kims hospital
-
శ్రీతేజు విదేశాల్లో చికిత్స..! బాలుడ్ని పరామర్శించిన బన్నీ వాసు
-
శ్రీతేజ్కు అల్లు అర్జున్ పరామర్శ
-
సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అర్జున్
సాక్షి, హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్కు వెళ్లారు. సంధ్య థియేటర్ ఘటన (Sandhya Theatre Stampede)లో గాయపడ్డ శ్రీతేజ్ను మంగళవారం పరామర్శించారు. ఈ మేరకు రాంగోల్పేట్ పోలీసులకు ముందస్తు సమాచారమిచ్చారు. దీంతో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలుడిని పరామర్శించిన అల్లు అర్జున్ అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆయన వెంట నిర్మాత దిల్ రాజు సైతం ఉన్నారు. అల్లు అర్జున్కు గడ్డు పరిస్థితితన సినిమా విజయం సాధిస్తే ఏ హీరో అయినా సంతోషపడిపోతాడు. రికార్డుల మీద రికార్డులు కొడుతుంటే సంబరాలు చేసుకుంటాడు. కానీ అల్లు అర్జున్కు ఆ సంతోషం లేకుండా పోయింది. ప్రమాదవశాత్తూ జరిగిన ఓ సంఘటన వల్ల అటు కేసులో ఇరుక్కోవడంతో పాటు మనోవేదనకు గురవాల్సి వస్తోంది.ఇంతకీ ఏం జరిగిందంటే?డిసెంబర్ 4న హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో పుష్ప 2 (Pushpa 2: The Rule) ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సినిమా చూసేందుకు అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో హీరోను చూసేందుకు జనాలు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలతో ఆస్పత్రిపాలయ్యాడు. 35 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబానికి అల్లు అరవింద్ రూ.1 కోటి, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే రేవతి భర్త భాస్కర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యంతోపాటు అల్లు అర్జున్పైనా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయగా ఒకరోజు జైల్లో కూడా ఉన్నాడు.పుష్ప 2 రికార్డులుసుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా లెవల్లో హిట్టయింది. రూ.350 కోట్లకు పైగా రాబట్టింది. మూడేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్గా పుష్ప 2 రిలీజైంది. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా శ్రీలీల స్పెషల్ సాంగ్లో మెరిసింది. ఈ సారి మూడు పువ్వులు ఆరు కాయలు అన్న రీతిలో వసూళ్లు వస్తున్నాయి. నెల రోజుల్లోనే పుష్ప: ది రూల్ 1831 కోట్లు రాబట్టింది. ప్రథమ స్థానంఈ సారి మూడు పువ్వులు ఆరు కాయలు అన్న రీతిలో వసూళ్లు వస్తున్నాయి. నెల రోజుల్లోనే పుష్ప: ది రూల్ 1831 కోట్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో మాత్రం ‘పుష్ప 2: ది రూల్’ ప్రథమ స్థానంలో నిలిచింది. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు.ఇండియన్ సినీ చరిత్రలో..ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఆమిర్ ఖాన్ దంగల్ మాత్రమే రూ.2 వేల కోట్ల మార్కును దాటింది. ఆ తర్వాత ప్లేస్లో అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప- 2 ది రూల్ నిలిచింది. రాజమౌళి చిత్రం బాహుబలి -2 మూడో స్థానానికి, ఆర్ఆర్ఆర్ (రూ.1387 కోట్లు) నాలుగో స్థానానికి పరిమితమైంది.చదవండి: శుభవార్త చెప్పిన హీరోయిన్.. పట్టలేనంత సంతోషం, కొంత నిరాశ! -
శ్రీ తేజ కుటుంబానికి రూ.2 కోట..
-
కిమ్స్ ఆస్పత్రికి దిల్ రాజు, అల్లు అరవింద్
-
కిమ్స్ లో శ్రీతేజ్ ను పరామర్శించిన డీకే అరుణ
-
శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది: సీపీ సీవీ ఆనంద్
సాక్షి,హైదరాబాద్ : సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు నగర కమిషనర్ సీవీ ఆనంద్. అనంతరం బాలుడి ఆరోగ్య వివరాలను ఆయన మీడియాకు తెలియజేశారు. శ్రీతేజ్ కోలుకునేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన విచారం వ్యక్తం చేశారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన రెండు వారాల నుంచి శ్రీతేజ కిమ్స్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సీపీ సీవీ ఆనంద్,హెల్త్ సెక్రటరీ క్రిస్టినాలు కిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం, సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ప్రభుత్వం తరఫున శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాం. తొక్కిసలాటలో శ్రీ తేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. రికవరీ కావడానికి చాలా సమయం పడుతుంది. ట్రీట్మెంట్ మరింత కాలం పట్టే అవకాశం ఉంది. త్వరలోనే బాలుడి ఆరోగ్యంపై వైద్యులు బులిటెన్ విడుదల చేస్తారు’ అని వెల్లడించారు. ‘పుష్ప-2’ ప్రీమియర్ షోలో తొక్కిసలాటహైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో ‘పుష్ప-2’ ప్రీమియర్ షోలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ వద్దకు చేరుకోగానే అభిమానులు ఒక్కసారిగా పెద్దఎత్తున లోనికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితి కట్టడి చేసేందుకు అభిమానులను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో సినిమా చూసేందుకు భర్త, పిల్లలతోపాటు థియేటర్కు వచ్చిన రేవతి అనే మహిళ, ఆమె కుమారుడు శ్రీతేజ్ తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు వీరిని ఆస్పత్రికి తరలించగా మహిళ మృతిచెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
హతవిధీ..! నిద్రలో పళ్ల సెట్ మింగేయడంతో..!
పళ్లు బాగా కదులుతున్నప్పుడు.. దంతవైద్యులు వాటిని తీసి, వాటి బదులు కృత్రిమ దంతాలు అమరుస్తారు. అలా అమర్చిన దంతాలు నిద్రలో ఉండగా ఊడిపోగా.. వాటిని మింగేశారో వ్యక్తి! అవి వెళ్లి ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. విశాఖపట్నంలో జరిగిన ఈ విషయం గురించి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ భరత్ తెలిపారు.“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నానికి చెందిన 52 ఏళ్ల ఉద్యోగి సుమారు రెండు మూడేళ్ల క్రితం పళ్లు కట్టించుకున్నారు. దంతవైద్యులు ఆయనకు ఎప్పటికీ అతుక్కునే ఉండే పళ్ల సెట్ అమర్చారు. అయితే, అవి కూడా అప్పుడప్పుడు ఊడే ప్రమాదం ఉంటుంది. ఈయన నిద్రలో ఉన్నప్పుడు అలాగే అది ఊడిపోయింది. అప్పుడు ఆయన తెలియకుండానే దాన్ని మింగేయడంతో అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. కుడి ఊపిరితిత్తి మధ్యభాగంలో ఇది ఇరుక్కుంది. అయితే అదే సమయంలో ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా పనిచేస్తుండడం, కుడి ఊపిరితిత్తిలోనూ పైన, కింది భాగాలు పనిచేయడంతో శ్వాస సంబంధిత సమస్యలు రాలేదు గానీ, లోపల ఫారిన్ బాడీ ఉండడంతో బాగా దగ్గు వచ్చింది. దీంతో రోగి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆయనకు ముందుగా ఎక్స్ రే, తర్వాత సీటీ స్కాన్ చేసి చూస్తే.. కుడివైపు ఊపిరితిత్తిలో పళ్ల సెట్ ఉందని తెలిసింది. దాంతో ఆయనకు జనరల్ ఎనస్థీషియా ఇచ్చి, రిజిడ్ బ్రాంకోస్కొపీ అనే పరికరం సాయంతో అత్యంత జాగ్రత్తగా దాన్ని బయటకు తీశాం. దానికి రెండువైపులా లోహపు వస్తువులు ఉండడంతో వాటివల్ల ఊపిరితిత్తులకు గానీ, శ్వాస నాళానికి గానీ ఏమైనా గాయం అవుతుందేమోనని చాలా జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది. ఒకవేళ అలా గాయమైతే అక్కడినుంచి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు దాదాపు నోటివరకు వచ్చిన తర్వాతే చిన్న గాయం అయ్యింది, దాన్ని కూడా వెంటనే సరిచేయడంతో ఎలాంటి ఇబ్బంది కాలేదు. పెద్ద పరిమాణంలో ఉండి, వంపుతో ఉన్న, పదునైన వస్తువులను తీయడానికి రిజిడ్ బ్రాంకోస్కొపీ బాగా ఉపయోగపడుతుంది.సాధారణంగా మన శరీరంలో ఏదైనా వస్తువు ఎక్కడైనా అమర్చాల్సి వస్తే.. అలాంటి వాటికి కొంత జీవనకాలం ఉంటుంది. ఆ తర్వాత అవి ఎంతో కొంత పాడయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల అలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఎప్పటికప్పుడు సంబంధిత వైద్యులను సంప్రదిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేతప్ప, ఒకసారి వేశారు కాబట్టి జీవితాంతం అవి అలాగే బాగుంటాయని అనుకోకూడదు. ముఖ్యంగా పళ్ల సెట్ కట్టించుకునేవారు ఎప్పటికప్పుడు దంతవైద్యులను సంప్రదిస్తూ దాన్ని చూపించుకోవాలి. ఇలా నిద్రలో మింగేసి, అది ఎక్కువకాలం ఉండిపోతే లోపల దానిచుట్టూ కండ పెరిగిపోయి, ఇన్ఫెక్షన్ కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది” అని డాక్టర్ భరత్ తెలిపారు.పల్మనాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ భరత్, కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి(చదవండి: పెద్దపేగు కేన్సర్ నివారణకు...) -
వాల్స్.. వండర్స్.. ప్రతి గోడా ఓ కళాఖండంలా..
ఖైరతాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం.. అయితే మనలో చాలా మంది అనారోగ్యంపాలైనప్పడు ఆస్పత్రులకు వెళ్లక తప్పదు..వెళ్లాలి కదా..! ఇప్పుడేమంటారు? అంటారా.. అదేనండి.. ఆస్పత్రులు అనగానే చాలా మంది బెదిరిపోతారు.. ఎందుకంటే ఓ వైపు మందుల వాసన, మరోవైపు ఫినాయిల్కంపు, ఎక్కడ చూసినా గోడలకు రోగాలకు సంబంధించిన పోస్టర్లు, చూట్టూ రోగులు.. అబ్బో నా వల్ల కాదు బాబోయ్ అంటారు. అలాంటి వారు కూడా ఈ ఆస్పత్రికి వెళ్లాలంటే మాత్రం ఎంచక్కా మ్యూజియంకో, ఎగ్జిబిషన్కో వెళ్తున్నట్లు రెడీ అయిపోతారు.. అదే నగరంలోని కిమ్స్ సన్షైన్ హాస్పటల్. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.. క్యారికేచర్స్గా డాక్టర్స్ ఫొటోలు.. ఆయా డిపార్ట్మెంట్ల ముందు డాక్టర్ల ఫొటోలను పాస్పోర్ట్ సైజ్ ఫొటోల్లాగా కాకుండా లైటర్వేయిన్తో క్యారికేచర్స్గా ప్రత్యేకంగా రూపొందించి ఏర్పాటుచేశారు. ఈ ఫొటోలను చూసి హాస్పిటల్కు వచ్చిన వారు ఎంజాయ్ చేయడంతో పాటు ఉత్సాహంగా ఫోన్లో ఫొటోలు భద్రపరుచుకుంటున్నారు. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో సతమతమౌతున్న మనిషికి ఆధునిక వైద్య విధానాలు ఎన్ని వచి్చనప్పటికీ ఆప్యాయంగా... ప్రేమగా పలకరించే వైద్యులు, వారి బాధలు చెప్పుకునేంత సమయం.. ఓర్పు, సహనం కలిగిన వైద్యులతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపించే హాస్పిటల్కు వెళ్లామనే ïఫీలింగ్ పేషెంట్లకు కలిగించేందుకు కొత్త కొత్త ఏర్పాట్లు చేస్తున్నాయి పలు హాస్పటల్స్. ఈ తరహా ప్రయత్నమే చేస్తోంది నగరంలోని బేగంపేట కిమ్స్ సన్షైన్ హాస్పటల్. రొటీన్ వాతావరణానికి భిన్నమైన అనుభూతిని కలి్పంచేలా ఓ మ్యూజియంకు వెళ్లామనే అనుభూతి, పేషెంట్ను పేషెంట్గా కాకుండా ఒక గెస్ట్గా ఆహా్వనించే పద్దతి, ఎక్కడ ఏ సమస్య వచి్చనా వెంటనే హాజరై సలహాలు, సూచనలు చేసే సిబ్బంది ఉంటే ఆ రోగికి సగం జబ్బు నయమైపోయినట్లే అంటున్నారు విశ్లేషకులు. సంస్కృతిని ప్రతిబింబించేలా..హాస్పిటల్లోకి వెళ్లగానే బాబోయ్ హాస్పిటల్కు వచ్చామనే ఫీలింగ్ లేకుండా ఉండేవిధంగా లోపలికి అడుగు పెట్టగానే తెలుగు సాంప్రదాయ పద్దతిలో చేతులు జోడించి నమస్కారంతో స్వాగతం పలికే సిబ్బంది మొదలుకొని డాక్టర్ల వరకూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. హాస్పిటల్లో డాక్టర్ ఓపి పరిసరాల్లో ఉండే గోడలపై భారతీయతను ప్రతిబింబించేలా తెలుగు పండగలు, అలనాటి క్రీడలు, అన్ని మతాలనూ ప్రబోధిస్తూ ఫొటోలు, తెలుగు రాష్ట్రాల చీరలు, రామాయణం, మహాభారతం, మనదేశ సంప్రదాయ నృత్యాలు, తల్లిప్రేమను ప్రతిబింబించే ఫొటోలు, మెడిసిన్ హిస్టరీని తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్, ఆయా డిపార్ట్మెంట్ల ప్రాముఖ్యతను తెలిపే ఫొటోలు, మన శరీరం ఆకృతిని నిర్దేశిస్తూ శరీరంలో ఉండే అస్థిపంజరం నమూనాలు, పెయింటింగ్స్ పరిజ్ఞానాన్ని పెంచడంతో పాటు మనస్సుకు ఎంతో ప్రశాంతతను చేకూరుస్తాయని చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చే వారు ప్రతి ఫ్లోర్లో మనస్సు నింపుకొని వెళ్లే విధంగా ఉండటం కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ ప్రత్యేకత.సిబ్బంది పద్దతి నచ్చింది..మేము ఉండేది కొండాపూర్, మా చుట్టుపక్కల ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. అయినా గంటన్నర ప్రయాణం చేసి బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్కు వస్తాం. ఇక్కడి వాతావరణం, నర్సులు, ఇతర సిబ్బంది పద్దతి మాకు బాగా నచ్చింది. బాధ్యతతో వ్యవహరించే డాక్టర్లు, హాస్పిటల్లో ప్రతి ఫ్లోర్లో ప్రశాంతతను ఇచ్చే వాతావరణం మాలో బరోసాను పెంపొందిస్తుంది. – జే.సుమిత్ర, కొండాపూర్, గృహిణిసేవా ధృక్పథంతో...మేమంతా సేవా ధృక్పథంతో పనిచేస్తున్నాం. మా అందరి గురువు డాక్టర్ గురవారెడ్డి. ఆయన అడుగు జాడల్లో రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి బాధలు చెప్పుకునేంత సమయం ఇస్తూ, వారి ఆనందంలో భాగస్వాములవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడి సిబ్బంది ఒక కుటుంబంలా పనిచేయడం ఎంతో సంతోషం. – డాక్టర్ నివేదిత సాయిచంద్ర, న్యూరో ఫిజీషియన్కంఫర్ట్ ఇవ్వగలగాలి..రొటీన్ పద్దతికి స్వస్తిచెప్పి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపించేలా మ్యూజియం, హార్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం.. రానున్న సంవత్సరంలో పేషెంట్ను గెస్ట్లా భావిస్తున్నాం. ఆస్పత్రిలో మంచి వాతావరణం ఉండటం వల్ల సగం జబ్బు నయమవుతుంది. గోడలను రకరకాల పెయింటింగ్స్, డిజైన్స్, ఫొటోలతో ఏర్పాటు చేశాం. అన్ని బాధలూ మేము తగ్గించకపోవచ్చు, కానీ అందరికీ ఆత్మస్థైర్యాన్ని, కంఫర్ట్ని ఇవ్వగలగాలి. ఇంగ్లిష్లో ఓక సామెత ఉంది ‘యు మే నాట్ క్యూర్ ఆల్ ది టైం.. బట్ యు కెన్ కంఫర్ట్ ఆల్ ది టైం’ అనేది నేను బలంగా నమ్ముతాను. – డాక్టర్ ఏవీ గురవారెడ్డి, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. -
ఏట్రియల్ ఫిబ్రిలేషన్! సైలెంట్గా దాడి చేసే డేంజరస్ వ్యాధి!
