medical camp
-
పార్వతీపురంలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నాట్స్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో తో కలిసి మన్యం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. తాజాగా పార్వతీపురంలో నాట్స్, గ్లో సంస్థలు సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. ఇందులో ముఖ్యంగా విద్యార్ధుల ఆరోగ్యంపై దృష్టి సారించాయి. గిరిజన విద్యార్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మందులను ఉచితంగా అందించాయి. గిరిజనుల సంక్షేమానికి తన వంతు చేయూత అందించేందుకు నాట్స్ ముందు ఉంటుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు. గ్లో సంస్థ సహకారంతో గిరిజనులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.(చదవండి: చికాగోలో నాట్స్ వింటర్ క్లాత్ డ్రైవ్) -
న్యూజెర్సీలో మాటా ఫ్రీ హెల్త్ క్యాంప్
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా ఫ్రీ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్ ను ప్రారంభించింది. న్యూజెర్సీ, ఎడిసన్లోని సాయి దత్త పీఠం అండ్ కల్చరల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఫ్రీ హెల్త్ క్యాంప్కి విశేష స్పందన వచ్చింది. ఫ్లు ఇంజెక్షన్ తోపాటు Free Medication అందజేశారు. వాలంటీర్లు, డాక్టర్లు పాల్గొని సేవలందించారు.ఈ సందర్భంగా మాటా తరుపున చేస్తున్న సేవా కార్యక్రమాలను సంస్థ సభ్యులు వివరించారు. అమెరికాలో ఉన్న తెలుగు అసోసియేషన్స్లో అతి తక్కువ టైమ్ లో ఎక్కువ మందికి చేరువైన సంస్థ మాటా అన్నారు. మూడు వేల మంది సభ్యులతో ప్రారంభించి.. అనేక రాష్ట్రాల్లో ఛారిటీ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఫ్రీ హెల్త్ క్లినిక్ లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లు, డాక్టర్లందరికీ మాటా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మాటా సంస్థని పలువురు అభినందించారు. ముఖ్య అతిథిలుగా విచ్చేసిన పలువురు ప్రముఖులు మాటా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు.(చదవండి: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక) -
పెదనందిపాడులో నాట్స్ మెగా కంటి ఉచిత వైద్య శిబిరం!
పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో నాట్స్ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సందర్భంగా నిర్వహించిన సభకు లక్ష్మణ్ రావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పెదనందిపాడులో పలుమార్లు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి వందలాది మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయించి అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేయించడం నిజంగా చాలా గొప్ప విషయమన్నారు. జన్మభూమి రుణం తీర్చుకోవాలనే తపనతో పని చేస్తున్న నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతిని లక్ష్మణరావు అభినందించారు. అమెరికాలో ఉంటున్న బాపు నూతి తన స్వగ్రామమైన పెదనందిపాడులో చేస్తున్న సేవా కార్యక్రమాలు నేటి యువతలో సేవా భావాన్ని, దేశభక్తిని పెంపొందించడానికి తోడ్పడతాయని అన్నారు. నాట్స్ చేపడుతున్న కార్యక్రమాల్లో తాను కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని లక్ష్మణరావు అన్నారు. రెండు రాష్ట్రాల్లో కుట్టు మిషన్ శిక్షణ శిబిరాలు, ఉచిత కంటి వైద్య శిబిరాలు ,ప్రభుత్వ పాఠశాలలకు సైకిల్ స్టాండు నిర్మాణం,మెడికల్ క్యాంపులు నిర్వహించడం, గ్రూప్ 2 అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్ అందజేయడం వంటి కార్యక్రమాలపై లక్ష్మణరావు ప్రశంసల వర్షం కురిపించారు. వైద్యం పొందడానికి పేదరికం అనేది శాపం కాకూడదనేది నాట్స్ లక్ష్యమని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి అన్నారు. గత కొన్నేళ్లుగా నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెదనందిపాడులో వందలాది మందికి ఉచిత కంటి పరీక్షలు చేయించడంతో పాటు.. అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించామని తెలిపారు. నల్లమల అడవి ప్రాంతంలో మహిళా సాధికారత కోసం గిరిజన మహిళలకు కుట్టుశిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పేద ప్రజలకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తి, ఆనందం మరే దానిలో తనకు లభించలేదని బాపు నూతి అన్నారు. ఈ సభకు కాకుమాను నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. మెగా కంటి వైద్య శిబిరాలు పేద ప్రజలు చక్కగా వినియోగించుకున్నారని ఆల్ ఇండియా లాయర్ యూనియన్ రాష్ట్ర నాయకులు నర్రా శ్రీనివాసరావు అన్నారు. ప్రాంగణంలో కంటి వైద్య శిబిరాన్ని శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, మాజీ ఎంపీపీ మర్ర బాలకృష్ణ ,ముద్దన నాగరాజుకుమారి ,పారిశ్రామిక వేత్తలు దాసరి శేషగిరిరావు, అరవపల్లి కృష్ణమూర్తి ,ముద్దన రాఘవయ్య, శీలం అంకారావు ,కొల్లా సాంబశివరావు తదితరులు బాపయ్య చౌదరి చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం నూతి బాపయ్య చౌదరి ,ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, నర్రా శ్రీనివాస్లను రైతు సంఘాల ప్రతినిధులు శాలువాతో సత్కరించారు. ఉచిత మెగా కంటి వైద్య శిబిరంలో 620 మంది పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 374 మంది ఆపరేషన్లు అవసరమని వైద్యులు నిర్ధారించారు. ఈ కార్యక్రమంలో వైద్య శిబిరం నిర్వహణ కమిటీ సభ్యులు దాసరి సుబ్బారావు, దాసరి రమేష్ ,ఎస్ చౌదరి ,లావు శివప్రసాద్ ,పి.పోతురాజు,కాకుమాను చెన్నకేశవులు ,కే శ్రీనివాసరావు,పి. గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. నాట్స్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని దిగ్విజయంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.పేద విద్యార్ధులకు సాయం చేయడంలో తాను ఎప్పుడూ ముందుంటానని ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు)నూతి అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని బాపు నూతి సందర్శించారు..ఎంతో మంది పేద రైతులు పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఏర్పాటుకు సహకరించారని బాపు నూతి అన్నారు. ఈ కాలేజీలో చదువుకున్న వారు అనేక రంగాల్లో మంచి విజయాలు సాధించారని.. అందులో తాను కూడా ఉన్నానని అన్నారు. పెదనందిపాడు అభివృద్ధికి తాను వంతు చేయూత అందించేందుకు ఎప్పుడూ ముందుంటానని చెప్పారు. పేద విద్యార్ధులకు ఉపకార వేతనాలు ఇచ్చి వారిని ప్రోత్సాహిస్తున్నామని బాపు నూతి తెలిపారు. అమెరికాలో తెలుగువారికి నాట్స్ కొండంత అండగా నిలుస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. దివ్యాంగుల స్వశక్తితో నిలబడేలా వారికి చేయూత అందించే కార్యక్రమాలను నాట్స్ చేపడుతుందని వివరించారు. పెదనందిపాడు ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ వీరరాఘవయ్య, నంది పాఠశాల ప్రిన్సిపల్ సత్యనారాయణలతో కళశాల ఆధ్యాపకులు కలిసి బాపయ్య చౌదరిని ఘనంగా సన్మానించారు.(చదవండి: కర్నూల్లో నాట్స్ మెగా ఉచిత వైద్య శిబిరం!) -
కర్నూలులో నాట్స్ మెగా ఉచిత వైద్య శిబిరం!
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగా కర్నూలు నగరంలోని ఓల్డ్ సిటీలో నాట్స్ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. పేదరికం కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకుడదనే సంకల్పంతో నాట్స్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు, దివ్యాంగులకు చేయూత, విద్యార్ధులకు ఉపకారవేతనాలు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. సుశీల నేత్రాలయం, మైత్రి హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో దాదాపు 1000 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా అందించారు. ఈ శిబిరంలో నాట్స్ సభ్యులతో పాటు స్థానికులు సుబ్బారావు దాసరి, ఎస్ చౌదరి, నారాయణ, బాలకాశి పాల్గొని దీనిని విజయవంతం చేశారు. నాట్స్ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన వైద్యులకు, సభ్యులకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: సింగపూర్లో భారత సంతతి వ్యక్తి మృతి..వాటర్ ట్యాంక్ని క్లీన్ చేస్తుండగా..) -
కట్టమూరులో నాట్స్ మెగా ఉచిత వైద్య శిబిరం
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తోంది. దీనిలో భాగంగా నాట్స్ తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి చొరవతో కాటూరు మెడికల్ కాలేజీ వారి సహకారంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దాదాపు 500 మందికి పైగా రోగులకు శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందించారు. ఈ మెగా వైద్య శిబిరంలో బీపీ, షుగర్, గుండె, శ్వాస కోస, ఊపిరితిత్తులు, కళ్ళు, ముక్కు, చెవి, గొంతు, ఎముకలు, కీళ్లు ఇలా 12 విభాగాలకు చెందిన వైద్యులు.. రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. జన్మభూమి రుణం కొంత తీర్చుకోవాలనే లక్ష్యంతోనే తాము ఇలాంటి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి ఈ సందర్భంగా తెలిపారు.. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ అధ్యక్షుడు, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ మోహన కృష్ణ మన్నవ, స్థానిక ప్రముఖులు మాగలూరి భాను ప్రకాష్, బొల్లు సురేశ్, హరి కొల్లూరు, కిరణ్ కుంచనపల్లి, గ్రామ పెద్దలు శివప్రసాద్, మల్లికార్జున రావు, నరేష్, శ్రీనివాస రావు, బాబు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్యం, మందులు అందించడం అభినందనీయమని శ్రీ హరి మందాడిని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రశంసించారు. మెగా ఉచిత వైద్య శిబిరంలో ఉచిత వైద్య సేవలు పొందిన వారు తమ కోసం శ్రీ హరి మందాడి చూపిన చొరవ, సేవాభావాన్ని కొనియాడారు.(చదవండి: టంపాబే లో అనాథల కోసం నాట్స్ సరికొత్త సేవా కార్యక్రమం!) -
ఆటా ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్
-
‘జగనన్న ఆరోగ్య సురక్ష’కు విశేష స్పందన
కడప: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని జిల్లా నోడల్ అధికారి మురళీధర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని వి.కొత్తపల్లె గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష పనితీరుపై తెలుసుకునేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాలకు నోడల్ అధికారులను నియమించిందన్నారు. వైద్యశిబిరానికి వచ్చిన రోగులను అడిగి.. అందుతున్న సేవలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన బీపీ చెకప్ చేయించుకున్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ స్టాల్స్ను పరిశీలించి అక్కడి గర్భవతులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓ అర్జున్ రావు, ఎంపీడీఓ విజయరాఘవరెడ్డి, తహసీల్దార్ వెంకటసుబ్బయ్య, మండల ఉపాధ్యక్షురాలు లీలావతి, సర్పంచ్ గంగరాజు, వైద్యులు పాల్గొన్నారు. -
ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్న వైదులు
-
ఆచంట నియోజకవర్గంలో జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం
-
రాష్ట్ర సచివాలయంలో ఉచిత వైద్య శిబిరం
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మణిపాల్ ఆస్పత్రి వైద్యులు ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేశారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ ఫిజిషియన్ స్పెషలిస్ట్, క్యాన్సర్ వైద్య పరీక్షలతో పాటు, ఈసీజీ, 2డీ ఎకో ఇతర వైద్య పరీక్షలు చేశారు. మొత్తం 750 మంది వైద్య సేవలు పొందారు. శిబిరంలో డాక్టర్ వేణు గోపాల్రెడ్డి, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ శివ, ఏపీ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
TANA: గుడివాడలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం
గుడివాడ (కృష్ణా జిల్లా): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్య స్రవంతి కార్యక్రమంలో భాగంగా గుడివాడలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక రోటరీ క్లబ్ సహాయంతో కళ్లు, ఈఎన్టీ, కేన్సర్ క్యాంప్ చేపట్టారు. స్కూల్ విద్యార్దినిలకు తానా చేయూత ద్వారా 55 మందికి స్కాలర్షిప్లు, తానా ఆదరణ ప్రోగ్రాం ద్వారా 25 కుట్టు మిషన్లు, 15 సైకిల్స్, 4 వీల్ చైర్స్ అందజేశారు. శశికాంత్ వల్లేపల్లి తన తండ్రి వల్లేపల్లి సీతా రామ్మోహన్ రావు పేరు మీద రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ - రోటరీ కమ్యూనిటీ సర్వీస్ ట్రస్ట్, గుడివాడ వారికి వైకుంఠ రథం బహూకరించారు. తెలుగు టైమ్స్ ఎడిటర్ సుబ్బారావు చెన్నూరి, టీఎన్ఐ లైవ్ ఎడిటర్ ముద్దు కృష్ణ నాయుడులను సత్కరించారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ ఈ సందర్భంగామాట్లాడుతూ.. డిసెంబర్ 2 నుంచి జనవరి 4 వరకు తానా చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో జరిగే సేవా కార్యక్రమాల గురించి వివరించారు. తానా టీమ్ స్క్వేర్ ద్వారా అమెరికాలోని తెలుగువారికి ఆపద, విపత్కర సమయాల్లో ఏ విధంగా సహాయం చేస్తున్నామో తానా సెక్రెటరీ సతీష్ వేమూరి వివరించారు. తానా చైతన్య స్రవంతి కార్యక్రమానికి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా రావి వెంకటేశ్వర రావు, వర్ల కుమార్ రాజా, గుడివాడ రోటరీ క్లబ్ పాలక సభ్యులు పాల్గొన్నారు. అమెరికా నుంచి వచ్చిన తానా నాయకులు శశికాంత్ వల్లేపల్లి, పురుషోత్తం గూడె, సునీల్ పాంత్రా, శశాంక్ యార్లగడ్డ, శ్రీమతి ఉమా కటికి, జోగేశ్వరరావు పెద్దిబోయిన, టాగోర్ మలినేని, రాజ కాసుకుర్తి, డాక్టర్ రావు మొవ్వా, శ్రీనివాస ఓరుగంటి, నాగ పంచుమర్తి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. (క్లిక్: హైదరాబాద్లో తానా మహాసభల సన్నాహక సమావేశం జయప్రదం) -
కాలానుగుణ వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి
తూర్పు గోదావరి (రంగంపేట): కాలానుగుణంగా వచ్చే వ్యాధులపై అవగాహన పెంచుకుని నివారణకు జాగ్రత్తలు పాటించాలని సత్యసాయి సేవా సంస్ధల జిల్లా అధ్యక్షుడు బలుసు వెంకటేశ్వర్లు సూచించారు. స్థానిక సత్యసాయి మందిరం వద్ద శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన చెవి, ముక్కు, గొంతు, ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజమహేంద్రవరానికి చెందిన శ్రీసత్యసాయి సరస్వతి చెవి, ముక్కు, గొంతు వైద్యశాల డాక్టర్ పి. ప్రవీణ్కుమార్ రెడ్డి ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 50 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగ సమన్వయ కర్త సుక్కిరెడ్డి సాయి సుధాకర్, రంగంపేట సజ్జోన్ కనీ్వనర్ మల్రెడ్డి వీర్రాజు, గరిమెళ్ళ అరుణ, సేవా సంస్థ కనీ్వనర్లు టి.గోవిందరాజులు, కె.వెంకట అమర్నాధ్, చావా బోధియ్య, ఉండవిల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఆషామాషీ కాదు: మోదీ
