manoj tiwari
-
Ind vs NZ: రోహిత్, గంభీర్.. కామన్సెన్స్ లేదా?
న్యూజిలాండ్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. తొలి టెస్టు తాలుకు పొరపాట్లు పునరావృతం చేయకుండా.. రెండో మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. పుణెలో గురువారం నుంచి మొదలుకానున్న ఈ టెస్టులో గెలిస్తేనే రోహిత్ సేన సిరీస్ బరిలో నిలుస్తుంది. లేదంటే.. పర్యాటక జట్టుకు 0-2తో ట్రోఫీని సమర్పించుకోకతప్పదు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, బెంగాల్ రంజీ మాజీ ప్లేయర్ మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కివీస్ చేతిలో సొంతగడ్డపై దాదాపు 36 ఏళ్ల తర్వాత ఓటమికి ప్రధాన కారణం టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్చి నిర్ణయాలే అని ఘాటు విమర్శలు చేశాడు.కామన్సెన్స్ లేదా?ఈ మేరకు క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారో కొన్నిసార్లు అర్థమే కాదు. కామన్సెన్స్ లోపించిందేమో అనిపిస్తుంది. అసలు ఆ కోచ్, కెప్టెన్ ఏం నిరూపించాలనుకుంటున్నారనేది నాకైతే అంతుపట్టడం లేదు. కొత్త కోచ్ వచ్చినా.. కొత్త కెప్టెన్ వచ్చినా.. తమను తాము నిరూపించుకునే ప్రయత్నంలో ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు’’ అని మనోజ్ తివారి విమర్శించాడు.కోచ్ ఏం చేస్తున్నాడు?బెంగళూరు టెస్టులో రవిచంద్రన్ అశ్విన్కు ఎక్కువగా బంతిని ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘పరిస్థితిని బట్టి స్పిన్నర్లతో తక్కువ బంతులు వేయిస్తారని తెలుసు. అయితే, అందుకోసం ఏకంగా అశ్విన్నే పక్కనపెడతారని అనుకోలేదు. టెస్టుల్లో ఐదు వందలకు పైగా అతడు వికెట్లు తీశాడు. 107 రూపంలో కనిపిస్తున్న స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జస్ప్రీత్ బుమ్రాతో కలిపి అశ్విన్ను కూడా ఆడించాల్సింది.గొప్ప కెప్టెన్లుగా పేరొందిన వారు కూడా తప్పులు చేస్తారు. అలాంటి సమయంలో కోచ్ ముందుకు రావాలి. ఎప్పటికప్పుడు మార్గనిర్దేశనం చేస్తూ ముందుకు నడిపించాలి. కానీ ఇప్పుడెందుకో ఇక్కడ అలా జరుగలేదు అనిపిస్తోంది’’ అని మనోజ్ తివారి గంభీర్ను తప్పుబట్టే ప్రయత్నం చేశాడు. కాగా కివీస్తో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచినప్పటికీ పిచ్ను తప్పుగా అంచనా వేసి తాము భారీ మూల్యం చెల్లించినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించాడు. అయితే, సీనియర్ స్పిన్నర్ అశ్విన్కు ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వకపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇదిలా ఉంటే.. భారత్- కివీస్ జట్ల మధ్య పుణె వేదికగా అక్టోబరు 24 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు విశేషాలు👉షెడ్యూల్: అక్టోబరు 16- అక్టోబరు 20👉వేదిక: ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు, కర్ణాటక👉వర్షం కారణంగా బుధవారం నాటి తొలిరోజు ఆట రద్దు👉రెండో రోజు మొదలైన ఆట👉టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా👉టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 46 ఆలౌట్👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 402 ఆలౌట్👉టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 462 ఆలౌట్👉న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 110/2👉ఫలితం: టీమిండియాపై ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రచిన్ రవీంద్ర(134, 39*).చదవండి: Ind vs NZ: అతడి ఆట తీరు బాగుంది.. అయినా..: గంభీర్ -
ఎంపీ మనోజ్ తివారీని బంధించిన మహిళ
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలోని వారణాసితో సహా 13 లోక్సభ స్థానాలకు చివరి దశలో పోలింగ్ జూన్ ఒకటిన జరగనుంది. ఈ దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్సభ స్థానంపై అధికంగా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు వారణాసిలో పలువురు బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. వారిలో ఎంపీ, ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు మనోజ్ తివారీ కూడా ఉన్నారు.తాజాగా మనోజ్ తివారీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోను మనోజ్ తివారీ స్వయంగా షేర్ చేశారు. దానిలో ఒక మహిళ తనను బంధించారని తివారీ పేర్కొన్నారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆయన దాని ట్యాగ్లైన్గా ‘కాశీకి చెందిన ఒక మహిళ ఆమె కుమారునికి మనోజ్ తివారీని పరిచయం చేయడానికి బంధించినప్పుడు’ అని రాశారు. ఈ వీడియోలో ఒక మహిళ కూడా కనిపిస్తున్నారు. అలాగే ఆమె తన ఆమె తన కుమారునికి బీజేపీ ఎంపీని పరిచయం చేయడానికి కాల్ చేయడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు.మనోజ్ తివారీ వచ్చి ఇంట్లో కూర్చున్నారని ఆ మహిళ ఫోనులో అవతలి వ్యక్తికి చెప్పారు. ఈ క్లిప్ తరువాత మనోజ్ తివారీ ఒక బండి దుకాణం ముందు నిలబడటాన్ని చూడవచ్చు. ఈ సమయంలో చాలా మంది అక్కడ ఉండటాన్ని గమనించవచ్చు. గాయకుడైన మనోజ్ తివారీ పాడిన పాటలు ఉత్తరప్రదేశ్, బీహార్లో ఎంతో ఆదరణ పొందాయి. ముఖ్యంగా అతని భోజ్పురి పాటలకు లెక్కకుమించిన అభిమానులున్నారు. ప్రస్తుతం మనోజ్ తివారీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. ఢిల్లీ లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. जब मनोज तिवारी को काशी की एक महिला ने अपने बेटे से मिलवाने के लिये बनाया बंधक #ModiAgainIn2024 pic.twitter.com/U0aliTTmMY— Manoj Tiwari (मोदी का परिवार) 🇮🇳 (@ManojTiwariMP) May 27, 2024 -
BJP Vs Congress: ఈశాన్య ఢిల్లీ ఎవరిది?..
దేశరాజధాని ఢిల్లీలో అందరినీ ఆకర్షిస్తున్న సీటు ఈశాన్య ఢిల్లీ. హ్యట్రిక్పై కన్నేసిన బీజేపీ ఎంపీ మనోజ్ తివారీపై, యువనాయకుడు కన్హయ్య కుమార్ను కాంగ్రెస్ పోటీకి దింపింది. గత ఎన్నికల్లో బెగుసరాయ్లో ఓడిపోయిన కన్హయ్యకుమార్ను రాహుల్ గాంధీ ఈసారి ఢిల్లీలో పోటీకి దింపడం చర్చనీయాంశంగా మారింది. 20శాతం ముస్లింలు, 11శాతం ఎస్సీల సమీకరణను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ ప్రయోగానికి దిగిందనే చర్చ జరుగుతోంది.ఈశాన్య ఢిల్లీ ప్రాంతం దేశ రాజధానిలో అతిపెద్ద జిల్లా. నార్త్ ఈస్ట్ సీటు భారతదేశం మొత్తంలో అత్యంత జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఇక్కడ అత్యధిక జనాభా పూర్వాంచల్కు చెందినవారే. ఈ లోక్సభ స్థానంలో అనేక అనధికార కాలనీలు ఉన్నాయి. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి వలస వచ్చినవారు స్థిరపడ్డారు. ఉత్తరప్రదేశ్తో ఈశాన్య ఢిల్లీ సరిహద్దు కారణంగా, ఇందులో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా నుండి వలస వచ్చిన వారి జనాభా ఎక్కువగా ఉంది.ఈ లోక్సభ స్థానంలో భజన్పురా, బురారీ, తిమర్పూర్, సీలంపూర్, ఘోండా, బాబర్పూర్, గోకల్పూర్, సీమాపురి, రోహతాస్ నగర్, ముస్తఫాబాద్, కరవాల్ నగర్లతో కలిపి 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో దాదాపు 16.3 శాతం షెడ్యూల్డ్ కులాలు, 11.61 శాతం బ్రాహ్మణులు, 20.74 శాతం ముస్లింలు, 4.68 శాతం వైశ్య (బనియా), 4 శాతం పంజాబీ, 7.57 శాతం గుర్జార్ మరియు 21.75 శాతం ఓబీసీ కమ్యూనిటీ వారి వాటాను కలిగి ఉంది.గతంలో 2009 లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ 59.03 శాతం ఓట్లతో భారీ ఆధిక్యం సాధించగా బీజేపీకి 33.71 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014 నుంచి వరుసగా బీజేపీ విజయకేతనం ఎగరేస్తోంది. 2014లో సినీ నటులు మనోజ్ తివారీకి 45.38 శాతం ఓట్లతో గెలుపొందగా, 2019లో 53.86 శాతం రెండోసారి విజయకేతనం అందుకున్నారు. ఈ సీటులో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ల అభ్యర్థులకు ప్రజల్లో మంచి పేరుంది.ఒకవైపు రాజకీయాలకు అతీతంగా నటుడిగా, గాయకుడిగా మనోజ్ తివారీ బాగా పాపులర్ అయితే, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ జేఎన్యూ స్టూడెంట్ లీడర్గా దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కన్హయ్య కుమార్ కూడా చాలా చురుకుగా కనిపించారు. ఈ యాత్రలతో యువతను కనెక్ట్ చేయడంలో ఆయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే తుక్డేతుక్డే గ్యాంగ్ నాయకుడని బీజేపీ.. కన్హయ్య కుమార్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ఢిల్లీలో బీజేపీ సీఎం అభ్యర్థి మారేందుకు ఈ ఎన్నిక మనోజ్ తివారీకి కీలకంగా మారనుంది. ఇప్పటికే రెండుసార్లు గెలిచి సత్తా చాటిన తివారీ మూడోసారి హ్యాట్రిక్ సాధించడం ద్వారా ఢిల్లీ బీజేపీ అగ్రనాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ బీజేపీకి నాయకుడు లేక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడుతున్న పార్టీకి తివారీ సారథ్యం వహించడానికి ఇదొక అవకాశమనే అంచనాలొస్తున్నాయి.ఇటు షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీకి ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ లీడర్ కరువయ్యారు. కన్హయ్య కుమార్ గనుక ఈశాన్య ఢిల్లీ నుంచి గెలిస్తే ఆయన కూడా ఢిల్లీ కాంగ్రెస్కు ఫ్యూచర్ సీఎం లీడర్గా ఎదిగే అవకాశముంది. మరి ఈసారి ఢిల్లీ ఈశాన్యంలో కమలం ఉదయిస్తుందా? హస్త రేఖలు మారతాయా? అన్నది ఓటరు చేతిలో ఉంది. -
ఇప్పటికి బాణాలు చాలు.. అవసరమైతే త్రిశూలం తీస్తా: మాధవీ లత
దేశంలో లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ నేతలు తమ ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన బీజేపీ అభ్యర్థి మాధవీ లత ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారి తరపున దేశ రాజధానిలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ నేత మాధవీ లత ఢిల్లీలోని బహిరంగ సభ వేదికపైకి రాగానే అక్కడున్న పార్టీ కార్యకర్తలు ‘జై శ్రీరామ్, జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనోజ్ తివారీపై పోటీ చేస్తున్న వ్యక్తి పేరు కన్హయ్య అని, అయితే అతని దోపిడీలు చాలా క్రూరమైనవని వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై జరిగిన దాడిని ప్రస్తావించిన ఆమె.. వేధించిన వ్యక్తిని రక్షించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రోడ్డుపైకి వచ్చారని ఆరోపించారు. బీహార్ యువత ఐఏఎస్, ఐపీఎస్లుగా మారి దేశానికి సేవ చేస్తుంటారని, అయితే ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ ఇలాంటి వారిని మోసం చేశారని మాధవీ లత ఆరోపించారు.ఢిల్లీలో నరకయాతన అనుభవిస్తున్న ప్రజల మధ్య, కేజ్రీవాల్ రెండు రోజులు తిరగాలని, అప్పుడే అతనికి ఇక్కడి పరిస్థితులు తెలుస్తాయని ఆమె అన్నారు. బీజేపీ చేపడుతున్న అభివృద్ధి పనులకు కేజ్రీవాల్ అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఫలితంగా బురారీ ప్రజలు బురద, చెత్త మధ్య బతకాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆమె ఆరోపించారు. అయితే ఇలాంటి బురదలో నుంచి వికసించిన కమలాన్నే దేవుని పాదాల చెంత ఉంచుతారన్నారు. ఢిల్లీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడేందుకు మద్దతునివ్వాలని ఆమె ఓటర్లను కోరారు.తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విమర్శల బాణాలు సంధించిన ఆమె.. ప్రస్తుతానికి ఈ బాణాలు చాలని, అవసరమైతే వారిపై త్రిశూలాన్ని కూడా ప్రయోగించడానికి వెనుకాడనని హెచ్చరించారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీకి మద్దతుగా మాధవీ లత బురారీలోని వెస్ట్ కమల్ విహార్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. -
‘కన్హయ్య కుమార్ ఉగ్రవాది అఫ్జల్ గురు మద్దతుదారు’
ఢిల్లీ: లోక్సభ ఎన్నికళ వేళ ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఈశాన్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ మంగళవారం ఇండియా కూటమి అభ్యర్థి కన్హయ్య కుమార్ హాట్ కామెంట్లు చేశారు. కన్హయ్య కుమార్ ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుదారు అని మండిపడ్డారు. మనోజ్ తివారీ చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.‘తన ప్రత్యర్థి కన్హయ్య కుమార్తో పోటీ ఆసక్తికంగా మారనుంది. కన్హయ్య కుమార్ను బరిలోకి దించటం.. ప్రతిపక్షాల కుట్రను వెల్లడిస్తుంది. ఈశాన్య ఢిల్లీలో కన్హయ్య కుమార్ను పోటీ చేయించి కాంగ్రెస్, ఆప్ పార్టీలు వాటి అసలు రంగు బయటపెట్టాయి. ప్రతిపక్షాల అభ్యర్థిపై గతంలో ఉన్న వివాదాలను ఓటర్లు పరిగణలోకి తీసుకుంటారు. ప్రజలు భద్రత కోరుకుంటాన్నారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఎల్లప్పుడు దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటారు.కన్హయ్య కుమార్ ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుదారు. గతంలో అఫ్జల్గురుకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలను ఓటర్లు మర్చిపోతారా?’ అని ఎంపీ మనోజ్ తివారీ అన్నారు ఇక.. ఈశాన్య ఢిల్లీలో మైనార్జీ జనాభా అధికంగా ఉంటుంది. మరోవైపు.. మనోజ్ కుమార్, కన్హయ్య కుమార్ ఇద్దరూ బిహార్కు చెందినవాళ్లే కావటం గమనార్హం.2001 డిసెంబరు 13న పార్లమెంట్పై ఉగ్రదాడి దాడి జరిగింది. ఐదుగురు ఉగ్రవాదుల పార్లమెంట్లోకి చొరబడి తొమ్మిది మంది భద్రతాసిబ్బందిని బలితీసుకున్నారు. ఆ మరుసటి రోజే దాడికి సూత్రధారి అయిన ఉగ్రవాది అఫ్జల్ గురును పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత 12ఏళ్లకు అతడు దోషిగా తేలడంతో ఉరితీసిన విషయం తెలిసిందే. -
షారుఖ్ స్టైల్లో సీఎం కేజ్రీవాల్ డైలాగ్.. సెటైర్లు వేస్తున్న బీజేపీ నేతలు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ సందేశం పంపారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్టైల్లో ‘మై నేమ్ ఈజ్ అరవింద్ కేజ్రీవాల్.. ఐయామ్ నాట్ టెర్రరిస్ట్’ అంటూ పంపిన ఆ మెజేస్ను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. అయితే జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశంపై బీజేపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కేజ్రీవాల్ ఆరోపణలు, ఆయన పంపిన మెసేజ్పై ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ను తాము టెర్రరిస్టుగా పిలవడం లేదని అన్నారు. అతన్ని టెర్రరిస్టు అని ఎవరు పిలుస్తున్నారో? కేజ్రీవాల్, అతని సహచరులు అతన్ని ఉగ్రవాది అని ఎందుకు పిలుస్తున్నారో మాకు తెలియదు. మేము అతనిని అవినీతిపరుడనే అంటున్నాం. ఆయన ఢిల్లీకి శత్రువు అని వ్యాఖ్యానించారు. VIDEO | Here's what BJP leader Manoj Tiwari (@ManojTiwariMP) said reacting to Delhi CM Arvind Kejriwal sending a message to people that he's not a terrorist. "Nobody is calling him a terrorist. We're calling him corrupt. He has made senior citizens cry for pension, poor cry for… pic.twitter.com/fztGHhjCds — Press Trust of India (@PTI_News) April 16, 2024 ఈ సందర్భంగా కేజ్రీవాల్పై మనోజ్ తివారీ సెటైర్లు వేశారు. అతను వృద్ధుల పెన్షన్ కోసం పాటుపడ్డారు. పేదల కోసం పనిచేశారు. రేషన్ కార్డుల కోసం, స్వచ్ఛమైన నీరు, గాలి అందించేందుకు ప్రజల కోసం కృషి చేశారని ఎద్దేశా చేశారు. దోపిడీకి పాల్పడే ముందు జైలులో సౌకర్యాల గురించి ఆప్ అధినేత ఆలోచించి ఉంటారని తివారీ అన్నారు. జైలు మాన్యువల్ అందరికీ ఒకేలా ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటోంది అని ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మీడియాతో మాట్లాడారు. देश के बेटे अरविंद केजरीवाल का जेल से देश की जनता को संदेश - मेरा नाम अरविंद केजरीवाल है और मैं आतंकवादी नहीं हूं। -@SanjayAzadSln pic.twitter.com/9VpPOpnLXa — AAP (@AamAadmiParty) April 16, 2024 -
కన్నయ్య కుమార్ vs మనోజ్ తివారి.. ఎవరి సత్తా ఎంత?
లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్ను బరిలోకి దించుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. గత కొన్నేళ్లుగా బీహార్ రాజకీయాల్లో యాక్టివ్గా కనిపించిన కన్నయ్య కుమార్ ఇప్పుడు రాజధాని ఢిల్లీలో తన హవా చాటేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీపై కన్నయ్య కుమార్ పోటీకి దిగారు. ఈశాన్య ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం యూపీకి ఆనుకుని ఉండటానికి తోడు ఇక్కడ బీహార్, హర్యానాకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. బీజేపీ వరుసగా మూడోసారి మనోజ్ తివారీని ఇక్కడ నుండి పోటీకి నిలబెట్టింది. 2014, 2019 ఎన్నికల్లో ఆయన ఇక్కడ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. మనోజ్ తివారీ భోజ్పురి సినిమా నటుడు కావడంతో అతనికి జనాదరణ అధికంగానే ఉంది. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ అతనికి పోటీగా బీహార్కు చెందిన కన్నయ్య కుమార్కు అవకాశం కల్పించింది. ఈయనకు యువత మద్దతు ఉంది. 2020 ఢిల్లీ అల్లర్లు ఈశాన్య ప్రాంతంలోనే మొదలయ్యాయి. ఈ ప్రాంతంలోని సీలంపూర్, ముస్తఫాబాద్, బాబర్పూర్, కార్గిల్ నగర్ తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ముస్లిం జనాభా ఉంటోంది. దీంతో ఇండియా కూటమి అక్కడి ముస్లిం ఓట్లను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు కన్నయ్య కుమార్ ప్రసంగాలు ఉపకరిస్తాయని కాంగ్రెస్ భావిస్తోందని సమాచారం. జేఎన్యూలో కన్నయ్య కుమార్ విద్యార్థి నేతగా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. యువతలో అతని పాపులారిటీ తారాస్థాయికి చేరింది. ఇప్పుడు అదే పాపులారిటీని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. మరి ఈశాన్య ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ కన్నయ్యను ఆదరిస్తారో, బీజేపీ మనోజ్ను అక్కున చేర్చుకుంటారో వేచి చూడాల్సిందే! -
తారలొకచోట... మెరుపులు మరోచోట
వాళ్లంతా భోజ్పురీ సినీ పరిశ్రమను తిరుగు లేకుండా ఏలిన, ఏలుతున్న తారలు. వెండితెరపై కనిపించారంటే విజిళ్లు, క్షీరాభిష్కాలే. అయితే వారిపట్ల ఈ వీరాభిమానమంతా భోజ్పురీ సినిమాలకు పుట్టిల్లయిన బిహార్, పొరుగు రాష్ట్రం జార్ఖండ్లకే పరిమితం. వాళ్లు స్థానికంగా ఎంతగా వెలిగినా బాలీవుడ్, తెలుగు తదితర సినీ పరిశ్రమల్లోనే విలన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించడం ద్వారానే దేశవ్యాప్తంగా ఫేమ్లోకి వచ్చారు. రాజకీయ రంగస్థలంపైనా ఇదే సీన్ రిపీటవుతోంది. భోజ్పురీ తారలెవరూ వారి స్వరాష్ట్రమైన బిహార్లో పెద్దగా ఉనికి చాటలేకపోతున్నారు. కారణాలేవైనా వారిని అక్కడినుంచి బరిలోకి దింపేందుకు పార్టీలు అంతగా ఆసక్తి చూపడం లేదు. దాంతో ఇతర రాష్ట్రాల నుంచి పోటీ చేసి మాత్రమే వాళ్లు లోక్సభలో అడుగు పెడుతున్నారు... భోజ్పురీ నటీనటులకు, వారి స్వరాష్ట్రమైన బిహార్కు రాజకీయంగా ఎప్పుడూ చుక్కెదురే. పొరుగు రాష్ట్రాలకో, సుదూరాలకో వెళ్లి మాత్రమే రాజకీయాల్లో రాణిస్తున్నారు. పలు తెలుగు సినిమాల్లో విలన్గా రాణించిన భోజ్పురీ సూపర్స్టార్ రవికిషన్ 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఉత్తరప్రదేశ్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ జౌన్పూర్ లోక్సభ స్థానంలో బరిలో దిగిన ఆయన ఘోర ఓటమి చవిచూసి ఆరో స్థానంలో నిలిచారు. అనంతరం బీజేపీలో చేరి 2019 లోక్సభ ఎన్నికల్లో యూపీలోని గోరఖ్పూర్ నుంచి 3 లక్షల ఓట్ల పై చిలుకు భారీ మెజారిటీతో నెగ్గారు. ఈసారి కూడా అక్కడినుంచే బరిలోకి దిగుతున్నారు. మరో ప్రముఖ భోజ్పురీ నటుడు మనోజ్ తివారీ అయితే ఏకంగా ఢిల్లీని తన రాజకీయ కర్మభూమిగా మార్చుకున్నారు. బిహార్లోని కైమూర్ జిల్లా అతర్వాలియా గ్రామానికి చెందిన ఆయన ఈశాన్య ఢిల్లీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ. ఈసారి కూడా అక్కడినుంచే పోటీలో ఉన్నారు. భోజ్పురీ నట గాయకుడు దినేశ్లాల్ యాదవ్ పరిస్థితీ అంతే. గత లోక్సభ ఎన్నికల్లో యూపీలోని ఆజంగఢ్ నుంచి నెగ్గిన ఆయన ఈసారీ అక్కడి నుంచే పోటీలో ఉన్నారు. మరో భోజ్పురీ గాయకుడు పవన్ సింగ్కు కూడా ఈసారి పశ్చిమ బెంగాల్ లోని ఆసన్సోల్ నుంచి బీజేపీ టికెటివ్వగా రెండు రోజులకే ఆయన అనూహ్యంగా బరి నుంచి తప్పుకున్నారు. బిహారీ బాబుగా ప్రసిద్ధుడైన బాలీవుడ్ దిగ్గజం శత్రుఘ్న సిన్హా గతంలో రెండుసార్లు బిహార్లోని పాట్నా సాహిబ్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలిచినా 2019లో టికెట్ దక్కకకపోవడంతో పశి్చమ బెంగాల్ వలస వెళ్లారు. అసన్సోల్ లోక్సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఈసారీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఇంటర్నెట్ సంచలనం, భోజ్పురీ గాయని నేహా సింగ్ రాథోడ్కు ఈసారి ఢిల్లీ నుంచి టికెట్ ఇస్తారంటున్నారు. గుంజన్.. ఒకే ఒక్కడు ఈ లోక్సభ ఎన్నికల్లో భోజ్పురి సినీ పరిశ్రమకు సంబంధించి బిహార్ నుంచి పోటీ చేస్తున్నది గుంజన్ కుమార్ ఒక్కరే. అయితే ఈ భోజ్పురీ/మగధీ గాయకుడు తన స్వస్థలమైన నవడా నుంచి ఇండిపెండెంట్గా బరిలో దిగుతున్నారు. ‘‘అన్ని ప్రధాన పార్టీలనూ సంప్రదించా. ఎవరూ టికెటివ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని వాపోతున్నారాయన! భోజ్పురి నటులు, గాయకులకు బిహార్లో లోక్సభ టికెటివ్వడానికి ప్రధాన పారీ్టలు వెనకా ముందాడుతున్న మాట వాస్తవమేనని భోజ్పురి గాయకుడు వినయ్ బిహారీ అంటున్నారు. ఆయన బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా లౌరియా ఎమ్మెల్యే. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున విజయం సాధించారు. కానీ ఏ పార్టీ కూడా టికెటివ్వకపోవడంతో 2010లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థగా పోటీ చేయాల్సి వచ్చింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన భోజ్పురీ భాషకు బిహార్లోనే తగిన గౌరవం లభించడం లేదు. బహుశా అందుకే భోజ్పురీ నటీనటులు, గాయకులకు ఇతర రాష్ట్రాల నుంచే తప్ప స్వరాష్ట్రంలో పోటీ చేసే అవకాశం దక్కడం లేదు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మారతాయేమో!’ అన్నారు. భోజ్పురీ నటీనటులు, గాయకులకు బీజేపీ మున్ముందు కచి్చతంగా బిహార్ నుంచి అవకాశమిస్తుందని తనకు నమ్మకముందని రవికిషన్ చెప్పుకొచ్చారు. -
రూ.11 కోట్లు టైమ్కి తీసుకుంటాడు.. చెత్తగా ఆడతాడు!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విమర్శలు గుప్పించాడు. అతడు జట్టుకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని పేర్కొన్నాడు. అంచనాలకు తగ్గట్లు ఒక్కసారి కూడా రాణించడం లేదని.. కోట్లకు కోట్లు మాత్రం తీసుకుంటాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయిన విషయం తెలిసిందే. సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో స్పిన్ ఆల్రౌండర్ మాక్సీ నాలుగు ఓవర్ల కోటాలో 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(20), ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్(24) రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ.. బ్యాటింగ్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. లక్నో విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టాపార్డర్ విఫలం కాగా.. బాధ్యత తీసుకోవాల్సిన నాలుగో నంబర్ బ్యాటర్ మాక్సీ చేతులెత్తేశాడు. 4 overs, 14 runs, 3 wickets, 24 laser beams 🔥⚡pic.twitter.com/pw5NOSbdpM — Lucknow Super Giants (@LucknowIPL) April 2, 2024 లక్నో యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మహిపాల్ లామ్రోర్(13 బంతుల్లో 33) కాసేపు పోరాడినా ఆర్సీబీని ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఈ నేపథ్యంలో మనోజ్ తివారి క్రిక్బజ్ షోలో మాక్స్వెల్ గురించి మాట్లాడాడు. ఇలా వస్తాడు.. అలా వెళ్లిపోతాడు ‘‘ఆర్సీబీ గ్లెన్ మాక్స్వెల్ను రిటైన్ చేసుకుంది. సరైన సమయానికి జీతం తీసుకుంటాడు. కానీ అదే స్థాయిలో ఆట మాత్రం ఆడలేకపోతున్నాడు. ఇలా వస్తాడు.. అలా వెళ్లిపోతాడు అన్నట్లుగా ఉంది అతడి పరిస్థితి. ఆటగాడిగా అతడికి అన్ని రకాల నైపుణ్యాలు ఉన్నాయి. కానీ వాటిని ఎక్కడ ప్రదర్శిస్తున్నాడు? ఐపీఎల్లో అతడి ట్రాక్ రికార్డు చూసినట్లయితే,, పంజాబ్ ఫ్రాంఛైజీకి ఆడినపుడు కూడా ఇలాగే ఉండేవాడు. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేస్తాడని ఆశిస్తే తుస్సుమనిపించేవాడు. అతడి ఆటలో నిలకడలేదు. ఇప్పటికైనా లోపాలు సరిచేసుకుంటే మంచిది’’ అని మాజీ బ్యాటర్ మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024 కోసం ఆర్సీబీ రూ. 11 కోట్లకు మాక్సీని రిటైన్ చేసుకుంది. ఆర్సీబీ తరఫున గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడి 400 పరుగులు చేశాడు. కేవలం మూడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అతడికి ఏకంగా 17 కోట్లు ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ నుంచి భారీ ధర(రూ. 17.5 కోట్లు)కు ట్రేడ్ చేసుకున్న కామెరాన్ గ్రీన్ కూడా ఆర్సీబీకి పెద్దగా ఉపయోగపడటం లేదని మనోజ్ తివారి పేర్కొన్నాడు. ఏదేమైనా.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ జట్టుతో లేనిలోటు ఆర్సీబీలో స్పష్టంగా కనిపిస్తోందన్నాడు. ఆర్సీబీ వర్సెస్ లక్నో స్కోర్లు: టాస్: ఆర్సీబీ.. బౌలింగ్ లక్నో స్కోరు: 181/5 (20) ఆర్సీబీ స్కోరు: 153 (19.4) ఫలితం: 28 పరుగుల తేడాతో ఆర్సీబీపై లక్నో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మయాంక్ యాదవ్(లక్నో- 3/14). చదవండి: MI: పాండ్యా ఒక్కడిని అలా వదిలేశారు.. అంతటికీ కారణం పెద్ద తలకాయలే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
క్రికెట్కు గుడ్బై చెప్పిన క్రీడా మంత్రి.. 19 ఏళ్ల కెరీర్కు?
టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీ ఫస్ట్క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా బిహార్తో మ్యాచ్ అనంతరం తన 19 ఏళ్ల కెరీర్కు తివారీ ముగింపు పలికాడు. ఈ క్రమంలో తన కెరీర్లో ఆఖరి మ్యాచ్ ఆడిన తివారీ బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ ఆదివారం ఘనంగా సన్మినించింది. అతడిని గోల్డెన్ బ్యాట్తో బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ చైర్మెన్ స్నేహసిస్ గంగూలీ సత్కారించారు. ఈ సందర్భంగా తివారీ మాట్లాడుతూ.. నాకు ఇష్టమైన ఈడెన్ గార్డెన్స్లో రిటైర్మెంట్ అవ్వడం చాలా సంంతోషంగా ఉంది. కానీ నా కెరీర్లో బెంగాల్కు రంజీ ట్రోఫీని అందించికపోవడం లోటుగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చాడు. కాగా తన కెరీర్లో 148 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన తివారీ.. 47.86 సగటుతో 10,195 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 30 సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్లో 5,581, టీ20ల్లో 3,436 పరుగులు మనోజ్ చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరపున 12 వన్డేలు ఆడిన తివారీ 287 పరుగులు చేశాడు. 2011లో చెన్నై వేదికగా వెస్టిండీస్తో జరిగిన వన్డేలో తివారీ సెంచరీ కూడా నమోదు చేశాడు. ఐపీఎల్లో కోల్కతా, పంజాబ్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్లకు ఆడాడు. కాగా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఆరంభానికి ముందే అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు మనోజ్ ప్రకటించాడు. కానీ బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ చైర్మెన్ స్నేహసిస్ గంగూలీ సూచన మెరకు మనోజ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఒకే ఒక్కే సీజన్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుత రంజీ సీజన్లో తివారీ భాగమయ్యాడు. ఇక 37 ఏళ్ల తివారీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కేబినెట్లో రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. చదవండి: #Dhruv Jurel: రెప్పపాటులో.. మెరుపులా కదిలిన జురెల్.. ‘సెంచరీ వీరుడి’ రనౌట్ చూశారా? -
క్రికెట్కు మనోజ్ తివారీ వీడ్కోలు
కోల్కతా: భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అన్ని ఫార్మాట్లకు గుడ్బై చెప్పాడు. ఈ బెంగాలీ క్రికెటర్ 2008 నుంచి 2015 వరకు అంతర్జాతీయ కెరీర్లో 12 వన్డేలు, మూడు టి20లు ఆడాడు. వన్డేల్లో ఒక సెంచరీ, అర్ధసెంచరీ ఉన్నాయి. కానీ మూడు టి20ల్లో ఒకసారి మాత్రమే బ్యాటింగ్ అవకాశం దక్కగా 15 పరుగులే చేశాడు. దేశవాళీ క్రికెట్లో 141 మ్యాచ్ల్లో 48.56 సగటుతో 9908 పరుగులు చేశాడు. ఐపీఎల్లో కోల్కతా, పంజాబ్, రైజింగ్ పుణేలకు ఆడాడు. 2012లో మనోజ్ తివారీ విన్నింగ్ షాట్తో కోల్కతా నైట్రైడర్స్ విజేతగా నిలిచింది. 37 ఏళ్ల తివారీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కేబినెట్లో రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. -
కేజ్రీవాల్ ప్లాన్, సిసోడియా హత్యకు కుట్ర చేస్తున్నారా?: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మద్యం విధానం కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఆయనకు ప్రాణ హాని ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ఈ ఆరోపణలపై బీజేపీ నేత ఎంపీ మనోజ్ తివారీ ఘాటుగా బదులిచ్చారు. ఢిల్లీ జైళ్లు ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకే వస్తాయని, మరి సిసోడియా ప్రాణాలకు ఎవరి నుంచి ముప్పు ఉంటుందని ఎదురు ప్రశ్నించారు. సిసోడియా ప్రాణహాని.. వాళ్ల నుంచేనా ఈ అంశంపై తివారీ మాట్లాడుతూ.. “ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం విషయంలో మంత్రి మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత, అవినీతిపరులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇంత కాలం అవినీతిపరులని తిట్టిన కేజ్రీవాల్ ప్రస్తుతం అవినీతిపరులను ఆలింగనం చేసుకుంటున్నారు. జైలులో మనీష్ సిసోడియా ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది, అయితే ఢిల్లీ జైలు ఢిల్లీ ప్రభుత్వం అధీనంలో ఉంది. మరి మనీష్ సిసోడియాకి ప్రాణ హాని బీజేపీ నుంచి ఎలా ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ రహస్యాలన్నీ ఆయనకు సన్నిహితుడైన మనీశ్ సిసోడియాకు బాగా తెలుసు. మరి తన సీక్రెట్లు బయటపడకుండా సిసోడియాను చంపేందుకు కేజ్రీవాల్ కుట్ర పన్నుతున్నారా?’’ అని ప్రశ్నించారు. ‘‘ఢిల్లీ సర్కారు పరిధిలో ఉన్న జైలులో సిసోడియా ప్రాణాలకు ముప్పు ఎలా ఉంటుంది? బీజేపీ నుంచే ముప్పు ఉందంటూ అపోహలు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిసోడియాకు గట్టి భద్రత ఇవ్వాలని తీహార్ జైలు అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ట్వీట్ ద్వారా ఈ విషయాలను పేర్కొన్నారు. Is Arvind Kejriwal conspiring to kill Manish Sisodia to stop him from disclosing Arvind Kejriwal’s secrets? An impression is being created that Manish Sisodia has threats from BJP. I appeal to jail authorities to provide Manish Sisodia best security possible:Manoj Tiwari, BJP MP pic.twitter.com/D0pYOMZVGb — ANI (@ANI) March 8, 2023 -
రంజీ ఫైనల్.. బెంగాల్ను ఆదుకునే ప్రయత్నం చేస్తున్న మంత్రి
బెంగాల్-సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ-2023 ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ సెకెండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ స్కోర్కు 61 పరుగులు వెనుకపడి ఉంది. బెంగాల్ కెప్టెన్, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి (57) షాబాజ్ అహ్మద్ (13) సాయంతో జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. అనుస్తుప్ మజుందార్ (61) హాఫ్సెంచరీతో రాణించగా.. సుమంత గుప్తా (1), అభిమన్యు ఈశ్వరన్ (16), సుదీప్ కుమార్ గరామీ (14) నిరాశపరిచారు. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కత్ (2/47), చేతన్ సకారియా (2/50) నిప్పులు చెరుగుతున్నారు. అంతకుముందు సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 404 పరుగులకు ఆలౌటైంది. హార్విక్ దేశాయ్ (50), షెల్డన్ జాక్సన్ (59), వనవద (81), చిరాగ్ జానీ (60) అర్ధసెంచరీతో రాణించారు. బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, ఆకాశ్దీప్, ఇషాన్ పోరెల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. దీనికి ముందు బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 174 పరుగులకే చాపచుట్టేసింది. ఉనద్కత్ (3/44), సకారియా (3/33), చిరాగ్ జానీ (2/33), జడేజా (2/19) చెలరేగారు. షాబాజ్ అహ్మద్ (69), అభిషేక్ పోరెల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో బెంగాల్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. -
స్పోర్ట్స్ మినిస్టర్ సారధ్యంలో శతకాలతో విరుచుకుపడిన ప్లేయర్లు
Ranji Trophy 2022-23 Semi Finals MP VS Bengal: రంజీ ట్రోఫీ-2022-23 సీజన్ చివరి అంకానికి చేరింది. ఈ దేశవాలీ టోర్నీలో ఇవాల్టి (ఫిబ్రవరి 8) నుంచే సెమీఫైనల్ మ్యాచ్లు మొదలయ్యాయి. తొలి సెమీస్లో బెంగాల్.. మధ్యప్రదేశ్ను ఢీకొంటుంటే, రెండో సెమీస్లో కర్ణాటక, సౌరాష్ట్ర జట్లు పోటీ పడుతున్నాయి. తొలి సెమీస్ విషయానికొస్తే.. స్పోర్ట్స్ మినిస్టర్ మనోజ్ తివారి సారధ్యంలో బెంగాల్ జట్టు తొలి రోజు ఆటలో పైచేయి సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బెంగాల్.. సుదీప్ కుమార్ ఘరామీ (112), అనుస్తుప్ మజుందార్ (120) శతకాలతో విరుచుకుపడటంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (27), కరణ్ లాల్ (23)లకు మంచి శుభారంభాలు లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ మనోజ్ తివారి (5), షాబజ్ అహ్మద్ (6) క్రీజ్లో ఉన్నారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, గౌరవ్ యాదవ్కు చెరో వికెట్ దక్కింది. -
ముచ్చటగా మూడోసారి తండ్రైన ప్రముఖ నటుడు.. ట్వీట్ వైరల్
భోజ్పూరి నటుడు, ఎంపీ మనోజ్ తివారి ముచ్చటగా మూడోసారి తండ్రయ్యాడు. సోమవారం ఆయన భార్య సురభి తివారీ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో భార్యతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వార్త విన్న అభిమానులు మనోజ్ తివారికి అభినందనలు తెలుపుతున్నారు. ట్విటర్లో ఆయన రాస్తూ..' లక్ష్మి తర్వాత సరస్వతి మా ఇంటికి వచ్చింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అందమైన చిన్నారి జన్మించింది. మా పాపను మీరంతా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఇట్లు సురభి-మనోజ్ తివారి' అంటూ పోస్ట్ చేశారు. మనోజ్ తివారి ప్రస్తుతం భాజపా ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా.. గత నెలలో మనోజ్ భార్య సురభి తివారీ బేబీ షవర్ని(సీమంతం) నిర్వహించారు. సురభి- మనోజ్ తివారీకి రెండో భార్య కాగా.. వీరికి 2020లో కూతురు జన్మించింది. అంతకు ముందే రాణి తివారీని 1999లో వివాహం చేసుకోగా.. వారికి రితి అనే కుమార్తె ఉంది. बड़े हर्ष के साथ सूचित करना है कि मेरे घर में लक्ष्मी के बाद सरस्वती का आगमन हुआ है..आज घर में प्यारी सी बिटिया पैदा हुई है.. उसपे आप सभी का आशीर्वाद बना रहे.. सुरभि-मनोज तिवारी pic.twitter.com/JJj1H82XEr — Manoj Tiwari 🇮🇳 (@ManojTiwariMP) December 12, 2022 -
51 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు
యాభై ఒక్క ఏళ్ల వయసులో ముచ్చటగా మూడోసారి తండ్రి కాబోతున్నాడు బాలీవుడ్ నటుడు మనోజ్ తివారి. తను తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా భార్య సురభి తివారీ గోధ్ భారై(సీమంతం) ఫంక్షన్ వీడియోను నెట్టింట షేర్ చేశాడు. 'కొన్ని సంతోషకరమైన క్షణాలను మాటల్లో చెప్పలేం. ఈ ఆనందం కలకాలం అలాగే నిలిచిపోతుందని భావిస్తున్నాను' అని క్యాప్షన్ జోడించాడు. దీనికి మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్ దీపక్ ఠాకూర్.. నిన్ను ఆ భగవంతుడు చల్లగా దీవించాలి అని కామెంట్ చేశాడు. మనోజ్ అభిమానులైతే శుభాకాంక్షలతో కామెంట్ సెక్షన్ను హోరెత్తిస్తున్నారు. కాగా మనోజ్ తివారి 1999లో రాణి తివారిని పెళ్లాడాడు. వీరికి రితి అనే పాప పుట్టింది. 2012లో వీరు విడాకులు తీసుకున్నారు. తర్వాత అతడు సురభిని పెళ్లాడాడు. వీరికి 2020లో పాప పుట్టింది. తాజాగా మరోసారి అతడు తండ్రి కాబోతున్నాడు. మనోజ్ హిందీ బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొన్నాడు. View this post on Instagram A post shared by Manoj Tiwari (@manojtiwari.mp) చదవండి: నాపై ట్రోలింగ్కు అతడే కారణం: జాన్వీ కపూర్ హన్సిక ఇంట పెళ్లి సందడి -
కేజ్రీవాల్ కరెన్సీ డిమాండ్కు బీజేపీ కౌంటర్
-
బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీపై కేసు
రాంచీ: బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీలపై కేసు నమోదైంది. జార్ఖండ్లోని దేవ్ఘర్ విమానాశ్రయంలో సూర్యాస్తమయం తర్వాత వీరి చార్టెడ్ ఫ్లైట్ను టేకాఫ్ చేయమని అధికారులను బలవంతం చేశారనే ఆరోపణలతో ఈ ఇద్దరితో పాటు మరో ఏడుగురిపై అభియోగాలు మోపారు పోలీసులు. ఇప్పటికే రాజకీయ సంక్షోభంలో ఉన్న జార్ఖండ్లో తాజా పరిణామం చర్చనీయాంశమైంది. దేవ్ఘర్ ఎయిర్పోర్టును ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది జులైలోనే ప్రారంభించారు. అయితే ఈ ఎయిర్పోర్టులో సూర్యాస్తమయానికి అరగంట ముందు నుంచి కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి లేదు. కానీ అవేమీ పట్టించుకోకుండా బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీ ఎయిర్పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గదిలోకి వెళ్లి తమ చార్టెట్ ఫ్లైట్ క్లియరెన్స్కు అనుమతి ఇవ్వాలని బలవంతం చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారి ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఆగస్టు 31న సూర్యాస్తమయం తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ విషయంపై ఎయిర్పోర్టు సెక్యూరిటీ ఇన్ఛార్జ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిశికాంత్ దూబె, దేవ్ఘర్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మంజునాథ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎంపీ నిశికాంత్ మంజునాథ్పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన పని తాను చేసుకుంటుంటే ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేసిన అనంతరం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సోరెన్ ఆరోపించారు. ముందు జాగ్రత్తగా యూపీఏ ఎమ్మెల్యేలను ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పుర్లోని రిసార్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు జార్ఖండ్లో పర్యటించడం, వారిపై కేసు నమోదు కావడం రాష్ట్రంలో పొలిటికల్ హీట్ను మరింత పెంచింది. చదవండి: నితీశ్కు బిగ్ షాక్.. బీజేపీలోకీ ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు -
సెంచరీ చేశా.. అయినా 14 మ్యాచ్లకు పక్కనపెట్టారు.. నాది వరల్డ్ రికార్డు!
న్యూఢిల్లీ: ‘‘ప్రస్తుత బీసీసీఐ యాజమాన్యం ఆటగాళ్లకు అండగా నిలబడుతోంది. 4-5 మ్యాచ్లలో విఫలమైనా మరో అవకాశం కల్పిస్తోంది’’ అని బెంగాల్ క్రీడా శాఖా మంత్రి, వెటరన్ క్రికెటర్ మనోజ్ తివారి అన్నారు. తాను టీమిండియాకు ఆడుతున్న సమయంలో గనుక ఇలాంటి మేనేజ్మెంట్ ఉండి ఉంటే తనను తాను నిరూపించుకునే అవకాశం దక్కేదని అభిప్రాయపడ్డారు. ఏళ్లపాటు ఎదురుచూసి కాగా బెంగాల్కు చెందిన మనోజ్ తివారి మనోజ్ తివారి.. భారత్ తరఫున 2008లో అరంగేట్రం చేశారు. ఇప్పటి వరకు మొత్తంగా 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇక 2011 డిసెంబరులో తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసిన మనోజ్ తివారి.. ఆ తర్వాతి ఛాన్స్ కోసం సుదీర్ఘకాలం ఎదురుచూడాల్సి వచ్చింది. అజేయ శతకంతో రాణించినా దురదృష్ట వెంటాడంతో జట్టుకు దూరమయ్యారు. ఈ క్రమంలో శ్రీలంకతో మ్యాచ్తో లెగ్ స్పిన్నర్ రాహుల్ శర్మకు సబ్స్టిట్యూట్గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మనోజ్.. నాలుగు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించారు. ఆ విషయంలో నాది ప్రపంచ రికార్డు ఈ నేపథ్యంలో గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న మనోజ్ తివారి తాజాగా స్పోర్ట్స్ తక్తో మాట్లాడారు. ‘‘వెస్టిండీస్తో మ్యాచ్లో సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాను. కానీ తర్వాత నన్ను జట్టు నుంచి తప్పించారు. 14 మ్యాచ్ల పాటు జట్టు దూరమయ్యాను. బాగా ఆడినా సరే నన్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారో ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీ. ఒకవేళ నాకు అవకాశం వస్తే అప్పుడు సెలక్టర్లుగా ఉన్నవాళ్లను కచ్చితంగా నిలదీస్తాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. వాళ్ల వల్లే ఇదంతా అదే విధంగా.. ‘‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన తర్వాత 14 మ్యాచ్లకు దూరమైన ఏకైక ప్లేయర్గా నేను ప్రపంచ రికార్డు నెలకొల్పాను. ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాను. రీఎంట్రీలో 65 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీశాను. అయినా, కూడా నా కెరీర్ సాఫీగా సాగలేదు. సరైన అవకాశాలు రాలేదు’’ అని మనోజ్ తివారి సెలక్టర్ల తీరుపై విమర్శలు గుప్పించారు. అయితే, వచ్చిన కొన్ని ఛాన్స్ల్లోనే తన ప్రతిభను నిరూపించుకున్నానన్న ఆయన.. తన జీవితంలో జరిగిన ఏ విషయానికి చింతించడం లేదని పేర్కొన్నారు. కాగా రంజీ ట్రోఫీ సీజన్ 2021-2022లో బెంగాల్ తరఫున బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు మనోజ్ తివారి. సెమీస్ మ్యాచ్లోనూ సత్తా చాటారు. చదవండి: Manoj Tiwary On Work And Cricket: పొద్దంతా క్రికెట్.. రాత్రిళ్లు నియోజకవర్గం పని -
టీఎంసీలో చేరిన టీమిండియా ఆటగాడు
