనివారం డబుల్స్తో పాటు రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఒక వేళ ఏదైనా జట్టు 3–0తో ఆధిక్యం సాధించినా నాలుగో మ్యాచ్ కూడా జరుగుతుంది. ఐదో మ్యాచ్ను మాత్రం ఆడకుండా తప్పుకునేందుకు రెండు జట్లకు అవకాశం ఉంది. నిజానికి ఈ మ్యాచ్ వేదిక పాకిస్తాన్లోని ఇస్లామాబాద్. అయితే ఇరు దేశాల మధ్య సరైన సంబంధాలు లేని కారణంగా పాక్లో పర్యటించేందుకు భారత్ తిరస్కరించింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో వేదికను కజకిస్తాన్కు మార్చాల్సి వచ్చింది. ఈ పోరులో విజయం సాధించిన జట్టు మార్చి 2020లో జరిగే వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్కు అర్హత సాధించి క్రొయేషియాతో తలపడుతుంది. భారత్కు ఎదురుందా! అనుభవం, తాజా ఫామ్వంటివి చూసుకుంటే పాకిస్తాన్కంటే భారత జట్టు ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. పేస్లాంటి సీనియర్, నాగల్, రామ్కుమార్లాంటి యువ ఆటగాళ్లు గ్రాండ్స్లామ్ టోర్నీలలో చెలరేగుతుంటే పాక్ ఆటగాళ్ల ప్రదర్శన ఐటీఎఫ్ ఫ్యూచర్స్ స్థాయి టోర్నీలకే పరిమితమవుతోంది. 46 ఏళ్ల వయసులో మరో సారి డేవిస్ కప్లో సత్తా చాటేందుకు పేస్ సిద్ధమవుతుండటం విశేషం. జీవన్ నెడుంజెళియన్తో కలిసి అతను బరిలోకి దిగుతున్నాడు. నాగల్, రామ్కుమార్ సింగిల్స్ భారం మోస్తారు. గతంలో రెండు డేవిస్ కప్ మ్యాచ్లలోనూ ఓడిన నాగల్ సింగిల్స్లో ఈ సారి బోణీ చేసే అవకాశం ఉంది. ఐసాముల్ హక్ ఖురేషీ, అఖీల్ ఖాన్లాంటి ఆటగాళ్లతో పాకిస్తాన్ జట్టు డబుల్స్లో కొంత పటిష్టంగా కనిపించింది. కానీ స్వదేశంనుంచి మ్యాచ్ను మార్చినందుకు నిరసనగా వీరిద్దరు తప్పుకోవడంతో ఆ జట్టు మరింత బలహీన పడింది. తొలి సింగిల్స్లో రామ్కుమార్తో తలపడనున్న 17 ఏళ్ల షోయబ్ కనీసం ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ మెయిన్ డ్రాలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. చలి తాకిడికి... నూర్–సుల్తాన్లో ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్ 20 డిగ్రీలకు చేరడంతో డేవిస్ కప్ మ్యాచ్ ఇండోర్ హార్డ్ కోర్టులో నిర్వహిస్తున్నారు. అందులోనూ ప్రత్యేకంగా వేడి హీటర్లు ఏర్పాటు చేశారు. అయితే బయటి వాతావరణం కూడా ఆటగాళ్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉండటంతో భారత్ పలు జాగ్రత్తలు తీసుకుంది. ప్రత్యేకంగా రూపొందించిన జాకెట్లను ఆటగాళ్లకు అందజేయడంతో పాటు తొలిసారి ఇద్దరు ఫిజియోలు జట్టుతో పాటు ప్రయాణిస్తున్నారు. -
సెల్ఫోన్ పేలి బాలిక మృతి
కజకిస్తాన్ : సేల్ఫోన్ పేలి 14ఏళ్ల బాలిక మృతి చెందింది. రాత్రంతా ఫోన్కు చార్జింగ్ పెట్టి ఉండటంతో బ్యాటరీ హీట్ అయ్యి పేలింది. ఈ ఘటన కజకిస్తాన్లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. కజకిస్తాన్లోని బాస్టోబల్ అనే గ్రామానికి చెందిన అలువా అసెట్కిజీ అబ్జల్బెక్(14) రాత్రి పడుకునే ముందు ఫోన్లో పాటలు విని.. ఆ తర్వాత ఫోన్కి చార్జీంగ్ పెట్టి తల దగ్గర పెట్టుకుని పడుకుంది. దీంతో రాత్రి సమయంలో ఫోన్ పేలడంతో బాలిక తలకు బలంగా గాయాలై చనిపోయింది. అయితే ఆ సమయంలో ఫోన్ చార్జీంగ్ పెట్టడంతో బ్యాటరీ వేడెక్కడంతో ఫోన్ పేలి బాలిక మరణించినట్లు ఫొరేన్సిక్ అధికారులు వెల్లడించారు. -
తాగి.. జిరాఫీతో గేమ్స్.. తగిన శాస్తి జరిగింది!
-
తాగి.. జిరాఫీతో గేమ్స్.. తగిన శాస్తి జరిగింది!
ఎవరైనా జూపార్కుకు వెళితే.. అక్కడి జంతువులను చూసి.. వాటితో కాసేపు సరదాగా గడిపి వస్తారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం తాగిన మైకంలో జూపార్కులో హల్చల్ చేశాడు. జిరాఫీ ఉన్న బోను దగ్గరికి వెళ్లి.. అది ఫెన్సింగ్ సమీపంలోకి రాగానే.. అమాంతం దానిపైకెక్కి కూర్చొని.. కాసేపు అటు-ఇటు స్వారీ చేశాడు. మొదటిసారి జిరాఫీ కొంచెం మృదువుగా వ్యవహరించి.. అతన్ని కిందికి విదిలించింది. అయినా, తాగిన మైకంలో ఉన్న సదరు వ్యక్తికి జిరాఫీపై మీద ఊరేగాలన్నా కోరిక తీరలేదేమో.. ఫెన్సింగ్ సాయంతో మరోసారి ఇదే దుస్సాహసానికి అతడు ఒడిగట్టాడు. జిరాఫీ మీద కూర్చొని.. స్వారీ చేయాలని చూశాడు. ఈసారి జిరాఫీ సదరు వ్యక్తిని గట్టిగా విదిలించి దభేల్న పడేలా చేసింది. దెబ్బకు మైకం నుంచి తేరుకున్న ఆ ఆకతాయి.. బతుకు జీవుడా అనుకుంటూ.. ఫెన్సింగ్ను ఎక్కి అక్కడినుంచి బయటపడ్డారు. ఒకింత సరదాగా, మరొకింత వికృతంగా ఉన్న ఈ ఘటన కజకిస్థాన్లోని స్కైమెట్ జూలో చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ జూలో జిరాఫీపై స్వారీ చేసేందుకు ప్రయత్నించి.. ఆకతాయి కిందపడిపోయిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సదరు దుండగుడిని పట్టుకొని తగిన శాస్తి చేసేందుకు ఇటు జూ అధికారులూ ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. -
శివ థాపా పసిడి పంచ్
నూర్ సుల్తాన్ (కజకిస్తాన్): 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బాక్సర్ శివ థాపా కజకిస్తాన్ ప్రెసిడెంట్స్ కప్ టోర్నీ చరిత్రలో భారత్కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. 63 కేజీల విభాగంలో శివ థాపా విజేతగా నిలిచాడు. అతనితో ఫైనల్లో తలపడాల్సిన ప్రత్యర్థి జకీర్ (కజకిస్తాన్) గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో శివ థాపాకు వాకోవర్ లభించింది. స్వర్ణం ఖాయమైంది. పురుషుల విభాగంలో భారత్కే చెందిన దుర్యోధన్ (69 కేజీలు) కాంస్యం, మహిళల విభాగంలో పర్వీన్ (60 కేజీలు) రజతం, సవీటి బొరా (75 కేజీలు) కాంస్యం సాధించారు. -
‘మమ్మీ’ చెప్పిన కథ.. కట్టుకథేనట...