అహ్మదాబాద్: మన దేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ఇది ఆషామాషీ విజయం విజయం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విజయమని, ఈ ఒరవడిని కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విజయంతో మరింత కష్టపడి, మరిన్ని పెద్ద విజయాలను సాధించగలమనే ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. గుజరాత్ రాష్ట్రం సూరత్లోని ఒల్పాడ్లో గురువారం జరిగిన మెడికల్ క్యాంప్లో వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన వర్చువల్గా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు లబ్ధిదారులతో ముచ్చటించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందేందుకు అవకాశమున్న ప్రకృతి సేద్యం వైపు మరలాలని రైతులను కోరారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.2 లక్షల కోట్లను జమ చేశామన్నారు. ఇంటర్నెట్, సాంతికేక పరిజ్ఞానం పుస్తకాల స్థానాన్ని భర్తీ చేయలేవని ప్రధాని మోదీ అన్నారు. పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని కోరారు. నవభారత్ సాహిత్య మందిర్ అహ్మదాబాద్లో నిర్వహించిన పుస్తక ప్రదర్శన ప్రారంభం సందర్భంగా మోదీ సందేశం పంపించారు. -
పెదనందిపాడులో నాట్స్ మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరం
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగునాట కూడా తన సేవా పరంపరను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పెదనందిపాడులో మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించింది. పెదకాకాని శంకర కంటి ఆస్పత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థలతో కలిసి నాట్స్ ఈ ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరాన్ని పెదనందిపాడు పీఎఎస్ కళాశాలలో విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు, విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా హాజరయ్యారు. అమెరికాలోనే కాకుండా సాటి తెలుగువారి కోసం నాట్స్ ఇక్కడ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎంపీ లావు కృష్ణ దేవరాయలు అన్నారు. నాట్స్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బాపయ్య చౌదరి తన పుట్టిన గడ్డకు ఎంతో కొంత మేలు చేయాలనే సంకల్పంతో ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని కృష్ణదేవరాయలు ప్రశంసించారు. ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు, పేదలకు ఎంతో ఉపయోగం ఉందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు బాపయ్య చౌదరి మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. పెదనందిపాడు గడ్డ ఎన్నో పోరాటాలకు కేంద్రబిందువుగా ఉందని, అలాంటి ప్రాంతానికి చెందిన బాపయ్య చౌదరి అమెరికాలో ఉన్నత పదవులు అధిరోహించి, తమ జన్మభూమికి సేవ చేయడం అభినందించదగ్గ విషయమని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. కరోనా సందర్భంలో కూడా బాపయ్య చౌదరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. పెదనందిపాడులో ప్రతిభ గల విద్యార్ధులకు ఉపకార వేతనాలు కూడా ఇస్తున్న బాపయ్య చౌదరి దాతృత్వం గొప్పదని ప్రశంసించారు. బాపయ్య ఈ ప్రాంతానికి మరి ఎన్నో సేవలు చేయాలని ఆకాంక్షించారు. నాట్స్ సంస్థ భాషే రమ్యం సేవే గమ్యం వంటి ఉన్నత ఆశయాలతో స్థాపించిబడింది అని, ఆ సంస్థలో బాపయ్య చౌదరి అంచెలంచెలుగా సేవ చేస్తూ నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కావడం మన ప్రాంతానికి గర్వకారణమని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తా: బాపయ్య చౌదరి, నాట్స్ అధ్యక్షుడు నాట్స్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి తెలిపారు. విద్య, వైద్యం తదితర అంశాలపై రాబోయే కాలంలో రెండు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మిత్రులకు, గ్రామ పెద్దలకు, శంకర కంటి ఆస్పత్రి సిబ్బందికి, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరానికి 2500 మంది పరీక్షలు చేయించుకొగా... వారిలో లో 570 మందిని ఆపరేషన్లు చేయడానికి అర్హులుగా వైద్యులు తేల్చారు. వీరికి విడతలవారీగా బస్సులు ఏర్పాటు చేసి శంకర కంటి ఆసుపత్రి లో ఆపరేషన్లు చేయిస్తామని బాపయ్య చౌదరి తెలిపారు. నాట్స్ చైర్మన్ అరుణ గంటి అమెరికా నుండి పాత కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీలతో సమావేశమయ్యారు. బాపు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. టెలిఫోన్ ద్వారా బాపయ్య చౌదరికి ప్రత్యేక అభినందనలు తెలియచేశారు. సేవా కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమానికి తమ వంతు మద్దతు అందిస్తామని కాకుమాను నాగేశ్వరరావు, కుర్రా హరిబాబు అన్నారు. ఈ సభకు కాకుమాను నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ వైద్య శిబిరానికి శంకర కంటి ఆసుపత్రి వైద్యులు కే అనూష, ఎస్ శ్రీదివ్య, కే సంకల్ప, క్యాంప్ ఎగ్జిక్యూటివ్ బీవీ నాగబాబులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ అధ్యక్షులు, బోర్డ్ అఫ్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మాదల రాజేంద్ర, సభ్యులు ధూళిపాళ్ల సురేంద్ర, కాళహస్తి సత్యనారాయణ, లావు రత్తయ్య, కొల్లా రాజమోహన్ రావు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ నర్రా శ్రీనివాస్, నూతి శ్రావణి, పోపూరి, లక్ష్మీనారాయణ, కుర్రా హరిబాబు, నూతి శ్రీనులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. చదవండి: ఆపి 40 వార్షిక సదస్సు వివరాలు -
కరోనా ఉగ్రరూపం
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి కత్తులు దూస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. వరుసగా ఐదో రోజు 15 వేలకుపైగా కేసులు బహిర్గతమయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం దాకా.. కేవలం 24 గంటల వ్యవధిలో ఏకంగా 19,906 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఈ సంఖ్యే అత్యధికం. గత 24 గంటల్లో 410 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం.. ఇండియాలో ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 5,28,859కు, మరణాలు 16,095కు చేరాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,03,051 కాగా, 3,09,712 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. ఇండియాలో జూన్ 1 నుంచి 28వ తేదీ వరకు 3,38,324 మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటిదాకా 82,27,802 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది. రికవరీ రేటు 58.56 శాతం దేశంలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా పెరుగుతుండడం సానుకూల పరిణామం. రికవరీ రేటు ప్రస్తుతం 58.56 శాతానికి చేరింది. యాక్టివ్ కేసులు, కరోనా నుంచి కోలుకున్నవారి మధ్య తేడా లక్షకుపైగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వ్యత్యాసం ఆదివారం నాటికి 1,06,661 అని తెలియజేసింది. దేశవ్యాప్తంగా 1,055 ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటళ్లలో 1.77 లక్షల ఐసోలేషన్ పడకలు, 23,168 ఐసీయూ పడకలు, 78,060 ఆక్సిజన్ సపోర్టెడ్ బెడ్లు ఉన్నాయి. అలాగే 2,400 కోవిడ్ హెల్త్ సెంటర్లలోనూ సేవలందిస్తున్నారు. అంతేకాకుండా 8.34 లక్షల పడకలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ముంబైలోని ఓ మురికివాడలో మెడికల్ క్యాంపు నిర్వహించేందుకు వెళ్తున్న ఆరోగ్య కార్యకర్తలు -
మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభించిన మల్లాది
-
‘కొందరిలోనే సమాజసేవ ఆకాంక్ష’
సాక్షి, హిందూపురం : సమాజ సేవ చేయాలనే ఆకాంక్ష కొందరిలోనే ఉంటుందని, అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని రాష్ట్ర మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన వారు సమాజ సేవకు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. స్థానిక పంచజన్య శ్రీనివాసభారతి చారిటుబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్స్ వెల్ఫర్ అసిసోయేషన్, బెంగళూరు పీపుల్స్ ప్రీ హాస్పిటల్స్ సౌజన్యంతో పంచజన్య స్కూల్లో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ఏటా మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పేదలకు నాణ్యమైన వైద్య చికిత్సలను ఉచితంగా అందజేస్తున్న పంచజన్య శ్రీనివాస్ సేవలను అభినందించారు. ఇతర దేశాల్లో స్థిరపడ్డ వైద్యులను ఇక్కడకు రప్పించి, వారి చేత వైద్య సేవలు అందించడం చాలా గొప్ప విషయమన్నారు. కేవలం వైద్య శిబిరాలే కాకుండా ఇతర సామాజిక సేవా కార్యక్రమాలపై కూడా దృష్టి సారించాలని కోరారు. శ్రీనివాసులు మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆస్పత్రి వైద్య నిపుణులు 15 మందిని ఒక చోట చేర్చి అన్నిరకాల రోగాలకు ఉచితంగా పరీక్షలు చేయించడంతో పాటు మందులూ ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి శంకరనారాయణ వైద్యశిబిరంలో పర్యటిస్తూ రోగులకు పంపిణీ చేస్తున్న మందుల వివరాలు, చికిత్స విధానాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికి అతి«థులుగా ప్రీపుల్స్ హాస్పిటల్ సీఈఓ చంద్రశేఖర్, మునియప్ప, మున్సిపల్ కమిషనర్ మోహన్రావు, ఎంఈవో గంగప్ప, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పుల్లారెడ్డి హాజరయ్యారు. శిబిరంలో సుమారు 1,500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచజన్య స్కూల్ కోశాధికారి నందకిషోర్, ఏఓ భాస్కర్, హెచ్ఎం గాయత్రి, ఏహెచ్ఎంలు విజయేంద్ర, శశికళ, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు వేణుగోపాల్, రియాజ్, ముస్తఫా అలీఖాన్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆటా ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్
వాషింగ్టన్ : ప్రవాస తెలుగు వారికే కాకుండా ప్రవాస భారతీయులందరికీ అండగా నిలిచే ఆటా, ఆగస్టు 17న అత్యున్నత స్థాయిలో హెల్త్ క్యాంపు నిర్వహించింది. అమెరికాలో ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేపట్టే ఆటా నేడు చేసిన హెల్త్ క్యాంపు వల్ల పలు వర్గాల వారికి బహు విధాలా ప్రయోజనకరంగా వారి సేవలు అందించారు. ఆట వాషింగ్టన్ డీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు ఆరు వందలకు పైగా అమెరికా వాసులు, వారి బంధు మిత్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అతి విజయవంతంగా చేసారు. హేర్నడోన్ కమ్యూనిటీ సెంటర్ లో జరిగిన ఈ ప్రోగ్రాం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2 వరకు నడిచింది. కార్యక్రమంలో ౩౦ మంది పైగా డాక్టర్లు పాల్గొన్నారు. వైద్యో నారాయణో హరి: అన్నట్లుగానే వచ్చిన వైద్యులు చాలా ఓపికతో వచిన వారికీ సలహాలు ఇచ్చి వారి సమస్యలకు స్పందించారు. వచ్చిన వారందరు పలు స్పెషాలిటీస్ లో ఆరితేరిన నిపుణులు మరియు 10ఏళ్లకు పైగా అనభవాం కలిగిన వైద్యులు కావడం విశేషం. అరుదైన విధంగా హృదయేతర కార్డియాలజిస్ట్ , కిడ్నీ స్పెషలిస్ట్స్, ఇంటర్నల్ మెడిసిన్, దంత మరియు ఆర్థోపెడిక్ డాక్టర్స్, పిల్లల డాక్టర్స్, న్యూరాలజీ, అల్లెర్జీస్ సంబంధించిన నిపుణులను మరియు అనేక ఫార్మాసిస్ట్స్లను ఒకే చోటుకు తీసుకు వచ్చిన ఖ్యాతి ఆటా ఒక్కదానికే దక్కింది. వారికి వారే సాటి! అన్ని రకాల వైద్యులు ఒకే చోట ఉన్నందున వచ్చిన ప్రతి వ్యక్తి హర్షం వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ ఉన్నా ఎన్నోసార్లు తిరగాల్సిన అవసరం లేకుండా ఆటా ఈ విధంగా తమకి ఎంతో సాయం చేసిందని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రక్త పరీక్ష మరియు బీపీ చెకప్ చేయించుకొని డాక్టర్ల చేత సలహాలు పాందారు. డాక్టర్ రామకృష్ణన్ గారి హృదయ సమస్యల పరమైన అవగాహన మరియు ఆరోగ్యకరమైన జీవన విధానం, డాక్టర్ వీరపల్లి గారి వ్యాధుల లక్షణాలు తెలుసుకోవడం, డాక్టర్ పాలువోయ్ గారిచే అల్లెర్జిఎస్ ఎలా అరికట్టాలో వినడం తమకు ఎంతో ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు. వచ్చిన వారందరూ ఆటా ఈ క్యాంపు ద్వారా తమ రుగ్మతలను సకాలంలో వైద్య సదుపాయాలందించిందని అభినందించారు. వచ్చిన వైద్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ భువనేశ్ మాట్లాడుతూ.. సామాజిక ప్రయోజనమే లక్షంగా పెట్లుకొని ఈ ప్రొగ్రాం నిర్వహించామని , వైద్య సదుపాయాలు తెచ్చామని , ఆరోగ్యకరమైన అవగాహన కల్సించాలని , సామాజిక అభ్యున్నతికి సర్వ విధాలా ఆటా తోడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన వైద్యులకు ధన్యవాదాలు తెలియచేస్తూ , డాక్టర్ వెంకట్ గారి ప్రేరణనను అభినంధిస్తూ , వైద్యులందరికి కృతజ్ఞత భావంగా మెమెంటోలని సమర్పించారు .ఇంత పెద్ద ఎత్తున క్యాంపు ఎవరు చేయలేదని , ఇదే చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొన్నారు. ఆట బోర్డు అఫ్ ట్రస్టీస్ సౌమ్య కొండపల్లి మరియు జయంత్ చల్ల గార్లు మాట్లాడుతూ.. ఆట సంవత్సరం పొడువునా అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ప్రవాస తెలుగు వారికీ ఉన్నత విద్యలో స్కాలర్షిప్స్ ఇస్తుందని, భారతదేశంలో మానవీయ సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తుందని పేర్కొని , ఇంత భారీ ఎత్తున క్యాంపు చేసినందుకు ఆట డీసీ చాప్టర్ కు అభినందలు తెలిపారు . -
దివ్యాంగులు, అనాథ పిల్లలకు ఉచిత వైద్య శిబిరం
సందేశాత్మక లఘు చిత్రాలు, మ్యూజిక్ వీడియోస్తో ఆకట్టుకున్న దర్శకుడు డాక్టర్ ఆనంద్ చిన్నారులు, దివ్యాంగులు, అనాథ పిల్లల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. జనయిత్రి ఫౌండేషన్ మరియు బంజారా మహిళా యన్.జీ వొ సంయుక్తంగా డాక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బోడుప్పల్ ,పీర్జాది గూడా ప్రాంతంలో వున్న దివ్యాంగులు, అనాథ పిల్లల కోసం ఒక ఉచిత వైద్య శిబిరాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ‘డాక్టర్ కావ్య (గైనకాలజిస్ట్), డాక్టర్ మధు( ఫిజీషియన్), డాక్టర్ అర్జున్ (డెంటిస్ట్) కలిసి, దాదాపు 200 మంది చిన్న పిల్లలకు వైద్య పరీక్షలతో పాటు, రక్త పరీక్షలను కూడా నిర్వహించినట్లుగా తెలిపారు. ముఖ్యంగా ఆటిజం, బాధిర్యం, మానసిక ఎదుగుదల లోపం, అంధత్వం, మస్తిష్క పక్షవాతం లాంటి సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు, వారి తల్లి తండ్రులకు సహాయ సహకారాలను అందిచామ’ని తెలిపారు. ఇలాంటి కార్య క్రమాల ద్వారా ఎంతో మంది చిన్నారులకు లబ్ది చేకూరుతుందని, మరెన్నో కార్యక్రమాలను దేశ మంతటా నిర్విస్తున్నట్లు డాక్టర్ ఆనంద్ తెలియ చేసారు. బీహార్ చిన్న పిల్లల కోసం, ఒడిషా ఫాని తుఫాను బాధితుల కోసం పలు వైద్య శిబిరాలను నిర్వహించిన ఆనంద్ను ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. -
బాబోయ్ జ్వరాలు..
