Mental stress
-
చలికాలం.. కాస్త ఎండపడనిద్దాం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చలికాలమని ముసుగుతన్ని ఇంట్లోనే పడుకుని కాలక్షేపం చేద్దామనుకుంటున్నారా? చలికి భయపడి మార్నింగ్ వాక్కు వెళ్లడం మానేశారా? ఇంట్లోంచి నేరుగా ఉదయం 10 తర్వాత కార్యాలయానికి బయలుదేరుతున్నారా? ఉదయం బాగా చలేస్తోందని.. సాయంత్రం వాకింగ్ చేస్తున్నారా? చలి పేరుతో ఇలా చేస్తుంటే వెంటనే మీ అలవాటును మార్చుకోండి. లేదంటే మానసిక ఒత్తిడి తప్పదని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంవో) హోవార్డ్ లీవైన్ చెబుతున్నారు. చలికాలంలో వచ్చే వాతావరణ మార్పులతో మెదడులో కొన్ని రసాయన మార్పులు జరిగి.. శారీరకంగా నీరసంగా ఉన్నామనే భావన వస్తుందని.. ఈ భావనతో బయటకు వెళ్లి ఇతరులను కలవడం కూడా తగ్గిపోతుందని ఆయన పేర్కొంటున్నారు. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తెలిసిన విషయాన్ని మర్చిపోవడం.. కొన్ని పదాలను అసలు పలికేందుకు ఇబ్బంది పడి.. వేరే పదాలను పలకడం వంటివి కూడా చేస్తారని ఆయన అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ ఉదయం 10 గంటలలోపు అరగంట పాటు సూర్యరశ్మిలో ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ సూర్యరశ్మి అందుబాటులో లేని రోజుల్లో ప్రత్యేకంగా కాంతిని ప్రసరింపచేసేందుకు ఉపయోగించే లైట్ బాక్సుల ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చని ఆయన చెబుతున్నారు.ఎస్ఏడీ.. ఎలా వస్తుందంటే..చలికాలంలో కాంతి లేకపోవడం వల్ల మన మానసిక, శారీరక ప్రవర్తనపై ప్రభావం పడుతుంది. దీనిని సీజనల్ అఫెక్టివ్ సిండ్రోమ్ (ఎస్ఏడీ) అని.. వైద్య పరిభాషలో ‘సిర్కాడియల్ రిథమ్స్’ అని అంటారు. ఎస్ఏడీ మన మెదడులోని నిద్రను ప్రేరేపించే హార్మోన్ మెలటోనిన్ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది మానసిక స్థితిని ప్రభావితం చేసే మరో ఎంజైమ్ సెరోటోనిన్ తక్కువ విడుదల కావడానికి దోహదం చేస్తుంది. ఈ రసాయన అసమతుల్యత వల్ల నీరసంగా మారిపోతాం. తద్వారా ఎక్కువగా తినడం.. ప్రధానంగా కార్బొహైడ్రేట్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుని.. ప్రోటీన్ ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం కూడా జరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా ఇతరులతో కలవడంపై దీని ప్రభావం ఉంటుందని అంటున్నారు. దీంతో ఇంటికే పరిమితమై మానసికంగా ఇబ్బంది పడతారని లీవైన్ స్పష్టం చేశారు. ఎస్ఏడీ అనేది కేవలం మానసిక స్థితి మాత్రమే కాదని అంతకుమించి ఏకాగ్రతను కూడా దెబ్బతీస్తుందని ఆయన పేర్కొంటున్నారు. జ్ఞాపకశక్తి వంటి సమస్యలతో పాటు మన పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. ఈ సిండ్రోమ్ మన ఉచ్ఛారణలో సరైన పదాలు పలకలేకపోవడంతో పాటు.. సరైన సమాచారం కూడా సకాలానికి గుర్తుకురాకపోవడం జరుగుతుందని ఆయన చెబుతున్నారు. సూర్యరశ్మి లేదా లైట్ థెరపీసీజనల్గా వచ్చే ఈ సిండ్రోమ్కు సాధారణంగా డోపమైన్ స్థాయిని పెంచే యాంటీ డిప్రెసెంట్స్ మందులను వాడతారు. అయితే, దీనికంటే మంచి మందు ఏమిటంటే.. ప్రతిరోజూ అరగంట పాటు సూర్యుడి ఎండ తగిలేలా ఉండటమేనని హోవార్డ్ లీవైన్ చెబుతున్నారు. అది కూడా ఉదయం 10 గంటలలోపు అరగంటపాటు సూర్యుడి ఎండ తగిలేలా ఉంటే ఈ సిండ్రోమ్ నుంచి బయటపడవచ్చని ఆయన జరిపిన అధ్యయనంలో తేలింది. ఒకవేళ చలికాలంలో వాతావరణ ప్రభావంతో సూర్యరశ్మి లేనిపక్షంలో లైట్ థెరపీని ఆయన సూచిస్తున్నారు. తెల్లని కాంతిని ఉత్పత్తి చేసే లైట్ బాక్సులను కొనుగోలు చేసి ఉపయోగించడమే ఈ లైట్ థెరపీ. ఆన్లైన్లో ఈ లైట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. మీ లైట్ బాక్స్లో 10,000 లక్స్ (‘లక్స్’ అంటే నిర్దేశిత ప్రదేశంలో ఎంతమేర లైట్ పడుతుందని తెలిపేది. దీనిని కాంతి తీవ్రత/కాంతి ప్రకాశం అని పేర్కొంటారు) ఎక్స్పోజర్ ఉండాలి. సాధారణంగా సూర్యుడు బాగా ప్రకాశించే సమయంలో 50 వేల కాంతి ప్రకాశాలు ఉంటాయి. అందులో పదో వంతు కాంతి తీవ్రత ఉండేలా చూసుకుంటే చాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. -
ఒడుపైన ఎత్తు.. ఒత్తిడే చిత్తు
సాక్షి, హైదరాబాద్: ఒకచోట అర్ధరాత్రి ఆత్మల్లా విహారం. మరోచోట ఆమని ఒడిలో చిన్నారుల్లా కేరింతలు. భయపెడుతూ, భయపడుతూ, భయాన్ని అధిగమించే సన్నివేశం ఒకటి. బాల్యంలోకి తీసుకెళ్లి బడి ఒత్తిడిని తగ్గించే కార్యక్రమం మరొకటి. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలైన ఐఐటీల్లో విద్యార్థులకు మానసిక ఒత్తిడి, భయాన్ని తగ్గించేందుకు అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఐఐటీ భువనేశ్వర్లో ఏటా నిర్వహించే హాలోవీన్ నైట్, ఐఐటీ హైదరాబాద్ నిర్వహించే సన్షైన్ కార్యక్రమాలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి.ఐఐటీలో ఆత్మల రాత్రి అర్ధరాత్రి.. ఆత్మ మాదిరిగా వేషధారణ.. అక్కడక్కడ శవపేటికలు.. దెయ్యాల కొంపల్లా భవనాల అలంకరణ.. పుర్రెలతో డెకరేషన్.. మసక మసక చీకటితో కూడిన లైటింగ్.. ఐఐటీ భువనేశ్వర్లో ఏటా అక్టోబర్ చివరలో నిర్వహించే హాలోవీన్ నైట్ కార్యక్రమం దృశ్యాలివి. విద్యార్థులను తీవ్రమైన మానసిక ఒత్తిడి నుంచి బయటపడేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంస్థలో నవంబర్ మూడో వారం నుంచి సెమిస్టర్ పరీక్షలు మొదలవుతాయి. ఈ పరీక్షల కోసం విద్యార్థులు రేయింబవళ్లు కష్టపడుతుంటారు. పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. ల్యాప్టాప్లలో మునిగిపోతారు.ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. కొందరైతే డిప్రెషన్లోకి వెళ్లిపోతుంటారు. ప్రధానంగా మొదటి సంవత్సరం విద్యార్థుల్లో ఈ భయం ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు ఈ ఉన్నత విద్యా సంస్థ ఏటా ఇలా హాలోవీన్ నైట్ (పిశాచాల రాత్రి) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది. విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు ఇందులో సీఎస్టీ (కౌన్సిలింగ్ సర్వీస్ టీం) అనే ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. ఇందులో విద్యార్థులతో పాటు పాఠాలు బోధించే ఫ్రొఫెసర్లు, వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా ఉంటారు.ఐఐటీహెచ్లో మెంటల్ హెల్త్ మంత్రాళ్లపై బోమ్మలు (స్టోన్ పెయింటింగ్).. మట్టితో వివిధ ఆకృతులు (క్లే థెరపీ).. ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్లే స్కూల్లో చిన్నారులు చదువుకునే విధానంలా ఉంది కదా? కానీ, టెక్నాలజీ పరంగా దేశంలోనే అత్యున్న విద్యా సంస్థల్లో ఒకటైన హైదరాబాద్ ఐఐటీలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించేందుకు అవలంభిస్తున్న మార్గాలివి. సన్షైన్ పేరుతో పనిచేస్తున్న ప్రత్యేక విభాగం ఏటా అక్టోబర్లో మెంటల్ హెల్త్ మంత్ నిర్వహిస్తోంది. విద్యార్థులు చదువుల ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మ్యూజిక్ ఆర్ట్ థెరపీ, ఎమోస్నాప్.. హీల్ అవుట్ లౌడ్.. ఇలా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. ఈ సన్షైన్ విభాగంలో స్టూడెంట్ బడ్డీ, మెంటార్స్, కౌన్సిలర్లు, మానసిక వ్యక్తిత్వ నిపుణులు భాగస్వాములుగా ఉంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్నే అబివృద్ధి చేశారు. చాట్బాట్ రూపంలో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒత్తిడిని జయించే మార్గాలను సలహాలను సూచనలు పొందేలా ఏర్పాట్లు చేశారు. ఐఐటీహెచ్లో తొలి నేషనల్ వెల్బీయింగ్ కాంక్లేవ్ హైదరాబాద్ ఐఐటీ వేదికగా తొలి నేషనల్ వెల్బీయింగ్ కాంక్లేవ్ శనివారం ప్రారంభమైంది. దేశంలోని అన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిబుల్ఐటీలు, ఇతర ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఫ్రొఫెసర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. విద్యార్థులు ఒత్తి డిని జయించేందుకు ఆయా విద్యా సంస్థలు అవలంభిస్తున్న మార్గాలను వివరించేందుకు ప్రత్యేకంగా స్టాల్లను ప్రదర్శించారు. ఒత్తిడిని జయించేందుకు ఎంతో ఉపయోగం విద్యార్థులు మానసిక ఒత్తి డితో బాధపడుతు న్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే ఆ విద్యార్థితో స్టూడెంట్ గైడ్ మాట్లాడుతారు. అవస రం మేరకు ఆ విద్యార్థి పరిస్థితిని వ్యక్తిత్వ వికాస నిపుణుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను అధిగమించేలా చేస్తున్నాము. ఇందుకోసం మా విద్యా సంస్థల్లో సీఎస్టీ (కౌన్సిలింగ్ సరీ్వస్ టీం) పనిచేస్తోంది. – మంగిపూడి శ్రావ్య, బీటెక్ మెట్లర్జీ, ఐఐటీ భువనేశ్వర్ -
మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
మీరు.. మీ పిల్లల ఆలోచనలను, వారి నడవడికను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారా? అయితే.. అది మీకు, మీ పిల్లలకి మధ్య భావోద్వేగ అంతరానికి కారణం కావచ్చు. ఈ దూరాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గం మీ పిల్లలతో చాలా మాట్లాడటం. కొన్ని ప్రశ్నలు అడుగుతూండటం చేయాలి. మీరడిగే ప్రతీది వారి మనస్సును మలుచుకోవడంలో సహాయమవుతుంది. భావోద్వేగాలను పంచుకోవడంలో తోడ్పడుతుంది. అలాగే, వారిలో పాతిపెట్టిన విషయాలను చెప్పడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇలా చేసి చూడండి!ప్రతీ తల్లితండ్రులు తమ పిల్లలను అడగాల్సిన ప్రశ్నలివే..1. 'నీవు ఏ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తావు?'.. అనే ఈ ప్రశ్న అడగడంతో.. పిల్లవాడిని ఆలోచించేలా చేస్తాయి. దీంతో మీరు అతని అంతర్గత ఆలోచనలు, సమస్యలను మెరుగైన మార్గంలో ఉంచగలుగుతారు. ఇలాంటి విషయాలను తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్గా అడగడమే ఉత్తమం.2. 'నీకు నచ్చే విషయమేంటి? ఎలా సంతోషంగా ఉంటావ్?'.. ఈ ప్రశ్న అతనికి తన గురించి చెప్పే అవకాశాన్ని ఇస్తుంది. దీంతో తన కోరికలను వ్యక్తం చేయగలడు.3. మీరు మీ పిల్లల్ని తప్పకుండా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే? 'నేను మీతో తక్కువ లేదా ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తోంది?' ఈ విధంగా సూటిగా చూస్తూ అడగడంతో.. వారి కళ్ళ నుంచి మీకు, మీ బిడ్డకు మధ్య ఉన్న సరైన బంధాన్ని అర్థం చేసుకోగలరు.4. పిల్లలు పెరుగుతున్నప్పుడు.. తరచుగా కొన్ని ఆలోచనలలో మునిగిపోతూంటారు. ఆ సమయంలో మీరు వారిని తప్పకుండా అడగాల్సిన విషయం ఇదే.. 'నీ జీవితంలో నీవు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఏదైనా సమస్యా?' అని అడగడంతో వారిలో ఏదైనా ప్రశ్న ఉన్నా భయ సంకోచాన్ని వదిలేస్తారు.5. 'కుటుంబంతో నీవు కలిగి ఉన్న ఉత్తమ జ్ఞాపకం ఏంటి?' ఇలా అడిగితే.. వాళ్లు కుటుంబంతో గడిపిన మంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. పిల్లలు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తారో కూడా మీరు అర్థం చేసుకుంటారు.6. 'ఒత్తిడికి లేదా ఆందోళనకు గురికావడం వంటివి ఏవైనా ఉన్నాయా?' ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే? నేటి జీవనశైలిలో 'మానసిక ఒత్తిడి' పిల్లల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. వారి వ్యక్తిత్వ ఎదుగుదలపై ప్రభావితం చూపుతుంది. ఈ ఒత్తిడిని పెద్దలు నిర్వహించగలరు. కానీ పిల్లలు తరచుగా ఈ సమస్యలలో చిక్కుకుంటున్నారు. దీని పర్యవసానాలు చాలా ప్రమాదకరమైనవి. కనుక వారిని తరచుగా అడగండి.. ఒత్తిడి నుంచి ఎలా బయటపడాల్లో నేర్పించండి.7. 'మీరు నాతో ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారా!' అని అడగడంతోపాటు వారి ఆశను నెరవేర్చాలి. ఎందుకంటే? పిల్లలు తరచుగా ఒంటరిగా ఉంటారు. తల్లిదండ్రులతో కొంత నాణ్యమైన సమయాన్ని గడపాలని లోలోనే తపిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో వారితో కలిసి కొన్ని కొత్త విషయాలను నేర్చుకోవడంలో మంచి అవకాశాన్ని ఇస్తుంది. -
విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించాలి: జయంత్ చల్లా
మానసిక స్థైర్యంతో తమకి ఉన్న ఒత్తిడులను తొలగించుకోవాలని ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆటా వేడుకల్లో భాగంగా 20 రోజుల పాటు నిర్వహించే సేవ కార్యక్రమాల్లో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో అల కుటుంబం, ఆటా సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి ఆల వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ సెమినార్లో మోటివేషనల్ స్పీకర్, RGUKT, బాసర విసి వి.వెంకటరమణతో కలిసి జయంత్ చల్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయంత్ చల్లా మాట్లాడుతూ.. విద్యార్థులకు తల్లిదండ్రులు, అధ్యాపకులు, స్నేహితులు అందరితో ఒత్తిడులు, సవాళ్లు వుంటాయని, వాటిని ఎదుర్కొని నిలబడి విద్యార్థి తమ అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలని అన్నారు. అలాగే వచ్చే భవిష్యత్ అంతా కూడా... విద్యార్థులదేనని అందుకు అనుగుణంగా కష్టపడాలి అన్నారు. మా ఆటా సేవ లక్ష్యాలలో విద్య కూడా వుందని, విద్యార్థులు ఏ సహాయం కోరినా ఆటా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి తమ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ సెమినార్ ను ఏర్పాటు చేసిన ఆటా సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి అల ను అభినందించారు. ఇదే సందర్భంలో మోటివేషనల్ స్పీకర్, RGUKT బాసర విసి వెంకటరమణ విద్యార్థులు తమ భవిష్యత్ ప్రణాళికలు ఎలా సిద్దం చేసుకోవాలి, ఇతర దేశాలకి వెళ్లి సెటిల్ కావడం, చదువుకోవడం లాంటివి ఎలా? అనే విషయాన్ని ప్రతి ఒక్కటి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, కిషోర్ గూడూరు, వనపర్తి పరిధిలో గల 10 కాలేజీల ప్రిన్సిపాల్స్, అధ్యాపక బృందం, 250 మందికి పైగా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: అట్టహాసంగా టీటీఏ మొదటి రోజు మెడికల్ క్యాంపు) -
ఎంబీబీఎస్ సీటు రాక.. బీఏఎంఎస్లో వాట్సాప్లో ఫ్రెండ్కు మెసేజ్ పెట్టి..
వెంగళరావునగర్ (హైదరాబాద్): మానసిక ఒత్తిడి కారణంగా ఓ మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా విఠలాపూర్ గ్రామానికి చెందిన జి.డి మాణిక్యప్ప వ్యవసాయం చేస్తుంటారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జగదీశ్ (23)కు చిన్నప్పటి నుంచి ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలని కోరిక. ఈ క్రమంలో గత ఏడాది నీట్ ఎంట్రన్స్ రాశాడు. ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో ఎర్రగడ్డ ఆయుర్వేద కళాశాలలో బీఏఎంఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు. వెంగళరావునగర్ డివిజన్ జవహర్నగర్లో తన స్నేహితుడు ఫణీంద్రతో కలిసి రూం తీసుకుని ఉంటున్నాడు. బీఏఎంఎస్ చేయడం ఇష్టం లేకపోవడంతో కళాశాలకు కూడా సరిగా వెళ్లలేకపోయాడు. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీ నుంచి బీఏఎంఎస్ పరీక్షలు జరుగుతున్నట్టు నోటీసు వచ్చింది. జగదీశ్ సరిగా కళాశాలకు హాజరు కాలేకపోవడంతో హాల్ టికెట్ పొందేందుకు ఇబ్బంది ఎదుర్కొన్నాడు. తనకు హాల్ టికెట్ ఇవ్వరేమో, పరీక్షలు రాయడానికి వీలుపడదేమో అనుకుని ఒత్తిడికి గురయ్యాడు. ఒకవైపు ఇష్టమైన ఎంబీబీఎస్ సీటు రాకపోవడం, మరోవైపు బీఏఎంఎస్ హాల్ టికెట్ ఇస్తారో లేదో అనే ఆందోళనతో జగదీశ్ మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. ఇదిలాఉండగా బుధవారం ఉదయం 7.30 గంటలకు జగదీశ్ రూంలో ఉంటున్న ఫణీంద్ర తన మరో స్నేహితుడైన రాజ్కుమార్ రూంకు వెళ్లాడు. జగదీశ్ 8.30 గంటల సమయంలో తన స్నేహితుడు అజయ్కు వాట్సాప్ ద్వారా తాను చనిపోతున్నట్టు మెసేజ్ పెట్టాడు. వెంటనే అజయ్ ఆందోళన చెంది ఫోన్ చేయగా, తాను చనిపోతున్నట్టు చెప్పి ఫోన్ కట్ చేశాడు. హుటాహుటిన అజయ్ తన స్నేహితుడు నవీన్కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే నవీన్, ఫణీంద్ర, ప్రశాంత్ కలిసి హుటాహుటిన జవహర్నగర్కు వచ్చి చూడగా గదిలో జగదీశ్ ఉరి వేసుకుని ఉన్నాడు. జగదీశ్ను ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని తండ్రి మాణిక్యప్పకు తెలియజేయడంతో ఆయన హుటాహుటిన మధురానగర్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
కాబోయే వైద్యులకూ కావాలి వైద్యం!
వారంతా స్టెత్పట్టి రోగుల నాడి చూడాల్సిన మెడికోలు... కానీ వారిలో కొందరు మానసిక ఒత్తిళ్లకు చిత్తవుతున్నారు! మనోవేదనను తాళలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు!! గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఈ ధోరణి చోటుచేసుకుంటోంది. రాష్ట్రంలోనూ ఇటీవల కాలంలో పలువురు వైద్య విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. భావిభారత వైద్యులకు ఈ పరిస్థితి ఎందుకు తలెత్తుతోంది? అందుకుగల కారణాలు ఏమిటి? సాక్షి, హైదరాబాద్: జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చేపట్టిన అధ్యయనం ప్రకారం 2010 నుంచి 2019 మ«ధ్య దేశవ్యాప్తంగా 125 వైద్య విద్యార్థులు, 105 మంది రెసిడెంట్ డాక్టర్లు, 128 మంది వైద్యులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బలవన్మరణాలకు పాల్పడిన ప్రతి 10 మందిలో ఏడుగురు 30 ఏళ్లలోపు వారేనని అధ్యయనంలో వెల్లడైంది. అలాగే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలోనే (కేరళ మినహా) ఎక్కువ మంది మెడికోల ఆత్మహత్యలు నమోదయ్యాయని, గత ఐదేళ్లలో 64 మంది ఎంబీబీఎస్, 55 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికోలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఎన్ఎంసీ వెల్లడించింది. ఒత్తిళ్లు.. విభేదాలు.. అనారోగ్యం.. మెడికోల ఆత్మహత్యలను ఎన్ఎంసీ విశ్లేషించగా విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. మెడికోల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగే విభాగాల్లో అనస్తీ షియాలజీ (22.4 శాతం) తొలి స్థానంలో నిలవగా ఆ తర్వాత స్థానంలో ప్రసూతి–గైనకాలజీ (16 శాతం) నిలిచింది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వైద్య విద్యార్థుల్లో (45.2 శాతం), రెసిడెంట్ డాక్టర్లలో (23.1 శాతం) చదువుల ఒత్తిడి కారణమవుతోంది. అలాగే వైద్యుల దాంపత్య జీవితంలో మనస్పర్థలు (26.7 శాతం), మానసిక సమస్యలు (వైద్య విద్యార్థుల్లో 24 శాతం, వైద్యుల్లో 20 శాతం), వేధింపులు (20.5 శాతం) ఆత్మహత్యలకు ఇతర కారణాలుగా నిలిచాయి. ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో 13 శాతం మంది గతంలో మానసిక వైద్య సహాయం కోరడం గమనార్హం. ఆర్టీఐ కార్యకర్త వివేక్ పాండే ఇటీవల అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ అధ్యయన ఫలితాల్ని విడుదల చేసింది. మరోవైపు వైద్యవృత్తిలో ఉన్నవారిలో ఆత్మహత్య ప్రమాదం సాధారణ జనాభా కంటే దాదాపు 2.5 రెట్లు ఎక్కువని ఇండియన్ మెడికల్ అసోసియేషన్–జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ కమిటీ హెడ్ రిమీ డే పేర్కొన్నారు. చదువుకు గుడ్బై చెబుతున్నారు దాదాపు అన్ని మెడికల్ కాలేజీల్లో నియమాలు, రక్షణలు సహాయక వ్యవస్థలు ఉన్నప్పటికీ సక్రమంగా అమలు కావడం లేదని... అందుకే 1,166 మంది విద్యార్థులు వైద్య కళాశాలలకు వీడ్కోలు పలికారని అధ్యయనం తేలి్చంది. వారిలో 160 మంది ఎంబీబీఎస్, 1,006 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న వారు ఉన్నారు. ఎన్ఎంఏ కీలక సూచనలివీ... ♦ వైద్య విద్యార్థులు మాదకద్రవ్యాలు, మద్యం, పొగాకు ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలి. ♦సామాజిక మాధ్యమ పరిధి, ఉపయోగంతో పాటు విచక్షణారహిత వినియోగంతో వచ్చే వృత్తిపరమైన ప్రమాదాల గురించి వైద్య విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ♦ రోగులతో సమర్థంగా కమ్యూనికేట్ చేయడానికి స్థానిక భాషను నేర్చుకోవాలి. ♦ విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి, మానసిక అనారోగ్య సమస్యల గురించి ప్రొఫెసర్లు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ♦ వైద్య విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి అందుబాటులో ఉన్న పరిష్కార ప్రక్రియల గురించి అవగాహన పెంచుకోవాలి. అధ్యయనం జరగాలి... ‘వెలుగులోకి వచ్చేవి, మీడియా లో చర్చకు నోచుకున్నవే కాదు. బయటకు రాని మరికొన్ని ఆ త్మహత్యల ఉదంతాలూ ఉన్నా యి. ప్రైవేటు మెడికల్ కాలేజీ ల్లో నిబంధనల పేరిట విద్యార్థుల్ని విపరీతమైన ఒత్తిడికి లోనుచేస్తున్నారు. ఇక ఆస్పత్రుల్లో 24/7 షిఫ్టులు, కుటుంబానికి దూరంగా ఉండటం, ఆర్థిక కష్టాలు, కొన్ని చోట్ల ర్యాగింగ్, కుల వివక్ష, భవిష్యత్తుపై భయం వంటివి వైద్య విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. దీనిపై సమగ్ర అధ్యయనం జరపాలి. నివారించే దిశగా కార్యాచరణ రూపొందించాలి. – డాక్టర్ బీఎన్ రావు, ఐఎంఏ అధ్యక్షుడు ఒత్తిడి ఉంది... పరీక్షల దశలోనే ఒత్తిడి బా గా ఉంది. ఇంటర్న్స్, పీజీలకు రెగ్యులర్ డ్యూటీల భారం ఉంటోంది. ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కు వమంది రోగులు, తక్కువ మంది వైద్యులు ఉండటం వల్ల నిర్ణీత పనివేళలు ఉండవు. సర్జరీల్లో ఉండే వారికి మరింత ఎక్కువ పనిభారం ఉంటోంది. –డాక్టర్ కౌశిక్ డెర్మా, జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు -
‘ఫోకస్’ తప్పుతోంది
కంచర్ల యాదగిరిరెడ్డి : అర నిమిషం తీరిక లేదు... అర్ధరూపాయి సంపాదన లేదు.. ఈ సామెత వింటుంటే ఈ తరం బడిపిల్లలు గుర్తుకు వస్తున్నారు. ఎప్పుడు చూసినా పుస్తకాల్లో తలమునకలై ఉంటారు. బాగా చదువుతున్నారే అని మురిసిపోయినా.. పరీక్షల్లో వచ్చిన మార్కులు చూస్తే అత్తెసరు. ఈ తరం పిల్లల్లో ఎక్కువ మంది ఫోకస్డ్గా లేకపోవడమే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు. అసలు పెద్దవారి ఏకాగ్రత కూడా బాగా తగ్గిపోతోందని.. స్మార్ట్ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలు, మాధ్యమాల వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్పష్టం చేస్తున్నారు. దృష్టి మళ్లే దారులెన్నో.. మునుపటితో పోలిస్తే పిల్లల దృష్టి మళ్లేందుకు స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, టీవీలు ఇలా ఎన్నో కారణమవుతున్నాయి. నిత్యం ఎవరో ఒకరి నుంచో, ఏదో వాట్సాప్ గ్రూపులోనో మెసేజీలు రావడం, ఫేస్బుక్ నోటిఫికేషన్లు, స్మార్ట్ వాచ్ మెసేజ్.. ఇలా తరచూ మన దృష్టిని తప్పిస్తున్నాయని, దీనివల్ల తదేకంగా ఒక పనిని శ్రద్ధగా చేసే శక్తిని కోల్పోతున్నామని నిపుణులు చెప్తున్నారు. సెల్ఫోన్లు రాకముందు, సాంకేతిక విప్లవం లేనప్పుడు మనుషులు ఎలా ఉన్నారు? ఇప్పుడెలా ఉన్నారన్నదానిపై అమెరికాలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, అండ్ హ్యూమన్ డెవలప్మెంట్’ఇటీవల ఓ అధ్యయనం చేసింది. 1946–1975 మధ్య కాలంలో పుట్టి, రకరకాల రంగాల్లో పనిచేస్తున్న వారిని, 1976–2000 మధ్య పుట్టి పలు రంగాల్లో ఉన్న వారిని, ప్రైమరీ స్కూల్, హైసూ్కల్, కాలేజీ విద్యార్థులను ప్రశ్నించి.. ఐక్యూ టెస్ట్ పెట్టింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో ఈ అధ్యయనం సాగింది. ఏ పనికైనా ఫోకస్ అవసరం! మనం ఏ పనిచేయాలన్నా ఫోకస్ అనేది చాలా అవసరం. లేకుంటే ఏ పని సరిగా, త్వరగా పూర్తి చేయలేం. తరాలు మారుతున్న కొద్దీ ఫోకస్ టైం మారుతూ వస్తోందని అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు బేబీ బూమర్లు అంటే 1946–1964 మధ్య పుట్టినవాళ్లకు ఫోకస్ టైం ఇరవై నిమిషాలు ఉండేది. తర్వాతి తరం జనరేషన్ ఎక్స్ అంటే 1965–1980 మధ్య పుట్టినవారి ఏకాగ్రత 12 నిమిషాలకు చేరింది. 1981, ఆ తర్వాత పుట్టినవారికి ఇది కేవలం ఎనిమిది నుంచి 12 నిమిషాలే.. ఫోకస్ పెట్టలేక పోయినప్పుడు అరగంటలో చేయాలనుకున్న పని గంట, గంటన్నర పడుతుంది. పైగా చేసే పనిలో నాణ్యత ఉండదని.. యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలూ వస్తాయని, మానసిక ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. నాలుగేళ్ల కితం జరిగిన ఒక పరిశోధన ప్రకారం.. ఇంటర్నెట్ వాడకం మన మెదడులోని పలు ప్రాంతాల్లో మార్పులకు కారణమవుతుందని తేలింది. ఇలా మారిపోయే విషయాల్లో మన జ్ఞాపకాలూ ఉన్నాయని వెల్లడైంది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, అండ్ హ్యూమన్ డెవలప్మెంట్’అధ్యయనం ప్రకారం కూడా.. నిద్రకు ఉపక్రమించే ముందు స్మార్ట్ఫోన్ లేదా ఇతర డిజిటల్ స్క్రీన్లను చూడటం వల్ల నిద్రకు చేటు కలుగుతుంది. అది కాస్తా వారి రోజువారీ కార్యక్రమాలపై ప్రభావం చూపుతుంది. వాటితో కేవలం పరధ్యానమే.. కంప్యూటర్ల వాడకంతో మనుషుల మానసిక స్థితిపై కలిగే ప్రభావంపై ఇంకో అధ్యయనం కూడా జరిగింది. ఆ్రస్టేలియాకు చెందిన డాక్టర్ షరోన్ హార్వుడ్ నిర్వహించిన ఆ అధ్యయనం ప్రకారం.. టెక్నాలజీ అనేది మన మేధో సామర్థ్యాన్ని వెంటనే మార్చేస్తుందనడం పూర్తిగా వాస్తవమేమీ కాదు. యుగాలుగా రకరకాల పరిస్థితు లను ఎదుర్కొని పరిణామం చెందిన మెదడు పనితీరు ఒక్క తరంలో మారిపోదని ఆమె చెప్తున్నా రు. కాకపోతే డిజిటల్ పరికరాలు మన మనసును పరధ్యానంలో పడేస్తాయని స్పష్టం చేస్తున్నారు. పక్కన ఉన్నా ప్రభావమే.. మన పరిసరాల్లో స్మార్ట్ఫోన్, ఇతర డిజిటల్ స్క్రీన్ డివైజ్ ఉంటే చాలు మన ఏకాగ్రత స్థాయి గణనీయంగా తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. ఆలోచించడం, గుర్తుంచుకోవడం, భావోద్వేగాల నియంత్రణకు కారణమైన విషయాలపై దృష్టిపెట్టడం వంటివాటిపై స్మార్ట్ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్ల వంటివి ప్రభావం చూపగలవని ఎన్నో అధ్యయనాల్లో తేలిందని స్పష్టం చేస్తున్నారు. చేతుల్లో, లేదా జేబులో, పక్కన టేబుల్పైనో స్మార్ట్ఫోన్ ఉంటే.. మన మనసు చేసే పనిపై కాకుండా ఫోన్కు వచ్చే నోటిఫికేషన్లు లేదా అది చేసే శబ్దాలపై పడుతుందని వెల్లడైందని వివరిస్తున్నారు. క్షణం విడిచి ఉండలేకుండా.. రోజులో గంటా రెండు గంటల పాటు స్మార్ట్ఫోన్ అందుబాటులో లేకపోయినా సరే నానా హైరానా పడే వారి సంఖ్య బాగా పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే పాశ్చాత్యదేశాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని.. మన దేశంలోనూ ఆ పరిస్థితి వస్తోందని హెచ్చరిస్తున్నారు. తక్షణ తృప్తి (ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్) కారణంగానే మనుషులు డిజిటల్ పరికరాలకు బానిసలవుతున్నట్టు వివరిస్తున్నారు. చాలా దేశాల్లో పిల్లలు నిపుణులు సూచించిన దాని కంటే ఎక్కువ సమయం డిజిటల్ తెరల ముందు గడుపుతుండటం ఆందోళనకరమని స్పష్టం చేస్తున్నారు. సమస్యను గుర్తించడం ఎలా? ♦ చేపట్టిన పనిని పూర్తి చేసేందుకు కష్టపడుతుంటే, కష్టం అనిపిస్తుంటే, అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతుంటే ఫోకస్ కోల్పోయామని అర్థం. ♦ అకారణంగా చిరాకు అనిపిస్తున్నా, మన దృష్టి సులువుగా పక్కదారి పడుతున్నా, రెస్ట్లెస్గా అనిపిస్తున్నా.. ఫోకస్ కోల్పోయామని స్పష్టంగా తెలుస్తుంది. ♦ ముఖ్యమైన అంశాలను అప్పటికప్పుడు మర్చిపోతుంటే ఫోకస్ పోతున్నట్టే. ఏమిటి పరిష్కారం? ♦ ఫోకస్ పెంచుకునేందుకు సులువైన మార్గాలెన్నో ఉన్నాయి. మన ఏకాగ్రతను దెబ్బతీస్తున్న మొబైల్ ఫోన్ నోటిఫికేషన్, కంప్యూటర్ నోటిఫికేషన్ వంటివి ఆఫ్ చేయాలి లేదా అత్యవసరమైనవే వచ్చేలా సెట్ చేసుకోవాలి. ♦ ఏ పని ముందు చేయాలి? ఏ పని తరువాత చేయాలి? దేనికి ప్రాధాన్యత ఎక్కువ? దేనిని నిర్ణీత సమయం (డెడ్లైన్)లోపు పూర్తి చేసుకోవాలన్న దానిపై కొంత వర్క్ చేసుకుని ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయడం నేర్చుకుంటే ఫోకస్ పెరుగుతుంది. ♦ ప్రతిరోజు మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలి. అంటే పూర్తిగా చేసే పనిపైనే ధ్యాస నిలిపాలి. ఉదాహరణకు.. ఉదయం లేవగానే బ్రష్ చేసేటప్పుడు ఆ బ్రషింగ్పై మాత్రమే, కాఫీ తాగేటప్పుడు దానిపై మాత్రమే ధ్యాస నిలిపేందుకు ప్రయత్నించాలి. ఇలా అన్ని పనులకూ వర్తింపజేయాలి. దీనిని రోజూ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫోకస్ ఆటోమేటిగ్గా పెరుగుతుంది. –విశేష్ , సైకాలజిస్ట్ ఇంటర్నెట్కు బానిసవుతున్న జనం ప్రపంచవ్యాప్తంగా జనం ఇంటర్నెట్కు బానిసగా మారుతున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. వాటి ప్రకారం.. రోజులో ఒక్కొక్కరూ కనీసం 149 నిమిషాల పాటు స్మార్ట్ఫోన్ను చూస్తూ గడుపుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు రాత్రిళ్లు నిద్రలేచి మరీ సోషల్ మీడియా పోస్టులు చూసుకుంటున్నారు. వీడియో గేమ్స్ ఆడే యువకులు వారంలో వాటిపై గడిపే సమయం 8 గంటలకు పైనే.. అమెరికాలో ట్రాఫిక్ ప్రమాదాల్లో 26శాతం స్మార్ట్ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం వల్లనే జరుగుతున్నాయి! -