ఈ ‘మమ్మీ’ చెప్పిన కథ.. కట్టుకథేనట. ఎలుగుబంటి దాడిలో గాయపడి.. దాని గుహలో నెలరోజులపాటు ఉండి.. మృత్యుంజయుడిలా బయటపడ్డాడంటూ అలెగ్జాండర్ అనే వ్యక్తి గురించి పాశ్చాత్య మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ‘నన్ను తర్వాత తినడానికి వీలుగా ఇక్కడ దాచి పెట్టి ఉంచింది’ అంటూ అతడు చెప్పాడని తెలిపాయి. అయితే.. అవన్నీ అబద్ధాలని కజకిస్థాన్కు చెందిన వైద్యుడు రుస్తుం ఇసేవ్ చెబుతున్నారు. ‘మమ్మీ’లా కనిపించిన అలెగ్జాండర్ అసలు ఫొటో ఇదిగో ఇదేనట. ఇతడు తీవ్రమైన సొరియాసిస్ వ్యాధితోపాటు ఇతర రుగ్మతలతో బాధపడుతున్నాడట. అందువల్లే అలా అయిపోయాడట. అలెగ్జాండర్ కజకిస్థాన్కు చెందినవాడని.. ప్రస్తుతం ఔట్ పేషెంట్ కింద తమ వద్ద చికిత్స తీసుకుంటున్నాడని రుస్తుం తెలిపారు. తమ కుమారుడిని ఎలుగుబంటి దాడి బాధితుడిగా చూపించడం.. మమ్మీ అనడం వంటి వాటి వల్ల అలెగ్జాండర్ తల్లి ఎంతో బాధపడుతున్నారని.. అతడి గురించి మరే వివరాలు వెల్లడించవద్దని తమను కోరారని వివరించారు. చదవండి: ‘మమ్మీ’ మనిషి కథలో కొత్త మలుపు! అలెగ్జాండర్ అసలు ఫొటో.. -
సగం ధరకే స్టెంట్లు
సాక్షి, హైదరాబాద్: గుండెజబ్బుల చికిత్స కోసం ఉపయోగించే స్టెంట్లు మరింత చౌక కానున్నాయి. నికెల్, టైటానియం డయాక్సైడ్ల మిశ్రమంతో తయారైన సరికొత్త స్టెంట్ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రక్షణ శాఖ సంస్థ మిధాని (మిశ్ర ధాతు నిగమ్) అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టెంట్ల ధరలో సగానికే కొత్తవి అందుబాటులోకి వస్తాయని, ప్రస్తుతం వీటిని ఓ మెడికల్ యూనివర్సిటీ పరీక్షిస్తున్నట్లు మిధాని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ లేఖీ తెలిపారు. ‘షేప్ మెమరీ అల్లాయ్’గా పిలిచే ఈ కొత్త లోహ మిశ్రమాన్ని కొన్ని నెలల కిందే అభివృద్ధి చేశామని చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే మరో ఏడాదిన్నరలో ఈ కొత్త స్టెంట్ అందుబాటులోకి రావొచ్చని చెప్పారు. స్టెయిన్లెస్ స్టీల్ కంటే ఎంతో మెరుగైన టైటానియం, ఇతర లోహాల తయారీలో ప్రఖ్యాతిగాంచిన మిధాని ఈ ఏడాది నుంచి బయో ఇంప్లాంట్స్ మార్కెటింగ్ రంగంలోకి అడుగుపెడుతోందని హైదరాబాద్లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. కృత్రిమ పళ్లు బిగించేందుకు అవసరమైన స్క్రూ మొదలుకొని, కృత్రిమ కీళ్లు, భుజాలు, మోకాలు చిప్ప, తుంటి ఎముకలను తాము చాలా కాలంగా తయారు చేస్తున్నామని, ఇప్పటివరకు వాటి మార్కెటింగ్కు ప్రయత్నాలు చేయలేదని చెప్పారు. హిందుస్తాన్ యాంటీ బయోటిక్స్ లిమిటెడ్తో బయో ఇంప్లాంట్స్ మార్కెటింగ్కు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. పరీక్షలు అవసరం.. టైటానియం, నికెల్ స్టెంట్ల గురించి మాట్లాడుతూ వీటి సామర్థ్యాన్ని ప్రపంచానికి నిరూపించేందుకు విస్తృత స్థాయిలో వందల మందితో పరీక్షలు నిర్వహించాల్సి ఉందని.. ఇందుకోసం మిలటరీ ఆసుపత్రులను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు దినేశ్ లేఖీ చెప్పారు. ఈ పరీక్షలు తమ దేశంలోనే నిర్వహించాలని ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కజకిస్తాన్ ప్రతిపాదించిందని, సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుని తగు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో బయో ఇంప్లాంట్స్ మార్కెటింగ్ ద్వారా రూ.100 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఏఎల్ చైర్మన్, ఎండీ నీరజా సరాఫ్ తదితరులు పాల్గొన్నారు. -
భారత్కు నిరాశ
అస్తానా (కజకిస్తాన్): ఫెడ్ కప్ వరల్డ్ గ్రూప్నకు అర్హత సాధించాలని ఆశించిన భారత మహిళల టెన్నిస్ జట్టుకు నిరాశ ఎదురైంది. కజకిస్తాన్తో శుక్రవారం జరిగిన ఆసియా–ఓసియానియా గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో భారత్ 0–3తో ఓడిపోయింది. తొలి సింగిల్స్లో కర్మన్కౌర్ 3–6, 2–6తో జరీనా దియాస్ చేతిలో ఓటమి చవిచూసింది. రెండో సింగిల్స్లో భారత నంబర్వన్ అంకిత రైనా 1–6, 6–7 (4/7)తో ప్రపంచ 43వ ర్యాంకర్ యులియా పుతిన్సెవా చేతిలో పరాజయం పాలైంది. దాంతో కజకిస్తాన్ విజయం ఖాయమైంది. నామమాత్రమైన డబుల్స్ మ్యాచ్లో రియా భాటియా–ప్రార్థన ద్వయం 1–6, 1–6తో అనా డానిలినా–గలీనా వొస్కోబొయేవా జంట చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం పరిపూర్ణమైంది. గ్రూప్ ‘ఎ’లో రెండు విజయాలో కజకిస్తాన్ ‘టాపర్’గా నిలిచింది. భారత్ రెండో స్థానంలో, థాయ్లాండ్ మూడో స్థానంలో నిలిచాయి. నేడు జరిగే 3–4 ప్లే ఆఫ్ స్థానా ల కోసం కొరియాతో భారత్ ఆడుతుంది. వరల్డ్ గ్రూప్ బెర్త్ కోసం కజకిస్తాన్, చైనా తలపడతాయి. -
రాకెట్ ప్రమాదం.. వ్యోమగాములు సేఫ్