కోల్కత్తా : టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. తన స్వరాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో బుధవారం హుబ్లీలో నిర్వహించిన ర్యాలీ పాల్గొని టీఎంసీ గూటికి చేరాడు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో మనోజ్ రాజకీయ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గతకొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేంద్రంలోని మోదీ సర్కార్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రో ధరలను పెంచుతోందంటూ విమర్శలు కురిపించాడు. అంతేకాకుండా సామన్యుడి నడ్డివిరిచేలా పెరుగుతున్న ధరల్లో పెట్రోల్, డీజిల్ భారీ భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. కాగా బెంగాల్లో రాజకీయ కాక తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోరు ఉత్కంఠగా మారింది. అధికార టీఎంసీ నేతల్ని టార్గెట్గా చేసుకున్న బీజేపీ.. విజయమే లక్ష్యంగా దూసుకుడుగా వ్యవరిస్తోంది. మరోవైపు బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేలా మమత పావులు కదుపుతున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తుల్ని తనవైపుకు తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత లోక్సభ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులకు టికెట్లు కేటాయించి పార్లెమెంట్కు పంపిన విషయం తెలిసిందే. తాజాగా మనోజ్ తివారీని సైతం తన గూటికి చేర్చుకున్నారు. కాగా 35 ఏళ్ల మనోజ్ తివారీ టీమిండియా తరుఫున వన్డే, టీ-20లకు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో సొంత జట్టు కోల్కత్త తరఫున సుదీర్ఘంగా ఆడాడు. కొన్నాళ్ల పాటు పంజాబ్కు ప్రాతినిథ్యం వహించాడు. రాష్ట్ర స్థాయిలో బెంగాల్ క్రికెట్కు సారథిగా వ్యవహరించాడు. 2008లో ఫిబ్రవరి 3న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ద్వారా అరంగేట్రం చేసిన తివారీ.. 12 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తరువాత ఫామ్ కోల్పోవడంతో జట్టుకి దూరమయ్యాడు. ఐపీఎల్లో రాణించినప్పటికీ జట్టులో మరోసారి చోటుదక్కలేదు. ఈ క్రమంలోనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నకావడంతో రాజకీయ రంగ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే టీఎంసీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తారా లేక అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. -
నాకు లక్ష ఇస్తే.. తనకు రూ. 25 వేలే
బాలీవుడ్ టీవీ షో కపిల్ శర్మ కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బడా స్టార్స్ అంతా ఈ షోకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో ఈ వారం కపిల్ శర్మ షోకు భోజ్పురి సూపర్ స్టార్లు మనోజ్ తివారీ, రవి కిషన్ వచ్చారు. తమ జీవితాలు, కెరీర్కు సంబంధించి అనేక విషయాలను వెల్లడించారు. అంతేకాక ఇద్దరి మధ్య వచ్చిన విభేదాల గురించి తెలిపారు. ఈ సందర్భంగా మనోజ్ తివారీ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో రవి కిషన్ నాకు సీనియర్. నేను పరిశ్రమలోకి వచ్చేనాటికే అతడు సూపర్ స్టార్. అయితే ఒక సినిమాకు రవికిషన్కు కేవలం 25 వేల రూపాయలు ఇస్తే.. నాకు లక్ష రూపాయలు ఇచ్చారు. అది కూడా కేవలం ఒక ఐటమ్ సాంగ్ కోసం’ అంటూ రవి కిషన్ని ఆట పట్టించాడు. ఈ షోలో క్రికెట్ ఆడారు. ఇలా ఇద్దరు ఒకే షోకు హాజరుకావడం చాలా గొప్ప విషయం అన్నారు. అంతేకాక ఇండస్ట్రీలో వారి ప్రయాణం.. ఎదుర్కొన్న కష్టాలు.. హార్డ్ వర్క్ వంటి విషయాల గురించి వెల్లడించారు. (చదవండి: ‘రూ.500 టికెట్తో.. రూ.5 లక్షల వైద్యం’) అభిమానులతో మాటల సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఇద్దరు హీరోలు. తాను రాజకీయ నాయకుడిని అయితే.. నదులను శుభ్రం చేస్తానని తెలిపారు మనోజ్ తివారీ. ఇద్దరికి సంబంధించిన ఫోటోలను షోలో ప్రదర్శించారు. వాటిల్లో వారు సమజానికి సేవ చేస్తున్న ఫోటోలు కూడా ఉన్నాయి. లాక్డౌన్ కాలంలో మనోజ్ తివారీ పేదలకు సాయం చేయగా.. రవి కిషన్ తన స్వస్థలం.. గోరఖ్పూర్లో వరదల సమయంలో, లాక్డౌన్ కాలంలో జనాలకు అవసరమైన వస్తువులను అందించారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. View this post on Instagram कल A post shared by Ravi Kishan (@ravikishann) on Sep 11, 2020 at 11:37pm PDT -
ఖాళీ ఉన్నా... ఆడే అవకాశం ఇవ్వలేదు
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు మిడిల్ ఆర్డర్లో ఖాళీ ఉన్నా... తనకు అవకాశం ఇవ్వలేదంటూ భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక స్పోర్ట్స్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్యూలో అతడు తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వివరించాడు. ‘2011–2012లో మేము ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాం. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత మిడిల్ ఆర్డర్ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయింది. అంతేకాకుండా మిడిల్ ఆర్డర్లో బ్యాట్స్మన్కు ఒక ఖాళీ కూడా ఉంది. టీమ్ మేనేజ్మెంట్ నాకు అవకాశం ఇవ్వాలని భావించి ఉంటే తప్పకుండా ఇచ్చేది. కానీ వారు అలా భావించలేదు’ అని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా సెంచరీతో జట్టును గెలిపించే ప్రదర్శన చేశాక ఎవరికైనా సరే జట్టులో తన స్థానం సుస్థిరం అనే అనిపిస్తుందని... అయితే తనకు మాత్రం ఆ విధంగా జరగలేదని... తర్వాత తనను ఏకంగా 14 మ్యాచ్లపాటు బెంచ్కే పరిమితం చేయడం షాక్కు గురిచేసిందని వాపోయాడు. ఆసీస్ పర్యటన కంటే ముందు వెస్టిండీస్తో భారత్ వన్డే సిరీస్ ఆడింది. అందులో భాగంగా జరిగిన ఐదో వన్డేలో మనోజ్ తివారి శతకం (104) సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్లో భారత్ 34 పరుగుల తేడాతో గెలుపొందింది.(ఆరోజు సచిన్ నక్కతోకను తొక్కాడు : నెహ్రా) మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని మాత్రం మనోజ్ ప్రశంసలతో ముంచెత్తాడు. 2011 ప్రపంచ కప్ను భారత చేజిక్కించుకోవడంలో గంగూలీ పాత్ర కూడా ఉందన్నాడు. గంగూలీ నాయకుడిగా ఉన్నప్పుడే ప్రపంచ కప్ను గెలిచేలా యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, ఆశీష్ నెహ్రా, హర్భజన్ సింగ్లతో కూడిన జట్టును తయారు చేశాడన్నాడు. వారిని 2011 ప్రపంచ కప్లో అప్పటి సారథి ధోని సమర్థంగా ఉపయోగించుకున్నాడని పేర్కొన్నాడు. భారత్ తరఫున 12 వన్డేలు ఆడిన మనోజ్ తివారి 287 పరుగులు చేశాడు. -
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి
ముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్టు ఎంపికలో ప్రాంతీయతకు ప్రాధాన్యత లభిస్తోందని ఆరోపించాడు. ఎవరి హయాంలోనైనా చీఫ్ సెలక్టర్ సొంత ప్రాంతానికి చెందిన క్రికెటర్లకే మేలు కలుగు తుందని విమర్శించాడు. సెలక్షన్ కమిటీ వైఫల్యం వల్లే గతేడాది వరల్డ్కప్లో భారత్ ఓడిపోయిందన్న తివారీ... నాలుగేళ్ల సమయం దొరికినప్పటికీ జట్టులో నాలుగో నంబర్ స్థానాన్ని భర్తీ చేయలేకపోయిందని అసహనం వ్యక్తం చేశాడు. సిరీస్ల కోసం టీమిండియాను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ సమావేశాలను టెలివిజన్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేశాడు. ఆటగాళ్లను ఏ పద్ధతి ప్రకారం కమిటీ ఎంపిక చేస్తుందో తెలుసుకోవడానికి ఇదొక్కటే మార్గమని అభిప్రాయపడ్డాడు. ఒక ఆటగాడిని జట్టు నుంచి తప్పించినప్పుడు కనీసం అతనికైనా కారణం చెప్పాలని కోరాడు. ఎమ్మెస్కే ప్రసాద్ ఆంధ్ర వ్యక్తి కాబట్టి హనుమ విహారికి, వెస్ట్జోన్కి చెందిన వ్యక్తి అధికారంలో ఉండగా వసీమ్ జాఫర్కు, నార్త్జోన్ వ్యక్తి సెలెక్టర్గా ఉన్న కాలంలో గురుకీరత్ సింగ్, రిషీ ధావన్లకు అవకాశాలు వచ్చాయని భారత్ తరఫున 12 వన్డేలు, 3 టి20లు ఆడిన తివారీ ఆరోపించాడు. -
ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడి మార్పు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఆదేశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న మనోజ్ తివారీ స్థానంలో ఆదేశ్ గుప్తా నియమితులయ్యారు. బీజేపీ సీనియర్ నేతగా ఉన్న ఆదేశ్ కుమార్ గుప్తా.. గతంలో ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్గా పనిచేశారు. కాగా, రెండు సార్లు ఎంపీగా ఉన్న మనోజ్ తివారి 2016లో బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన పదవి నుంచి వైదొలగాలని భావించినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే నూతన అధ్యక్షుడి ఎంపిక చేపట్టే వరకు పదవిలో కొనసాగాల్సిందిగా తివారీకి బీజేపీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా తెలిసింది. మరోవైపు ఇటీవల తివారీ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. హరియాణాలోని ఓ అకాడమీలో క్రికెట్ ఆడటం వివాదానికి దారితీసింది. -
‘లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించలేదు’
న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో పలు నిబంధనలు, మర్గదర్శకాలను పాటిస్తూ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించుకోవడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ, ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ హర్యానాలోని సోనిపట్ జిల్లా షేక్పురాలో ఉన్న క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఓ క్రికెట్ మ్యాచ్లో సోమవారం పాల్గొన్నారు. క్రికెట్ ఆడుతున్న క్రమంలో మనోజ్ తివారి తన ముఖానికి మాస్క్ ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. లాక్డౌన్ నిబంధనలను ఎంపీ ఉల్లఘించారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో తనపై వస్తున్న విమర్శలపై ఎంపీ మనోజ్ తివారీ స్పందించారు. ‘లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన సామాజిక దూరం నిబంధనలను పాటించాను అని తెలిపారు. ప్రేక్షకులు లేకుండా స్టేడియాలు ప్రారంభించుకోవాలని హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే తాను సోనిపట్ క్రికెట్ అకాడమీలో క్రికెట్ ఆడినట్లు తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించలేదని పేర్కొన్నారు. సోషల్ మీడియలో వైరల్గా మారిన ఫొటోల్లో ఎంపీ మనోజ్ తివారీ ముఖానికి మాస్క్ ధరించకుండా, సామజిక దూరం పాటించకూడా ఉన్నట్లు కనిపిస్తోంది. దేశంలో కరోనా వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా కొత్తగా 6,977 కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 1,38,845కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
‘కేజ్రీవాల్కు డబుల్ పనిష్మెంట్’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ఆప్ నేతలు దోషులుగా తేలితే రెండింతలు శిక్ష ఉండాలన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలను ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఎద్దేవా చేశారు. అసలు ఆప్ చీఫ్ కేజ్రీవాల్నూ శిక్షించాలని దుయ్యబట్టారు. ఐబీ ఉద్యోగి హత్యోదంతంలో ఆప్ కార్పొరేటర్ తాహిర్ హుస్సేన్పై కేసు నమోదైన క్రమంలో మనోజ్ తివారీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘డబుల్ పనిష్మెంట్ అంటే..ఇప్పుడు తాహిర్తో పాటు ఆయన బాస్ను కూడా కఠినంగా శిక్షించాలి..ఐబీ అధికారిని అమానుషంగా కత్తితో 400 సార్లు పొడిచి చంపిన ఈ కేసులో నిందితులను, కుట్రదారులను నిర్ధిష్ట కాలపరిమితి విధించి ఉరితీయాల’ని మనోజ్ తివారీ ట్వీట్ చేశారు. కాగా ఢిల్లీ అల్లర్లలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై కౌన్సిలర్ తాహిర్ హుసేన్ను ఆప్ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఐబీ అధికారిని తాహిర్ హుస్సేన్ మనుషులు ఇంటి నుంచి బలవంతంగా తీసుకువెళ్లారని బాధితుడి కుటుం సభ్యులు సైతం ఆరోపించారు. ఐబీ అధికారి మృతదేహం ఆ తర్వాత చాంద్బాగ్ ప్రాంతంలోని డ్రైనేజ్లో లభ్యమైంది. ఈ హత్య కేసులో ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి : అంకిత్ శర్మ హత్య: తాహిర్పై ఆప్ వేటు -
ఓటమికి బాధ్యత వహిస్తా :మనోజ్ తివారీ
-
ఢిల్లీ పీఠం మాదే.. తివారి జోస్యం
-
ఢిల్లీ పీఠం మాదే.. తివారి జోస్యం
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి ధీమా వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 50కి పైగా సీట్లను గెలుచుకొని, తమ పార్టీ జాతీయ రాజధానిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అన్ని వైపులనుంచి ఆ ప్రకంపనలు తనకు వినిపిస్తున్నాయనీ, బీజీపీ తప్పక విజయం సాధిస్తుందని తన సిక్స్త్ సెన్స్ చెబుతోందంటూ జోస్యం చెప్పారు. ఢిల్లీ ప్రజల ఆశీస్సులతో తమ విజయం తథ్యమని తివారి వెల్లడించారు. అంతేకాదు ప్రజల ఆశీర్వాదాలు ప్రధాని మోదీకి ఉన్నాయనీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయ మన్నారు. ఢిల్లీ ప్రజలు తమకే పట్టం గడతారనీ, తమ విజయం కోసం ఎదురు చూస్తున్నామని తివారి వెల్లడించారు. అయితే, బీజేపీ అధికారంలోకి వస్తే మీరు సీఎం అవుతారా అన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేసిన ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు చెప్పడానికి నిరాకరించారు. కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఈ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 70 అసెంబ్లీ స్థానాలకు గాను 67 సీట్లను గెలుచుకోగా, బీజేపీ మూడు స్థానాలను మాత్రం దక్కించుకుంది. కాంగ్రెస్కు ఒక్కస్థానం కూడా దక్కలేదు. మరోవైపు గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఏడు స్థానాలను దక్కించుకోవడం విశేషం. చదవండి : ఢిల్లీ ఎన్నికల పోలింగ్ లైవ్అప్డేట్స్ -
కేజ్రీవాల్పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఢిల్లీ బీజేపీ చీఫ్, ఎంపీ మనోజ్ తివారీ అన్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని ఆయన తన ఎమ్మెల్యేలతో కొట్టించారని, ఇటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలూ అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. సాక్షి టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కేజ్రీవాల్ పరిపాలన నచ్చకపోవడంతోనే.. ఆయనకు వ్యతిరేకంగా వందలమంది నామినేషన్లు వేశారని అన్నారు. ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 45 సీట్లకుపైనే వస్తాయని అన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికలలో బీజేపీ సత్తా చాటిందని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం రాకపోవడం వల్ల ఢిల్లీకి నష్టం జరిగిందన్నారు. దేశానికి మోదీ, ఢిల్లీకి బీజేపీ అనేది తమ నినాదమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఎక్కడ గుడిసె ఉందో, అక్కడే నిరుపేదలకు ఇల్లు కట్టించి.. గ్యాస్, టాయిలెట్ సౌకర్యం కల్పించిందని చెప్పారు. కుషాల్ ఢిల్లీ తమ లక్ష్యమన్నారు. -
మనోజ్ తివారీ 303 నాటౌట్
కోల్కతా: హైదరాబాద్తో జరుగుతోన్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో బెంగాల్ బ్యాట్స్మన్ మనోజ్ తివారీ ట్రిపుల్ సెంచరీతో సత్తా చాటాడు. మనోజ్ తివారీ (414 బంతుల్లో 303 నాటౌట్; 30 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత ప్రదర్శనతో తొలి ఇన్నింగ్స్ను బెంగాల్ 7 వికెట్లకు 635 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అతని ఫస్ట్క్లాస్ కెరీర్లో ఇది 27వ సెంచరీ కాగా, తొలి ‘ట్రిపుల్’ కావడం విశేషం. బెంగాల్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. -
కేజ్రీవాల్కు కొత్త చిక్కులు.. రూ.500 కోట్ల దావా