కొన్ని వ్యాధులు అంత తేలిగ్గా బయటపడవు. ఎటువంటి సంకేతాలు ఇవ్వవు. కానీ ఇతరత్ర వ్యాధులకు దారితీసేంత వరకు దాని వల్లే మనకు ఆ వ్యాధి వచ్చిందనేది కూడా తెలియదు. దీంతో పరిస్థితి విషమించిన సందర్భాలు కోకొల్లలుగా జరగుతున్నాయి. అలాంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్(గుండెదడ). ఇదే స్ట్రోక్ వంటి ప్రమాదకర వ్యాధులకు దారితీసి ప్రాణాంతకంగా మారుస్తోంది. అసలు ఏంటీ ఏట్రియల్ ఫిబిలేషన్(ఏఎఫ్)? ఎలా సైలెంట్గా దాడి చేసేంత డేంజరస్ వ్యాధి తదితరాల గురించే ఈ కథనం!. ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్(ఏఎఫ్)గుండెదడ)) బాధపడుతున్న రోగులలో దాదాపు 1/3వ వంతు రోగుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. దీంతో ప్రస్తుతం చాలామంది రోగుల్లో ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ప్రాణాంతకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. ఇంతకీ ఏట్రియా అంటే గుండె గదులు. వీటిలో గుండె లయలు సక్రమంగా లేకపోతే గుండెలోని దిగువ గదులకు రక్తప్రవాహం సవ్యంగా జరగదు. దీంతో స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తున్నట్లు గుర్తంచారు వైద్యులు. నిజానికి భారతదేశంలో పలు ఆస్పత్రుల అధ్యయనాల ప్రకారం..దాదాపు 10 నుంచి 25% స్ట్రోకు రోగులకు అంతర్లీనంగా ఉన్న ఈ ఏట్రియల్ ఫిబ్రలేషన్ కారణమని చెబుతున్నారు. సుమారు మూడింట ఒక వంతు మందిలో దీనికి సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదన్నారు. అందువల్ల ఆస్పత్రుల్లో చేరాల్సి రావడం, జీవన నాణ్యత దారుణంగా పడిపోయింది, ప్రాణాంతక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని హెచ్చరిస్తున్నారు. ఈ ఏఎఫ్ని గనుక ముందుగా గుర్తించగలిగితే (ఓరల్ యాంటీ కోగ్యులెంట్ థెరపీ) నోటి ద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నివారించే ఔషధాలతో స్ట్రోక్లు వంటివి రాకుండా నివారించొచ్చని చెబుతున్నారు. ఎవరికీ వచ్చే ఛాన్స్ ఎక్కువంటే.. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడినవారు, స్థూలకాయం, టైప్ 2 మధుమేహం, గుండె వైఫల్యం, కొరోనరీ ఆర్టరీ వ్యాధి, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, సీఓపీడీ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు, స్లీప్ అప్నీయా లేదా హైపర్ థైరాయిడిజం వంటి వైద్య పరిస్థితులతో బాధపడుతున్నవారికి ఈ ఏఎఫ్ బారినపడే అవకాశం ఎక్కువుగా ఉంది. ఈ మేరకు హైదరాబాద్లోని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లోని పేసింగ్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజీ డైరెక్టర్ డాక్టర్ బి హైగ్రీవ్ రావు మాట్లాడుతూ..చాలా సందర్భాలలో ఈ ఏఎఫ్ లక్షణ రహితంగా ఉంటుంది. ఈసీజీ, రొటీన్ చెకప్లు లేదా సంబంధిత స్ట్రోక్ కారణంగా యాదృచికంగా దీన్ని గుర్తించడం జరుగుతుంది. ఈ ఏఎప్లో ముందుగా స్ట్రోక్ రాకుండా చూడటం అనేది అతి ముఖ్యం. ఈ వ్యాధి బారినపడిన రోగులు రక్తాన్ని పలుచగా చేసే మందులు లేదా గడ్డకట్టడాన్ని నిరోధించే మాత్రలు వాడటం అత్యంత కీలకం. సరైన చికిత్సా పద్ధతులను అనుసరించాలి. అలాగే రక్తపోటు, మధుమేహం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, ఊబకాయం, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు సక్రమమైన జీవనశైలిని పాటించాలి. ఇలాంటి జాగ్రత్తలను అనుసరిస్తే స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా నివారించగలుగుతామని హైగ్రీవ్ రావు చెప్పారు. ఏఎఫ్ వచ్చిన రోగుల లక్షణాలు.. అలసట, హృదయ స్పందన సరిగాలేకపోవటం దడ, గుండెలు అదరటం మైకము, మూర్ఛ శ్వాస ఆడకపోవడం లేదా ఛాతీ నొప్పి తిమ్మిరి, నీరసం, గందరగోళం దృష్టి సమస్యలు నడకసమస్యలు మైకము, వివరించలేని తలనొప్పి వంటివి కనిపిస్తే స్ట్రోక్కి దారితీసే అవకాశం ఎక్కువగా ఉదని అర్థం. చికిత్స దీనికి మూడు ప్రధాన రకాల ఔషదాలు ఉన్నాయి, గుండె స్పందన రేటు నియంత్రణ మందులు (హృదయ స్పందన వేగాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి), రిథమ్ నియంత్రణమందులు (సాధారణ గుండె లయను పునరుద్ధరించడానికి పని చేస్తాయి), చివరిగా రక్తంపలచబడటానికి ( రక్తం గడ్డకట్టడం మరియు స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగించేవి) మందులు ఉంటాయి . కొంతమంది రోగులకు ఎలక్ట్రికల్ కార్డియోవర్షన్ లేదా పల్మనరీ వీన్ అబ్లేషన్ వంటి శస్త్ర చికిత్సలు అవసరం. వీటితో పాటుగా , ధూమపానానికి దూరంగా ఉండటం, గుండె ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్నే తీసుకోవడం, బరువు పెరగకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు చేసుకోవడం అత్యంత ముఖ్యం. వీటన్నింటిని పాటిస్తే ఈ ఏఎఫ్ సమస్య నుంచి సత్వరమే బయటపడొచ్చని అంటున్నారు కిమ్స్ వైద్యులు హైగ్రీవ్ రావు. --కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లోని పేసింగ్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజీ డైరెక్టర్ డాక్టర్ బి హైగ్రీవ్ రావు (చదవండి: ‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్' అంటే? తలెత్తే సమస్యలు..) -
ఆ రోజు నాకు మాటలు రాలేదు ..
-
రాంప్ వాక్ అదరగొట్టిన లూపస్ పేషెంట్స్
-
కిమ్స్ ఆసుపత్రి లో చీమలపాడు క్షతగాత్రులు
-
ఆస్పత్రి బాత్రూమ్ డోర్లాక్.. చిన్నారిని రక్షించిన ఫైర్ సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ఓ చిన్నారి తల్లిదండ్రులను, ఆస్పత్రి సిబ్బందిని కాసేపు ఉరుకులు పరుగులు పెట్టించాడు. వాష్ రూమ్లోకి వెళ్లి అనుకోకుండా లాక్ వేసేసుకున్నాడు. దీంతో అక్కడే ఇరుక్కుపోయి ఏడ్వసాగాడు. ఈ విషయాన్ని గుర్తించిన చిన్నారి తల్లిదండ్రులు.. ఆస్పత్రి నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. తాళాలు లేకపోవడంతో ఫైర్ సేఫ్టీ సిబ్బందికి కాల్ చేశారు. వాళ్లు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బాలుడిని రక్షించే యత్నం చేశారు. సుత్తి, స్క్రూడ్రైవర్తో తాళం పగులగొట్టి చిన్నారిని బయటకు తీసుకొచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో.. 101కు డయల్ చేయాలని తెలంగాణ ఫైర్ సర్వీసెస్ ట్విటర్ పేజీలో ఆ వీడియోను పోస్ట్ చేసింది. -
భద్రాచలం కిమ్స్లో అగ్నిప్రమాదం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని కిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో సోమవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. అయితే, సకా లంలో అగ్నిమాపక సిబ్బంది, ఆస్పత్రి నిర్వాహకులు స్పందించటంతో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్లోని స్కానింగ్ గదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడగా దట్టంగా పొగలు వ్యాపించాయి. దీంతో నిర్వా హకులు అగ్నిమాపక సిబ్బందికి సమా చారం ఇవ్వగా వారు చేరుకుని ఆక్సిజన్ మాస్క్లతో లోపలికి వెళ్లి ఐసీయూలో ఉన్న ముగ్గురు, చికిత్స పొందుతున్న మరో పది మందిని బయటకు తీసు కొ చ్చారు. ఐసీయూలోని రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. మంటలు రాకపోవడంతో ముప్పు తప్పింది. -
పేద కుటుంబంలో వెలుగు నింపారు
రాంగోపాల్పేట్ (హైదరాబాద్): పుట్టుకతోనే బైలియరీ అట్రేజియా (పిత్తవాహిక మూసుకుపోవడం)తో బాధపడుతున్న 9 నెలల చిన్నారికి అత్యం త ఖరీదైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఉచితంగా చేశారు. సోమవారం కిమ్స్ కాలేయ విభాగపు అధిపతి డాక్టర్ రవిచంద్ సిద్దాచారి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా తిరుమలగిరి గ్రామానికి చెందిన శంకర్, శోభారాణి దంపతులకు పుట్టిన పాపకు నెల రోజులకే కామెర్లు వచ్చాయి. నగరంలోని ఓ ఆస్పత్రిలో పాపకు శస్త్ర చికిత్స చేసినా కామెర్లు తగ్గలేదు. పైగా కాలేయం విఫలమవుతున్న లక్షణాలు కనిపించాయి. దీంతో 2 నెలల క్రితం తల్లిదండ్రులు సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి పాపను తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారి బైలియరీ అట్రేజియాతో బాధపడుతోందని గుర్తించారు. దీనికి కాలేయ మార్పిడే పరిష్కారమని సూచించారు. బిడ్డకు కాలేయం ఇచ్చేందుకు తల్లి ముందుకొచ్చినా శస్త్ర చికిత్సకు దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిసి దంపతులిద్దరికీ దిక్కుతోచకుండా పోయింది. వీరి పరిస్థితిని గమనించిన ఆస్పత్రి యాజమాన్యం ఉచితంగా సర్జరీ చేసింది. కోలుకున్నాక చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. -
ఎంసీపీఐయూ నేత తాండ్ర కుమార్ మృతి
మియాపూర్: ఎంసీపీఐయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తాండ్రకుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో నాలుగు రోజుల నుండి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో సోమవారం ఉదయం 9 గంటల సమయంలో తాండ్రకుమార్ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని కిమ్స్ ఆస్పత్రి నుండి బాగ్లింగంపల్లిలోని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యాలయం ఓంకార్ భవన్కు తరలించారు. అక్కడి నుంచి మియాపూర్లోని ఎంఏనగర్లో ఉన్న ఎంసీపీఐయూ కార్యాలయంలో సాయంత్రం వరకు ఉంచారు. అనంతరం మియాపూర్లోని సొంత ఇంటికి తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఒమిక్రాన్ మళ్లీ రాదనుకోవద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ ఒకసారి వచ్చిపోయాక మళ్లీ రాదని నిర్లక్ష్యం వద్దని కిమ్స్ ఆస్పత్రి పల్మనాలజిస్ట్, స్లీప్ డిపార్డర్స్ స్పెషలిస్ట్ డా. వీవీ రమణప్రసాద్ అన్నారు. ఒకసారి ఒమిక్రాన్ వచ్చి తగ్గాక మళ్లీ నెల, నెలన్నరలో రీ ఇన్ఫెక్షన్ వస్తోందని, దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా ప్రస్తుత పరిస్థితులపై ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఒమిక్రాన్ రీ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయా? ఒకసారి ఒమిక్రాన్ వచ్చాక మళ్లీ రాదనుకోవద్దు. గత నెలలో ఒమిక్రాన్ సోకి నెగెటివ్ వచ్చాక బయట తిరిగి వైరస్కు మళ్లీ ఎక్స్పోజ్ అయిన కొందరు కరోనా బారిన పడుతున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్ రీ ఇన్ఫెక్షన్ కేసులు మళ్లీ వస్తున్నాయి. అలాంటి కొన్ని కేసులు గుర్తించాం. కాబట్టి కరోనా ఎండమిక్ స్టేజ్కు చేరే దాకా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోసారి వచ్చిన వాళ్లలో లక్షణాలేంటి? కరోనా రెండోసారి సోకినా తీవ్రత ఎక్కువగా ఉండట్లేదు. లక్షణాలూ మునుపటిలా స్వల్పంగానే ఉంటున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన కేసులన్నీ దాదాపుగా ‘అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్’లోనే ఉంటున్నాయి. డెల్టాతో ›ఇన్ఫెక్ట్ అయిన వారు, అస్సలు టీకా తీసుకోనివారు కొంతమంది దీర్ఘకాలిక కోవిడ్ అనంతరం అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పుడు ఎలాంటి సమస్యలతో వస్తున్నారు? ప్రస్తుతం ఒకరోజు జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, ఇతర లక్షణాలు తగ్గిపోయాక కఫంతో కూడిన దగ్గు ‘అలర్జీ బ్రాంకైటీస్ లేదా అస్థమా’ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రాత్రి కాగానే కొంచెం దగ్గురావడం, పడుకున్నాక దగ్గుతో ఇబ్బంది పడటం, కొందరికి పిల్లి కూతలుగా రావడం వంటి సమస్యలతో వస్తున్నారు. వారం కిందట ఒకరోజు జ్వరం, కొద్దిగా ఒళ్లునొప్పులు వచ్చి తగ్గిపోయాయని, ఆ తర్వాత ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఎక్కువ మంది చెబుతున్నారు. అలా వారికి అప్పటికే కరోనా సోకిందని తెలుస్తోంది. చాలా మందికి మళ్లీ ఆస్థమా లేదా ‘అలర్జీ బ్రాంకైటీస్’ సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్లు దుమ్ము, పొగ, చల్లటి పదార్థాలు, చల్లటి గాలి నుంచి తగిన రక్షణ పొందుతూ జాగ్రత్తలు తీసుకోవాలి. లాంగ్ కోవిడ్ సమస్యలుంటున్నాయా? అసలు టీకాలు తీసుకోని వారు, ఒక్క డోస్ తీసుకున్న వారికి సంబంధించి వైరస్ సోకాక వారం, పది రోజుల తర్వాత దగ్గు, ఆయాసం పెరిగిన కేసులు స్వల్పంగా వస్తున్నారు. వీరిలో కొన్ని కేసులు ‘లంగ్ షాడోస్’ వంటివి వస్తున్నాయి. ఇంకా అక్కడక్కడ డెల్టా కేసులు వస్తున్నాయి కాబట్టి న్యూమోనియా, ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయి. -
ఒకే వ్యక్తికి రెండు కేన్సర్లు.. రోబోటిక్ సర్జరీతో ఊరట
సాక్షి, హైదరాబాద్: ఓ కేన్సర్ వచ్చి పూర్తిగా తగ్గకుండానే మరో కేన్సర్ వచ్చిన వ్యక్తికి రోబోటిక్ సర్జరీ ద్వారా సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఉపశమనం అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కిమ్స్ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్టు, రోబోటిక్ సర్జన్ డాక్టర్ మధు దేవరశెట్టి మాట్లాడుతూ సర్జరీ పూర్వాపరాలు తెలిపారు. ‘ఫార్మారంగంలో పనిచేసే 36 ఏళ్ల నగరవాసి ఎక్యూట్ ప్రోమైలోసిటిక్ లుకేమియా (ఏపీఎంఎల్).. అనే రక్తకేన్సర్కు కీమోథెరపీ తీసుకుంటూనే పాంక్రియాటిక్ కేన్సర్కి కూడా గురవడంతో రెండో కేన్సర్ చికిత్స కోసం తమ ఆసుపత్రికి వచ్చాడని తెలిపారు. సమస్య తీవ్రత దృష్ట్యా అతడికి రోబోటిక్ సర్జరీ చేయాలని నిర్ణయించి, కేవలం మూడున్నర గంటల కన్సోల్ టైంలోనే సర్జరీ పూర్తి చేశామన్నారు. సర్జరీ తర్వాత ఒక్క రోజు మాత్రమే ఐసియూలో ఉంచి, ఐదోరోజున డిశ్చార్జి చేశామన్నారు. మన దేశంలో అత్యంత వేగవంతంగా జరిగిన రోబోటిక్ సర్జరీల్లో ఇదొకటని, రోగి చాలా త్వరగా, చాలా బాగా కోలుకున్నాడన్నారు. ఈ రోబోటిక్ సర్జరీలో కిమ్స్ ఆస్పత్రికి చెందిన సర్జికల్ ఆంకాలజిస్టులు డాక్టర్ వెంకటేశ్, డాక్టర్ మాధవితో పాటు సిస్టర్ స్వప్న పాల్గొన్నారని తెలిపారు. -
కామినేని ఆసుపత్రి నుంచి కిమ్స్ ఆసుపత్రికి 15 నిమిషాల్లో గుండెను తరలించిన అధికారులు
-
చిన్నారి ప్రాణం నిలిపిన ఆరోగ్యశ్రీ
సాక్షి, నందిగామ(కృష్ణా): అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డ గుండె శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కృష్ణాజిల్లా నందిగామలోని 13వ వార్డుకు చెందిన ముంగి కోటయ్య 10 నెలల బాబు సంతోష్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. తొలుత విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ నుంచి హైదరాబాద్లోని కిమ్స్కు తరలించారు. రూ.10 లక్షల ఖరీదైన శస్త్ర చికిత్స ఈనెల 8న కిమ్స్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా జరిగింది. చిన్నారి సంతోష్ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా శుక్రవారం ఇంటికి చేరుకున్నాడు. దీంతో బాలుడి కుటుంబసభ్యులు పట్టరాని సంతోషంతో వారి ఇంటి ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ డాక్టర్ మొండితోక అరుణ్కుమార్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం వల్లే తమ బిడ్డ తిరిగి వచ్చాడని, ముఖ్యమంత్రికి తాము జీవితాంతం రుణపడి ఉంటామని చిన్నారి తండ్రి కోటయ్య పేర్కొన్నాడు. -
సీఎం జగన్ సహాయంతో ‘ఊపిరితిత్తుల మార్పిడి’ సక్సెస్
కారంచేడు: ప్రకాశం జిల్లా కారంచేడు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ నర్తు భాస్కరరావుకు హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో గురువారం ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. విధుల్లో ఉన్న ఆయనకు ఏప్రిల్ 24న కోవిడ్ సోకింది. దీంతో ఆయనకు విజయవాడ, హైదరాబాద్ల్లోని పలు ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. భాస్కరరావు ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోవడంతో వాటిని మార్చాలని, అందుకు రూ.1.5 కోట్లు ఖర్చవుతుందని కిమ్స్ వైద్యులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి సమస్యను వివరించింది. ఈ విషయాన్ని వెంటనే ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలియజేయడంతో సీఎం స్పందించి డబ్బుకు వెనుకాడొద్దని, భాస్కరరావు చికిత్సకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చినట్టుగానే డాక్టర్ భాస్కరరావుకు ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ఒక ప్రభుత్వ వైద్యుడికి ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి ఆయన ప్రాణాలను కాపాడటంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. డాక్టర్ భాస్కరరావు భార్య డాక్టర్ బొమ్మినేని భాగ్యలక్ష్మి.. సీఎం వైఎస్ జగన్, మంత్రి బాలినేని, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
28 వారాలకే జన్మించిన శిశువు.. అరుదైన చికిత్స
సాక్షి, గచ్చిబౌలి: నెలలు నిండక ముందే జన్మించిన (28 వారాలు) ఆడ శిశువు గుండెకు కొండాపూర్ కిమ్స్ వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. చందానగర్కు చెందిన అనిత, రాకేష్ సింగ్ దంపతులకు గత ఏప్రిల్ 21న ఆడపిల్ల జన్మించింది. సాధారణంగా నెలలు నిండక ముందు తక్కువ బరువుతో జని్మంచిన శిశువు (1100 గ్రాముల బరువు) బతికే అవకాశాలు తక్కువ. పుట్టుకతోనే ‘పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్’ సమస్య ఉండటంతో రెండు ప్రధాన రక్త నాళాల మధ్య ఖాళీ ఉన్నట్లు గుర్తించి ఆ మేరకు చికిత్స అందించినట్లు ఆస్పత్రి చీఫ్ నియోనెటాలజిస్ట్ డాక్టర్ అపర్ణ తెలిపారు. దీంతో పాప ఊపిరి తిత్తులు విచ్చుకోవడానికి మందులు ఇచ్చేందుకు వీలు పడిందన్నారు. 28వ రోజున చిన్నారికి యూ ఏ పీడీఏ పరికరాన్ని అమర్చినట్లు తెలిపారు. దీంతో పాప బరు వు 1500 గ్రాములకు చేరుకోవడంతో జూన్ 11 డిశ్చార్జీ చేసినట్లు డాక్ట ర్ సుదీప్ వర్మ తెలిపారు. కార్యక్రమంలో పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్లు డాక్టర్ గౌతమి, డాక్టర్ సుదీప్, అనస్తటిస్ట్ డాక్టర్ నాగరాజన్, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: కొరడా ఝుళిపించిన కలెక్టర్.. డీపీఆర్ఓపై చర్యలు -
అతి పిన్న వయసులో కరోనాను జయించిన శిశువు..!