న్యూయార్క్: ఇద్దరు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) తీసుకెళ్తున్న రష్యాకు చెందిన సూయజ్ రాకెట్ సాంకేతిక కారణాల వల్ల కజకిస్థాన్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా బయటపడ్డారని నాసా ఉన్నతాధికారి జిమ్ బ్రిడెన్స్టైన్ తెలిపారు. సూయజ్ రాకెట్లో రష్యాకు చెందిన వ్యోమగామి అలెక్సీ ఓవ్చినిన్, అమెరికా వ్యోమగామి నిక్ హగ్లు ప్రయాణిస్తుండగా రాకెట్ బూస్టర్లో సమస్య తలెత్తింది. దీంతో ఆ ఇద్దరు వ్యోమగాములు బాలిస్టిక్ డీసెంట్ మోడ్లో తిరిగి భూమిపైకి వచ్చినట్లు నాసా పేర్కొంది. సాధారణ ల్యాండింగ్ కంటే ఇది కాస్త వేగంగా జరిగే ల్యాండింగ్ అని నాసా తెలిపింది. సూయజ్ రాకెట్లో ఆరు గంటల పాటు ప్రయాణించి ఐఎస్ఎస్కు చేరాల్సి ఉంది. వీళ్లు ఆరు నెలల పాటు స్పేస్ స్టేషన్లో ఉండాల్సి ఉంది. ప్రస్తుతం వాళ్లు ల్యాండైన ప్రదేశానికి రెస్క్యూ టీమ్స్ వెళ్తున్నాయి. నాసా ట్విట్ చేసిన వీడియోలో రాకెట్ తన మార్గాన్ని మరల్చుకుని తిరిగి భూమివైపు రావడం కనిపిస్తోంది. LIFTOFF! Shooting into the sky at 4:40am ET, the Soyuz rocket carrying @AstroHague and Alexey Ovchinin leaves Earth on a four-orbit, six-hour journey to the @Space_Station. Watch: https://t.co/BjMDNrNorR pic.twitter.com/0Cfm0Uu2Jx — NASA (@NASA) October 11, 2018 .@NASA astronaut Nick Hague and Russian cosmonaut Alexey Ovchinin are in good condition following today's aborted launch. I’m grateful that everyone is safe. A thorough investigation into the cause of the incident will be conducted. Full statement below: pic.twitter.com/M76yisHaKF — Jim Bridenstine (@JimBridenstine) October 11, 2018 -
కజికిస్థాన్ అమ్మాయి.. విజయవాడ అబ్బాయి
సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్) : వారిద్దరు వేర్వేరు దేశాలకు చెందిన వారు.. అయితేనేం వారిని ప్రేమ ఒకటిగా చేసింది. కజికిస్థాన్కు చెందిన అమ్మాయి.. విజయవాడకు చెందిన అబ్బాయి బంధువుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఆది వారం ఒక్కటయ్యారు. నగరంలోని విజయకృష్ణా సూపర్ మార్కెట్ సమీపంలోని కల్యాణ మండపంలో వీరి వివాహం కనులపండువగా జరిగింది. విజయవాడ అయోధ్యనగర్కు చెందిన ఆలపాటి వెంకటదుర్గా ప్రసాద్ రెండేళ్ల క్రితం ఉద్యోగం నిమిత్తం కజికిస్థాన్ దేశంలోని షింకెన్ట్ పట్టణానికి వెళ్లాడు. అక్కడ ఒక కంపెనీలో డెప్యూటీ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే కంపెనీలో షింకెన్ట్ పట్టణానికి చెందిన యుస్పోవ్ షుక్రత్, దిల్పుజా దంపతుల కుమార్తె సాహిస్త హెచ్ఎస్సీ అడ్మినిస్ట్రేటర్గా విధులు నిర్వహిస్తోంది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. కజికిస్థాన్లో నిశ్చితార్థాన్ని జరిపించారు. ఆదివారం విజయవాడలో వివాహం చేసుకున్నారు. -
పోరాడి ఓడిన సాకేత్
అస్తానా: ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, భారత డేవిస్కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని పోరాటం ముగిసింది. కజకిస్తాన్లోని అస్తానాలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 4–6, 7–6 (12/10), 5–7తో డానియల్ బ్రాండ్స్ (జర్మనీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 2 గంటల 26 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్ 13 ఏస్లు సంధించడంతోపాటు తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయాడు. క్వార్టర్స్లో ఓడిన సాకేత్కు 3,650 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 2 లక్షల 50 వేలు)తోపాటు 18 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భారత్ శుభారంభం
జకార్తా: ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన టీమ్ ఈవెంట్ తొలి లీగ్ మ్యాచ్లో భారత్ 5–0తో కజకిస్తాన్ను చిత్తు చేసింది. గ్రూప్ ‘సి’లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో ఆకర్షి కశ్యప్ 21–5, 21–4తో ఇయా గోర్డెయెవా (కజకిస్తాన్)పై గెలిచి 1–0తో ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్గా జరిగిన పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ 21–15, 21–12తో దిమిత్రీ పనరిన్పై విజయం సాధించాడు. మహిళల డబుల్స్లో సిమ్రన్ సింఘి–రితిక ద్వయం 21–7, 21–8తో ఇయా గొర్డెయెవా–అయేషా జంటపై నెగ్గింది. పురుషుల డబుల్స్లో మన్జీత్ సింగ్–డింకూ సింగ్ జోడీ 21–5, 21–16తో అబ్దుల్లాయెవ్–తజిబుల్లాయెవ్ ద్వయంపై విజయం సాధించగా... చివరగా జరిగిన మిక్స్డ్ డబుల్స్లో సృష్టి జూపూడి–శ్రీ కృష్ణ సాయి జంట 21–7, 21–9తో దిమిత్రీ–అయేషా జుమాబెక్పై గెలిచి 5–0తో విజయాన్ని పరిపూర్ణం చేశారు. -
హైదరాబాద్లో కజాక్ ప్రొఫెసర్ల బృందం పర్యటన