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచార వేడి పెరిగింది. అధికార, విపక్ష పార్టీలైన ఆమ్ఆద్మీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించిన ఢిల్లీ బీజేపీ చీఫ్, ఎంపీ మనోజ్ తివారీ సీఎం కేజ్రీవాల్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆప్ ఇటీవల విడుదల చేసిన ‘లగే రహో కేజ్రీవాల్’ అనే ప్రచారం గీతంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పాట తన బోజ్పురి సంగీత అల్బమ్కు చెందిన ఎడిటెడ్ వెర్షన్ అని, తన పాటను కాపీ చేసే హక్కు ఆప్ సర్కార్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. (ఊపేస్తున్న.. ‘లగే రహో కేజ్రీవాల్’) దీనిపై తాను న్యాయపోరాటానికి దిగుతానని, తన మేధో సంపత్తి హక్కులు ఉపయోగించుకున్నందుకు రూ.500 కోట్ల పరువునష్టం దావా వేసినట్లు మనోజ్ తివారీ ప్రకటించారు. అలాగే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశానని అన్నారు. ఈ మేరకు ఆయనకు నోటీసులు పంపామన్నారు. అబద్దాలను ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్పై ఆప్ ఓ ప్రచార గీతాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘లగే రహో కేజ్రీవాల్’ అంటూ సాగే ఈ ప్రచారం గీతం ఢిల్లీ ప్రజలను విశేషంగా అకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. (తేలని సీఎం అభ్యర్థి.. మోదీపైనే భారం!) -
ప్రధానికి మనోజ్ తివారీ లేఖ
న్యూఢిల్లీ: దేశంలో బాలల దినోత్సవాన్ని నవంబర్ 14వ తేదీకి బదులు డిసెంబర్ 26న జరపాలని కోరుతూ బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు, ఎంపీ మనోజ్ తివారీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇలా చేస్తే అది సిక్కుల పదో గురువైన గురు గోవింద్ సింగ్ ఇద్దరు కొడుకులకు ఘన నివాళి అవుతుందని లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఎందరో బాలలు ఎన్నో త్యాగాలు చేశారని, కానీ వారిలో గురు గోవింద్ సింగ్ కుమారులైన జొరావర్ సింగ్, ఫతే సింగ్ల త్యాగం గొప్పదన్నారు. 1705వ సంవత్సరంలో డిసెంబర్ 26నే వాళ్లిద్దరు ధర్మాన్ని రక్షించడానికి తమ ప్రాణాలర్పించారన్నారు. స్వతంత్ర భారతావని మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని ప్రతి ఏటా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మనోజ్ తివారీ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న సిక్కు ఓటర్లను దృష్టిలో పెట్టుకునే ఆయన లేఖాస్త్రం సాధించారన్న వాదనలు వినబడుతున్నాయి. పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన ఆయన బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుంజలో ఉన్నారు. పూర్వాంచల్ వాసులు కూడా ఢిల్లీలో గణనీయంగా ఉన్నారు. (చదవండి: ‘మఫ్లర్'మ్యాన్కు ఏమైంది?) -
ఎన్నార్సీపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు.. భగ్గుమన్న బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలు గురువారం ఆందోళన బాట పట్టారు. ఎన్నార్సీపై ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ.. సీఎం నివాసం ఎదుట బీజేపీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. సీఎం డౌన్.. డౌన్ అంటూ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో సీఎం కార్యాలయం ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్కు తరలించారు. జాతీయ పౌరజాబితా (ఎన్నార్సీ) అమలైతే ఢిల్లీ నుంచి ముందుగా వెళ్లాల్సింది బీజేపీ నేత మనోజ్ తివారేనని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులు భగ్గుమన్నారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ అయిన మనోజ్ తీవారికి కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. -
నన్ను తరిమేయడానికి ఆయన ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్సీ) అంశంపై సీఎం కేజ్రీవాల్, బీజేపీ నేత మనోజ్ తివారీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఢిల్లీలో ఎన్ఆర్సీ అమలు చేస్తే మనోజ్ తివారీనే ముందుగా ఢిల్లీ వదిలిపోవాల్సి వస్తుందని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై తివారీ తాజాగా విరుచుకుపడ్డారు. ఇదే కేజ్రీవాల్ ఉద్దేశమైతే ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని అనుకోవాల్సి వస్తుందని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పూర్వాంచల్ నుంచి ఒక వ్యక్తి ఢిల్లీ వస్తే అతను చొరబాటుదారు అవుతారని, అతన్ని ఢిల్లీ నుంచి తరిమికొట్టాలని ఆయన చెప్పదలుచుకున్నారా? ఇతర రాష్ట్రాల నుంచి వలసవచ్చిన వారంతా విదేశీయులని ఆయన అభిప్రాయమా?. ఒక ఐఆర్ఎస్ అధికారిగా ఆయనకు ఎన్ఆర్సీ అంటే తెలియదా? అని తివారీ తీవ్ర స్థాయిలో సీఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముందు తివారినే వెళ్లిపోవాలి ఢిల్లీలో ఎన్ఆర్సీ అమలు చేయాలంటున్న ఢిల్లీ బీజేపీ చీఫ్ తివారీ అభిప్రాయంపై కేజ్రీవాల్ను మీడియా అడిగినప్పుడు ఆయన సూటిగా స్పందించారు. అదే జరిగితే ముందుగా ఢిల్లీని వదిలి పెట్టాల్సింది తివారీయేనని వ్యాఖ్యానించారు. జర్నలిస్టుపై దాడికి చొరబాటుదారులే కారణమని, ఢిల్లీలో ఎన్ఆర్సీ అమలు చేయాలని మనోజ్ తివారీ చెబుతున్నారని, ఎన్ఆర్సీ అమలు చేస్తే ముందుగా ఢిల్లీని వదిలి పెట్టాల్సింది ఆయనేనని అన్నారు. ఢిల్లీలో స్థిరపడిన అక్రమ వలసదారులతో ప్రమాదం ఉన్నందున ఢిల్లీలో ఎన్ఆర్సీ అవసరం ఎంతైనా ఉందని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల పార్టీ మేనిఫెస్టేలో ఇది కూడా ఉండబోతోందని ఇటీవల తివారీ చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాగా, కేజ్రీవాల్ తాజా వ్యాఖ్యలపై బీజేపీ నేత కపిల్ మిశ్రా ఘాటుగా స్పందించారు. సీఎం వ్యాఖ్యలు కలవరపెట్టే విధంగా ఉన్నాయని అన్నారు. ఢిల్లీలో ఎన్ఆర్సీ అమలు చేస్తే బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రజలు ఢిల్లీ వదలిపెట్టాలని కేజ్రీవాల్ చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఎన్ఆర్సీలో ‘ఎన్’ అంటే ‘జాతీయుడు’ (నేషనల్) అని అర్ధమని, కొందరికి ఇది అవగాహన కావడం లేదని కేజ్రీవాల్ను పరోక్షంగా విమర్శించారు. -
‘అదే జరిగితే ముందు వెళ్లేది ఆయనే’
న్యూఢిల్లీ: ఒక వేళ దేశ రాజధానిలో గనక భారత పౌరులను గుర్తించే ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్’ను అమలు చేస్తే.. బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీనే తొలుత ఢిల్లీ నుంచి వెళ్లి పోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అసోం తరహాలోనే ఢిల్లీలో కూడా అక్రమ వలసదారులను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని మనోజ్ తివారీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో అద్దెకుంటున్న వారికి కూడా వర్తించే పవర్ సబ్సిడీ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు కేజ్రీవాల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఒకవేళ రాష్ట్రంలో ఎన్ఆర్సీని వర్తింపజేస్తే.. మనోజ్ తివారీనే ముందుగా ఢిల్లీ నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు. (చదవండి: మిమ్మల్ని టచ్ చేయాలంటే నన్ను దాటాలి!) అసోంలో ఎన్ఆర్సీ అమలు చేసిన సందర్భంగా ఢిల్లీలో కూడా అమలు చేయాలని మనోజ్ తివారీ డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా ఢిల్లీలో ప్రవేశించారని.. వారి వల్ల రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయన్నారు మనోజ్ తివారి. వారిని రాష్ట్రం నుంచి పంపించడానికి ఢిల్లీలో కూడా ఎన్ఆర్సీ అమలు చేయాలని మనోజ్ తివారి డిమాండ్ చేశారు. ఎన్ఆర్సీ అమలు రాజకీయ పార్టీల మధ్య విబేధాలు సృష్టిస్తోంది. విపక్షాలు ఎన్ఆర్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితుల్లోను తమ రాష్ట్రాల్లో ఎన్ఆర్సీని అమలు చేయమని.. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
‘డిప్యూటీ సీఎం కూడా రాజీనామా చేస్తారు’
సాక్షి, న్యూఢిల్లీ: మరికొన్ని నెలల్లో దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగునున్న వేళ బీజేపీ ఎంపీ, ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అధికార ఆమ్ఆద్మీ పార్టీలో ముసలం మొదలైందని, ముఖ్యనేతలంతా ఆప్ని వీడతారని పేర్కొన్నారు. వీరిలో ఉపముఖ్యమంత్రి, సీనియర్ నేత మనీష్ సిసోడియా కూడా ఉన్నారని, ఆయన ఏ క్షణమైన పార్టీని వీడే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020 ఫిబ్రవరి నాటికి ఢిల్లీ అసెంబ్లీ గడవు ముగుస్తున్న విషయం తెలిసిందే. సోమవారం మనోజ్ తివారి ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల లోపు ఆప్లో కేవలం సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు. కేజ్రీవాల్ తీరుతో, పార్టీ సిద్దాంతాలతో విసిగిపోయిన అనేక నేతలు ఇప్పటికే గుడ్బై చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. రాజకీయాలను ప్రక్షాళన చేస్తామనే నినాదంతో ఆప్లో చేరిన ముఖ్యలు మోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషన్, ఆనంద్ కుమార్, కుమార్ విశ్వాస్తో వీరంతా ఇప్పుడు ఎక్కడున్నారంటూ ఆయన ప్రశ్నించారు. గడిచిన ఏడాది కాలంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని వీడారని, రానున్న కాలంలో ఆప్ ఖాళీ కావడం తప్పదని అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ వైఖరితో ఆ పార్టీ నేతలే కాకా ప్రజలు కూడా విసిగిపోయారని విమర్శించారు. త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలల్లో బీజేపీ విజయం సాధించడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో కూడా ఎన్ఆర్సీని అమలు చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని తివారి తెలిపారు. కాగా ఆప్ ముఖ్యనేత, ఎమ్మెల్యే అల్కా లాంబా ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె కేజ్రీవాల్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతకుముందే ఎమ్మెల్యే కపిల్ మిశ్రా కూడా ఆప్ను వీడి బీజేపీలో చేరారు. -
విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ విమోచన దినోత్స వాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేసింది. విమోచన దినోత్సవాన్ని నిర్వహించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో విమోచన దినోత్సవాన్ని జరపకుండా టీఆర్ఎస్ పార్టీ.. ఎంఐఎం అడుగులకు మడుగులొత్తుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందన్నారు. తెలంగాణ విమోచన ఉద్యమానికి సంబంధించి భారత ప్రభుత్వం జరిపిన ఆపరేషన్ పోలో, ఉద్యమ పోరాటాన్ని వివరిస్తూ తెలంగాణ విమోచన కమిటీ ఆధ్వర్యం లో మంగళవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తో కలసి ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ తివారీ ప్రారంభించారు. బైరాం పల్లి కాల్పుల ఉదంతంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల్ని, ఆ ఉదంతం ప్రత్యక్ష సాక్షులను ఈ సందర్భంగా సన్మానించారు. నాడొక మాట.. నేడొక మాట అధికారంలోకి కాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని అప్పటి సీఎం రోశయ్యను డిమాండ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఎందుకు మిన్నకుండిపోతున్నారని కిషన్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఏంఐఎంకు తాకట్టుపెడుతోందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ చరిత్రను మాత్రమే చెప్పుకొనేలా టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. విమోచన ఉద్యమ పోరాటాన్ని ప్రతిఒక్కరికీ తెలిసేలా కృషి చేస్తామని మనోజ్ తివారీ అన్నారు. కార్యక్రమంలో ఎంపీలు డి.అరవింద్, మోహన్రావు, సీనియర్ నేతలు శ్రీరాం వెదిరే, సత్యకుమార్, పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి..మీరేనా?!
న్యూఢిల్లీ : అసోం తరహాలోనే దేశ రాజధాని ఢిల్లీలో కూడా అక్రమ వలసదారులను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. భారత పౌరులను గుర్తించే ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్’ అసోం పౌర తుది జాబితా నేడు వెలువడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ఢిల్లీలో కూడా ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అక్రమ వలసదారులు ఢిల్లీలో తిష్ట వేశారని.. వారి సంఖ్య రాజధానికి ప్రమాదకరంగా పరిణమించిందని పేర్కొన్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఎన్ఆర్సీని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చదవండి: ఎన్ఆర్సీ అసోం తుది జాబితా; 19.6 లక్షల మంది అవుట్! కాగా మనోజ్ తివారీ వ్యాఖ్యలపై అఖిల భారత మహిళా కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. వలసదారులను ఏరివేయమని వలస వచ్చిన వ్యక్తే చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేసింది. ఈ మేరకు...‘ మనోజ్ తివారీ గారూ.. బిహార్లోని కైమూర్లో జన్మించి... ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో చదివి...మహారాష్ట్రలోని ముంబైలో పనిచేసి, ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో పోటీచేసి, మళ్లీ ఢిల్లీలో బరిలో దిగారు. మీరు ఢిల్లీ నుంచి వలసదారులను ఏరివేయాలని కోరుతున్నారు. నిందాస్తుతి తనపేరు మార్చుకోవాలేమో’ అని ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇక అసోంలో మొత్తం 3.29 కోట్ల మంది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, వారిలో 3 కోట్ల పదకొండు లక్షల మందిని మాత్రమే ఎన్ఆర్సీ భారత పౌరులుగా గుర్తించింది. దీంతో తుది జాబితాలో చోటు దక్కని దాదాపు 19 లక్షల మంది ఇకపై విదేశీయులుగా గుర్తింపబడనున్నారు. So Manoj Tiwari ji Born in Kaimur, Bihar Studied in Varanasi, UP Worked in Mumbai, Maharshtra Contested in Gorakhpur, UP Contested again in Delhi Is talking about throwing immigrants away from Delhi. Irony wants a change of name! https://t.co/aUGfqYIewt — All India Mahila Congress (@MahilaCongress) August 31, 2019 -
యాంటి రోమియో స్క్వాడ్ పని తీరు భేష్
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో ప్రారంభించిన వివాదాస్పద యాంటి రోమియో స్క్వాడ్ బృందానికి తాజాగా మరో మద్దతుదారు దొరికారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి యాంటి రోమియో స్క్వాడ్ పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. త్వరలోనే దీన్ని ఢిల్లీలో కూడా ప్రారంభిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో బీజేపీ స్టేట్ వర్కింగ్ కమిటీ ప్రారంభోత్సవానికి హాజరైన మనోజ్ తివారి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైన యాంటి రోమియో స్క్వాడ్ బృందాల పని తీరు చాలా బాగుంది. మహిళల రక్షణకు ఇది చాలా మంచి పద్దతి. త్వరలోనే దీన్ని ఢిల్లీలో కూడా ప్రారంభిస్తే బాగుంటుంద’న్నారు. ఈవ్ టీజింగ్కు పాల్పడే వారి పని పట్టడం కోసం 2017లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ యాంటి రోమియో స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ బృందాల పని తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. మహిళల రక్షణ పేరిట ఈ బృందాలు జంటలపై దాడులకు తెగబటమే కాక యువకులకు గుండు కొట్టించడం.. గుంజీలు తీయించడం వంటి దారుణాలకు పాల్పడ్డారు. దాంతో కొన్ని రోజుల పాటు ఈ బృందాల మీద నిషేధం విధించారు. కానీ తాజాగా మహిళల పట్ల నేరాలు పెరుగుతుండటంతో యోగి ఆదిత్యనాథ్ ఈ యాంటి రోమియో స్క్వాడ్ను తిరిగి పునరుద్దరించారు. -
‘ఓటర్లను కొనేందుకే ఇలా చేస్తున్నారు’
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నారని ఢిల్లీ బీజేపీ చీఫ్, ఎంపీ మనోజ్ తివారి విమర్శించారు. ప్రజలకు నిజంగా మేలు చేయాలని భావిస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మెట్రో రైళ్లు, బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేందుకు వీలుగా ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఈ పథకానికి అయ్యే ఖర్చుతో కేంద్రానికి సంబంధం లేదని, తామే పూర్తి ఖర్చు భరిస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రకటనపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ తీవ్రంగా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ ఢిల్లీలోని పేద ప్రజలకు ప్రధాని ఆవాస్ యోజన, వైద్య పథకాలు సీఎం అమలు చేయకపోతే, త్వరలోనే బీజేపీ అమలు చేస్తుంది. మీకు నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదు. ఇటువంటి ప్రకటనలు చేయడం ద్వారా ఇప్పటి నుంచే ఓటర్లను కొనడానికి సీఎం ప్రయత్నాలు మొదలుపెట్టారు అని విమర్శలు గుప్పించారు. కాగా ఈ ఏడాది చివరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. చదవండి : మహిళలకు మెట్రో, బస్సు ప్రయాణాలు ఉచితం -
డ్యాన్సులకే పనికివస్తారు; అవమానకరం!