జీతం కాదు.. మానసిక ప్రశాంతతే ముఖ్యం
మానవ సమాజానికి కరోనా ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో నేర్పినన పాఠాలు అన్నీ ఇన్నీ కాదు. దాదాపు మూడేళ్ల క్రితం ప్రాణాంతక కోవిడ్ వైరస్ వ్యాప్తిలోకి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు ఏదో ఒక రూపంలో తీవ్రంగా ప్రభావితమైన తీరు తెలిసిందే. మళ్లీ కరోనా కేసుల పెరుగుదల, దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు, వివిధ రకాల ఇన్ఫ్లూయెంజా వైరస్ల వ్యాప్తి నేపథ్యంలో ఒత్తిళ్లకు దూరంగా జీవనం, మానసిక ప్రశాంతత వంటివి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. జీతం కంటే మానసిక ప్రశాంతతకే ఓటు వేస్తున్న ఉద్యోగుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరుగుతోంది. వివిధ దేశాల్లో అధిక శాతం ఉద్యోగులు పని ప్రదేశాల్లో మానసిక ఆరోగ్యం అనేది చాలా కీలకమని అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ సహా పది దేశాల్లోని ఉద్యోగులపై చేసిన ఓ తాజా అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అన్నిట్లోనూ మార్పు దిశగా అడుగులు మనుషులకు సవాళ్లు ఎదురైనప్పుడే వాటిని ఎలా అధిగమించాలనే దానిపై దృష్టి పెడతారు. జీవితం దుర్లభంగా మారుతోందనగానే దానిని ఎదుర్కొని అనుకూలంగా మార్చుకునేందుకు ఏమి చేయాలనే ఆలోచనలు వస్తాయి. పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మార్చుకోవడం, జీవిత ప్రాధామ్యాల్లోనూ మార్పులు, చేర్పులు చేసుకోవడం జరుగుతుంది. ఏది చేస్తే మనసుకు, శరీరానికి స్వాంతన దొరుకుతుందనే దానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మానసిక ప్రశాంతతకే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలనే ట్రెండ్ ఎప్పటికీ ఉంటుందా? అంటే ఇప్పుడే చెప్పలేం. కొంతకాలం మాత్రం తప్పకుండా ఉంటుంది. అందువల్లే చాలామంది ఆరోగ్యం మీద ఫోకస్ పెడుతున్నారు. పని పద్ధతులు, పని సమయాలు, తీసుకునే ఆహారం, ధరించే దుస్తులు.. ఇలా అన్నిటిలోనూ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. మనుషులపై కరోనా పరిస్థితులు తెచ్చిన ప్రభావం మాత్రం రాబోయే 4, 5 ఏళ్ల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ భారత్లో ఇలా.. ►పనిచేసే ప్రదేశాల్లో మానసిక ఆరోగ్య పరిరక్షణే ప్రధానమన్న అధిక శాతం ఉద్యోగులు ► ఒత్తిళ్లకు దూరంగా ప్రశాంతతతో జీవించేందుకు.. అధిక జీతాలొచ్చే ఉద్యోగాలు సైతం వదులుకునేందుకు సిద్ధమని 88% మంది చెప్పారు. ►71 శాతం మంది పని భారం వల్ల తలెత్తే ఒత్తిళ్లు వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ►వ్యక్తిగత సంబంధాలనూ ప్రభావితం చేస్తున్నాయన్న 62% మంది. ►కుటుంబ సభ్యులతో మెరుగైన సంబంధాలు, సంతోషకరమైన జీవితమే ముఖ్యమన్న 46% మంది. ►పని ఒత్తిళ్లతో సాయంత్రాని కల్లా నిస్త్రాణంగా మారుతున్నామని 26% మంది చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే... ► ఇతర దేశాల ఉద్యోగులు సైతం మన దేశంలో మాదిరి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. ►అధిక జీతమొచ్చే ఉద్యోగం కంటే మంచి మానసిక ఆరోగ్యానికి అనువైన ఉద్యోగానికే 81% మంది మొగ్గు చూపారు. ►తమ పనితీరుపై మానసిక ఒత్తిళ్లు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని 78% మంది చెప్పారు. ►తాము చేస్తున్న ఉద్యోగం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోందని 60% మంది పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది ప్రస్తుతం ఉద్యోగులతో పాటు అందరూ మానసిక ఆరోగ్యానికి బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మన జీవితాల్లో కరోనా పరిస్థితులు తెచ్చిన అనిశ్చితి అంతా ఇంతా కాదు. మహమ్మారి ఉధృతంగా ఉన్నప్పటి తీవ్రమైన భయం ఇప్పటికీ కొనసాగుతోంది. దాదాపు అన్నివర్గాల వారు డబ్బు ఆదా చేయడం కంటే మానసిక ప్రశాంతతే ముఖ్యమనే భావనకు వచ్చారు. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండేలా జీవనశైలిని మార్చుకోవాలనే శ్రద్ధ పెరిగింది. గతంలో ఇలాంటి పరిస్థితి అంతగా ఉండేది కాదు. కానీ కరోనాతో చాలా మార్పు వచి్చంది. ప్రతిఒక్కరూ మానసిక ప్రశాంతత కోరుకోవడం ఎక్కువైంది. – డాక్టర్ బి.అపర్ణా రెడ్డి, హెచ్ఆర్ నిపుణురాలు -
జీవితంలో సుడిగుండం.. మానసిక శక్తిని దెబ్బతీసిన కరోనా
‘కరోనాతో రెండేళ్ల పాటు ఇంట్లోనే ఆన్లైన్ క్లాస్లకు అటెండ్ అయ్యాను. అప్పట్లో సరిగా చదువుపై దృష్టి సారించలేదు. ప్రస్తుతం ఆఫ్లైన్ క్లాస్లు నడుస్తున్నాయి. రోజూ కాలేజీకి వెళుతున్నాను. కానీ టీచర్ చెప్పేది అర్థం కావడం లేదు. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తున్నాయి. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు’ – ఓ ఇంటర్ విద్యార్థి ‘ఓ వైపు ఆఫీస్, మరోవైపు ఇల్లు.. ఇలా రెండు చోట్లా సమస్యలు వేధిస్తున్నాయి. ఫలితంగా మానసిక ప్రశాంతత కోల్పోతున్నాను. ఒంటరిగా జీవించాలనే భావన పెరుగుతోంది’ – ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి సాక్షి, అమరావతి: వివిధ మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారు వైద్య శాఖ ఏర్పాటు చేసిన ‘టెలీ మానస్’ కాల్ సెంటర్ను సంప్రదిస్తున్నారు. సమస్యలను వివరంగా తెలుసుకుంటున్న కాల్ సెంటర్లోని కౌన్సిలర్లు బాధితులకు సాంత్వన చేకూరుస్తున్నారు. అవసరం మేరకు దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రిలోని మానసిక వైద్యులకు రిఫర్ చేసి వైద్య సేవలు అందేలా చూస్తున్నారు. కరోనా మహమ్మారి, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ చాలా మందిలో మానసిక శక్తిని దెబ్బతీసింది. దీనికి తోడు వివాహ బంధాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, విద్యా, ఉద్యోగం, అనారోగ్యం ఇతరత్రా కారణాలతో మానసిక సమస్యలతో సతమతమయ్యే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. దేశంలో సుమారు 15 కోట్ల మంది మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని గతేడాది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్(ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) సర్వే వెల్లడించింది. డిప్రెషన్కు లోనై.. రాష్ట్రంలో మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, సలహాలు, సూచనలివ్వడం కోసం గతేడాది అక్టోబర్లో వైద్య శాఖ కాల్ సెంటర్ను ప్రారంభించింది. విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలలో కాల్ సెంటర్ ఉంది. ఈ కాల్ సెంటర్కు ఇప్పటి వరకూ వివిధ సమస్యలతో 2,452 మంది ఫోన్ చేశారు. ప్రస్తుతం రోజుకు సగటున 30 వరకూ కాల్స్ వస్తున్నాయి. కాల్ సెంటర్ను సంప్రదించిన వారిలో ఎక్కువ మందిలో డిప్రెషన్ సమస్య ఉన్నట్టు కౌన్సెలర్లు చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి భయం, లాక్డౌన్ కారణంగా ఎక్కువ రోజులు ఒంటరిగా గడపడం, కుటుంబ సభ్యులు, సన్నిహతులు మృత్యువాత పడటం.. ఆర్థిక ఇబ్బందులు మొదలైనవి డిప్రెషన్కు ముఖ్య కారణాలుగా బాధితులు చెబుతున్నట్టు వెల్లడైంది. కొందరిలో ఈ సమస్య ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నట్టు తెలిసింది. మరికొందరిలో సమస్య తీవ్రమై.. తమ చుట్టూ ఉండే కుర్చీలు, బల్లలు, ఇతర వస్తువులు మాట్లాడుతున్నాయన్న భావన కలుగుతోందని చెబుతున్నారు. ఇంటర్, పదో తరగతి విద్యార్థులు సైతం కాల్ సెంటర్కు ఫోన్ చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న వారే. కరోనా కారణంగా రెండేళ్ల పాటు అకడమిక్ ఇయర్ దెబ్బతింది. దీనికి తోడు, కొందరు తల్లిదండ్రులు పిల్లల అభిరుచులు, సామర్థ్యాలు పట్టించుకోకుండా పదో తరగతి, ఇంటర్లో మంచి మార్కులు రావాలి, ఐఐటీ, నీట్లో ర్యాంక్లు సాధించాలి.. అంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు సైతం మార్కులు, ర్యాంక్ల కోణంలోనే విద్యార్థులను వేధిస్తున్నాయి. ఈ ధోరణుల మధ్య తాము తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నామని కాల్ సెంటర్కు ఫోన్ చేస్తున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక దశలో వైద్యులను సంప్రదించడం ఉత్తమం మానసిక సమస్యలు ఉన్నవారు ప్రాథమిక దశలోనే కౌన్సెలర్లు, వైద్యులను సంప్రదిస్తే మంచిది. అయితే చూసే వాళ్లు ఏమనుకుంటారోనని కౌన్సిలర్లు, వైద్యులను సంప్రదించడానికి విముఖత వ్యక్తం చేస్తుంటారు. అలాంటి వారు 14416 లేదా 180089114416 నంబర్కు కాల్ చేసి మానసికంగా ఉపశమనం పొందుతున్నారు. నచ్చిన పాటలు వినడం, సినిమాలు చూడటం, విహార యాత్రలకు వెళ్లడం వంటి కార్యకలాపాలు చేస్తే మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చు. – ఎ.అనంత్కుమార్, కౌన్సెలర్, సూపర్వైజర్ టెలీ మానస్ కాల్సెంటర్ -
కన్నీళ్లు తెప్పించే ఘటన.. నీవు లేక నేను లేను..
అమలాపురం టౌన్: భార్య మృతిని తట్టుకోలేని భర్త కొద్దిసేపటికే బలవన్మరణానికి పాల్పడ్డాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలోని కొంకాపల్లిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ విషాద ఘటన కలకలం రేపింది. పట్టణ ఇన్చార్జి సీఐ వీరబాబు, స్థానికుల కథనం ప్రకారం.. కొంకాపల్లిలో భార్యాభర్తలు బోనం తులసీలక్ష్మి(45), శ్రీరామ విజయకుమార్(47) ఇంట్లోనే కొద్ది నిమిషాల తేడాలో మృతి చెందారు. ఓఎన్జీసీ సబ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్న విజయకుమార్ ఇటీవల ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. భార్య తులసీలక్ష్మికి మూడు నెలల కిందట మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగి, అనారోగ్యంతో అవస్థలు పడుతోంది. శనివారం రాత్రి ఇద్దరూ ఇంట్లో నిద్రపోయారు. తెల్లవారుజామున తులసీలక్ష్మి బెడ్ రూమ్లో మంచంపై విగతజీవిగా ఉంది. ఆమె మరణాన్ని భర్త విజయకుమార్ తట్టుకోలేకపోయాడు. అప్పటికే ఆర్థిక సమస్యలతో మానసిక ఒత్తిడికి గురవుతున్న అతనికి భార్య మృతి మరింత కుంగదీసింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై తన ఇంటి రెండో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి కుమారుడు కృష్ణ విజయవాడలో ఇంటర్ చదువుతున్నాడు. తల్లిదండ్రుల మరణవార్త తెలియడంతో అతడు విజయవాడ నుంచి హుటాహుటిన వచ్చి.. అమ్మానాన్నల మృతదేహాలపై పడి ఏడ్వడం అందరినీ కలచివేసింది. తులసీలక్ష్మి తండ్రి గోవిందు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరబాబు తెలిపారు. -
ఆఫీస్లో పని ఒత్తిడా..? అయితే ఇలా చేయండి
ఆఫీసుల్లో పని భారం ఎక్కువైనప్పుడు ఒత్తిడికి గురవడం సహజమే. అయితే ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అందుకే దీన్ని తొందరగా తగ్గించుకోవాలి. కొన్ని సాధారణమైన చిట్కాలను పాటిస్తే ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆఫీస్ పనులకు వ్యక్తిగతమైన పనులు కూడా తోడు కావడంతో ఒక్కోసారి ఊపిరి సలపనంత పనులతో అవిశ్రాంతంగా పని చేయవలసి వస్తుంది. దీనివల్ల విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటారు. ఇది మన శరీరంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా పనులను అస్సలు పూర్తిచేయలేము సరికదా.. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేటందుకు కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే సరి. అవేమిటో తెలుసుకుందాం. గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది. ఇది బరువును తగ్గించడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మానసిక ఒత్తిడిని కూడా తొలగిస్తుంది. ఆఫీసులో ఏదైనా కారణం వల్ల మీరు ఒత్తిడికి గురైన ప్పుడు వెంటనే కప్పు గ్రీన్ టీని తాగితే మానసిక స్థితి మెరుగుపడి గందర గోళం తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. సంగీతంతో సాంత్వన సంగీతం మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది. అంతేకాదు ఇది ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. ఒత్తిడిస్థాయులు ఎక్కువైనాయనిపించినప్పుడు వెంటనే మనసుకు నచ్చిన పాటలను వింటే సరి... ఎందుకంటే సంగీతం కోపాన్ని కూడా అదుపు చేస్తుంది. మనసుకు హాయిని కలిగిస్తుంది. దీంతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగే శక్తి వస్తుంది. పజిల్ గేమ్స్ ఆఫీసులో పని ఒత్తిడి పెరిగినప్పుడు విసుగ్గా అనిపిస్తుంది. అందులో పని పూర్తికాకపోతే చిరాకుతోపాటుగా ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. ఇక కొన్ని కారణాల వల్ల పై అధికారి పదిమందిలోనూ మీపై చిరాకు పడినప్పుడు ఒకవిధమైన మానసిక అస్థిరత ఏర్పడుతుంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే చాలా మంది తప్పుడు నిర్ణయాలను తీసుకుంటారు. లేదా మరింత ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడి లేని పోని రోగాలకు దారితీస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి పజిల్ గేమ్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఒత్తిడిగా అనిపిస్తే కాసేపు ఆటలు ఆడండి. ఒత్తిడి కొన్ని సెకన్లలో పోతుంది. ఇష్టమైన వారితో గడపండి కొందరికి సంగీతం అంటే ఆసక్తి ఉండకపోవచ్చు. పజిల్ గేమ్స్ పూర్తి చేయలేకపోవచ్చు. అయితే ఇష్టమైన వాళ్లు అందరికీ ఉంటారు. అటువంటి వాళ్లతో కొద్దిసేపు నవ్వుతూ సరదాగా గడిపితే సరి... మానసిక ఒత్తిడి మటుమాయం అవుతుంది. చివరగా ఒక విషయం ఏమిటంటే... ఒత్తిడిగా అనిపించినప్పుడు ఆ విషయాన్ని ఎవరితో ఒకరితో పంచుకోవాలి. ఆ భారం తీర్చుకునే మార్గం ఆలోచించాలి. లేదంటే ఒత్తిడి మనల్ని ఒత్తేస్తుంది. చదవండి: Green Peas Akki Roti: బియ్యప్పిండి, పచ్చి బఠాణీలతో.. గ్రీన్ పీస్ అక్కీ రోటీ తయారీ -
Kanala hindola: ఆటలకు మానసిక బలం
ఆటల్లో ఒకరు గెలిస్తే మరొకరు ఓడాలి. గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా ఉండగలిగేవారు స్పోర్టివ్ స్పిరిట్ ఉన్నావారు. కాని అందరూ అలా ఉండరు. ఆటల్లో రాణించాలంటే వారిని ఓటమి భయం వెంటాడుతూ ఉంటుంది. ప్రత్యర్థి గురించి ఆందోళనలు ఉంటాయి. చిన్నపిల్లల దగ్గరి నుంచి సీనియర్ ఆటగాళ్ల వరకూ ఈ ఒత్తిడి తప్పించుకోని వారు ఉండరు. మరి వీరికి సాయం? హిందోళ వంటి స్పోర్ట్స్ సైకాలజిస్ట్ను కలవడమే. ‘మైండ్ లీడ్’ అనే ప్రోగ్రామ్ ద్వారా ఆటగాళ్ల ఒత్తిడిని తొలగిస్తూ వారికి అవసరమైన మానసిక బలం అందిస్తోంది హైదరాబాద్ వాసి హిందోళ. ‘స్పోర్ట్స్ సైకాలజీ అనేది ఒకటుంటుందని మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. దాని అవసరం ఏముందిలే అనుకోవచ్చు. కానీ ఈ రంగంలో ఈ సైకాలజీ అవసరం ఎంతో ఉంది’ అంటోంది హైదరాబాద్ మాదాపూర్లో ఉంటున్న హిందోళ. అందుకు డియర్ కామ్రెడ్లోని ఒక సీన్ను ఉదాహరిస్తూ.. ‘లిల్లీ క్రికెటర్గా రాణిస్తున్న అమ్మాయి. రాష్ట్రస్థాయి క్రీడాకారిణి. మంచి నైపుణ్యం ఉన్న అమ్మాయి సడెన్గా డిప్రెషన్ బారిన పడుతుంది. ఎవరికీ అర్థం కాదు. ఎవరూ అర్థం చేసుకోలేరు. క్రికెట్టే లోకంగా బతికిన ఆ అమ్మాయి మూడేళ్లపాటు మానసికంగా ఒంటరైపోతుంది. ఆసుపత్రి పాలైన ఆ అమ్మాయిని హీరో వచ్చి ఆమెను మానసిక వేదన నుంచి బయటికి తీసుకొస్తాడు. అందరి జీవితాల్లోనూ అలాంటి హీరోలు ఉండకపోవచ్చు. కానీ, మానసిక స్థైర్యం ఇవ్వగలిగేవాళ్లు ఉండాలి. ఇటీవల తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి బ్యాడ్మింటన్ చాలా బాగా ఆడేది. సడెన్గా అకాడమీకి రావడం మానేసింది. ఆ స్పోర్ట్స్ అకాడమీకి సైకాలజిస్ట్గా పనిచేస్తున్న నేను ఏమైందని తెలుసుకోవడానికి వారి తల్లిదండ్రులను సంప్రదించాను. తనను కష్టపెడుతున్న సమస్యలు ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకపోయింది. తోటి వారి నుంచి వస్తున్న కామెంట్స్ ఆమెను ఆ ఆట నుంచి తప్పుకునేలా చేశాయి. ఈ విషయంపై కొన్నిరోజుల పాటు చేసిన కౌన్సెలింగ్ ఆమెలో మార్పు తీసుకువచ్చింది. లేదంటే, ఇదే ప్రభావం ఆమె చదువుమీద ఆ తర్వాత తన కెరియర్ మీద పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకు బయటకు చెప్పుకోలేని ఎన్నో సమస్యలు ఉంటాయి. అవి కోచ్ల ద్వారా కావచ్చు, తోటి క్రీడాకారుల ద్వారా కావచ్చు, ఆత్మన్యూనత కావచ్చు, మరేవిధమైన మానసిక సంఘర్షణ అయినా కావచ్చు. ఇలాంటప్పుడు స్పోర్ట్స్ సైకాలజిస్టుల మద్దతు అవసరం అవుతుంది’ అని వివరించింది ఈ మైండ్లీడ్ ఛాంపియన్. అకాడమీలో సైకాలజిస్ట్గా.. తను చేస్తున్న వర్క్స్, ప్రణాళికల గురించి వివరిస్తూ – ‘బెంగళూరులోని పదుకొనే ద్రావిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్’లో పనిచేస్తున్నాను. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అథ్లెట్స్తోనూ మాట్లాడుతుంటాను. దీంతో ఏ స్థాయిలో స్పోర్ట్ సైకాలజీ అవసరం అనేది మరింత క్షుణ్ణంగా అర్ధమవుతుంది. చాలామంది క్రీడలలో మానసిక అంశాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ పక్కన పెట్టేస్తారు. మన దేశంలో అయితే చాలా వరకు దీనిని విస్మరిస్తుంటారు. అందుకే, క్రీడాకారులందరికీ మానసిక శిక్షణను అందుబాటులో ఉంచాలని ఆన్లైన్లో మైండ్లీడ్ ప్రోగ్రామ్ ద్వారా వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాను. బలమైన స్థితి క్రీడలకు మానసిక బలం అవసరమని విదేశీయులకు బాగా తెలుసు. అందుకే వారు ప్రతి పోటీలో స్పోర్ట్స్ సైకాలజిస్ట్ల గైడెన్స్ తప్పక తీసుకుంటారు. మన దేశంలో కూడా దీనిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర ఇంకా రకరకాల భావజాలాలు ఉన్నాయి. అమ్మాయిలను ఓ స్థాయి వరకే క్రీడలకు పరిమితం చేస్తుంటారు. కుటుంబం, బయట, అకాడమీ, స్కూల్, కాలేజీ.. ప్రతిచోటా వెనక్కి లాగడానికే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ విధానంలో మార్పులు తీసుకురావడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాను. దీని ద్వారా అథ్లెట్లు, కోచ్లు, బృందాలు, తల్లిదండ్రులకు, సహాయక సిబ్బందికి వినూత్నమైన విధానంలో మానసిక శిక్షణతో పాటు కౌన్సెలింగ్ ఇస్తున్నాను. రాహుల్ ద్రావిడ్తో... ఈ భిన్నమైన కోర్సును ఎంచుకున్నప్పుడు మా అమ్మ మాలతి, నాన్న సుధాకర్ల మద్దతుగా నిలిచారు. వారి వల్లే ఈ రంగంలో మరింతగా కృషి చేయగలుగుతున్నాను. ఈ మైండ్ లీడ్ ప్రోగ్రామ్ ద్వారా స్కూల్స్ కాలేజీలలో వర్క్షాప్స్ నిర్వహించబోతున్నాను. గ్రామీణ స్థాయి క్రీడాకారులలోనూ మానసిక చైతన్యం నింపే దిశగా కృషి చేస్తున్నాను’ అని వివరించింది ఈ యువ స్పోర్ట్స్ సైకాలజిస్ట్. ఆటలు పరిచిన బాట ‘చిన్నప్పటి నుంచి నాకు ఆటల్లో ఆసక్తి ఎక్కువ. బహుశా కేంద్రీయ విద్యాలయంలో చదవడం, అక్కడ అన్ని ఆటల్లో పోటీపడటం వల్ల క్రీడలు నా జీవితంలో కీలకమయ్యాయి. నా దృష్టి ఎక్కువగా బ్యాడ్మింటన్పై ఉండేది. అదే నన్ను ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్కి పరిచయం చేసింది. ఈ రంగంలో కొత్త కొత్త వ్యక్తులను కలిశాను. గెలుపు కోసం ప్రయత్నించేవారితో కలిసి ఉండటం వల్ల ప్రతిరోజూ నన్ను నేను కొత్తగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఇందులో ఉండే చేదు అనుభవాలు, పంచుకున్నవారి వేదనలు.. ఇవన్నీ నా కెరియర్ని డిసైడ్ చేసుకునేలా చేశాయి. అందుకే, స్కూల్ చదువు పూర్తవగానే స్పోర్ట్స్ సైకాలజీ దిశగా అడుగులు వేశాను. దీనికోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాలజీ అండ్ రీసెర్చ్ నుండి సైకాలజీ, జర్నలిజం అండ్ ఉమన్ స్టడీస్లో డిగ్రీ చేశాను. ఆ తర్వాత స్పోర్ట్స్ సైకాలజీలో మాస్టర్స్ చేయడానికి మణిపూర్ వెళ్లాను. ఇక్కడే క్రీడలలో మైండ్ఫుల్నెస్పై ప్రయోగాత్మక పరిశోధన చేశాను. భారతదేశంలోని అథ్లెట్ల కోసం సొంతంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించాను.’ కె.హిందోళ, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ – నిర్మలారెడ్డి -
Health Tips: ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారా? అయితే...
Health Tips In Telugu: సంతోషకరమైన జీవితం ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి లేని జీవన శైలిని అలవరుచుకోవాలి. దీనిపై పెద్దవాళ్లు, అనుభవజ్ఞులు, ఆయుర్వేద వైద్యనిపుణులు స్పష్టమైన ఆరోగ్యసూత్రాలను ఎప్పుడో చెప్పారు. వాటిని పాటించడం వల్ల మానసిక దృఢత్వం కలుగుతుంది. ఉండవలసిన దినచర్య ►యోగా చేయడం ►ఏడెనిమిది గంటలకు తగ్గకుండా మంచి నిద్ర ►తొందరగా నిద్ర లేవడం ►జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్, డాన్సింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్సైజ్లు చేయడం. ►తోటివారితో కరుణతో వ్యవహరించడం, పెద్దలు, ఇతరుల పట్ల గౌరవం కలిగి ఉండడం. ►దినచర్య, రుతుచర్య పాటించడం, దయతో వ్యవహరించడం. ►పరోపకార గుణం కలిగి ఉండడం. ►ఆధ్యాత్మిక భావాలు ఉంటే పూజ చేసుకోవడం, పవిత్ర గ్రంథాలు పఠించడం ►కుటుంబంతో ఉల్లాసంగా గడపడం. ►రీడింగ్, సింగింగ్, గార్డెనింగ్, పేయింటింగ్, మ్యూజిక్ వినడం వంటి అలవాట్లతో ఒత్తిడిని దూరం చేసుకోవడం. ►అనవసర జోక్యాలు లేకుండా మనసును నియంత్రించడం చేయకూడనివి ►ఆలస్యంగా నిద్ర పోవడం, ఆలస్యంగా లేవడం, అసలు నిద్ర పోకుండా ఉండడం ►పగటి నిద్ర పోవడం ►శారీరక శ్రమ, వ్యాయామం లేకుండా అధికంగా కూర్చుని ఉండే జీవన సరళి కలిగి ఉండడం ►అధికంగా ఒత్తిడి కలిగి ఉండడం ►కామం, క్రోధం, లోభం వంటివాటిపై నియంత్రణ లేకపోవడం ►సామాజిక నిబంధనలు, నైతిక విలువలు పాటించక, అసహజ ప్రవర్తన కలిగి ఉండడం ►అతిగా ఆలోచించడం, ఏవో పాత సంఘటనలని తలచుకుని నిరంతరం బాధపడుతుండడం, ఆందోళన పడటం ►నిరంతరం టీవీ, మొబైల్ చూడటం.. దీనివల్ల సెన్స్ ఆర్గాన్స్పై ఒత్తిడి ►కోపం, భావోద్వేగాలపై నియంత్రణ లేకపోవడం ►అతిగా భయం, కామం వంటి వాటికి లోనయ్యే చర్యలకు పాల్పడడం చదవండి: Diet For Mental Health: మానసిక దృఢత్వం కోసం.. ముడి పెసలు, ఉసిరి.. ఇంకా! ఇవి మాత్రం మానేయాలి! Health Tips: కాలీఫ్లవర్, క్యారెట్లు, బీట్రూట్, పుట్టగొడుగులు అతిగా తింటే అంతే సంగతులు! కాస్త.. -
Stress Management: వర్క్ ఫ్రమ్ హోమ్లో ఒత్తిడిని ఇలా దూరం చేయండి..