సాక్షి, హైదరాబాద్ : విద్య, వైద్య రంగాల్లో పరస్పర సహకారం అందించుకునేందుకు భారత్, కజికిస్తాన్ ముందుకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ కజికిస్తాన్ ప్రెసిడెంట్ ఫ్రొఫెసర్ అల్హనోవ్, డైరెక్టర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పార్ట్నర్షిప్ ప్రొఫెసర్ అస్సన్తో కూడిన ప్రొఫెసర్ల బృందం సోమవారం హైదరాబాద్లో పర్యటించింది. వీరితో పాటు అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫ్ కజికిస్తాన్ భారత అధికార ప్రతినిధి డాక్టర్ బి.వవ్య సునీతరాజ్, నియో సీఈఓ డాక్టర్ బీవీకే రాజ్ ఉన్నారు. ఈ బృందం జేఎన్టీయూ హైదరాబాద్, ఉస్మానియా యూనిర్సిటీల వైస్ చాన్స్లర్లను అలాగే జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కలిసింది. కజికిస్తాన్లో మొత్తం 3 వేలమంది భారతీయ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తుండగా.. ఒక్క తెలంగాణ నుంచే 600 మంది వైద్య విద్యార్థులు ఉన్నారు. ఈ క్రమంలో వీరి కలయిక మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వీరి మధ్య వైద్య, విద్య ఆరోగ్య సంరక్షణకు సంబంధించి అనేక అంశాలు చర్చకు వచ్చాయి. కజాక్ లోని తెలంగాణ వైద్య విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని బృంద సభ్యులకు మంత్రి హామి ఇచ్చారు. అలాగే కజికిస్తాన్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తెలంగాణ విద్యార్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించే ఆలోచనలు కూడా చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని కజికిస్తాన్ రాజధాని ’ఆస్తానా‘ నగరంగా అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దేందుకు సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రంతో పాటు, జేఎన్టీయూలో వీసీ, ప్రొఫెసర్ ఎ.వేణుగోపాల్ రెడ్డి, ప్రిన్సిపల్స్, డైరెక్టర్లతో సమావేశమైన బృంద సభ్యులు. ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ, మేనేజ్ మెంట్ కోర్సుల్లో కజికిస్తాన్ లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు.. ఉస్మానియా తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు ప్రొఫెసర్ అల్హనోవో వెల్లడించారు. ఇందుకు ఉస్మానియా వీసీ, జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. అలాగే ఫ్యాకల్టీలను కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవాలనే నిర్ణయానికి కూడా వచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంతరిక్ష పరిశోధన కేంద్రమైన బైక నోర్ కాస్మోడ్రామ్ లో అధ్యయనం చేసేందుకు ఉస్మానియా అధ్యాపక బృందాన్ని కజికిస్తాన్ ప్రతినిధి బృందం ఆహ్వానించింది. -
అమ్మో.. అమ్మాయేనా..
2018 మిస్ వర్చ్యువల్ కజకిస్తాన్ అందాల పోటీ ఫైనలిస్ట్ అయిన ఈ పిల్లను చూసినోళ్లంతా ఇదే పాటేసున్నారు... అందమంటే.. అరినా అలియెవాదే అని అనేసుకున్నారు... అందాల కిరీటమూ ఆమెదేనని అందరికీ డప్పేసుకున్నారు.. ఈ పాటేసుకోడాలు.. అనేసుకోడాలు.. డప్పేసుకోడాలు మధ్య.. మనకు తెలియని మరో కథ ఉంది.. కింగ్ఖాన్ అన్నట్లు.. ‘అబీ పిక్చర్ బాకీ హై మేరే దోస్త్’ ఇంతకీ మనకు తెలియని ఆ స్టోరీ ఏంటంటే.. ఎలీ డయాగ్లెవ్(22).. ఓ మోడల్.. ఓ రోజు తన ఫ్రెండ్స్లో కాఫీ షాపులో కూర్చుని ఉండగా వాళ్ల మధ్య ఓ చర్చ.. ఒకప్పుడు మహిళలు తమ వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చేవారని.. ఇప్పుడంతా ట్రెండ్ ఎటు ఉంటే అటు పోతున్నారని ఎలీ అన్నాడు. ఫ్యాషనబుల్గా దుస్తులు ధరించడం, మేకప్ వేసుకుంటే చాలు తాము అందంగా ఉంటామని అనుకుంటున్నారని.. ప్రస్తుతమున్న ఆధునిక పద్ధతులతో ఓ మగాడు కూడా అందమైన మహిళగా మారిపోవచ్చని చెప్పాడు.. స్నేహితులు ఇతడి వాదనను వ్యతిరేకించారు. ఎలీ మాత్రం తన మాటే రైట్ అని నిరూపించాలనుకున్నాడు.. అంతే.. మేకప్ ఆర్టిస్టు సాయం తీసుకున్నాడు.. ఎలీ కాస్త.. అరినాగా మారిపోయాడు. వర్చ్యువల్ కజకిస్తాన్ అందాల పోటీలో భాగంగా ఆన్లైన్లో తన ఫొటోలను పెట్టాడు.. స్పందన అదిరిపోయింది.. ఫైనలిస్టుగా ఎంపికయ్యాడు.. తన మాట నెగ్గింది.. ఇక నిజం చెప్పాల్సిన టైమొచ్చింది.. దీంతో తాను అరినాను కాదని.. ఎలీ అంటూ ఓ వీడియో నెట్లో పోస్ట్ చేశాడు.. ‘కొంత మంది అమ్మాయిలు ఈ మధ్య బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఆ బాహ్య సౌందర్యాన్ని ఓ మగాడు కూడా సాధించగలడు. వ్యక్తిత్వం, అంతః సౌందర్యం అన్నవి అన్నింటికన్నా ముఖ్యం.. నా ఈ పని కొంతమందైనా అమ్మాయిలను ఆ దిశగా ఆలోచించేలా చేస్తుందని భావిస్తున్నాను’ అంటూ ఎలీ తన వీడియోలో పేర్కొన్నాడు.. మగాళ్ల పరిస్థితి ఏమైంది? ఓకే.. ఓకే.. అమ్మాయిలకు మెసేజీ ఇచ్చేశాడు సరిపోయింది.. మరి ఎలీని.. అరినా అనుకుని.. పిచ్చపిచ్చగా ఆరాధించేసిన మగాళ్ల పరిస్థితి ఏమైంది? ఏమవుతుంది? వాళ్లే సాంగ్ను కాస్త మార్చుకున్నారు.. శాడ్ ట్యూన్లో మళ్లీ పాటేసుకున్నారు.. అయ్యయ్యో.. బ్రహ్మయ్య.. అన్యాయం చేశావేమయ్యా.. ఈ బుల్లోడే.. బుల్లెమ్మనుకుని.. ఎంతగానో మోసపోయామయ్యా.. యా.. యా..యా.. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
-56 డిగ్రీలు.. గడ్డకట్టి ప్రాణాలు విడిచాయి..