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడిన వెంటిలేటర్పై ఉన్న ఓ గర్భిణీకి మాతృత్వాన్ని ప్రసాదించడంతో పాటు, నెలలు నిండకముందే పుట్టి కరోనా బారిన పడిన ఆ బిడ్డకు హైదరాబాద్ కొండాపూర్లోని కిమ్స్ కడల్స్ డాక్టర్లు ఊపిరి పోసి తల్లి ఒడికి చేర్చారు. దీంతో హైదరాబాద్ నగరంలోనే అతి పిన్న వయస్సులో కరోనాను గెలిచిన పాపగా ఆ నవజాత శిశువు రికార్డు సాధించినట్లయింది. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 28 వారాల గర్భిణీ కరోనా సోకి తీవ్రమైన లక్షణాలతో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు ఈ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి వెంటిలేటర్పై చికిత్స పొందుతుండగా ఏప్రిల్ 17న నెలలు నిండని 1,000 గ్రాముల బరువుతో కూడిన నవజాత శిశువుకు ఆమె జన్మనిచ్చింది. మొదట నెగెటివ్.. తర్వాత పాజిటివ్ పుట్టిన శిశువుకు కోవిడ్ టెస్ట్ చేయగా తొలుత నెగెటివ్ వచ్చింది. వారం తర్వాత క్రమంగా శిశువు ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో పాటు శ్వాస తీసుకోవడం కష్టమై వెంటిలేటర్ అవసరం ఏర్పడింది. దీంతో మరోసారి కరోనా టెస్ట్ చేయగా అందులో పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో శిశువు బరువు 1,000 గ్రాముల నుంచి 920 గ్రాములకు తగ్గిపోయింది. ఆక్సిజన్ తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండటంతో ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్, నియోనాటాలజీ అండ్ పీడియాట్రిక్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సి.అపర్ణ ఆధ్వర్యంలో వైద్య బృందం వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించడానికి కోవిడ్ ఐసోలేషన్ ఐసీయూకు తరలించారు. ఇంట్రావీనస్ యాంటీ బయాటిక్స్ ఇస్తూ ఆధునిక పద్ధతులలో చికిత్స చేశారు. శిశువు క్రమంగా కోలుకోవడంతో మరోసారి డాక్టర్లు పీసీఆర్ టెస్ట్ నిర్వహించగా కోవిడ్ నెగటివ్ రావడంతో శిశువును ఐసీయూ నుంచి చక్కని వెలుతురు, సరైన ఊష్ణోగ్రత కూడిన ప్రత్యేకమైన గదిలోకి మార్చి చికిత్స చేశారు. ఆస్పత్రిలో దాదాపు 30 రోజులు అన్ని రకాల మెరుగైన చికిత్సలతో శిశువు 1,500 గ్రాముల బరువుకు చేరుకోవడంతో పాటు, ఆరోగ్యంగా తయారు కావడంతో డిశ్చార్జి చేసినట్లు డాక్టర్ అపర్ణ వివరించారు. చివరకు తల్లి కూడా కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపారు. -
Seeti Maar: డాక్టర్ల అదిరిపోయే డ్యాన్స్.. దిశా పటాని ఫిదా!
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనాపై పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది శక్తికి మించి పోరాడుతున్నారు. చాలా మంది వైద్యులు తమ వ్యక్తిగత సంతోషాలను పక్కన పెట్టి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. చాలా రోజులుగా కుటుంబాలకు దూరంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో కొందరు డాక్టర్లు డ్యాన్స్ చేస్తూ కరోనా బాధితులకు చికిత్స చేయడంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సల్మాన్, దిశా పటాని నటించిన "రాధే" చిత్రంలోని సీటీ మార్ పాటకు వైద్యులు డ్యాన్స్ చేస్తున్నవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను బాలీవుడ్ భామ దిషా పటాని ఫ్యాన్స్ క్లబ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. మే 14న హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు కాళ్లు కదుపుతూ చేసిన డ్యాన్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా.. 35,515 మంది నెటిజన్లు వీక్షించారు. డాక్లర్లు చేసిన డ్యాన్స్ని మెచ్చుకుంటూ నెటిజన్లు తమ ప్రేమను పంచుకుంటున్నారు. దీనిపై దిశా పటాని స్పందిస్తూ 'నిజమైన హీరోలు' అంటూ ప్రశంసించింది. "మా ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన వైద్యులకు ధన్యవాదాలు" అని ఓ నెటిజన్ ప్రశంసల జల్లు కురిపించాడు. "మీరు నిజమైన హీరోలు. మీ డ్యాన్స్ చాలా బాగుంది." అంటూ మరో నెటిజన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Team Disha (@teamdishap) (చదవండి: వెరైటీ ఫుడ్..దాన్ని చూసి నెటిజన్లు షాక్!) -
పగిలిన గుండె రక్తనాళానికి చికిత్స
కర్నూలు(హాస్పిటల్): రక్తనాళంలో రక్తం గడ్డకట్టి రక్తనాళం చిట్లి గుండెపోటు వచ్చిన వ్యక్తికి కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు యాంజియోప్లాస్టీ ద్వారా అరుదైన చికిత్స చేసి ప్రాణం కాపాడారు. ఆదివారం కార్డియాలజిస్టు డాక్టర్ చింతా రాజ్కుమార్ మాట్లాడుతూ.. ‘గిద్దలూరుకు చెందిన నాగార్జునరెడ్డి(32)కి గతేడాది నవంబర్ 12న ఛాతిలో నొప్పి రావడంతో సమీపంలోని ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు రక్త పరీక్షల్లో గుండెకు సంబంధించిన సమస్యను గుర్తించారు. దీంతో అతను అదే రోజు కిమ్స్ హాస్పిటల్కు వచ్చాడు. యాంజియోగ్రామ్ చేయగా రక్తనాళం పగిలినట్లు తేలింది. ఇది చాలా అరుదైన కేసు. ప్రపంచంలోనే 20వ కేసుగా పరిగణించవచ్చు. పైగా మిగతా 19 కేసుల కంటే భిన్నమైనది. రక్తనాళం పగలడంతో రక్తం గుండె చుట్టూ చేరుకుని ఒత్తిడికి గురిచేసింది. ఆ సమయంలో రోగి బీపీ తగ్గి వెంటనే మరణించే అవకాశం ఉంది. ఇతనిలో ప్రమాదాన్ని సాధ్యమైనంత తొందరంగా గుర్తించి పెర్క్యుటేనియస్ ట్రాన్స్లూమినల్ కరోనరి యాంజియోప్లాస్టీ చేసి రక్తప్రవాహాన్ని ఆపి ప్రాణాలు కాపాడాం. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకున్నాడు’ అని వివరించారు. -
నెలలు నిండని శిశువును కాపాడిన కిమ్స్ వైద్యులు
సాక్షి, కర్నూలు : నెలలు నిండకుండానే పుట్టిన శిశువును అతికష్టం మీద శస్ర్తచికిత్స చేసి కాపాడారు కిమ్స్ వైద్యులు. కేవలం 950 గ్రాముల అతి తక్కువ బరువు ఉండటంతో పాటు పేగుల్లో ఇన్ఫెక్షన్ కూడా ఉండటంతో శిశువును కాపాడటం వైద్యులకు కత్తిమీద సాములా మారింది. అయినప్పటికీ శిశువు ప్రాణాలు కాపాడి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన అరుదైన ఘటన కిమ్స్ ఆసుపత్రి వైద్యులకే దక్కింది. కడప జిల్లాకు చెందిన గీత అనే మహిళ 15 ఏళ్ల వైవాహిక జీవితంలో రెండోసారి గర్భం దాల్చారు. అయితే ఆరున్నర నెలలకే ఉమ్మనీరు మొత్తం పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సి వచ్చింది. అయితే శిశువు రక్తంలో ఇన్ఫెక్షన్ ఉండటంతో పాటు ప్తేగుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ( నెక్రోటైజింగ్ ఎంటెరోకొలైటిస్ ) ఉన్నట్లు తేలింది. వీటితో పాటు ప్లేగులకు రంధ్రం కూడా ఉన్నట్లు పరీక్షలో వెల్లడైంది. దీంతో పీడియాట్రిక్ నిపుణులైన డా. శ్రీకాంత్ బాబు సంరక్షణలో శిశువును ఐసీయూలో పెట్టి అత్యాధునిక లైఫ్ సపోర్ట్ వ్యవస్థలపై ఉంచారు. ఇలియోస్టమీ (మలవిసర్జనకు ప్రత్యేక మార్గం ) ఏర్పాటు చేసి శిశువును కొన్ని రోజులపాటు వెంటిలేటర్పై ఉంచి క్రమంగా తీసేశారు. అతి చిన్న వయసులోనే శిశువుకు ఇన్ఫెక్షన్ రావడంతో 3 వారాలపాటు యాంటీ బయాటిక్స్ ఇచ్చారు. దాంతో పాటు రెండుసార్లు రక్తం ఎక్కించి 5సార్లు ప్లేట్లెట్లు ఎక్కించారు. తర్వాత కొద్దికొద్దిగా తల్లిపాలు అలవాటు చేసి కంగారూ మదర్ కేర్ అందించారు. దాదాపు నెల రోజుల అనంతరం వైద్యుల సంరక్షణ అనంతరం ప్రస్తుతం పాప పూర్తిగా కోలుకుంది. ('అక్కడ ఎనిమిదో వింత ఉన్నట్లుగా ఫీలవుతున్నారు' ) -
మళ్లీ ఊపిరి పోశారు!