కరోనా మూలంగా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇంటి నుంచి పని చేయడం చాలా సులువుగా ఉంటుంది అనుకుంటారు. ఇంట్లోంచి పనిచేస్తే ఆఫీసు/ కాలేజీ/ బడికి వెళ్లే ప్రయాణ సమయం కొంత మిగిలినట్లే కనిపించినా, రానురానూ దానివల్ల ఇబ్బందులు తప్పించి, అంతగా ప్రయోజనాలు లేకపోయినా, థర్డ్ వేవ్ మూలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ను కొనసాగిస్తున్నట్లు సాఫ్ట్వేర్ సంస్థల ఉద్యోగులకు ఉత్తర్వులు అందాయి. దాంతో తిరిగి ఇంటినుంచి పనిని కొనసాగించక తప్పడం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసే వారు ఒత్తిడికి, అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వారం చూద్దాం... ఆఫీసులో ఉంటే ఉండే వాతావరణం వేరు. ఇంటిలో ఉండి పని చేస్తే ఉండే వాతావరణ వేరు. ఎందుకంటే, చాలామందికి ఇంటినుంచి పని చేయడానికి కావలసిన సాధన సంపత్తి అందుబాటులో ఉండదు. చిన్న చిన్న గదులు గలవారికి మరీ ఇబ్బంది. ప్రశాంతంగా వుండే ప్రత్యేకమైన గది, చుట్టుపక్కలవారు పని చేస్తుంటే వారితో కలిసి పని చేయడం, ఏమైనా సందేహాలు వస్తే సీనియర్లను, లేదంటే విషయ పరిజ్ఞానం కల కొలీగ్స్ను అడిగి తెలుసుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేయడం సులువు. అయితే ఇంటిలో ఉండి పని చేసేటప్పుడు అందరికీ తగిన వసతులు ఉండకపోవచ్చు. ముఖ్యంగా సరైన ఎత్తులో వుండే మేజా బల్ల, కుర్చీ, దానికి వీపు ఆన్చడానికి వీలుగా వుండే వాలు, చేతులు మోపడానికి ఆర్మ్ రెస్ట్ వంటివి ఇంటిలో అందుబాటులో ఉండవు. ►చాలామంది ఒళ్లో లాప్ టాప్ పెట్టుకుని మంచం మీదో, సోఫాలోనో ఒరిగిపోయి లేదా వాలిపోయి రోజంతా వేళ్లను టప టపలాడిస్తూ అదేపనిగా పని చేస్తూ ఉండడం వల్ల రకరకాల జబ్బుల బారిన పడుతున్నారు. నాలుగైదు గంటలు గడిచేసరికి విపరీతమైన వీపు నొప్పి, మెడనొప్పి, మౌస్ ఎక్కువగా వాడే వారికి మణికట్టు నొప్పులతోబాధ పడినట్లు ఇటీవల జరిగిన ఒక సర్వేలో తెలియ వచ్చింది. చదవండి: Beauty Tips: కళ్ల చుట్టూ ఏర్పడ్డ నల్లటి వలయాలు తగ్గాలంటే... ► గ్రాఫిక్స్ మీద పనిచేసేవారు తీక్షణంగా రెప్ప వాల్చకుండా దృష్టి మరల్చకుండా స్క్రీన్ కేసి అదేపనిగా చూడటం వల్ల కళ్లు లాగేసి తలనొప్పి వస్తోంది. బయటికి కదలకుండా ఇంట్లోనే కూర్చోడం మూలంగా డీ విటమిన్ లోపాలు తలెత్తే అవకాశం మెండుగా వుంది. కాబట్టి ఇంట్లోంచి పని చేసినా ఆఫీసు కి వెళుతున్నట్లే ఒక నిత్యకృత్యంలా నిబద్ధతతో ఆఫీస్/ చదువు టైం ప్రకారం ముగించి, కాసేపు దుకాణం కట్టేసి, వీలుంటే డాబా మీదో, వరండాలోనో, పెరట్లోనో కాసేపు అటూ ఇటూ తిరిగి గాలిపోసుకోవడం వల్ల రిఫ్రెష్మెంట్తోపాటు కంటికి, ఒంటికి కొంత మేలు. ►ఆఫీస్లో అయితే పొద్దున 10 నుంచి సాయంత్రం 5 లేదా 6 వరకు అనే టైమింగ్స్ ఉంటాయి. ఇంటినుంచి పని చేసేవారు అలాంటి నిబంధన పెట్టుకోకుండా వీలు కుదిరినప్పుడు మొదలు పెట్టి, అది పూర్తి అయ్యే వరకు దానితోనే కుస్తీలు పడుతుంటారు. అయితే అలాకాకుండా ఆఫీస్లో ఉండి పని చేస్తున్నట్లే ఇంటి దగ్గర కూడా మనకు మనమే టైమింగ్స్ సెట్ చేసుకోవాలి. అదే ఆఫీస్ వాళ్లకు మనం చెప్పాలి. ఈ సమయంలో నేను అందుబాటులో ఉంటాను. తర్వాత ఉండనని సంకేతాలు ఇవ్వాలి. లేదా వారితో ముందుగానే సూటిగా చెప్పాలి. అప్పుడే ఈ సమస్య నుంచి బయటపడగలరు. చదవండి: ఒక ఊరికథ..మంచిపని ఊరకే పోలేదు...ఎన్నో ఊళ్లకు స్ఫూర్తి ఇచ్చింది ఆఫీసు వాతావరణం ఎలా? ఇంటినుండి పనిచేసేటపుడు ఒక ప్రత్యేకమైన గదిలో ఆఫీసు లో కూర్చున్నట్లు కూర్చొని పని చేసుకోడం మంచిది. ఆ సమయంలో ఇంట్లో వారితో మాట్లాడటం లేదా కొన్ని ఇంటి పనులు చేయడం పెట్టుకోవద్దు. సాధారణంగా కొంత మంది ఇంటిపని ఆఫీసు పని కలిపి అక్కడో కాలు ఇక్కడో కాలు అన్నట్లుగా చేస్తూ ఉంటారు. అప్పుడు ఆందోళన ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఆడవాళ్లు వంటచేసుకోవడం, పిల్లలను చూసుకోవడం, ఆఫీసు పని చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ఆందోళన పెరుగుతుంది. అలాంటప్పుడు పిల్లలను చూసుకోవడానికి, వంట చేయడానికి వేరేవారి సహాయం తీసుకోవడం కొంత మెరుగు. ఇంటి నుంచి పని చేయడం వల్ల ఉబకాయమే కాకుండా ఇతర సమస్యలు వస్తున్నాయి. వాటితో పాటుగా నడుం నొప్పి , మెడనొప్పి వంటి సమస్యలు చాలా మందిలో సాధారణం. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఈ నొప్పి తగ్గే అవకాశం ఉంది. నిద్ర పోయేటప్పుడు తల కింద ఎల్తైన దిండు పెట్టుకోకుండా మెత్తటి క్లాత్ను మడిచి దిండులా వాడటం వల్ల మెడ నొప్పి రాకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు నడుము నొప్పి తగ్గాలంటే మకరాసనం, శలభాసనం, మర్కటాసనం, భుజంగాసనం వేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. చదవండి: Shanta Balu: పూనా పవార్.. వయసు 86.. అయినా తగ్గేదేలే.. ధైర్యంగా.. ఒత్తిడినుంచి ఇలా తప్పుకోవచ్చు ►అదేపనిగా పని చేస్తూ ఉండకుండా రోజూ సాయంత్రం కాసేపు నడవటం, ►పిల్లతో ఆడుకోవడం, పెద్దలతో మనసు విప్పి మాట్లాడటం, ►తల్లి/భార్యకు ఇంటి పనుల్లో సాయం చేయడం, ►కూరగాయలు/పండ్ల మార్కెట్కు వెళ్లడం ►కొత్త వంటలను వండేందుకు ప్రయత్నించడం ►టెర్రస్ గార్డెన్ లేదా బాల్కనీ గార్డెనింగ్ చేయడం, ►ఫ్రెండ్స్, బంధువులతో అప్పుడప్పుడు వీడియో కాల్స్ మాట్లాడుకోవడం ►క్యారమ్స్, షటిల్ వంటి ఆటలను ఆడటం వల్ల కాస్త రిలాక్సింగ్గా ఉంటుంది. ►స్క్రీన్ మీద పని చేసేటప్పుడు 20–20 20 చిట్కా పాటించడం మంచిది. -
పని ఒత్తిడితో చిర్రెత్తి ఉన్నారా!.....అయితే ఈ వీడియో చూడండి చాలు
న్యూఢిల్లీ: పని ఒత్తిడితో సతమవుతు ఉన్నారా.! పైగా అస్సలు సంతోషంగా ఉండే అవకాశం కూడా లేదని బాధపడిపోతూ కూర్చొకండి. ఇదే సరైన సమయం ఈ వీడియో చూడగానే మీ ఒత్తిడి దూరం అవుతుంది. ఒక్కసారి మీ ముఖంలో చిరునవ్వు తప్పక తొంగి చూస్తుంది. అసలు ఏం ఉందబ్బా ఈ వీడియోలో అని సందేహంతో ఉన్నారా!. (చదవండి: ఉబర్ డ్రైవర్ని వరించిన రూ. 75 లక్షల లాటరీ) అసలు విషయంలోకెళ్లితే...అందమైన పసుపు రంగు బాతులు ముద్దు ముద్దుగా ఎలా ఆడుకుంటున్నాయో చూడండి. ఎంతో అద్భుతంగా చూడ ముచ్చటగా ఉంది. అంతేకాదు ఒక్కసారిగా ఒత్తిడి మరిచిపోయి ఆనందంగా మైమరచి చూస్తాం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వుతోంది. దీంతో నెటిజన్లు ఇది ప్రకృతి అందం కదా అంటూ రకరకాలుగా ట్వీట్చేశారు. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: సంవత్సరాల తేడాతో ఒకే నెల ఒకే తేదిలో జన్మించినన ముగ్గురు అక్కాచెల్లెళ్లు) -
Health Tips: ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదా? చెర్రీ, తేనె, అరటి, వేడిపాలు.. తింటే..
ప్రస్తుత జీవన శైలి వల్ల చివరికి నిద్ర కూడా కరువైపోతుంది. ఉరుకుల పరుగుల పనులు, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ వినియోగం, మితిమీరిన ఒత్తిడి.. కారణమేదైనా ఎంతో మంది నిద్రలేమితో సతమతమౌతున్నారు. కేవలం శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా తగినంత నిద్ర అవసరం అంటున్నారు నిపుణులు. చర్మం ముడతలు పడటం, జుట్టు రాలిపోవడం ఇవన్నీ నిద్రలేమితో సంభవించేవే. సరైన నిద్ర లేకపోతే ఆరోగ్యంపై కూడా అనేక దుష్ఫభావాలు పడే అవకాశం ఉంది. మరి ఎలా ? ఎంత ప్రయత్నించినా నిద్రపట్టట్లేదని వాపోతున్నారా? రాత్రి పడుకునే ముందు ఈ ఆహారాలు తీసుకుంటే వెంటనే నిద్రపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. వేడి పాలు మన పేరెంట్స్ నిద్రపోతే ముందు గ్లాస్ వేడిపాలు తాగడానికి ఇస్తారు. ఎందుకో తెలుసా? రోజు ముగింపు సమయంలో వేడిపాలు తాగితే వెంటనే నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడులోని మెలటోనిన్, సెరటోనిన్ లను ప్రభావితం చేసి నిద్రవచ్చేలా ప్రేరేపిస్తుంది. సెరోటోనిన్ మానసిక స్థితిని స్థిరీకరించడానికి, క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. చదవండి: డ్రీమ్ హౌస్ షిఫ్టింగ్.. సముద్రంపై పడవలతో గమ్యానికి చేర్చి..! సీమ చేమంతి టీ సీమ చేమంతి టీ నరాలపై ఎలా ఉపశమనం కలిగిస్తుంది, నిద్రను ప్రేరేపించడంలో ఎలా సహాయపడుతుందనే విషయాల గురించి కంప్లీట్ బుక్ ఆఫ్ ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీస్ వివరంగా తెలుపుతుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ నిండుగా ఉంటాయి. ముఖ్యంగా సీమ చేమంతి టీ ఆందోళనను తగ్గించి, ప్రశాంతమైన నిద్రపట్టేలా చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండు అరటిపండ్లలో సహజంగానే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. ఇది నిద్ర మత్తును కలిగించడానికి సహాయపడుతుంది. అరటిలోని ప్రీబయోటిక్స్ నిద్ర వచ్చేలా చేస్తుందని కొలొరడో బౌల్డర్ యూనివర్సిటీ తాజా అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాకుండా పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడుంది. చెర్రీ పండ్లు పీనియల్ గ్రంథి మెలటోనిన్ అనే హార్మోన్ను విడుదల చేసేలా చెర్రీ పండ్లు ప్రేరేపిస్తాయి. ఈ హార్మోన్ మనసును ప్రశాతంగా ఉంచి నిద్ర వచ్చేలా చేస్తుంది. 'ది కంప్లీట్ బుక్ ఆఫ్ హోమ్ రెమెడీస్' పుస్తకం ప్రకారం.. రోజుకు 10-12 చెర్రీ పండ్లు తింటే మానసిక అలసట, ఒత్తిడి దూరం చేసి హాయిగా నిద్రవచ్చేలా చేస్తుంది. తేనె తేనెలోని సహజ చక్కెరలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచి, మెలటోనిన్, ట్రిప్టోఫాన్లు మెదడులో విడుదల్యేలా ప్రేరేపిస్తుంది. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్లడానికి సహాయపడుతుంది. తేనె సెరటోనిన్ను మెలటోనిన్గా మార్చి సుదీర్ఘ సమయం నిద్రపోయేలా చేస్తుందని శుఖ్థా హాస్పిటల్కు చెందిన డా. మనోజ్ కె అహుజ సూచించారు. చదవండి: ఢిల్లీలో హఠాత్తుగా పెరిగిన వాయుకాలుష్యం.. కారణం అదే! -
ప్రాణాలు పోతున్నా... ఏమీ చేయలేకపోతున్నాం
రేయింబవళ్లు నిద్రాహారాలు మానుకొని పని పని పని.. మండు వేసవిలో శరీరాన్ని పీపీఈ కిట్లతో బంధించి కోవిడ్ రోగులకు చికిత్స అందివ్వాలి. కళ్లముందే ప్రాణాలు పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. సెకండ్ వేవ్ వచ్చేసరికి భారత్లో వైద్యులు శారీరకంగా అలసిపోతున్నారు. మానసికంగా ఆందోళనకు లోనవుతున్నారు. కన్నీరు కారుస్తూ ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలంటూ వేడుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైద్యులు పెడుతున్న పోస్టులు, వీడియోలు వైరల్గా మారుతున్నాయి. అవేంటో చూద్దాం.. సూపర్ హీరోలం అనుకోవద్దు మేము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. బాధతో హృదయం ముక్కలవుతోంది. 34 ఏళ్ల యువకుడు వెంటిలేటర్ మీద చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. పరిస్థితి మా చేతులు కూడా దాటేస్తోంది. అందుకే అందరూ మాస్కు తప్పనిసరిగా వేసుకోండి. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోండి – డాక్టర్ తృప్తి గిలాడా, ముంబై నా ఫోన్ రింగ్ ఆగడం లేదు ప్రతీ అయిదు నిముషాలకు ఒకసారి నా ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. ఆసపత్రిలో బెడ్స్ కోసం పేషెంట్లు నిరంతరం కాంటాక్ట్ చేస్తూనే ఉంటారు. వారు దీనంగా బెడ్ కోసం అడుగుతూ ఉంటే ఏం చెయ్యాలో తెలీడం లేదు. ముంబైలో బెడ్స్ ఖాళీ లేవు. అందుకే ఆస్పత్రి అవసరం రాకుండా ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ పింటో, ముంబై ముందు జాగ్రత్తలు లేవు కరోనా ఫస్ట్ వేవ్కి, సెకండ్వేవ్కి మధ్య కొంత సమయం దొరికింది. అయినా ప్రభుత్వాలు, ప్రజలు కూడా సన్నద్ధతపై దృష్టి పెట్టలేదు. ఢిల్లీ కూడా మరో మహారాష్ట్రలా మారడానికి ఎన్నో రోజులు పట్టదు. ప్రభుత్వాల అలసత్వం, ప్రజల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి వచ్చింది. కళ్ల ముందే కోవిడ్ రోగులు ఊపిరాడక మరణిస్తూ ఉంటే తట్టుకోవడం కష్టంగా ఉంది – డాక్టర్ రేష్మా తివారి బసు, గుర్గావ్ ప్రాణాలు పోతున్నా... ఏమీ చేయలేకపోతున్నాం నా కెరీర్ మొత్తంలో ఇలాంటి దుస్థితి చూడలేదు. కళ్ల ముందే ఆక్సిజన్ లేక రోగులు ప్రాణాలొదిలేస్తుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోతున్నాం. మేమూ మనుషులమే మాకూ భావోద్వేగాలుంటాయి. శారీరకంగా, మానసికంగా అలిసిపోతున్నాం. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్.. అందరూ మాస్కులు వేసుకోండి. – డాక్టర్ దీప్శిఖ ఘోష్, ముంబై అందరం కలిసి నిరసనకు దిగుదాం దేశవ్యాప్తంగా భారీ జనసందోహం హాజరవుతున్న సమావేశాలకు వ్యతిరేకంగా మనందం నిరసనకు దిగుదాం. డాక్టర్లు, నర్సుల అసోసియన్లు అందరూ కలిసి రండి. మన దేశంలో ఆరోగ్య వ్యవస్థ కుప్ప కూలిపోతోంది. కేసులు సునామీలా ముంచేస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎవరి చేతుల్లోనూ ఏమీ ఉండదు. – డాక్టర్ పారల్ ఎం శర్మ, ఢిల్లీ -
పిల్లల్లోనూ మానసిక ఒత్తిడి!
సాక్షి, హైదరాబాద్: పన్నెండేళ్ల శివాని గతంలో హోంవర్క్ అయ్యాక.. ఇంటి పనిలో సాయపడేది. లాక్డౌన్ తరువాత అస్సలు సాయం చేయడం లేదు. చిన్న పని చెప్పినా చికాకుపడుతోంది. పదహారేళ్ల శివ లాక్డౌన్కు ముందు చలాకీగా ఉండేవాడు. సాయంకాలం వారి హోటల్లో పనులు చక్కబెట్టేవాడు. లాక్డౌన్ కారణంగా బాగా బరువు పెరిగి లావయ్యాడు. చీటికీ మాటికీ చికాకుపడుతున్నాడు. ఇదీ..ప్రస్తుతం విద్యార్థుల మానసిక పరిస్థితి. లాక్డౌన్ సమస్త మానవాళి జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. లాక్డౌన్ సమయంలో ఇంటి నుంచి కాలు బయట పెడితే.. కరోనా కాటు వేస్తుందన్న భయంతో అంతా ఇంటికే పరిమితమయ్యాం. లాక్డౌన్ ఆంక్షలు సడలించాక కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదవుతుండటంతో ఇప్పుడు కూడా పిల్లల్ని బయటికి పంపే పరిస్థితి లేదు. దీంతో వారు ఆంక్షల మధ్య జీవిస్తూ ఒత్తిడికి గురవుతున్నారు. మునుపటిలా స్నేహితులను కలవలేకపోవడం, కలిసి ఆడుకోలేకపోవడం వల్ల చికాకుపడుతున్నారు. అందుకే, చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్నారు. పిల్లల్లో ఈ ఆకస్మిక ప్రవర్తన చూసి తల్లిదండ్రులు విస్మయపోతున్నా.. లాక్డౌన్ కావడంతో చేసేదిలేక సర్దుకుపోతున్నారు. వాస్తవానికి పిల్లల్లో కనిపిస్తోన్న ఈ విపరీత ధోరణికి కారణం వారికి తగినంత శారీరక శ్రమ లేకపోవడమే. వాస్తవానికి ప్రతిరోజూ పిల్లలు ఇంటి వద్ద లేదా బడిలో ఎంతోకొంత సమయం ఆడుకునేవారు. ఆటల వల్ల శరీరంలో ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్ లాంటి పలు హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి శరీరాన్ని ఒత్తిడి నుంచి దూరంగా ఉంచి, మానసిక ప్రశాంతత చేకూరుస్తాయి. అంతేకాదు, ఆటల వల్ల శరీరం అలసి మంచి నిద్ర కూడా వస్తుంది. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకపోవడంతో విద్యార్థుల లైఫ్స్టైల్ పూర్తిగా మారిపోయింది. శారీరక శ్రమ అస్సల్లేదు. ఎప్పుడు పడుకుంటున్నారో.. ఎప్పుడు లేస్తున్నారో.. ఎప్పుడు తింటున్నారో.. వారికే తెలియడం లేదు. వేళాపాళా లేని జీవనశైలి వల్ల చిన్న విషయాలకే ఒత్తిడికి గురవుతున్నారు. 24 గంటలు ఇంటికే పరిమితమవడంతో బరువు కూడా పెరిగి లావవుతున్నారు. చికాకు పెరిగితే చిక్కులే లాక్డౌన్ పరిస్థితులను పిల్లలు అర్థం చేసుకుం టున్నారు కాబట్టి. పిల్లల్లో ఈ చికాకు అప్పుడప్పుడు మాత్రమే బయటపడుతోందని ప్రముఖ సైకాలజిస్టు వీరేందర్ అంటున్నారు. దేశంలో అధిక శాతం పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబాలే. వీరిలో చాలామందివి సింగిల్ బెడ్రూమ్ ఇళ్లే. లాక్డౌన్లో బయటికి వెళితే.. ప్రాణాల మీదకు వస్తుందన్న భయంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి అనుమతించడం లేదు. పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కానీ, అప్పుడప్పుడు వచ్చే కోపాన్ని, చికాకును నియంత్రించుకోలేక ఇలా బయట పడుతున్నారని వివరిస్తున్నారు. తల్లిదండ్రులు ఇలాంటి ఘటనలను పెద్దగా పట్టించుకోకుండా.. వారి పరిస్థితిని అర్థం చేసుకుని, అనునయించే యత్నం చేయాలని హితవు పలుకుతున్నారు. లేకపోతే ఇవే పెద్ద గొడవలుగా మారి, బంధాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. –వీరేందర్, సైకాలజిస్టు ఏం జరుగుతోంది..? ► మార్చి 22 నుంచి అంటే దాదాపుగా 105 రోజులుగా విద్యార్థులంతా ఇంట్లోనే ఉంటున్నారు. ► టీవీలు, ఇంటర్నెట్, సెల్ఫోన్తో కాలక్షేపం చేస్తున్నారు. ► ఆటపాటలు లేకపోవడంతో శరీరానికి వ్యాయామం దూరమైంది. పలువురు పిల్లలు తమ శరీర బరువులో మార్పు రావడాన్ని స్వయంగా గ్రహిస్తున్నారు. ► ఒత్తిడిని అధిగమించే హార్మోన్లు సరిగా విడుదల కాకపోవడంతో కోపం, చికాకు తెచ్చుకుంటున్నారు. ► ఇంకొందరు తల్లిదండ్రులతో వాదనలకు దిగుతూ నానా హంగామా చేస్తున్నారు. ఏం చేయాలి? ► ఇంట్లో పిల్లలకు యోగాసనాలు, ప్రాణాయామం నేర్పించాలి. ► ప్రతిరోజూ పిల్లలతో కనీసం 45 నిమిషాలపాటు చిన్న చిన్న వర్కవుట్లు చేయించాలి. ► రోజూ తింటున్న కేలరీలకు, ఖర్చు చేస్తున్న కేలరీల మధ్య వ్యత్యాసం ఎక్కువైతే శరీర బరువు పెరిగిపోతుందన్న విషయం వివరించాలి. ► వర్క్ ఫ్రం హోం చేసే తల్లిదండ్రులు తమ పిల్లలకు కథలు వినిపించడం, రాయమని ప్రోత్సహించడం చేయాలి. ► లాక్డౌన్, కరోనా వైరస్ తదనంతర పరిస్థితులపై వారి భయాల్ని పోగొట్టాలి. ► ఆన్లైన్ క్లాసులు ముగిసిన వెంటనే చదువు అంటూ పదేపదే పోరుపెట్టకూడదు. ► ఒకవేళ పిల్లలు సబ్జెక్టు అర్థం కాలేదని చికాకు పడుతుంటే.. ఆ విషయాలను వారితో చర్చించి స్కూలు ఉపాధ్యాయులతో మాట్లాడించండి. -
ఒత్తిడిని తగ్గించుకోవడానికి అద్భుత చిట్కా!
పెద్దింటివాడికైనా, పేదింటివాడికైనా మానసిక ఒత్తిడి ప్రశాంతత లేకుండా చేస్తుంది. దీన్ని ప్రారంభంలోనే గుర్తించి చికిత్స తీసుకోవడమో, నివారించడమో చేయకపోతే ఘోరమైన దుష్ప్రభావాలు చవిచూడక మానదు. అందుకు నిలువెత్తు ఉదాహరణ బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య. అతని చిరునవ్వు కోట్లాదిమంది మనసుల్లో అలజడి రేపే ఆయుధం. అతనికి ఎన్ని కష్టాలున్నాయో, ఎన్ని బాధల సుడిగుండాల్లో చిక్కుకున్నాడో.. కానీ వాటన్నంటినీ గుండెల్లోనే దాస్తూ చిరునవ్వు చెరగనిచ్చేవాడు కాదు. కానీ కాలం కరుగుతున్న కొద్దీ అతనిపై మానసిక ఒత్తిడి పై చేయి అవుతూ వచ్చింది. అంతిమంగా అతను చావుకు తలొంచుతూ అందరికీ శాశ్వత వీడ్కోలు పలికాడు. (అవును... త్వరగా వెళ్లిపోయావ్ సుశాంత్..) నిజంగానే మానసిక ఒత్తిడిని మనం జయించలేమా? అది మనల్ని పొట్టన పెట్టుకునే వరకూ చూస్తూ ఉండాలా? దీనికి ఓ ప్రొఫెసర్ వీడియోతో సమాధానం చెప్పారు. ఆయన ఓ గాజు గ్లాసులో నీళ్లు తీసుకుని విద్యార్థుల ఎదుట నిలబడ్డారు. ఇప్పుడు అది ఎంత బరువుందని అడగ్గా... విద్యార్థులు రకరకాల సమాధానాలిచ్చారు. దీనికి ఆ ప్రొఫెసర్ బదులిస్తూ.. ‘ఇక్కడ గ్లాసు బరువు అనేది ప్రామాణికం కాదు. దాన్ని ఎంతసేపు పట్టుకుంటున్నామనేది ముఖ్యం. ఓ నిమిషం దాన్ని అలాగే చేతులతో పట్టుకుని ఉంటే ఏమీ అవదు. గంటసేపు పట్టుకుంటే నా చేయి నొప్పి పెడుతుంది. ఇక రోజంతా పట్టుకునే ఉంటే నా చేయి మొద్దుబారిపోయి చచ్చుబడిపోతుంది. (‘ఆత్మహత్య చేసుకోవాలనిపించేది’ ) కానీ వీటన్నింటికి గ్లాసు బరువు కారణం కాదు. దాన్ని ఎంతసేపు పట్టుకున్నామనేదే ముఖ్యం. అలాగే జీవితంలోని ఒత్తిడి కూడా అంతే. అది కూడా నీళ్ల గ్లాసు వంటిదే. కాసేపు వాటి కోసం ఆలోచిస్తే ఏమీ కాదు. కానీ కొంచెం ఎక్కువసేపు ఆలోచించారనుకో అది మిమ్మల్ని బాధిస్తుంది. అదే రోజంతా ఆలోచిస్తూనే ఉన్నారనుకో.. మీరు మొద్దుబారిపోతారు. ఏ పనీ సరిగా చేయలేరు. కాబట్టి చేయాల్సిందొక్కటే గ్లాసు పక్కన పెట్టేసినట్లు వాటి కోసం ఆలోచించడం వదిలేయండి’ అని సెలవిచ్చారు. ఈ వీడియోను టాలీవుడ్ దర్శకుడు దేవా కట్ట ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతోమంది తప్పకుండా అనుసరించాల్సిన మార్గమిది. -
ఈ రోజు నా గడువు తీరిందని లేఖలో ..
భద్రాద్రి కొత్తగూడెం,కూసుమంచి: కుటుంబసభ్యులు సుమారు మూడేళ్ల క్రితం కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఒంటరిగా మిగిలిన యువకుడు వారులేని లోటును భరించలేక బతుకు సాగించలేక తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని జీళ్లచెరువు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. జీళ్లచెరువు గ్రామానికి చెందిన షేక్ లాల్సాహెబ్ (29) తల్లిదండ్రులతో పాటు అతని అన్న, వదిన, పిల్లలు 2017లో పాలేరులోని మినీ హైడల్ ప్రాజెక్టు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పటి నుంచి లాల్సాహెబ్ ఒంటరిగా ఉంటున్నాడు. స్నేహితులతో గడుపుతూ కాలం వెళ్లదీస్తున్నాడు కన్నవారు, తోడబుట్టిన వారు దూరం కావటాన్ని జీర్ణించుకోలేక పలు మార్లు ఆత్మహత్యకు యత్నించాడు. చివరకు గ్రామ శివారులోని ఓ వెంచర్లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు లాల్సాహెబ్ మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. బుధవా రం రాత్రే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. నా టైమ్ తీరింది.. ఆత్మహత్యకు పాల్పడ్డ లాల్సాహెబ్ జేబులో ఒక లేఖను పోలీసులు గుర్తించారు. ఆ లేఖలో తాను ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో తన డ్రస్సింగ్ టేబుల్ వద్ద మరో లేఖ ఉందని, దాన్ని చదవాలని రాసిఉంది. డ్రస్సింగ్ టేబుల్ వద్ద మరో లేఖ లభ్యంకాగా అందులో తనవారందరూ తనకు దూరమయ్యారని, అప్పటి నుంచి సంతోషంగా బతకలేకపోతున్నాని, తాను ఎప్పటి నుంచో చనిపోవాలని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. ప్రతి వస్తువుకు గడువుతేదీ ఉన్నట్లు తనకు ఈ రోజు గడువు తీరిందని, తన స్నేహితులు తనను నమ్మి అప్పులు ఇచ్చారని, తన ఇల్లు, మిగిలిఉన్న కొంత భూమి అప్పులు అమ్మి తీర్చాలని అధికారులను, గ్రామపెద్దలను కోరాడు. లేఖలో రూ.14 లక్షల 80వేల అప్పులు ఉన్నట్లు, ఎవరికి ఎంత ఇవ్వాలో పేర్లతో రాసి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు అంత్యక్రియలు పూర్తిచేశారు. కాగా మృతుడు అవివాహితుడు. -
తెల్ల జుట్టుకు బై చెప్పచ్చు
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం మనం తరచూ చూస్తూంటాం. విపరీతమైన ఒత్తిడి దీనికి కారణమన్న విషయమూ మనకు తెలుసు. అయితే కారణమేమిటన్నది మాత్రం నిన్న మొన్నటివరకూ ఎవరికీ తెలియదు. ఈ లోటును పూరించారు హార్వర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఒత్తిడికి, జుట్టు నెరుపుకూ మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది తెలుసుకునేందుకు తాము విస్తృత స్థాయిలో పరిశోధనలు చేపట్టామని హార్వర్డ్ శాస్త్రవేత్త యా ఛీ హూ తెలిపారు. వృద్ధాప్య లక్షణాలు వేగంగా చోటు చేసుకునేందుకు ఒత్తిడి కారణమవుతుందని, అందువల్లనే జుట్టు తెల్లబడుతోందని ఇప్పటివరకూ అనుకునేవారు. కానీ పరిశోధనల్లో మాత్రం భిన్నమైన ఫలితాలు కనిపించాయి. ఒత్తిడి ఎక్కువైనా వెంట్రుకల కుదుళ్లలో నల్లటి రంగును ఉత్పత్తి చేసే కణాలు తక్కువేమీ కాలేదు. అలాగే.. కార్టిసాల్ అనే హార్మోన్కూ వెంట్రుకల నెరుపుకూ సంబంధం లేదని స్పష్టమైంది. వెంట్రుకల కుదుళ్లలో ఉండే కొన్ని రకాల మూలకణాలు ఒత్తిడి ఎక్కువయినప్పుడు అతిగా స్పందిస్తున్నట్లు ఎలుకలపై జరిగిన పరిశోధనల ద్వారా తెలిసిందని, ఈ క్రమంలో ఆ మూలకణాల సంఖ్య తగ్గిపోవడం వల్ల నల్లటి రంగును ఉత్పత్తి చేసే కణాలూ తగ్గిపోతున్నట్లు తెలిసిందని హూ తెలిపారు. ఇంకోలా చెప్పాలంటే సాధారణ స్థితిలో నల్లటి రంగును ఉత్పత్తి చేసే కణాలుగా మారే మూలకణాలు ఒత్తిడి సమయంలో అతిగా స్పందించడం వల్ల జుట్టు నెరుస్తోందన్నమాట! అంతా బాగుందికానీ.. ఒత్తిడి సమయాల్లో మన శారీరక వ్యవస్థలోని సింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ విడుదల చేసే నోరీపైనిఫ్రైన్ అనే రసాయనం మూలకణాలను చైతన్యవంతం చేస్తోందని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. వెంట్రుకలు తెల్లబడకుండా కొత్త మందులు కనుక్కునేందుకు ఈ పరిశోధన ఉపకరిస్తుందని అంచనా. -
వేర్వేరు అవయవాలపై ఒత్తిడి ప్రభావం అధిమించండి
మీరు బాగా ఒత్తిడిలో ఉన్నారా? ఆ విషయం మీ శరీరం ద్వారానూ మీకు స్పష్టంగా తెలుస్తోందా? ఎందుకంటే దాని ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. మానసిక ఒత్తిడి తీవ్రమైనప్పుడు కొందరిలో తలనొప్పి రావచ్చు. మరికొందరిలో ఛాతీ బరువుగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఇలా తల మొదలుకొని, పాదాల వరకు రకరకాల అవయవాల్లోని ఇబ్బందులు రకరకాల రూపాల్లో వ్యక్తమవుతాయి. మానసిక ఒత్తిడి మీలోని ఏ అవయవాన్ని ఎలా ప్రభావితం చేసి, ఏయే లక్షణాలను కనబరుస్తోందో... దాన్ని బట్టి ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఏం చేయాలో తెలుసుకోండి. ఇవి చాలా తేలికైనవి. అనుసరించి చూడండి. రిలాక్స్ అవ్వండి. తల, మెడ భాగాల్లో కొందరిలో ఒత్తిడి వల్ల తల గట్టిగా పట్టేసినట్లుగా అనిపిస్తుంది. నుదురు ముడుచుకుపోతుంది. ఆ తర్వాత సన్నగా తలనొప్పి మొదలై తీవ్రం కావచ్చు. మరికొందరిలో తెలియని భారమంతా తమ భుజాలపైన ఉన్నట్లుగానూ, ఆ బరువు తమను కుంగదీస్తున్నట్లుగానూ ఉండవచ్చు. మెడ, భుజాల కండరాలు గట్టిగా పట్టేసినట్టు అనిపించవచ్చు. ఇది తగ్గాలంటే కొన్ని చిట్కాలివి... ►మొదట కుర్చీలో హాయిగా, సౌకర్యంగా కూర్చుని రిలాక్స్ అవ్వండి. చేతులు, కాళ్లు రిలాక్స్డ్గా ఉంచాలి. ►మీ ముఖాన్ని కుడి భుజం వైపుకు, మళ్ళీ ఎడమ భుజం వైపు తిప్పాలి. ఆ తర్వాత పైకీ, ఆ వెంటనే కిందకు వంచాలి. ఇలా ఐదు సార్లు చేయాలి. ►మీ తలను మొదట ఎడమ భుజం వైపు తర్వాత ఛాతీ వైపుకు, అక్కడి నుంచి కుడి భుజం వైపుకు ఇలా గుండ్రంగా తిప్పాలి. ఆ తర్వాత మళ్లీ నెమ్మదిగా వ్యతిరేక దిశలో తిప్పాలి. ఇలా ఐదు సార్లు చేయాలి. ►నోటిని పెద్దగా తెరవాలి, కళ్ళను రెప్పలతో గట్టిగా నొక్కిపెట్టాలి. నోటితో గట్టిగా అరుస్తున్నట్టుగా నోరు తెరవాలి. కానీ ఎలాంటి శబ్దం చేయకూడదు. అలా విశాలంగా నోరు తెరచి గాలిని బాగా పీల్చాలి. మీకు బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. ఛాతి: ఒత్తిడి కారణంగా ఛాతీ చాలా బరువుగా ఉన్నట్లు అనిపించడం, శ్వాస గుండెల నిండా పూర్తిగా తీసుకోలేకపోవడం, ఏదో ఇబ్బందిగా ఉన్నట్టు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ఈ కింది విధంగా చేయండి. ►రిలాక్స్డ్గా కూర్చోవాలి. ఆ సమయంలో నడుమును నిటారుగా ఉంచాలి. ►కళ్ళు మూసుకుని మీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ►ఐదు వరకు అంకెలు లెక్కపెడుతూ నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. అలాగే మళ్లీ ఐదు అంకెలు లెక్కపెడుతూ శ్వాసను నెమ్మదిగా బయటకు వదిలేయాలి. ►వీలైతే శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు ఉదరాన్ని బయటకు పెట్టాలి. అలాగే శ్వాసను వదలుతున్నప్పడు ఉదరాన్ని లాగినట్టుగా లోపలికి తీసుకోవాలి. ►ఇప్పుడు మీ ఉచ్ఛాస్వ–నిశ్శాస్వలను లెక్కించండి. ఈ లెక్కపెట్టడం రివర్స్లో జరగాలి. మీకు సమయం ఉంటే 60 నుంచి వెనక్కి సున్న వచ్చేంత వరకూ, సమయం లేకపోతే కనీసం 20 సంఖ్య నుంచి వెనక్కి సున్న వచ్చేంత వరకూ లెక్కించాలి. శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు ఒక అంకె, శ్వాస వదిలినప్పుడు తర్వాత అంకె... ఇలా సున్న వరకు లెక్కించి, సున్న తర్వాత కళ్ళు తెరవాలి. ఛాతీ, మొండెం భాగాల్లో మీరు ఒత్తిడికి గురయ్యినప్పుడల్లా మీరు ఎలా నుంచున్నారో లేదా కూర్చొని ఉన్నారో మీ పోశ్చర్ను ఒకసారి గమనించుకోండి. సాధారణంగా ఒత్తిడి తీవ్రమైనప్పుడు చాలామంది ఒంగిపోయి, తల ఒంచుకుని ఉంటారు. ఇది మీ వెన్ను మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ కింది చిట్కాలు పాటించి ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ►మొదటగా మీకు తెలిసిందే... తలవంచుకుని లేదా తలవాల్చి ఉండవద్దు. నిటారుగా కూర్చోండి. ►ఎక్కువ సేపు కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉండేవారు ప్రతి అరగంటకి ఒకసారి లేచి నిలబడి అక్కడికక్కడే ఒకటిరెండు నిమిషాలు నడవండి. ►నడుం నొప్పి వచ్చేవారికి భుజంగానసం చాలా బాగా పనిచేస్తుంది. కాళ్లు... పాదాలపై చాలామందిలో ఒత్తిడి తమ పాదాలపై ప్రభావం చూపుతుంది. మరీ ఒత్తిడికి గురైన చాలామందిలో పిక్కలు పట్టేయడం, కాళ్ల కండరాలు పట్టేయడం (మజిల్ క్రాంప్స్) కనిపిస్తాయి. ఒత్తిడి వల్ల కాళ్లు, పాదాలు ప్రభావితమయ్యేవారు ఈ కింది టిప్స్ పాటించాలి... ►కాళ్ళను కాస్తంత ఎత్తు మీద పీటలాంటిదానిపై పెట్టి ఉంచండి. ►మీ కాళ్ళను స్ట్రెచ్ చేసి మీ పాదాలను మీ వైపు తీసుకురావడానికి ప్రయత్నించండి, అలాగే దానికి వ్యతిరేక దిశలో మళ్లీ స్ట్రెచ్ చేయండి. ►నిలబడి గాని, కూర్చునిగాని ఒక కాలిని పైకి లేపి మడమను గుడ్రంగా రొటేట్ చేస్తున్నట్లుగా తిప్పాలి. మొదట కుడివైపుకు, తర్వాత ఎడమవైపుకు తిప్పాలి. రెండుకాళ్లతో ఇలా ఐదుసార్లు చేయాలి. ►పెడిక్యూర్ చేయడం /పాదాల మసాజ్ వల్ల కూడా పాదాలపై ఒత్తిడి తగ్గుతుంది. అదనంగా... ►పైన పేర్కొన్న వాటన్నింటితో పాటు టెన్నిస్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, హాకీ లేదా క్రికెట్ వంటి ఆటలు కూడా ఆడుతుండటం మంచిది. ►ప్రతి రోజు ఒక గంట ఎరోబిక్స్ చేయడం మంచిది. టీవీ చూస్తూ డ్యాన్స్ కూడా చేయవచ్చు. ►వాకింగ్, జాగింగ్, స్విమింగ్ వీటిలో ఏదో ఒకటి రోజుకు గంట పాటు చేయాలి. వీటన్నింటి వల్ల మన గుండె , ఊపిరితిత్తులు, రక్తకణాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలు, కీళ్ళు గట్టిపడతాయి. దేహమంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఎండార్ఫిన్స్ వంటి మంచి హార్మోన్లు విడుదలయ్యి అవి ఒత్తిడిని కలిగించే రసాయనాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. కళ్లు ఒత్తిడి బాగా ఉన్నప్పుడు కొందరిలో కళ్లు నొప్పిగా ఉండటం, కళ్లు లాగినట్లు అనిపించడం, కళ్ల వెంట నీరుకారడం జరుగుతుంది. టీవీ, మొబైల్స్ ఎక్కువగా వాడటం, కంప్యూటర్పై ఎక్కువగా పనిచేయడం వల్ల కూడా కళ్లపై ఒత్తిడి పడి ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఈ కింది సూచనలు పాటించండి. ►ప్రతి గంటకోసారి కళ్లను గట్టిగా కాకుండా, మృదువుగా మూసుకొని... కళ్లపై మునివేళ్లతో నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇది గుండ్రంగా చేయాలి. తొలుత క్లాక్వైజ్గా ఐదుసార్లు, ఆ తర్వాత యాంటీక్లాక్వైజ్గా మరో ఐదుసార్లు చేయాలి. ►కళ్లకు ఆహ్లాదంగా ఉండే రంగు (సూదింగ్ కలర్) లైట్ గ్రీన్. కాబట్టి కిటికీలోంచి పచ్చటి చెట్లను చూడవచ్చు. లేదా కంప్యూటర్ మానిటర్ పక్కన ఇన్డోర్ ప్లాంట్స్ పెట్టుకొని చూస్తుండటం కూడా మంచి పద్ధతి. ►కంప్యూటర్ / మొబైల్ ఫోన్స్లో రీడింగ్ మోడ్లో ఉంచి చదవడం మంచిది. ►రోజూ రాత్రి పడుకునే ముందు కళ్లమీద తాజానీటిలో ముంచిన తడిగుడ్డ కాసేపు ఉంచుకోవడంమంచిది. వీటన్నింటివల్ల ప్రయోజనం కనిపించినప్పుడు ఒకసారి కంటి డాక్టర్ను సంప్రదించి తమ ఐ–సైట్ చెక్ చేయించుకోవాలి. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఈ వెండి సంతోషానివ్వదు...