కజకిస్థాన్, మధ్య ఆసియా : మధ్య ఆసియా దేశాలు చలికి గడ్డకట్టుకుపోతున్నాయి. ఆర్కిటిక్ ఖండం స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మధ్య ఆసియా దేశాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కజకిస్థాన్లో మంచు తీవ్రతకు జంతువులు గడ్డ కట్టి ప్రాణాలు విడిచాయి. ఈ హృదయవిదారక దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. మంచుదిబ్బలో కూరుకుపోయి గడ్డకట్టి మరణించిన కుక్క ఫెన్సింగ్ను దాటేందుకు ప్రయత్నించిన కుందేలు అందులో ఇరుక్కుపోయి చలి తీవ్రతకు గడ్డకట్టి మరణించింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయిన కుందేలును స్థానికులు ఫెన్సింగ్ నుంచి బయటకు తీశారు. అదే ప్రాంతంలో మంచు దిబ్బను దాటడానికి ప్రయత్నించిన శునకం కూడా దానిలో ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచింది. ప్రపంచంలోని అత్యంత శీతల ప్రదేశం ‘ఓమియాకాన్’ సైబీరియాలోనే ఉంది. ఇక్కడ శీతాకాలపు ఉష్ణోగ్రత -67 డిగ్రీలకు పడిపోతుంది. -
బస్సులో మంటలు : 52 మంది మృతి
-
బస్సులో మంటలు : 52 మంది దుర్మరణం
కజకిస్తాన్లో ఘోర బస్సు ప్రమాదం అలమటీ : కజకిస్తాన్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. నడుస్తున్న బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి 52 మంది మృతిచెందారు. కజకిస్తాన్లో అక్టావులోని ఇర్గిజ్ జిల్లాలో గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కజకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈమేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రమాదం నుంచి ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. బాధితులందరూ ఉజ్జేకిస్తాన్కు చెందినవారుగా సమాచారం. బస్సు రష్యాకు వెళ్తుండగా, లేదా రష్యా నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. -
నాకు కరాటే వచ్చు.. నేను కిక్ ఇస్తే అంతే..!
-
నాకు కరాటే వచ్చు.. నేను కిక్ ఇస్తే అంతే..!
ప్రయాణ సమయంలో ఓ ప్యాసింజర్కు అరుదైన అనుభవం ఎదురైంది. మద్యం సేవించి బస్సులో ప్రయాణిస్తున్న యువకుడిపై బామ్మ దాడికి దిగింది. ఈ సంఘటన కజికిస్తాన్లోని ఒక సిటీలో చోటుచేసుకుంది. బస్సులో ఉన్న మరో ప్రయాణికుడు ఈ ఘటనను మొబైల్ ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. వివరాలివి.. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను పరిశీలిస్తే.. వృద్ధురాలు హఠాత్తుగా ఆ యువకుడి చెంపపై కొట్టింది. కూర్చొన్న సీటులో నుంచి లేవమని అతనిపై గట్టిగా అరిచింది. ‘అంతటితో ఆగకుండా బస్సులో నుంచి వెళ్లిపోవాలని చెప్పింది. మద్యం సేవించిన వాళ్లు అంటే నాకు నచ్చదు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని’ అతడితో అన్నది. ఆ యువకుడు బామ్మ నుంచి దూరంగా వెళ్లుతూ.. ‘మీ చేతులను అదుపులో ఉంచుకోవాల’ని అన్నాడు. అతడి మాటలకు ఆమె కోపంతో మరింత రెచ్చిపోయింది. ఆ యువకుడిని వెనక్కి నెట్టి, కాళ్లతో కూడా తన్నింది. ‘నాకు కరాటే వచ్చు.. నేను కిక్ ఇస్తే అంతే సంగతి. నాకు మందు తాగే వాళ్లంటే ఇష్టం ఉండద'ని కేకలు వేసింది. పాపం ఆ యువకుడు బామ్మ దెబ్బకు భయపడి అక్కడి నుంచి వెళ్లి బస్సులోనే మరోవైపు కూర్చున్నాడు. -
రష్యా, కజకిస్తాన్లోనూ గెలుస్తారా?!
న్యూఢిల్లీ : కొంతకాలంగా సైలెంట్గా ఉన్న బీజేపీ ఫైర్బ్రాండ్ స్మృతి ఇరానీ తాజాగా మరోసారి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీకి ఈ మధ్య విపరీతంగా పెరుగుతున్న ఫాలోయింగ్పై ఆమె స్పందించారు. రాహుల్ గాంధీ తన ట్విటర్ అకౌంట్ నుంచి అధికంగా రీట్వీట్లు చేస్తుండడంతో ఫాలోవర్లు విపరీతంగా పెరుగుతున్నట్లు తాజాగా ఒక వార్తాసంస్థ పేర్కొంది. రాహుల్ గాంధీ అధికారిక ట్విటర్ అకౌంట్లో ఆటోమేటెడ్ బాట్లను ఉపయోగించడం వల్లే ఇది సామధ్యమవుతోందని సదరు వార్తా సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీ.. తాజాగా రాహుల్ గాంధీ రష్యా, కజకిస్తాన్లోనూ గెలిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఉందంటూ ట్వీట్ చేశారు. అంతేకాక రాహుల్ గాంధీకి ఫాలోవర్లు పెరగడంపైనా ఆమె స్పందించారు. రాహుల్ గాంధీ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో ఆటోమేటెడ్ బాబ్లను ఉపయోగించడం వల్లే.. ఫాలోవర్లు పెరిగారని సదరు సంస్థ తెలిపింది. అందువల్లే రాహుల్ గాంధీ అధికారిక ట్విటర్ ఖాతా ‘ఆఫీస్ఆఫ్ఆర్జీ’కి కజకిస్తాన్, రష్యా, ఇండోనేషియాల నుంచి రీ ట్వీట్లు వస్తున్నాయని.. వీటిని ఆటోమేటెడ్ బాట్స్ చేస్తున్నాయని ఆ వార్త సంస్థ తెలిపింది. దీనిపైనే స్మృతి ఇరానీ రాహుల్ గాంధీపై వ్యంగ్యంగా స్పందించారు. Perhaps @OfficeOfRG planning to sweep polls in Russia, Indonesia & Kazakhstan ?? #RahulWaveInKazakh https://t.co/xVanl2mKGh https://t.co/Yhl1oAGqOg — Smriti Z Irani (@smritiirani) October 21, 2017 -
హెలికాప్టర్ను దించి అడ్రస్ అడిగాడు!