న్యూఢిల్లీ : తనను కించపరచడం ద్వారా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పూర్వాంచల్ ప్రజలందరినీ అవమానించారని బీజేపీ నాయకుడు మనోజ్ తివారీ ఆరోపించారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మనోజ్ తివారీ.. ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. ఈయనకు పోటీగా కాంగ్రెస్ ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ను బరిలోకి దించగా.. ఆమ్ ఆద్మీ పార్టీ దిలీప్ పాండేను నిలబెట్టింది. ఈ నేపథ్యంలో దిలీప్ పాండేకు మద్దతుగా సీఎం కేజ్రీవాల్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో మనోజ్ తివారీ నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ‘ మనోజ్ తివారీకి కేవలం డ్యాన్స్ ఎలా చేయాలో మాత్రమే తెలుసు. కానీ పాండేజీకి డ్యాన్స్ చేయడం తెలియక పోయినా ప్రజల కోసం పనిచేసే గుణం మాత్రం ఉంది. అందుకే ఈసారి డ్యాన్స్ చేసే వాళ్లకు కాకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వారికే ఓటేయాలి. ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. అభివృద్ధి చేసేవారిని మాత్రమే గెలిపించాలి. నాచ్నేవాలాకు కాదు’ అని మనోజ్ తివారీపై విమర్శలు గుప్పించారు. కాగా కేజ్రీవాల్ వ్యాఖ్యలపై స్పందించిన మనోజ్ తివారీ... తనను కించపరచడం ద్వారా పూర్వాంచల్ ప్రజలందరినీ కేజ్రీవాల్ అవమానించారని పేర్కొన్నారు. ఇందుకు ఆయన భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాగా భోజ్పురిలో మంచి నటుడిగా, గాయకుడిగా గుర్తింపు పొందిన మనోజ్ తివారీ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 12న ఢిల్లీలో ఎన్నికలు జరుగనున్నాయి. -
కాంగ్రెస్కు షాక్.. సప్నా చౌదరీ యూటర్న్..!
చంఢీగడ్ : హరియాణా పాపులర్ సింగర్, డాన్సర్ సప్నా చౌదరీ యూటర్న్ తీసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆదివారం వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. మధుర నియోజకవర్గంలో బాలీవుడ్ డ్రీమ్గర్ల్, సిట్టింగ్ ఎంపీ హేమమాలినిపై సప్నా చౌదరిని నిలబెట్టాలన్నది కాంగ్రెస్ వ్యూహమని ప్రచారం జరిగింది. అయితే, తాను కాంగ్రెస్లో చేరలేదనీ, అసలు ఏ పార్టీ తరఫునా పోటీ కూడా చేయట్లేదని, ప్రియాంక గాంధీతో ఉన్న ఫోటో కూడా పాతదని ఆమె ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. దీంతో కాంగ్రెస్ ఆమె పార్టీలో చేరేందుకు ఫారం నింపుతున్న ఓ వీడియోను బయటపెట్టడంతో అది వైరల్ అయ్యింది. ‘ఆమె స్వయంగా శనివారం నాడు పార్టీ ఆఫీసుకొచ్చి ఫారం నింపి వెళ్లారు. ఆమె సోదరి కూడా కాంగ్రెస్లో చేరారు’ అని యూపీసీసీ ప్రధాన కార్యదర్శి నరేంద్ర రథి ప్రకటించారు. (‘డ్యాన్స్ వస్తే చాలు.. కాంగ్రెస్లో ఛాన్స్’) ఇదిలాఉండగా... ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీతో సప్న భేటీ అయ్యారనే వార్తలు కాంగ్రెస్ను కలవరానికి గురిచేస్తున్నాయి. ఆమె యూటర్న్ తీసుకుని బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ప్రియాంక గాంధీని కలిసిన కొద్ది గంటలకే ఆమె తివారీతో సమావేశమయ్యారు. అక్కడా.. ఇక్కడా.. ఆమె అవే దుస్తుల్లో దర్శనమివ్వడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. ‘సప్న సంతకాన్ని కాంగ్రెస్ ఫోర్జరీ చేసింది. కాంగ్రెస్లో చేరుతున్నట్టు ఆమెకు సంబంధించిన వీడియా అసత్యం. ఆ ఫారం 2011-15 మధ్య కాలానిది’’ అని బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు. -
ఎన్నికల ర్యాలీకి ఏకంగా ఆర్మీ డ్రెస్లో..!
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి మిలిటరీ దుస్తులు ధరించి ఎన్నికల ర్యాలీలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని యమునా విహార్లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని మిలిటరీ దుస్తుల్లో వచ్చిన మనోజ్ తీవారి జెండా ఊపి ప్రారంభించారు. తీవారి తీరుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఓట్లు అడుక్కోవడానికి ఆర్మీ దుస్తులు వాడుకోవడం సిగ్గుచేటు అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ ట్విటర్లో మండిపడ్డారు. ‘సిగ్గుచేటు. ఓట్లు అడగడానికి మనోజ్ తీవారి సాయుధ దళాల యూనిఫామ్ను వేసుకసున్నారు. బీజేపీ, మోదీ, అమిత్ షా మన జవాన్లను రాజకీయంగా వాడుకొని అవమానిస్తున్నారు. అంతేకాకుండా దేశభక్తి గురించి లెక్చర్లు దంచుతున్నారు‘ అని డెరెక్ ట్వీట్ చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో తీవారి వివరణ ఇచ్చారు. ‘మన దేశ ఆర్మీ అంటే ఎంతో గర్వంగా ఉంది. అందుకే ఆర్మీ దుస్తులు ధరించాను. నేను ఇండియన్ ఆర్మీలో లేకపోయినా.. ఈవిధంగా నా సంఘీభావం తెలియజేశాను. ఇలా చేయడం అవమానించడం ఎలా అవుతుంది? నెహ్రూ జాకెట్ వేసుకుంటే.. జవహర్లాల్ నెహ్రూను అవమానించినట్టేనా’ అని తివారీ ట్విటర్లో ఎదురుప్రశ్నించారు. -
బెంగాల్ 194/6
సాక్షి, విశాఖపట్నం: రంజీ ట్రోఫీలో ఆడిన ఐదు మ్యాచ్ల్లో పేలవ ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో నిలిచిన ఆంధ్ర జట్టు సొంతగడ్డపై బెంగాల్తో ప్రారంభమైన మ్యాచ్ను సానుకూలంగా ప్రారంభించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో శనివారం మొదలైన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 78 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. కెప్టెన్ మనోజ్ తివారి (90; 14 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. ఆరంభంలో ఆంధ్ర బౌలర్లు చెలరేగడంతో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన బెంగాల్ను తివారి ఆదుకున్నాడు. నాలుగో వికెట్కు అగ్నివ్ పాన్ (39; 6 ఫోర్లు)తో కలిసి 113 పరుగులు జతచేశాడు. ప్రస్తుతం వృత్తిక్ చటర్జీ (27 బ్యాటింగ్), ప్రదీప్తా ప్రమాణిక్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్, యర్ర పృథ్వీరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా... విజయ్ కుమార్, షోయబ్ ఖాన్లకు చెరో వికెట్ దక్కింది. హైదరాబాద్ వేదికగా పంజాబ్తో జరుగుతోన్న మరో మ్యాచ్లో హైదరాబాద్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 240/7తో నిలిచింది. 46 ఏళ్ల వయసులో... శనివారం మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్య ప్రారంభమైన ప్లేట్ గ్రూప్ రంజీ ట్రోఫీ మ్యాచ్లో అరుదైన ఘనత నమోదైంది. మణిపూర్ తరఫున టోక్చోమ్ ఇబోయైమా సింగ్ రంజీల్లో అరంగేట్రం చేశాడు. బరిలోకి దిగే సమయానికి టోక్చోమ్ వయసు 45 ఏళ్ల 296 రోజులు కావడం విశేషం. ఫలితంగా అతి పెద్ద వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగు పెట్టిన ఆటగాళ్ల జాబితాలో అతనూ చేరాడు. 1973 మార్చి 1న టోక్చోమ్ పుట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అతను 16 పరుగులకే 5 వికెట్లు తీసి అరుణాచల్ను 66 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. -
‘బీజేపీ అధ్యక్షుడిని నెట్టివేయలేదు’
న్యూఢిల్లీ: యమునా నదిపై నిర్మించిన సిగ్నేచర్ బ్రిడ్జి ప్రారంభోత్సవం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ల మధ్య వివాదానికి కేంద్రంగా మారింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ, ఆప్ల నాయకులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి వెళ్లిన తనను అమానతుల్లా ఖాన్ తనను నెట్టివేసాడని పార్లమెంట్ సభ్యుడు, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఆరోపించారు. తివారీ వ్యాఖ్యలపై స్పందిచిన ఖాన్ ఆ వ్యాఖ్యలను ఖండించారు. తివారీ స్టేజ్ ఎక్కేందుకు ప్రయత్నించగా తాను అడ్డుకున్నట్టు తెలిపారు. అంతేకానీ అతన్ని నెట్టివేయలేదని వెల్లడించారు. ఒకవేళ తివారీ స్టేజ్పైకి వెళితే.. అతను సీఎం అరవింద్ కేజ్రీవాల్తోపాటు, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలతో అమర్యాదగా ప్రవర్తించేవారని.. అతని చర్యలు అనుమానించేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి తివారీని ఆహ్వానించలేదని ఆయన తెలిపారు. కానీ సిగ్నేచర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ఆయన తన అనుచరులతో వచ్చారని అన్నారు. అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు ఆప్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు.. తమ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తివారీ స్టేజ్కు సమీపంలోకి వచ్చినా పోలీసులు అతన్ని అడ్డుకోలేదని ఖాన్ అన్నారు. అంతకుముందు ఈ ఘర్షణపై తివారీ స్పందిస్తూ.. సిగ్నేచర్ బ్రిడ్జి ప్రారంభ కార్యక్రమంలో అమానతుల్లా ఖాన్ తనను నెట్టివేసాడని ఆరోపించారు. ఇదంతా సీఎం కేజ్రీవాల్ సమక్షంలోనే జరిగిందని అన్నారు. ఖాన్పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఇది తన నియోజకవర్గంలో(ఈశాన్య ఢిల్లీ) జరగుతున్న కార్యక్రమం అని.. చాలా కాలంగా ఆగిపోయిన బ్రిడ్జి పనులను తానే తిరిగి ప్రారంభించానని అన్నారు. ఈ వివాదంపై కేజ్రీవాల్ ట్విటర్లో ఘాటుగా స్పందించారు. గతంలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని అన్నారు. బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. ఇది ఢిల్లీ ప్రభుత్వ కార్యక్రమం అని తెలిపారు. ఇక్కడ ఘర్షణ జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. ఢిల్లీ పోలీసులను పర్యవేక్షించే లెఫ్టినెంట్ గవర్నర్పై శాంతి, భద్రతలను కాపాడాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. -
బీజేపీ, ఆప్ శ్రేణుల బాహాబాహీ
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ, ఆప్ శ్రేణుల మధ్య ఘర్షణకు దేశ రాజధానిలో సిగ్నేచర్ వారధి ప్రారంభోత్సవం వేదికగా మారింది. ఈ బ్రిడ్జి పునర్నిర్మాణానికి తాము చొరవ తీసకుంటే స్ధానిక ఎంపీనైన తనను ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల సమక్షంలోనే బీజేపీ, ఆప్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. తన నియోజకవర్గ పరిధిలో ఈ బ్రిడ్జి పునర్నిర్మాణానికి తాను చొరవ తీసుకున్నానని, తాను వారధి నిర్మాణానికి ఎంతో కృషి చేస్తే ప్రస్తుతం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభిస్తున్నారని అన్నారు. తివారీ వేదిక వద్దకు చేరుకోగానే బీజేపీ, ఆప్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆప్ కార్యకర్తలు, పోలీసులు తన పట్ల దురుసుగా వ్యవహరించారని తివారీ ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ను స్వాగతించేందుకు తాను ఇక్కడికి వస్తే పోలీసులు, ఆప్ శ్రేణులు తనను నేరస్తుడిలా చుట్టుముట్టాయని ఆరోపించారు. మరోవైపు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆప్ వాలంటీర్లను, స్ధానికులను నెట్టివేసి రాద్ధాంతం చేశారని ఆప్ నేత దిలీప్ పాండే పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది ఆహ్వానం లేకపోయినా హాజరయ్యారని, తివారీ తనకు తాను వీఐపీలా భావిస్తున్నారని పాండే అన్నారు. -
రాజధానిలో లక్షమందితో
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో విజయమేధ్వేయంగా జాతీయ రాజధాని ఢిల్లీలో భారీ ర్యాలీలను నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీ నేతలతో చర్చలు జరిపారు. ఢిల్లీలోని మొత్తం ఏడు పార్లమెంట్ స్థానాలు, 70 అసెంబ్లీ స్థానాల్లో భారీ ర్యాలీలను నిర్వహించాలని భావిస్తోంది. ఈ ర్యాలీలో అమిత్ షాతో సహా ప్రధాని మోదీ కూడా పాల్గొని ప్రసంగించనున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం పాల్గొనే ఈ ర్యాలీలో లక్షమందికి పైగా పార్టీ కార్యకర్తలతో ర్యాలీని నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రకటించారు. 45 శాతం వరకు ఓటింగ్ ప్రభావం గల పూర్వాంచాలీస్లో బలపడాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. దానిలో భాగంగానే 2016 భోజ్పూరి నటుడు, బీజేపీ నేత మనోజ్ తివారిని ఢిల్లీ యూనిట్ ప్రెసిడెంట్గా నియమించింది. 2017 ఏప్రీల్లో జరిగిన పురపాలక ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం వెనుక మనోజ్ తివారి కృషి ఎంతో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతిన్న ఢిల్లీలోని స్లమ్ ఏరియాలో మరింత దృష్టి సారిస్తామని తివారి పేర్కొన్నారు. బీజేపీ ప్రధానంగా పూర్వాంచాలీస్ పైనే ఎక్కువగా దృష్టి సారించింది. వారి ప్రభావం గల 20 అసెంబ్లీ స్థానాలతో సహా, 80 పురపాలక వార్డులు బీజేపీకి ఎంతో కీలకం కానున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోవడం విశేషం. -
కేజ్రీవాల్ ఇంట్లో అసలు ఏం జరిగింది?