సాధారణంగా వెండి రంగు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందరికీ కనువిందు చేస్తుంది. కానీ ఈ వెండి రంగు మాత్రం సంతోషాన్నివ్వదు. పైగా బాధను నింపుతుంది. మరికొందరిలోనైతే... ‘‘అప్పుడేనా?... ఈ వయసులోనేనా...?’’ అనే ఫీలింగ్ ఇస్తుంది. అవే వెంట్రుకలు తెల్లబడటం. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ వెంట్రుకలు తెల్లబడటం అనేది చాలా సహజమైన ప్రక్రియ. ఏజింగ్లో భాగంగా అందరిలోనూ జరిగే ప్రక్రియే. అయితే కొందరిలో అది చాలా చిన్న వయసులోనే జరుగుతుంది. అలా నెరవడాన్ని ‘బాలనెరుపు’ అంటారు. ఇలా బాలనెరుపు వచ్చేందుకు కారణాలేమిటో, వాటి నివారణ ఎలాగో తెలుసుకుందాం. వెంట్రుకలు తెల్లబడటానికి కారణమిదే... మన వెంట్రుకల మూలాన్ని మనం హెయిర్ ఫాలికిల్ అని పిలుస్తాం. ఈ మూలంలో మెలనోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఈ మెలనోసైట్స్ అనే కణాలు మెలనిన్ అనే రంగునిచ్చే పిగ్మెంట్ను ఉత్పత్తి చేస్తాయి. అప్పుడప్పుడే తెల్లబడుతున్న వెంట్రుకలను ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కింద పరిశీలించినప్పుడు అక్కడి మెలనోసోమ్స్ అనే చోట్ల తగినంత మెలనిన్ ఉండకపోవడాన్ని డాక్టర్లు గమనిస్తారు. అదే తెల్లవెంట్రుకల విషయానికి వస్తే అక్కడ మెలనోసైట్స్ అనే కణాలు ఉండవు. ఈ పిగ్మెంట్ వల్లనే వెంట్రుకకు నల్లటి రంగు వస్తుంది. కొన్ని వెంట్రుకల్లో ఈ మెలనిన్ ఉత్పత్తి ఆగిపోవడం ఫలితంగా ఆ వెంట్రుక నల్లరంగును కోల్పోయి తెల్లగా మారుతుందన్నమాట. వాస్తవానికి మనకు 50 ఏళ్ల వయసు వచ్చేనాటికి మన జుట్టుకు రంగునిచ్చే 50 శాతం పిగ్మెంట్ను కోల్పోతాం. కానీ కొందరిలో ఆ వయసుకు ముందే జుట్టు తెల్లబడుతుంది.నిజానికి వెంట్రుక తెల్లగా మారదు. మెలనిన్ ఇచ్చే నలుపు రంగును కోల్పోవడం వల్ల అది పూర్తిగా కాకుండా, ఒక మేరకు పారదర్శకం (ట్రాన్స్లుసెంట్)గా మారుతుంది. అదే నల్లటి వెంట్రుకల నేపథ్యంలో తెల్లగా అనిపిస్తుంటుంది. వెంట్రుకలు తెల్లబడటానికి కారణాలు వెంట్రుకలు తెల్లబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో అన్నింటికంటే ప్రధానమైన కారణాలు జన్యుపరమైనవి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా వెంట్రుకలు త్వరగా నెరిస్తే పిల్లల్లోనూ అవి త్వరగా తెల్లబడటానికి ఆస్కారం ఉంది. ఇలా కొందరిలో చాలా త్వరగా వెంట్రుకలు తెల్లబడటానికి మరికొన్ని కారణాలు ఇవే... స్వాభావికంగా వెంట్రుకలు నల్లబడాలంటే... ►ఐరన్, జింక్ సమృద్ధిగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ►విటమిన్ బి–12 పుష్కలంగా అందేలా తగిన ఆహారం తీసుకోవడం వల్ల వెంట్రుకల నెరుపు తగ్గుతుంది. మాంసాహారులైతే మాంసం, శాకాహారులైతే రోజూ గ్లాసెడు పాలు తాగడంతో పాటు, పొట్టుతీయని తృణధాన్యాలు తినాలి. ఇవి తీసుకున్న తర్వాత కూడా మీ ఒంటికి సరైన మోతాదులో విటమిన్ బి12 అందకపోతే డాక్టర్ సలహా మేరకు వైటమిన్ బి12 అందేలా టాబ్లెట్లు వాడటం అవసరం. ∙ క్యాల్షియం పాంటోథనేట్, పాబా అమైన్ సప్లిమెంట్లు తీసుకుంటే తెల్లవెంట్రుకలు తగ్గే అవకాశం ఉంది. ►కరివేపాకు వేసిన మజ్జిగ వల్ల కూడా వెంట్రుకలు తెల్లబడే ప్రక్రియ మందగిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ►ఇక వాతావరణ కాలుష్యాలకు సైతం వీలైనంత దూరంగా ఉంటూ మంచి స్వాభావికమైన వాతావరణంలో ఉండాలి. ►వ్యాయామం కూడా వెంట్రుకలు నెరిసే ప్రక్రియను మందగించేలా చేస్తుంది. అందుకే ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయడం మంచిది. ఇది వెంట్రుకలు తెల్లబడకుండా నివారించడంతో పాటు ఓవరాల్ హెల్త్కూ మంచిది. చికిత్స: హెయిర్ పెప్టైడ్ సీరమ్ వంటి కొన్ని మందులను వాడితే ప్రయోజనం ఉంటుంది. అయితే ఇలాంటి వాటిని తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకే వాడాలని గుర్తుంచుకోవాలి. మానసిక ఒత్తిడి కారణంగా... ►మనలో పెరిగే మానసిక ఒత్తిడి వల్ల మన జీవకణాల్లోని కొన్ని పొరలు (సెల్యులార్ స్ట్రక్చరల్ మెంబ్రేన్స్), కొవ్వుపదార్థాలు (లైపిడ్స్), ప్రోటీన్లు, డీఎన్ఏ దెబ్బతిని వెంట్రుక తెల్లబడుతుంది. ►తీవ్రమైన మానసిక ఉద్వేగాలకు లోనుకావడం (ఎమోషనల్, ఇన్ఫ్లమేటరీ స్ట్రెస్) ►కణంలోని రోగనిరోధక శక్తి తగ్గడం ►థైరాయిడ్ లోపం ►రక్తహీనత (అనీమియా) ►పొగతాగే అలవాటు ►హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉత్పత్తి (మన రోమమూలాల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఉత్పత్తి అవుతుంటుంది. ఇది చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నప్పుడు కూడా వెంట్రుక తెల్లబడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది). ►వీటికి తోడు కాలుష్యం, పోషకాహార లోపం కూడా కొంతమేరకు తెల్లవెంట్రుకలకు కారణమవుతాయి. కొన్ని మూలకాల/పోషకాల లోపాలు ►ఐరన్ లోపించడం ►కాపర్ లోపించడం ►జింక్ లోపించడం ►విటమిన్ బి–12, విటమిన్–ఈ, విటమిన్–సి లోపించడం డాక్టర్ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
గజరాజులకు మానసిక ఒత్తిడి!
సాక్షి, హైదరాబాద్: ఆలయాల్లో ఊరేగింపులకు, పర్యాటకుల విహారానికి, అటవీ ఉత్పత్తుల తరలింపునకు ఏనుగులను ఎక్కువగా వాడటం, వాటిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) అనుబంధ సంస్థ లాకోన్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. తగిన శిక్షణ లేని మావటీల కారణంగా అవి హింసకు గురవుతున్నట్లు వారు వెల్లడించారు. తద్వారా ఒత్తిడి పెరిగి వాటి ప్రవర్తనపై ప్రభావం పడుతోందని, సంతానోత్పత్తి సామర్థ్యం కూడా తగ్గిపోతోందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏనుగుల జాతి దీర్ఘకాలం మనుగడ సాగించాలంటే ఈ ఒత్తిడిని తగ్గించాలని లాకోన్స్ శాస్త్రవేత్త డాక్టర్ జి.ఉమాపతి నేతృత్వంలో జరిగిన పరిశోధన స్పష్టం చేస్తోంది. ఆసియా ప్రాంతంలో 20 శాతం ఏనుగులు నిర్బంధంలో ఉన్నాయని, ఒత్తిడి కారణంగా 1993 – 2003 మధ్యకాలంలో దాదాపు 274 మందిపై ఏనుగులు దాడులు చేశాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో లాకోన్స్ శాస్త్రవేత్తలు వేర్వేరు పరిస్థితుల్లో గజరాజుల ఆరోగ్యం, ఒత్తిళ్లపై పరిశోధనలు చేపట్టారు. మైసూరు జంతు సంరక్షణాలయంతోపాటు మధుమలై, బాంధవ్గఢ్ ఎలిఫెంట్ క్యాంపుల్లోని 870 ఏనుగుల వ్యర్థ నమూనాలను పరిశీలించారు. దసరా ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగుల్లో ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మతపరమైన కార్యక్రమాల్లో ఏనుగులను వీలైనంత తక్కువగా వాడాలని, పునరుత్పత్తి చేయగల వయసులో ఉన్న ఆడ ఏనుగులను అసలు వాడరాదని శాస్త్రవేత్తలు సూచించారు. గజరాజులతో పనులు చేయించేందుకు మరింత సులువైన, హింసకు తావివ్వని పద్ధతులు పాటించేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. -
టెండనైటిస్ తగ్గుతుందా?
నా వయసు 35 ఏళ్లు. నేను క్రీడాకారుణ్ణి కావడంతో అన్ని రకాల ఆటలు బాగా ఆడుతుంటాను. నాకు కొంతకాలంగా చేయి కదిలించినప్పుడు భుజంలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్ను సంప్రదిస్తే టెండన్స్కి సంబంధించిన వ్యాధి అని చెప్పారు. మందులు వాడుతున్నా సమస్య నుంచి ఉపశమనం లభించడం లేదు. అసలు ఈ సమస్య ఎందుకు కలుగుతుంది? హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి. మీరు వివరంగా తెలిపిన లక్షణాలను బట్టి మీరు టెండినైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి హోమియో ద్వారా పూర్తి పరిష్కారం లభిస్తుంది. సాధారణంగా మన శరీరంలోని కండరాలను ఎముకలతో జతపరిచే తాడు లాంటి కణజాలాన్ని టెండన్స్ అని అంటారు. ఇవి ఫైబ్రస్ కణజాలంతో ఏర్పడతాయి. వీటికి సాగే గుణం ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. కాబట్టి అవి కండరాలు ముడుచుకునే సమయంలో, ఎముకలు, కీళ్ల కదలికలకు సహకరిస్తాయి. ఏ కారణం చేతనైనా వీటికి హానికలిగితే, కదలికలు ఇబ్బందికరంగా మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఈ టెండన్స్ ఇన్ఫెక్షన్కు గురికావడాన్ని టెండినైటిస్ అంటారు. శరీరంలో ఎక్కడైనా ఏర్పడే ఈ సమస్య... భుజాలలో, మోచేతుల్లో, మణికట్టు, బొటనవేలు మొదటి భాగంలో, తుంటి, మోకాలు, మడమలు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏ వయసు వారిలోనైనా కనిపించే ఈ సమస్య ఎక్కువగా పెద్దవయసు వారిలో (ముఖ్యంగా 40 ఏళ్లు పైబడినవారిలో) కనిపిస్తుంది. ఆ వయసు వారిలో సాధారణంగా టెండాన్స్ సాగేతత్వం, ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గిపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కారణాలు వయసు పెరగడం, గాయం కావడం, వృత్తిరీత్యా లేదా హాబీల కారణంగా టెండన్స్పై అధిక ఒత్తిడి కలిగించే ఒక రకమైన కదలికలను ఎక్కువగా కొనసాగించడం. ఉదా: కంప్యూటర్ కీ–బోర్డులు, మౌస్లు ఎక్కువగా వాడటం, కార్పెంటింగ్, పెయింటింగ్ మొదలైనవి. క్రీడల వల్ల : ►పరుగెత్తడం, టెన్నిస్, బాస్కెట్బాల్, గోల్ఫ్, బౌలింగ్ మొదలైనవాటివల్ల. ►డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి ఇబ్బందులతో బాధపడేవారిలో ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది. ►కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ టెండినైటిస్ సంభవించే అవకాశం ఉంది. లక్షణాలు టెండినైటిస్కి గురైన ప్రదేశంలో నొప్పి, బిగువుగా ఉండటం, ఆ భాగాన్ని కదిలించినప్పుడు నొప్పి అధికమవ్వడం, కొన్ని రకాల శబ్దాలు వినిపించడం, వాపు, చేతితో తాకితే ఆ ప్రదేశం వేడిగా అనిపించడం, ఎర్రగా మారడంవంటి లక్షణాలను గమనించవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►కంప్యూటర్లను, కీబోర్డులను, మౌస్లను సరైన పొజిషన్లో సర్దుబాటు చేసుకోవడం. ►పనిలో కొంత విశ్రాంతి తీసుకోవడం ►వ్యాయామాలు ఒకేసారి అధిక ఒత్తిడికి గురిచేసేలా కాకుండా నెమ్మదిగా ప్రారంభించడం ►క్రీడలలో కోచ్ సలహా మేరకు జాగ్రత్తలు పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు. చికిత్స జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శారీరక పరిస్థితులు, తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం ద్వారా రోగి తాలూకు రోగ నిరోధకశక్తిని సరిచేయడం వల్ల ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా దానిని నయం చేయడమే కాకుండా టెండన్స్ను దృఢపరచి సమస్యను సమూలంగా దూరం చేయడం జరుగుతుంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మైగ్రేన్కు చికిత్స ఉందా? నా వయసు 25 ఏళ్లు. నాకు విపరీతమైన తలనొప్పి వస్తోంది. వారంలో ఒకటి, రెండు సార్లు తీవ్రంగా వస్తోంది. ఎన్నో రక్తపరీక్షలు, ఎక్స్–రే, స్కానింగ్ పరీక్షలు చేయించాను. డాక్టర్లు దీన్ని మైగ్రేన్గా నిర్ధారణ చేశారు. జీవితాంతం వస్తుంటుందని చెప్పారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? తరచూ తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. నేటి ఆధునికయుగంలో శారీరక, మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనలు తలనొప్పికి ముఖ్యమైన కారణాలు. ఇంకా రక్తపోటు, మెదడు కణుతులు, మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణల్లో మార్పులు, సైనసైటిస్ మొదలైన వాటివల్ల తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం ఉంది. తలనొప్పి ఏ రకానికి చెందినదో నిర్ధారణ తర్వాత ఖచ్చితమైన చికిత్స చేయడం సులువవుతుంది. మైగ్రేన్ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధిక ప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలోనే ఎక్కువ. మైగ్రేన్లో దశలూ, లక్షణాలు సాధారణంగా మైగ్రేన్ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్ మైగ్రేన్ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ రక్తపరీక్షలు, రక్తపోటును పరీక్షించడం, సీటీస్కాన్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్ను నిర్ధారణ చేయవచ్చు. మైగ్రేన్ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు మనం తినే ఆహారంలో మార్పులు, మనం ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావారణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి. చికిత్స మైగ్రేన్ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంవశిక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటిని అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్ కన్స్టిట్యూషన్ సిమిలియమ్ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తారు. బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్కు అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఒళ్లంతా తెల్లమచ్చలు... తగ్గేదెలా? నా వయసు 39 ఏళ్లు. నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. మొదట్లో కాస్త చిన్నవిగా ఉండి, ఇప్పుడు క్రమంగా పెద్దవవుతూ అందరూ గమనించేలా ఉంటున్నాయి. ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. నాకు హోమియోలో పరిష్కారం సూచించండి. శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. ఇప్పుడు మీరు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ►బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. ►పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు. ►జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు. దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు : ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు. ►మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ►కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. ►వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది. లక్షణాలు మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
మార్కుల యజ్ఞంలో విద్యార్థులే సమిధలు
సచిన్ పది పాస్ కాలేదు..అయినా క్రికెట్కి దేవుడయ్యాడు.కమల్హాసన్ 2వ తరగతే చదివాడు.. దేశం మెచ్చిన మహానటుల్లో ఒకడిగా నిలిచాడు. ఏఆర్ రెహమాన్ స్కూలుకైనా వెళ్లలేదు, అయినా ఆస్కార్ను గెలిచాడు. జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. కష్టనష్టాల కోరిస్తేనే విజయం విలువ రుచి చూడగలం. బతుకు గొప్పదనం తెలుసుకోగలం. కానీ, నేటి జీవితంలో ఆటపాటలు కరువై, చదువే లోకంగా బతుకుతున్న విద్యార్థులు ఒక్క సబ్జెక్టులో తప్పినా ఆత్మన్యూనతకులోనై వెంటనే ప్రాణాలు తీసుకుంటున్నారు. తప్పు తమది కాకపోయినా.. ప్రాణాలు తీసుకోవడం ఒక్కటే సమస్యకు పరిష్కారం అనుకుంటున్నారు. పరిష్కారం కోసం వెతికే ఓపిక,ఎదిరించే పోరాట పటిమ నేటితరంలో లేకుండా చేసింది కార్పొరేట్ విద్యావ్యవస్థ,అదే నిజమనుకుంటున్న తల్లిదండ్రులదే అసలైన తప్పు అంటున్నారు సామాజిక వేత్తలు. రెక్కలు కత్తిరించిన స్వేచ్ఛ ఎందుకు? పిల్లలకు అడిగినా, అడగకపోయినా అన్నీ ఇస్తున్నారు నేటికాలం తల్లిదండ్రులు. కానీ స్వేచ్ఛారెక్కలు కత్తిరించి తాము చెప్పినట్లు ర్యాంకుల కోసం చదవమంటున్నారు. కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కొనే నేర్పరితనం, నాయకత్వ లక్షణాలు అస్సలు కనిపించడం లేదు. పైగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై, న్యూక్లియర్ ఫ్యామిలీలు పెరగడం కూడా పిల్లల మానసిక ఒత్తిడికి మరో కారణం. తల్లిదండ్రులు కాకుండా ఓదార్చే కుటుంబ సభ్యులెవరూ లేకపోవడం కూడా సమస్యను పెంచుతోంది. ఏటా 3 లక్షలమంది ఎంసెట్ రాస్తున్నారు. ఐఐటీ, ఐఐఎంలో ఉండే 1000 సీట్లు రాకుంటే వారు అనర్హుల కింద లెక్కగట్టే ధోరణి మారాలి. ప్రొ. డాక్టర్ సతీశ్కుమార్, సామాజిక వేత్త ఆటపాటలు, స్కౌట్స్, ఎన్సీసీ అంటే తెలియవు! ఇప్పుడు పిల్లల్లో ఆటపాటలు లేవు. కార్పొరేట్ జైళ్లలో కాలేజీలు. అందుకే, పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు ఆటపాటలు, స్కౌట్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వంటి అంశాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి నుంచి సమస్యలపై పోరాడే తత్వం అలవడుతుంది. దేశభక్తి, సామాజిక బాధ్యత పెరుగుతాయి. ఓడిపోయినా.. కుంగిపోకుండా విజయం సాధించే పోరాటతత్వం, అవసరమైనప్పుడు నలుగురికి నేతృత్వం వహించే నాయకత్వ లక్షణాలు నేర్చుకుంటున్నారు. కానీ, ప్రైవేటు, కార్పొరేట్ విద్యార్థుల్లో ఇవేమీ కానరావడం లేదంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియాలో గంటలకొద్దీ గడుపుతూ విపరీత మనస్తత్వాన్ని పెంచుకుంటున్నారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి 18 మంది.. ఈసారి ఇంటర్ ఫలితాల్లోతీవ్ర గందరగోళం నెలకొంది. లెక్కకుమించిన తప్పులతో విద్యార్థులు తమ ప్రమేయం లేకుండా ఫెయిల య్యారు. చివరికి తమది తప్పు కాదని తెలిసినా విద్యార్థులు జీర్ణించుకోలేక పోతున్నారు. సమస్యపై పోరాడలేక చేతులెత్తేస్తున్నారు. తమ ప్రతిభను ర్యాంకులు, గ్రేడులు అంటూ తూకమేసి కొలుస్తున్న ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఇమడలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంటర్ ఫలితాలు వెలువడిన నాటి నుంచి నేటి వరకు దాదాపుగా 18 మంది విద్యార్థులు కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. లోపం ఎక్కడుంది? విద్యార్థులు మరీ ఇంత సున్నిత మనస్కులుగా తయారవడానికి మనమే కారణమంటున్నారు సామాజికవేత్తలు. పిల్లలు పది పాస్ కాగానే, కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించడం, సమాజానికి దూరంగా, చదువేలోకంగా, బ్రాయిలర్ కోళ్లలా రాత్రింబవళ్లు చదువుతున్నారు. తమ సంతానం ఇంజనీర్, డాక్టర్ అవ్వాలని పుట్టగానే డిసైడ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. పిల్లల ఇష్టంతో పనిలేదు. వారికి కష్టం అంటే తెలియకుండా కాలు కందనీయకుండా, ఆటపాటలకు దూరంగా చదువే పరమావధిగా ఉండే స్కూళ్లు, కాలేజీల్లో వేస్తున్నారు. 90 శాతం రాకపోతే అసలు అది చదువే కాదన్న మానసిక స్థితికి పిల్లలను తీసుకువస్తున్నారు. అలాంటి పిల్లలు అకస్మాత్తుగా వ్యతిరేక ఫలితాలు చూసి తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. పిల్లలకు భరోసా ఇవ్వండి ఫెయిలైన పిల్లలకు తల్లిదండ్రులు ముందు ధైర్యం చెప్పాలి. తప్పె క్కడ జరిగిందో అన్వేషించాలి. ఆత్మహత్యల వార్తలు, దృశ్యాల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. నేటి పిల్లలు తెలివైన వారు, కాకపోతే సున్నిత మనస్కులు. సమస్య పరిష్కారమయ్యే వరకు వెంట ఉంటామన్న భావన కుటుంబ సభ్యులు వారిలో కల్పించాలి. అప్పటికీ మార్పు లేకపోతే కౌన్సెలింగ్ ఇప్పించాలి. - సుమతి, ఎస్పీ, విమెన్ ప్రొటెక్షన్ సెల్ -
నిద్రపట్టడం లేదు... సలహా ఇవ్వండి
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 33 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రతి రెండు వారాలకు ఒకసారి షిఫ్ట్ మారుతుంది. ఈ మధ్యే డే–షిఫ్ట్ కు మారాను. అయినా రాత్రివేళ సరిగా నిద్రపట్టడం లేదు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – ఎమ్. నవీన్, హైదరాబాద్ మనిషికి గాలి, నీరు, తిండి లాగే నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర కరువైతే కళ్లలో కళాకాంతులు తగ్గుతాయి. ఉత్సాహం తగ్గుతుంది. అలసట, ఆందోళన మాత్రమే గాక అనేక ఆరోగ్య సమస్యలకు నిద్రలేమి కారణమవుతుంది. శారీరక, మానసిక సమస్యలు తప్పవు. నిద్రలోకి జారుకోలేకపోవడం, ఒకవేళ నిద్రపట్టినా తెల్లవారుజామున నిద్రలేవడం, రాత్రిళ్లు మళ్లీ మళ్లీ మెలకువ రావడం, ప్రశాంతమైన నిద్రలేకపోవడం నిద్రలేమి సమస్యకు సంబంధించిన ఒకటి రెండు లక్షణాలు. అయితే ఇవి అన్నీ గాని... కొన్ని గాని ఉండటాన్ని వైద్యపరిభాషలో ఇన్సామ్నియా (నిద్రలేమి)గా చెప్పవచ్చు. నిద్రలేమి శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆలోచన గమనాన్ని నియంత్రిస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కారణాలు : ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శారీరకంగా వచ్చే మార్పులు ∙చికాకులు ∙చీటికిమాటికి కోపం తెచ్చుకోవడం ∙దీర్ఘకాలిక వ్యాధులు ∙వంశపారంపర్యం ∙అంతులేని ఆలోచనలు లక్షణాలు: ∙నిద్రలోకి జారుకునేందుకు కష్టపడిపోవడం ∙నిద్రపట్టినా మధ్య మధ్య మెలకువ వస్తూ ఉండటం, నాణ్యమైన నిద్ర లోపించడం ∙తెల్లవారుజామున మెలకువ వచ్చాక మళ్లీ నిద్రపట్టకపోవడం ∙నిద్రలేచిన తర్వాత విశ్రాంతిగా అనిపించకపోవడం నిర్ధారణ పరీక్షలు : రక్తపరీక్షలు, పాలీసామ్నోగ్రామ్ (పీఎస్జీ) చికిత్స: హోమియోలో నిద్రలేమి సమస్యకు మంచి చికిత్స అందుబాటులో ఉంది. నక్స్వామికా, ఓపియమ్, బెల్లడోనా, ఆర్సినిక్ ఆల్బమ్ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. పాసీఫ్లోరా 20 – 25 చుక్కలు అరకప్పు నీళ్లలో కలుపుకుని తాగితే గాఢంగా నిద్రపడుతుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ గౌట్ సమస్యకు పరిష్కారం ఉందా? నా వయసు 43 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. సలపరంతో కూడిన తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్గారు గౌట్ అని చెప్పారు. ఎన్ని మందులు వాడినా ఉపశమనం కనిపించడం లేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – ఆర్. కళ్యాణ్, గుంటూరు గౌట్ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీళ్లు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్’ అంటారు. కారణాలు: సాధారణంగా రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్కు దారితీస్తుంది. ∙ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం. ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. లక్షణాలు: ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి. ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది. ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. ∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. నివారణ / జాగ్రత్తలు : మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగ, పేగుల వంటివి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స: హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటున్నారు... నా వయసు 62 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉండటంతోబాటు కీళ్లవద్ద ఎర్రగా మారాయి. నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. మాలకొండారావు, ఒంగోలు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే తన వ్యాధి నిరోధక శక్తి తన పట్ల ప్రతికూలంగా పనిచేయడం. సాధారణంగా యాభైఏళ్లు పైబడిన వాళ్లలో ఈ నొప్పులు మొదలవుతాయి.ఈ వ్యాధి ఉన్న వారిలో లక్షణాల తీవ్రతలో చాలా రకాల మార్పులు కన్పిపిస్తుంటాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకేకీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్లు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్లలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు.రుమటాయిడ్ ఆర్థరైటిస్ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా ఈ వ్యాధిని పూర్తిగానియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
లూపస్ అంటువ్యాధా? ఎందుకు వస్తుంది?