-
కజికిస్తాన్లో తెలుగు విద్యార్థులకు చేదు అనుభవం
-
కజికిస్తాన్లో తెలుగు విద్యార్థులకు చేదు అనుభవం
కజికిస్తాన్లో ఎంబీబీఎస్ చేస్తున్న తెలుగు విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. కజికిస్తాన్లో ఎంబీబీఎస్ చేస్తూ మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని సెలవులకు ఇంటికి వచ్చిన తెలుగు విద్యార్థులు గురువారం తిరుగు పయనం అయ్యారు. అయితే వారిని యూనివర్శిటీ హాస్టళ్లోకి సిబ్బంది అనుమతించ లేదు. అడ్మిషన్ టైంలో కన్సల్టెన్సీ చెప్పిన ఫీజుకంటే రెట్టింపు చెల్లిస్తేనే లోపలికి అనుమతి అంటూ రాత్రి సమయం అని కూడా చూడకుండా యాజమాన్యం హాస్టల్ రూమ్లకు తాళాలు వేసింది. వర్షం కూడా కురవడంతో యూనివర్శిటీ బయటే చలిలో తెలుగు విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉదయం వరకైనా అనుమతి ఇవ్వాలని కోరినా, ఒప్పుకోకుండా దుర్భాషలాడారంటూ విద్యార్థులు(అబ్బాయిలు,అమ్మాయిలు) తమ తల్లిదండ్రులకు వాట్సాప్లో గోడువెల్లబోసుకున్నారు. పిల్లల మెసెజ్లతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, కజికిస్తాన్లో ఎంబీబీఎస్ లో చేర్పించిన ఎన్ఈఓ కన్సల్టెన్సీని సంప్రదించారు. అయితే వారు కూడా పట్టించుకోవటంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 200 మంది తెలుగు విద్యార్థులు ఎన్ఈఓ కన్సల్టేన్సీ ద్వారా గత ఏడాది కజకిస్తాన్లో ఎంబీబీఎస్లో చేరారు. ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చి దాదాపు 50 మంది తెలుగు విద్యార్థులు హైదరాబాద్ నుంచి కజకిస్తాన్కు తిరిగి వెళ్లారు. -
మాజీ ప్రధానికి జాబ్ ఆఫర్.. 314 కోట్ల శాలరీ!
సాధారణంగా ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయిన వారు ఏ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలో చేసుకుంటారు. లేదా రిటైరయి కాలక్షేపం చేస్తారు. కానీ బ్రెగ్జిట్ దెబ్బకు బ్రిటన్ ప్రధాని పదవిని కోల్పోయిన డేవిడ్ కామెరాన్ ఒక్కసారిగా ఖాళీగా మారిపోయారు. ఎంపీగా కొనసాగాలని, వచ్చే ఏడాది కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నప్పటికీ.. ఆయనకు మాత్రం ఇతర జాప్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అందులో ఒకింత వికృతమైన, విస్మయం కలిగించే ఆఫర్ ఆయనకు వచ్చింది. తమ దేశ 'సుల్తాన్'గా ఉండాలని, అందుకు ఏడాదికి 32మిలియన్ పౌండ్లు (రూ. 314,49 కోట్లు) జీతం ఇస్తామని కజికిస్థాన్ ఆఫర్ చేసింది. అయితే, ఈ పదవికి అర్హుడిగా మారాలంటే ముస్లింల మాదిరిగా 'సుంతి' చేయించుకోవాలని సూచించింది. ఈమేరకు నేరుగా కామెరాన్ కార్యాలయానికి జాబ్ ఆఫర్ను పంపించడం గమనార్హం. ముస్లిం యూనియన్ అయిన కజకిస్తాన్ ఇలాంటి వ్యంగ్య ప్రహసనాలతో గతంలోనూ వార్తల్లో నిలిచింది. కజకిస్తాన్ నియంత పాలకుడు మురాత్ తెలిబెకోవ్ గతంలోనూ ఇలాంటి వ్యంగ్యోక్తులతో మీడియా దృష్టిని ఆకర్షించారు. దేశాధ్యక్షుడి వయస్సు 80 ఏళ్లు దాటితే ఉరితీయాలని, లంచాన్ని చట్టబద్ధం చేయాలంటూ 76 ఏళ్ల తెలిబెకోవ్ గతంలో పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుతం ఎంపీగా కామెరాన్ అందుకుంటున్న వేతనం 74వేల పౌండ్లు మాత్రమే కాబట్టి ఆయన ఈ జాబ్ చేపడితే బాగుంటుందని ఆయన ప్రత్యర్థులు ఛలోక్తులు విసురుతున్నారు. -
అస్థానా తరహాలో అమరావతి
- రాజధాని నిర్మాణంలో మార్పులు - వాణిజ్య, సర్కారు జోన్లో గృహ సముదాయాలు - కజికిస్థాన్ పర్యటన అనంతరం సీఎం ఆలోచనలు సాక్షి, హైదరాబాద్ : కజకిస్తాన్ రాజధాని అస్థానా తరహాలో ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఏ రంగానికి కేటాయించిన జోన్లో ఆ నిర్మాణాలే జరగాలనే నిబంధనల్లో కొంతమేర సడలింపులు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ జోన్లో ఇతర కార్యకలాపాలకు అనుమతించకూడదని ఇప్పటివరకూ భావించారు. అలా చేయడం వల్ల ప్రభుత్వ కార్యాలయాల సమయం ముగిసిన తరువాత ఆ ప్రాంతంలో జన సంచారం లేకపోవడమే కాకుండా ఎలాంటి కార్యకలాపాలకు అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల జోన్ పరిధిలో కొంతభాగం గృహ సముదాయాలకు అనుమతించాలని, అలాగే మరికొంత భాగంలో వాణిజ్య సముదాయాలకు అనుమతించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే వాణిజ్య జోన్లో ఇతర కార్యకలాపాలకు, నివాసాలకు అనుమతించకూడదనే ఆలోచనను మార్చుకుం టున్నట్లు వెల్లడించారు. వాణిజ్య జోన్లోనూ నివాస సముదాయాలకు కొంతమేర అనుమతించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భూగర్భ పార్కింగ్ వసతి అస్థానాలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో ఒక భవనం నుంచి మరో భవనానికి నడిచి వెళ్లేందుకు కారిడార్లు ఉన్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారు. అమరావతిలోకూడా ఇదే తరహా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. అక్కడ అంతా భూగర్భ పార్కింగేనని ఇలాంటి ఏర్పాటే ఉండాలని సీఎం యోచిస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టపక్కల పూల వనాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు. -