సాక్షి, హైదరాబాద్: శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇ బ్బంది, ఆయాసంతో పాటు కరోనా వైరస్ బారిన పడిన ఓ యువకుడికి నగరంలోని కిమ్స్ వైద్యులు విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేశారు. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎండీ భాస్కర్రావు, హార్ట్ అండ్ లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ స్పెషలిస్టు డాక్టర్ సందీప్ అట్టావర్లు చికిత్సకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కరోనా బారిన పడిన వ్యక్తికి ఒకే సమయంలో 2 ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చే యడం దేశంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు. దాతది కోల్కతా.. స్వీకర్తది చండీగఢ్ పంజాబ్లోని చండీగఢ్కు చెందిన రిజ్వాన్ (32) గత కొంతకాలంగా శ్వాస సంబంధ సమస్య (సర్కోయిడోసిస్)తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం అనేక ఆస్పత్రులను తిరిగాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఇటీవల ఆయన హైదరాబాద్ కిమ్స్లోని ప్రముఖ గుండె, ఊపిరితిత్తుల మార్పిడి నిపుణుడు డాక్టర్ సందీప్ అట్టావర్ను సంప్రదించాడు. అయితే బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా సర్కోయిడోసిస్కు తోడు కరోనా కూడా సోకినట్లు తేలింది. దీంతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. ఊపిరితిత్తుల మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని వైద్యులు నిర్ణయించారు. అవయవ మార్పిడి చికిత్సకు రిజ్వాన్ అంగీకరించడంతో అవయవదానం కోసం జీవన్దాన్లో పేరు నమోదు చేశారు. ఆగస్టు 24న కోల్కతాకు చెందిన ఓ వ్యక్తి (52) బ్రెయిన్డెత్ స్థితికి చేరుకున్నాడు. అతడి అవయవాలు దానం చేసేందుకు కుటుంబీకులు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే అవయవ మార్పిడి చికిత్స కోసం ఎదురు చూస్తున్న రిజ్వాన్, కిమ్స్ వైద్యులకు ఈ సమాచారం అందింది. అప్పటికే రిజ్వాన్ కోవిడ్ను జయించడంతో వైద్యులు చికిత్సకు సిద్ధమయ్యారు. వైద్యులు రెండు బృందాలుగా విడిపోయి.. ఆస్పత్రికి చెందిన వైద్యులు రెండు బృందాలుగా విడిపోయారు. వీరిలో ఓ వైద్య బృందం వెంటనే ప్రత్యేక విమానంలో కోల్కతాకు వెళ్లి దాత శరీరం నుంచి ఊపిరితిత్తులను సేకరించి, అదే రోజు అదే విమానంలో హైదరాబాద్కు చేరుకుంది. ఆస్పత్రిలో ఉన్న మరో వైద్య బృందం అప్పటికే రోగి ఛాతీని ఓపెన్ చేసి ఉంచింది. డాక్టర్ సందీప్ అట్టావర్ నేతృత్వంలోని వైద్య బృందం సుమారు 10 గంటల పాటు శ్రమించి రోగికి విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం బాధితుడు పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు ప్రకటించారు. తనకు పునర్జన్మను ప్రసాదించిన కిమ్స్ వైద్యులకు బాధితుడు రిజ్వాన్ కృతజ్ఞతలు తెలిపాడు. -
కర్నూలు కిమ్స్ వైద్యుల అరుదైన శస్త్రచికిత్స
కర్నూలు : ఆటలు ఆడేటప్పుడు జరిగే గాయాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఎంత తీవ్రమైన సమస్యలు వస్తాయో చెప్పలేం. వాటిని పట్టించుకోకుండా వదిలేయడం వల్ల సమస్య మరింత ఎక్కువవుతుంది. ఇలా నాలుగైదేళ్ల క్రితం గాయపడి, ఇన్నాళ్లూ దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక చేతి కదలికలు దాదాపు పూర్తిగా కోల్పోయిన వ్యక్తికి అత్యంత అరుదైన లెటార్జెట్ ప్రొసీజర్ అనే అరుదైన శస్త్రచికిత్స చేసి, అతడికి చేతి కదలికలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు కిమ్స్ కర్నూలు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ జీవీఎస్ రవిబాబు ఈ చికిత్స పద్ధతి గురించి, కేసు గురించిన పూర్తి వివరాలను ఆయన ఇలా వెల్లడించారు. (80 నిమిషాల్లో 560 కి.మీ ప్రయాణం) "అనంతపురం జిల్లాకు చెందిన గోపీచంద్(20) అనే యువకుడు నాలుగైదేళ్ల క్రితం క్రికెట్ ఆడుతూ జారిపడటంతో అతని కుడి చేతి ఎముక పక్కకు జరిగింది. మాములు నొప్పే అనుకుని నిరక్ష్యం చేసిన అతను కొన్ని రోజుల వరకు వైద్యులను సంప్రదించలేదు. తర్వాత కొంత కాలానికి కొందరు వైద్యుల వద్దకు వెళ్లినా, సమస్యను పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల సరైన చికిత్స జరగలేదు. నాలుగైదేళ్ల పాటు ఇలాగే నిర్లక్ష్యం చేసి, క్రికెట్ ఆడటం సహా అన్ని పనులూ చేయడంతో ఈ మధ్య కాలంలో దాదాపు 30-40 సార్లు ఎముక పక్కకు జరిగింది. అది అతడికి చాలా బాధాకరంగా మారింది. (పర్యాటకంపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు) అనంతపురం జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేసే ఆ యువకుడి తల్లి.. తర్వాత అతడికి ఎంఆర్ఐ తీయించి కర్నూలు కిమ్స్ ఆసుపత్రికి పంపారు. అతడిని పూర్తిగా పరీక్షించినప్పుడు బంతిగిన్నెకీలు కూర్చునే ప్రాంతం (గ్లెనాయిడ్ కప్) అరిగిపోయినట్లు తెలిసింది. దీనివల్ల ఏమాత్రం కదిలించినా చేతి ఎముక జారిపోతుంది. గ్లెనాయిడ్ కప్లో నాలుగోవంతు పూర్తిగా అరిగిపోయింది. దీంతో ఎముక జారిపోతుందన్న భయంతో కొన్నాళ్లుగా అతడు కుడిచేతిని వాడటం మానేసి కేవలం ఎడమచేత్తోనే అన్ని పనులూ చేసుకుంటున్నాడు. పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాత లెటార్జెట్ ప్రొసీజర్ అనే పద్ధతిలో అతడికి శస్త్రచికిత్స చేశారు. ఇది చాలా అరుదైన పద్ధతి. ఇందులో భుజంలోనే వేరే ప్రాంతం నుంచి ఎముకను, దాని చుట్టూ ఉన్న కండరాలతో కలిపి కొంత కట్ చేసి తీసుకొచ్చి, ఇక్కడ అతుకుతారు. ఈ కేసులో కొరకాయిడ్ ప్రాసెస్ ఎముకను, దాని కండరాలను తీసుకొచ్చి ఈ కప్ వద్ద కూర్చోబెట్టారు. దానివల్ల గ్లెనాయిడ్ కప్ మళ్లీ పూర్తి స్థాయిలో ఏర్పడింది. దీన్ని ఆర్మ్ స్లింగ్ ఎఫెక్ట్ అంటారు. అతడి చేతి కదలికలు సాధారణ స్థాయికి రావడంతో డిసెంబరు 24న డిశ్ఛార్జి చేసి ఇంటికి పంపేశారు. మధ్యమధ్యలో మళ్లీ ఫాల్ అప్ కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు పరీక్షించగా చెయ్యి బాగుందని తేలింది. దాంతో ఇప్పుడు అతడు మళ్లీ క్రికెట్ కూడా ఆడగలుగుతున్నాడు. ఈ తరహా చికిత్సలు చేయడం కర్నూలు ప్రాంతంలో ఇదే తొలిసారి" అని డాక్టర్ జీవీవీఎస్ రవిబాబు తెలిపారు. -
80 నిమిషాల్లో 560 కి.మీ ప్రయాణం
రాంగోపాల్పేట్: పుణేలోని ఓ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి లంగ్స్ (ఊపిరితిత్తులు) సేకరించారు... అవి అక్క డి నుంచి చార్టెడ్ ఫ్లైట్లో బేగంపేట ఎయిర్పోర్టుకు.. అక్కడి నుంచి మినిస్టర్ రోడ్లోని కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నాయి. మొత్తం 560 కి.మీ దూరం ప్రయాణానికి కేవలం 80 నిమిషాలు పట్టింది... ఇక్కడ సిద్ధంగా ఉన్న ఓ వ్యక్తికి ఆ లంగ్స్ను అమర్చే చికిత్సను వైద్యులు మొదలుపెట్టారు. పుణే ట్రాఫిక్ పోలీసులు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ద్వారా రెండు ఎయిర్పోర్టుల నుంచి రోడ్డు మార్గంలో తరలించే ఏర్పాటు చేయడంతో ఇది సాధ్యమైంది. బ్రెయిన్డెడ్ వ్యక్తి నుంచి సేకరించి ఆదివారం ఉదయం పుణేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. ఆ వ్యక్తి మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబసభ్యులు అవయవదానం చేసి మరో నలుగురి ప్రాణం పోయాలని మానవత్వంతో ముందుకొచ్చారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి ఊపిరితిత్తుల దాత కోసం జీవన్దాన్లో పేరు నమోదు చేసుకున్నాడు. జీవన్ధాన్ డాక్టర్ స్వర్ణలత, పుణేలో జడ్టీసీసీ సెంట్రల్ కో–ఆర్డినేటర్ ఆర్తిగోఖలే.. పుణే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి ఊపిరితిత్తులను సేకరించి హైదరాబాద్ కిమ్స్ హార్ట్ అండ్ లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ ఇనిస్టిట్యూట్ లో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి నుంచి శస్త్రచికిత్స ద్వారా లంగ్స్ను సేకరించారు. పుణే ఆస్పత్రి నుంచి ఎయిర్పోర్టు వరకు అక్కడి ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. 11 కిమీ దూరం ఉండే పుణే ఎయిర్పోర్టుకు 20 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకుంది. అప్పటికే ఎయిర్పోర్టులో సిద్ధంగా ఉన్న చార్టెడ్ ఫ్లైట్ ఆ ఆర్గాన్స్తో పుణే నుంచి బయలుదేరి 4.30 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంది. నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ ఆదేశాల మేరకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి వరకు బేగంపేట ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి 2.9 కి.మీ దూరం ఉండే కిమ్స్ ఆసుపత్రికి 2 నిమిషాల 5 సెకన్లలో అంబులెన్స్లో ఆర్గాన్ను చేర్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న కిమ్స్ వైద్యుల బృందం ఆర్గాన్ను మరో వ్యక్తికి అమర్చే శస్త్రచికిత్స మొదలెట్టారు. ఈ ఆపరేషన్ పూర్తి కావడానికి సుమారు 6 నుంచి 8 గంటలు పడుతుందని వైద్యులు చెప్పారు. -
చిన్నారికి సరికొత్త జీవితం!
గచ్చిబౌలి: జీవితాంతం వైకల్యంతో బాధపడాల్సిన ఆరేళ్ల గ్రీష్మికకు కొండాపూర్లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు కొత్త జీవితాన్ని ఇచ్చారు. వివరాలివీ... గ్రీష్మిక వెన్నెముక వైకల్యంతో జన్మించింది. కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ చిన్నారిని మార్చిలో ఆమె తల్లిదండ్రులు కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పాపను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఆమెకు పుట్టకతోనే గూని ఉందని వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ కె.కృష్ణ చైతన్య గుర్తించారు. ఇది చాలా క్లిష్టమైనది కావడంతో బాలికకు ఒకసారి కాకుండా పలుమార్లు శస్త్రచికిత్సలు చేసి ఆమెకు 13 ఏళ్ల వయస్సు వచ్చే వరకు రాడ్ను పొడిగిస్తూ పోవాలి. వెన్నెముక ఎదుగుదలతోపాటే రాడ్ పొడవు కూడా పెంచాలి. అప్పుడే సమస్య పూర్తిగా నయమవుతుంది. సాధారణంగా ప్రతి 2 వేల మందిలో ఒకరికి ఇలా పుట్టుకతోనే గూని వస్తుంది. ఐదేళ్లలోపు పిల్లలకు ఇది రావడంతో వాళ్ల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది. శస్త్రచికిత్స ద్వారా గ్రోయింగ్రాడ్ వేశాం: డాక్టర్ కృష్ణచైతన్య వైకల్యం కారణంగా గ్రీష్మిక చిన్నచిన్న ఆనందాలకూ దూరమైందని కిమ్స్ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ కృష్ణచైతన్య సోమవారం తెలిపారు. కొండాపూర్లోని కిమ్స్ ఆస్పత్రిలో విలేకరులతో మాట్లాడారు. ఆమెకు గ్రోయింగ్రాడ్ వేయాల్సి వచ్చిందని, పాపకు 13 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆమె ఎదుగుదలకు ఇది అత్యవసరమని గుర్తించి వేశామన్నారు. మొదటి శస్త్రచికిత్స 2019 మార్చిలో చేసి అందులో డి3/డి4, ఎల్3/ఎల్4 వద్ద యాంకర్ స్క్రూలు బిగించామన్నారు. రెండో శస్త్రచికిత్సను ఈ నెలలోనే చేసి ఆ స్క్రూలను కొంత విస్తరించామన్నారు. మొదటి చికిత్సకు ఆరు గంటల సమయం పట్టిందని, రాడ్లు, స్క్రూలు వేసి వెన్నెముకను సరిచేశామన్నారు. ఇందుకోసం మేము ఇంట్రా ఆపరేటివ్ న్యూరల్ మానిటరింగ్ 3డి ప్రింటింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించామన్నారు. చిన్న వయసులో గుర్తిస్తే పిల్లల్లో ఇలాంటి వైకల్యాలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చాలా చక్కగా నయం చేయవచ్చన్నారు. సమావేశంలో ఆర్థోపెడిక్ స్పైన్ విభాగాధిపతి డాక్టర్ అన్నె సాయిలక్ష్మణ్, ట్రామా అండ్ ఆర్థోస్కోపీ సర్జన్ డాక్టర్ సి.ఆర్.సురేష్బాబు, మత్తు వైద్య నిపుణుల బృందం పాల్గొన్నారు. -
యశోద, కిమ్స్పై ఏం చర్యలు తీసుకున్నారు?
-
యశోద, కిమ్స్పై ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కోవిడ్ నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, బాధితులకు అందుతున్న చికిత్సపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. గాంధీ ఆస్పత్రిలోనూ కరోనా పరీక్షలు జరపాలని ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశించింది. కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించాలని సూచించింది. కరోనా బాధితులకు 4 లక్షల రూపాయలకు పైగా బిల్లులు వేసిన యశోద, కిమ్స్ ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. (తెలంగాణలో 99 శాతం రికవరీ : హెల్త్ డైరెక్టర్) అలాగే ప్రైవేటు కేంద్రాల్లో అన్ని రకాల పరీక్షలకు గరిష్ట చార్జీలు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆస్పత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్ల వివరాలను విస్తృత ప్రచారం చేయాలని సూచించింది. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో కరోనా చికిత్సలు చేస్తారా లేదో చెప్పాలని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ఈ నెల 27లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.(నిమ్స్లో మొదలైన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్) -
ఆ ఫీజులు పేదలకంటేనే ఒప్పుకున్నాం...