సాక్షి, గార: మండలంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు రావడం, ఎండలు మండిపోతుండడంతో ఉపాధి వేతనదారులు, చిన్నారులు, వృద్ధులు జ్వరాల బారిన పడుతున్నారు. అయితే అంతా ఎన్నికల బిజీలో ఉండడంతో వీరు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మండలంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. మండలంలో శ్రీకూర్మం పంచాయతీలో సెగిడిపేట తదితర గ్రామాలతో పాటు, సైరిగాం పంచాయతీ అప్పోజీపేట, రామచంద్రాపురం, గొంటి పంచాయతీల పరిధిలో అధికంగా జ్వర బాధితులు ఉన్నారు. ఏడు రోజులుగా బాధపడుతున్నా.. ఏడు రోజులుగా జ్వరం వస్తోంది. గ్రామంలోని డాక్టరును అడిగితే మందులు ఇచ్చారు. కానీ తగ్గలేదు. మండలంలో పెద్ద డాక్టరు దగ్గరుకు వెళ్లినా ఏమాత్రం మార్పులేదు. మందులు వాడుతున్నా జ్వరం తగ్గడం లేదు. – బరాటం వెంకటేశ్వరరావు, అప్పోజీపేట మరో ఊరెళ్తున్నాం.. ఊర్లో జ్వరం ఉందని చెబితే మందులిచ్చారు. తగ్గలేదు సరికదా ఒళ్లంతా (శరీరమంతా) ఊపేస్తుంది. ఇంకో ఊరెళ్లి వైద్యం చేయించుకుంటున్నాం. అయినా జ్వరం తగ్గడం లేదు. తిండి తినడం లేదు. – కిల్లాన అచ్చెమ్మ, సెగిడిపేట, శ్రీకూర్మం -
విశాఖలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
ప్రారంభమైన వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, అమరావతి: నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల కోసం తపించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. డిసెంబర్ 21 జననేత పుట్టిన రోజు కావడంతో.. ఒకరోజు ముందుగానే అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను ప్రారంభించారు. రాష్ట్రంలోని పలుచోట్ల కేక్లు కట్చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాడిపత్రిలో వృద్దులకు దుస్తుల పంపిణీ.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో శ్రీ కృష్ణ వృద్దాశ్రమంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్రెడ్డి వృద్దాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. అనంతరం ఆశ్రమంలోని వృద్దులకు దుస్తులు పంపిణీ చేశారు. వైజాగ్లో భారీ కేక్ కట్ చేసిన పార్టీ శ్రేణులు వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా వైజాగ్లోని మనోరమ జంక్షన్లో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ రమణ మూర్తి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బారీ కేక్ కట్ చేశారు. వైఎస్సార్ సీపీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం కన్వీనర్ గరికిన గౌరి, వార్డు అధ్యక్షురాలు భారతిలు పాల్గొన్నారు. విజయవాడలో మెడికల్ క్యాంపు.. జననేత జన్మదిన వేడుకల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, తనుబుద్ది చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ల చేతుల మీదుగా ఈ క్యాంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు రక్షణ నిధి, జోగి రమేశ్, ఇక్బాల్, ఉదయభాను, మల్లాది విష్ణు, బొప్పన భవకుమార్, అసిఫ్, తోట శ్రీనివాస్, ఎంవీఆర్ చౌదరి, అరిమండ వరప్రసాద్రెడ్డిలు పాల్గొన్నారు. -
ప్రజలు వైద్యం కోసం ఎదురు చూస్తున్నారు
ప్రకాశం, గిద్దలూరు: రాష్ట్రంలో ప్రజలకు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక కాశిరెడ్డినగర్లోని శ్రీ శ్రీనివాస డిగ్రీ కళాశాల, సాయిటెక్నో స్కూల్లలో వైవీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్యశిబిరాన్ని ఆదివారం ప్రారంభించిన అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నప్పటికీ అందులో వైద్యులు, సిబ్బంది కొరత, మందుల కొరతతో ప్రజలకు వైద్యం అందడం లేదన్నారు. కరువుతో అల్లాడుతున్న ప్రజలు ఉచిత వైద్య శిబిరాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజలకు వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం అందించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నీరుగార్చిందన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పటిష్టంగా అమలు పరిస్తే ప్రజలు ఉచిత వైద్య శిబిరాల వైపు చూడాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. జిల్లాలో 555 ఆరోగ్య కేంద్రాలు, 90 పీహెచ్సీలు, 14 సీహెచ్సీలు ఉన్నా ప్రయోజనం శూన్యమన్నారు. ప్రజలకు తగిన వైద్యం అందడం లేదని గ్రహించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తాను అన్ని నియోజకవర్గాల్లో మెగా ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే మార్కాపురం, దర్శి, కనిగిరి, గిద్దలూరులో నిర్వహించినట్లు చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లోనూ ప్రజలకు ఉపయోగపడేలా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల నుంచి సైతం వేలాది మంది ప్రజలు వైద్య శిబిరానికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారన్నారు. అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్టు వైద్యులతో శిబిరాలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. శిబిరంలో పాల్గొన్న వారందరికీ భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి 6,500 మంది వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరికి మందులు, భోజన వసతి కల్పించారు. మంచినీటి సరఫరాలో లోపం వలనే ప్రజలకు అనారోగ్యం:ప్రభుత్వం ప్రజలకు శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయకపోవడం వలనే అనారోగ్యం పాలవుతున్నారని ఆయన అన్నారు. 2014 ఎన్నికల ముందు ప్రతి గ్రామంలో మినరల్ ప్లాంట్ ద్వారా తాగునీరందిస్తామని చెప్పిన చంద్రబాబు నేటికీ ఏర్పాటు చేయలేదన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెయ్యి అడుగుల లోతులో బోరుబావులు తవ్వితే కానీ నీరు లభించని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ నీటిని తాగిన ప్రజలు కీళ్లనొప్పులు, కిడ్నీ, ఫ్లోరోసిస్ వ్యాధిబారిన పడి మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు సాగర్ జలాలు వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడంతో అవి ప్రజలకు చేరువకావడం లేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు కావస్తున్నా ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు. ఫలితంగా ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు లేదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టు, గుండ్లమోటు ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరందిస్తామన్నారు. కంభం చెరువుకు నీరు నింపి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు మరుగున పడటం వలన సాగులో ఉన్న ఖరీఫ్, రబీ రెండు పంటలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన అరకొర పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు పంటను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. 2014 ఎన్నికల ముందు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు అధికారంలోకి రాగానే రైతులను ఆదుకునేందుకు స్వామినాథన్ కమిషన్ సిపార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చారని, నేటికీ రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించిన దాఖలాలు లేవన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే రైతును ఆదుకునేందుకు అన్నివిధాలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ తిరిగి అధికారం చేపట్టాలన్న దురుద్దేశంతో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోనే 5,227 ఓట్లను తొలగించేందుకు ఫారం–7 పెట్టారని, వారి కుట్రలను భగ్నం చేస్తూ సమన్వయకర్త ఐవీ రెడ్డి, నాయకులతో కలిసి 4,463 ఓట్లను పునరుద్ధరించేలా చేశారన్నారు. ప్రజలకు సేవచేసి వారి మన్ననలను పొందలేని అధికార పార్టీ నాయకులు ఇలాంటి నీచానికి దిగజారుతున్నారు. ప్రజల కోసం సేవచేస్తున్న వారికి మద్దతు పలికి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిడతల సాయికల్పనారెడ్డి, యాళ్లూరి వెంకటరెడ్డి, కే.పి.కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, నాయకులు కామూరి రమణారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ సీహెచ్.రంగారెడ్డి, యేలం వెంకటేశ్వర్లు, కే.వి.రమణారెడ్డి, మండల కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు. సాగర్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి పొదిలి: సాగర్ కుడి కాలువ కింద వరి సాగు చేసిన రైతులకు సకాలంలో నీరు అందించటంలో విఫలం కావటంతో వరి ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యుడు వైవి.సుబ్బారెడ్డి అన్నారు.మాజీ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డి స్వగృహంలో ఆదివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ వాటిని ప్రణాళిక బద్ధంగా రైతులకు అందించటంలో విఫలమయ్యారన్నారు. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. పొదిలి ప్రాంతంలోని ఫ్లోరైడ్ సమస్య, నీటి సమస్య గురించి ఢిల్లీ స్థాయిలో గళం వినిపించామని, ఫలితంగా కేంద్ర అధికారులు వచ్చి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారన్నారు. మంచినీటి ప్రాజక్టుల కోసం కేంద్రం నిధులు మంజూరు చేసిందని, అయితే చర్యలు తీసుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. పశ్చిమ ప్రాంతం వారికి కరవు లేకుండా చేసే వెలుగొండ ప్రాజక్టు నిర్మాణం చంద్రబాబుతో కాదన్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన సంవత్సరం లోపు ప్రాజెక్టు పూర్తి చేయటంతో పాటు, పొదిలి ప్రాంత ప్రజల తాగునీటి ఇబ్బందులు తీరుస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సానికొమ్ము పిచ్చిరెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. -
పెదమానాపురంలో వైద్యశిబిరం
దత్తిరాజేరు విజయనగరం : మండలంలోని పెదమానాపురం దళిత కాలనీలో సోమవారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. వారం రోజులుగా కాలనీవాసులు జ్వరాలతో అవస్థలు పడుతున్న నేపథ్యంలో ‘మంచం పట్టిన మానాపురం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి విజయలక్ష్మి ఆదేశాల మేరకు స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి రామేశ్వరి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటుచేసి రోగులకు వైద్యసేవలందించారు. రాజన శాంతి, మరియాల వెంకటలక్ష్మి, బొత్స రమ, ఈశ్వరమ్మ, చిన్నారులు గౌతమి, నాని, మౌనిక, తదతర జ్వర పీడితులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. ఇంటింటికీ వెళ్లి జ్వరపీడితుల వివరాలు సేకరించారు. అనంతరం డాక్టర్ రామేశ్వరి మాట్లాడుతూ, పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే జ్వరాలు ప్రబలినట్లు చెప్పారు. స్థానిక పశువుల ఆస్పత్రి ఆవరణలో పశువులను నిత్యం ఉంచడం వల్ల మురుగు పేరుకుపోవడంతో వ్యాధులు ప్రబలాయని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులపై జిల్లా పంచాయతీ అధికారి బి. అప్పారావు ఆరా తీశారు. పనులు సక్రమంగా చేపట్టాలని మండల పంచాయతీ అధికారి రాంబాబును ఆదేశించారు. ఈ విషయమై గ్రామ ప్రత్యేక అధికారి, మండల తహసీల్దార్ కల్పవల్లి స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి పారిశుద్ధ్య పనులు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో సీహెచ్ఓ సత్యనారాయణ, హెల్త్ సూపర్వైజర్ నరసింహులు, ఫార్మాసిస్టు సీతారాం, వీఆర్వోలు తిరుపతి, రాజేష్, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో ఏర్పాటుచేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ బుధవారం ప్రారంభించారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం, అపోలో ఆస్పత్రులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరం 3 రోజులు కొనసాగనుంది. ఈ సందర్భంగా జస్టిస్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, న్యాయవాద వృత్తిలో తీవ్ర ఒత్తిడి ఉంటుందని, అందువల్ల ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడాన్ని అలవాటు చేసుకోవాలని న్యాయవాదులను కోరారు. రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆలోచన విధానం సరిగ్గా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, అపోలో ఆస్పత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, ఇరు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జీవనశైలిలో మార్పు రావాలి