మరోసారి చంద్రబాబు విదేశీ పర్యటన
-
మరోసారి విదేశాలకు బాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరుతున్నారు. గత రెండేళ్ల కాలంలో అనేక దేశాలు పర్యటిస్తూ వస్తున్న చంద్రబాబు నాయుడు తాజాగా ఈ నెల 9 నుంచి అయిదు రోజుల పాటు కజకిస్థాన్, రష్యా దేశాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు ఇటీవలే రెండోసారి చైనాలో పర్యటించి వచ్చిన విషయం తెలిసిందే. అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు చైనా, సింగపూర్, జపాన్, స్విట్జర్లాండ్, ఇంగ్లండ్, మలేషియా తదితర దేశాల్లో పర్యటించారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ నెల 9 న బయలుదేరి 14 వ తేదీ వరకు ఆయా దేశాల్లో పర్యటించడానికి సంబంధించి ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పర్యటనలో భాగంగా స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులను, వ్యాపార వేత్తలను కలవనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ కమ్యునికేషన్స్ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎం ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, ప్రన్సిపల్ సెక్రెటరీ సాయి ప్రసాద్, మౌలిక సదుపాయాలు, సీఆర్ డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సాల్మన్ అరోకియా, సీసీడీఎంసీ చైర్మన్ డి. లక్ష్మీపార్థసారథి, రాష్ట్ర స్కిల్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కె. లక్ష్మినారాయణ, ఎకనమిక్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సీఈవో జాస్తి క్రిష్ట కిషోర్, సీఎం పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కూచిపూడి నగేష్ బాబు తదితరులు ఉంటారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
అక్కడి కార్యాలయాల్లో స్మార్ట్ఫోన్లు నిషేధం
సిడ్నీ: ప్రభుత్వ కార్యాలయాలకు వెళుతున్నారా ? అయితే మీరు మీ వెంట స్మార్ట్ ఫోన్లు తీసుకెళ్లకండి. ఒకవేళ తీసుకెళ్తే రిసెప్షన్ కౌంటర్ వద్దే వదిలివెళ్లాల్సి ఉంటుంది. ఇది కేవలం సామాన్య వ్యక్తులకు మాత్రమే కాదు, అక్కడి కార్యాలయాల్లో పనిచేస్తే ఉద్యోగులు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఖజకిస్తాన్లోని సిడ్నీలో ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తిగా స్మార్ట్ఫోన్లను నిషేధించారు. ఈ నిషేధం మార్చి 24 నుంచి అమల్లోకి రానుంది. ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వానికి సంబంధించిన రహస్య సమాచారాలు తరుచూ బయటకు లీకు అవుతున్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఖజికిస్తాన్ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు స్మార్ట్ఫోన్లకు బదులు సాధారణ ఫోన్లు (కెమెరా, ఇంటర్నెట్ సౌకర్యం లేని) ను మాత్రమే ఉపయోగించాల్సిందిగా ఆదేశించింది. -
ఆ గ్రామాన్ని వేధిస్తున్న మిస్టరీ ఏంటి?
కజకిస్తాన్: అది కజకిస్తాన్లోని బెరిజోవాకా అనే చిన్న గ్రామం. ఏళ్ల తరబడి నరకప్రాయం అనుభవిస్తోంది. అక్కడ ఎందుకు అలా జరగుతుందో ఇప్పటికీ అంతుబట్టడం లేదు. ఎవరూ గుర్తించలేని ఓ భయంకర వ్యాధి వారిని పట్టి పీడిస్తోంది. అది కూడా అతి నిద్ర వ్యాధి. వారు ఒక్కసారి నిద్రపోయారంటే మళ్లీ ఎప్పుడు లేస్తారో చెప్పలేని పరిస్థితి. వారు చనిపోయారా నిద్రలో ఉన్నారా కూడా గుర్తుపట్టలేని వైనం. ఫలితంగా దాదాపు 1,500 మంది ప్రజలు ఆ గ్రామాన్ని ఏదో శాపంపట్టిపీడిస్తోందని అపనమ్మకంతో ఖాళీ చేసి వెళ్లిపోయారు. ముఖ్యంగా ఈ వ్యాధి వల్ల వారికి అనుహ్యంగా మూర్చ రావడం, కళ్లు మసకగా అయిపోవడం, కడుపులో భయంకరంగా తిప్పడం వెంటనే కుప్పకూలిపోవడం వంటి లక్షణాలు వారిని పీడిస్తున్న 'స్లీపీ హాలో' అనే జబ్బు చూపిస్తున్న ప్రతిచర్యలు. ఇదంతా ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి యుక్తవయసులో ఉన్నవారికి వస్తుండటం వారిని వణికిస్తోంది. పాఠశాల కోసం తమ చిన్నారులను సిద్ధం చేసి పంపిస్తే వారు అనూహ్యంగా బెంచీల్లోనే శవాలమాదిరిగా కుప్పకూలినట్లు పడిపోయి సుధీర్ఘ నిద్రలోకి వెళ్లిపోవడం రోజుల తరబడి కిక్కురుమనకుండా ఉండిపోతుండటంతో వారికి ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితి. దీంతో ఆ గ్రామానికి పదిహేను మైళ్ల దూరంలో ఉన్న అక్సాయి అనే గ్రామంలోకి తరలి వెళ్లారు. అయినా వారి పరిస్థితి మారలేదు. వారంలో రెండుసార్లయినా ఆపిల్లలు అలా మత్తులో మునిగిపోతున్నారు. అయితే, బెరిజోవాకా అనే గ్రామంలో విష వాయువుల ప్రభావం అమితంగా ఉందని, కరచగనాక్ పెట్రోలియం ఆపరేటింగ్ పవర్ స్టేషన్ ఆ గ్రామానికి సమీపంలో ఉండి అది అనేక విషవాయువులు విడుదల చేస్తుందని ఫలితంగానే పిల్లలు అనూహ్య రోగాల బారిన పడుతున్నట్లు ఆ గ్రామస్తులు చెప్తుండగా ప్రభుత్వ అధికారులు మాత్రం అక్కడ పరీక్షలు నిర్వహించి అలాంటిదేం లేదని అంటున్నారు. మరింతకీ ఆ పిల్లలను వేధిస్తున్న ఆ మహమ్మారి ఏంటనేది ముందురోజుల్లో తెలుస్తుందేమో చూడాలి. -