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కేవలం నగదు చెల్లించే కొన్ని వర్గాలకు మాత్రమేనని, ఆ మేరకు ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ఉ త్తర్వుల్లో మార్పులు చేయాలని తెలంగాణ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు, కిమ్స్ ఆస్పత్రుల అధినేత భాస్కర్రావు స్పష్టం చేశారు. దీనిపై సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రి ఈటల రాజేందర్తో జరిగిన చర్చల వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఆ ఫీజులు పేదలకంటేనే ఒప్పుకున్నాం... ‘సర్కారు జీవో ప్రకారమే కరోనా చికిత్సకు ఫీజులు వసూలు చేయాలని, ఆ ప్రకారమే చెల్లిస్తామని బీమా కంపెనీలు ఒత్తి డి చేస్తున్నాయి. అందరికీ అలా చేయాలంటే కుదరదని ప్ర భుత్వానికి విన్నవించాం. ప్రభుత్వం ప్రకటించిన ఫీజుల ప్ర కారం అందరికీ కరోనా వైద్యం కుదరదు. కేవలం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, పేదలకు ఆ ఫీజులకు చికిత్స అందించాలంటేనే ఒప్పుకున్నాం. కర్ణాటక, మహారాష్ట్రలలో విడుదల చేసిన జీవోల్లో కూడా కేవలం నగదు చెల్లించే రోగులకే ఆయా రాష్ట్రాలు ఫిక్స్ చేసిన ఫీజులను వసూలు చేయాలని జీవోల్లో ఉంది. ప్రైవేటు బీమా, సీజీహెచ్ఎస్ వంటి రోగులకు సర్కారు ఉత్తర్వులు వర్తించవు. అది కూడా సాధారణ వార్డుల్లో ఉన్న వారికే ఇది వర్తి స్తుంది. అందరికీ ఆ ఫీజు లతో వైద్యం చేయడం సాధ్యం కాదని చెప్పామని తెలిపారు. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి... నగదు చెల్లించే వారికి మాత్రమే ఆ ఫీజులు వర్తిస్తాయని ప్ర భుత్వం ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వాలని కోరినట్లు భాస్కర్రావు చెప్పారు. అందరికీ అవే ఫీజులతో చికిత్స చేస్తే ఆసుపత్రులు నిలదొక్కుకోలేవన్నారు. 50 శాతం పడకలు ప్రభుత్వానికి ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. కరోనా చికిత్సకు బెడ్ల కేటాయింపును యాప్ ద్వారా చేస్తారని, ఐఏఎస్లతో కమిటీ వేస్తారంటూ వచ్చిన ప్రచారమూ తమ కు తెలియదన్నారు. పడకలు లేవంటూ చెప్పడం, ఎవరో ఒ కరు రావడం వంటివి జరుగుతున్నాయి కాబట్టి ఒక నోడల్ ఆఫీసర్ను పెట్టాలని మాత్రం ప్రభుత్వాన్ని కోరామన్నారు. వాస్తవానికి ప్రభుత్వం కూడా ఉత్తర్వుల జారీకి ముందు జనరల్ వార్డుల్లో ఉన్న వారికే నిర్దేశించిన ఫీజులన్న విషయాన్ని అంగీకరించిందన్నారు. బీమా కంపెనీలకు ఈ ప్యాకేజీ వర్తిం చదని జీవోలో మార్పులు చేయాలని కోరామన్నారు. ఇప్పటికే వివిధ జబ్బులకు వర్తించేలా బీమా కంపెనీలు ప్రజల నుంచి పాలసీలు తీసుకున్నాయని, వాటి ప్రకారం ఫీజులు వసూలు చేస్తాం తప్ప ఈ ప్యాకేజీ ప్రకారం కరోనా రోగుల కు ఫీజులను వర్తింప చేయలేమన్నారు. ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు ప్రభుత్వ ప్యాకేజీ కిందకు రారని స్పష్టం చేశారు. వారంతా డబ్బులు చెల్లించాల్సిందేనన్నారు. -
గుండెకు ఆపరేషన్..మెదడువాపుతో చనిపోయాడన్నారు
రాంగోపాల్పేట్: గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ బాలుడిని చికిత్స నిమిత్తం కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పిస్తే శస్త్ర చికిత్స చేసి మెదడు వాపుతో చనిపోయాడని చెప్పారు. శస్త్ర చికిత్స బాగానే జరిగిందని చెప్పిన వైద్యులు తెల్ల వారే సరికి అతను మృతి చెందినట్లు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు చనిపోయాడని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టడమేగాక రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, జలాల్పూర్కు చెందిన అయ్యలమ్ కుమారుడు రవి (13) స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గత నెలలో అతను అస్వస్థతకు గురికావడంతో స్థానిక వైద్యులకు చూపించారు. అయితే అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో ఈ నెల 5న సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకుచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టుర్లు బాలుడి గుండెలో రంద్రాలు ఉన్నాయని ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద అతడికి చికిత్స అందించేందుకుగాను ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. ఈ నెల 10న బాలుడికి ఆపరేషన్ చేసిన వైద్యులు శస్త్ర చికిత్స విజయవంతం అయిందని తెలిపారు. 11న బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం అర్ధరాత్రి రవి మెదడు వాపు వ్యాధితో మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఆగ్రహానికి లోనైన మృతుని బంధువులు మంగళవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు మృతి చెందాడని ఆరోపిస్తూ రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యసేవల్లో లోపం లేదు:ఎండీ భాస్కర్రావు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రవికి శస్త్ర చికిత్సకు ముందు, అనంతరం వైద్యులు పూర్తి స్థాయి వైద్యసేవలు అందించారు. ఎక్కడ ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదు. శస్త్ర చికిత్స తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేయగా మెదడు పనితీరు సక్రమంగా లేదని గుర్తించి, అదే రోజు కుటుంబ సభ్యులకు చెప్పాం. గుండె ఆగిపోవడంతో రోగి మృతి చెందాడు. -
నా ప్రాణాలకు రక్షణ కల్పించండి: అనిత
హైదరాబాద్: మళ్లీ విధులకు వెళితే తన ప్రాణాలకు రక్షణ ఉండదని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని సిర్పూర్ కాగజ్నగర్ ఘటనలో గాయపడిన ఎఫ్ఆర్వో అనిత కోరారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు మాత్రమే అక్కడికి వెళ్లానని, 4 రోజుల ముందే గ్రామస్తులతో సమావేశం నిర్వహించి స్పష్టంగా చెప్పిన తర్వాత పొలంలోకి వెళ్లామని చెప్పారు. తాము మొక్కలు నాటే పనులు చేస్తుండగా జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణతోపాటు మిగతావారు వచ్చి తనను చుట్టుముట్టి కొట్టారని చెప్పారు. ఎంత వేడుకున్నా వినకుండా దాడి చేశారన్నారు. ఇక్కడ రాజకీయ నాయకులు గ్రామస్తులను రెచ్చగొట్టడం, అధికారులపై దాడులకు ఉసిగొల్పడం చేస్తుంటారని, గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పారు. దాడి చేసిన వారిపై ఏదో ఒక కేసు పెడితే మళ్లీ రాజకీయ బలంతో బయటకు వస్తారని, అప్పుడు తన ప్రాణాలకు రక్షణ ఉండదని భయాందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకుని తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. -
ఊపిరితిత్తుల్లో 25 పైసల నాణెం
అక్కిరెడ్డిపాలెం (గాజువాక): ఎప్పుడో పొరపాటున మింగిన 25 పైసల నాణేన్ని వైద్యులు కుట్టు కోత లేకుండా తొలగించి ఓ వృద్ధుడి ప్రాణాన్ని కాపాడారు. ఎల్.సాయిబాబు (77) అనే వృద్ధుడు 30 ఏళ్ల క్రితం 25 పైసల నాణేన్ని పొరపాటున మింగేశాడు. అయితే ఆ విషయాన్ని అతడు అంతటితో మర్చిపోయాడు. కొద్ది కాలం నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్ర జ్వరంతో బాధపడుతూ విశాఖ షీలానగర్లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించాడు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఊపిరితిత్తుల్లో 25 పైసల నాణెం ఉన్నట్లు గుర్తించారు. బ్రాంకోస్కోపీ ద్వారా పొడవైన ఫ్లెక్సిబుల్ ట్యూబ్కు కెమెరాను అమర్చి, ట్యూబ్ను ఉపిరితిత్తుల ద్వారా పంపించి నాణేన్ని తొలగించామని పల్మనాలజిస్ట్ డాక్టర్ కె.ఎస్.ఫణీంద్ర కుమార్ తెలిపారు. రోగి పూర్తిగా కోలుకోవడంతో శుక్రవారం డిశ్చార్జ్ చేశామన్నారు. -
మిసెస్ మామ్
-
మాజీ ఎమ్మెల్యే రుక్మిణమ్మ కన్నుమూత
పాలకొండ: శ్రీకాకుళం జిల్లా ఉనుకూరు మాజీ ఎమ్మెల్యే పాలవలస రుక్మిణమ్మ (89) శ్రీకాకుళంలోని కిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పాలకొండ మండలం వడమలో 1929లో జన్మించిన రుక్మిణమ్మ 1944లో వీరఘట్టం మండలం నీలానగరానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పాలవలస సంగన్నాయుడును వివాహం చేసుకున్నారు. 1952లో పాలకొండ నుంచి, 1962లో ఉనుకూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సంగన్నాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన 1970లో మృతి చెందడంతో రుక్మిణమ్మ 1972లో ఉనుకూరు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. 1980లో పాలకొండ సమితికి తొలి ప్రెసిడెంట్గా విజయం సాధించారు. రుక్మి ణమ్మ కుమారుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు పాలవలస రాజశేఖరం వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహరాల కమిటీ సభ్యుడిగా, వ్యవహరిస్తుండగా, మనుమరాలు రెడ్డి శాంతి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. -
వృద్ధురాలిపై ఎలుగుబంటి దాడి
డిచ్పల్లి, నిజామాబాద్ : గ్రామంలో వచ్చిన ఎలుగుబంటి ఓ వృద్ధురాలిపై దాడి చేసి గాయపరిచింది. స్థానికులు కర్రలతో వెంటబడడంతో అడవిలోకి పరుగు తీసింది. ఈ ఘటన మండలంలోని ధర్మారం(బి)లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ధురాలు కాసం లక్ష్మి ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి బయట గేటును తెరుస్తుండగా ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో ఆమె చేతులకు గాయాలయ్యాయి. ఆమె భయంతో కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి కర్రలతో ఎలుగుబంటిని తరిమేశారు. మదన్పల్లి వైపు ఎలుగుబంటి పారిపోయిందని గ్రామస్తులు తెలిపారు. స్థానికులు కొద్దిగా ఆలస్యంగా వచ్చి ఉంటే లక్ష్మితో పాటు అక్కడే ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను ఎలుగుబంటి తీవ్రంగా గాయపరిచి ఉండేదని సర్పంచ్ ఈదర కస్తూరి, ఉప సర్పంచ్ ఎడవెల్లి సోమనాథ్ లు తెలిపారు. యపడిన బాధితురాలిని 108 వాహనంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ కిమ్స్లో చేర్పించారు. అటవీ ప్రాంతంలో తాగునీరు లేకపోవడంతో ఎలుగుబంటి గ్రామంలోకి వచ్చి ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. ఎలుగుబంటి దాడితో ధర్మారం(బి), మదన్పల్లి, కేశాపూర్ గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. -
విలక్షణ నేత ఆనం వివేకా కన్నుమూత
-
ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/రాంగోపాల్పేట్: మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. మూత్రకోశ క్యాన్సర్తో బాధపడుతూ హైదరాబాద్లో చికిత్స పొందుతున్న అయన బుధవారం ఉదయం 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వివేకానందరెడ్డి ఈ నెల 13వ తేదీన హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. చికిత్సకు వివేకానందరెడ్డి శరీరం సహకరించకపోవడంతో తుదిశ్వాస విడిచినట్లు ఆయన సోదరుడు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ప్రకటించారు.మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు ఆసుపత్రికి వచ్చి నివాళులర్పించారు. నెల్లూరుకు భౌతికకాయం ఆనం వివేకానందరెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి బుధవారం రాత్రి 8 గంటల సమయంలో నెల్లూరులోని ఏసీ సెంటర్లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విలక్షణ నేత : 1950 డిసెంబర్ 25 నెల్లూరులో జన్మించిన వివేకానందరెడ్డి విలక్షణ రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. మాజీ మంత్రి, తన తండ్రి ఆనం వెంకటరెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని 1980లో నెల్లూరు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1982లో నెల్లూరు మున్సిపల్ కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్గానూ పనిచేశారు. వివేకానందరెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఏసీ సుబ్బారెడ్డి కాగా, రెండో కుమారుడు ఆనం రంగమయూర్రెడ్డి ప్రస్తుతం నెల్లూరులో కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. సీఎం చంద్రబాబు సంతాపం సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆనం కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆనం కుంటుంబీకులకు జగన్ సానుభూతి సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. వివేకా కుటుంబ సభ్యులకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉత్తమ్ సంతాపం సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రఘువీరా, కేవీపీ దిగ్భ్రాంతి వివేకానందరెడ్డి మృతి పట్ల పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు బుధవారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
కూసుమంచి: హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు బుధవారం వేకువజామున ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద అదుపు తప్పి అలుగుల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్యకు తీవ్ర గాయం కాగా.. మరో 11 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఖమ్మం డిపోకు చెందిన టీఎస్04 జెడ్ 0230 నంబరు గల రాజధాని ఏసీ బస్సు కూకట్పల్లి నుంచి ఖమ్మం బయలుదేరింది. బస్సు నాయకన్గూడెం గ్రామం దాటగానే ప్రమాదవశాత్తు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పాలేరు రిజర్వాయర్ అలుగుల ప్రాంతంలోని లోయలోకి దూసుకెళ్లింది. దీంతో ముందు వరుసలో కూర్చున్న మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య పెదవి పగిలి తీవ్ర రక్తస్రావం అయింది. మిగిలిన ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి గాయపడిన మాజీ ఎమ్మెల్యేను ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రికి తలించారు. మిగిలిన వారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, ఎదురుగా వస్తున్న లారీలను తప్పించే క్రమంలో బస్సు అదుపుతప్పినట్లు డ్రైవర్ గుగులోతు భద్రు తెలిపాడు. -
ఇంటికి దాసరి భౌతికకాయం తరలింపు
హైదరాబాద్: దర్శక నిర్మాత దాసరి నారాయణరావు (75) భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి తరలించారు. తీవ్ర ఆనారోగ్యంతో గత కొన్ని రోజులుగా సతమతమవుతున్న దాసరి వారం రోజుల కిందట మరోసారి కిమ్స్ లో చేరి అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తర్వాత మృతిచెందిన విషయం తెలిసిందే. దాసరి మరణవార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దాసరి భౌతికకాయాన్ని సందర్శించేందుకు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయన ఇంటికి తరలివస్తున్నారు. దాసరితో వారికి ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. దర్శకరత్న దాసరి మృతి ఇండస్ట్రీకి తీరనిలోటని, ఆయన లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నామంటూ టాలీవుడ్ ప్రముఖులు వాపోతున్నారు. విక్టరీ వెంకటేశ్, డా. రాజశేఖర్, జీవిత, నిర్మాతలు సురేష్ బాబు, అశోక్, దర్శకులు బోయపాటి శ్రీను, సుకుమార్, విజయశాంతి, హేమ, అలీ, సనీ ఆర్టిస్టులు, బుల్లితెర నటులు దాసరి భౌతికకాయాన్ని దర్శించుకుని నివాళులర్పిస్తున్నారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు మొయినాబాద్లో ప్రభుత్వ లాంచనాలతో దాసరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
సాక్షి కుటుంబానికి ఆత్మీయుడు
-
దాసరి నారాయణరావు కన్నుమూత
-
దాసరి నారాయణరావు కన్నుమూత
ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు (75) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వారం రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. మంగళవారం సాయంత్రం తర్వాత మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే వైద్యులు ప్రకటించడానికి ముందుగానే ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఆస్పత్రి బయటకు వచ్చి, ''గురువు గారు ఇక లేరు, కాసేపట్లో బాడీని ఇంటికి తీసుకెళ్తున్నాం'' అని కన్నీటి పర్యంతమై చెప్పారు. కళ్యాణ్ దాసరికి అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తి కావడంతో ఏం జరిగిందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. గతంలో ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత వారం రోజుల క్రితం దాసరి నారాయణరావు మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఆయన అన్నవాహికకు రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేశామని, ఆ తర్వాత ఆయన మూత్రపిండాలలో సమస్య ఏర్పడిందని వైద్యులు తొలుత విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో ప్రకటించారు. రాత్రి 7 గంటలకు... రాత్రి 7 గంటలకు ఆయన గుండె పనిచేయడం మానేసిందని, దాన్ని పునరుద్ధరించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదని కిమ్స్ వైద్యులు చెప్పారు. ఆయన మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర వివరాలతో కూడిన బులెటిన్ను బుధవారం విడుదల చేయగలమని అన్నారు. ముందుగా ఆయన కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేస్తామని, ఆ తర్వాత మాత్రమే బయటకు విడుదల చేయగలమని తెలిపారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దాసరి హెల్త్ బులెటిన్ విడుదల
తీవ్ర అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ప్రముఖ దర్శక నిర్మాత డాక్టర్ దాసరి నారాయణరావు హెల్త్ బులెటిన్ను ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. ఆయన అన్నవాహికకు రీకన్స్ట్రక్టివ్ శస్త్ర చికిత్స చేశామని, ఆ తర్వాత ఆయనకు మూత్రపిండాలలో సమస్య తలెత్తిందని వివరించారు. అందువల్ల ఆయనకు ప్రస్తుతం హిమో డయాలసిస్ చేస్తున్నట్లు అందులో తెలిపారు. ఆయన ఐసీయూలో ఉండి చికిత్స పొందుతున్నారని, ఆయనను నిరంతరం వైద్యుల బృందం పర్యవేక్షిస్తోందని చెప్పారు. దాసరి నారాయణరావు ఆరోగ్యం ఇప్పటికి నిలకడగానే ఉందని కిమ్స్ వైద్యులు ఆ హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. వారం రోజుల క్రితం కిమ్స్లో చేరిన దాసరి ఆరోగ్యం కొంతవరకు విషమించినట్లు తొలుత కథనాలు వచ్చాయి. మోహన్బాబు, ఆర్ నారాయణమూర్తి తదితరులు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి దాసరిని పరామర్శించారు. -
వైద్యవిధానంలో మార్పులు రావాలి
కిమ్స్ వైద్య పట్టభద్రుల ప్రదానోత్సవంలో డాక్టర్ రమేష్ సి. డేకా అమలాపురం రూరల్ : ప్రస్తుతం వస్తున్న రోగాలకు అనుగుణంగా వైద్యవిధానంలో మార్పులు రావాలని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్, అస్సాం డౌ¯ŒSటౌ¯ŒS వైస్ ఛాన్సలర్ డాక్టర్ రమేష్.సి.డేకా అభిప్రాయపడ్డారు. స్థానిక కిమ్స్ వైద్య కళాశాల ఏడవ వైద్య పట్టభద్రుల ప్రదానమహోత్సవం శనివారం రాత్రి డీ¯ŒS ఏఎస్ కామేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. డేకా మాట్లాడుతూ వైద్యవృత్తి ఎంతో పవిత్రమైందని, యువ వైద్యులు చట్టబద్ధమైన, సర్వసమ్మతమైన వైద్యవిధానాలను అనుసరించి రోగులకు సేవలందించాలన్నారు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ వి.రామాంజనేయులు మాట్లాడుతూ భారత గ్రామీణ ప్రజారోగ్య సమస్యలు ఎదుర్కొనడంలో యువ వైద్యుల పాత్ర ముఖ్యమైందన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్యవిశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు మాట్లాడుతూ నిట్ పరీక్ష విధానంలో ఎంసీఐ ద్వారా ఎన్టీఆర్ యూనివర్సిటీకి గుర్తింపు లభించిందన్నారు. కిమ్స్ చైర్మన్ చైతన్యరాజు మాట్లాడుతూ తమ విద్యాలయం ద్వారా ఇప్పటి వరకు ఏడు బ్యాచ్ల యువ వైద్యులను సమాజానికి అందించామన్నారు. డీ¯ŒS ఏఎస్ కామేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ జీకేవీ ప్రసాద్ యువ వైద్యులతో ప్రమాణం చేయించారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ ద్వారా 11 స్వర్ణపతకాలు సాధించిన డాక్టర్ పావనీ ప్రియాంకను సత్కరించారు. అనంతరం 12వ వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కిమ్స్ ఎండీ, ఎమ్మెల్సీ రవికిరణ్వర్మ, గైట్ ఎండీ శశికిరణ్వర్మ, సీఈవో రఘు పాల్గొన్నారు. -
దాసరిని పరామర్శించిన వైఎస్ జగన్
హైదరాబాద్ : సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శకరత్న దాసరి నారాయణరావును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం పరామర్శించారు. నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, బాలసౌరి తదితరులతో కలిసి కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళిన ఆయన దాసరిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడారు. దాసరి త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
రెండు రోజుల్లో సాధారణవార్డుకు దాసరి
మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శుక్రవారం సాయంత్రం కిమ్స్ వైద్యులు ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని, రెండు రోజుల్లో సాధారణ వార్డుకు తరలిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆయన వెంటిలేటర్ మీద ఉండటంతో మాట్లాడలేకపోతున్నారని వివరించారు. అన్నవాహికలో ఉన్న పదార్థాల వల్లే ఇన్ఫెక్షన్ రావడంతో.. వాటన్నింటినీ శస్త్రచికిత్స ద్వారా తొలగించిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉండటంతో దాసరి నారాయణరావును వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. మధ్యలో మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా రావడంతో ఆయనకు డయాలసిస్ చేశారు. దాసరి ఆరోగ్యం గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు వాకబు చేశారు. తెలుగు సినీ పరిశ్రమ యావత్తు కిమ్స్ ఆస్పత్రికి తరలివచ్చి ఆయనను పరామర్శించింది. -
రెండు రోజుల్లో సాధారణవార్డుకు దాసరి
-
దాసరిని పరామర్శించిన అంబటి
-
దాసరి ఆరోగ్యంపై ప్రముఖుల ఆరా!