పాలమూరు మహబూబ్నగర్ : మారుతున్న మనిషి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం, అపరిశుభ్రమైన నీరు తాగడం వల్ల వదుమేహం(షుగర్) వ్యాధి సోకుతుందని జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ వాసు చైతన్య అన్నారు. సుశ్రుత ప్రజావైద్యశాల, ‘సాక్షి’ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని సుశ్రుత ఆస్పత్రిలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఓపీ, బీపీ, రక్తపరీక్షలు చేశారు. అంతకుముందు డాక్టర్ వాసు చైతన్య మధుమేహం ఎలా వస్తుంది.. ఎలా అదుపు చేసుకోవాలి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. అనే అంశాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుత పరిస్థితిలో చాలా చిన్న వయసులో షుగర్ వస్తోందని, పాఠశాలల్లో చదువు పట్ల ఒత్తిడికి లోను కావడం వల్ల కూడా చక్కెరను నియంత్రించే హార్మోన్లు కొంత కాలానికి పని చేయకుండా పోతాయని, ఈ కారణంగా కూడా వ్యాధి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరు తీసుకునే ఆహారం గ్లూకోజ్గా మారి రక్తంలో కలుస్తుందని, ఈ క్రమంలో రక్తంలో గ్లూకోజ్ లెవల్ పెరిగితే షుగర్ వ్యాధి సోకినట్లు గుర్తిస్తామన్నారు. అదేవిధంగా గ్లూకోజ్ ఇన్సులిన్ హార్మోన్ తక్కువగా ఉన్నా, ఇన్సులిన్ సక్రమంగా పని చేయకపోయినా వ్యాధి వచ్చినట్లేనన్నారు. పెరుగుతున్న వ్యాధిగ్రసులు లక్ష మందిలో ఇద్దరు లేదా ముగ్గురు చిన్నారులకు అతి చిన్న వయసులో ఈ వ్యాధి వస్తున్నట్లు సర్వేల్లో తేలిందని, పెద్దవారిలో 100 మందిలో 50 మందికి షుగర్కు సంబంధించి ఎలాంటి లక్షణాలు కన్పించవని అయిన వారికి ఆ వ్యాధి ఉంటుందని, మరో 50 మందికి లక్షణాలు పస్పుటంగా కన్పిస్తాయని తెలిపారు. ఇవీ.. లక్షణాలు షుగర్ వచ్చిన వారికి ఆకలి ఎక్కువగా కావడం, మూత్రం అధికంగా రావడం, కాళ్లు చేతులు తి మ్మిర్లు రావడం, దాహాం వేయడం, శరీరానికి అయిన గాయాలు మానకపోవడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. 45ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు ప్రతి మూడు నెలలకు ఓ సారి వై ద్యుడి దగ్గర అన్ని రకాల పరీక్షలు చేసుకోవాలని సూచించారు. 20నుంచి 30ఏళ్ల వారు ప్రతి ఆరు నెలలకు పరీక్షలు చేసుకోవాలన్నారు. ముందుజాగ్రత్తలే మేలు వ్యాధి లక్షణాలు కనిపించిన వ్యక్తులు అర్హత కల్గిన వైద్యుడి దగ్గరికి మాత్రమే వెళ్లాలని వాసు చైతన్య సూచించారు. షుగర్ కంట్రోల్లో ఉండాలంటే సరైన పౌష్టికాహారం, వ్యాయామం, డాక్టర్ ఇచ్చిన మందులు సక్రమంగా వాడటం వంటివి చేయాలన్నారు. రోజుకు ఆహారం ఎక్కువ సార్లు తక్కువ మోతాదులో తీసుకోవాలని, బ్రౌన్ రైస్ తీసుకుంటే చాలా మేలన్నారు. రాబోయో కాలంలో ఆరోగ్యవంతులుగా ఉండాలంటే బీపీ, షుగర్ అదుపులో పెట్టుకోవాలని లేకపోతే కిడ్నిలు, గుండెనొప్పి, బ్రెయిన్ స్ట్రోక్ తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. శిబిరంలో డాక్టర్ వేణు, పీఆర్ఓ కమల్ పాల్గొన్నారు. -
వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జేసీ
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): సదాశివపేట మండల పరిధిలోని నందికంది గ్రామంలో జాతీయ క్షయ నివారణ కార్యక్రమంలో భాగంగా సోమవారం మొబైల్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ నిఖిలారెడ్డి ముఖ్య అతిధిగా హాజరై మొబైల్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు క్షయ వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నివారణకు అవసరమైన మందులను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తుందన్నారు. వారానికి మించి దగ్గు, జ్వరం ఉంటే వెంటనే తెమడ పరీక్షలు చేయించుకోవాలన్నారు. మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండాలన్నారు. గ్రామంలోని ప్రజలకు మొబైల్ వాహనంలోనే వైద్య పరీక్షలను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి రాజేశ్వరి, సర్పంచ్ అమృతదేవి, ఎంపీటీసీ సభ్యురాలు జయశ్రీ శ్రీనివాస్ తదితరులున్నారు. -
మంచి పాత్రలు వస్తే మళ్లీ నటిస్తా: నటి
సాక్షి, సబ్బవరం: మంచి పాత్రలు వస్తే తప్పక నటిస్తానని ప్రముఖ సినీ నటి రమ్యశ్రీ చెప్పారు. శుక్రవారం ఆమె విశాఖపట్నంలోకి సబ్బవరానికి వచ్చారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇంతవరకూ ఎనిమిది భాషల్లో 300 సినిమాల్లో నటించానని ఆమె చెప్పారు.1997లో కోరుకోన్న ప్రియుడు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశానన్నారు. కన్నడలో ఆర్యభట్ట సినిమాకు జాతీయ అవార్డు లభించిందన్నారు. రమ్య హృదయాలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మొగలిపురం గ్రామంలోని రామాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందుతున్నా ప్రసవ సమయంలో మహిళలు మృత్యువాత పడుతున్న సంఘటనలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. గ్రామాల్లో గర్భిణులు వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే ప్రసవ సమయంలో ఇబ్బందులు ఉండవని తెలిపారు. బీపీ, సుగర్, స్త్రీ సమస్యలపై వైద్య శిబిరంలో ఉన్నత స్థాయి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రమ్యశ్రీ కోరారు. -
ప్రజా సంకల్పయాత్రలో వైద్యశిబిరం
చిత్తూరు అర్బన్: 55 రోజులు.. 760కి పైగా కిలో మీటర్ల దూరం. అతడే ఓ సైన్యంలా నడిచి వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానుల కోసం వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి పాకాల శివార్లలో చంద్రగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర వైఎస్సార్సీపీ సేవాదళ్ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని పార్టీ నాయకులు, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. పాదయాత్రలో జగన్మోహన్రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వందల సంఖ్యలో నడుచుకుంటూ వస్తున్నారు. వీరికి కనీస వైద్య పరీక్షలు నిర్వహించడానికి చెవిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు ఆయన స్నేహితుడు డాక్టర్ బి హేమకుమార్రెడ్డి సంకల్పించి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పాదయాత్రలో పాల్గొన్న వారికి శని, ఆదివారాలు రక్త పరీక్షలు, మధుమేహం, ఇతర పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, డాక్టర్ శివాజీరెడ్డితో పాటు ఇతర వైద్యులు హరిబాబు, గంగిరెడ్డి, శ్రీనివాసరావు, మధుసూదన్రెడ్డి, రమేష్, వరప్రసాద్, సుబ్రమణ్యంరెడ్డి, వెంకటేష్, గణేష్రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. -
ఆటా ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు
తలకొండపల్లి: ఆటా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపునకు విశేష స్పందన వచ్చింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడ్కల్ గ్రామంలో ఆటా వారు బుధవారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఆటా మెడికల్ క్యాంపునకు స్థానికులు భారీ సంఖ్యలో హాజరై.. హెల్త్ చెకప్ చేయించుకున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు వైద్య శిబిరానికి వచ్చారు. డాక్టర్ల బృందం పేషెంట్లకు మెడిసిన్ పంపిణీ చేశారు. -
వైద్యం.. తూతూమంత్రం
ప్రొద్దుటూరు టౌన్ : మండలంలోని అమృతానగర్లో ఎలాంటి సమాచారం లేకుండా వైద్యశిబిరం నిర్వహించడం పట్ల స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరికీ చెప్పకుండా వైద్యశిబిరం పెడితే ఎవరు వస్తారని స్థానికులు డాక్టర్ను ప్రశ్నించారు. నాకు తెలియదు ఇక్కడికి వెళ్లమని ఫోన్ వస్తే వచ్చా అని డాక్టర్ చెప్పడంతో ప్రజలు అవాక్కయ్యారు. అక్కడ ఉన్న మందుల్లో ఆప్లాస్పిన్ ఎరల్– ఐపి టానిక్ (యాంటిబయాటిక్) మందు 2015 నవంబర్లో తయారు చేయగా 2017 అక్టోబర్తో కాలం ముగియనుంది. అంటే మరో 12 రోజుల గడువు ఉంది. అలాగే క్లోరోక్లిన్ టాబ్లెట్ 2015లో తయారుచేయగా 2017 నవంబర్ నెలతో కాలం ముగియనుంది. ఇలా మరి కొన్ని మందులు కూడా తక్కువ కాలం గడువు కలిగినవి వైద్య శిబిరానికి తీసుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే ప్రజల ఆరోగ్యంపై వైద్యాధికారులకు ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. కల్లూరు పీహెచ్సీ నుంచి తీసుకొచ్చిన మందులు ఔట్ సోర్సింగ్ కింద పని చేస్తున్న ఏఎన్ఎంలు మరియమ్మ, యశోదలు మండల పరిధిలో ఉన్న కల్లూరు పీహెచ్సీ నుంచి మందులను తీసుకొచ్చారు. డిప్యుటేషన్పై కల్లూరు పీహెచ్సీలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఏఎన్ఎం మరియమ్మను ఇక్కడ నియమించారు. ప్రతి రోజు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లూరు నుంచి అమృతానగర్కు రావాలంటే కష్టంగానే ఉందని వాపోతోంది. ప్రభుత్వం ఇచ్చే జీతం డబ్బులోనే చార్జీలు పెట్టుకోవాల్సి వస్తోందని అంటోంది. ఏ వసతులు లేక పోయినా ఆరోగ్య ఉపకేంద్రంలో పని చేయాల్సిన పరిస్థితి సిబ్బందికి ఏర్పడింది. -
చిలకపాడులో..డెంగీ టెర్రర్!
► విష జ్వరాలతో 50 మందికి పైగా ఆస్పత్రి పాలు ► నెలరోజుల వ్యవధిలో గ్రామంలో ఐదుగురికి డెంగీ ► పారిశుద్ధ్య లోపమే రోగాలకు కారణమంటున్న స్థానికులు ప్రాణాంతక డెంగీ జ్వరాలతో చీమకుర్తి మండలంలోని చిలకపాడు ఎస్సీకాలనీ మంచం పట్టింది. 80 కుటుంబాలు ఉన్న ఈ కాలనీలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 60 మంది విష జ్వరాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు డెంగీతో బాధ పడుతున్నట్టు వైద్యులు నిర్ధారించారు. నెల రోజుల వ్యవధిలో ఒకే కాలనీకి చెందిన ఐదుగురు డెంగీ బారిన పడటం గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తోంది. చీమకుర్తి రూరల్ : చీమకుర్తి మండలం చిలకపాడు ఎస్సీకాలనీకి చెందిన 13 ఏళ్ల బాలుడు వంకాయలపాటి ఏసయ్య జ్వరంతో బాధపడుతూ ప్రస్తుతం ఒంగోలులోని రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడికి డెంగీ నిర్ధారణ అయినట్లు రిమ్స్ నుంచి వేములపాడు ప్రాథమిక వైద్య కేంద్రానికి మెయిల్ వచ్చిందని ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ పి.హేమలత ధ్రువీకరించారు. ఏసయ్య సోదరుడు మనోహర్ కూడా డెంగీతో బాధపడుతూ రిమ్స్లో చికిత్స పొంది రెండు మూడు రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యాడు. వీరిద్దరితోపాటు గడిచిన రెండు రోజులుగా ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వంకాయలపాటి మనీషా, పాలపర్తి ప్రశాంత్కు డెంగీ నిర్ధారణ అయిందని ఆయా ఆస్పత్రుల వైద్యులు చెప్పారని, ప్రభుత్వ ఆస్పత్రి సూపర్వైజర్ లక్ష్మీనరసింహరావు తెలిపారు. దీంతో ప్రస్తుతం డెంగీ జ్వరంతో ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న గ్రామస్తుల సంఖ్య మూడుకు చేరుకుంది. ఫిబ్రవరి 22వ తేదీన చిలకపాడు వడ్డెపాలేనికి చెందిన తన్నీరు వేణుగోపాల్కు డెంగీ రావడంతో చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చాడు. చిలకపాడు ఎస్సీకాలనీలో రెండు రోజుల నుంచి దాదాపు 50 నుంచి 60 మంది వరకు తీవ్రమైన జ్వరాలతో బాధపడుతూ పక్కనే ఉన్న మద్దులూరులోని ఆర్ఎంపీ వద్ద తాత్కాలిక వైద్యం చేయించుకున్నారు. తగ్గకపోవడంతో ఒంగోలులోని రిమ్స్తో పాటు పలు ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స చేయించుకుంటున్నారు. వారిలో 10 మందికి వైట్ ప్లేట్లెట్స్ పడిపోయినట్లు వైద్య సిబ్బంది చెప్పారని, రోగుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సభ్యులంతా ఆస్పత్రుల్లోనే..: ఒకే కుటుంబానికి చెందిన వంకాయలపాటి ఇస్రాయేల్, భార్య కోటేశ్వరి, కొడుకులు ప్రవీణ్, జాన్, మనోజ్ జ్వరాలతో బాధపడుతూ ఒంగోలులోని ఒకే ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. మరో కుటుంబానికి చెందిన వంకాయలపాటి రాజా, ఆయన భార్య మనీషా, తాళ్లూరి మరియమ్మ, పాలపర్తి ప్రశాంత్, రేపూరి మాధవి, ఇండ్ల సుమతి జ్వరాలతో బాధపడుతున్నారు. వీరిలో కొందరు వైరల్ ïఫీవర్, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలతో బాధపడుతున్నారు. గత ఏడాది జూలైలో ఇదే మండలంలోని తక్కెళ్లపాడులో డెంగీ జ్వర లక్షణాలు గుర్తించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. చిలకపాడు, దాని సమీప గ్రామాలలో జ్వరాల విజృంభణ కారణంగా రోగులతో పాటు వారి బంధువలంతా రెండు మూడు రోజులుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. హుటాహుటిన వైద్య శిబిరం...: చిలకపాడు గ్రామంలో డెంగీ, ఇతర జ్వరాలు వ్యాపించిన సంగతి తెలుసుకుని వేములపాడులోని ప్రాథమిక వైద్యకేంద్రం డాక్టర్ పి.హేమల త ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక వైద్యశిబిరం ఏ ర్పాటు చేశారు. 27 మందికి వైద్యపరీక్షలు చే సి మందులు అందజేశారు. ఒంగోలు మలేరి యా డిపార్టుమెంట్ సబ్యూనిట్ ఆఫీసర్ మజీద్, సూపర్వైజర్ లక్ష్మీనరసింహారావు, హెల్త్ అ సిస్టెంట్ల సాయంతో కాలువ ఎబేట్ పిచికారీ చే యించారు. ఎం.ఎల్.ఆయిల్ను కాలువలలో పో యించారు. కాలువల్లో మురుగు పారుదల లేకపోవడం, దోమలు స్వైర విహారం చేయడమే రోగాలకు కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. డెంగీతో బాలిక మృతి దొనకొండ : డెంగీతో బాధపడుతున్న బాలిక పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని ఇండ్లచెరువులో గురువారం వెలుగు చూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన కుర్రా గంగారావు కుమార్తె రూప(8) వారం నుంచి జ్వరంతో బాధపడుతోంది. స్థానికంగా వైద్యం చేయించినా జ్వరం అదుపులోకి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వినుకొండలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు రూప డెంగీ జ్వరంతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి బాలిక మృతిచెందింది. -
వైఎస్ జగన్ పుట్టినరోజున మెడికల్ క్యాంప్
-
చంచల్గూడ జైల్లో వైద్య శిబిరం
హైదరాబాద్ : ఆసుపత్రుల యాజమాన్యాలు జైళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని చంచల్గూడ పురుషుల జైలు సూపరింటెండెంట్ బచ్చు సైదయ్య అన్నారు. నగరానికి చెందిన ఓ డెంటల్ ఆస్పత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సైదయ్య ప్రారంభించారు. ఈ శిబిరంలో 165 మంది ఖైదీలు దంత సమస్యలపై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఖైదీలను భారీ సంఖ్యలో ఆసుపత్రులకు తరలించడంతో ఇబ్బందులు తలెత్తేవన్నారు. ఈ వైద్య శిబిరాలతో ఆ సమస్య కొంత వరకు తీరిందన్నారు. -
కప్పట్రాళ్ల అభివృద్ధిలో 'తానా'