మా పక్కింటావిడకి లూపస్ వ్యాధి ఉందని వైద్యులు నిర్ధారణ చేశారు. ఆవిడ తరచూ నా దగ్గరకు వస్తుంటుంది. దీనివల్ల నాకు కూడా ఆ వ్యాధి వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. అసలు లూపస్ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి. ఈ జబ్బు ఎందుకు వస్తుంది? లూపస్ లేదా ఎస్ఎల్ఈ (సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్) అనే ఈ వ్యాధి ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే రోగి తాలూకు వ్యాధి నిరోధక శక్తి రోగిపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే వ్యాధి అన్నమాట. మనందరిలో ఒక వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. అది బయటి నుంచి వచ్చే వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. జన్యులోపాల వంటి ఏవైనా కారణాల వల్ల మన వ్యాధి నిరోధక శక్తి... మన శత్రుకణాలను తుదముట్టించడానికి బదులుగా, మన సొంతకణాలనే మన శత్రువులుగా పరిగణించి, వాటిపై దాడి చేస్తుంది. దాంతో కంచే చేను మేసినట్టుగా మన సొంత అవయవాలే మన వ్యాధి నిరోధకశక్తి బారిన పడతాయి. అందువల్ల వచ్చే వ్యాధిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్షమందిలో ఒకరి నుంచి 15 మంది వరకు ఈ జబ్బు వస్తుంటుంది. సాధారణంగా 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న స్త్రీలు దీని బారిన ఎక్కువగా పడుతుంటారు. ఇది ఎంతమాత్రమూ అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి మరొకరికి ఇది అంటుకోదు. కాబట్టి ఈ జబ్బు ఉన్నవారితో సన్నిహితంగా మెలగడం వల్ల, సహజీవనం చేయడం వల్ల ఈ వ్యాధి సోకదు. ఇలాంటి వ్యాధిగ్రస్తులను వెలివేయనక్కర్లేదు. పైపెచ్చు వారి పట్ల మరింత ప్రేమ, ఆదరణ చూపించడం వల్ల వారిలో మానసిక ఒత్తిడి తగ్గి, మనోధైర్యం పెరుగుతుంది. అలా వ్యాధి తీవ్రతను కూడా తగ్గించవచ్చు. ఈ జబ్బు లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. అలాగే ఒకే రోగిలో కూడా తరచూ లక్షణాలు మారిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించకుండానే వ్యాధి ఉండవచ్చు. మరికొన్నిసార్లు చాలా తీవ్రరూపంలో లక్షణాలు కనిపించవచ్చు. ఈ వ్యాధిని తొలిదశలో అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఈ రోగులు సూర్యరశ్మికి అతి సున్నితంగా ఉంటారు. ఎండబారిన పడ్డప్పుడు ఒంటిమీద ర్యాష్, దద్దుర్లు, దురద వంటివి కలుగుతాయి. వివిధ రకాలైన మచ్చలు, దీర్ఘకాలికంగా మానని పుండ్లు, నోటిలో పూత, జుట్టు ఎక్కువగా రాలడం, కీళ్లనొప్పుల వంటివి ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలు. వ్యాధి తీవ్రత వల్ల కొందరిలో ఒక్కోసారి యుక్తవయసులోనే పక్షవాతం, గుండెపోటు, బుద్ధిమందగించడం వంటి విపరీత లక్షణాలు కూడా కనిపించవచ్చు. అకస్మాత్తుగా చూపుపోవడం, తరచూ ఫిట్స్రావడం, రక్తహీనత, తెల్లరక్తకణాలు–ప్లేట్లెట్లు తగ్గిపోవడం కూడా సంభవించవచ్చు. గుండె మీద, ఊపిరితిత్తుల మీద పొర ఏర్పడి, చుట్టూ నీరు చేరడం కూడా జరగవచ్చు. మహిళల్లో తరచూ గర్భస్రావాలు జరగడానికి కూడా లూపస్ ఒక కారణం. ఈ వ్యాధి ప్రభావం మూత్రపిండాలపై పడినప్పుడు ఒళ్లంతా వాపు, బీపీ పెరగడం, మూత్రం నుంచి ఎక్కువగా ప్రోటీన్ పోవడం వంటివి జరుగుతాయి. శరీరంలోని ఏ అవయవమైనా ఈ వ్యాధి బారిన పడవచ్చు. పై అవయవాలు ప్రభావితం అయినప్పుడు... వాటికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు ఎన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడినా ప్రయోజనం ఉండక, స్టెరాయిడ్స్ అనే మందులు వాడినప్పుడు ఉపశమనం కలుగుతుంటే... లూపస్ వ్యాధిని గుర్తించడానికి అది మంచి అవకాశంగా పరిగణించవచ్చు. ఇలాంటి రోగులను వెంటనే రుమటాలజిస్టులకు చూపించాలి. వ్యాధి నిర్ధారణ చేసి, వారి ఆధ్వర్యంలో మందులు వాడటం వల్ల ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. ఆర్థరైటిస్ రోగుల ఆహారం ఎలా ఉండాలి? నా వయసు 33 ఏళ్లు. ఇటీవలే నాకు కీళ్లవాతం (ఆర్థరైటిస్) ఉందని వైద్యులు నిర్ధారణ చేశారు. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఆహార నియమాలను వివరించండి. కీళ్లవాతం (ఆర్థరైటిస్) అని వైద్యులు నిర్ధారణ చేసిన వెంటనే రోగులు, వాళ్ల బంధువులు రోగి అనుసరించాల్సిన ఆహార నియమాల గురించి మొట్టమొదట కలవరపడతారు. అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సావిధానాల కన్న ఆహారపు అలవాట్ల గురించి ఎక్కువగా ఆందోళన పడతారు. ఏ వస్తువులు తినాలి, ఏవి తినకూడదు, ఏయే పదార్థాల వల్ల వాతం తగ్గుతుంది లేదా పెరుగుతుంది లాంటి సందేహాలతో సతమతమవుతారు. చాలామంది వెంటనే దుంపకూరలు, గుడ్లు, మాంసం, వంకాయ, గోంగూర వంటివి తినడం మానేస్తారు. అలాగే కొంతమంది ఒక్కసారిగా చేపలు, వెల్లుల్లి ఎక్కువగా తినడం మొదలుపెడతారు. నిజానికి గౌట్ అనే ఒక రకమైన కీళ్లవాతంలో తప్ప... వేరే ఏ ఇతర కీళ్లవాతాలలోనూ ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అనేక రకాల పరిశోధనలు, క్షుణ్ణంగా పరిశీలనలు జరిపిన తర్వాత శాస్త్రవేత్తలు తేల్చి చెప్పిన మాట ఇది. గౌట్ అనే వ్యాధిలో యూరిక్ యాసిడ్ అనే ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి జరిగి కీళ్లలోకి చేరుతుంది. దానివల్ల కీళ్లలో నొప్పి, వాపు, ఎర్రబారడం వంటివి జరుగుతాయి. ఈ వ్యాధితో బాధపడేవారు మాత్రమే యూరిక్ యాసిడ్ తక్కువగా ఉత్పత్తి చేసే ఆహారాన్ని ఎంపిక చేసేకోవాలి. గౌట్ వ్యాధిగ్రస్తులు మాత్రం మాంసం, చేపలు, పీతలు, రొయ్యలు, బీన్స్ వంటి పదార్థాలను తినకూడదు. అలాగే మద్యం వల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. అందువల్ల పైన పేర్కొన్నవాటికి దూరంగా ఉండాలి. ఇక ఆర్థరైటిస్ వంటి ఇతర కీళ్లవాతాలతో బాధపడేవారు ఏ విధమైన ఆహార నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. మంచి పౌష్టికాహారంతోపాటు క్యాల్షియమ్ ఎక్కువగా లభించే గుడ్లు, పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, నట్స్ ఎక్కువగా తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. దాంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కీళ్లకు ఎంతో అవసరం. అది కీళ్లకు మేలు చేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్కు స్టెరాయిడ్స్ తప్పవా? నా వయసు 52 ఏళ్లు. నేను తొమ్మిది సంవత్సరాల నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నాను. నొప్పి, వాపు తగ్గడం కోసం ప్రిడ్నిసలోన్ అనే మందును చాలా కాలం నుంచీ వాడుతున్నాను. రెండేళ్ల నుంచి నొప్పి పెరిగింది. ప్రతి నెలా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఉపయోగిస్తున్నాను. నెల కిందట నా ఎడమ కాలు ఎముక విరిగి, ఇంట్లో పనులు చేసుకోడానికి ఇబ్బంది కలుగుతోంది. ఉద్యోగం కూడా మానేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యాధికి స్టెరాయిడ్స్ కాకుండా మెరుగైన చికిత్స ఏదైనా ఉందా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే మన ఒంట్లో ఉండే రక్షణ వ్యవస్థ మన కణాలనే గుర్తించే సమర్థతను కోల్పోయి మన శరీర అవయవాలపైనే దాడి చేస్తుంది. దాంతో ఈ వ్యాధి వస్తుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధి. దీనిని ప్రారంభదశలోనే గుర్తించి సకాలంలో చికిత్సను ప్రారంభించాలి. నిపుణులు వ్యాధి తీరును బట్టి, తీవ్రతను బట్టి చికిత్స ప్రారంభిస్తారు. అనేక చికిత్స విధానాలు ఉన్నాయి. స్టెరాయిడ్స్ అనేవి చికిత్స విధానాలలో ఒక భాగం. వీటిని దీర్ఘకాలం వాడితే చాలా రకాల ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి షుగర్, నొప్పి, ఎముకలు బలహీనంగా కావడం... దాంతో తేలిగ్గా విరిగిపోవడం, కంటి శుక్లం, అంటువ్యాధులకు తేలిగ్గా లోనుకావడం వంటివి ముఖ్యమైనవి. కాబట్టి చికిత్స చేసే డాక్టర్లు స్టెరాయిడ్ స్పేరింగ్ డ్రగ్స్ మందులను ఉపయోగిస్తారు. వ్యాధి నిర్ధారణ జరగగానే వీటిని ఉపయోగించాలి. వీటితో పాటు చిన్న చిన్న మోతాదుల్లోనే స్టెరాయిడ్స్ను మూడు నుంచి ఆర్నెల్ల వరకు మాత్రమే ఉపయోగించాలి. ఈ స్టెరాయిడ్ స్పేరింగ్ మందుల వల్ల వ్యాధి తీవ్రతను, తీవ్రమైన వ్యాధి వల్ల కలిగే నొప్పి, వాపు, క్లిష్టమైన సమస్యలను అరికట్టవచ్చు. ఇటీవల అనేక ఆధునిక చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని బయొలాజిక్స్ అంటారు. తొలి ప్రాథమ్య ఔషధాలకు లొంగని వ్యాధిగ్రస్తుల్లో వీటిని ఉపయోగిస్తారు. ఈ మందుల వల్ల సత్వర ఉపశమనం కలుగుతుంది. త్వరగా స్టెరాయిడ్స్ వాడకాన్ని తగ్గించుకునే అవకాశం లభిస్తుంది. డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ రుమటాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12,బంజారాహిల్స్, హైదరాబాద్. -
నిద్రకు అష్టకష్టాలు
కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటే చాలు అనుకుంటారు చాలామంది అల్పసంతోషులు.డబ్బు పెడితే తిండి దొరకొచ్చేమో గాని, ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రశాంతమైన నిద్ర ఎక్కడా దొరకదు. గాఢంగా ప్రశాంతమైన నిద్రపట్టాలంటే డబ్బుతో పనిలేదు. శరీరానికి తగినంత శ్రమ, కడుపు నిండా తిండి, మానసిక ఒత్తిడి లేని జీవితం ఉంటే చాలు, పక్క మీద వాలిన నిమిషాల్లోనే నిద్ర ముంచుకొస్తుంది. దురదృష్టవశాత్తు మానసిక ఒత్తిడి ప్రస్తుతం నిత్యకృత్యంగా మారింది. జనాభాలో సగానికి సగం పైగా మనుషులు ఏదో ఒకరకంగా మానసిక ఒత్తిడికి, కుంగుబాటుకు, లేనిపోని ఆందోళనలకు లోనవుతున్నారు. వారందరూ ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు. ఆధునిక జీవనశైలిలో పెరిగిన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు,టీవీల వాడకం, ఆహారపు అలవాట్లలో మార్పులు వంటివి కూడా చాలామందికి నిద్రను దూరం చేస్తున్నాయి. దీర్ఘకాలం నిద్రలేమితో బాధపడేవారు నానా రకాల ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. నిద్ర ప్రాధాన్యాన్ని శతాబ్దాల కిందటే మన పూర్వీకులు గుర్తించారు. నిద్రకూ ఆరోగ్యానికీ గల సంబంధాన్ని కూడా వారు గుర్తించారు. నిజానికి అప్పటి మనుషులు బాగానే నిద్రపోయేవారు. ఆరోగ్య సమస్యలతో బాధపడే ఏ కొద్దిమందో తప్ప మిగిలిన వారంతా ప్రశాంతంగా ఆదమరచి నిద్రపోయేవారే. నిద్రకు సంబంధించిన ప్రస్తావనలు మన పురాణాల్లోనూ, ఇతర దేశాల గాథల్లోనూ కనిపిస్తాయి. రామాయణంలో కుంభకర్ణుడి నిద్ర, ఊర్మిళ నిద్ర గురించి తెలిసిందే. గ్రీకు, రోమన్ పురాణాల్లోనైతే నిద్రకు అధిదేవతలు కూడా ఉన్నారు. గ్రీకు పురాణాల్లో నిద్రకు అధిదేవత హిప్నోస్. రోమన్ పురాణాల్లో నిద్రకు అధిదేవత సోమ్నస్. గ్రీకు, రోమన్ పురాణాల్లో నిద్రకు, కలలకు సంబంధం ఉన్న మరో అధిదేవత మార్ఫియస్. సోమ్నస్కు గల వేలాది మంది కొడుకుల్లో మార్ఫియస్ ఒకడు. ప్రశాంతమైన నిద్ర కోసం, చక్కని కలల కోసం రోమన్, గ్రీకు నాగరికతలకు చెందిన ప్రజలు ఈ దేవతలను ఆరాధించేవారు. నిద్రలేమితో బాధపడేవారికి అప్పట్లో పూజారులే రకరకాల చికిత్సలు చేసేవారు. మద్యం, నల్లమందు మొదలుకొని మూలికా కషాయాల వరకు ఔషధాలుగా ఇచ్చేవారు. అయితే, మనుషులకు ఎంత నిద్ర అవసరం, మంచి నిద్ర కోసం తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి అనేదానిపై వారికి పెద్దగా అవగాహన ఉండేది కాదు. సూచనల ద్వారా మనుషులను నిద్రలోకి పంపే హిప్నోటిజమ్, నిద్రకు సంబంధించిన ఇన్సోమ్నియా (నిద్రలేమి), సోమ్నాంబులిజం (నిద్రలో నడక) వంటి రుగ్మతల పేర్లకు గ్రీకు, రోమన్ నిద్రాధిదేవత పేర్లే మూలం. నిద్ర కోసం ప్రాచీన ఔషధాలు ప్రాచీనులు సైతం నిద్రలేమిని రుగ్మతలాగానే గుర్తించారు. ఇతర రుగ్మతలను నయం చేయడానికి ఔషధాలు ఉన్నట్లే నిద్రలేమి పోగొట్టేందుకు కూడా ఔషధాలు ప్రకృతిలోనే ఉంటాయని భావించి, నానా ప్రయోగాలు చేసేవారు. ప్రాచీన ఈజిప్షియన్లు ‘లెట్యూస్’ అనే మొక్క కాండం నుంచి కారే పాలవంటి ద్రవాన్ని నిద్రలేమికి ఔషధంగా వాడేవారు. రోమన్లు మంచు ప్రాంతాల్లో తిరిగే ఎలుకల కొవ్వును నిద్రలేమికి ఔషధంగా ఉపయోగించేవారు. మంచు ప్రాంతాల్లో తిరిగే ‘డార్మైస్’ అనే ఎలుకలు శీతాకాలంలో సుదీర్ఘకాలం శీతలనిద్రలోకి జారుకుంటాయి. నిద్రలోకి జారుకునే ముందు ఇవి విపరీతంగా ఆహారం తిని కొవ్వు పెంచుకుంటాయి. అందువల్ల వీటి కొవ్వులో నిద్ర కలిగించే లక్షణం ఉంటుందని ప్రాచీన రోమన్లు నమ్మేవారు. అయస్కాంతం వాడుకలోకి వచ్చిన తర్వాత మేగ్రెటిజం చికిత్స ద్వారా నిద్రలేమిని నయం చేసేందుకు అప్పటి వైద్యులు నానా ప్రయత్నాలు చేసేవారు. నిద్రపై శాస్త్రీయమైన దృష్టి నిద్రపై శాస్త్రీయంగా దృష్టి సారించడం పన్నెండో శతాబ్ది నుంచి మొదలైంది. తొలిసారిగా స్పానిష్ వైద్యుడు, తత్వవేత్త మైమోనిడెస్ మోసెస్ రోజులో మూడోవంతు కాలం నిద్ర మనుషులకు అవసరమని క్రీస్తుశకం 1180 సంవత్సరంలో ప్రకటించాడు. మోసెస్ అంచనా ఆధునిక వైద్యుల అంచనాలకు దగ్గరగా ఉంది. ఏయే వ్యక్తులకు ఎంతెంత నిద్ర అవసరమనే దానిపై మోసెస్ ప్రత్యేకంగా దృష్టి సారించలేదు. ఆధునిక వైద్య పరిశోధకులు ఆ పనిని పూర్తి చేశారు. మనుషుల్లోనే కాదు, సమస్త జీవరాశుల్లోనూ అంతర్గత గడియారం ఒకటి పనిచేస్తూ ఉంటుందని, దానికి అనుగుణంగానే జీవుల నిద్రవేళలు ఉంటాయని ఫ్రెంచ్ శాస్త్రవేత్త జీన్ జాక్వెస్ డి ఓర్టస్ డి మైరాన్ 1729 సంవత్సరంలో తన పరిశోధనల ద్వారా నిరూపించాడు. మరో ఫ్రెంచ్ శాస్త్రవేత్త హెన్రీ పీరాన్ నిద్రలో ఎదురయ్యే సమస్యలకు గల శారీరక కారణాలపై తొలిసారిగా దృష్టి సారించి, పరిశోధనలు సాగించాడు. తన పరిశోధనలను వివరిస్తూ 1913లో ‘లె ప్రాబ్లమె ఫిజియాలజిక్’ అనే గ్రంథం రాశాడు. అంతకు ముందు ఆస్ట్రియన్ శాస్త్రవేత్త, ఆధునిక మానసిక వైద్యశాస్త్రానికి ఆద్యుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ కలలపై పరిశోధన సాగించాడు. నిద్రలో వచ్చే కలలకు అంతశ్చేతనలోని ఆలోచనలే కారణమని వివరిస్తూ ‘ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్’ గ్రంథాన్ని రాశాడు. మనుషులు మెలకువలో ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు వారి మెదడు పనితీరులో మార్పులను ఈఈజీ (ఎలక్ట్రో ఎన్సెఫెలోగ్రామ్) ద్వారా జర్మన్ మానసిక వైద్యుడు హాన్స్ బెర్గర్ 1924లో తొలిసారిగా గుర్తించాడు. పారిశ్రామిక విప్లవం తర్వాత మనుషుల్లో నిద్రలేమి సమస్య పెరగసాగింది. నిద్రలేమి ఇతర వ్యాధులకు దారితీయడం కూడా పెరిగింది. నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర సమస్యలపై ఇరవయ్యో శతాబ్దిలో మాత్రమే వైద్య పరిశోధకులు ప్రత్యేకంగా దృష్టి సారించి పరిశోధనలు మొదలుపెట్టారు. అమెరికన్ శాస్త్రవేత్తలు ఆంథోనీ కాలెస్, అలాన్ రెషాఫెన్ తమ పరిశోధనల్లో నిద్రలోని దశలను గుర్తించారు. మనుషులు నిద్రపోయేటప్పుడు ‘ర్యాపిడ్ ఐ మూవ్మెంట్’ ఒక దశ, ‘నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్’ నాలుగు దశలు ఉంటాయని 1968లో వారు ప్రకటించారు. ఇరవయ్యో శతాబ్దిలో జరిగిన పరిశోధనలు నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర సమస్యలను నయం చేసే ఔషధాలను కనుగొనడంలోను, చికిత్స పద్ధతులను మెరుగుపరచడంలోను ఇతోధికంగా దోహదపడ్డాయి. నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర రుగ్మతలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి పలు పరిశోధనల్లో బయటపడిన నేపథ్యంలో నిద్రకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరగాల్సిన అవసరాన్ని శాస్త్రవేత్తలు, ప్రభుత్వాధినేతలు గుర్తించారు. ఫలితంగా 1987లో ‘వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్ అండ్ స్లీప్ మెడిసిన్ సొసైటీస్’ ఏర్పడింది. ఈ సంస్థ ‘జర్నల్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్’, ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్’ అనే రెండు పత్రికలను ప్రచురిస్తోంది. నిద్ర అంటే... మనం నిద్రపోతున్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆ సమయంలో మన జ్ఞానేంద్రియాలు మన చుట్టూ జరుగుతున్న మార్పులకు స్పందించడం తగ్గిపోతుంది. నిద్ర పూర్తి కాగానే మనం మామూలు స్థితిలోకి రాగలుగుతాము. అయితే నిద్ర అన్నది పూర్తిగా ఒక అచేతనావస్థ మాత్రమే కాదు. మనం నిద్రపోయే సమయంలోనూ మెదడు మన చుట్టూ జరిగే అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు నిద్రిస్తున్న తల్లి తన పక్కన పడుకున్న చిన్నారి కదలికలకు వెంటనే స్పందించి లేస్తుంది. నిద్రించే సమయంలో మనం రెండు రకాల స్థితుల్లో ఉంటాం. ఒక స్థితిలో కనుగుడ్లు వేగంగా కదలకుండా ఉంటాయి. ఈ స్థితిని నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఎన్ఆర్ఈఎం) అంటారు. రెండో స్థితిలో కనుగుడ్లు వేగంగా కదులుతుంటాయి. ఈ స్థితిని ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎం) అంటారు. రాత్రి మనం నిద్రకు ఉపక్రమించిన దగ్గరి నుంచి ఉదయం మేల్కొనే వరకు ఈ రెండు స్థితులు ఒకదాని తర్వాత మరొకటి కలుగుతాయి. ఎన్ఆర్ఈఎం, ఆర్ఈఎం అనే ఈ రెండు స్థితులూ వరుసగా మొదటిది 80 నిమిషాల పాటు, మరొకిటి 10 నిమిషాల పాటు ఉంటాయి. ఈ రెండు స్థితులు కలసిన ఒక మొత్తాన్ని ఒక సైకిల్గా చెబితే మొత్తం నిద్రలో ఈ సైకిల్స్ 4–5 సార్లు కలుగుతాయి. నిద్ర ముగింపునకు వచ్చే సరికి రెండో స్థితి సమయం ఎక్కువగా ఉంటుంది. మెలకువ నుంచి నిద్రకు ఉపక్రమించినప్పుడు ఎన్ఆర్ఈఎమ్ (మొదటి స్థితి)కి వెళ్తాం. ఈ ఎన్ఆర్ఈఎమ్లో మొత్తం నాలుగు భాగాలు ఉంటాయి. ఇందులో మూడు, నాలుగు భాగాలను గాఢనిద్రగా వ్యవహరిస్తారు. నిద్రించే సమయంలో మెదడులో జరిగే ఎలక్ట్రికల్ చర్యలను ఈఈజీ అనే ప్రక్రియ ద్వారా నమోదు చేయవచ్చు. (గుండె స్పందనలను ఈసీజీ ద్వారా నమోదు చేసినట్లుగా). దీర్ఘనిద్ర సమయంలో ఈఈజీ యాక్టివిటీ అతి తక్కువగా ఉంటుంది. నిద్రించాక తొలి భాగంలో దీర్ఘనిద్ర అధికంగా ఉంటుంది. ఈ సమయంలో గుండెవేగం, బీపీ, శ్వాసవేగం మొదలైనవి తక్కువగా ఉంటాయి. నిద్రలో ఈ భాగం చాలా ముఖ్యమైనది. మొదటి స్థితి (ఎన్ఆర్ఈఎం)లోని చివరి భాగమైన దీర్ఘనిద్ర నుంచి మళ్లీ రెండో స్థితి అయిన ఆర్ఈఎం స్థితిలోకి వెళ్తాం. ఈ స్థితిలో కనుగుడ్లు వేగంగా కదులుతాయి. ఈ స్థితిలో బీపీ, శ్వాస, గుండెవేగం పెరుగుతాయి. అయితే మన కండరాలు (కనుగుడ్లు, డయాఫ్రమ్ తప్ప మిగతావి) కదలికను కోల్పోతాయి. ఈ స్థితిలో మనం 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంటాం. కలలు ఎక్కువగా ఈ స్థితిలోనే వస్తాయి. కండరాల్లో కదలిక ఉండదు కనుక మనం కలల్లోని కదలికలను అనుగుణంగా ప్రవర్తించలేం. తెల్లవారు జామున రెండోస్థితి అయిన ఆర్ఈఎం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలోనే కలలు ఎక్కువగా వస్తాయి. నిద్ర నుంచి మెలకువ వచ్చాక మనకు ఎంతో ఉల్లాసంగా అనిపించాలి. నూతన ఉత్తేజం, శక్తి ఫీలవ్వాలి. అలా కలిగినప్పుడు చక్కటి నిద్ర పట్టినట్లు భావించాలి. (ఆర్ఈఎం దశ నుంచి నిద్రలేస్తే మనకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.) నిద్రలేమితో వచ్చే సమస్యలు నిద్రలేమి వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. పిల్లల్లో ఎదుగుదల లోపాలు ఏర్పడతాయి. నిద్రలేమి అధిక రక్తపోటుకు, డయాబెటిస్కు దారితీస్తుంది. స్థూలకాయానికి, జీర్ణకోశ సమస్యలకు కారణమవుతుంది. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల నానా మానసిక సమస్యలు ఏర్పడటం, రోగనిరోధక శక్తి క్షీణించడం, చివరకు ఆయుః ప్రమాణం కూడా తగ్గిపోవడం జరుగుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలేమి కారణంగా వాటిల్లే తక్షణ నష్టాలు ∙ఏకాగ్రత లోపం ∙అలసట / నిస్సత్తువ ∙గుండె లయలో మార్పులు ∙పనితీరులో మందకొడితనం ∙దిగులు ∙మానసిక కుంగుబాటు ∙చిరాకు, కోపం ∙ఒంటినొప్పులు, కీళ్లనొప్పులు నిద్రలేమి వల్ల శారీరక ఇబ్బందులతో పాటు మానసిక సమస్యలూ పెరుగుతాయి. భావోద్వేగాలు అదుపు తప్పడం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, యాంగై్జటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమితో బాధపడే పిల్లల్లో అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్డీ), మెదడు ఎదుగుదలలో లోపం, జ్ఞాపక శక్తి లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పెద్దల్లోనైతే యాంగై్జటీ న్యూరోసిస్, డిప్రెషన్, సైకోసిస్, మాదక ద్రవ్యాలపై ఆధారపడే పరిస్థితి తలెత్తడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రపంచంలో సగం మంది నిద్రకు దూరం మనుషుల్లో నిద్రలేమి సమస్య పెరగడం పారిశ్రామిక విప్లవం నాటి నుంచి మొదలైంది. ఇక ఈ డిజిటల్ యుగంలో నిద్రలేమి బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలో సగం మందికి పైగా తగినంత నిద్రలేక అలమటిస్తున్న వారే. ‘ప్రిన్సెస్ క్రూయిసెస్’ సంస్థ ఇటీవల విడుదల చేసిన తొమ్మిదో రిలాక్సేషన్ రిపోర్ట్–2018 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 51 శాతం మంది తగినంత నిద్రలేక ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 18 శాతం మంది దీర్ఘకాలిక నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రకు సరైన వేళలు పాటిస్తూ తగినంత సేపు నిద్రపోతున్న వారు కేవలం 35 శాతం మాత్రమే. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మెలకువగా ఉంటూ ఆలస్యంగా నిద్రపోతున్నవారు 26 శాతం మంది అయితే, రాత్రి ఆలస్యంగా నిద్రపోయినా వేకువనే మేల్కొంటున్న వారు 21 శాతం మంది వరకు ఉన్నట్లు రిలాక్సేషన్ రిపోర్ట్–2018 వెల్లడించింది. రాత్రివేళ టీవీ చూసే అలవాటు కారణంగానే ఇటీవలి కాలంలో చాలామంది నిద్రలేమికి లోనవుతున్నారని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. ఇందులో వెల్లడైన కొన్ని ఆసక్తికరమైన అంశాలు... మంచి నిద్ర కోసం... ►ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రించడం / నిద్రలేవడం ► రోజూ వ్యాయామం చేయడం ►నిద్రపోయే ముందర సమస్యలను చర్చించకూడదు ►గోరువెచ్చటి నీళ్లతో స్నానం, శ్రావ్యమైన సంగీతం వినడం, పుస్తకపఠనం నిద్రకు మంచి మార్గాలు ►రాత్రిపూట పడుకునే ముందు కాఫీ, టీ వంటివి తీసుకోకూడదు. అలాగే శీతల పానీయాలు, మద్యం కూడా మంచిది కాదు. ►టీవీ చూడటం, కంప్యూటర్ పై పనిచేయడం వంటివి రాత్రిపూట వద్దు. ►పకడగదిలో మరీ ఎక్కువ కాంతి లేకుండా, చప్పుళ్లకు దూరంగా ఉండాలి. ►పడకగదిలో మరీ ఎక్కువ చల్లగా లేకుండా, వేడిగా లేకుండా చూసుకోవాలి. కొన్ని ‘నిద్రా’ణ వాస్తవాలు మనిషి ఆరోగ్యానికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. తగినంత పోషకాహారం, వ్యాయామం ఉన్నవారికి సర్వసాధారణంగా చక్కని నిద్రపడుతుంది. ఏవైనా మానసిక ఇబ్బందులు ఉంటేనే నిద్ర కరువయ్యే పరిస్థితులు ఉంటాయి. ఎక్కువరోజులు తగినంత నిద్ర లేకుండా గడిపితే ఇతరేతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువవుతాయి. నిద్రకు సంబంధించి కొన్ని అరుదైన వాస్తవాలను అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ వెల్లడించింది. వాటిలో కొన్ని... ►స్తన్యజీవుల్లో కేవలం మనుషులు మాత్రమే ఉద్దేశపూర్వకంగా నిద్రను ఆపుకోగలరు. సృష్టిలోని పశుపక్ష్యాదులేవీ ఇలా ఉద్దేశపూర్వకంగా నిద్రను మానుకొని జాగారాలు చేయలేవు. ►ఎల్తైన ప్రదేశాల్లో నిద్ర పట్టడం కష్టమవుతుంది. సముద్ర మట్టానికి 13,200 అడుగుల ఎత్తుకు మించిన ప్రదేశాలకు చేరుకుంటే, అలాంటి ప్రదేశాల్లో తగిన ఆక్సిజన్ లేకపోవడంతో ఆరోగ్యవంతులకు సైతం నిద్రపట్టడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ►దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడుతున్న వారిలో ఒంటరి జీవితం గడుపుతున్న వారే ఎక్కువ. ►విధి నిర్వహణలో భాగంగా రకరకాల షిఫ్టుల్లో పనిచేసే వారు కూడా దీర్ఘకాలిక నిద్రలేమి, తద్వారా వచ్చే గుండెజబ్బులు, జీర్ణకోశ సమస్యల బారిన పడుతున్నారు. ►నిద్రలేమితో బాధపడేవారిలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. నిద్రకు దూరమైన వారిలో ఆకలిని నియంత్రించే ‘లెప్టిన్’హార్మోన్ పరిమాణం పడిపోవడమే దీనికి కారణం. అందుకే దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడేవారు స్థూలకాయులుగా తయారవుతారు. జాగారంలో రికార్డు మహాశివరాత్రి రోజున జాగారం ఉండటం చాలామందికి తెలిసిందే. ఒక్కరోజు జాగారం ఉంటేనే మర్నాటికి మగత మగతగా ఉంటుంది. ఎంత త్వరగా నిద్రపోదామా అనిపిస్తుంది. అలాంటిది చైనాలో ఒక సాకర్ పిచ్చోడు కేవలం సాకర్ మ్యాచ్లను నిరాటంకంగా చూడాలనే ఉబలాటంతో ఏకంగా పదకొండు రోజులు నిద్రను వాయిదా వేసుకున్నాడు. నిద్రలేమిని తట్టుకోలేక చివరకు మరణించాడు. ఈ సంఘటన 2012లో జరిగింది. అంతకు దశాబ్దాల ముందే.. 1964లో రాండీ గార్డెనర్ అనే యువకుడు ఏకధాటిగా పదకొండు రోజులు.. కచ్చితంగా చెప్పాలంటే 264.4 గంటల సేపు నిద్ర లేకుండా గడిపి గిన్నిస్ రికార్డుకెక్కాడు. – పన్యాల జగన్నాథదాసు నిద్ర సంబంధమైన సమస్యలు కొంతమందికి నిద్రలో నడవడం, కలవరించడం, పళ్లు కొరకడం, తరచు మెలకువ రావడం, భయంకరమైన కలలు రావడం వంటివి జరుగుతాయి. మరికొందరు నిద్రలో కాళ్లూ, చేతులు కదిలిస్తుంటారు. దీన్ని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు. కొందరు నిద్రలో మల–మూత్ర విసర్జనలు చేస్తుంటారు. దీన్ని నాక్చర్నల్ ఎన్యురెసిస్ లేదా ఎంకోప్రెసిస్ అంటారు. కొందరికి పగటినిద్రను నిలువరించుకోవడం కష్టమవుతుంది. తమకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంటారు. నిద్రలో ఊపిరి సక్రమంగా లేక తరచు మెలకువ రావడం వంటి సమస్యలు కూడా కొందరిలో కనిపిస్తాయి. -
హార్ట్ ఫెయిల్యూరా?