మాజీ ప్రధానికి పదేళ్ల జైలు
ఆస్తానా: కజకిస్థాన్ మాజీ ప్రధాని సెరిక్ అఖ్ మెతోవ్ కటకటాలపాలయ్యాడు. అక్కడి కోర్టు ఆయనకు పదేళ్ల జైలు శిక్షను విధించింది. గౌరవ ప్రదమైన ప్రధాని బాధ్యతలు నిర్వర్తించిన ఓ వ్యక్తి ఆ దేశంలో జైలు శిక్షను అనుభవించడం ఇదే తొలిసారి. తాను అధికారంలో ఉన్నప్పుడు సెరిక్ నాలుగు అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డాడని గత కొద్ది కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే, తాను ఏ తప్పు చేయలేదని, ఈ విషయంలో కావాలనే కొందరు వ్యక్తులు తనపై కుట్ర చేశారని, క్షమించాల్సిందిగా అధ్యక్షుడు నర్సుల్తాన్ నబర్ బయేవ్ కు అర్జి పెట్టుకున్నారు. కానీ, అధ్యక్షుడు ఆయన విజ్ఞప్తిని తిరస్కరించారు. ఈ కేసు తుదివాదనలు శనివారం జరిపిన కోర్టు చివరకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. మొత్తం 17మంది ఈ కేసుల్లో ఉండగా.. ముగ్గురు వ్యక్తులు బయటపడ్డారు. మిగితా వారందరికీ వారి నేరాలనుబట్టి శిక్ష ఖరారైంది. -
వ్యోమగాములను తీసుకెళ్లే రాకెట్
-
‘టై’పై పోరుకు మరింత సహకారం
భారత్, మధ్య ఆసియాల మధ్య ఘనమైన ఉమ్మడి ఇస్లామ్ సంస్కృతి ఉంది: మోదీ రెండు ప్రాంతాల సంస్కృతులు పరస్పరం సుసంపన్నమయ్యాయి ఉజ్బెక్ నుంచి కజకిస్తాన్ చేరుకున్న మోదీ {పధానితో చర్చలు.. అస్తానా: భారతదేశానికి, మధ్య ఆసియాకు మధ్య ఘనమైన ఉమ్మడి ఇస్లామ్ సంస్కృతి ఉందని.. అది తీవ్రవాద శక్తులను ఎల్లవేళలా తిరస్కరిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ - మధ్య ఆసియాల నడుమ రక్షణ, భద్రత సహకారం పెంపొందాలని పిలుపునిచ్చారు. మధ్య ఆసియా దేశాల్లో తొలిసారి పర్యటిస్తున్న ప్రధాని మోదీ మంగళవారం కజకిస్తాన్లో పర్యటించారు. సోమవారం ఉజ్బెకిస్తాన్లో పర్యటించిన మోదీ.. మంగళవారం తాష్కెంట్ నుంచి ప్రత్యేక విమానంలో కజకిస్తాన్ రాజధాని అస్తానా చేరుకున్నారు. కజక్ ప్రధాని కరీమ్ మాసిమోవ్తో పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరిపారు. తర్వాత నజర్బయేవ్ వర్సిటీలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. భారతీయ, ఇస్లామిక్ సంస్కృతులు మధ్య ఆసియాలో సమ్మిళతం కావటం జరిగిందని.. అది ఒకదానిని మరొకటి ఆధ్యాత్మిక చింతనతో పాటు.. వైద్యం, శాస్త్రపరిశోధన, గణితం, అంతరిక్షశాస్త్రాల్లోనూ సుసంపన్నం చేశాయని పేర్కొన్నారు. ‘‘ఢిల్లీ దర్గాలు సూఫీ సంగీతంతో ప్రతిధ్వనిస్తాయి. మధ్య ఆసియా యోగా, హిందీ కేంద్రాలయ్యాయి. అయితే.. భారత్, మధ్య ఆసియాల మధ్య సంబంధాలు వాటి సామర్థ్యానికి తగినంతగా బలోపేతం కాలేదు. ఆ పరిస్థితి ఇప్పుడు మారుతుంది. ఈ పురాతన సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించటానికి నేను వచ్చాను’’ అని చెప్పారు. ఉగ్రవాదం ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రపంచ సవాలుగా మారిందన్నారు. ‘‘అస్థిరత, తీవ్రవాదం, ఉగ్రవాదం ముంగిట్లో మనం నివసిస్తున్నాం. ఉగ్రవాదం తమలో చేరికలక కోసం సైబర్ స్పేస్ను వినియోగించుకోవటం చూస్తున్నాం. కాబట్టి.. ఈ పర్యటనలో.. మా రక్షణ, భద్రత సహకారాన్ని బలోపేతం చేసుకుంటాం. మా విలువలు, మానవత్వానికి మా కట్టుబాటు అనే మా బలంతో కూడా మేం ఉగ్రవాదంపై పోరాటం చేస్తాం’’ అని పేర్కొన్నారు. మోదీ బుధవారం కజక్ అధ్యక్షుడు నూర్సుల్తాన్ నజర్బయేవ్తో సమావేశమవుతారు. ఓఎన్జీసీ ఆయిల్ డ్రిల్లింగ్ను ప్రారంభించిన మోదీ కజక్లోని సత్పయేవ్ చమురు క్షేత్రంలో.. భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థ విదేశీ విభాగమైన ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ చేపట్టిన తొలి డ్రిల్లింగ్(చమురు అన్వేషణ) ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. కార్యక్రమంలో కజక్ ప్రధాని కూడా పాల్గొన్నారు. ఈ చమురు క్షేత్రంలో 25 శాతాన్ని ఓఎన్జీసీ కొనుగోలు చేసింది. హిందీ ప్రాధాన్యం పెరుగుతుంది తాష్కెంట్: ఒక భాష ప్రజాదరణ అనేది.. ఆ దేశ ఆర్థిక శక్తితో ముడిపడి ఉంటుందని మోదీ పేర్కొన్నారు. భారతదేశం ఆర్థిక సుసంపన్నత దిశగా వేగంగా అడుగులు వేస్తున్నందున.. హిందీ ప్రాధాన్యం పెరగనుందన్నారు. మంగళవారం తాష్కెంట్లో ఇండాలిజిస్టులు, హిందీ భాష విద్యార్థులు, భారత సమాజ సభ్యుల కూడిన ఒక సమావేశంలో మోదీ ప్రసంగించారు. తొలి ఉజ్బెక్ - హిందీ డిక్షనరీని మోదీ ఆవిష్కరించారు. లాల్బహదూర్కు నివాళులు మాజీ ప్రధాని లాల్బహదూర్శాస్త్రి గర్వించదగ్గ భారత పుత్రుడని మోదీ అభివర్ణించారు. 1966లో తాష్కెంట్లో గుండెపోటుతో మరణించిన లాల్బహదూర్ స్మారకార్థం ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద ఆయన నివాళులర్పించారు.