– చైతన్య స్రవంతి పేరుతో డిసెంబరు 23, 24న అభివృద్ధి కార్యక్రమాలు కర్నూలు: కప్పట్రాళ్ల గ్రామాభివృద్ధికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ముందుకు వచ్చిందని ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. బుధవారం కర్నూలులో ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. చైతన్య స్రవంతి పేరుతో గ్రామంలో డిసెంబరు 23, 24 తేదీల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు తానా సభ్యులు కార్యచరణను రూపొందించారని వివరించారు. తానా జాయింట్ కార్యదర్శి రవి పొట్లూరి సొంత నిధులతో కప్పట్రాళ్ల గ్రామంలో డిసెంబరు 23న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తారన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఈ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని, అలాగే గ్రామంలోని ప్రతి విద్యార్థికి హైపటైటిస్–బి వ్యాక్సిన్ను వేస్తారన్నారు. డిసెంబరు 24న కప్పట్రాళ్ల జడ్పీ హైస్కూలులో బ్రీడ్స్ సొసైటీ లైబ్రరీని ప్రారంబిస్తామన్నారు. అలాగే జెడ్పీ హైస్కూలులో డిజిటల్ క్లాస్రూములను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పురుగు మందుల పిచికారీ సమయంలో అవసరమైన ప్రొటెక్షన్ కిట్స్ను రైతులకు పంపిణీ చేయన్నుట్లు చెప్పారు. తానా జాయింట్ కార్యదర్శి రవి పొట్లూరితో పాటు తానా అధ్యక్షులు జంపాల చౌదరి, తానా కార్యక్రమాల సమన్వయకర్త ముప్పా రాజశేఖర్ (కర్నూలు), వేమన సతీష్, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి (అమెరికాలో) కోమటి జయరామ్, తానా ఫౌండేషన్ చైర్మెన్ గోగినేని శ్రీనివాస్, ఫౌండేషన్ ట్రస్టీ తాళ్లూరి జయశేఖర్ తదితరులు చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
తెర్నెకల్లో ప్రబలిన అతిసార
తెర్నెకల్(దేవనకొండ) : మండలంలోని తెర్నెకల్ గ్రామంలో శుక్రవారం అతిసార వ్యాధి ప్రబలడంతో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన పెద్దయ్య, కంసలి లక్ష్మి, కళావతి, వెంకటేశ్వరమ్మ, వీరేష్, చాకలి బడేసాబ్తో పాటు మరో 44 మందికి వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరందరూ స్థానిక ఆర్ఎంపీ వద్దనే చికిత్సలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ వైద్యసిబ్బంది గ్రామంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేసి అతిసార వ్యాధిని నియంత్రించాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. -
ఆదిలాబాద్ లో ఆప్టా మెగా వైద్య శిబిరం
అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్టా) అధ్వర్యంలో మహత్మా గాంధీ జయంతి సందర్బంగా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల గిరిజన గ్రామం రాజురా లో అక్టోబర్ నెల 2వ తేదిన ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనుంది. స్థానిక ప్రభుత్వ హైస్కూల్ లో ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయుంత్రం 4 గంటల వరకు ప్రముఖ వైద్యలు తమ సేవలను అందజేస్తారు. స్థానిక డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ కృష్ణం రాజు, డాక్టర్ రామకృష్ణ లతో సహా.. 20 మంది వైద్యులు.. ఇతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొంటారు. అన్ని రకాల వ్యాధులకు వైద్య సేవలు, మందులు ఉచితంగా ఇవ్వనున్నారు. కార్యక్రమంలో భాగంగా ఉచిత భోజన వసతి ఉంటుందని ఆప్టా అధ్యక్షులు గూడపాటి గోపాల కృష్ణ గూడపాటి తెలిపారు. ఈ శిబిరానికి కావాల్సిన ఆఫ్టా మెడికల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ చైర్ డాక్టర్ కొత్తపల్లి కుమార్, వైస్ చైర్ డాక్టర్ రగుతూ సూర్య లు పంపిణీ చేయనున్నారు. ఎన్నారై పన్నెల జనార్ధన్ శిబిరానికి అవసరం అయిన సహాయ సహకారాలు అందిస్తున్నారని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రేఖాశ్యామ్ నాయక్ పాల్గొనున్నారు. -
వైద్యం చేయలేని శిబిరం ఎందుకు
కాకరపర్రు (పెరవలి): గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నా.. వైద్యం సక్రమంగా అందించడం లేదని, దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నాం అంటూ కాకరపర్రు గ్రామస్తులు అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతుంటే వైద్య శిబిరంలో రెండు మందు బిళ్లలు మాత్రమే ఇస్తున్నారని, కనీసం ఇంజెక్షన్ కూడా చేయడం లేదని ధ్వజమెత్తారు. కాకరపర్రు గ్రామంలో జ్వరాల పరిస్థితిని తెలుసుకునేందుకు బుధవారం పెరవలి తహసీల్దార్ వి.జితేంద్ర ఇక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు ఆయన్ను కలిసి ఆవేదన వెళ్లగక్కారు. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నా ఉపయోగం ఉండటం లేదని అన్నారు. గ్రామంలో సగానికి పైగా జ్వరపీడితులు ఉన్నారని, వందలాది మంది మంచాలపై అవస్థలు పడుతున్నారన్నారు. గ్రామంలో సరైన రోడ్లు, డ్రెయిన్లు లేకపోవడంతో దోమలు వృద్ధి చెంది జ్వరాల బారిన పడుతున్నామని వాపోయారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ ప్రజలకు కావాల్సిన సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలని, గ్రామంలో చెత్తాచెదారం తొలగించి దోమల నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే మందుల కోసం ఆర్డీవోతో మాట్లాడతానని, రోగుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచించారు. అనంతరం గ్రామంలో పలువురు రోగులను పరామర్శించారు. బుధవారం కూడా గ్రామంలో సర్వే చేయగా మరో 14 మందికి జ్వరాలు సోకాయని, దీంతో జ్వరపీడితుల సంఖ్య 68కు చేరిందని డాక్టర్ కె.లావణ్య చెప్పారు. -
సమష్టిగా పుష్కర వైద్య సేవలు
డీఎంహెచ్వో డా.నాగమల్లేశ్వరి లబ్బీపేట: లక్షలాది మంది పుష్కరాలకు తరలివచ్చినా ఎలాంటి అవాంతరాలు కలగకుండా వైద్యశాఖ సిబ్బంది అంతా సమష్టిగా పనిచేసి అనారోగ్యానికి గురైన వారికి సేవలు అందించారని ఆ శాఖ నోడల్ ఆఫీసర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ ఆర్ నాగమల్లేశ్వరి అన్నారు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బందితో పాటు, పలు కార్పొరేట్ ఆస్పత్రులు సైతం పుష్కరాల్లో సేవలు అందించాయని అన్నారు. ప్రభుత్వ, ప్రవేటు సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో యాత్రికులకు మంచి సేవలు అందించగలిగాం. 4.11 లక్షల మందికి వైద్య పరీక్షలు పుష్కర ఘాట్లలోని వైద్య శిబిరాల్లో 4,11,283 మంది ఓపీ పరీక్షలు చేయగా, 2672 మందికి ఇన్ పేషెంట్స్గా సేవలు అందించినట్లు ఆమె తెలిపారు. 959 మందిని రిఫరల్ కేసులుగా మెరుగైన వైద్యం కోసం వివిధ ఆస్పత్రిలకు తరలించినట్లు చెప్పారు. -
జర్నలిస్టులందరికీ మెరుగైన వైద్యం
► హెల్త్కార్డుల అమలుకు ప్రత్యేక సీఈవో ► కార్డుల జారీలో ఇబ్బందులు వాస్తవమే.. వాటిని తొలగిస్తాం -- మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ మెరుగైన వైద్యం అందించటమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య, ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. సోమాజీగూడలోని ప్రెస్క్లబ్లో ఆదివారం మ్యాక్స్క్యూర్ హాస్పిటల్స్ వారు జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రెస్క్లబ్ ప్రధాన కార్యదర్శి శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. హెల్త్కార్డులతో ఏర్పడే అవాంతరాలను తొలగిస్తామని, దాని కోసం ప్రత్యేకంగా ఒక సీఈవోను నియమిస్తామని చెప్పారు. ప్రభుత్వం అందించిన హెల్త్కార్డుల్లో ఇబ్బందులున్న మాట వాస్తవమేనని, అయితే నాలుగైదు తప్ప, అన్ని ఆస్పత్రుల్లో హెల్త్కార్డులకు వైద్య పరీక్షలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. మంత్రి అయిన తర్వాత బీపీ పెరిగింది.. సర్కారు దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. పేదలకు సేవ చేసే ఆస్పత్రులపై పోత్సాహకరంగా వార్తలు రాస్తే బాగుంటుందని సూచించారు. మంత్రి కాకముందు తనకు బీపీ, మధుమేహం లేవని, ఇప్పుడు బీపీ వచ్చిందన్నారు. మ్యాక్స్క్యూర్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ అనిల్కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు మ్యాక్స్క్యూర్ ఆస్పత్రుల్లో 20 శాతం డిస్కౌంట్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్క్లబ్ జాయింట్ సెక్రటరీ రమేశ్ వైట్ల, ఈసీ మెంబర్స్ వి.యశోద, ఎ.రాజేశ్, జి.వసంత కుమార్, నరేందర్ జీ పద్మశాలీ, సి.హరి ప్రసాద్, వైద్యులు డాక్టర్ రవికిరణ్, డాక్టర్ పంకజ్, డాక్టర్ సునీల్, డాక్టర్ వకిల్, డాక్టర్ హిమకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పిప్రిలో వైద్యశిబిరం
బజార్హత్నూర్ : మండలంలోని పిప్రి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలల్లో రాపీడ్ ఫీవర్ సర్వేలో భాగంగా సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామంలో 72మందికి, ప్రాథమికోన్నత పాఠశాలలో 19 మంది విద్యార్థులకు వైద్యపరీక్షలు చేశారు. పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ఈవో కైలాస్, సూపర్వైజర్లు దేవిదాస్, సుశీల, హెల్త్అసిస్టెంట్ గాజుల రమేశ్, ఏఎన్ఎం తారసీనా, ఆశ కార్యకర్త లలిత పాల్గొన్నారు. -
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
దేవరకొండ : గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కోరారు. ఆదివారం పట్టణంలోని బాలికల ప్రభుత్వ పాఠశాలలో ఆంకోటెలిగెంట్, నీలగిరి ఫౌండేషన్, యశోద క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. క్యాన్సర్ బాధితులకు ప్రభుత్వం తరుపున సహాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారుపాకుల సురేష్గౌడ్, ఆసిఫ్, పొన్నెబోయిన సైదులు, ముచ్చర్ల ఏడుకొండల్, మధునాయక్, రాజుపేట శ్రీను, కొర్ర రాంసింగ్నాయక్, పీపీఆర్, బాబురాంనాయక్, పాండునాయక్, రేపాల హరి, తేలుకుంట్ల జయశ్రీ, సుజాత స్టీఫెన్, రఘు, విజయ్కాంత్, రాంబాబు, శ్రీకాంత్రెడ్డి తదితరులున్నారు. -
కల్లుకుంటకు జ్వరమొచ్చింది
చిలమత్తూరు : మండలంలోని పలగలపల్లి పంచాయతీ కల్లుకుంట గ్రామ వాసులకు జ్వరాలు చుట్టుముట్టాయి. గ్రామంలో సుమారు వందమంది మంచాలబారిన పడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే వైద్య సిబ్బంది స్పందించి గ్రామంలో మంగళవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలో 240 ఇళ్లల్లో సుమారు 650 మంది జనాభా నివసిస్తున్నారు. పంచాయతీకి ఒక్క బోరు మాత్రమే ఏర్పాటు చేశారు. కాగా ట్యాంక్కు సరఫరా అయ్యే ప్రధాన పైపులైన్ దోబీఘాట్ సమీపంలో పగిలిపోయింది. దీంతో పైప్లైన్లోకి మురుగునీరు చేరి కలుషితం అవుతున్నాయి. ఆ నీటిని తాగడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో జ్వరాలు ప్రబలిన విషయం తెలుసుకున్న సర్పంచ్ జయశంకర్రెడ్డి వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. సీహెచ్ఓ ఫకద్దీన్, ప్రకాష్ స్పందించి గ్రామానికి చేరుకుని వైద్య పరీక్షలు నిర్వహించి మాత్రలు పంపిణీ చేశారు. కాగా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఎక్కడ పడితే అక్కడ మురుగు నీరు నిల్వ ఉండి రోగాలు ప్రబలుతున్నాయని వైద్యులు తెలిపారు. అధికారులు స్పందించి డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని, పైపులైన్ సరిచేసి, దోభీఘాట్లు మంజూరు చేయాలని స్థానికులు గంగులప్ప, డి.నరసింహయ్య, శ్రీనివాసులు, లక్ష్మీపతి, బి.నరసింహయ్య, వీరనారాయణ, క్రిష్టప్ప డిమాండ్ చేశారు. -
వైద్యసేవలపై సబ్కలెక్టర్ ఆరా
దొరవారిసత్రం: ఏకొల్లు ఎస్సీ కాలనీలో కొనసాగుతున్న వైద్యశిబిరం ద్వారా ప్రజలకు అందుతున్న వైద్యసేవలపై సబ్ కలెక్టర్ గిరీషా ఆరా తీశారు. శుక్రవారం ఆయన కాలనీలో పర్యటించి జ్వరంతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పలువురి ఇళ్లను సందర్శించి లార్వా సర్వే చేపట్టారు. రోజూ సురక్షిత నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పాటు పంచాయతీ పాలకులకు సూచించారు. జ్వరాలు పూర్తిగా తగ్గే వరకూ వైద్యశిబిరం కొనసాగించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఒకే వైద్యాధికారి కావడంతో అందరికీ వైద్యసేవలు అందడం లేదని, జ్వరాలు తగ్గుముఖం పట్టే వరకూ మరో వైద్యాధికారిని నియమించాలని స్థానికులు సబ్కలెక్టర్ను కోరారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యురాలు విజేత, తహసీల్దార్ శ్రీనివాసులు, సర్పంచ్లు కష్ణమూర్తి, జాన్ రమేష్ ఉన్నారు. వివాదాస్పద భూమి పరిశీలన నెలబల్లిలో ఇరువర్గాల మధ్య సమస్యగా మారిన ప్రభుత్వ స్థలాన్ని సబ్కలెక్టర్ పరిశీలించారు. అనుమతి లేకుండా దిగకుండా చర్యలు తీసుకోమని స్థానిక రెవెన్యూ అధికారులకు సబ్కలెక్టర్ ఆదేశించారు. -
అభిమానుల రుణం తీర్చుకోలేనిది : నారా రోహిత్
అనంతపురం: అనంతలో సేవా భావం కలిగిన అభిమానులుండడం ఆనందంగా ఉందని, ఇక్కడ ఒక సినిమా చేయాలనుందని సినీ హీరో నారా రోహిత్ అన్నారు. నారా పవర్ ఆఫ్ యూత్ సంస్థ ఆధ్వర్యంలో నారా రోహిత్ ఆదివారం నగరంలో జరిగిన వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. నారాయణ సేవ పేరిట నిత్యం అన్నదానం చేస్తున్న విజయ్సాయికుమార్ సేవలను కొనియాడారు. మునిసిపల్ అతిథి గృహంలో అభిమానులతో సమావేశమై వారితో ముచ్చటించారు. బాలయ్యతో పాటు తన చిత్రాలను ఆదరిస్తున్న నందమూరి అభిమానుల రుణం తీర్చుకోలేనిదన్నారు. తన అభిమానులు చేపట్టిన సేవా కార్యక్రమాలను కొనసాగించాలని, వారికి తన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందన్నారు. లలితకళాపరిషత్తులో జరిగిన వైద్య శిబిరంలో దాదాపు 500 మందికి ఉచిత వైద్య సేవలందించారు. అదేవిధంగా రోహిత్ అభిమాన సంఘం వారు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి, హీరో నారా రోహిత్, నిర్వాహకులు ధనుంజయ నాయుడు బృందాన్ని అభినందించారు. అనంతరం ప్రభుత్వ జనాసుపత్రిలో సాయి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన అన్నదానం, పేద విద్యార్థులకు పుస్తకాల వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత జగన్, మారుతీప్రసాద్ తదితరులతో పాటు నారా రోహిత్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
వణికిస్తున్న చికున్గున్యా...