సాక్షి, న్యూఢిల్లీ : సరిగ్గా మంగళవారం ఉదయం 9గంటల ప్రాంతం. బీజేపీ ఢిల్లీ నగర అధ్యక్షుడు మనోజ్ తివారీ, ఐదురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మహిళా మేయర్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిలోకి సీలింగ్ డ్రైవ్ వ్యవహారంపై చర్చించేందుకు అడుగుపెట్టారు. కేజ్రీవాల్ సమావేశ మందిరంలోకి వారు అడుగుపెట్టారో లేదో అక్కడి వారిని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ ఆమ్ఆద్మీపార్టీ ఎమ్మెల్యేలతోపాటు బౌన్సర్లు కార్యకర్తలు మొత్తం కలిపి 150మంది వరకు ఉన్నారు. వీళ్లేమో మొత్తం కలిపి 20మందే. ఈలోగా అరవింద్ కేజ్రీవాల్ వచ్చి బీజేపీ నేతలకు స్వాగతం చెప్పి కూర్చోవాలని కోరారు. అయితే, సమావేశ మందిరంలో ఇంతమంది ఎందుకని, ఇదేదో సమస్యపై ప్రసంగించే అసెంబ్లీ కాదని, వారందరిని బయటకు పంపిస్తే కూర్చుంటామని చెప్పారు. ఇదే విషయాన్ని కేజ్రీవాల్కు బీజేపీ నేత విజేందర్ గుప్తా, ఎంపీ రమేశ్ బిదూరి పునరావృతం చేశారు. కేజ్రీవాల్ మాత్రం వారిని కూర్చోవాలని మాట్లాడుకుందామని మళ్లీ చెప్పారు. ఢిల్లీ ప్రజల భవిష్యత్కు సంబంధించిన విషయం కాబట్టి బహిరంగంగా మాట్లాడుకోవడంలో తప్పేమీ లేదని బీజేపీ నేతలతో చెప్పారు. కానీ, తివారీ మాత్రం ఆయన మాటలు వినేందుకు నిరాకరించి ఏదో విషయాన్ని చెప్పబోతుండగా వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జితేంద్ర సింగ్ తోమర్ గట్టిగా అరుస్తూ 'నీ ఉపన్యాసాలు వినడానికి కాదు మేం ఇక్కడ కూర్చుంది' అన్నారు. దీంతో బీజేపీలోని 20మంది నేతలకు ఆగ్రహం వచ్చింది. వెంటనే కేజ్రీవాల్ ఇంటి నుంచి బయటకు వస్తుండగా అందులోని 150 మంది ఆప్ నేతలు, కార్యకర్తలు, బౌన్సర్లు పకపకా నవ్వారు. దీంతో మరింత చిర్రుబుర్రులాడుతూ కేజ్రీవాల్ సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే వారు వెళ్లే సమయంలో ఒక్కరు కూడా బయట లేకపోగా తిరిగి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే దాదాపు 2000మంది ఆప్ నేతలు అక్కడ పోగయ్యారు. వారి మధ్య నుంచి వెళ్లే సమయంలో మరోసారి జితేంద్ర సింగ్ వేగంగా పరుగెత్తుకుంట తివారీని అడ్డగించి బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఓ గందరగోళ వాతావరణ నెలకొంది. దీనిపై మనోజ్ తివారీ స్పందిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ పక్కా ప్లాన్ ప్రకారం ఈ పనిచేసిందని, ఓ ముఖ్యమైన అంశంపై చర్చ జరిగే సమయంలో ఇంతమంది కార్యకర్తలను తెప్పించుకోవాల్సిన అవసరం ఏముందని మండిపడ్డారు. మహిళా మేయర్లు అని కూడా చూడకుండా ఆప్ కార్యకర్తలు గుండాల్లాగా ప్రవర్తిస్తూ దాడికి దిగారని చెప్పారు. నగర మావోయిస్టుల్లాగా ఆప్ కార్యకర్తలు తయారయ్యారని మండిపడ్డారు. వారు దాడి కారణంగా విజేందర్ గుప్తా కూడా గాయాలు అయ్యాయని ఈ ఘటనపై తాము పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేసింది. అసలు విషయాన్ని చర్చించడం బీజేపీ నేతలకు ఇష్టం లేకే వెళ్లిపోయారని ఆరోపించింది. -
‘కేజ్రీవాల్ అవమానించారు.. దాడి చేశారు’
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయన మద్దతుదారులు తమ వాళ్లను తీవ్రంగా అవమానించారని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీ ప్రభుత్వం చేపడుతున్న వివాదాస్పద సీలింగ్ డ్రైవ్ గురించి చర్చించేందుకు తమ పార్టీ నేత మనోజ్ తివారీ నేతృత్వంలో కేజ్రీవాల్ ఇంటికి వెళితే అవహేళన చేశారని, ఆయన మద్దతుదారులు దాడి చేశారని మండిపడింది. ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పింది. సీలింగ్ డ్రైవ్ విషయంపై మాట్లాడేందుకు కేజ్రీవాల్ ఇంటికి ముగ్గురు బీజేపీ ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మేయర్లు రాగా, అక్కడ కేజ్రీవాల్తోపాటు ఆప్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే, ఈ చర్చ మొత్తం కూడా మీడియా ఎదుట జరగాలని కేజ్రీవాల్ డిమాండ్ చేయగా అందుకు బీజేపీ అంగీకరించనట్లు తెలిసింది. దీంతో ఎట్టి పరిస్థితిల్లో ఈ అంశంపై చర్చ బహిరంగంగానే జరగాలని చెప్పారు. ‘ఓ పక్క సమావేశం జరుగుతుండగానే బీజేపీ నేతల బృందం ముఖ్యమంత్రి (కేజ్రీవాల్) మాట వినకుండానే మధ్యలో వెళ్లిపోయింది. నిజంగా వర్తకుల విషయంలో బీజేపీ సీరియస్గా ఉన్నారా? లేక విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రతినిధులుగా ఉన్నారా?’ అని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నించింది. -
సారీ చెప్పినా.. సిధార్థ్పై ఎఫ్ఐఆర్
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సిధార్థ్ మల్హోత్రా చిక్కుల్లో పడ్డాడు. భోజ్పురి భాషను అవమానించాడన్న విమర్శల నేపథ్యంలో అతనిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఈ విషయాన్ని భోజ్పురి నటుడు, బీజేపీ నేత మనోజ్ తివారీ వెల్లడించారు. ‘‘సిధార్థ్ చేసిన వ్యాఖ్యలు నేను విన్నా. 22 కోట్ల మంది మనోభావాలను అతను దారుణంగా దెబ్బతీశాడు. నేను వాటిని ఖండిస్తున్నా. మనం ప్రతీ భాషను గౌరవించాల్సిన అవసరం ఉంది. కళాకారులకు ఆ బాధ్యత ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అతను మంచి నటుడే. కానీ, ఇలా వ్యవహరించటం కుసంస్కారం. క్షమాపణలు చెప్పినా ప్రజలు అతన్ని వదిలేస్తారని నేను అనుకోవట్లేదు’’ అని తివారీ తెలిపారు. పట్నా, వారణాసి, కోల్కతా, ముంబై, తదితర ప్రాంతాల్లో ఇప్పటికే సిధార్థ్ పై భోజ్పురి కమ్యూనిటీ ఫిర్యాదులు చేయగా.. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు సమాచారం అందుతుందని తివారీ వెల్లడించారు. అసలేం జరిగిందంటే... ‘అయ్యారీ’ సినిమా ప్రమోషన్ కోసం హీరో సిధార్థ్, హీరోయిన్ రకుల్, నటుడు మనోజ్ బాజ్పాయి... సల్మాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోకు వెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంలో మనోజ్ బాజ్పాయి బలవంతం మేరకు భోజ్పురి భాషలో సిధార్థ్ ఓ డైలాగ్ చెప్పాడు. అయితే ఫన్నీగా సాగిన ఆ ఎపిసోడ్ కాస్త అభ్యంతరకర వ్యాఖ్యలుగా మారిపోవటంతో భోజ్పురి కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిధార్థ్ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేసింది. నటి నీతూ చంద్ర కూడా ఈ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తూ ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే చివరకు సిధార్థ్ ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పినా.. పరిస్థితి చల్లారటం లేదు. I recently tried speaking a new language while I was on a TV show. In the process if I inadvertently hurt anyone's feelings or sentiments, I apologise and assure you that no disrespect was meant in any way. — Sidharth Malhotra (@S1dharthM) 22 January 2018 -
ఢిల్లీ బీజేపీ చీఫ్కు చేదుఅనుభవం
సాక్షి, న్యూఢిల్లీ : ‘అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు’ సామెత గుర్తుందికదా, దాదాపు అలాంటి చేదు అనుభవమే ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీకి ఎదురైంది. చైనా వస్తువుల వ్యతిరేక ర్యాలీకి వెళ్లిన ఆయన.. తన అమెరికా ఐఫోన్ను పోగొట్టుకున్నారు. ఏం జరిగిందంటే.. చైనా వస్తువులను బహిష్కరించాలంటూ మత సంస్థ ఆర్ఎస్ఎస్ వాణిజ్య విభాగమైన స్వదేశీ జాగరణ్ మంచ్ సోమవారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఒక ర్యాలీని ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి కూడా పాలుపంచుకున్నారు. సభ ముగిసిన అనంతరం ఆయన తన ఫోన్ పోయినట్లు గుర్తించారు. అది.. అమెరికాకు చెందిన ఆపిల్ సంస్థ తయారి ‘ఐఫోన్ సెవెన్ ప్లస్’, ధర సుమారు రూ.55 వేలు! అనుచరులతో ఎంత వెతికించినా లాభంలేకపోవడంతో చివరికి తివారీ కమలా మార్కెట్ పోలీసులను ఆశ్రయించారు. తన ఐఫోన్ తస్కరణకు గురైందని ఫిర్యాదుచేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఎంపీగారి ఫోన్ జాడను కనిపెట్టేపనిలో పడ్డారు. భోజ్పురి నటుడు, సంగీతకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న తివారీ.. 2014లో బీజేపీలో చేరి, ఈశాన్య ఢిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గత డిసెంబర్ నుంచి బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
మనోజ్ తివారీ ఇంటిపై దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఇంటిపై దాడి జరిగింది. ఆదివారం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిదిమంది కలిసి తివారీ ఇంటిపై దాడికి దిగారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు. ఈ విషయాన్ని స్వయంగా తివారీనే తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ‘8-9మంది 159 నార్త్ అవెన్యూ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇది ముమ్మాటికీ దొంగదెబ్బే. ఈ ఘటనలో నా కుటుంబ సభ్యులు ఇద్దరు గాయపడ్డారు’ అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కూడా ఎడెనిమిదిమంది తివారీ ఇంటివద్ద అనవసర మాటలు అనుకుంటూ తిట్టుకుంటూ కనిపించారు. ఆ సమయంలో వారిని తివారీ ఇంటివద్ద పనిచేసే వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిపై దాడికి దిగి ఆయన ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారు. అయితే, పోలీసులు మాత్రం ఇది రోడ్డుపై జరిగే చిల్లర పంచాయితీలాంటిదని, ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు. మనోజ్ తివారీ మాత్రం తనపై చేసిన కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందని అన్నారు. పోలీసుల హస్తం కూడా ఇందులో ఉందంటూ ఆరోపించారు. -
నాడు యోగి చేతిలో ఓడి.. నేడు సీఎంకు షాక్
కేజ్రీవాల్ను కంగుతినిపించిన భోజ్పూరి స్టార్! న్యూఢిల్లీ: ఇది 2009 లోక్సభ ఎన్నికలనాటి ముచ్చట. ఆ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థిగా మనోజ్ తివారీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎస్పీ ఆయనకు గోరఖ్పూర్ టికెట్ ఇచ్చింది. గోరఖ్పూర్ స్థానంలో 1998 నుంచి యోగి ఆదిత్యనాథ్ గెలుస్తూ వచ్చారు. 2009లోనూ సీన్ మారలేదు. తివారీకి నిరాశే ఎదురైంది. కట్ చేస్తే 2017.. బుధవారం వెలువడిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వరుసగా మూడోసారి బీజేపీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ప్రధానంగా వెలుగులోకి వచ్చింది మాత్రం మనోజ్ తివారీయే. పాపులర్ భోజ్పూరి స్టార్ హీరో అయిన ఆయన ఢిల్లీ బీజేపీ చీఫ్గా తాజా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీలో బీజేపీ గెలుపు క్రెడిట్ ప్రధాని మోదీదేనని తివారీతో సహ పార్టీ నేతలంతా ముక్తకంఠంతో చెప్తున్నా.. కమలం శ్రేణులను సమన్వయంతో ముందుండి నడిపించి.. ఎన్నికల ప్రచారంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన తివారీ పాత్ర తోసిపుచ్చలేనిది. తివారీ రాజకీయ జీవితం ఇటీవలే మేలిమలుపు తిరిగిందని చెప్పవచ్చు. కేవలం ఆరు నెలల కిందటే ఆయనకు ఢిల్లీ బీజేపీ చీఫ్ పగ్గాలను అందజేశారు. పదేళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రజావ్యతిరేకతను దూరం చేసి.. పార్టీని విజయతీరాలకు చేర్చే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఢిల్లీలో ఉత్తరప్రదేశ్ పూర్వాంచల్కు చెందిన ఓటర్లు పెద్దసంఖ్యలో ఉన్నారు. భోజ్పూరి స్టార్గా వారిలో తివారీకి ఉన్న క్రేజ్ కలిసివస్తుందని బీజేపీ భావించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అకవింద్ కేజ్రీవాల్ ఘనవిజయం వెనుక కూడా పూర్వాంచల్ ఓటర్లే ఉన్నారు. ఈ వ్యూహం బాగానే కలిసివచ్చింది. ఈశాన్య ఢిల్లీ ఎంపీగా ఉన్న తివారీ తనకప్పగించిన బాధ్యతల్లో వెంటనే ఇమిడిపోయి నగరంలోని మురికివాడలు, నిరుపేద, మధ్యతరగతి నివాసాల్లో ఎక్కువగా తిరిగారు. రాత్రుళ్లు బస చేసి.. ఓటర్లతో మమేకమయ్యారు. ఢిల్లీలోని 270 వార్డులకుగాను 250 వార్డులలో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. హిందీ, భోజ్పూరి భాషలో పట్టు ఉండటంతో ఆయన సులువుగా ఓటర్లతో కలిసిపోయి వారిని ఆకట్టుకోగలిగారని, ఇది బీజేపీకి బాగా కలిసి వచ్చిందని పరిశీలకులు చెప్తున్నారు. -
కేజ్రీవాల్ తక్షణమే రాజీనామా చేయాలి
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ తక్షణమే రాజీనామా చేయాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మనోజ్ తివారీ మాట్లాడుతూ... ఢిల్లీని నాలుగు నెలల్లో బీజేపీ శుభ్రం చేస్తుందని అన్నారు. '4 నెలల్లో ఢిల్లీని క్లీన్ సిటీగా మార్చుతాం. పరిశుభ్రమైన, ఎలాంటి వ్యాధులు లేని ఆరోగ్యమైన నగరంగా తీర్చిదిద్దుతాం. అని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనందుకు కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఆప్ విస్మరించిందని, నగర ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ప్రజలు కూడా కేజ్రీవాల్ రాజీనామా చేయాలని కోరుకుంటున్నారని మనోజ్ తివారీ పేర్కొన్నారు. కాగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 'చీపురు'ను ఊడ్చేయడంతో ఆప్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చాంపియన్ ఈస్ట్ జోన్
ముస్తాక్ అలీ టి20 టోర్నీ ముంబై: తొలిసారి ఇంటర్ జోనల్ ఫార్మాట్లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ జాతీయ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఈస్ట్ జోన్ జట్టు చాంపియన్ గా అవతరించింది. ఐదు జోన్ ల (సౌత్, వెస్ట్, ఈస్ట్, సెంట్రల్, నార్త్) మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ఈస్ట్ జోన్ ఆడిన నాలుగు మ్యాచ్లో్లనూ గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో మనోజ్ తివారీ సారథ్యంలోని ఈస్ట్ జోన్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో వెస్ట్ జోన్ జట్టును ఓడించింది. మొదట బ్యాటింగ్కు దిగిన వెస్ట్ జోన్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 149 పరుగులు చేసింది. షెల్డన్ జాక్సన్ (44 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. 150 పరుగుల లక్ష్యాన్ని ఈస్ట్ జోన్ 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి అధిగమించింది. విరాట్ సింగ్ (34 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు), ఇషాంక్ జగ్గీ (30 బంతుల్లో 56; 3 ఫోర్లు, 6 సిక్స్లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీలు సాధించి ఈస్ట్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఓటమితో ముగించిన సౌత్ జోన్ మరోవైపు సెంట్రల్ జోన్ తో జరిగిన మ్యాచ్లో సౌత్ జోన్ రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ టోర్నీలో సౌత్ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో కేవలం ఒక మ్యాచ్లోనే గెలిచి, మిగతా మూడింటిలో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 181 పరుగులు చేయగా... సెంట్రల్ జోన్ జట్టు సరిగ్గా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 184 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. చివరి ఓవర్లో సెంట్రల్ జట్టు విజయానికి నాలుగు పరుగులు అవసరమయా్యయి. సెంట్రల్ జట్టు టాప్ స్కోరర్ హర్ప్రీత్ సింగ్ (51 బంతుల్లో 92; 10 ఫోర్లు, 4 సిక్స్లు) చివరి ఓవర్ తొలి బంతికి అవుటైనా... అమిత్ మిశ్రా (5 బంతుల్లో 13 నాటౌట్), అంకిత్ రాజ్పుత్ (4 బంతుల్లో 5 నాటౌట్) ఒత్తిడికి లోనుకాకుండా సెంట్రల్ జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. -
బీజేపీ నేత కారుపై దాడి
-
బీజేపీ నేత కారుపై దాడి
ముంబై: ఢిల్లీ బీజేపీ చీఫ్, ఎంపీ మనోజ్ తివారి ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ముంబైలో ఇంట్లో నుంచి ఆయన బయటకు వెళ్తుండగా రాళ్లు విసిరారు. ఇది ప్రత్యర్ధి పార్టీ కుట్ర అని, ఇలాంటి చర్యలకు తాను భయపడబోనని మనోజ్ తివారి అన్నారు. 'నాకు ముంబైలో ఇల్లు ఉంది. ఇక్కడ ఉంటున్నాను. నాకు ఇక్కడి ప్రజల మద్దతు ఉంది. ప్రత్యర్థి పార్టీ ఈ దాడికి పాల్పడి ఉంటుంది. వారు నన్ను భయపెట్టేందుకు ప్రయత్నించారు. నేను ఇలాంటి వాటికి బెదరను. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసులు విచారణ చేస్తున్నారు' అని మనోజ్ తివారి చెప్పారు. ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 21న ఎన్నికలు జరగనున్నాయి. -
మనోజ్ తివారీ స్పెషల్ సాంగ్.. ఇది వారికోసమే!
-
మనోజ్ తివారీ స్పెషల్ సాంగ్.. ఇది వారికోసమే!