నా వయసు 68 ఏళ్లు. కొద్దిరోజులుగా నడిచినప్పుడు తీవ్రంగా ఆయాసం వస్తోంది. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండి, పాదాల వాపు కనిపించింది. డాక్టర్ను కలిస్తే పరీక్షలు చేసి, హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పారు. జీవన శైలిలోమార్పులు చేసుకోవడం మంచిదని కూడా అన్నారు. నేను నా జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులేమిటో సూచించండి. మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు ఆహారంలో తీసుకోవాల్సిన మార్పులివి... ►ఉప్పు: ఒంట్లో నీరు చేరుతూ ఆయాసం వంటి లక్షణాలు కనబడితే ఉప్పు వాడకాన్ని పూర్తిగా తగ్గించడం మంచిది. రోజుకు 2.5 గ్రాములు (అరచెంచా) కంటే తక్కువే తీసుకోవాలి. ఉప్పు వేయకుండా కూరలు వండుకోవాలి. పచ్చళ్లు, బయట దొరికే చిరుతిండ్లను పూర్తిగా మానేయాలి. ఉప్పు ఉండని – బాదం, జీడిపప్పు, ఆక్రోటు వంట్ నట్స్, పాలు, పండ్ల వంటివి ఎక్కువగా తీసుకోవచ్చు. అవసరమైతే కూరల్లో రుచి కోసం కొద్దిగా వెనిగర్ వంటివి ఉపయోగించుకోవచ్చు. ►ద్రవాహారం: ఒంట్లోకి నీరు చేరుతుంటే ద్రవాహారం తగ్గించాలి. ఒంట్లోకి నీరు చేరకపోతే మాత్రం రోజు లీటరున్నర వరకు ద్రవాహారాలు తీసుకోవచ్చు. ►విశ్రాంతి: గుండె వైఫల్యం వస్తే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి చాలామంది అనుకుంటారు. కానీ ఇది సరికాదు. వైఫల్యం తీవ్రంగా ఉంటే తప్ప... శరీరం సహకరించినంత వరకు, ఆయాసం రానంతవరకు శారీరక శ్రమ, నడక, మెట్లు ఎక్కడం వంటివి చేయవచ్చు. ►మానసికంగా ప్రశాంతంగా ఉండాలి: గుండెవైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్), అశక్తతల వల్ల మానసిక ఒత్తిడి, తీవ్ర భావోద్వేగాలు తలెత్తుతుంటాయి. రోగులు ఒత్తిడిని అధిగమించాలి. ఇందుకు యోగా, ధ్యానం వంటివి మేలు చేస్తాయని అనేక అధ్యయనాల్లో నిరూపితమైంది. ►ఈ మందులు వాడకండి: గుండె వైఫల్యం ఉన్నవారు కొన్ని మందులు... ముఖ్యంగా నొప్పులు తగ్గేందుకు వాడుకునే ఇబూప్రొఫేన్, డైక్లోఫెనాక్ వంటి ఎన్ఎస్ఏఐడీ రకం మందులు వేసుకోకూడదు. స్టెరాయిడ్స్కు దూరంగా ఉండాలి. ఇవి ఒంట్లోకి నీరు చేరేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని వాడకూడదు. నాటు మందుల్లో ఏ పదార్థాలు ఉంటాయో, అవి గుండె మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. నొప్పులు ఎక్కువగా ఉంటే... మరీ అవసరమైతే నొప్పులు తగ్గేందుకు పారాసిటమాల్ వంటి సురక్షిత మందులు వాడుకోవచ్చు. ►వైద్యపరమైన జాగ్రత్తలు: గుండె వైఫల్యానికి వాడే మందులతో కూడా అప్పుడప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తవచ్చు. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు వాటి మోతాదుల్లో మార్పులు చేసుకోవడం లేదా మందులను మార్చడం అవసరం. అందుకే తరచూ వైద్యులను సంప్రదించి, వారి సూచనలు తప్పక పాటించాలి. అరిథ్మియాఅంటే ఏమిటి? నా వయసు 37 ఏళ్లు. రెండు వారాల కిందట అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాను. స్పృహ వచ్చాక కూడా చాలా నీరసంగా ఉంది. అప్పట్నుంచి కళ్లు తిరుగుతున్నాయి. చాలా ఆయాసంగా ఉంది. ఊపిరితీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటోంది. డాక్టర్ను కలిస్తే ఎరిథ్మియా కావచ్చు అన్నారు. అరిథ్మియా అంటే ఏమిటి? నాకు చాలా ఆందోళనగా ఉంది. సలహా ఇవ్వండి. సాధారణంగా మన గుండె మామూలుగా నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి. అలా కాకుండా 60 కన్నా తగ్గినా లేదా 100 కన్నా పెరిగినా ఆ కండిషన్ను అరిథ్మియా అంటారు. కానీ ఎవరైనా తీవ్ర భయాందోళనలకు గురైనప్పుడు, వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం 100 నుంచి 160 మధ్యన ఉంటుంది. దీన్ని సైనస్ టాకికార్డియా అంటారు. ఇలా కాకుండానే గుండె వేగం దానంతట అదే ఇంకా పెరిగితే అది జబ్బువల్ల కావచ్చు. ఈ లక్షణంతో మరి కొన్నిరకాల గుండెజబ్బులు ఉండవచ్చు. సమస్య ఏదైనా గుండె వేగం మరింత పెరిగినా లేదా తగ్గినా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. మీరు స్పృహ కోల్పోయినట్లు చెప్పారు కాబట్టి వెంటనే దగ్గర్లోని కార్డియాలజిస్ట్ని కలిసి ఈసీజీ, ఎకో, హోల్టర్ పరీక్షల్లాంటివి చేయించండి. మీరు స్పృహ కోల్పోడానికి గుండె జబ్బే కారణమా, మరి ఇంకేదైనా సమస్య వల్ల ఇలా జరిగిందా తెలుసుకొని దానికి తగిన విధంగా చికిత్స తీసుకోవడం అవసరం. ఇప్పుడు ఆధునిక వైద్య విజ్ఞానం వల్ల అన్నిరకాల జబ్బులకు మంచిమందులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఆందోళన చెందకండి. - డాక్టర్ అనూజ్ కపాడియా, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ సీఏబీజీ సర్జరీ అంటే ఏమిటి? నా వయసు 67 ఏళ్లు. ఇటీవల ఒక రోజు ఛాతీనొప్పి వస్తే పరీక్షించిన డాక్టర్లు సీఏబీజీ సర్జరీ చేయాలని చెప్పారు. అంటే ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు, రక్తసరఫరాకు అవరోధం కలగకుండా, సీఏబీజీ అనే సర్జరీ చేసి, రక్తాన్ని ఇతర మార్గాల్లో (బైపాస్ చేసిన మార్గంలో) గుండెకండరానికి అందేలా చేసే ఆపరేషనే సీఏబీజీ. మనం ఇంగ్లిష్లో సాధారణంగా ‘బైపాస్ సర్జరీ’ అని పిలిచే దీన్ని వైద్యపరిభాషలో కరొనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అని వ్యవహరిస్తారు. దాని సంక్షిప్తరూపమే ఈ సీఏబీజీ ఆపరేషన్. ఇందులో కాళ్లు లేదా చేతులపై ఉన్న రక్తనాళాలను తీసి, గుండెకు అడ్డంకిగా ఏర్పడిన రక్తనాళాలకు ప్రత్యామ్నాయంగా, రక్తాన్ని బైపాస్ మార్గంలో అందించేలా అమర్చుతారు. సాధారణంగా ఒక బ్లాక్ (అడ్డంకి)ని బైపాస్ చేయాలంటే ఒక రక్తనాళం అవసరం. గుండె వద్ద ఉన్న రక్తనాళాన్ని నేరుగా బైపాస్ చేసే ప్రక్రియను రీ–వా స్క్యులరైజేషన్ అంటారు. ఛాతీకీ కుడి, ఎడమ వైపున ఉన్న రక్తనాళాలను ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ అంటారు. గుండెకు ఎడమవైపున ఉన్న నాళాన్ని లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అర్టరీ అని అంటారు. ఈ రక్తనాళాన్ని బ్లాక్ అయిన నాళాల వద్ద బైపాస్ మార్గంలా కలుపుతారు. దీర్ఘకాల ప్రయోజనాలతో పాటు రోగి త్వరగా కోలుకుంటున్నందున ఇప్పుడు బైపాస్లోనూ సరికొత్త విధానాన్ని పాటిస్తున్నారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత, భవిష్యత్తులో ఇలా మార్చిన రక్తనాళాల్లోనూ కొవ్వు పేరుకోకుండా హృద్రోగులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రక్తనాళాల్లో పేరుకున్న బ్లాక్స్ను అధిగమించి, రక్తాన్ని గుండెకు చేరవేసేందుకు వీలుగా బైపాస్ సర్జరీ చేస్తారు. అంతేతప్ప ఇది చేయడం వల్ల అప్పటికే ఉన్న గుండెజబ్బు తొలగిపోయిందని పేషెంట్ అపోహ పడకూడదు. అందుకే రోగి మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవే... రోగికి హైబీపీ ఉన్నట్లయితే దాన్ని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకునేలా డాక్టర్ సూచించిన మందులు తీసుకోవాలి. అలాగే రోగికి డయాబెటిస్ ఉంటే, రక్తంలోని చక్కెరపాళ్లు ఎల్లప్పుడూ అదుపులో ఉండేలా మందులు తీసుకుంటూ, కొవ్వులు తక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ఇక పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తక్షణం పూర్తిగా మానేయాలి. డాక్టర్లు సూచించిన తగిన వ్యాయామాలు చేస్తూ ఉండాలి. -
ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను
సంగారెడ్డి రూరల్: ‘మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను.. ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని లెటర్ రాసి మిత్రుడికి మెయిల్ చేసిన ఐఐటీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా కంది శివారులోని ఐఐటీ హైదరాబాద్లో ఈ సంఘటన చోటుచేసుకుందని రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాజన్ కుటుంబం హైదరాబాద్లోని తిరుమలగిరిలో నివాసం ఉంటోంది. రాజన్ కుమారుడు అనిరుధ్య (21) కంది ఐఐటీ హైదరాబాద్లోని డీ బ్లాక్లో గల హాస్టల్లో ఉంటూ బీటెక్ మెకానికల్ అండ్ ఏరోస్పేస్ కోర్సు ఫైనలియర్ చదువుతున్నాడు. కాగా, అనిరుధ్య.. మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని లెటర్ రాసి గురువారం రాత్రి 12 గంటల సమయంలో మిత్రుడు కనిష్క్రెడ్డికి మెయిల్ చేశాడు. అనంతరం హాస్టల్ ఏడో అంతస్తు పైకి చేరుకుని భవ నంపై నుంచి కిందికి దూకేశాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావ డంతో అనిరుధ్యకు ఐఐటీలోని ఆస్పత్రిలో ప్రథమచికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉండగా... మృతుడి తండ్రి రాజన్ మాట్లాడుతూ ఈ మధ్యే తన కుమారుడు సెలవుపై ఇంటికి వచ్చి వెళ్లాడని, ఇంతలోనే ఏం జరిగిందో అంతుబట్టడంలేదన్నారు. ప్రమాదానికి ముందు అనిరుధ్య టెర్రస్పైకి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయినట్లు ఎస్ఐ తెలిపారు. ఐఐటీ క్యాంపస్ సెక్యూరిటీ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
బెంగళూరు: ఐటీకి ఏటా 24 వేల కోట్ల నష్టం
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగుల శారీరక అనారోగ్యం, శారీరక శ్రమ రాహిత్యం, మానసిక ఉద్వేగం తగ్గిపోయి మానసిక ఒత్తిడి పెరడగం, క్రమశిక్షణలేని జీవన శైలి తదితర కారణాల వల్ల భారత సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరులో ఏటా ఐటీ పరిశ్రమకు 24 వేల కోట్ల రూపాయల రాబడి తగ్గుతోందట. రెడ్సీర్ కన్సల్టింగ్ సంస్థ బెంగళూరులోని పది పెద్ద ఐటీ కంపెనీలలోని 500 మంది ఉద్యోగులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఈ అధ్యయనం జరిపింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ట్రీ లాంటి భారతీయ కంపెనీలకు ప్రపంచ హెడ్ క్వాటర్స్ ఇక్కడ ఉండగా, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలకు ఇక్కడ భారతీయ హెడ్ క్వాటర్స్ ఇక్కడ ఉన్నాయి. భారత దేశం మొత్తం మీద ఐటీ పరిశ్రమలో 165 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుండగా, ఒక్క బెంగళూరు నగరంలోనే ఏటా 50 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. ఉద్యోగుల శారీరక, మానసిక అనారోగ్యం, అపసవ్య జీవన శైలి తదితర కారణాల వల్ల నగరంలోని మొత్తం రెవెన్యూలో ఏడు శాతం నష్టపోతున్నారు. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులకే ఎక్కువగా అనారోగ్య అలవాట్లు, అనారోగ్య జీవన శైలి ఉందని, నష్టపోతున్న రెవెన్యూలో 42 శాతం వాటా వీళ్ల కారణంగానే జరుగుతోందని అధ్యయనం తేల్చింది. యువతీ యువకులకు వేళకు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శారీరక బలహీనత సమస్యలు తలెత్తుతుంటే పెద్ద వారికి సరైన వ్యాయామం లేదా శారీరక శ్రమ లేకపోవడం వల్ల బలహీనత సమస్యలకు గురవుతున్నారు. ఇదివరకు ఉద్యోగుల్లో శారీరక, మానసిక ఉల్లాసానికి అట పాటలకు క్యాంపస్లోనే సౌకర్యాలు ఉండేవి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశమ్రలో మాంద్యం లాంటి పరిస్థితులు ఏర్పడడంతో ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా కంపెనీల యాజమాన్యాలు ఇలాంటి సౌకర్యాలను తొలగించింది. ఇదివరకు ఉద్యోగుల కోసం ‘ఫిజికల్ ఫిట్నెస్’ సిబ్బంది కూడా ఉండేవారట. వారంతా కూడా కాలక్రమంలో కనిపించకుండా పోయారు. ఉద్యోగులే వారంతట వారే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ‘మెడిటేషన్’ లాంటి విద్యలు ప్రాక్టీస్ చేస్తున్నారట! -
‘సోషల్’ అతిగా వాడితే అనర్థమే
న్యూయార్క్: సామాజిక మాధ్యమాలను అతిగా వాడటం వల్ల మానసిక ఒత్తిడి, ఒంటరితనం వంటివి దరిచేరుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఫేస్బుక్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల వినియోగం ఆరోగ్యానికి హానికరంగా మారుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ‘సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నపుడే మీరు మీ జీవితానికి కావాల్సిన ప్రశాంతమైన సమయాన్ని గడపుతారు’అని అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన మెలిస్సా హంట్ తెలిపారు. -
నెలసరి... సమస్యలిక సరి
మహిళల్లో క్రమ రహిత ఋతుచక్రం ఇప్పుడు సర్వసాధారణం. ఉండాల్సిన దానికన్నా తక్కువ బరువు ఉండడం, ఒబేసిటీ, అనెరెక్సియా (బరువు పెరుగుతామనే భయంతో తక్కువగా తినడం) మానసిక ఒత్తిడి, గర్భ నిరోధక మాత్రలు, హార్మోన్ల సమస్యలు, థైరాయిడ్, పిసిఒడి... వంటì వన్నీ కారణాలే. యోగలో దీనికి చక్కని పరిష్కారాలున్నాయి. ఋతుక్రమ సమస్య రజస్వల అయిన 5 సంవత్సరాల వరకూ, మెనోపాజ్కి 3 సంవత్సరాల ముందు ఎక్కువగా బాధిస్తుంటుంది. ఈ అవస్థ నుంచి బయటపడడానికి విటమిన్డి, కాల్షియం సప్లిమెంట్స్, సోయా, ఫ్లాక్స్ సీడ్ (అవిసెగింజలు) వాడడం, హెర్బల్ మెడిసిన్స్ వాడవచ్చు. వీటన్నింటికన్నా క్రమం తప్పని యోగ సాధన ఎంతైనా ఉపయుక్తం. నిలబడి చేసే ఆసనాల్లో తాలాసన, తాడాసన, త్రికోణాసన, పార్శ్వకోణాసన, కూర్చుని చేసే వాటిలో వక్రాసన, మరీచాసన, భరద్వాజాసన, ఉష్ట్రాసన, అర్ధ ఉష్ట్రాసన, అథోముఖ శ్వానాసన, బద్ధ కోణాసన, బోర్లాపడుకుని చేసే వాటిలో భుజంగాసన, ధనురాసన వంటివి ఉపకరిస్తాయి. వీటిని సాధన చేస్తే పునరుత్పత్తి వ్యవస్థ బాగా ప్రభావితమై సమస్య పరిష్కారమవుతుంది. 1 భరద్వాజాసనం కాళ్లు రెండూ ఎడమవైపు మడిచి శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ శరీరానికి కుడివైపు నేలమీద ఉంచి తలను, ఛాతీని, నడుమును, వెనుకకు పూర్తిగా తిప్పుతూ 2,3 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ తల, ఛాతీ మధ్యలోకి తీసుకురావలెను. ఇదే విధంగా వ్యతిరేక దిశలో చేయవలెను. ఈ ఆసనాన్ని 3 లేదా 5 సార్లు రిపీట్ చేయవచ్చు. 2 పరివృత్త పార్శ్వకోణాసనం సమస్థితిలో నిలబడాలి. కుడికాలు ముందుకి ఎడమ కాలు వెనుకకి (కాళ్ళ మధ్యలో 3 లేదా 4 అడుగుల దూరం) ఉంచాలి. కుడి మోకాలు ముందుకు వంచి ఎడమ కాలిని వెనుకకు బాగా స్ట్రెచ్ చేయాలి, నడుమును ట్విస్ట్ చేస్తూ ఛాతీని కుడివైపుకి తిప్పి, ఛాతీని తొడభాగానికి నొక్కుతూ ఎడమ ఆర్మ్పిట్ (చంకభాగం) కుడి మోకాలు మీదకు సపోర్టుగా ఉంచి వెనుకకు చూస్తూ రెండు చేతులు నమస్కార ముద్రలో ఉంచాలి. కొంచెం సౌకర్యంగా ఉండటానికి ఎడమ మడమను పైకి లేపి పాదాన్ని, కాలి వేళ్ళను ముందు వైపుకి తిప్పవచ్చు. 3 లేదా 5 శ్వాసలు తరువాత తిరిగి వెనుకకు వచ్చి ఇదే విధంగా రెండో వైపు కూడా చేయాలి. నమస్కార ముద్రలో చేతులు ఉంచలేని వాళ్లు ఎడమ అరచేతిని పూర్తిగా నేలమీద ఉంచి కుడిచేతిని కుడి చెవికి ఆనించి ముందుకు స్ట్రెచ్ చేస్తూ కుడి అరచేతిని చూసే ప్రయత్నం చేయవచ్చు. 3 అర్ధ ఉష్ట్రాసనం వజ్రాసనంలో... అంటే మోకాళ్లు మడిచి మడమలు పాదాల మీద (మోకాళ్లు రెండింటి మధ్య ఒక అడుగు దూరం ఉంటే సౌకర్యంగా ఉంటుంది) కూర్చోవాలి. అవసరం అయితే మడమల కింద ఒక దిండును ఉపయోగించండి. ఎడమ అరచేయి ఎడమ పాదం వెనుకగా భూమి మీద ఉంచి చేతిని నేలకు ప్రెస్ చేస్తూ సీట్ భాగాన్ని పైకి లేపుతూ కుడి చేయిని ముందు నుండి పైకి తీసుకు వెళ్లి శ్వాస తీసుకున్న స్థితిలో శరీరాన్ని విల్లులాగా వెనుకకు వంచుతూ పొట్టను ముందుకు నెట్టే ప్రయత్నం చేయాలి. (ఎడమ అరచేయి భూమిమీద సపోర్ట్గా ఉంచినట్టయితే వెన్నెముకకు డ్యామేజ్ జరగదు). శ్వాస వదులుతూ తిరిగి వజ్రాసనంలోకి రావాలి. అదే విధంగా రెండవవైపు కూడా చేయాలి. అనుభవం ఉన్న సాధకులు ఎడమ అరచేతిని ఎడమ పాదం మీద ఉంచి పొట్టను ముందుకు నెట్టే ప్రయత్నం చేయవచ్చు. 4 యోగ కాయ చికిత్స పైన చెప్పిన ఆసనాలతో పాటు యోగ కాయ చికిత్స కూడా మంచి ఫలితాన్నిçస్తుంది. న్యూరాన్ ట్రాన్స్మిషన్ చానెల్స్కి సంబంధించిన బయోఫీడ్ మెకానిజంతో పనిచేయడమే ఈ యోగ కాయ చికిత్స. ఈ చికిత్సను 21 లేదా 40 రోజులు గాని క్రమం తప్పకుండా చేస్తే పిసిఒడి సమస్య, పొట్టలో లేదా ఛాతీలో ఏర్పడిన గడ్డలు (ఫైబ్రాయిడ్స్) కరిగిపోతాయి. చేసే విధానం పొట్ట మీద గడియారం దిశలో కొంచెం మీడియం సైజ్ సర్కిల్లో మృదువుగా అరచేతితో మర్దన చేయాలి. పొత్తికడుపు కింది భాగం నుంచి పైకి బొడ్డు భాగం వరకూ అప్వార్డ్ దిశలో... బొడ్డు భాగం నుంచి పక్కలకు పై నుంచి కిందకు డయాగ్నల్గా రోజూ 20 నిమిషాల చొప్పున ఉదయం సాయంత్రం మర్దన చేయాలి. ప్రాణయామాలు, తేలికపాటి ఆసనాలు తప్ప పొట్ట మీద ఒత్తిడి కలిగించే ఆసనాలు పీరియడ్స్ టైమ్లో చేయకూడదు. 5 ధనురాసనం నేలపై బోర్లాపడుకుని మోకాళ్ళని వంచి చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళి కాలి చీలమండల్ని పట్టుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకొని వదిలేస్తూ మోకాళ్ళని పైకెత్తుతూ రెండు కాళ్ళని, ఛాతీని పైకెత్తాలి. పొట్ట మాత్రమే నేలను తాకుతూ ఉంటుంది. శరీరం బరువు మొత్తం పొట్ట మీద ఉంటుంది. శరీరం ధనుస్సు మాదిరిగా ఉంటుంది. ముందు కాళ్ళను పైకెత్తుతూ, ఛాతీని పైకెత్తితే నడుము మీద ఒత్తిడి పడదు. కాళ్ళను పైకెత్తే క్రమంలో మోకా ళ్ళను ఎడంగా ఉంచాలి. అప్పుడు ఆసనంలోకి వెళ్ళటం తేలిక అవుతుంది. సాధ్యమైనంత సేపు ఆసనంలో ఉండి నెమ్మదిగా ఛాతీ నేలకు ఆనించి తర్వాత కాళ్ళను నేలకు ఆనించి నిదానంగా బయటకు రావాలి. - ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ – సమన్వయం: ఎస్. సత్యబాబు, ఫొటోలు: పోచంపల్లి మోహనాచారి -
మనోల్లాస యోగం
వ్యక్తిగత సమస్యలు, సామాజిక సమస్యలు, వృత్తి నిర్వహణలో వచ్చే సమస్యలు, విద్యార్థుల సమస్యలు – ఇవన్నీ మానసిక ఒత్తిడికి కారణం అని అందరికీ తెలుసు. కానీ, ఈ ఒత్తిడి వల్ల మనసు, శరీరంపై ఎటువంటి దుష్ప్రభావం ఉంటుందో ముందుగా తెలుసుకుంటే ఈ సమస్యను నివారించడం లేదా పరిష్కరించడం ఎంత ముఖ్యమో అర్థం అవుతుంది. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు శరీరంలోని ఎడ్రినల్ గ్రంధులు కార్టిజోన్, ఎడ్రినలిన్, నార్ ఎపినెఫ్రైన్ అనే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఎడ్రినలిన్ వలన గుండె వేగం పెరిగి తద్వారా రక్తపోటు పెరుగుతుంది. కార్టిజోన్ వలన రక్తనాడుల లోపల లైనింగ్ పనితీరు క్రమం దెబ్బతింటుంది. ఇది గుండెపోటుకు దారి తీయవచ్చు. కార్టిజోన్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు ఆకలికి సంబంధించి మార్పులు రావడం, బరువు పెరగడం, జీర్ణాశయ సమస్యలు, ఆస్టియోపొరోసిస్, క్యాన్సర్, డయాబెటిస్ వ్యాధులకు కారణమవుతుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ని ఉత్పత్తి చేసి, ఉన్న బ్రెయిన్ సెల్స్ చనిపోవడానికి, కొత్త బ్రెయిన్ సెల్స్ పుట్టకుండా చేస్తుంది. ఇది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, స్కీజోఫ్రేనియా, డిమిన్షియా, అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. యోగ ఆసనాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. దీనికి చేయవలసిన కొన్ని ముఖ్యమైన ఆసనాలు –ఒత్తిడిలో ఉన్నప్పుడు ముందుగా తలలోని భాగాలు, మెడ, భుజాలు బాగా ప్రభావితమవుతాయి. కనుక వీటికి సంబంధించిన యోగాసనాలు చేయాలి. వీటిలో బ్రహ్మముద్రలు, చాలన తాలాసన, ఉత్థాన హస్తపాదాసన. మార్జాలాసన, అర్ధ అధోముఖ, అధోముఖ శ్వానాసన, నిరాలంబాసన, ఉదరాకర్షణాసన, మకరాసన, శశాంకాసన.. వంటి తేలికపాటి ఆసనాలు రెగ్యులర్గా సాధన చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. యోగనిద్ర, సరైన ధ్యాన మార్గాలను కూడా సాధన చేసినట్లయితే సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంది. ఆసనాలు చేసే విధానం... 1.చాలన తాలాసన కుడి ఎడమలకు ముందు సమస్థితిలో నిలబడి, కుడికాలు ముందుకు ఎడమకాలు వెనుకకు ఉంచి శ్వాసతీసుకుంటూ చేతులు రెండూ పైకి లేపి, శ్వాస వదులుతూ చేతులు రెండూ ముందు నుండి డయాగ్నల్గా కిందకు తీసుకురావాలి. కాలి మడమను తిప్పుతూ వెనుకకు తిరుగుతూ చేతులు రెండూ డయాగ్నల్గా క్రిందనుంచి పైకి తీసుకువెళ్ళి చేతులు విశ్రాంతిగా భుజాల వెనుక ఉన్న ట్రెపీజియస్ కండరాల మీద ఉంచాలి. ఈ విధంగా ముందునుండి వెనుకకు, వెనుక నుండి ముందుకు 5 నుండి 10 సార్లు చేయాలి. ఇదేవిధంగా రెండవవైపు కూడా చేయాలి. నెమ్మదిగా, సౌకర్యవంతంగా శ్వాస తీసుకుని వదులుతూ చేయాలి. 2. ఉత్థాన హస్తపాదాసన సమస్థితిలో నిలబడి శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ ముందు నుండి పైకి తీసుకువెళ్ళి, శ్వాస వదులుతూ మోకాళ్లు ముందుకు వంచి క్రిందకు వంగి, చేతులు రెండూ ఫొటోలో చూపినట్లుగా వెనుకకు, పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ ముందు నుంచి పైకి తీసుకువెళ్లాలి. ఇలా 5 నుంచి 10 సార్లు చేయవచ్చు. 3. అధోముఖ శ్వానాసన చేతులు రెండూ క్రిందకు ఉంచిన తరువాత (పై పొజిషన్లో) కుడికాలు వెనుకకు తరువాత ఎడమకాలు వెనుకకు తీసుకువెళ్లి శ్వాస వదులుతూ నడుమును పైకి తీసుకువెళ్లి పొట్టని బాగా లోపలకు లాగుతూ 3 లేదా 5 శ్వాసలు ఉండాలి. ఈ స్థితిలో తలవైపునకు రక్తప్రసరణ పెరిగి మెదడు తదితర భాగాలు చురుకుగా పనిచేస్తాయి. 4. నిరాలంబాసన పై స్థితిలో నుండి శ్వాస తీసుకుంటూ కుడి మోకాలు క్రిందకు, తరువాత ఎడమ మోకాలు క్రిందకి తీసుకువచ్చి మార్జాలాసనంలో రిలాక్స్ అవ్వాలి. తరువాత రెండు కాళ్ళు వెనుకకు స్ట్రెచ్ చేస్తూ పొట్ట భాగాలు పూర్తిగా నేలకు తాకే విధంగా చెక్ చేసుకుంటూ మోచేతులు రెండూ నేలమీద ఉంచి, చేతులు గడ్డం కింద ఉంచి 3 నిమిషాలు రిలాక్స్ అవ్వచ్చు. 5. ఉదరాకర్షణాసన భూమి మీద బోర్లాపడుకుని కుడి చేయి నడుముకి పక్కన, ఎడమ చేయి తలకు సమాంతరంగా ఎడమ మోకాలు మడచి ఎడమపాదం కుడి తొడకు దగ్గరగా తీసుకువచ్చి శరీరంలో వీలైనన్ని భాగాలు భూమి మీద ఆనిస్తూ రిలాక్స్ అవ్వాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా కనీసం 3 నిమిషాల పాటు రిలాక్స్ అవ్వాలి. ఇది హై బీపీని తగ్గించడంలో మెటబాలిక్ రేట్ని రెగ్యులేట్ చేయడంలో ఉపయోగపడుతుంది. 6. యోగనిద్ర పైన చెప్పిన ఆసనాలు అన్నీ పూర్తయిన తరువాత కొన్ని తేలికపాటి ప్రాణాయామాలు (సూర్య భేది, అనులోమ విలోమ, చంద్రభేది, భ్రామరి) చేయాలి. తర్వాత యోగనిద్రలోకి వెళ్లి, 5 నుండి 10 నిమిషాల పాటు శరీరంలోని భాగాలన్నిటిమీద, మాడుపై భాగం నుండి కాలి వేళ్ళ వరకు మనో నేత్రంతో చూస్తూ రిలాక్స్ అవ్వాలి. దీని వలన ఆయా అవయవాలకు సాంత్వన, మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ ,యోగా ఫౌండేషన్ -
యోగాతో రోగాలు దూరం
∙ మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు ∙ సంపూర్ణ ఆరోగ్యం.. జీవిత కాలం పెంపు ∙ పాఠశాలస్థాయి నుంచి అలవరచుకోవాలి మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలోని సిద్ధార్థ్ విద్యాసంస్థల్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్చౌదరి మాట్లాడుతూ యోగ గొప్పదనాన్ని విద్యార్థులకు వివరించారు. ప్రతినిత్యం యోగా చేయడం ద్వారా ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. చక్కటి ఆరోగ్యం కోసం యోగాసనాలు వేయాలని ప్రిన్సిపల్ సంధ్యారాణి విద్యార్థులకు సూచించారు. మెదక్రూరల్: యోగాసనాలు వేయడంతో మానసిక ఒత్తిడి..శారీరక శ్రమను అధిగమించవచ్చని రిటైర్డ్ ఇంజనీర్ మురహరిరావు సూచించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం మెదక్ మండలంలోని మాచవరం, చిట్యాల తదితర ప్రభుత్వ పాఠశాలల్లో యోగా డే నిర్వహించారు. మండల పరిధిలోని మాచవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అదే గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి, రిటైర్డ్ ఇంజనీర్ మురహరిరావు ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక జీవనంలో మానసిక ఒత్తిడి, శారీరక శ్రమను తగ్గించుకోవడానికి యోగాసనాలు వేయడం ఒక్కటే మార్గమన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వలన పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు కీడలు, యోగాలోకూడా ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. యోగా నేర్చుకునే విద్యార్థులకు టీషర్ట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సింహరావు, సత్యనారాయణ, ఉపాధ్యాయులు తదితరులున్నారు. టేక్మాల్(మెదక్): మండలంలో అంతర్జాతీయ యోగా డేని బుధవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థులచే పలు ఆసనాలు వేయిస్తూ యోగా ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు. మండల కేంద్రమైన టేక్మాల్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు వయాగ్రాసం, బకాసన్, సేతుబంద చక్రాసనం, ఎకపాద చక్రాసనం, ద్విపాద వృశ్చికాసనం, భూమాసనం వంటి ఆసనాలు వేయించారు. శారీరక, మానసిన ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని హెచ్ఎం మిజ్బా విద్యార్థులకు సూచించారు. రామాయంపేట(మెదక్ ): మండలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. మంజీరా విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యోగా శిక్షకుడు రవీజీ విద్యార్థులకు, స్థానికులకు యోగాలో శిక్షణ ఇచ్చారు. పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో సీఐ వెంటక్రెడ్డి, పతంజలి ఆరోగ్య కేంద్రం నిర్వాహకులు కైరంకొండ తిరుపతి, శిక్షకులు నరేశ్, భరత్, ప్రవీణ్, ప్రిన్సిపాల్ జితేందర్రెడ్డి, డైరెక్టర్ రామచందర్గౌడ్, ప్రిన్సిపాల్ సురేశ్, స్వాభిమాన్ ట్రస్ట్ ప్రతినిధులు రాజశేఖర్రెడ్డి, సంగమేశ్వర్, దేమె భూమయ్య, ముత్యాలు, పండరినాధ్ పాల్గొన్నారు. రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి, లెక్చరర్లు బాలప్రకాశ్, అరుణ, యతి రాజవల్లి, వెంటకలీలావతి, శ్రీనివాస్, మల్లేశం, అశోక్, శ్రీదేవి పాల్గొన్నారు. అలాగే అక్కన్నపేట జెడ్పీహెచ్ఎస్లో హెచ్ఎం శ్రీనివాస్, ఇతర పాధ్యాయులు పాల్గొన్నారు. నిజాంపేట(మెదక్): మండలంలోని కల్వకుంట ఉన్నత పాఠశాలలో జరిగిన యోగా కార్యక్రమంలో శిక్షకుడు భరత్, హెచ్ఎం పద్మజ, టీచర్లు రామ్మోహన్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. పాపన్నపేట(మెదక్): మండలంలోని పలు పాఠశాలల్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్శహించారు. చీకోడ్ ప్రాథమిక పాఠశాలలో యోగా ఆకృతిలో కూర్చున్న విద్యార్థులు యోగా విన్యాసాల్ని ప్రదర్శించారు. అలాగే పొడిచన్పల్లి, అబ్లాపూర్, నార్సింగి, ఎల్లాపూర్, శానాయిపల్లి పాఠశాలల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం కిషన్, అంజనాచారి, ఢాక్యా, జ్యోతి, దుర్గాగౌడ్, లక్ష్మీనారాయణ, సంధ్యారాణి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హవేళిఘణాపూర్(మెదక్): హవేళిఘణాపూర్ ఉన్నత పాఠశాల, ఔరంగాబాద్ తండా ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపాల్ ఉపాధ్యాయులు వైద్య శ్రీనివాస్, వసంత్కుమార్, రాజశేఖర్ తదితరులున్నారు. అల్లాదుర్గం(మెదక్): మండల పరిధిలోని చిల్వెర, అల్లాదుర్గం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం యోగా దినోత్సవం జరుపుకున్నారు. యోగా చేస్తే ఆరోగ్యవంతంగా ఉంటారని చిల్వెర పాఠశాల హెచ్ఎం కందర్ప చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు కచుర్రావ్, జానార్ధన్, ఎన్సీసీ అధికారి మహేశ్, సవిత తదితరులు పాల్గొన్నారు. పెద్దశంకరంపేట(మెదక్) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులు యోగాపై అవగాహన కల్పించారు. దీంతో పాటు పేటలోని రామాలయం, చీలాపల్లిలో యోగాగురువు లక్ష్మీనారాయణ యోగాసనాలపై వివరించారు. కార్యక్రమంలో యోగా అభ్యాసకులు, ఉపాద్యాయులున్నారు. చిన్నశంకరంపేట(మెదక్): యోగాతో శారీరక దారుఢ్యంతోపాటు మానసిక శక్తిని పొందవచ్చని చిన్నశంకరంపేట ప్రభుత్వ కళశాల ప్రిన్సిపాల్ డి.నాగేందర్ పేర్కొన్నారు. బుధవారం చిన్నశంకరంపేట ప్రభుత్వ కళశాలలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ హెచ్ఎం రమేష్ కుమార్ పాల్గొన్నారు. -
మైగ్రేన్కు మందులున్నాయా?