కొత్తపెంటలో వందమందికి పైగా రోగులు గ్రామంలో ఏర్పాటైన వైద్యశిబిరం మందుల పంపిణీ కొత్తపెంట(బొబ్బిలి రూరల్): మండలంలో కొత్తపెంట గ్రామాన్ని చికున్గున్యా కుదిపేస్తోంది. గ్రామంలో సుమారు 100మందికిపైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. గ్రామంలో సుమారు వారం రోజులుగా ఇక్కడి ప్రజలు జ్వరాలతో సతమతమవుతున్నారు. పెద్దింటి లక్ష్మి, లచ్చుపతుల పైడితల్లి, చోడవరపు ఎల్లమ్మ, సింహాచలం, బోడంగి పార్వతి, గడుతూరి నరసమ్మ, బేతనపల్లి లక్ష్మి, ఎల్.సూరమ్మ తదితరులు జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్నారు. ఇలా ఇంటికి ఇద్దరేసివంతున జ్వరాలబారిన పడి అవస్థలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు బుధవారం వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. 46మందికి వైద్యసేవలు పిరిడి పీహెచ్సీ వైద్యసిబ్బంది డాక్టర్ కె.కె.వి.శోభారాణి ఆధ్వర్యంలో స్థానిక రామమందిరం వద్ద బుధవారం వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. డాక్టర్ మణిమౌనిక, డాక్టర్ షేక్హలా వైద్యసేవలు అందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. బుధవారం ఒక్కరోజే దాదాపు 46మందికి వైద్యసేవలు అందించారు. వైద్యసిబ్బంది గ్రామంలో కలియతిరిగి గ్రామస్థులకు పారిశుద్ధ్యం, నిల్వనీటిపై అవగాహన కల్పించారు. గ్రామసర్పంచ్ బేతనపల్లి బి.జయలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకుడు బేతనపల్లి శ్రీరాములునాయుడు గ్రామంలో కాలువల్లో బ్లీచింగ్ చల్లించి, గ్రామస్తులకు అవగాహన కల్పించి, వైద్యసహాయం అందేలా చర్యలు చేపట్టారు. ఎంపీడీఓ పి.చంద్రయ్య, పంచాయతీ కార్యదర్శి అల్లుభాస్కరరావు సేవలను పర్యవేక్షించారు. -
దత్తత గ్రామంలో ఏకేఖాన్ వైద్యశిబిరం
శంషాబాద్: తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్ దత్తత గ్రామంలో ఆదివారం వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జుకల్ గ్రామంలో కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఖాన్ పుస్తకాలు పంపిణీ చేశారు. దీనిపై జుకల్ గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
మనావత్తండాలో వైద్య శిబిరం
సాక్షి కథనానికి అధికారులు స్పందంచారు. విషజ్వరాలతో వణికి పోతున్న మానావత్ తండాలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, డీఎంహెచ్ వో లు గ్రామానికి స్వయంగా తరలి వచ్చి రోగులకు చికిత్స అందించారు. -
గ్రామంలో వైద్య శిబిరం
కోటపల్లి (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం షట్పల్లి గ్రామంలో ప్రత్యేక వైద్య, ఆరోగ్య శిబిరాన్ని జిల్లా వైద్యులు నిర్వహించారు. శుక్రవారం గ్రామంలో జరిగిన వైద్య శిబిరంలో గ్రామస్తులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని వైద్య అధికారులు ముందస్తుగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. -
విష జ్వరాలతో 50 మందికి అస్వస్థత
శ్రీకాకుళం (కంచిలి) : శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మఖరాంపురం గ్రామంలో శుక్రవారం 50 మంది అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా గ్రామంలో సుమారు 50 మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు. విషయం తెలిసిన ప్రభుత్వ వైద్యాధికారులు శుక్రవారం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రోగులకు చికిత్సనందించి మందులు పంపిణీ చేస్తున్నారు. -
వైద్యశిబిరానికి విశేష స్పందన
సాక్షి, ముంబై : పద్మశాలీ యువక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో దాదాపు 150 మంది పాల్గొని పరీక్షలు చేయించుకున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. నాయిగాం పరిసర ప్రాంతాలకు చెందిన తెలుగువారితోపాటు మరాఠీయులు కూడా ఈ శిబిరంలో పాల్గొన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బి.జి.కానాజి, గౌరవ అతిథిగా డాక్టర్ దంతాల పురుషోత్తం హాజరయ్యారు. ఈ శిబిరానికి హాజరైన వారికి మోకాళ్ల నొప్పుల నివారణ కు వైద్యులు ఈ సందర్భంగా తగు సూచనలు, సలహాలిచ్చారు. పద్మశాలీ యువక సంఘం చైర్మన్ గాడిపెల్లి గణేష్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘ ధర్మకర్తలు ముశం నారాయణ, బుదారపు రాజారాం, బోగా కళావతి, అధ్యక్షుడు కోడిచంద్రమౌళి, ఉపాధ్యక్షులు పొన్న శ్రీనివాస్లు, ప్రధాన కార్యదర్శి కస్తూరి సుధాకర్, కోశాధికారి జిల్లా పురుషోత్తం, కార్యదర్శులు, వైద్య సమితి ఉపాధ్యక్షుడు చిలివేరి మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
పల్లె సేవలో జూనియర్లు
‘ పల్లె ప్రజల ఆరోగ్యం.. జూనియర్ డాక్టర్ల లక్ష్యం’ నినాదంతో రాష్ట్రంలోనే తొలిసారిగా జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో జఫర్గఢ్ మండలంలోని కూనూరులో సోమవారం చలో పల్లె కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరానికి ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం ఆస్పత్రులకు చెందిన 50మంది జూనియర్ వైద్యులు హాజరయ్యారు. - జఫర్గఢ్ -
ఆసరా అందించండి
సంగారెడ్డి అర్బన్: పింఛన్ల పంపిణీ కార్యక్రమం ‘ఆసరా’ను శనివారం అధికారికంగా ప్రారంభించాలని రెవెన్యూ డివిజనల్ అధికారులు, నియోజకవర్గ స్థాయి ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలను జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా శుక్రవారం ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 8న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పింఛన్ల పంపిణీ నిర్వహించాలన్నారు. దీనిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక శాసన సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగేలా చూడాలని సూచించారు. పెన్షన్లు ఇచ్చేందుకు మండల పరిధిలోని గ్రామాల నుంచి తీసుకువచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాలన్నారు. లబ్ధిదారులను క్షేమంగా తిరిగి వారి గ్రామాలకు చేరవేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం యథావిధిగా ఆయా గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని పేర్కొన్నారు. పింఛన్లు అందజేసే చోట వైద్య శిబిరం మంచినీటి సౌకర్యం, తదితర మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్లో మెదక్ డివిజన్ నుంచి జేసీ డా.ఎ.శరత్ , డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, జడ్పీ ఇన్చార్జ్ సీఈవో, డీపీఓ ప్రభాకర్రెడ్డి, ఆర్డీఓలు మధుకర్రెడ్డి, వనజాదేవి, ముత్యంరెడ్డి, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
తుపాను బాధితులకు అపోలో వైద్యసేవలు
అపోలో ఆసుపత్రి జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సంగీతారెడ్డి వెల్లడి విశాఖపట్నం: తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు వైద్యపరంగా ఎంత మేరకైనా సాయమందించడానికి అపోలో ఆస్పత్రి సిద్ధంగా ఉందని ఆస్పత్రి జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ కె.సంగీతారెడ్డి తెలిపారు. ఆదివారం ఇక్కడి అపోలో మెయిన్ ఆస్పత్రి ఆవరణలో బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని, సంచార వైద్య వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తుపాను బాధితుల సహాయార్థం విరాళం అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా కలెక్టర్ను కలిశానని, అయితే వారు విరాళం కంటే విలువైన వైద్య సేవలను బాధితులకు అందించాలని కోరారని తెలిపారు. దీంతో అపోలో ఆస్పత్రి విశాఖ జిల్లాలోని భీమిలి, పెదజాలరిపేట, ఆరిలోవ హెల్త్సిటీ, రాంనగర్ అపోలో ఆస్పత్రి ఆవరణ లో దీపావళి వరకూ వైద్య శిబిరాలను నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. అరకు, చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో గిరిజనులను ఆదుకునేందుకు మూడు సంచార వైద్య బృందాలను సోమవారం నుంచి పంపనున్నామని తెలిపారు. రూ.5 లక్షల విలువైన మందులను కూడా సిద్ధం చేశామన్నారు. -
వీరికేమైంది?
గుమ్మఘట్ట : మండలంలోని గోనబావి గ్రామంలో చిన్నారులు గొంతు వాపు వ్యాధితో పిట్టల్లా రాలిపోతున్నారు. గొంతు కింద వాపు వచ్చి.. తినడానికి, తాగడానికి ఇబ్బందికరంగా మారి, నీర సించిపోయే లక్షణాలతో ఈ నెల మూడో తేదీన ఆరో తరగతి విద్యార్థి గీత (11), పదో తేదీన నాలుగో తరగతి విద్యార్థి కవిత (9) చనిపోయారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్లు. తాజాగా గురువారం లక్ష్మి, వడ్డే ఆంజనేయులు దంపతుల కుమార్తె అక్షయ (4) ప్రాణాలు విడిచింది. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి జబ్బులబారినపడిన వారికి చికిత్సలు చేస్తున్నారు. అయితే మరో 20 మంది విద్యార్థుల్లో పై లక్షణాలు కనిపించడంతో వారిని మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. మృతురాలు అక్షయ కుటుంబంలో ని శ్యామల, అశోక్ కూడా వెళ్లిన వారిలో ఉన్నారు. చిన్నారులు హరికృష్ణ, ఉపేంద్ర, మహేంద్రల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యాధికారి హిమ బిందు తెలిపారు. గ్రామంలో ఒకేసారి ఇంత మంది విద్యార్థులు చికిత్స కోసం వెళ్లడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదేం మాయరోగమో అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. పిల్లల ఉసురు తీసి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్న ఈ వ్యాధిని వెంటనే అరికట్టి.. మరిన్ని ప్రాణాలు పోకుండా చికిత్స అందించాలని ప్రజలు కోరుతున్నారు. డిప్తీరియా వ్యాధేమోనని అనుమానం గ్రామస్తులు భావిస్తున్నట్టుగా గవద బిల్లలు (టాన్సిల్స్)తో అయితే చనిపోరని, ఈ వ్యాధి ఏమిటో అంతు చిక్కడం లేదని సీనియర్ ప్రజా ఆరోగ్యాధికారి వెంకటస్వామి చౌదరి పేర్కొన్నారు. గొంతువాపు లక్షణాలతో బాధపడుతున్న చిన్నారులను పరిశీలించిన ఆయన వెంటనే జిల్లా వైద్యాధికారికి ఫోన్లో సమాచారమందించారు. ఆయన అదేశాల మేరకు సంబంధిత పిల్లలను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డిప్తీరియా వ్యాధి ఏమై నా సోకిందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎస్పీహెచ్ఓ ,ఆరోగ్య బోధకుడు లక్ష్మినారాయణ పర్యటించి వివరాలు సేకరించారు. ఇంటింట వైద్య పరీక్షలు.. గ్రామంలో వైద్యులు హిమబిందు, రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చికిత్సలు నిర్వహిస్తున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, తాగునీరు కలుషితమవడం వల్ల ఇలాంటి వ్యాధులు ప్రబలుతున్నాయని పేర్కొన్నారు. వ్యాధులు అదుపులోకి వచ్చేవరకూ వైద్య శిబిరం కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. దోమల నిర్మూలనకు గంబూషియా చేపలు గోనబావి గ్రామంలో దోమల నిర్మూలనకు మురికి కాలువలు, నీటి కుంటల్లో గంబూషియా చేప పిల్లలను వదిలినట్లు ఎంపీడీఓ జీ మునయ్య చెప్పారు. గురువారం ఈఓఆర్డీ ప్రసాద్తో కలసి గ్రామాన్ని సందర్శించిన ఆయన వ్యాధుల పట్ల ప్రజలకు అ వగాహన కల్పించారు. నీటి శ్యాంపిల్స్ను పరీక్షల కోసం ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి శివకుమార్, వైస్ ఎంపీపీ వడ్డే హనుమక్క, గోనబావి ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. మెదడువాపు వ్యాధితో చిన్నారి మృతి రాయదుర్గం టౌన్: పట్టణంలోని 23వ వార్డులో నివాసముంటున్న చాకలి వన్నూరుస్వామి కుమార్తె శ్రావణి (4) మెదడువాపు వ్యాధితో బుధవారం ఉదయం బళ్లారిలోని విమ్స్లో మృతి చెందింది. ఆలస్యంగా సమాచారం అందడంతో ప్రభుత్వాస్పత్రి వైద్యుడు మన్సూర్, ఆరోగ్య బోధకుడు లక్ష్మినారాయణ, మలేరియా యూనిట్ ఆఫీసర్ లక్ష్మానాయక్, ఇన్చార్జ మునిసిపల్ కమిషనర్ హనుమన్న, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీంద్రయాదవ్ గురువారం మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి వివరాలు సేకరించారు. 18 మంది పిల్లలకు ‘అనంత’లో చికిత్స అనంతపురం మెడికల్ : గొంతు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన గుమ్మఘట్ట మండలం గోనబావికి చెందిన 18 మంది పిల్లలకు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఈఎన్టి వైద్యుడు అనిల్ కుమార్, చిన్న పిల్లల విభాగం వైద్యురాలు మల్లేశ్వరి పర్యవేక్షణలో వారికి చికిత్స కొనసాగుతోంది. 10 నెలల చిన్నారి గవద బిళ్లలతో, 17 మంది పిల్లలు టాన్సిల్స్తో బాధపడుతున్నారని వారు చెప్పారు. వీరిలో సగం మందికి జ్వరం, జలుబు ఉన్నట్లు గుర్తించి చికిత్స అందిస్తున్నామని, టాన్సిల్స్ వల్ల మృతి చెందే అవకాశం లేదని చెప్పారు. -
జహీరాబాద్ చేరిన లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ రైలు
- 6 నుంచి 21వ తేదీ వరకు ఉచిత వైద్య సేవలు - అత్యాధునిక వసతులతో ఆపరేషన్లు జహీరాబాద్ : జిల్లాలో మొదటి సారిగా లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ ద్వారా వైద్య శిబిరం నిర్వహించేందుకు రైల్వే శాఖ తలపెట్టింది. జహీరాబాద్లోని మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారం సహకారంతో లైఫ్లైన్ ఎక్స్ప్రెస్లో సెప్టెంబర్ 6 నుంచి 21వ తేదీ వరకు జహీరాబాద్ రైల్వేస్టేషన్లో మారుమూల గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించనున్నారు. ఇందుకోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐదు ప్రత్యేక రైలు బోగీలు స్థానిక రైల్వే స్టేషన్కు చేరుకున్నాయి. ప్రత్యేక రైలులో అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచారు. జహీరాబాద్లో నిర్వహించేది 155వ ఉచిత వైద్య శిబిరం అవుతుందని రైల్వే శాఖ అధికారులు చెప్పారు. శిబిరంలో ఆర్థోపెడిక్, కంటి, చెవి, పంటి, గ్రహణమొర్రి, మూర్చ రోగాలకు వైద్య సేవలందించనున్నారు. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేస్తామని అధికారులు చెప్పారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా 1991లో రైల్వేశాఖ లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ ద్వారా వైద్య సేవలను ప్రారంభించిందని తెలిపారు. రైళ్ల రాకపోకలు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వీలుగా గూడ్స్ రైళ్లను నిలిపే ప్లాట్ఫాంపై ప్రత్యేక రైలును నిలిపి రోగులకు వైద్య సేవలందించనున్నారు. వైద్య శిబిరం నిర్వహణ ఏర్పాట్లను మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారం ప్రతినిధులు గిల్రాయ్, ప్రదీప్గౌడ్ శనివారం పరిశీలించారు. ఈ శిబిరంలో ఆపరేషన్లు నిర్వహించేందుకు రోగులకు గుర్తించేందుకు ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. 6వ తేదీన వైద్య శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. -
అంక్షాపూర్లో డెంగీ?