హైదరాబాద్: తీవ్ర అస్వస్థతకు గురై కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావును పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుక్రవారం పరామర్శించారు. దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవి, ఆయన బావమరిది అల్లు అరవింద్, దర్శకుడు వివి వినాయక్, సినీనటి జయప్రద తదితరులు దాసరి నారాయణరావును ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా దాసరి నారాయణను పరామర్శించి.. ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. దాసరి ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని, ఆయన్ని చూశాక ధైర్యం వచ్చిందని, ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని చిరంజీవి మీడియాతో పేర్కొన్నరు. -
దాసరి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
-
దాసరి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
హైదరాబాద్: కిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ఆరోగ్యం మెరుగవుతోందని వైద్యులు చెప్పారు. దాసరి ఆరోగ్యంపై గురువారం సాయంత్రం కిమ్స్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. డయాలసిస్ అవసరం లేకుండానే దాసరి చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు చెప్పారు. ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని, మూడు నాలుగు రోజుల్లో సాధారణ పరిస్థితికి వస్తుందని తెలిపారు. వెంటిలేటర్పైనే ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నామని వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా దాసరి కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి దాసరిని పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. (చదవండి: దర్శకుడు దాసరికి అస్వస్థత) -
మెరుగవుతున్న దాసరి ఆరోగ్యం
పరామర్శించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దర్శక నిర్మాత దాసరి నారాయణరావు కోలుకుంటున్నారు. అన్నవాహికకు ఇన్ ఫెక్షన్ సోకడంతో ఆయనను మూడు రోజుల కిందట సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితంతో పోలిస్తే బుధవారం ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందని, ఊహించిన దానికంటే ఎక్కువగా చికిత్సకు స్పందిస్తున్నట్లు కిమ్స్ ఎండీ, సీఈవో డాక్టర్ భాస్కర్రావు ప్రకటించారు. దాసరి త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మూత్ర పిండాల పనితీరు మెరుగుపడటంతో డయాలసిస్ నిలిపివేసినట్లు తెలిపారు. అయితే మరో 24 గంటలపాటు సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నటుడు మోహన్ బాబు మాట్లాడుతూ.. క్లిష్టమైన ఆపరేషన్ ను కిమ్స్ వైద్యులు విజయవంతంగా చేశారని, దాసరి పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం షిర్డి వెళ్లి తన గురువు కోసం బాబాకు పూజలు చేసి వస్తానని చెప్పారు. ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కూడా ఆస్పత్రికి వచ్చి దాసరి ఆరోగ్యంపై వాకబు చేశారు. వైఎస్ జగన్ పరామర్శ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు దాసరిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లా డి ధైర్యం చెప్పారు. అక్కడే ఉన్న మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులతో దాసరి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఆస్పత్రి ఎండీ భాస్కర్రావుతో మాట్లాడి ఎలాంటి వైద్యం అందిస్తున్నారు, ప్రస్తుత పరిస్థితి ఏమి టి, ఎన్ని రోజుల్లో కోలుకుంటారనే విషయా లను అడిగి తెలుసుకున్నారు. జగన్ వెంట వైఎస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అధికార ప్రతినిధి అరుణ్ కుమార్, నాయకుడు కాసు మహేశ్రెడ్డి కూడా ఉన్నారు. దాసరి త్వరగా కోలుకోవాలి: పవన్ దాసరి నారాయణరావును సినీనటుడు పవన్ కల్యాణ్ పరామర్శించారు. బుధవారం సాయంత్రం ఆస్పత్రికి వచ్చి దాసరి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అలాగే వైద్యులతో ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాసరి పూర్తిగా కోలుకుంటారనే నమ్మకంతో వైద్యులు ఉన్నారని, గురువారం వెంటిలేటర్ తొలగిస్తామని చెప్పారని తెలిపారు. త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. పవన్ తోపాటు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మత్ శరత్ తదితరులు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కూడా దాసరి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. -
దాసరికి పవన్ కల్యాణ్ పరామర్శ
-
దాసరిని పరామర్శించిన పవన్ కల్యాణ్
హైదరాబాద్: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పరామర్శించారు. సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతున్న దాసరిని కలిసిన పవన్ అనంతరం డాక్టర్లతో ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దాసరి నారాయణరావు త్వరలో కోలుకోవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. మూడు రోజుల క్రితం మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా దర్శకరత్న దాసరి కిమ్స్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం దాసరి ఆరోగ్యంపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అన్నవాహికలో ఇన్ఫెక్షన్ను తొలగించేందుకు స్టెంట్ వేయడంతో పాటు.. వెంటిలెటర్పై ఉంచి శ్వాస అందజేస్తున్నామని వారు తెలిపారు. ఆయనకు డయాలసిస్ కూడా చేస్తున్నారు. దాసరి కుమారులు అరుణ్, ప్రభు ఆస్పత్రిలోనే ఉన్నారు. ప్రస్తుతం దాసరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. -
దాసరికి వైఎస్ జగన్ పరామర్శ
-
దాసరిని ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచాం
హైదరాబాద్: కిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు కిడ్నీల పనితీరు బాగానే ఉందని ఆస్పత్రి ఎండీ భాస్కరరావు చెప్పారు. మంగళవారం ఆయనకు డయాలసిస్ చేశామని, ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచామని తెలిపారు. బుధవారం సాయంత్రం దాసరి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మూడు రోజుల క్రితం మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా దాసరి కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి దాసరిని పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. దాసరి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. (చదవండి: ఆస్పత్రిపాలైన ప్రఖ్యాత తెలుగు దర్శకుడు) -
దాసరికి వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను వైఎస్ జగన్ బుధవారం కలిశారు. ఆయనకు అందిస్తున్న వైద్యంపై డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. (చదవండి : దర్శకుడు దాసరికి అస్వస్థత ) దాసరి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. దాసరిని పరామర్శించిన వారిలో పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఇతర నేతలు ఉన్నారు. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన దాసరి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. -
దర్శకుడు దాసరికి అస్వస్థత
అనారోగ్యంతో కిమ్స్లో చేరిన దాసరి నారాయణరావు అన్నవాహికతో పాటు కిడ్నీలు, ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వెంటిలేటర్పై ఉంచి వైద్య సేవలు దాసరి ఆరోగ్యం నిలకడగానే ఉందని కిమ్స్ వైద్యుల వెల్లడి మంత్రి తలసాని, మోహన్బాబు సహా పలువురి పరామర్శ హైదరాబాద్ ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం అన్నవాహికలో ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన ఆయనను వైద్యులు పరీక్షించి ఊపిరితిత్తులు, కిడ్నీలు కూడా ఇన్ఫెక్షన్కు గురైనట్లు గుర్తించి వైద్యసేవలు అందజేశారు. దాసరి ఆరోగ్య స్థితిని, ఆయనకు అందిస్తున్న వైద్యాన్ని కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్రావు, ఇతర వైద్యులు మీడియాకు వివరించారు. అన్నవాహికలో ఇన్ఫెక్షన్ను తొలగించేందుకు వైద్యం అందజేస్తూనే.. వెంటిలెటర్పై ఉంచి శ్వాస అందజేస్తున్నామని వారు తెలిపారు. అన్నవాహికకు స్టెంట్ వేసినట్లు చెప్పారు. కిడ్నీలు కూడా దెబ్బతిన్నట్లు పరీక్షల్లో వెల్లడవడంతో డయాలసిస్ కూడా చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దాసరి కుమారులు అరుణ్, ప్రభు ఆస్పత్రిలోనే ఉన్నారు. తరలి వచ్చిన సినీ ప్రముఖులు.. దాసరి కిమ్స్లో చికిత్స పొందుతున్నారనే సమాచారం తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నాయి. ప్రముఖ సినీనటుడు మోహన్బాబు, ఆయన సతీమణి, కుమారుడు మంచు విష్ణు మంగళవారం ఉదయం ఆస్పత్రికి వచ్చి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. సినీ నటి జయసుధ, ప్రముఖ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, సినీ దర్శకులు రాఘవేంద్రరావు, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు దాసరిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చారు. తన గురువు దాసరి నారాయణరావు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, ఆయన అందరికీ కావలసిన వ్యక్తి అని మోహన్బాబు చెప్పారు. -
'దాసరి త్వరలో కోలుకునే ఆస్కారం'
-
'దాసరి త్వరలో కోలుకునే ఆస్కారం'
ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావుకు ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, వాటికి చికిత్స చేసేందుకు వెంటిలేటర్ మీద పెట్టామని కిమ్స్ ఎండీ, సీఈవో డాక్టర్ బొల్లినేని భాస్కరరావు చెప్పారు. దాసరికి చెస్ట్ ఆపరేషన్ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నవాహికలో ఉన్న పదార్థాల వల్లే ఇన్ఫెక్షన్ వస్తోందని, వాటన్నింటినీ శస్త్రచికిత్స ద్వారా తీసేశామని ఆయన వివరించారు. ఇప్పుడైతే ఆయన చాలా బాగున్నారని, రెండు మూడు రోజుల్లో బాగా కోలుకోడానికి ఆస్కారం ఉందని అన్నారు. ఇది చాలా సున్నితమైన విషయం కాబట్టి దీని గురించి ఇంకేమీ చెప్పలేనని డాక్టర్ భాస్కరరావు అన్నారు. (చదవండి: వెంటిలేటర్పై దాసరి నారాయణరావు) తన గురువుగారైన దాసరి నారాయణరావు తప్పకుండా కోలుకుంటారని, ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ కావల్సిన మనిషని నటుడు మోహన్ బాబు అన్నారు. డాక్టర్లు అన్నీ చెబుతున్నారని.. వీళ్లు తనకు, దాసరికి కూడా బాగా కావల్సిన వాళ్లని ఆయన తెలిపారు. దాసరి నూరేళ్లు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని, అందరూ కూడా ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించాలని కోరారు. దాసరి నారాయణరావు అన్నయ్య, దాసరి కుమారుడు రఘు కూడా ఆస్పత్రి వద్దకు వచ్చారు. -
కిమ్స్లో మహారాష్ట్ర యువకుడికి కాలేయ మార్పిడి
హైదరాబాద్: తను కన్నుమూస్తూ మరో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపాడు ఓ యువకుడు. నెల్లూరుకు చెందిన దినేష్రెడ్డి (31) కొంత కాలంగా తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం వారం క్రితం నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చేరాడు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో శుక్రవారం రాత్రి బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అవయవదానానికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో జీవన్దాన్కు సమాచారమిచ్చారు. జీవన్దాన్లో పేరు నమోదు చేసుకుని హైదరాబాద్ కిమ్స్లో కాలేయ, గుండె మార్పిడి చికిత్సకు ఎదురు చూస్తున్న ఇద్దరు బాధితులకు సమాచారం ఇచ్చారు. అవయవమార్పిడి చికిత్సకు వారు అంగీకరించడంతో వారికి చికిత్స చేస్తున్న వైద్య బృందం వెంటనే ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరు చేరుకుంది. దాత నుంచి గుండె, కాలేయం, కిడ్నీలను సేకరించింది. రెండు కిడ్నీలను నెల్లూరు కిమ్స్లో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులకు అమర్చగా, గుండె, కాలేయాన్ని ప్రత్యేక బాక్స్లో భద్రపరిచి ఉదయం 6.30 గంటలకు నెల్లూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 7.30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అటు నుంచి ట్రాఫిక్ పోలీసుల సహాయం (గ్రీన్ చానల్)తో కిమ్స్కు తరలించారు. మహారాష్ట్ర నాందేడ్కు చెందిన 36 ఏళ్ల యువకునికి కాలేయాన్ని విజయవంతంగా అమర్చారు. దాత నుంచి సేకరించిన గుండె స్వీకర్తకు మ్యాచ్ కాలేదు. దాత హైబీపీతో బాధపడుతుండటం, సాధారణంగా 1 సెంటీమీటర్ల మందంలో ఉండాల్సిన గుండె రక్త నాళాలు 1.5 సెంటిమీటర్ల మందంలో ఉండటం వల్ల అవయవమార్పిడికి పనికి రాలేదు. దీంతో గుండె మార్పిడి చికిత్సను విరమించుకున్నట్లు కిమ్స్ సీఈవో భాస్కర్రావు వెల్లడించారు. -
హార్ట్ఎటాక్పై ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ
హైదరాబాద్ (రాంగోపాల్పేట్) : హఠాత్తుగా గుండె నొప్పికి గురయ్యే వారిని రక్షించేందుకు నగరంలోని ట్రాఫిక్ పోలీసులకు కిమ్స్ ఆస్పత్రి ఈ నెల 16వ తేదీన ఓ రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కిమ్స్ ఆస్పత్రి సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ హయగ్రీవచారి గురువారం వెల్లడించారు. హృదయ సంబంధిత వ్యాధితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని రక్షించేందుకు ఉపయోగించే కార్డియో పల్మనరీ రిసషియేషన్ విధానంపై పోలీసులకు వైద్య నిపుణులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. గుండె సంబంధిత ఇబ్బందులకు గురయ్యే వారిని ఆస్పత్రికి చేర్చేలోపు ముందుగా శ్వాస సక్రమంగా అందించడంతోపాటు రక్తప్రసరణ మెరుగయ్యేలా చూడటం వంటివి ఈ విధానంలో ఉంటాయని పేర్కొన్నారు. అకస్మాత్తుగా గుండె సంబంధ ఇబ్బందులు ఎదుర్కొనే వారిని సకాలంలో ఆస్పత్రికి చేర్చడంతో పాటు ముందుగా ఇలా చేయడం ద్వారా వారి ప్రాణాలు నిలబెట్టవచ్చని సూచించారు. ట్రాఫిక్ పోలీసుల శిక్షణ కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్, డీసీపీలు ఎల్ఎస్ చౌహాన్, ఏవీ రంగనాథ్ పాల్గొంటారని డాక్టర్ హయగ్రీవచారి వివరించారు. -