న్యూఢిల్లీ : ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఓ స్పెషల్ సాంగ్ పాడారు. అయితే ఈ పాట ఓ మూవీ కోసమో, ప్రైవేట్ ఆల్బమ్ కోసమో కాదు. పాత నోట్లు రద్దయిన దగ్గర్నుంచి నగదు కోసం బ్యాంకుల వద్ద నిరీక్షిస్తున్న వారికోసం ఈ ప్రత్యేక పాటను ఆలపించారు. క్యూలో నిల్చున్న వారందరూ దేశభక్తులుగా నిలిచిపోతారంటూ అభివర్ణిస్తూ మనోజ్ తివారీ ఈ పాటను పాడారు. పాత నోట్లు రద్దయిన దగ్గర్నుంచి బ్యాంకులు, ఏటీఎంల వద్ద నుంచి నగదు తీసుకోవడం కష్టతరంగా మారిన సంగతి తెలిసిందే. రోజుల తరబడి ప్రజలు ఏటీఎంలు, బ్యాంకుల వద్దనే నిరీక్షిస్తున్నారు. వారందరి కోసం మనోజ్ తివారీ ఆ పాటను దేశరాజధానిలోని మోతీ బాగ్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఓ ప్రొగ్రామ్లో ఆలపించారు. బ్లాక్మనీపై పోరాటానికి ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించే వారు దేశభక్తులుగా పరిగణించబడతారని పలువురు అభివర్ణించారు కూడా. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు వహిస్తున్న మనోజ్ తివారీ, రాజకీయాలోకి రాకముందు గాయకుడు, నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, సంగీత దర్శకుడు. అనంతరం ఆయన బిహార్ నుంచి రాజకీయాలోకి ప్రవేశించి, ఢిల్లీకి పార్టీ అధ్యక్షుడయ్యారు. -
లడ్డూలు మార్చుకోవడం కుదరదు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు గంటల తరబడి నిలబడుతున్న ప్రజల ఓపికకు మెచ్చుకొని వారికి లడ్డూలు పంచాలని ఢిల్లీలోని బీజేపీ శాఖ నిర్ణయించింది. ప్రతి పార్టీ కార్యకర్త ఇందులో క్రియాశీలకంగా పాల్గొనాలని. జనవరి ఒకటవ తేదీ నుంచి పది తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒక ఇంటికి ఒక లడ్డూ లేదా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని లడ్డూల చొప్పున ఇవ్వాలంటూ ఆయన చేసిన సూచనపై సోషల్ మీడియా యూజర్లు తమదైన శైలిలో స్పందించారు. ‘నెలలో నాలుగు లడ్డూలు మాత్రమే ఇస్తారు. పాత వాటితోని కొత్త లడ్డూలు మార్చుకోవడం కుదరదు. పది లడ్డూలకు మించి లడ్డూలుంటే ఐటీ దాడులు జరుగుతాయి...ఏటీఎంల ముందు క్యూలో నిలబడితే లడ్డూలు ఇస్తారట, వాస్తవానికి రెండు లడ్డూలు వస్తాయి. ఒకటి క్యూలో, మరోటి ఏటీఎం నుంచి....లడ్డూ వ్యాసానికి సరిపడే పరికరాలు ఏటీఎంలో లేవట. వాటన్నింటిని మూసేసి మరమ్మతులకు పంపిస్తారట...డబ్బుకు బదులుగా లడ్డూలు ఇమ్మని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదంటూ ఆర్బీఐ వివరణ....మొదటి రోజు కుటుంబానికి ఒక లడ్డూ ఇస్తారు. రెండో రోజు మూడు కుటుంబాలకు కలిపి రెండు లడ్డూలు ఇస్తారు. మూడోరోజు ఆప్ లడ్డూ కా రహా హై, వా బార్డర్ పర్....నరేంద్ర మోదీ క్యాష్లెస్ సొసైటీ కోరుకుంటున్నందున నమో యాప్పై డిజిటల్ లడ్డూలను పంచుతారు....’ఇలా తమదైన శైలిలో వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. -
'ఆయనను దేశద్రోహి అనలేదు'
బాలీవుడ్ నటుడు ఆమిర్ఖాన్ను 'దేశద్రోహి' అని తాను అనలేదని, అయినప్పటికీ తాను ఆ మాట అన్నట్టు పలు పత్రికలు ప్రచురించాయని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ శనివారం వివరణ ఇచ్చారు. 'పార్లమెంటు స్థాయీ సంఘం సమావేశంలో నేను ఏం చెప్పానన్నది రహస్యం. స్థాయీ సంఘంలో చేసే వ్యాఖ్యలు బయటకు వెల్లడించడం చట్టవిరుద్ధమవుతుంది. ఆమిర్ను ఉద్దేశించి నేను 'దేశద్రోహి' అన్న పదాన్ని ఉపయోగించలేదు. నా జీవితం మొత్తంలో ఆయన గురించి అలాంటి మాట అనలేను. అయినా పరువును దెబ్బతీసేందుకు అలాంటి వ్యాఖ్యలను ప్రతికలు ప్రచురించాయి. అసత్యాలను ప్రచురించినందుకు వాటికి నోటీసులు ఇస్తాను' అని మనోజ్ తివారి పేర్కొన్నారు. ఆమిర్ఖాన్ను 'ఇన్క్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్గా తొలగించడాన్ని తప్పుబడుతూ పర్యాటకంపై పార్లమెంటు స్థాయీ సంఘం శుక్రవారం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఆమిర్ను ఉద్దేశించి బీజేపీ ఎంపీ మనోజ్ తివారి అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు ఆయనపై మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చిన మనోజ్ తివారి ఆమిర్ 'ఇన్క్రెడిబుల్ ఇండియా'కు బ్రాండ్ అంబాసిడర్గా ఉండరాదని మాత్రమే తాను పేర్కొన్నానని చెప్పారు. అసహనం వివాదం నేపథ్యంలో భారత్ సురక్షిత దేశం కాదని పేర్కొన్న ఆయన దేశ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం సరికాదని తెలిపారు. -
అమీర్ సంచలన వ్యాఖ్యలపై దుమారం
ముంబై: భారత్ వదిలిపెట్టి పోదామని తన భార్య అడుగుతోందన్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలపై ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ సోషల్ మీడియాలో స్పందించారు. అమీర్ కు ఎక్కడ శాంతి ఉంటుందనుకుంటే అక్కడి వెళ్లిపోవచ్చని, ఆ స్వతంత్రత ఆయనకుందంటూ ట్విట్ చేశారు. ఇక్కడ జీవించడానికి భయంగా ఉంటే ఎక్కడికైనా వెళ్లి జీవించే స్వేచ్ఛ అమీర్ ఖాన్ కు ఉందని మనోజ్ తివారీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఒక్క క్షణంలో ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసి భారతమాతకు తీరని కళంకాన్ని ఆపాదించారని మనోజ్ తివారీ మండిపడ్డారు. ఎంత పొరబాటుగా మాట్లాడారో ఇప్పటికైనా ఆలోచించాలని అమీర్ కు ఆయన సూచన చేశారు. అమీర్ ప్రకటన షాక్కు గురి చేసిందని, అలాంటి వ్యాఖ్యలు చేయడం తనకు చాలా బాధ కలిగించిందన్నారు. అయినా తనలాంటి అభిమానులు అమీర్ పై కురిపించిన ప్రేమ,ఆప్యాయతలు ఇక ముందు కూడా కొనసాగాలంటూ మనోజ్ తివారీ ఆకాంక్షించారు. కాగా దేశంలో ఆరు నెలలుగా అభద్రతా పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యలు చేసిన అమీర్, తమ పిల్లల విషయంలో తన భార్య కిరణ్ ఆందోళన చెందుతోందన్నారు. దేశం వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్లాలని కూడా ఆలోచించిందని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. Aamir khan ne apne bayaan se desh ka mahaul bigaadne ki koshish ki. Hall me baithe saikdon logo ne bhartiya sehanshilta ka parichay diya... — Manoj Tiwari (@ManojTiwariMP) November 23, 2015 -
బీజేపీలో ఆరని ‘బిహార్’ మంట
సాక్షి, బెంగళూరు/నాగ్పూర్: బీజేపీలో ‘బిహార్’ మంటలు చల్లారడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో మోదీ-షా ద్వయంపై విమర్శలు గుప్పించిన సీనియర్ నేతల దారిలోనే మరికొందరు నడుస్తున్నారు. తాజాగా పార్టీ ఎంపీ, హోంశాఖ మాజీ కార్యదర్శి ఆర్కే సింగ్ సీనియర్లతో గొంతు కలిపారు. ఓటమికి బాధ్యులను తేల్చాల్సిందేనన్నారు. ‘బిహార్ ఎన్నికల్లో ఓటమిపై తప్పకుండా సమీక్ష జరగాలి. ఎక్కడ తప్పు చేశామో, ఎవరు బాధ్యులో తేలాలి. మార్గదర్శక మండలి కూడా ఇదే విషయాన్ని చెప్పింది’ అని పేర్కొన్నారు. ఈఎన్నికల్లో బీజేపీ కొందరు నేరచరిత్ర ఉన్నవారికీ టికెట్లు ఇచ్చిందన్నారు. ‘వారిలో కొందరిపై ప్రభుత్వమే రివార్డులు ప్రకటించింది. ఇది చాలా బాధాకరం’ అని పేర్కొన్నారు. పార్టీకి చెందిన మరో పార్లమెంట్ సభ్యుడు(ఈశాన్య ఢిల్లీ ఎంపీ) మనోజ్ తివారీ కూడా ఎన్నికల్లో పార్టీ పని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి అనుసరించిన వ్యూహాలు కచ్చితంగా బీజేపీ కంటే మెరుగ్గా ఉన్నాయన్నారు. ఎన్నికల్లో బీజేపీ అజెండా ప్రజలను మెప్పించలేకపోయిందన్నారు. పార్టీ వేదికలపై మాట్లాడి ఉండాల్సింది: వెంకయ్య బిహార్లో ఓటమిపై సీనియర్ నేతలు ముందుగా తమ అభిప్రాయాలను పార్టీ వేదికపై ప్రస్తావించి ఉంటే బాగుండేదని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవార ం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. ‘పార్టీకి, దేశానికి మోదీ నాయకత్వం అవసరం. సీనియర్లు కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వాటిని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం. అయితే బహిరంగ వ్యాఖ్యలకు బదులు పార్టీ వేదికలపై వారు తమ అభిప్రాయాలను పంచుకుంటే బాగుండేది. బిహార్లో ఓటమిపై సమగ్ర సమీక్ష జరపాలని పార్లమెంటరీ బోర్డు ఇప్పటికే నిర్ణయించింది’ అని చెప్పారు. ఎన్నికల్లో జయాపజయాలు సహజమేనని, వాటికి పార్టీయే సమష్టి బాధ్యత వహిస్తుందని స్పష్టంచేశారు. క్రమశిక్షణ చర్యలపై చెప్పలేదు: గడ్కారీ సీనియర్ నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ తాను పార్టీకి ఎలాంటి సూచనలూ చేయలేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ స్పష్టం చేశారు. బిహార్ ఎన్నికల్లో పనితీరుపై వారు వ్యక్తంచేసిన అభిప్రాయాలపై పార్టీ నాయకత్వం చర్చిస్తోందని ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీలో అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు అత్యంత గౌరవం ఉందని, తాను గానీ మరెవరూ గానీ వారిపట్ల అగౌరవంగా ప్రవర్తించలేదన్నారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ తాను పార్టీ అధ్యక్షుడికి సూచించినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. -
'తప్పుగా మాట్లాడలేదు, మనసులో మాట చెప్పా'
న్యూఢిల్లీ : మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీని పార్టీలో చేర్చుకుని ఆమెకు అధిక ప్రాధాన్యాన్ని ఇవ్వడంపై బహిరంగంగా అసంతప్తిని వెల్లడించిన తూర్పు ఢిల్లీ ఎంపీ మనోజ్ కుమార్ తివారీని పార్టీ మందలించింది. దాంతో ఆయన వివరణ ఇచ్చారు. తానేమీ తప్పుగా మాట్లాడలేదని , తన మనసులోని మాటలను తనదైన శైలిలో వెల్లడించానని మనోజ్ తివారీ చెప్పారు. కిరణ్బేడీని ఠానేదార్ అనలేదని ఆయన చెప్పారు. పార్టీలో చేరినవారు పార్టీలో ఉన్ను అందరిమాదిరిగా ప్రవర్తించాలే తప్ప వేరుగా కాదని మాత్రమే అన్నానని వివరణ ఇచ్చారు. తన మాటలు ఎవరినైనా బాధించినట్లయితే తాను అందుకు విచారిరస్తున్నానని చెప్పారు. తనకు రామ్ మాధవ్ ఫోన్ చేయలేదని కూడా ఆయన చెప్పారు. కిరణ్ బేడీని బహిరంగంగా విమర్శించినందుకు రామ్ మాధవ్ ఫోన్ చేపి మనోజ్ తివారీని మందలించినట్లు వార్తలు వచ్చాయి. కిరణ్ బేడీ పార్టీ కార్యకర్తేనని , ఆమె అలాగే ప్రవర్తించాలని అంతకు ముందు మనోజ్ తివారీ మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. నగరానికి చెందిన ఎనిమిది మంది ఎంపీలను కిరణ్ బేడీ ఆదివారం తన ఇంటికి టీ పార్టీకి ఆహ్వానించారు. మనోజ్ తివారీ ఆ పార్టీకి హాజరుకాలేదు. కిరణ్ బేడీ నివాసానికి వెళ్లడం సముచితంగా భావించనందువల్ల తాను పార్టీకి వెళ్లలేదని మనోజ్ తివారీ తెలిపారు. అది తమ పార్టీ నేత ఆహ్వానం కాదు కనుక తాను వెళల్లేదని చెప్పారు. కిరణ్ బేడీ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కాదని, పార్టీ ఇంకా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని ఆయన చెప్పారు. -
ఇప్పటికీ ప్రేమలేఖలు వస్తున్నాయి: వెంకయ్య
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు మంగళవారం తన ఛలోక్తులతో లోక్సభలో నవ్వులు పూయించారు. ‘నాకు ఇప్పటికీ ప్రేమలేఖలు వస్తున్నాయి. అయినా.. నా భార్య అవేవీ పట్టించుకోదు’ అని అన్నారు. ఢిల్లీలోని అనధికారిక కాలనీల క్రమబద్ధీకరణ బిల్లును తెచ్చినందుకుగాను వెంకయ్యను తాను ప్రేమిస్తున్నానంటూ భోజ్పురి గాయకుడు, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ‘వెంకయ్యజీ ఐ లవ్ యూ’ అని ఓ పాట పాడారు. దీనిపై వెంకయ్య స్పందిస్తూ.. మనోజ్ ప్రేమపై తనకేమీ అభ్యంతరం లేదని అన్నారు. -
సచిన్ పీఏను అడ్డుకున్న పోలీసులు
నెల్లూరు: పుట్టంరాజు వారి కండ్రిగ వెళ్తున్న సచిన్ పీఏ మనోజ్ తివారీని గూడూరు వద్ద పోలీసులు ఆపేశారు. తాను సచిన్ పీఏ అంటూ మనోజ్ పోలీసులకు విన్నవించుకున్నాడు. అయినా పోలీసులు ఖాతరు చేయలేదు. ఈ ఘటనను సాక్షి విలేకర్లు చిత్రీకరిస్తుండగా ఎస్సై అంకమ్మరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పద్దతి కాదంటూ సాక్షి విలేకర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో సాక్షి విలేకర్లకు పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సచిన్ నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సచిన్ ఆదివారం ఆ గ్రామంలో పర్యటించనున్నారు. దాంతో గ్రామ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
'సునీల్ దత్, వినోద్ ఖన్నాలే నాకు స్పూర్తి'
ముంబై: నటులుగా, రాజకీయ నాయకులుగా తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న సునీల్ దత్, వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హాల జీవితాలే తనకు ఆదర్శమని బీజేపీ నుంచి కొత్తగా లోక్ సభకు ఎన్నికైన మనోజ్ తివారీ స్పష్టం చేశారు. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ రాణించిన ఆ ముగ్గరు జీవితాల్నిసవాల్ తీసుకుని తాను కూడా ముందుకు వెళతానని తివారీ తెలిపారు. ఈ సందర్భంగా ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. వారి జీవితాలే తనకు ఆదర్శమన్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వారు రాజకీయ రంగాల్లో రాణించలేరని అపవాదును వారు ముగ్గురు తొలగించారన్నారు. ఆ విమర్శలు సరైనవి కావనడానికి వారి రాజకీయ జీవితాన్ని పరికిస్తే అవగతమవుతుందన్నారు. 'నేను భోజ్ పూరి భాషా సంక్షేమానికి, హిందీ చిత్ర రంగ అభివృద్ధికి కృషి చేస్తానని' తివారీ తెలిపాడు. లోక్ సభలో ఈ అంశాలకు సంబంధించి తనగొంతును వినిపించడానికి సిద్ధంగా ఉన్నానని తివారీ తెలిపారు.