హోమియో కౌన్సెలింగ్ నాకు విపరీతమైన తలనొప్పి వస్తోంది. వారంలో ఒకటి, రెండు సార్లు తీవ్రంగా వస్తోంది. ఎన్నో రక్తపరీక్షలు, ఎక్స్–రే, స్కానింగ్ పరీక్షలు చేయించాను. డాక్టర్లు దీన్ని మైగ్రేన్గా నిర్ధారణ చేశారు. జీవితాంతం వస్తుంటుందని చెప్పారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? – శ్రీరామ్మూర్తి, నిడదవోలు నేటి ఆధునికయుగంలో శారీరక, మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనలు తలనొప్పికి ముఖ్యమైన కారణాలు. ఇంకా రక్తపోటు, మెదడు కణుతులు, మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణల్లో మార్పులు, సైనసైటిస్ మొదలైన వాటివల్ల తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం ఉంది. తలనొపి ఏ రకానికి చెందినదో నిర్ధారణ తర్వేత ఖచ్చితమైన చికిత్స చేయడం సులువవుతుంది. కారణాలు, అది ఏరకమైనది అయినప్పటికీ తరచూ తలనొప్పి వస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. మైగ్రేన్ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధికప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలోనే ఎక్కువ. మైగ్రేన్లో దశలూ, లక్షణాలు : సాధారణంగా మైగ్రేన్ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్ మైగ్రేన్ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ: రక్తపరీక్షలు, రక్తపోటును పరీక్షించడం, సీటీస్కాన్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్ను నిర్ధారణ చేయవచ్చు. నివారణ: మైగ్రేన్ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు మనం తినే ఆహారంలో మార్పులు, మనం ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావారణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి. చికిత్స: మైగ్రేన్ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంశీక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటిని అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్ కన్స్టిట్యూటషన్ సిమిలియమ్ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకొని బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్కు అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ ఏడాదిలో నాలుగుసార్లు యూరినరీ ఇన్ఫెక్షన్ పీడియాట్రిక్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు రెండేళ్లు. వాడికి తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తోంది. గత ఏడాదిలో నాలుగు సార్లు వాడికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. తరచూ వాడికి ఇలా ఇన్ఫెక్షన్ రావడం మమ్మల్ని ఆందోళనలో పడేస్తోంది. దయచేసి వాడి విషయంలో మాకు తగిన సలహా ఇవ్వండి.– ప్రవీణ్కుమార్, వరంగల్ మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్ను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇది మూత్ర విసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రావచ్చు. అంటే మూత్రం తయారయ్యే మూత్రపిండాల వద్ద గానీ లేదా మూత్రపిండాల నుంచి మూత్రాశయానికి (బ్లాడర్కు) తీసుకువచ్చే నాళాల్లో (యురేటర్స్లో) గానీ లేదా మూత్రాశయం నుంచి మూత్రాన్ని బయటకు విసర్జించేందుకు ఉపయోగపడే నాళమైన యురెథ్రాలో గానీ... ఇలా ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా చెబుతారు. అంటే... ఇన్ఫెక్షన్కు కలగజేసే సూక్ష్మక్రిములు ఈ మూత్రవిసర్జన వ్యవస్థలోకి చేరి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ కలిగిస్తాయన్నమాట. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ కలిగించే జీవులు బ్లాడర్ నుంచి పై వైపునకు ప్రసరించి మూత్రపిండాలకు (కిడ్నీలకు) హాని చేయవచ్చు. కిడ్నీలలో అబ్నార్మాలిటీ ఉన్న పిల్లల్లో (ఉదాహరణకు అబ్స్ట్రక్షన్, విసైకో యురెటెరిక్ రిఫ్లక్స్), కిడ్నీలలో రాళ్లు, మూత్రాశయం (బ్లాడర్) పూర్తిగా ఖాళీ కాకుండా అక్కడ కొంత మూత్రం మిగిలిపోవడం, మలబద్దకం వంటి సమస్యలు ఉన్న పిల్లల్లో మిగతావారి కంటే ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు గురైన పిల్లల్లో తీవ్రమైన జ్వరం మొదలుకొని అనేక లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, కడుపునొప్పి వంటివి కనిపించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ కిడ్నీకి పాకి అక్కడ కిడ్నీని దెబ్బతీయడం జరిగితే అది కిడ్నీని శాశ్వతంగా దెబ్బతీయవచ్చు. అందుకే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లల్లో మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ కనిపిస్తే... అందునా అది దీర్ఘకాలికంగా ఉండే వెంటనే డాక్టర్ను సంప్రదించి తగిన మందులు తీసుకోవాలి. డాక్టర్లు ఈ సమస్యను అదుపు చేయడానికి నోటి ద్వారా తీసుకునేవి లేదా నరం (రక్తనాళం) ద్వారా ఇచ్చే యాంటీబయాటిక్స్ను ఇస్తారు. ఒకవేళ తగినంత మెరుగుదల కనిపించనప్పుడు గానీ లేదా వైద్య పరీక్షల తర్వాతగానీ అవసరాన్ని బట్టి డాక్టర్లు 48 నుంచి 72 గంటల్లో యాంటీబయాటిక్స్ను మార్చి ఉపయోగిస్తారు. ఇలా మార్చి మార్చి యాంటీబయాటిక్స్ను ఉపయోగిస్తూ, వాటి కోర్సు పూర్తయ్యాక మళ్లీ వైద్య పరీక్షలు చేయిస్తూ ఫలితాలను సమీక్షిస్తూ, చికిత్సను కొనసాగిస్తుంటారు. మీ బాబు విషయంలో మీరు పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ వి.వి.ఆర్. సత్యప్రసాద్, కన్సలెట్ పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్, రెయిన్బో చిల్డ్రెన్స్ హాస్పిటల్, హైదరాబాద్ గుండె జబ్బులున్నవారు పాటించాల్సిన జాగ్రత్తలివి! కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. మా దూరపు బంధువుల్లో ఇద్దరుముగ్గురు చాలా కొద్దికాలంలోనే గుండెజబ్బుతో చనిపోయారు. దాంతో నాకు ఆందోళన పెరిగింది. గుండెజబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయగలరు. – వెంకటరామ్, మహబూబ్నగర్ గుండెజబ్బులు ఉన్న కుటుంబ చరిత్ర గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రధాన సూచనలివి... ► మీలా చిన్న వయసు వారైనప్పటికీ ఇప్పట్నుంచే తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ ఉండటం మేలు. డాక్టర్ సలహాల మేరకు కొన్ని మందులు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ను నియంత్రించుకుంటూ ఉండాలి. ►గుండెపోటు రావడానికి డయాబెటిస్ ఒక ప్రధాన కారణం. అందుకే ఆ సమస్య ఉన్నవారు రక్తంలోని చక్కెరను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. రోజూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ, డాక్టర్ సూచన మేరకు వారు సూచించిన వ్యవధిలో క్రమం తప్పకుండా రక్తంలోని చక్కెరలను పరీక్షించుకుంటూ ఉండాలి. ►కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించాలి. ► పొగ తాగే అలవాటును పూర్తిగా వదిలేయాలి. అలాగే పొగాకుకు సంబంధించిన ఉత్పాదనలు, వస్తువులను పూర్తిగా మానేయాలి. గుండెజబ్బుల నివారణలో ఇది చాలా ప్రధానం. ► డాక్టర్ సూచనల మేరకు శరీరానికి మరీ శ్రమ కలిగించకుండా చేసే వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి. ► మన ఒంటి బరువును పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ► రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి. ► మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఒంటికి అందేలా సమతులాహారం తీసుకోవాలి. ►ఆరోగ్యకరమైన జీవనశైలిని తప్పనిసరిగా పాటించాలి. ఈ కొన్ని జాగ్రత్తలతోనే చాలావరకు గుండెజబ్బులను నియంత్రించవచ్చు. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు తమ డాక్టర్లు సూచించిన మందులను తప్పక వాడుతుండాలి. ఆరోగ్యంలో ఏమాత్రం తేడా ఉన్నట్లు అనిపించినా డాక్టర్ను తప్పక సంప్రదించాలి. ఈ కొద్దిపాటి సూచనలు పాటిస్తే గుండెపోటు వంటి ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను నివారించడం చాలావరకు నివారించవచ్చు. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
గ్యాస్ట్రైటిస్ అంటే ఏమిటి?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. నేను ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటాను. నేను కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతోను బాధపడుతున్నాను. డాక్టర్ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. మందులు వాడుతున్నంత సేపు బాగానే ఉన్నా, అవి మానేస్తే మళ్లీ మామూలే. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? హోమియో చికిత్స ద్వారా నయమబవుతుందా? – రమేశ్కుమార్, హైదరాబాద్ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించకపోవడంతో గ్యాస్ట్రైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల అందరిలోనూ నెలకొంటున్న తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం అనే అంశం దీనికి ఆజ్యం పోస్తోంది. శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఇటీవల చాలామంది గ్యాస్ట్రైటిస్ సమస్య బారిన పడుతున్నారు. గ్యాస్ట్రైటిస్ అంటే: జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు: దాదాపు 20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది. → తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం n కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం n పైత్య రసం వెనక్కి ప్రవహించడం n కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్ డిసీజ్), కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు → శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో n ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు: కడుపు నొప్పి, మంట n కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం n అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు n ఆకలి తగ్గిపోవడం n కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు: n సమయానికి ఆహారం తీసుకోవాలి n కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి n పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి n ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స: హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కిడ్నీ వ్యాధులను నివారించడమెలా? కిడ్నీ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. మా ఇంట్లో మా అమ్మగారు, వారి తండ్రిగారు కిడ్నీ సంబంధిత వ్యాధులతో మరణించారు. జన్యుపరమైన అంశాలు కూడా కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణమవుతాయని ఇటీవలే చదివాను. అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది. కిడ్నీ వ్యాధి రాకుండా ఉండటానికి ఏవైనా ముందస్తు పరిష్కార మార్గాలున్నాయా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – నిత్యానంద ప్రసాద్, ఖమ్మం మూత్రపిండాలను కబళించే జబ్బుల్లో అతి పెద్దది డయాబెటిస్. మూత్రపిండాల వ్యాధులు రావడానికి సుమారు 40 నుంచి 40 శాతం వరకు ఇదే ప్రధాన కారణం. దీర్ఘకాలంగా ఉన్న అధిక రక్తపోటు కూడా కిడ్నీలను దెబ్బతీస్తుంది. ఇవేకాకుండా వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు మిగతా ఇతర జబ్బుల కారణంగా కూడా కిడ్నీలు చెడిపోతాయి. కిడ్నీ జబ్బులు వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే అది రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం. కిడ్నీ వ్యాధులలో పరిస్థితి చాలా తీవ్రతరం అయ్యేవరకు ఎలాంటి లక్షణాలు బయటపడవు. అందుకే కిడ్నీ జబ్బులను సైలెంట్ కిల్లర్స్గా పేర్కొంటారు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి మూత్రపరీక్ష, సీరమ్ క్రియాటనిన్ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఒకవేళ ఈ పరీక్షలలో ఏమైనా అసాధారణంగా కనిపిస్తే మరింత లోతుగా సమస్యను విశ్లేషించేందుకు జీఎఫ్ఆర్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు తోడ్పడతాయి. డయాబెటిస్, రక్తపోటు, ఊబకాయంతో బాధపడుతున్నవారు, కుటుంబలోగానీ, వంశంలో గానీ కిడ్నీ సంబంధిత జబ్బులున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్, బీపీని నియంత్రణలో ఉంచుకుంటూ తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఆకలి మందగించడం, నీరసం, మొహం వాచినట్లు ఉండటం, కాళ్లలో వాపు, రాత్రిళ్లు ఎక్కువసార్లు మూత్రం రావడం, తక్కువ మూత్రం రావడం, మూత్రం నురగ ఎక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే మూత్రపిండాల వ్యాధులలో సమయమే కీలకపాత్ర పోషిస్తుంది. చికిత్స ఆలస్యం అయ్యేకొద్దీ మూత్రపిండాల సమస్య తీవ్రతరమవుతుంది. ఎక్కువగా నీళ్లు తాగడం, బరువును అదుపులో ఉంచుకోవడం, మాంసాహారం మితంగా తీసుకోవడం, సాధ్యమైనంతవరకు జంక్ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్కు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తాజాపండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు. డాక్టర్ విక్రాంత్రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నీరసం.. నిస్సత్తువ.. తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. ఇటీవల నీరసంగా, నిస్సత్తువగా ఉంటే మా డాక్టర్గారు కొన్ని రొటీన్ పరీక్షలు చేయించి, హైపోథైరాయిడిజమ్ అని చెప్పారు. నాకు ఉన్న సమస్య ఏమిటి? హోమియో పద్ధతిలో ఇది తగ్గుతుందా? – నీరజ, కొత్తగూడెం మన శరీరంలోని కీలకమైన గ్రంథి థైరాయిడ్. హైపో థైరాయిడిజమ్ సమస్య ఉన్న వారిలో ఇది మామూలుకన్నా తక్కువగా థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. కారణాలు : ∙అయోడిన్ లోపం ∙పిట్యూటరీ గ్రంథి లోపాలు ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన, తొందరపాటుతో వ్యవహరించడం ∙ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడటం ∙ఆటో ఇమ్యూన్ హైపోథైరాయిడిజమ్ ∙రేడియోథెరపీ. హైపో థైరాయిడిజమ్లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. 1) ప్రైమరీ హైపో థైరాయిడిజమ్: థైరాయిడ్ గ్రంథి టీ3, టీ4 హార్మోన్లను సరైన మోతాదులో ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఈ రుగ్మత ఏర్పడుతుంది. 2) సెకండరీ హైపో థైరాయిడిజమ్: పిట్యుటరీ గ్రంథి సరైన మోతాదులో టీఎస్హెచ్ (థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్)ను ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఈ రుగ్మత వస్తుంది. లక్షణాలు : ∙అలసట, నీరసం ∙నిద్రమత్తు ∙ఏకాగ్రత కోల్పోవడం ∙పెళుసైన గోళ్లు ∙పొడి జుట్టు ∙పొడిబారిన చర్మం, చలికి తట్టుకోలేకపోవడం ∙మలబద్దకం ∙శరీరం బరువు పెరగడం ∙రక్తహీనత ∙కీళ్లనొప్పులు ∙మానసిక ఒత్తిడి ∙రుతుస్రావంలో లోపాలు ∙వినికిడి లోపం ∙కండరాలలో నొప్పి, తిమ్మిరి. చికిత్స : హైపోథైరాయిడిజమ్తో మొదలుకొని థైరాయిడ్కు సంబంధించిన ఏ సమస్య అయినా హోమియో విధానంలో సమర్థంగా తగ్గించవచ్చు. రోగి వ్యక్తిగత, శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఎలాంటి సమస్యనైనా పూర్తిగా నయం చేయవచ్చు. అయితే అనుభవజ్ఞులైన ఆధ్వర్యంలో ఈ మందులను తీసుకోవాల్సి ఉంటుంది. మీరు నిపుణులైన హోమియో వైద్యులను సంప్రదించి, వారు సూచించిన విధంగా మందులు తీసుకుంటే మీ సమస్య పూర్తిగా తగ్గుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ -
మత్తు వదిలిస్తున్నారు!
తాగి వాహనం నడిపితే జైలుకే జిల్లాలో 6 నెలల్లో 10,546 కేసులు రూ.40,62,800 జరిమానా సరదాకోసం కొందరు.. వ్యక్తిగత సమస్యలతో మరికొందరు.. మానసిక ఒత్తిడితో ఇంకొందరు ఇలా కారణాలు ఏవైనా వాటి నుంచి ఉపసమనం పొందేందుకు మద్యానికి బానిసలవుతున్నారు. పుట్టుగా మద్యంసేవించి ఆ మత్తులోనే వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇలాంటి వారి భరతం పట్టేందుకు జిల్లా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. తాగి వాహనాలు నడిపే వారికి భారీ జరిమానా, శిక్షలు విధిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 10 వేలకుపైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు రూ. 40 లక్షల 60 వేల వరకు జరిమానా విధించారు. తిరుపతిక్రైం: మద్యంమత్తులో వాహనాలు నడిపే వారికి జిల్లా పోలీసులు ఝలక్ ఇస్తున్నారు. దొరికినవారికి దొరికినట్లు.. జరిమానా విధిస్తున్నారు. తీవ్రత ఎక్కువగా ఉంటే.. జైలుశిక్ష కూడా తప్పడం లేదు. జిల్లాలో 25కు పైగా బ్రీత్ అన్లైజర్లు ఉన్నాయి. వీటితో రాత్రిపూట జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాకు మరి న్ని బ్రీత్ అన్లైజర్లు వచ్చే అవకాశం ఉంది. అవి వచ్చిన వెంటనే తనిఖీలు మరింత విస్తృతం చేయనున్నారు. శ్వాస పరీక్షలు, శిక్షలు.. తనిఖీల సమయంలో పోలీసులు వాహనదారుని నోట్లో బ్రీత్ అన్లైజర్ పెట్టి గట్టిగా ఊదమంటారు. ఆ వ్యక్తి మద్యం సేవించినట్టు అయితే బ్రీత్ అన్లైజర్లో ఆల్కాహా ల్ శాతం నమోదవుతుంది. ఒక బీరు, 15 ఎంఎల్ మద్యం సేవించినట్లు అయితే 30 శాతంగా చూపిస్తుంది. అంతకు మించి నమోదైదే కేసు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తారు. పరీక్షించిన సమయంలో శరీరంలోని ఆల్కాహాల్ శాతం వివరాలు, బ్రీత్ అన్లైజర్ నుంచి వచ్చే రశీదులో నమోదవుతాయి. అనంతరం వాహనాన్ని సీజ్ చేసి కోర్టుకు తరలిస్తారు. న్యాయమూర్తి ఇచ్చే తీర్పును బట్టి రూ.2 వేల వరకు జరిమానా వరకు లేదా జైలు శిక్షపడే అవకాశం ఉంది. నిబంధనలు ఇలా.. ద్విచక్ర వాహనదారుడు రూ.2 వేలు జరిమానా, పదేపదే దొరికితే రూ.5 వేలు జరిమానాతో పాటు ఆరునెలలు జైలు విక్ష విధిస్తారు. కారు, అంతకన్నా పెద్దవాహనాలు నడుపుతూ చిక్కిన వారికి రూ.2500 జరిమానా, మూడు రోజులు జైలు శిక్ష, పదేపదే దొరికితే జైలు శిక్షతోపాటు జరిమానా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తిరుపతి అర్బన్ జిల్లాలో.. 2014లో 1336 కేసులు నమోదు కాగా, రూ.40,68,000 కోర్టులో జరిమానాలు విధించారు. 2015లో 1755 కేసులు నమోదు కాగా రూ.61,93,400 జరిమానాలు కోర్టు ద్వారా విధించారు. 2015లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 మందికి సుమారు రెండు నెలలు పాటు జైలు శిక్షపడింది. మరో వ్యక్తికి లెసైన్స్ లేనందున మూడు రోజులపాటు జైలు శిక్ష విధించారు. 2016 జూలై వరకు రూ.23,62,800 ఇప్పటి వరకు మద్యం తాగిన వారి వద్ద జరిమానాలను కోర్టు వసూలు చేసింది. చిత్తూరులో కేసులు ఇలా.. 2014లో 1470 కేసులు నమోదు కాగా కోర్టు ద్వారా రూ.49,71,200 జరిమానాల రూపంలో వసూలు చేశారు. 2015లో 1272 కేసులు నమోదు కాగా కోర్టు ద్వారా రూ.37,72,100లు వసూలు చేశారు. 2016లో జూలై వరకు సుమారు 400లకు పైగా కేసులు నమోదు చేసి రూ.17 లక్షలకు పైగా కోర్టు ద్వారా జరిమానాలు విధించారు. జరిమానా మా లక్ష్యం కాదు.. వాహనదారులకు జరిమా నా విధించడం మా లక్ష్యం కాదు. మద్యంసేవించి వాహనాలు నడపడం వల్ల నిండుప్రాణాలు గాలిలో కలసి పోతున్నాయి. వాటిని అరికట్టడమే ముఖ్యం. మద్యం సేవించి వాహనాలు నడిపితే గతంలో జరిమానాలు విధించేవారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాకుం డా మద్యం సేవించి, ట్రిపుల్ రైడింగ్లో కాలేజీ విద్యార్థులు ఎవరైనా దొరికితే వారి వద్ద మొదటిసారిగా 3 గంటలసేపు ట్రాఫిక్ విధులు నిర్వహింపజేస్తాం. రెండోసారి దొరికితే మూడు రోజులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. - డాక్టర్ ఓ.దిలీప్కిరణ్, ట్రాఫిక్ డీఎస్పీ, తిరుపతి -
ఒత్తిడితో మతిమరుపు
పరిపరి శోధన మానసిక ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే మతిమరుపు తప్పదని వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి అరుదుగా ఎదురయ్యే మానసిక ఆందోళన, ఒత్తిడి వల్ల పెద్దగా అనర్థాలేమీ ఉండకపోయినా, దీర్ఘకాలికంగా అదే పరిస్థితి కొనసాగుతుంటే మెదడులోని ‘హిప్పోక్యాంపస్’ భాగంలో మార్పులు తలెత్తి, జ్ఞాపకశక్తి క్రమంగా క్షీణిస్తుందని ఓహయో స్టేట్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఎలుకలపై నిర్వహించిన పరిశోధనల్లో తాము ఈ విషయాన్ని గుర్తించామని అంటున్నారు. దీర్ఘకాలం పాటు కొన్ని ఎలుకలను ఒత్తిడికి గురిచేసి, వాటి మెదడు పనితీరులో వచ్చిన మార్పులను అధ్యయనం చేసిన ఈ పరిశోధకులు తమ పరిశోధన వివరాలను ‘జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్’లో ప్రచురించారు. -
మానసిక ఒత్తిడి మాయే!
ఆత్మబంధువు ఆనంద్ ఆఫీసునుంచి వచ్చాడు. కానీ రేఖను ఏమాత్రం పట్టించుకోలేదు. కాఫీ ఇస్తే ఏదో అలా తాగేశాడు. పిల్లలు దగ్గరకు వచ్చినా పట్టించుకోలేదు. అతను ఏదో ఒత్తిడిలో ఉన్నాడని రేఖకు అర్థమైంది. అదే విషయం అడిగింది. ‘‘అలాంటిదేం లేదోయ్’’ అన్నాడు. ‘‘మరి అలా ఎందుకున్నారు?’’ ‘‘ఎలా ఉన్నాను? బానే ఉన్నాగా?’’ ‘‘మీరు మామూలుగా లేరు. ఆఫీసులో ఏదైనా ఒత్తిడా?’’ ‘‘అలాంటిదేం లేదు. నేను బాగానే ఉన్నా. ఆఫీసులో కూడా బాగానే ఉంది. ఏదో చిన్న ఒత్తిడి. అంతే. ఉద్యోగం అన్న తర్వాత అవన్నీ తప్పవుగా.’’ ‘‘చిన్న ఒత్తిడి అని వదిలేస్తే పెద్ద సమస్యలు తెచ్చిపెడుతుంది ఆనంద్.’’ ‘‘అలాంటిదేం లేదులే. అది చాలా చిన్న సమస్య. ఐ కెన్ మేనేజ్.’’ ఆనంద్ అలా చెప్తున్నా... ఆ సమస్యను మేనేజ్ చేయలేకనే ఒత్తిడి ఫీల్ అవుతున్నాడని రేఖకు అర్థమైంది. ఆ విషయం అతనికి ప్రాక్టికల్గా చెప్పాలనుకుంది. ‘‘ఆనంద్... ఓ చిన్న పని చేయ గలవా?’’ మర్నాడు అడిగింది రేఖ. ‘‘హా.. చెప్పు’’ అన్నాడు ఆనంద్. ‘‘కొంచెం ఈ కప్పు పట్టుకోవా?’’ అని చిన్న కప్పు చేతికిచ్చింది. ‘‘ఆ మాత్రం దానికేనా?’’ అంటూ కప్పు అందుకున్నాడు. ‘‘నేను చెప్పేంతవరకూ ఆ కప్పు కింద పెట్టకూడదు’’ అంది రేఖ. ‘‘ఒహ్హో... ఈ చిన్న కప్పును పట్టుకోలేనా?’’ ‘‘పట్టుకోండి సార్ చూద్దాం.’’ ఆనంద్ ఆ కప్పును అలా పట్టుకుని నిల్చున్నాడు. రేఖ వంట చేసుకుంటోంది. పది నిమిషాలకు కప్పు బరువుగా అనిపించింది ఆనంద్కి. పావు గంటకు చెయ్యి గుంజడం మొదలెట్టింది. అరగంట తర్వాత ఇక భరించలేననుకున్నాడు. కప్పును చేయి మార్చుకోవడానికి ప్రయత్నించాడు. ‘‘హలో మిస్టర్ ఆనంద్... మీరు అదే చేత్తో పట్టుకోవాలి. చేయి మార్చుకోవడం కుదరదు’’ అంది రేఖ. ‘‘అరగంట పట్టుకునేసరికి చేయి గుంజుతుందోయ్’’ చెప్పాడు ఆనంద్. ‘‘కదా... అలాగే చిన్న ఒత్తిడిని ఎక్కువకాలం భరించినా ఎన్నో సమస్యలు తెచ్చి పెడుతుంది సర్’’ అంది నవ్వుతూ. ‘‘ఓహ్... నిన్న నేనన్న మాటలకు రిటార్డా?’’ అంటూ కప్పు కింద పెట్టాడు. ‘‘రిటార్డేం కాదు. చిన్న ఒత్తిడని నిర్లక్ష్యం చేయకూడదని చెప్పాలనీ...’’ ‘‘చెప్పాలనుకుంటే డెరైక్ట్గా చెప్పొచ్చుగా... ఇలా ఎందుకు?’’ ‘‘డెరైక్ట్గా చెప్తే తమరికి నచ్చదుగా. అందుకే ప్రాక్టికల్గా చూపిద్దామనీ...’’ ‘‘అబ్బో... స్ట్రెస్ మేనేజ్మెంట్ టిప్స్ కూడా చెప్తావా ఏంటీ?’’ ‘‘ఏం... చెప్పకూడదా ఏంటీ?’’ ‘‘నాకు తెలియని టిప్స్ నువ్వేం చెప్తావోయ్?’’ ‘‘మీకు తెలిసిన టిప్స్ ఏంటో చెప్పండి ముందు.’’ ‘‘రోజూ పొద్దుటే వాకింగ్, యోగా, మెడిటేషన్ చేసాను కదా! అలాగే మా ఆఫీసులో స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఎక్స్పర్ట్స్తో క్లాసులు కూడా చెప్పిస్తుంటారు. వాళ్లు రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు.’’ ‘‘మరి చేస్తున్నారా?’’ ‘‘అప్పుడప్పుడూ. అంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు చేస్తున్నా.’’ ‘‘మరి తగ్గుతుందా?’’ ‘‘తగ్గుతుంది... మళ్లీ వస్తుంది.’’ ‘‘కదా... మానసిక ఒత్తిడి నుంచి పూర్తిగా తప్పించుకోవాలంటే... అసలది లేదనే విషయం తెలుసుకోవాలి.’’ ఆశ్చర్యంగా చూశాడు ఆనంద్. ‘‘ఏంటీ... మానసిక ఒత్తిడనేది లేదా? ఎవరైనా వింటే జనాలు నవ్వుతారు. ఒత్తిడి తట్టుకోలేక లక్షలాదిమంది బాధపడు తుంటే నువ్వు ఒత్తిడనేదే లేదంటావేం?’’ ‘‘సరే ఉంది. కానీ ఆ ఒత్తిడి సృష్టిస్తున్నది ఎవరు?’’ ‘‘ఎవరంటే... దానికి చాలా కారణాలు ఉంటాయి. ఎలా చెప్పడం?’’ ‘‘మీరెన్ని కారణాలు చెప్పినా అవి సెకెండరీ. మీరెన్ని టిప్స్ పాటించినా అవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు. ఒత్తిడి నుంచి పూర్తిగా తప్పించుకోవాలంటే... దాని మూలం తెలుసుకోవాలి. ప్రతి మనిషికీ కొన్ని సామర్థ్యాలూ, అంచనాలూ ఉంటాయి. అంచనాలకు, ఆశయాలకూ తగ్గ సామర్థ్యా లున్నప్పుడు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. అంచనాలకూ సామర్థ్యాలకూ మధ్య దూరం పెరిగేకొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. ‘‘అందుకే ఒత్తిడి తగ్గించుకోవాలంటే అంచనాలు తగ్గించుకోవాలి, లేదంటే అంచనాలకు అందుకోగల సామర్థ్యాలను పెంచుకోవాలి. అంతే తప్ప మరేం చేసినా అవి తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే.’’ ‘‘నువ్వు చెప్పింది నిజమేనోయ్. థ్యాంక్స్.’’ అంటూ ముద్దిచ్చాడు ఆనంద్. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
వయసు పైబడుతున్నా ఫిట్నెస్ ఎలా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 40. ఎత్తు 5.4 అంగుళాలు. బరువు 78 కిలోలు. ఇటీవల లిపిడ్ ప్రొఫైల్ టెసట్ చేయిస్తే బ్యాడ్ కొలస్ట్రాల్ ఎక్కువగా ఉందన్నారు. హోమియోలో దీన్ని తగ్గించవచ్చా? - ఎస్.పవన్ కుమార్, తెనాలి మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న శారీరక, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా వస్తున్న వ్యాధుల్లో కొలెస్ట్రాల్ ఒకటి. సాధారణంగా కొలెస్ట్రాల్ అనగానే అది హానికరమైనదే అనే మాట తరచు వినిపిస్తుంది. అయితే కొలెస్ట్రాల్ పెరగడం వల్లే కాదు, తగ్గడం వల్ల కూడా సమస్యలు తప్పవు. ఎందుకంటే మన శరీరంలో ఉన్న ప్రతి కణానికీ కొలెస్ట్రాల్ కావాలి. అలాగే విటమిన్ - డి, హార్మోన్ల తయారీకి కొలెస్ట్రాల్ కావలసిందే. గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండడంతో ఇటీవల కాలంలో చాలామంది కొలెస్ట్రాల్పై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కొలెస్ట్రాల్ రెండు రకాలు. అందులో హైడెన్సిటీ లైపో ప్రొటీన్స్ (హెచ్.డి.ఎల్): ఇది మనకు మేలు చేసేది. మంచి కొలెస్ట్రాల్ను హెచ్డీఎల్ అంటారు. దీని సాధారణ విలువ 40-60 మధ్యన ఉండాలి. అరవైకన్నా ఎక్కువ ఉంటే గుండెలోని రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. అందుకే దీన్ని మంచి కొలెస్ట్రాల్ అంటారు. లో డెన్సిటీ లైపో ప్రొటీన్స్(ఎల్ డీ ఎల్) ఇది హానికరమైనది. రక్తప్రవాహంలో ఆటంకాలు కలిగించే కొలెస్ట్రాల్ ఇది. డెసీలీటరుకు 130 మిల్లీగ్రాముల కన్నా తక్కువ ఉండటం మంచిది. అంతకు మించితే ధమనుల్లో కొవ్వు చేరి, గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎల్డీఎల్ను చెడు కొలెస్ట్రాల్ అంటారు. కారణాలు: చక్కెర, కొవ్వు, పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, వేపుడుపదార్థాలు, వెన్న, నెయ్యి, మాంసం, జంక్ఫుడ్స్, మాదక ద్రవ్యాలు తీసుకోవడం, గర్భనిరోధక మందులు, మూత్రం ఎక్కువగా రావడానికి వాడే మందులు, వంశపారంపర్యత, మద్యపానం, ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి, ఆందోళన, పౌష్టికాహార లోపం. జాగ్రత్తలు: నడక వల్ల మంచి కొవ్వు స్థాయి పెరగవచ్చు, ఆల్కహాల్, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, సిగరెట్లు మానేయాలి. పీచు ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు, ఆహారం, ఓట్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ను పూర్తిగా నియంత్రించవచ్చు. నిర్ధారణ: లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష. హోమియో చికిత్స: కొలెస్ట్రాల్ను తగ్గించడానికి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. దీనిని సాధారణంగా వాడే మందులు కాల్కేరియా కార్బ్, ఫైటోలిక్కా, కొలెస్ట్రినమ్, గ్రాఫైటిస్, కాక్టస్, రావుల్ఫియా, సర్పెంటైనా, ఫ్యూకస్. వీటిని నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో కాన్స్టిట్యూషనల్ విధానంలో వాడితే మంచి ఫలితం ఉంటుంది. న్యూరాలజీ కౌన్సెలింగ్ మా బాబుకు నాలుగేళ్లు. ఇప్పటికి ఒక ఏడాదిలోపు మూడు సార్లు ఫిట్స్ వచ్చాయి. ఈ మూడుసార్లు కూడా జ్వరం వచ్చినప్పుడు మాత్రమే మా బాబుకు ఫిట్స్ వచ్చాయి. మేము డాక్టర్ను సంప్రదించాలనుకుంటున్నాము. దయచేసి సలహా ఇవ్వండి. - మనోహర్రావు, నల్గొండ చిన్నపిల్లల్లో జ్వరంతో పాటు ఫిట్స్ రావడం అనేది చాలాసార్లు అంత భయపడాల్సిన విషయం కాదు. వాటిని ఫిబ్రైల్ సీజర్స్ అంటారు. వాటికోసం ఫిట్స్వ్యాధి ఉన్నవారిలోలాగా పిల్లలకు రోజూ మాత్రలు వేయాల్సిన అవసరం ఉండదు. జ్వరం వచ్చినప్పుడు మాత్రమే పారాసిటమాల్ వంటివి తీసుకొని, వాటితో పాటు మూడు లేదా నాలుగు రోజులు ఫిట్స్కు సంబంధించిన మాత్రలు డాక్టర్ సలహా మేరకు తీసుకుంటే సరిపోతుంది. వీటి నిర్ధారణ పరీక్షలు కూడా అవసరం ఉండదు. చాలా కొద్దిమందిలో మాత్రం ఫిట్స్ లేదా ఎక్కువ సేపు వచ్చినా ఎక్కువసార్లు వచ్చినా లేదా వాటితో పాటు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నప్పుడు ఫిట్స్కు సంబంధించిన మాత్రలు ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం రావచ్చు. మీకు దగ్గర్లో ఉన్న చిన్నపిల్లల వైద్యులు లేదా న్యూరోఫిజీషియన్ను సంప్రదించి చికిత్స తీసుకోండి. నాకు 24 ఏళ్లు. నేను ఎనిమిదేళ్లుగా ఫిట్స్ మందులు వాడుతున్నాను. నాకు ఏడాది క్రితం పెళ్లయ్యింది. నేను పిల్లలను కనచ్చా? ముందు మందులు మానేయవచ్చా? సలహా ఇవ్వండి. - మంజుల, నందిగామ ఫిట్స్ వ్యాధి ఉన్న మహిళలు మందుల ద్వారా ఫిట్స్ను నియంత్రించుకున్న తర్వాత గర్భం దాల్చవచ్చు. మందులు వాడుతున్నవారు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గర్భంలో పెరిగే శిశువుకు మందుల వల్ల వచ్చే దుష్ర్పభావాలు రాకుండా తగ్గించుకోవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్ సూచనలు లేకుండా మందులు మానకూడదు. మీ విషయంలో ఫిట్స్ రెండేళ్ల నుంచి రావడం లేదు కాబట్టి ఒకసారి డాక్టరును సంప్రదించి, వీలుంటే మందులు పూర్తిగా ఆపేశాక గర్భం ధరించవచ్చు. ఒకవేళ మీ ఫిట్స్ మందులు ఆపడం సాధ్యం కాకపోతే గర్భం దాల్చకముందు నుంచి ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడటం ద్వారా గర్భస్థ శిశువుపై ఫిట్స్ మందుల ప్రభావం తగ్గించవచ్చు. డాక్టర్ల సలహా మేరకు సరైన మందులు వాడటం వల్ల పుట్టబోయే బిడ్డకు కలిగే ఇబ్బందులు నివారించవచ్చు. లైఫ్స్టైల్ కౌన్సెలింగ్ నా వయసు 58 ఏళ్లు. గతం కంటే కొంత ఫిట్నెస్ తగ్గినట్లు అనిపిస్తోంది. నేను మునపటి ఆరోగ్యాన్నే కొనసాగించాలంటే మార్గాలేమిటి? - నర్సింహారావు, కరీంనగర్ వయసు పెరుగుతున్నప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ప్రధానమైన అంశం. ఇందుకోసం వ్యాధి లక్షణాలు ఉంటే తగిన చికిత్స పొందడం, మంచి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అంశాలు ఎంతగానో దోహదపడతాయి. అందులో వ్యాయామం చాలా ముఖ్యమైనది. దీనివల్ల గుండెజబ్బులు, మతిమరపు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, హైబీపీ, ఒబేసిటీ వంటి సమస్యలను నివారించుకోవచ్చు. ఎముకల సాంద్రత తగ్గడం కూడ నివారితమవుతుంది. దానివల్ల వయసు పైబడ్డవారు పడిపోయినప్పుడు ఎముకలు విరిగే ప్రమాదం తగ్గుతుంది. వ్యాయామం చేసేవారిలో ఎండార్ఫిన్ వంటి జీవరసాయనాలు ఎక్కువగా స్రవించి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. అయితే కాస్త వయసుపైబడ్డవారు వ్యాయామాన్ని ప్రారంభించే ముందుగా డాక్టర్ నుంచి తగిన సలహా పొందాలి. వారి వ్యక్తిగత రుగ్మతలకూ, జీవనశైలికి తగిన వ్యాయామ విధానాల గురించి సూచనలు పొందాలి. ఉదాహరణకు డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు తాము తీసుకుంటున్న మందులు, ఆహారానికి తగినట్లుగా తమ వ్యాయామ పద్ధతులు, వేళల గురించి డాక్టర్ సలహా పొందడం అవసరం. వ్యాయామాన్ని కొత్తగా మొదలుపెట్టేవారు పెద్దపెద్ద వ్యాయామాలను ఒకేసారి ప్రారంభించకూడదు. వ్యవధినీ, శరీరం మీద పడే భారాన్ని మెల్లమెల్లగా పెంచాలి. వ్యాయామం వల్ల అయ్యే గాయాలను నివారించడానికి ఎక్సర్సైజ్కు ముందుగా వార్మింగ్ అప్, తర్వాత కూలింగ్ డౌన్ వ్యాయామాలు చేయాలి. వ్యాయామం మనల్ని మరింత చురుగ్గా ఉండేలా చేయాలి గానీ, నిస్సత్తువను పెంచకూడదు. వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పులు పెరిగినా, ఒంట్లో ఎక్కడైనా ఎర్రబారినా, శ్వాస అందకపోయినా, చెమటలు బాగా పట్టినా, ఇతరత్రా ఇబ్బందులు ఎదురైనా వెంటనే వ్యాయామం ఆపేసి డాక్టర్ను కలిసి తగిన చికిత్సనూ, సూచనలను పొందాలి. -
వేధింపులతోనే విద్యార్థుల ఆత్మహత్య
కార్పొరేట్ కళాశాలల బంద్ విజయవంతం నారాయణ మంత్రి పదవికి రాజీనామా చేయాలి వైఎస్సార్ విద్యార్థి విభాగం, ఏబీవీపీ డిమాండ్ తిరుచానూరు/తిరుపతి క్రైం : కార్పొరేట్ కళాశాలలు పేరుకోసం విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేయడంతోనే విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జే. విశ్వనాథ్ అన్నారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాలో చేపట్టిన కార్పొరేట్ జూనియర్ కళాశాలల బంద్ విజయవంతమైంది. విద్యార్థి సం ఘాల నాయకులు జిల్లాలోని కార్పొరేట్ జూనియర్ కళాశాలలను మూ యించి వేశారు. కొన్ని కళాశాలలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సహకరించాయి. విద్యార్థి విభాగం నాయకులు తిరుపతి టౌన్ క్లబ్ సర్కిల్ వద్ద మానవహారం చేపట్టారు. ఉప్పరపల్లి నారాయణ కళాశాల వద్ద మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. హరిప్రసాద్రెడ్డి, జే.విశ్వనాథ్ మాట్లాడుతూ చదువు పేరుతో విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. కార్పొరేట్ కళాశాలలకు తలొగ్గిన ప్రభుత్వం వారి అరాచకాలకు అడ్డుకట్ట వేయడం లేదని దుయ్యబట్టారు. విద్యార్థుల ఆత్మహత్మకు కారకుడైన మంత్రి నారాయణపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న మనీష, నందిని కుటుం బాలకు రూ.25లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, ఆ కుటుం బాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వైఎస్సార్ విద్యార్థి నాయకులు కిషోర్, హేమంత్కుమార్రెడ్డి, మౌలాలి, ఏఐఎస్ఎఫ్ నాయకులు నరేష్, శివారెడ్డి, చాముతి, దాము, చలపతి పాల్గొన్నారు. 13మందిపై కేసు నమోదు.. బంద్లో భాగంగా కాలేజీలపై దాడులకు పాల్పడిన 13మంది విద్యార్థి సంఘ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎంఆర్పల్లి ఎస్ఐ ఆదినారాయణ తెలిపారు. వీరు తిరుపతి ఎమ్మార్ పల్లి పరిధిలోని నారాయణ మెడికల్ జూని యర్ కళాశాలలో అద్దాలు పగులగొట్టారని, కుర్చీలు విరగ్గొట్టారని, కళాశాల ఇన్చార్జ్ ఫిర్యాదు మేరకు ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు. -
మరణంలోనూ వీడని బంధం
బషీరాబాద్(రంగారెడ్డి జిల్లా): ఒకే గడియలో భార్యాభర్తలు మృతి చెందిన ఘటన బషీరాబాద్ మండలం దామర్చెడ్లో గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పగిడ్యాల ఆశన్న(65), బుగ్గమ్మ(60) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. బుగ్గమ్మ భర్త ఆశన్నకు విరేచనాలు కావడంతో మంగళవారం ఉదయం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. భర్త అపస్మారక స్థితిలో ఉండటంతో బుగ్గమ్మ భర్త వద్దే ఉండి సేవలు చేసింది. ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన బుగ్గమ్మ ఆస్పత్రిలోనే కుప్పకూలి మృత్యువాత పడింది. దీంతో కుటుంబీకులు ఆమెను ఆస్పత్రి నుంచి గ్రామానికి తరలిస్తుండగానే ఆశన్న సైతం మృతి చెందాడు. గంట వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
అందుకే ‘బాబు’ యోగాసనాలు: శైలజానాథ్
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాసనాలు వేశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి శైలజానాథ్ ఎద్దేవా చేశారు. ఈ కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబుకు సీఎం పదవిలో ఒక క్షణం కూడా కొనసాగే అర్హత లేదన్నారు. ఏపీ పోలీసుల చేత టీ న్యూస్, సాక్షి చానెళ్లకు నోటీసులు ఇప్పించి అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇందిర భవన్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
పొట్ట తగ్గడానికి 10 సూత్రాలు...