పోర్షియాతో జట్టుకట్టిన కిమ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవలను ఇంటి వద్దనే అందించేందుకు కిమ్స్ ఆసుపత్రి.. హోమ్ హెల్త్కేర్ సేవలందించే పోర్షియాతో జట్టు కట్టింది. ఈ ఒప్పందంతో సికింద్రాబాద్, కొండాపూర్లోని కిమ్స్ ఆసుపత్రుల నుంచి డిశ్చార్చి అయిన పేషెంట్లకు ఇతర వైద్య సేవలను పోర్షియా ద్వారా అందిస్తామని, టెక్నాలజీ ఆధారిత సమగ్ర వైద్య సేవలను ఇంటి వద్దనే పొందొచ్చని కిమ్స్ తెలియజేసింది. -
చచ్చేంత చావు
మట్టి నుంచి వచ్చిన మానవుడు మట్టిలో కలవాల్సిందే.. కాని... బంధుత్వాలు, మానవత్వం మట్టిపాలు అవుతుంటే చూడలేకపోతున్నాం! స్వతంత్య్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్.. అన్న ఆకలిరాజ్యం సినిమా పాట మానవత్వంలేని ఆకలిని సజీవంగా ఉంచింది! ధార్మిక ఆలోచనలు ఉన్న చాలామంది నమ్మే విషయం.. మనిషి పోయినా ఆ మనిషి ఆనవాళ్లు ప్రేమరూపంలో, ఎనర్జీ రూపంలో మనవెంటే ఉంటాయని! ఈ కథనం వాస్తవం! మన కళ్లముందే జరిగిన డబ్బు మాయ! తల్లి చావు వార్త అందరికీ తెలిస్తే ఖర్చు భరించలేమని గోప్యంగా ఖననం చేసిన కొడుకు కథ! తప్పు ఆ కొడుకుదా? తప్పొప్పులు ఖాయం చేసే వ్యవస్థదా? లేక అమ్మ ప్రేమని కూడా అమ్మేసే డబ్బుదా?మట్టిలో గింజ పెడితే చెట్టవుతుంది! కానీ ఈ చెట్టంత కొడుకు కాసుల కోసం చేసిన నిర్వాకం అందరినీ విస్మయపరిచింది! అమ్మలకు బతకడమే చావై పోయిన ఈ రోజుల్లో చావు.. మానవత్వం చచ్చినంత చావైంది! కరెన్సీ నోటు మీద ఉన్న గాంధీజీ తన జీవితంలో ఏనాడూ డబ్బును ఆశించలేదు. కాని ఆయన బొమ్మ ఉన్న ఆ నోట్లను మాత్రం ప్రతి ఒక్కరూ ఆశిస్తూనే ఉన్నారు. ఉంటారు. ఆదర్శం కంటే అణా పైసలకే ఎక్కువ విలువ ఉన్న రోజులు వచ్చాయి. బంధాలను వెల కట్టలేము అనుకునే రోజులు పోయి ‘వెల’ను బట్టే బంధాలు మిగుల్చుకునే రోజులు ఏనాడో వచ్చేశాయి. బతికి ఉన్న మనిషి చనిపోయాడని పాలసీ క్లయిమ్ చేసిన ఘటన గతంలో ఎప్పుడో జరిగితే జనం వింతగా చెప్పుకున్నారు. కాని ఇప్పుడు అలాంటివి కోకొల్లలు. కడుపున పుట్టిన పిల్లలు భారమవుతారని వదిలేసేవాళ్లు కొందరైతే కని పెంచినవారు భారమవుతారని వదిలేసేవాళ్లు మరికొందరు. డబ్బు పాపిష్టిది అని తెలిసినా పాపిష్టి పనులు చేయడానికి సిద్ధపడేవాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తరగడం లేదు. కొద్దిపాటి డబ్బుల కోసం చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకోవడం కోసం చైన్ స్నాచర్లుగా, కిడ్నాపర్లుగా, దోపిడీ దొంగలుగా మారుతున్న చదువుకున్న యువకులను చూస్తుంటే ఆందోళనగా ఆనిపిస్తుంది. డబ్బు సహాయం ఎక్కడ చేయాల్సి వస్తుందోనని ప్రాణ స్నేహాలను వదలుకునేవారు కొద్ది పాటి డబ్బుల్లో తేడా వస్తే ప్రాణస్నేహితులను కడతేర్చేవారు నిత్యం కనిపిస్తున్నారు. పూర్వికులు ‘పైసా మే పరమాత్మ హై’ అన్నారు తప్ప ‘పైసా హీ పరమాత్మా హై’ అనలేదు. సాటి మనిషిలో పరమాత్ముణ్ణి చూస్తే బంధాలు అనుబంధాలు మనిషితనం మిగులుతాయి. రూపాయిలో దేవుడున్నాడనుకుంటే ఇదిగో ఇలాంటి ఘటనలే జరుగుతాయి. వరంగల్జిల్లా, భూపాలపల్లి పట్టణంలోని ఎల్బీనగర్ నివాసి.. కట్కూరి శ్రీనివాస్. సింగరేణి సివిల్ ఆఫీస్లో ఉద్యోగం. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు అక్కచెల్లెళ్లు. తల్లి కట్కూరి మల్లమ్మ. ఎనభై ఏళ్లు. అనారోగ్యంతో బాధపడుతోంది. నలుగురు కొడుకులు మూడు నెలలకొకరు చొప్పున తల్లి బాగోగుల బాధ్యతను పంచుకున్నారు. ఈ క్రమంలో భాగంగా శ్రీనివాస్ మూడు నెలల కిందట కరీంనగర్జిల్లాలోని గోదావరిఖనిలో ఉంటున్న తన తమ్ముడు కృష్ణ దగ్గర్నుంచి తల్లిని భూపాలపల్లికి తీసుకొచ్చాడు. మొన్న శుక్రవారం (ఒకటవ తేదీ )ఉదయం మల్లమ్మ పెద్ద కూతురు బల్ల సరస్వతి తల్లిని చూడడానికి సోదరుడు శ్రీనివాస్ ఇంటికి వచ్చింది. తల్లితో మంచిచెడు మాట్లాడి ఆమెకు పళ్లరసాన్ని తాగించి సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్ళింది. అదే రోజు సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో మల్లమ్మ మరణించింది. తల్లి మరణ వార్తను ఊళ్లోనే బంధువుల ఇంట్లో ఉన్న అక్కకు కానీ మిగిలిన తోబుట్టువులకు కానీ తెలియపర్చలేదు శ్రీనివాస్. తెలియపర్చకపోగా అప్పటికప్పుడు ఓ టాటా ఏస్ ప్యాసింజర్ వాహనాన్ని తీసుకొని వచ్చి భార్య కృష్ణవేణి సహాయంతో తల్లి మృతదేహాన్ని కెటికె 2వ గని దగ్గరున్న శ్మశాన వాటికకు తీసుకెళ్ళాడు. మృతదేహాన్ని ఖననం చేశాడు. బంధువుల ఇంటికి వెళ్ళిన సరస్వతి సుమారు 6 గంటల సమయంలో తిరిగి శ్రీనివాస్ ఇంటికి వచ్చింది. ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడంతో చుట్టుపక్కల వారిని అడిగింది. వాళ్లు ‘మీ అమ్మ చనిపోయింది. మీ తమ్ముడు, మరదలు కలిసి శవాన్ని ఖననం చేయడానికి వెళ్లారు’ అని చెప్పారు. ఆ మాటలకు సరస్వతి అవాక్కయింది. ఏడుస్తూ పోలీస్స్టేషన్కు వెళ్లి తమ్ముడు శ్రీనివాస్, మరదలు కృష్ణవేణిపై ఫిర్యాదు చేసింది. తన తల్లి మరణంపై అనుమానం ఉందని, దర్యాప్తు జరిపించాలని కోరింది. ఈ మేరకు ఎస్సై గణపతి నరేష్ కేసు నమోదు చేసుకున్నారు. శనివారం ఉదయం శ్రీనివాస్ను విచారించారు. అనంతరం సంఘటన స్థలానికి వెళ్ళి స్థానిక తహశీల్దార్ సత్యనారాయణ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. పోస్ట్మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని పరకాల సివిల్ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టమ్ నివేదికలో మల్లమ్మది సహజ మరణమనే తేలింది. అంత్యక్రియల ఖర్చులకు భయపడేనా.. ? కొంతకాలంగా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లతో శ్రీనివాస్కు విభేదాలున్నాయట. ఇంతలోకే తల్లి మరణించడంతో ఆమె అంత్యక్రియలు, కర్మకాండల ఖర్చులు తానే భరించాల్సి వస్తుందని భావించిన శ్రీనివాస్ ఆమె మరణవార్తను గోప్యంగా ఉంచినట్లు తెలిసింది. - పి రవిభాస్కర్ సోషల్స్టిగ్మా గురించి బాధపడక్కర్లేదు కుటుంబంలో ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులను ఓదార్చి, వాళ్లకు కొంత స్వాంతన ఇవ్వడం ఓ ఆనవాయితీ, ఆచారం. అయితే మారిన కాలంలో ఇవన్నీ ఓ భారంగా మారాయి. నిజానికి పదమూడు రోజుల పండగలాంటివన్నీ కొంతమందికి పనికల్పించే కట్టుబాటు, ఏర్పాటు. పోయిన మనిషిని కనీసం యేడాదికి ఒక్కసారన్నా స్మరించుకోవాలని చేసిన ఏర్పాట్లే తద్దినాలు, శ్రాద్ధాలు. కానీ ఇవన్నీ ఇప్పుడు దిగువమధ్యతరగతి వాళ్లకు ఆర్థికభారంగా పరిణమించాయి. అనారోగ్యంతో చనిపోతే బతికున్నవాళ్లకు మరీ కష్టం. ఆ మనిషికైన ఆసుపత్రి ఖర్చు అప్పటికే ఆ కుటుంబాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసి ఉంటుంది. చనిపోయాక కర్మకాండల పేరుతో జరిగే తంతు మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. అసలు మారిన ఈ కాలంలో పరామర్శ, ఓదార్పుల పేరుతో ఇంటికి రావాల్సిన అవసరమే లేదు. ఫోన్లు వచ్చాయి. సోషల్నెట్వర్కింగ్ సిస్టమ్ ఉంది. అందులో ఓ మెసేజ్ పెడితే చాలు. ఫోన్చేసి పలకరిస్తే చాలు. లోయర్మిడిల్ క్లాస్ కూడా అయ్యో చెప్పకపోతే.. పిలవకపోతే ఎవరు ఏమనుకుంటారో.. అనే సోషల్స్టిగ్మా గురించి భయపడక్కర్లేదు.. బాధపడక్కర్లేదు. అంత్యక్రియలు, కర్మకాండల పేరుతో వేలకువేలు ఖర్చుపెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. - యండమూరి వీరేంద్రనాథ్. కుటుంబ సభ్యులకైనా చెప్పాల్సింది శ్రీనివాస్ వాళ్లమ్మ మరణవార్తను గుప్తంగా ఉంచి, మూడోకంటికి తెలియకుండా అంత్యక్రియలు జరిపించడానికి తోబుట్టువులతో ఉన్న మనస్పర్థలే కారణమని తేలింది. ఎన్ని స్పర్థలున్నా తన దగ్గరున్నప్పుడు తల్లి చనిపోతే ఆ విషయాన్ని తోబుట్టువులకు చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది. ఎందుకంటే వాళ్లకూ ఆమె తల్లే కదా! తల్లిని చివరిచూపు చూసుకోవాల్సిన హక్కు వాళ్లకూ ఉంటుంది కదా! ఒకవేళ అంత్యక్రియలు, కర్మకాండలు ఆయనకు భారవమవుతాయన్న భావనే ఉంటే ఆ విషయాన్ని తోబుట్టువులకు చెప్పి కన్విన్స్ చేయాల్సింది. తలా కొంచెం ఆ బాధ్యతను పంచుకునేలా వాళ్లను ఒప్పించాల్సింది. ఇవేవీ లేకుండా.. తల్లి మరణవార్తనే గోప్యంగా ఉంచడమనేది కరెక్ట్ కాదు. - డాక్టర్ నాగలక్ష్మి.జి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ -
నిలకడగా ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఆరోగ్యం
హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీమంత్రి ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి(74) ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు శనివారం తెలిపారు. ఆయన జ్వరం, ఫిట్స్తో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. నాలుగేళ్లుగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధికి సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతున్నారు. జ్వరం, ఫిట్స్ రావడంతో తాజాగా ఆయన ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వెంకటరెడ్డి శరీరం చికిత్సకు సహకరిస్తోందని, మరో 3 రోజులు గడిస్తే పూర్తి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పగలమని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం వెంటనే నగరంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే రాంరెడ్డి గత కొంత కాలం నుంచి కేన్సర్ సంబంధిత వ్యాధితో సతమతమవుతోన్న విషయం తెలిసిందే. 2014లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన రాంరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. -
ఎవరీ బాలుడు?
తలకు బలమైన గాయాలు తగిలి రోడ్డుపై పడిఉన్న బాలుడిని కొందరు నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. ఆ బాలుడు అపస్మారకస్థితిలో ఉండడంతో అతని వివరాలు తెలియరాలేదు. ఆస్పత్రి సిబ్బంది బాలుని గురించి పోలీసులకు సమాచారం అందించారు. వారి తల్లిదండ్రులు ఎవరో. ఎక్కడివాడో తెలియలేదు. ఎవరైనా ఈ బాలుడిని గుర్తిస్తే కిమ్స్ ఆస్పత్రికి రావాలని ఆస్పత్రి వర్గాలు శనివారం ఉదయం విజ్ఞప్తి చేస్తున్నారు. -
గుండె తెలుసు... తడి తెలుసు!
రోగుల వెతలు తెలుసు..! - డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు కార్డియోథొరాసిక్ సర్జన్, సీఈఓ - ఎం.డి, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ వై.ఎస్. రాజశేఖర్రెడ్డి ఒక డాక్టర్. ఆయనకు రోగుల వెతలూ తెలుసు, ఆసుపత్రుల కష్టాలూ తెలుసు. అందుకే అందరికీ మేలు జరిగేలా, అన్ని వైపుల వారికీ మేలు కలిగేలా ఆరోగ్యశ్రీని రూపొందించగలిగారు. ఈ యజ్ఞంలో నేనూ ఒక భాగస్వామిని. ఆరోగ్యశ్రీ పథకాన్ని మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రకటించే సమయానికి ఆయనతో పాటు నేనూ వేదికపై ఉన్నాను. ప్రకటించిన వెంటనే...20 మంది రోగులను నా వెంటే తీసుకొని ఒక బస్సుతో బయల్దేరాను. వాళ్లకు మా ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స ప్రారంభించాం. రెండ్రోజుల తర్వాత నేను వెంట తెచ్చుకున్న రోగులను గుర్తుంచుకొని వారిని చూసేందుకు డాక్టర్ వై.ఎస్. స్వయంగా మా ఆసుపత్రిని సందర్శించారు. రోగుల ముఖంలో వెలుగుతున్న సంతోషాన్ని చూసి పులకించిపోయారు. ఆయన కేవలం డాక్టర్ మాత్రమే కాదు... ఒక మహనీయ మానవతామూర్తి. ఆరోగ్యశ్రీని సాధ్యం చేసి చూపించారు - డాక్టర్ మోహనవంశీ, సర్జికల్ ఆంకాలజిస్ట్ - ఎండీ, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో నేను ‘ఇండో అమెరికన్ హాస్పిటల్’కు డెరైక్టర్గా ఉన్నాను. ఒకరోజు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మా ఇన్స్టిట్యూట్కు వచ్చి పేదల క్యాన్సర్ చికిత్స గురించి, అందుకు వై.ఎస్. ఆలోచిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం గురించి చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ‘సర్... కొన్ని సాధారణ క్యాన్సర్లకు ప్రభుత్వ బీమా అమలు చేయవచ్చేమో, కానీ ఎంత ఖర్చవుతుందో కూడా అంచనా తెలియని క్యాన్సర్లకూ బీమా అంటే కుదరదేమో’ అని సందేహాన్ని వ్యక్తం చేశారట ఆ సెక్రటరీ. అప్పుడు వై.ఎస్. తనతో... ‘చూడండి.. అగర్వాల్జీ! సామాన్యుల నుంచి నాకు వచ్చే విజ్ఞప్తుల్లో వైద్యసహాయం కోసం అడిగేవారే ఎక్కువ. ఒక డాక్టర్గా నాకు తెలిసిన విషయం ఏమిటంటే... గుండెజబ్బులూ, క్యాన్సర్, కిడ్నీ సమస్య... ఈ మూడింటిలో ఏది వచ్చినా ఒక పేదవాడి జీవితమే కునారిల్లుతుంది. అందుకే సామాన్యులకు సాయం చేయడానికి... పేదలకు, తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వమే వైద్యబీమా అందించే పథకం కావాల్సిందే’ అన్నారట. రోగుల బాధలకు అంతగా చలించిపోయారాయన. అత్యంత సంపన్నమైన అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ ఇలా ఆరోగ్యబీమాను ప్రభుత్వమే చేపట్టడం అన్నది లేదు. కేవలం ఒక రాష్ట్రప్రభుత్వం ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వారికి వైద్యచికిత్సను అందించడం బహుశా ప్రపంచంలోనే ఇదే మొదటిసారి కావచ్చు. చిన్నారిని కాళ్ల మీద నిలబెట్టింది ఆరోగ్యశ్రీ - డాక్టర్ కె. సుధీర్రెడ్డి, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్మార్క్ హాస్పిటల్స్ ఒక రోజు నాలుగేళ్ల వయసున్న ఒక కోయ చిన్నారిని నా దగ్గరికి తీసుకొచ్చారు అతడి తల్లిదండ్రులు. ఆ అమాయకపు అడవిబిడ్డను రోడ్డుపై ఏదో వాహనం ఢీకొట్టింది. చాలా ఆసుపత్రులు తిరిగి, కాలు తీసేయాల్సిందేనని చెప్పడంతో నా దగ్గరికి వచ్చారు. ఆ పిల్లాడిని చూసి చలించిపోయా. మల్టిపుల్ సర్జరీలకు చాలా ఖర్చవుతుంది. పైగా ఈ సర్జరీ ‘ఆరోగ్యశ్రీ’ కిందికి రాదు. ఆ చిన్నారి కాలును తొలగించడానికి నాకు మనసు రాలేదు. ‘మీరు ఒక్క పైసా కూడా చెల్లించని విధంగా మేమే సీఎం వైఎస్ గారి నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుంటాం’ అంటూ ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి సర్జరీలకు ఉపక్రమించాను. వైఎస్ స్వయానా డాక్టర్ కావడంతో రోగుల అవసరాలు గుర్తెరిగి, ఈ సర్జరీ ‘ఆరోగ్యశ్రీ’ కింద కవర్ కాకపోయినా ప్రత్యేక అనుమతి ఇచ్చారు. సరిగ్గా ఏడాది తర్వాత ఆ చిన్నారిని ఫాలో అప్ కోసం తల్లిదండ్రులు మళ్లీ నా దగ్గరికి తీసుకొచ్చారు. చెంగుచెంగున ఎగురుతూ గెంతుతూ... పెరిగిన జుత్తును తమ కోయశైలిలో కట్టుతో... చిరునవ్వుతో నా ముందుకు వచ్చాడు. నేనెన్నో సర్జరీలు చేశాను. ఎన్నో సంక్లిష్టమైన ప్రక్రియలూ నిర్వహించాను. సొంతబిడ్డ మునికాళ్ల మీద లేస్తూ పడుతూ, మళ్లీ లేచి తొలి అడుగు వేసిన నాడు కన్నతండ్రి ఆనందించినంతగా సంతోషపడ్డాను. ఇలాంటి సహాయాలు అందించబట్టే డాక్టర్ వై.