నంగునూరు: మండల పరిధిలోని అంక్షాపూర్లో ఓ బాలునికి డెంగీ లక్షణాలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవడంతో గ్రామస్థులు భయాందోళనకు గురుయ్యారు. దీంతో వైద్యాధికారులు ఆదివారం గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన విద్యార్థి బెల్లం సురేశ్ (11)కు జ్వరం రావడంతో కుంటుంబ సభ్యులు రెండు రోజుల కిందట సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. బాలుణ్ని పరీక్షించిన వైద్యులు రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గాయని, డెంగీ వ్యాధి సోకినట్లు అనుమానం వ్యక్తం చేసి హైదరాబాద్కు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. పస్తుతం బాలుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. కాగా గ్రామంలో డెంగీ వ్యాధి వ్యాపించిందని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేయడంతో హుటాహుటిన వైద్య శిబిరం ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. గ్రామంలోని మురుగు కాల్వలు, మంచినీటి ట్యాంకులను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఇదిలా ఉండగా డెంగీ వ్యాపించిందని గ్రామస్థుల ఫిర్యాదు మేరకు జిల్లా మలేరియా నివారణ అధికారి నాగయ్య గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మురుగుకాల్వలు, ఇళ్లల్లో నిల్వ ఉన్న నీటిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామానికి చెందిన బెల్లం సురేశ్ రక్త నమూనాను సేకరించి పరీక్షలకు పంపామన్నారు. గ్రామంలో జ్వరాలు రాలేదని, డెంగీ లక్షణాలు కనబడటం లేదని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామంలో మూడు రోజుల పాటు వైద్య శిబిరం కొనసాగిస్తామన్నారు. మురికి నీరు నిల్వ ఉండ కుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్యసిబ్బంది అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యంపై దృష్టిసారించాలని ఆదేవించారు. కార్యక్రమంలో వైద్యాధికారి సదానందం, అధికారులు కొండయ్య, శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ బొంగోని లక్ష్మి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
వాంతులు, విరేచనాలుతగ్గితే ఒట్టు!
వంగూరు, న్యూస్లైన్: పక్షం రోజులుగా చారకొండ గ్రామస్తులను ముప్పుతిప్ప లు పెడుతున్న వాంతులు, విరేచనాలు ఏ మాత్రం తగ్గడం లేదు. రెండురోజులుగా అతిసార మళ్లీ విజృంభించడంతో స్థానికులకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. వైద్యశిబిరం ఏర్పాటుచేసి చికిత్సలు అందజేసినా వ్యాధి ఎంతమాత్రం అదుపులో కి రావడం లేదు. కడుపుకు తిండిలేక.. ఒంట్లో సత్తువలేక బాధితులు స్థానిక వై ద్యం శిబిరంలో చికిత్స పొందుతున్నారు. పదుల సంఖ్యలో కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి వెళ్తున్నారు. మరికొందరు నేరుగా హైదరాబాద్కు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. శనివారం మరో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీ రిలో రఘు, లక్ష్మణ్, లక్ష్మమ్మ, బుజ్జి, తేజ స్విని, ధోని, నిఖిల్, శివప్రసాద్ ఉన్నారు. వీరు స్థానిక శిబిరంలో వైద్యచికిత్సలు పొందుతున్నారు. ఇదిలాఉండగా, గతరెండు రోజులుగా వ్యాధి బారినపడిన 11 మంది కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రిలో చికి త్స పొందుతున్నారు. ప్రధానంగా చారకొండ పరిసర గ్రామాలైన మర్రిపల్లి, రాంపూర్, తుర్కలపల్లి, శాంతిగూడెం, సిరసనగండ్ల గ్రామాల్లోనే అతిసారవ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. గ్రా మంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరం కొనసాగుతూనే ఉంది. తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోండి: డీఎంహెచ్ఓ ప్రధానంగా తాగునీరు కలుషితం కావ డం వల్లే అతిసారవ్యాధి వ్యాప్తి చెందుతుందని, చారకొండ గ్రామంలోని స్కీం బోర్ల నుంచి గాని, వాటర్ ట్యాంకుల నుంచి గాని నీటిని సరఫరా చేయకుండా నేరుగా ట్యాంకర్ల ద్వారానే ప్రజలకు సరఫరా చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిణి(డీఎంహెచ్ఓ) రుక్మిణమ్మ అ ధికారులకు సూచించారు. శనివారం ఆ మె చారకొండ గ్రామాన్ని సందర్శించి వై ద్యశిబిరంలో చికిత్సపొందుతున్న రోగులను పరీక్షించారు. అనంతరం గ్రామ శి వారులో పైప్లైన్ల లీకేజీలతో ఏర్పడిన మురుగుకాల్వలను పరిశీలించారు. ఆ త రువాత స్థానికులు, బాధితులతో మాట్లాడారు. కలుషితమైన నీటిని తాగడం, ఆ హారలోపాల వల్లే అతిసార ప్రబలుతుం దన్నారు. చారకొండతోపాటు చుట్టుపక్క ల గ్రామాల్లో ఉన్న తాగునీటి బోర్లు, ఫి ల్టర్ వాటర్ప్లాంట్ల నీటి శాంపిల్స్ను ప రీక్షించేందుకు ఆదివారం జిల్లాకేంద్రం నుంచి ప్రత్యేకబృందం వస్తుందని ఆమె వివరించారు. వైద్యులు పట్టించుకోవడంలేదు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గుై రె వైద్య శిబిరం వద్దకు వస్తే ఇక్కడ ఉన్న సిబ్బంది, డాక్టర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అతిసార బాధితులు, గ్రామస్తులు డీఎంహెచ్ఓకు ఫిర్యాదుచేశారు. రెండుమందు గోళీలు ఇచ్చి రెఫర్ టు క ల్వకుర్తి అంటూ 108 ద్వారా కల్వకుర్తి ప్ర భుత్వాసుపత్రికి పంపిస్తున్నారని స్థానికు లు వాపోయారు. దీంతో ఆమె సిబ్బం దిపై అసహనం వ్యక్తంచేశారు. అవసరమైతే మరికొంత మంది సిబ్బందిని ఏ ర్పాటు చేసుకుని ఇక్కడికివచ్చే రోగులకు ఇక్కడే వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. వ్యాధి తీవ్రత ఉంటే తప్ప రె ఫర్ చేయడానికి వీల్లేదని హెచ్చరించారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే తనకు ఫోన్ చేయమని గ్రామస్తులకు సూ చించారు. డీఎంహెచ్ఓను కలిసిన వారి లో చారకొండ సర్పంచ్ శిల్పాదేవీలాల్, గ్రామస్తులు శ్రీనివాస్గౌడ్, వెంకట్రెడ్డి, శ్రీను తదితరులు ఉన్నారు. -
చారకొండ గుండెదడ
వంగూరు, న్యూస్లైన్: ఆ ఊరికి దారులన్నీ బంద్ అయ్యాయి. గతకొన్ని రో జులుగా చుట్టాలు, బంధువులు రావడమే మానేశారు. పుట్టిపెరిగిన ఊరి నీళ్లను తాగడం కాదు.. చూస్తేనే ఆ గ్రామస్తులు హడలిపోతున్నారు. కొందరైతే బంధువుల వద్దకు బాటకడుతున్నారు. కారణమేమంటే అతిసార భయమే..! మండలంలోని చారకొండ వాసులు భయం గుప్పట్లో గడుపుతున్నారు. పదిరోజులుగా గ్రామాన్ని అతలాకుతలం చేస్తున్న అతిసారవ్యాధి మరోసారి తన ప్రతాపం చూపింది. దెబ్బకు చిన్నాపెద్దా అనే తేడాలేకుండా మంచం పడుతున్నారు. శుక్రవారం చారకొండ, సిరసనగండ్ల, మర్రిపల్లి గ్రామాలకు చెందిన దాదాపు మరో 15మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో చిన్నారులే అధికంగా ఉన్నారు. గ్రామంలోనే వైద్యశిబిరం ఏర్పాటుచేసి చికిత్సలు అందజేస్తున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. బాధితులను కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తున్నారు. అక్కడ కొద్దిసేపు ఉంచి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం చారకొండ గ్రామానికి చెందిన సాయిప్రసన్న, శివలీల, మహేష్, నరేష్, ప్రవీణ్, సాయిచందర్, రవి, సిరసనగండ్లకు చెందిన బుచ్చమ్మ, యాదమ్మ, ముత్తయ్య, మర్రిపల్లికి చెందిన ద్రౌపతమ్మ, రాములు, ప్రశాంత్లతోపాటు మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. వీరికి ప్రధానంగా విరేచనాలు అధికమవడంతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా గ్రామంలో పారిశుధ్య పనులు చేయడంతోపాటు వైద్య శిబిరం ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు వైద్యం అందిస్తున్నారు. మరోవైపు ఇంటింటికెళ్లి తాగునీరు, తీసుకునే ఆహారపదార్థాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నప్పటికీ వ్యాధి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కలుషితమే కారణం ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్దాస్ మాట్లాడుతూ.. వ్యాధితీవ్రత అధికమవడంతో తాము చేసేదేమీ లేదని పదిరోజులుగా తీవ్రంగా శ్రమించి వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. గ్రామంలో తాగునీరు కలుషితమవుతుందని, అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే చారకొండతో పాటు సమీపంలో ఉన్న తుర్కలపల్లి, మర్రిపల్లి, మర్రిపల్లి తండా, శాంతిగూడెం, అగ్రహారం తండా, సిరసనగండ్ల గ్రామాల్లోనే వ్యాధితీవ్రత కనిపిస్తోంది. చర్యలు మరిచిన అధికారులు చారకొండ గ్రామాన్ని అతలాకుతలం చేస్తున్న అతిసారవ్యాధిని అరికట్టేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు మొక్కుబడిగా ఉన్నాయని గ్రామస్తులు పెదవివిరుస్తున్నారు. గ్రామంలో తాగునీరు సరఫరా అయ్యే పైప్లైన్ లీకేజీ అయి మురుగునీరు చేరినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. గత 20 రోజుల క్రితం తాగునీటికోసం నూతనంగా పైప్లైన్ వేసేందుకు జేసీబీతో గుంతలు తీసిన సమయంలో పైప్లైన్ పగిలింది. అక్కడ మురుగునీరు చేరి..తాగునీటి పైపులైన్లో కలుస్తోంది. తిరిగి ఆ నీరే గ్రామంలో సరఫరా అవుతోంది. గ్రామంలో ఎక్కడచూసినా అపరిశుభత్ర రాజ్యమేలుతోంది. గ్రామంలో ఏడేళ్లుగా మురికికాల్వలను శుభ్రం చేయడం లేదని స్థానికులు వాపోతుతున్నారు. అయితే గ్రామానికి నీటి సరఫరా చేసే పైప్లైన్ మరమ్మతులు మరిచిన అధికారులు గ్రామంలో అతిసార రావడానికి ఒక వాటర్ప్లాంటే కారణమని చెప్పి చేతులు దులుపుకోవడం సమంజసం కాదని మండిపడుతున్నారు. పైప్లైన్ లీకేజీ విషయాన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో శుక్రవారం స్థానిక పీహెచ్సీ వైద్యులు డాక్టర్ వెంకట్దాస్ నేరుగా అక్కడికి వెళ్లి ఫొటోలు తీసుకుని నేరుగా డీఎంహెచ్ఓకు పంపించారు. ఇదిలాఉండగా, వారం రోజులుగా వాటర్ ట్యాంకుల నుంచి నీటి సరఫరానే నిలిపివేశామని, కేవలం వాటర్ ట్యాంకర్ల ద్వారానే తాగునీటిని సరఫరా చేస్తున్నామని అలాంటప్పుడు ఆ నీరు ఎలా కలుషితమవుతుందని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అతిసార ప్రబలిన నాటినుంచి గ్రామస్తులు ఫిల్టర్చేసిన నీటినే తాగుతున్నారు. అయినప్పటికీ అతిసార ఎందుకు ప్రబలుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. గ్రామాన్ని ఉన్నతాధికారులు సందర్శించి మెరుగైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
వైఎస్సార్ బాటలో ఆయన అభిమానులు
-
వెల్లివిరిసిన సేవాభావం