ఎస్. ప్రజల హృదయాల్లో అంతగా గుర్తుండిపోయారు. ఆరోగ్యశ్రీ వైద్యసేవారంగంలో విప్లవం... - డాక్టర్ హరిప్రసాద్, సీఈఓ, అపోలో హాస్పిటల్స్, సెంట్రల్ రీజియన్ ఆరోగ్యసేవా రంగంలోని విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది ‘ఆరోగ్య శ్రీ’. ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్రెడ్డి... వైద్యచికిత్సకు నోచుకోని ఎంతోమంది రోగులు, వారి కుటుంబాల ముంగ్లిట్లోకే వైద్యసేవలు వెళ్లి అందేలా చేశారు. ఎందరో పేద ప్రజల పెద్ద పెద్ద రుగ్మతలు నయం చేశారాయన. అలా ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపారాయన. ప్రజల ‘గుండె’కు చేరువైన పథకం... - డాక్టర్ అనూజ్ కపాడియా, సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ ఆరోగ్యశ్రీ వల్ల గుండె ఆపరేషన్లు చేయించుకొని, గుండెకు స్టెంట్స్ వేయించుకొని బాగుపడ్డ రోగుల సంఖ్య చాలా ఎక్కువ. ఈ పథకాన్ని అమలు చేశాక లబ్ధిపొందిన రోగులు గుండెజబ్బుల నుంచి దూరమై మామూలు జీవితం గడుపుతున్నారంటే అది ఆరోగ్య శ్రీ వంటి మంచి పథకం వల్లనే. ప్రజానాయకుడు కావడంతో పాటు డాక్టర్ కూడా కావడం వల్ల ఆయనకు పేషెంట్స్ అవసరాలు బాగా తెలిసి ఉండటం వల్లనేమో... ఇలాంటి పథకం ప్రవేశపెట్టారు. అందుకే ఎన్నో ప్రభుత్వ పథకాల కంటే ఇది ప్రజల ‘గుండె’లకు బాగా చేరువైంది. -
ఆచూకీ
వైద్యుడి సమాచారం తెలియక ఆందోళన టెక్నాలజీసాయంతో తెలుసుకున్న కుమారుడు రసూల్పుర, సాక్షి, సిటీబ్యూరో: కిమ్స్ ఆస్పత్రికి చెందిన వైద్యుడు రాఘవేంద్రరావు బోయిన్పల్లి సమీపంలో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించారు. మంగళవారం ఉదయం 11.40 గంటలకు ఇంటి నుంచి ఆస్పత్రికి బయలుదేరిన ఆయన ఆచూకీ సాయంత్రం 6.30 గంటల వరకూ తెలియలేదు. కుటుంబసభ్యులు ఫోన్ చేసినా...అటు నుంచి సమాధానం లేదు. ఈ నేపథ్యంలో వారు అమెరికాలో ఉన్న రాఘవేంద్రరావు కుమారుడు సుదీప్కు సమాచారం ఇచ్చారు. ఆయన బీఎండబ్ల్యూ కారులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ సాయంతో తండ్రి ఆచూకీ కనుగొన్నారు. ఎలాగంటే... బీఎండబ్ల్యూ కారుకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) సౌకర్యం ఉంటుంది. దీనికోసం ఆ కంపెనీ ఏకంగా విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(వీపీఎన్) ప్రత్యేక పోర్టల్ నిర్వహిస్తోంది. కారు కొనుగోలు చేసినప్పుడే యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. వీపీఎన్ యాక్సెస్ కావాలి. అధిక సెక్యూర్ కలిగిన ఐక్లోడ్ నెట్వర్క్ ద్వారా కారు ఎక్కడెక్కడ? ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది? ఏఏ ప్రాంతాల మీదుగా వెళ్లింది? చివరిసారిగా ఎక్కడ ఆగిపోయిందనే వివరాలను తెలుసుకునే సౌకర్యముందని ఆటోమొబైల్ రంగ నిపుణులు చెబుతున్నారు. కుమారుడు సుదీప్కి రాఘవేంద్రరావు ఈ యూజర్ ఐడీ, పాస్వర్డ్ గతంలోనే ఇచ్చి ఉండాలి. లేదంటే తన తండ్రి కారు కనబడటం లేదని... యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వాలని బీఎండబ్ల్యూ కంపెనీ ప్రతినిధులను కోరి ఉండాలి. అమెరికాలో ఉన్న కుమారుడు సుదీప్ ఈ టెక్నాలజీ ద్వారానే తండ్రి వాహనం ఆచూకీని కనుగొన్నారు. ఇంటి నుంచి బయలుదేరిన అరగంటకే.. రోజూ ఉదయం 9 గంటలకు పేట్ బషీరాబాద్ నుంచి డాక్టర్ రాఘవేంద్రరావు సికింద్రాబాద్ కిమ్స్కు బయలుదేరేవారు. మంగళవారం ఉదయుం 10.45కు ఇంటి వుుందుకు వచ్చారు. అక్కడే దాదాపు గంటపాటు సెల్ఫోన్లో వూట్లాడారు. వివిధ ఆస్పత్రుల వైద్యులతో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఉదయం 11 గంటల వరకు డాక్టర్ రాకపోవడంతో ఆపరేషన్ ఉందని కిమ్స్ ఆస్పత్రి నుంచి ఆయనకు ఫోన్ చేశారు. సహచర వైద్యులతో ఆ ఆపరేషన్ చెయ్యించండి అని రాఘవేంద్రరావు వారికి సూచించారు.11.40 గంటలకు బయలుదేరిన డాక్టర్ రాఘవేంద్రరావు పేట్బషీరాబాద్, సుచిత్ర, బోయిన్పల్లికి వచ్చారు. పాత బోయిన్పల్లి మార్గంలో ఉన్న హర్షవర్ధన్ కాలనీ రోడ్డు పక్కనే కారు ఆగిపోయింది. సాయుంత్రం 6.30 గంటల వరకూ డాక్టర్ ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యూరు. పలువూర్లు ఫోన్ చేశారు. స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమెరికాలో ఉంటున్న రాఘవేంద్రరావు కుమారుడు సుదీప్కు సవూచారం ఇచ్చారు. ఆయన బీఎండబ్ల్యూకు సంబంధించిన నెట్వర్క్ ద్వారా కారు బోయినపల్లి హర్షవర్థన్ కాలనీలో ఉన్నట్లు గుర్తించారు. ఇదే విషయూన్ని తల్లికి ఫోన్లో చెప్పారు. ఆ తర్వాత కారును గుర్తించారు. ఇదీ అనుమానం... డాక్టర్ రాఘవేంద్రరావు కారు ఆగి ఉన్న ప్రాంతం చుట్టూ జనావాసాలు ఉన్నాయి. మంగళవారం వుధ్యాహ్నం కారు ఆగితే... బుధవారం ఉదయుం 7.30 గంటల వరకు గుర్తించలేదని పోలీసులు చెబుతున్నారు. వాహనం రోడ్డు పక్కనే ఆగి ఉండడం.. అద్దాలు తెల్లగా ఉండడం... స్టీరింగ్పై ఓ వ్యక్తి పడుకున్నట్లు ఉండడం.. ఆయన నోరు, వుుక్కు నుంచి రక్తం కారడం వంటి విషయూలను ఎవరూ గవునించలేదా అన్న విషయుమై అనువూనాలు వ్యక్త వువుతున్నారుు. -
లయన్క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం
బేతంచర్ల : కర్నూలు జిల్లా బేతంచర్ల పట్టణంలో ఆదివారం నంద్యాల లయన్క్లబ్, కిమ్స్(సికింద్రాబాద్)వారి సహకారంతో లయన్క్లబ్(బేతంచర్ల) ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించింది. ఈ వైద్యశిబిరాన్ని అనంతపురం జిల్లా గుత్తి కోర్టు సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లయన్ క్లబ్ అధ్యక్షుడు శ్రీకాంత్, పట్టణ సీఐ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వైద్యశిబిరానికి పట్టణంలోని 300 మంది రోగులు వచ్చి చికిత్స తీసుకున్నారు. అనంతరం నిర్వాహకులు రోగులకు మందులు అందజేశారు. అట్టడగువర్గాల వారు ఇటువంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలని లయన్క్లబ్ నిర్వాహకులు కోరారు. -
కోలుకుంటున్న నటుడు ఆహుతి ప్రసాద్
రాంగోపాల్పేట్: అనారోగ్యంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు ఆహుతి ప్రసాద్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ సమస్యతో బాధ పడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు సోమవారం మధ్యాహ్నం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రసాద్ త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు. -
రేడియో అక్కయ్య కన్నుమూత
హైదరాబాద్: రేడియో అక్కయ్యగా శ్రోతలకు సుపరిచితమైన ప్రముఖ రచయిత్రి తురగా జానకిరాణి బుధవారం కన్నుమూశారు. కిమ్స్లో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా జానకిరాణి అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేడియో అక్కయ్యగా శ్రోతల అభిమానాలను చొరగున్న జానకిరాణి వరుసగా నాలుగు సార్లు ఆకాశవాణి జాతీయస్థాయి పురస్కారాలను అందుకున్నారు. సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డులో సంక్షేమ అధికారిగా పనిచేశారు. 1975-1994 సంవత్సరాలలో నిర్మాత, సహాయ సంచాలకులుగా కూడా ఆమె సేవలందించారు. జానకిరాణి స్వస్థలం మచిలీపట్నం సమీపంలోని మందపాకల. జానకిరాణి రచయిత్రిగా మూడు కథా సంకలనాలు, రెండు నవలలు, రేడియో నాటకాల సంకలనం, 5 అనువాద గ్రంథాలు 35 పిల్లల పుస్తకాలు, అనేక వ్యాసాలు రాశారు. ఎన్నో అవార్డులు అందుకున్న జానకిరాణి గృహలక్ష్మీ స్వర్ణకంకణం, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాలను అందుకున్నారు. మరికొన్ని ప్రక్రియల్లో కూడా ఆమె రచనలతో అందరినీ మెప్పించారు. రెండుసార్లు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలను అందుకున్నారు. పింగళి వెంకయ్య స్మారక సత్కారం, అరవిందమ్మ మాతృమూర్తి అవార్డు, సుశీల నారాయణరెడ్డి పురస్కారం, సాహితిపురస్కారాలను ఆమె అందుకున్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తులో పరిణితవాణి గౌరవాన్ని జానకిరాణి అందుకున్నారు. కాగా, జానకిరాణి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపాన్ని తెలియజేశారు. జ్క్షానపీఠ పురస్కార గ్రహీత డా.సి. నారాయణరెడ్డి, తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, బాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.రాళ్లబండి కవితాప్రసాద్లు ఆమెకు సంతాపం తెలిపారు. -
ఆ సంఘటనలే కిమ్స్ ఆవిర్భావానికి బీజం వేశాయి
నేడు డాక్టర్స్ డే డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు, ఎండీ అండ్ సీఈవో, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఇవ్వాళ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (కిమ్స్) సంస్థ దాదాపు వెయ్యి పడకలతో జంటనగరాల్లో ఒక పెద్ద సంస్థగా ఆవిర్భవించి ఉంది. కానీ ఇలాంటి సంస్థ అంత తేలిగ్గా ఉనికిలోకి రాలేదు. దీని వెనక మా అమ్మ సంకల్పం, మా నాన్నకు వచ్చిన వ్యాధి, మా చెల్లెలి దైన్యం... ఇలా ఎన్నో. ఇక్కడ పేర్కొన్న చివరి రెండు అంశాలూ అందరికీ అందుబాటులో ఉండేలా, అతి చవకగా వైద్యచికిత్స అందించాలన్న దీక్షను నాలో నింపాయి. జీవితం పట్ల నా దృక్పథాన్ని రెండు సంఘటనలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. మొదటిది మా నాన్నగారికి వచ్చిన ఈసోఫేజియల్ క్యాన్సర్. రెండోది మా చెల్లెలికి అవసరమైన ఆపరేషన్. కేవలం రూ. 5,000 ఉంటే ఆమెకు ఆపరేషన్ పూర్తవుతుంది. దాన్ని సమీకరించడానికి మాకు చాలా సమయం పట్టింది. ఆ జాప్యమే మా చెల్లెలి పక్షవాతానికి దారితీసింది. జీవితం నేర్పిన కఠిన పాఠాల నుంచి నేను నేర్చుకున్నదేమిటంటే... ఇతరులకు సహాయపడాలంటే మొదట నేను ఇవ్వదగిన స్థానంలో ఉండాలి. అందుకు న్యాయంగా డబ్బు సంపాదించాలి. ఇక రెండోది నేనో వైద్యచికిత్స కేంద్రాన్ని ప్రారంభించాలి. అక్కడ సాధారణ అందుబాటు ధరల్లోనే పెద్ద పెద్ద సంక్లిష్టమైన చికిత్సలు సైతం అందాలి. చికిత్స కంటే నివారణ మేలు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇన్ని సంకల్పాలతో తొలుత కేవలం 150 పడకలతో ఆసుపత్రిని ప్రారంభించాను. ఇప్పుడిక్కడ 1000 పడకలతో అత్యాధునికమైన పెద్ద ఆసుపత్రి రూపొందింది. జీవితపు పాఠాలను ప్రేరణగా తీసుకుంటే, వాస్తవ సంఘటనలనుంచి స్ఫూర్తి పొందితే ఎలాంటి లక్ష్యాలనైనా సాధించవచ్చు అనే సత్యాన్ని యువతకు తెలియజేయడం కోసమే ఈ కొన్ని విషయాలు యువతకోసం చెబుతున్నాను. -
అమ్మ ఇక్కడ.. బిడ్డలు అక్కడ..
అమలాపురం టౌన్ : అమ్మ.. నాన్న.. ఇద్దరు చిన్నారి పిల్లలు.. ఓ పండంటి కాపురం వాళ్లది. ఓ చిరువ్యాపారం చేసుకుంటూ ఉన్నంతలో ఆ కుటుంబం సంతోషంగా ఉంది. నగరం గ్యాస్ పైప్లైన్ పేలుడు అగ్నికీలల్లో తల్లి వానరాసి దుర్గాదేవి, ఇద్దరు కుమారులు ఎనిమిదేళ్ల మధుసూదన్, ఐదేళ్ల మోహన వెంకట కృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. భర్త నరసింహమూర్తి మాత్రం అగ్నికీలల నుంచి తప్పించుకున్నారు. గాయపడ్డ తల్లీబిడ్డలను ఆ రోజు హుటాహుటిన అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పిల్లల ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తల్లికి మాత్రం అమలాపురంలోని కిమ్స్లోనే వైద్యం అందిస్తున్నారు. రోజూ తనను అంటిపెట్టుకుని నిద్రించే.. ముస్తాబు చేసి స్కూలుకు పంపించే బిడ్డలు అగ్నికీలలకు కళ్లెదుటే గిలగిలలాడి తీవ్రగాయాలపాలవడం చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. తాను గాయపడినప్పటికీ వాటిని లెక్కచేయకుండా పిల్లలకోసమే గగ్గోలు పెట్టింది. తీరా ఆస్పత్రికి తరలించాక పిల్లలను మాత్రం తనకు దూరంగా కాకినాడకు పంపేయడంతో ఆమె మనసంతా వారిపైనే ఉంది. ఎవరు వచ్చినా ‘నన్ను నా పిల్లల దగ్గరకు పంపేయండి.. మా ముగ్గురికీ ఒకేచోట వైద్యం చేయండి’ అంటూ ప్రాధేయపడడం చూపరులను కలిచివేస్తోంది. ‘పిల్లలకు దూరంగా ఎప్పుడూ లేను.. వాళ్లను ఈ స్థితిలో వదిలి ఉండలేను.. ఇలాంటప్పుడు వాళ్లకి దగ్గర ఉంటేనే వారికి గమ్మున తగ్గుతుంది’ అని రోదిస్తోంది. శనివారం సాయంత్రం ఆమెను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి పరామర్శించి ఓదార్చారు. -
శ్రీకాకుళంలో 'కిమ్స్' వద్ద ఉద్రిక్తత
శ్రీకాకుళంలోని కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టౌన్ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా కిమ్స్ ఆసుపత్రి సెల్లార్ నిర్మాణం జరిగిందని ఆరోపిస్తూ మున్సిపల్ సిబ్బంది బుధవారం ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆ క్రమంలో సెల్లార్ నిర్మాణం కూల్చివేసేందుకు మున్సిపల్ సిబ్బంది సమయాత్తమైయ్యారు. మున్సిపల్ సిబ్బంది చర్యలను ఆసుపత్రి సిబ్బంది ప్రతిఘటించారు. దాంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ సంఖ్యలో కిమ్స్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.