ఒంగోలు, న్యూస్లైన్ : బాలల దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ వైద్య విభాగం ఆధ్వర్యంలో నగరంలోని కేంద్రీయ విద్యాలయలో గురువారం నిర్వహించిన బాలల వైద్య శిబిరం విజయవంతమైంది. కేంద్రీయ విద్యాలయతో పాటు నగరంలోని పలు ప్రైవేటు పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు వైద్య శిబిరానికి హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేట్ ఆస్పత్రులకు చెందిన 50 మంది వైద్యులు తమ సేవలందించారు. దృష్టి, దంత, వినికిడి తదితర పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఉచితంగా ఔషధాలు అందించారు. వైద్య శిబిరాన్ని వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తొలుత వాయిద్యాలు, పుష్పాలతో బాలినేనికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి, జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బాలలనుద్దేశించి బాలినేని మాట్లాడారు. అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యమని, అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ఇటీవల వరదల తాకిడికి జిల్లాలోని అన్ని ప్రాంతాలూ తీవ్రంగా నష్టపోయాయని, ఊహించని విధంగా అనేక కాలనీలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలో నీట మునిగిన కాలనీల్లోని బాలలు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలన్న సంకల్పంతో వైఎస్సార్సీపీ వైద్య విభాగం బాలల దినోత్సవం రోజు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించడం శుభపరిణామమన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రికాగానే ఆయన డాక్టర్ కనుక ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదల ఆరోగ్యానికి ఎనలేని భరోసా కల్పించారని కొనియాడారు. వైఎస్సార్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తోందని చెప్పారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా బాలల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమంటూ నిర్వాహకులను బాలినేని ప్రోత్సహించారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ నెహ్రూ జయంతి రోజు బాలల కోసం వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే బాలి నేనికి కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ సీహెచ్ ప్రసాదరావు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ సీపీ వైద్య విభాగం జిల్లా కన్వీనర్ డాక్టర్ యాదాల అశోక్బాబు మాట్లాడుతూ ఇప్పటి వరకూ తమ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమా లు నిర్వహించినట్లు చెప్పారు. బాలల వైద్య శిబిరానికి తమ విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ శివభరత్రెడ్డి కూడా హాజరయ్యారంటూ ఆయన్ను బాలల కు పరిచయం చేశారు. వివిధ కార్పొరేట్ వైద్యశాలల్లో పని చేస్తున్న సుమారు 50 మంది వైద్యులు మెడికల్ క్యాంపునకు విచ్చేశారని, బాలలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆశోక్బాబు కోరారు. అనంతరం తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల అవసరార్థం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.దీన్ని బాలినేని ప్రారంభించగా ఒంగోలు రెడ్క్రాస్ సిబ్బంది వచ్చి రక్తాన్ని సేకరించారు. కేంద్రీయ విద్యాలయంలో తన నిధులతో ఏర్పాటు చేసిన అదనపు తరగతి గదులను బాలినేని ప్రారంభించారు. కార్యక్రమంలో మాంటిస్సోరి, కేంద్రీయ విద్యాలయం, కేరళ మో డల్ స్కూల్, అపెక్స్ పాఠశాలల విద్యార్థులతో పాటు వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నరాల రమణారెడ్డి, కొఠారి రామచంద్రరావు, తాటితోటి నరశింగరావు, పార్టీ సంతనూతలపాడు నియోజవకర్గ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, డాక్టర్ వరికూటి అమృతపాణి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, సేవాదళ్ జిల్లా కన్వీనర్ ఆవుల చంద్రశేఖరరెడ్డి, సేవాదళ్ జిల్లా అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు, మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ షేక్ ఖాజా, ట్రేడ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు రమాదేవి, మహిళా విభాగం నగర కన్వీనర్ కావూరి సుశీల, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, నాయకులు సింగరాజు వెంకట్రావు, బడుగు ఇందిర, తోటపల్లి సోమశేఖర్, మీరావలి, ఎస్వీ రమణయ్య, ఏపీటీసీఏ రాష్ట్ర నాయకులు మాంటిస్సోరి ప్రకాశ్బాబు, కేరళ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ పాల్గొన్నారు. -
నేడు బాలల మెగా వైద్యశిబిరం
ఒంగోలు, న్యూస్లైన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో బాలల దినోత్సవమైన గురువారం బాలల మెగా వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ శివభరత్రెడ్డి తెలిపారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యశిబిరాన్ని వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభిస్తారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. శిబిరంలో వైద్యసేవలందించేందుకు 70 మంది వైద్యులు వస్తున్నారు. ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు వీరిలో ఉన్నారు. స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోని కేంద్రీయ విద్యాలయంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శిబిరం ఉంటుంది. దంతవైద్య సేవలు అందించేందుకు నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీ నుంచి, గుంటూరు సీవీఆర్ దంత వైద్యశాల నుంచి రెండు ప్రత్యేక అంబులెన్స్లు కూడా వస్తున్నాయి. కీళ్లు, దంత పరీక్షలతో పాటు, కళ్ల పరీక్ష, చర్మవ్యాధులు, సుగర్, సహజంగా పిల్లల్లో వచ్చే వ్యాధులకు చికిత్స అందించేందుకు పలు విభాగాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అవసరమైన వారికి కళ్లద్దాలు ఇస్తారు. ఉచిత వైద్య శిబిరంతో పాటు రక్తదాన శిబిరం కూడా నిర్వహిస్తున్నారు. చెవి పరీక్షల కోసం అపోలో ఆస్పత్రి నుంచి వైద్యుల బృందం వస్తోంది. వారు వినికిడి శక్తిని పరీక్షించి అవసరమైన వైద్య పరికరాలు పంపిణీ చేస్తారు. ఒకవేళ కాక్లియర్ ఇంప్లాంటేషన్ అవసరమని గుర్తిస్తే దాన్ని హైదరాబాదులో ఉచితంగా చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామని డాక్టర్ శివభరత్రెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ వైద్య విభాగం జిల్లా కన్వీనర్ డాక్టర్ యాదాల అశోక్ మాట్లాడుతూ గురువారం నిర్వహించే వైద్యశిబిరంలో డాక్టర్ శివభరత్రెడ్డి (సన్షైన్ వైద్యశాల కీళ్ల విభాగం వైద్యుడు), డాక్టర్ సుధాకర్రెడ్డి (అపోలో ఆస్పత్రి)తోపాటు ఒంగోలులోని ప్రముఖ వైద్యులు కూడా పాల్గొంటారని, ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు 150 పాఠశాలలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు కూడా సమాచారం అందించామన్నారు. బాలలు ఎక్కువగా ఈ వైద్య శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొందాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ పాల్గొన్నారు. -
జ్వరాలతో నలుగురు మృతి
అనిగండ్లపాడు (పెనుగంచిప్రోలు), న్యూస్లైన్ : వైరల్ జ్వరాలు, చికెన్ గున్యా లక్షణాలతో మండలంలోని అనిగండ్లపాడులో గంటల వ్యవధిలో నలుగురు మృత్యువాతపడ్డారు. గ్రామానికి చెందిన అత్తలూరి కోటేశ్వరరావు (65), దండా రామారావు (70) బుధవారం రాత్రి, కనకపూడి జగన్నాధం (70), నెలకుర్తి సీతారావమ్మ (69) గురువారం మృతిచెందారు. కొన్ని రోజులుగా గ్రామంలో వైరల్, చికెన్ గున్యా లక్షణాలతో జ్వరాలు వ్యాపించాయి. గ్రామంలో ఏ ఇంట్లో చూసినా జ్వరపీడితులు ఇద్దరికి పైగా ఉన్నారు. తీవ్ర శారీరక నొప్పులతో నడవలేని, మంచంలో నుంచి లేవలేని స్థితిలో గ్రామస్తులు అల్లాడుతున్నారు. మృతిచెందిన నలుగురూ కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపారు. వీరంతా వృద్ధులు కాగా, ఒకేసారి నలుగురు మృతిచెందడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే జ్వరపీడితులు, నొప్పులతో బాధపడుతున్నవారు ఆర్ఎంపీల వద్ద వందల సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. మరోపక్క కొందరు ఆర్ఎంపీలు కూడా జ్వరాల బారిన పడటం గమనార్హం. దీంతో జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, మధిర ఆస్పత్రుల్లో అనిగండ్లపాడు వాసులు పెద్ద సంఖ్యలో చికిత్సలు చేయించుకుంటున్నారు. అనిగండ్లపాడు పేరు చెబితేనే భయపడుతున్నారని, గ్రామానికి బయటవారు రావటానికి ఇష్ట పడటం లేదని, వచ్చినా వెంటనే వెళ్లి పోతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు, శివాలయం మాజీ చైర్మన్ నెలకుర్తి సాంబశివరావు తల్లి సీతారావమ్మ మృతదేహాన్ని పార్టీ మండల నేత వూట్ల నాగేశ్వరరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు లగడపాటి మోహనరావు, మండల ఉపాధ్యక్షుడు కురువెళ్ల రాయప్ప, కాంగ్రెస్ నాయకులు పాటిబండ్ల వెంకట్రావు, వాసిరెడ్డి బెనర్జీ, లగడపాటి నాగేశ్వరరావు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. మంచం పట్టిన బలుసుపాడు జగ్గయ్యపేట : మండల పరిధిలోని బలుసుపాడులో విషజ్వరాలు ప్రబలాయి. ఏ ఇంట్లో చూసినా జ్వరపీడితులే కనబడుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, బీసీ కాలనీల్లో జ్వరాలతో మంచం పట్టారు. గ్రామంలో పలు ప్రాంతాలలో మురికివాడల్లో అపరిశుభ్రత నెలకొంది. గ్రామంలో వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా సమైక్యాంధ్ర సమ్మెలో ఉండటంతో జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదు. సోమ, మంగళ, బుధవారాలు మూడురోజుల్లోనే పదుల సంఖ్యలో జ్వరంతో బాధపడుతూ జనం ఆస్పత్రులపాలయ్యారు. అధిక జ్వరంతో పాటు కీళ్లనొప్పులు విపరీతంగా ఉండటంతో మంచానికే పరిమితమవుతున్నారు. ఇంట్లో ఒకరికి జ్వరం వ్యాపిస్తే కుటుంబ సభ్యులందరికీ జ్వరాలు వస్తున్నాయి. గ్రామంలో వైద్యులు లేకపోవడంతో పేట పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే తీవ్ర జ్వరంతో గ్రామంలోని బండ్ల నాగరత్నం, ప్రకాశరావు, అమ్మనబోయిన గోపయ్య, రాజు, కొరివి వెంకమ్మ, మేరుగ వజ్రం, మదారమ్మ, రోశమ్మ, కంబాల మణమ్మ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో పారిశుధ్యం అధ్వానం.. గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. డ్రెయినేజీల పూడిక తీయకపోవడంతో పాటు తాగునీటి కుళాయిల వద్ద అపరిశుభ్రత నెలకొంది. కొన్ని నెలలుగా తాగునీటి ట్యాంకు కూడా శుభ్రం చేయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ అధికారులు పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారు. -
మర్రిపాడులో ప్రబలిన డయేరియా
మర్రిపాడు (సరుబుజ్జిలి), న్యూస్లైన్ : మండలంలోని షళంత్రి పంచాయతీ మర్రిపాడులో డయేరియా ప్రబలింది. రెండు రోజుల నుంచి 11 మంది చిన్నారులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. కొల్ల హాసిని, మజ్జి భరణి, కొమ్ము వివేకానంద, ఇప్పిలి కీర్తన, ఇప్పిలి ధనుష్, కొల్ల రుషేంద్ర, కందుల భార్గవి తదితరులు అతిసారతో బాధపడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. అతిసార బాధితుల్లో 11 నెలల నుంచి ఐదేళ్ల బాలబాలికలు ఉన్నారు. కలుషితమైన బోరు నీరే కారణం గ్రామంలో బోరు నీరు కలుషితం కావడంతో తరచూ వ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామానికి చెందిన కొల్ల శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య లోపంతో పాటు ఏఎన్ఎం హెడ్క్వార్టర్స్లో నివసించకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. అత్యవసర పరిస్థితిలో కూడా సాధారణమాత్రలు అందించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. దీంతో ప్రైవేట్ వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నామని చెప్పారు. పారిశుద్ధ్యం మెరుగు చేయాలని, గ్రామంలో అతిసార బాధితులకు వైద్యసేవలందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లావేటిపాలెంలో వైద్యశిబిరం ఏర్పాటు లావేరు: మండలంలోని లావేటిపాలెం గ్రామంలో శనివారం లావేరు పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. లావేటిపాలెం గ్రామానికి చెందిన భైరి జయప్రకాష్ డెంగీ జ్వరంతో బాధపడుతున్నట్లు ప్రైవేట్ వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ‘లావేటిపాలెంలో బాలునికి డెంగీ’ శీర్షికన శనివారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురిమైంది. దీనికి స్పందించిన లావేరు పీహెచ్సీ వైద్యాధికారిణి భారతీకుమారి దేవి, రణస్థలం క్లస్టర్ ఎస్పీహెచ్వో ఎంపీవీ నాయక్ గ్రామంలో పర్యటించారు. లావేటిపాలెం గ్రామంలో శనివారం వైద్యశిబిరం ఏర్పాటు చేసి 67 మందికి డాక్టర్ భారతీకుమారి దేవి వైద్యసేవలందించారు. ఇంటింటా వెళ్లి జ్వర పీడితుల వివరాలను సేకరించారు. లావేటిపాలెంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంపై రణస్థలం క్లస్టర్ ఎస్పీహెచ్వో ఎంపీవీ నాయక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రణస్థలం క్లస్టర్ సీహెచ్వో రాజగోపాలరావు, హెల్త్ సూపర్వైజర్ రమణమూర్తి, హెచ్వీ హేమకుమారి, హెల్త్ సూపర్వైజర్ పీవీ రమణమూర్తి, ఏఎన్ఎంలు ఆర్.రమణమ్మ, జి.త్రివేణి, ఎస్.భవానీ, సరోజిని, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.