1. అల్పాహారాన్ని మానకూడదు. 2. నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. 3. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. 4. మానసిక ఒత్తిడిని దరిచేరనీయకూడదు. 5. చిరుతిళ్లు, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకూడదు. 6. భోజనం చేసేటప్పుడు నెమ్మదిగా తినాలి. 7. రోజూ 45 నిమిషాలు యోగా చేయాలి. 8. ఐదు రకాల పండ్లు తీసుకోవాలి 9. ఐదు రకాల ఆకుకూరలు భోజనంలో ఉండేలా చూసుకోవాలి.. 10. అరగంటైనా రోజూ నడవాలి. -
యోగాతో చలికి చెక్!
విశాఖపట్నం: శారీరక శ్రమకన్నా మానసిక ఒత్తిడి నేటి యువతకు అధికం అవుతోంది. అదికాస్తా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఒత్తిడులను తగ్గించి శారీరక, సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సాధన ఒక్కటే మార్గమని ఆధారాలతో సహా యోగా గురువులు నొక్కి చెబుతున్నారు. వ్యాధులు విజృంభించే కాలంగా ముద్రపడిన చలికాలంలో వ్యాధుల నుంచి విముక్తి కావాలంటే యోగా ఒక్కటే మార్గమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో యోగా, ప్రకృతి వైద్యంపట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా పలువురు యోగా మాస్టర్లు ప్రత్యేకంగా వింటర్ యోగాను అందుబాటులోకి తెచ్చి ఇళ్ల వద్దకే వచ్చి నేర్పిస్తున్నారు. ఇందుకు అపార్ట్మెంట్లు, కాలనీ కమ్యూనిటీ హాల్లు వేదికలుగా మారుతున్నాయి. వీటికి మహిళలు, పురుషుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. మారిన ఆహారపు అలవాట్లు, కాలానుగుణంగా వస్తున్న మార్పులతో సోకుతున్న దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, ఉబ్బసం, గుండెపోటు, మెడ, నడుం నొప్పులు, జీర్ణ సంబంధిత వ్యాధులు చలికాలంలో ఎక్కువగా ముసురుకుంటాయి. ఈ వ్యాధులను ముందస్తుగానే అరికట్టేందుకు, అవి దరిచేరకుండా కట్టడి చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించేందుకు చలికాలంలో శారీరక వ్యాయామం, యోగాసనాలు, ధ్యానం ఎంతో అవసరమని యోగా శిక్షకులు చెబుతున్నారు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ల కారణంగా ఓపిక సన్నగిల్లుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పునరుత్తేజం పొందాలంటే, కొత్త శక్తులు తిరిగి పొందాలంటే యోగాను ఆశ్రయించాలని యోగా శిక్షకులు అంటున్నారు. తీవ్ర సమస్యలను, వ్యాధులను పారదోలే శక్తి యోగా సొంతమని పేర్కొంటున్నారు. శారీరక వ్యాయామం, మానసిక ప్రశాంతత పొందేందుకు ఉపయోగపడే గర్భాసనం, వ్యాగ్రాసనం, త్రికోణాసనం, మత్స్యాసనం, ప్రాణాయామం, సూర్యనమస్కారాలను ఇప్పుడు బాగా నేర్పిస్తున్నారు. తీసుకోవాల్సిన ఆహారపు జాగ్రత్తలు, భోజనంలో పాటించాల్సిన విషయాలపై అవగాహన కూడా కలిగిస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాతనే ప్రాణాయామాలు, సూర్యనమస్కారాలు చేయాలని, ఆ తర్వాత స్నానం చేయాలని వీరు పేర్కొంటున్నారు. ఉదయం 5 గంటలకు కచ్చితంగా నిద్రలేచి వెంటనే ఒకటి నుంచి 5 గ్లాసులు నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని కూడా సూచిస్తున్నారు. రాత్రి ఏడు గంటలకే భోజనం చేయడం, 9 నుంచి 10 గంటల మధ్య పడుకోవాలంటున్నారు. అన్నింటికీ పరిష్కారం ధ్యానంలో కూర్చున్న ప్రతిసారి అలసట తగ్గి చింతలు, బాధలు తొలగిపోతాయి. మానవుడు ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటాడో అప్పుడే శక్తిసంపన్నులుగా తయారవుతారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పావుగంట పాటు చేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ద్యానం చేసే సమయంలో మనం ఇతరుల నుంచి ఏకాంతంగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ధ్యానం శరీరం నుంచి అన్ని మలినాలను శుభ్రపరుస్తుంది. ఇప్పుడు అన్ని ప్రాంతాలలో అందుకే యోగాకు ప్రాధాన్యతనిస్తున్నారు. యోగాసనాలు బలాన్ని, శక్తిని ఇస్తాయి. - పి.ప్రశాంతి.. యోగా కౌన్సెలర్ -
జ్యూస్.. ఫ్రెష్ జ్యూస్..
జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే. చిత్రంలోని జ్యూస్ మరీ మంచిదట. ఆస్తమా, రక్తహీనత పోవడంతోపాటు ఎముకలు దృఢమవుతాయట. మెదడుకూ ఎంతో మంచిదట. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు, లైంగిక సామర్థ్యం తగ్గినవారు ఈ జ్యూస్ తాగితే ఇక ఆ సమస్యలు దరిచేరవట. ఇంకా చాలాచాలా సుగుణాలు ఉన్నాయట. పెరూ, బొలీవియాకు వెళ్తే.. అక్కడివాళ్లు ఈ జ్యూస్ గొప్పతనం గురించి ఇంకా చాలా చెబుతారు. ఇంతకీ ఈ జ్యూస్ను దేంతో తయారుచేస్తారో చెప్పలేదు కదూ.. అయితే.. రాసుకోండి.. తయారీ విధానం.. మొదటగా కొన్ని క్యారెట్లు తీసుకోండి.. తర్వాత కప్పుడు తేనె.. రెండింటినీ మిక్సీలో వేయండి.. బాగా ముద్దలా మారిన తర్వాత వెనీలా ఎసెన్స్ వేయండి. మళ్లీ మిక్సీ చేయండి. ఇప్పుడిక అసలు పని మొదలవుతుంది. చేతులు క్లీన్ చేసుకుని.. టిటికాకా నీటి కప్పలను తీసుకోండి. మీరు విన్నది నిజమే. కప్పలనే. ఎందుకంటే ఈ జ్యూస్ను అరుదైన టిటికాకా కప్పలతోనే తయారుచేస్తారు.. ఆశ్చర్యపోకుండా ముందు రాసుకోండి.. అవి చచ్చిన తర్వాత చర్మం వలిచి.. క్లీన్ చేసి.. మిక్సీలో బాగా రుబ్బండి. మధ్యలో కొన్ని ఐసు ముక్కలు వేయండి. ఇక జ్యూస్ రెడీ. అతిథులకు చల్లగా అందించండి. గమనిక: స్థానికులు సర్వరోగనివారిణి అని ఈ కప్పల జ్యూస్ను తెగ తాగేస్తున్నా.. పై రోగాలను ఇది తగ్గిస్తుందనడానికి ఏ ఆధారమూ లేదని వైద్యులు అంటున్నారు. -
విధుల్లో ఉరిమే ఉత్సాహం కావాలంటే!
ఆరోగ్యవంతుడి మదిలోనే సృజనాత్మక ఆలోచనలు, అద్భుతమైన ఆవిష్కరణలు రూపుదాలుస్తాయి. కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులు తరచుగా అలసటకు లోనవుతుంటారు. నిస్సత్తువ, నిరుత్సాహం ఆవరిస్తుంటాయి. దీంతో పనితీరు, ఉత్పాదకత తీవ్రంగా దెబ్బతింటాయి. క్రమ పద్ధతి లేని ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, పనిలో విసుగుదల, తగినంత నిద్ర లేకపోవడం.. ఇలాంటి ప్రతికూల కారణాలతోనే ఉద్యోగులు కార్యాలయంలో అలసటకు లోనవుతుంటారని నిపుణులు చెబుతున్నారు. జీవన శైలి(లైఫ్ స్టైల్)లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఉత్సాహం పుంజుకోవచ్చని సూచిస్తున్నారు. నడకే నయం: ఆఫీస్లో సహచరులతో సంభాషించాలంటే చాట్ మెసెంజర్, ఈ-మెయిల్, సెల్ఫోన్ వంటివి ఉపయోగించకుండా... వారి దగ్గరకు నడిచి వెళ్లండి. లిఫ్ట్ వాడకుండా మీరుండే అంతస్తు దాకా మెట్లదారినే ఎంచుకోండి. మీ వాహనాన్ని ఆఫీస్కు కొంత దూరంలోనే నిలిపేసి కాళ్లకు పని చెప్పండి. వినడానికి ఇవన్నీ చాలా చిన్న విషయాలుగానే కనిపిస్తాయి. కానీ, ఇవి చూపే ప్రభావం మాత్రం అసామాన్యం. నడక వల్ల శరీరంలో క్యాలరీలు కరిగిపోతాయి. మీరు వేసే ప్రతి అడుగు మీ ఆరోగ్యాన్ని పెంచుతుంది. బద్ధకాన్ని దూరంగా తరిమికొడుతుంది. భోజనం.. ఎన్నిసార్లు?: మనం సాధారణంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేస్తాం. ఒకరోజులో మొత్తం మూడు సార్లు తింటాం. దీన్ని ఆరు నుంచి ఎనిమిది భాగాలుగా విడగొట్టండి. తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకుంటే జీర్ణాశయంపై ఒత్తిడి తగ్గి, దాని పనితీరు మెరుగవుతుంది. తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమై, శక్తి సమకూరుతుంది. కాబట్టి ప్రతి రెండు గంటలకోసారి కొద్ది మొత్తంలో తినండి. అలాగే తీసుకొనే ఆహారం తాజాగా, అందులో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే వచ్చే ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఫాస్ట్ను బ్రేక్ చేయాల్సిందే!: కొందరు ఉదయం అల్పాహారం తీసుకోకుండానే నేరుగా మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. ఈ అలవాటు వల్ల బరువు పెరుగుతారు. రాత్రి పడకపై చేరినప్పటి నుంచి ఉదయం లేచేదాకా ఎలాంటి ఆహారం తీసుకోం కాబట్టి శరీరం శక్తిని కోల్పోతుంది. అందుకే ఉదయం నిద్ర లేచిన గంటలోపే అల్పాహారం తప్పనిసరిగా తినాలి. శరీరంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ అవసరం. కంటినిండా నిద్ర : తగినంత నిద్ర లేకపోతే మరుసటి రోజు త్వరగా అలసిపోతారు. క్రమంగా బరువు కూడా పెరుగుతారు. నిద్ర సరిపోకపోతే శరీరంలో కీలక హార్మోన్ల పనితీరు మందగిస్తుంది. శరీరానికి ఆహారం అవసరం లేకపోయినా ఆకలిగా అనిపిస్తుంది. దీంతో ఎక్కువ తింటారు. కాబట్టి రోజూ కనీసం ఆరు నుంచి ఏడు గంటలపాటు కంటినిండా నిద్ర పోవాలి. వ్యాయామం మర్చిపోవద్దు : ప్రతిరోజూ వ్యాయామం చేయడానికి తీరిక దొరక్కపోతే కనీసం వారాంతాల్లోనైనా అందుకు సమయం కేటాయించండి. ఫిట్నెస్ కాపాడుకోవడంపై దృష్టి పెట్టండి. టెన్నిస్, ఫుట్బాల్ వంటి ఆటలు ఆడండి. జాగింగ్, రన్నింగ్ చేయండి. ఆసక్తి ఉంటే డ్యాన్స్ కూడా చేయొచ్చు. యోగాతో తీరైన శరీరాకృతి, ఆరోగ్యం సొంతమవుతాయి. మనసుంటే మార్గాలుంటాయి. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే జీవన శైలిలో మార్పులు చేసుకోవడం కష్టమేమీ కాదు. ఆరోగ్యానికి మించిన విలువైన ఆస్తి మరొకటి లేదు. -
ఒత్తిడిని అధిగమిస్తేనే జీవితం
మానవ జీవితంలో మానసిక ఒత్తిడి అనేది సహజమే అరుునా.. శృతిమించడం వల్లే సమస్యలు అధికమవుతున్నాయి.. ఎల్కేజీ చదివే చిన్నారి నుంచి తల నెరిసిన తాతయ్య వరకు అందరికీ సమస్యలే. చదువు, ఉద్యోగం, కుటుంబరీత్యా, ఒంటరితనం ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో అనేక సమస్యలపై పోరాడుతున్నవారే. ప్రేమించిన యువతి దక్కలేదనే అక్కసుతో ప్రేమోన్మాదిగా మారడం, అనుకున్నది సాధించలేక పోతున్నాననే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచన, భార్యపై అనుమానంతో నిత్యం వేధింపులకు గురిచేయడం వంటివి సమాజంలో నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మానసిక సమస్యలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ మానసిక అవగాహన వారోత్సవాలను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. - ముంబై కాలంతో పాటు పరుగెడుతున్న సిటీ లైఫ్లో మానసిక ప్రశాంతత లోపించింది. గతంలో ఇళ్ల వద్ద అమ్మమ్మ, బామ్మ, తాతయ్య, బాబాయి ఇలా పెద్దలనే వారు ఉండేవారు. కొడుకు-కోడలు, కూతురు-అల్లుడు ఇలా చిన్నవాళ్లు కలహించుకున్నా, ఏదైనా సమస్య వచ్చినా ఆదిలోనే పరిష్కరించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించి పోవడంతో ఒత్తిడికి గురవుతున్న వారిని ఓదార్చేవారు లేక మానసిక సమస్యలకు గురవుతున్నారు. తల్లిదండ్రుల మధ్య గొడవల ప్రభావం పిల్లలపై పడుతుంది. వారు మానసికంగా కుంగిపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఏటా మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నెల నాలుగో తేదీ నుంచి 10 వరకూ నిర్వహించే వారోత్సవాల్లో మానసిక వైద్యులు, మానసిక విశ్లేషకులు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువతీ, యువకులు అంటే 16 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో మానసిక వైకల్యం (స్కిజోఫ్రీనియా), నివారణోపాయూలపై డబ్ల్యూహెచ్వో అవగాహన కలిగించాలని నిర్ణయించింది. ప్రతి వెయ్యిమందిలో ఐదుగురు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా. నగర ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు * మానసిక ఒత్తిడికి గురవుతున్న వారిలో అధికశాతం మంది డిప్రెషన్కు గురవుతుండగా, మరికొంతమంది పర్సనాలటీ డిజార్డర్స్, లైంగిక సమస్యలు, భాగస్వామితో విభేదాలు, స్మోకింగ్, మద్యపానానికి అలవాటుపడుతున్నారు. * పారానాయిడ్ సైకోట్రిక్ అనే సమస్యకు గురయిన వారికి సకాలంలో చికిత్స అందించనట్లయితే సైకోలుగా మారడం, కుటుంబసభ్యులను హింసించడం, హత్యాయత్నం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. సంతోషంగా ఉండాలంటే.. * మానసిక ఒత్తిడిని గురవరాదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒకే పనిని నిరంతరం చేస్తుండటం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. కొంత విరామం తీసుకుంటే ప్రశాంతంగా ఉంటారు. * ఇతరుల గురించి మంచిగా మాట్లాడండి, మంచిగా ప్రవర్తించండి. అప్పుడే మంచి సంబంధాలు ఏర్పడతాయి. * కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీరు అదుపు తప్పుతున్నప్పుడు కోపాన్ని ఆరోగ్యకరంగా ప్రదర్శించే తీరు నేర్చుకోండి. ఈర్ష, ద్వేషాలకు అతీతంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటే ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడటంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. * ఇతరులను చిరునవ్వుతో పలకరించండి.. అభినందించంది.. స్నేహం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి స్నేహితుల కోసం అన్వేషించి స్నేహం చేయండి. * సమస్య ఏర్పడినప్పుడు దానికి కారణాలు తెలుసుకుని పరిష్కరించుకోవాలి. సమస్యల వలయంలో చిక్కుకుని డిప్రెషన్కు లోనుకావద్దు. * జీవితంలో ఓటమి కూడా సామాన్యమే. ఓటమి పొందినప్పుడు నిరాశ, నిస్పృహలకు లోను కావద్దు. అవి అనుభవాలుగా విజయానికి నాంది అవుతాయి. * పిల్లల్ని కొట్టడం, తిట్టడం వల్ల వారిలో వ్యక్తిత్వ వికాసం ఏర్పడదు. తెలియచెప్పండి, పొరపాట్లు సరిదిద్దండి. * మీలోని భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడమే కాదు. తెలివిగా వీటిని అనుకూలంగా మలుచుకునే నేర్పరితనం నేర్చుకోండి. * భయం వీడితే జయం మీదే అవుతుంది. భయానికి ఒక కారణం ఉంటుంది. దానిని సరిచేసుకుంటే అది మీకు దూరంగా ఉంటుంది. * ఆత్మన్యూనతా భావాన్ని తొలగించుకుంటే మీరు ఎన్నో రంగాల్లో విజయం సాధిస్తారు. * పిల్లలతో సరదాగా గడపండి.. మాట్లాడండి. యోగా, మెడిటేషన్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉపయోగిస్తూ ఆరోగ్యంగా ఉండండి. -
సామర్థ్యాలే విజయానికి సోపానాలు
నే డున్నది పోటీ ప్రపంచం. యువత తమ లక్ష్యాన్ని సాధించే క్రమంలో అధిక పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వాస్తవ మేమిటంటే ఇలాంటి వాటిని ప్రతి వ్యక్తీ చదువులోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా ఎదుర్కోవాల్సిందే. వీటి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అపజయాలనేవి జీర్ణించుకోలేనివిగా ఉంటాయి. కానీ మనలో ఉండే సామర్థ్యాలపై నమ్మకం ఉంచి,కృషి సాగిస్తే విజయతీరాలకు చేరుకోవచ్చు. కాబట్టి గత చేదు అనుభవాలను విస్మరించి లక్ష్యం దిశగా అడుగులు వేయాలి. సామర్థ్యాలకు సానపెట్టు: కెరీర్లో రాణించాలంటే మొదట మనలోని సామర్థ్యాలను అంచనా వేయాలి. మూల్యాంకనం చేయాలి. ఎక్కడ వెనుకబడి ఉన్నామో గుర్తించాలి. దానికి అనుగుణంగా లోపాలను సరిదిద్దుకోవాలి. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందు కేయాలి. గమ్యం చేరే ప్రయత్నంలో కొన్ని అవరోధాలు ఎదురవుతాయి. పొరపాట్లకు దారితీస్తాయి. కాబట్టి వీటిపై ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్కడ తప్పులు దొర్లుతున్నాయో తెలుసుకొని, వాటిని పునరావృతం కాకుండా జాగ్రత్త పడొచ్చు. లక్ష్యం వైపే మనసు: సంకల్పించిన లక్ష్యం మనసులో దృఢంగా నాటుకుపోవాలి. ఈ వైఖరే మన విజయానికి కొంత దోహదపడుతుంది. కొన్ని సందర్భాల్లో బయటి నుంచి కొన్ని ప్రతికూల కారకాలు ప్రభావం చూపుతాయి. అవి మనం నియంత్రిం చలేని స్థాయిలో ఉంటాయి. అయినా మన దృష్టంతా లక్ష్యంపైనే ఉండాలి. లేదంటే మన ఆశయసాధన ప్రయత్నం సఫలం కాదు. సామాజిక మద్దతు: లక్ష్యసాధనలో తరచూ వైఫల్యాలు చవిచూసేవారు తీవ్ర నిరాశకు గురవుతారు. ఇక తమవల్ల సాధ్యం కాదనే న్యూనతకు లోనవు తారు. ఇలాంటి వారు సామాజిక మాధ్యమా లైన ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ ఇన్, గూగుల్ప్లస్ ద్వారా మిత్రులతో తమ అనుభవాలను పంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మిత్రులతోపాటు కొన్నిసార్లు అనుభవజ్ఞుల సలహాలు లభించే అవకాశం ఉంటుంది. స్వీయ విమర్శ: ప్రయత్నంలో భాగంగా చిన్నచిన్న పొరపాట్లు తలెత్తడం సహజం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ అందివచ్చిన అవకాశం చేజార్చుకునే సందర్భంలో...ఎక్కడ పొరపాటు దొర్లిందో గుర్తించాలి. ఎట్టి సందర్భంలోనూ పరాజయాలకు లొంగి వెనకంజ వేయవద్దు. ఎన్నిసార్లు విఫలమయ్యావన్నది విషయం కాదిక్కడ. ప్రతి ప్రయత్నంలో లక్ష్యానికి ఎంత చేరువవుతున్నావన్నదే ముఖ్యం. లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా ప్రయత్నం సాగిస్తే ఏదోరోజు విజయం సాధించవచ్చు. -
మేనికాంతికి యోగం
యోగం వయసులో ఉన్నవారి నుంచి వయసు పైబడిన వారి వరకూ అందరి దృష్టీ చర్మకాంతిపైనే! మేని చర్మం నిగనిగలాడుతూ ఉండాలని ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. కానీ, చర్మకాంతికి పై పూతగా వాడే క్రీములు పది శాతం మాత్రమే పనిచేస్తాయి. మిగతా అంతా మనం తీసుకునే జాగ్రత్తలు, ఆహారం, ఆహ్లాదరకరమైన జీవనవిధానమే శాసిస్తుంది. నేడు తీరికలేని పనులు, మానసిక ఒత్తిడుల వల్ల సరిగ్గా శ్వాస పీల్చడం కూడా మర్చిపోతున్నాం. బాల్యంలో సక్రమంగా ఉండే ఉచ్ఛ్వాస నిశ్వాసలలో వయసు పెరుగుతున్న కొద్దీ జీవనవిధానంలో వచ్చే తేడాల వల్ల అపసవ్యత చోటుచేసుకుంటుంది. ఫలితంగా ప్రాణవాయువు శరీరంలోని అన్ని భాగాలకూ సక్రమంగా అందక ఆరోగ్యం దెబ్బతింటుంది. చర్మం కాంతి కోల్పోతుంది. ఈ పరిస్థితి తలెత్తకుండా, చర్మకాంతి పెరగాలంటే యోగసాధన సరైన మార్గం అంటున్నారు నిపుణులు. ప్రతి రోజూ ఉదయం 45 నిమిషాలు యోగా చేయడం వల్ల శరీర అంతర్గత అవయవాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మకాంతి పెరుగుతుంది. ప్రాణాయామం... రోజులో 5-6 నిమిషాలు ప్రాణాయామానికి కేటాయించాలి. పద్మాసనం పద్ధతిలో విశ్రాంతిగా కూర్చోవాలి. ఛాతీ నిండుగా గాలి పీల్చి, వదిలేయాలి. ఇలా ఐదు సార్లు చేసిన తర్వాత ఒక వైపు నాసికా రంధ్రాన్ని బొటనవేలితో మూసి, రెండవ నాసిక రంధ్రం గుండా శ్వాస తీసుకోవాలి. ఆ వెంటనే మూసి ఉన్న నాసికపై వేలు తీసేసి లోపలి గాలిని బయటకు పంపించాలి. వయసును బట్టి ఐదు సెకండ్లు ఊపిరితీసుకోవడం, ఐదు సెకండ్లు వదిలేయడం చేయాలి. యోగాలో భాగమైన ప్రాణాయామం చేసే ప్రక్రియ వ్యక్తుల ఆరోగ్యం, వయసును బట్టి మనిషికి మనిషికి మారుతుంటుంది. అందుకని నిపుణుల పర్యవేక్షణలో ప్రాణాపాయం నేర్చుకొని చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రాణాయామాన్ని సరిగ్గా చేయడం వల్ల వయసు కారణంగా చర్మంపై ఏర్పడే ముడతలు, చర్మం పొడిబారడం, కొంత విహీనం అవడం వంటి సమస్యలు తగ్గి చర్మ కాంతి రోజురోజుకూ పెరుగుతుంది. - జ్యోతి యోగా కేంద్రం హైదరాబాద్ -
మనోహరమైన మున్నార్..!
నేడు చాలామంది మానసిక ఒత్తిడి నుంచి దూరం అవాలని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వెదుక్కుంటూ ప్రకృతి వనాలున్నచోటుకు వెళ్లాలని తపిస్తున్నారు. ఆ కోవలో పర్యాటకులను అమితంగా ఆకర్షించే ప్రాంతం మున్నార్. ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆకుపచ్చని తేయాకు తోటల్లో మీ సెలవుదినాలను ఎంజాయ్ చేయవచ్చు. ఏర్కాడు, ఏలగిరి, తేక్కడితో పాటు ఊటీ, కొడెకైనాల్లు మున్నార్కు దగ్గరలోనే ఉన్నాయి. అద్భుతమైన సెలవు దినాలలో మూడు రాత్రులు, నాలుగు పగళ్ల కోసం రూ.17,010 చెల్లిస్తే చాలు. ఇందులోనే అల్పాహారం, లంచ్, డిన్నర్, విమానాశ్రయానికి చేర్చడం వంటి అవకాశాలు కల్పించారు. అతిథుల సౌకర్యం కోసం 10 శాతం డిస్కౌంట్తో రూమ్ డైనింగ్, లాండ్రీ సౌకర్యాలున్నాయి. అత్యంత రద్దీగల ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పిల్లలు, పెద్దలు వినోదాన్ని పొందే సౌకర్యాలూ ఉన్నాయి. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు మున్నార్, తేక్కడిలో గడపచ్చు. ఇందుకు ప్యాకేజీ ధర రూ.32,000. దీంట్లోనే పెద్దలకు ప్రత్యేకమైన ఆయుర్వేదిక్ మసాజ్, సుగంధద్రవ్యపు తోటల సందర్శన, మున్నార్లోని ఇతర ప్రదేశాల సందర్శన అవకాశం కల్పిస్తారు. మరిన్ని వివరాలకు: http://bookings.sterlingholidays.com/packages/monsoon/ వెబ్సైట్కు లాగిన్ అవ్వచ్చు. -
మెదడు కూడా వ్యాయామం చేయాల్సిందే!
మీకు తెలుసా? మెదడు కూడా కండరంలాంటిదే. వ్యాయామం చేయకపోతే దేహంలోని ఇతర కండరాల్లాగానే మెదడు కూడా శక్తిహీనమవుతుంది. మెదడు చురుగ్గా ఉండాలంటే... కొత్త విషయాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వీలయినంతగా చదవాలి. కొత్త భాషను నేర్చుకునే క్రమంలో మెదడు చురుగ్గా స్పందించి ఉత్తేజితమవుతుంది. ప్రహేళికలను పరిష్కరించడం అంటే మెదడుకి తగినంత వ్యాయామం అందించినట్లే. మానసిక ఒత్తిడి వల్ల కార్టిజోల్ హార్మోన్ విడుదలవుతుంది. అది మెదడు పనితీరును నిరోధిస్తుంది. కాబట్టి ఒత్తిడికి లోనయినట్లు గుర్తించిన వెంటనే పది నిమిషాల సేపు ఇష్టమైన పని (ఇష్టమైన పుస్తకం చదవడం లేదా ఒక పజిల్ని పరిష్కరించడం) చేయడం వల్ల ఒత్తడి తగ్గి మెదడు ఉత్తేజితమవుతుంది. ఆహారంలో ‘బి’ విటమిన్ పుష్కలంగా తీసుకోవాలి. పొట్టుతో కూడిన ధాన్యాలు, ఆకు కూరలు, పాలు, పాల ఉత్పత్తులు సమృద్ధిగా తీసుకోవాలి. రోజుకు కనీసం అరగంట సేపు శారీరక వ్యాయామం చేయాలి. వ్యాయామం చేసినప్పుడు ఊపిరితిత్తులు దీర్ఘంగా శ్వాసిస్తాయి. దాంతో దేహం ఆక్సిజన్ను ఎక్కువగా తీసుకుంటుంది. దాంతో మెదడు చురుగ్గా ఉంటుంది. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోతే జ్ఞాపకశక్తి, తార్కిక శక్తి నశిస్తాయి. -
కిరాతకం
కుటుంబ సభ్యులను రాడ్డుతో కొట్టి వ్యక్తి ఆత్మహత్య చికిత్స పొందుతూ కుమార్తె మృతి బాలానగర్, న్యూస్లైన్: ఆర్థిక ఇబ్బందులతో మానసిక ఒత్తిడికి లోనైన ఓ వ్యక్తి కుటుంబసభ్యులను రాడ్డుతో కొట్టి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు కుమార్తె కూడా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లాకు చెందిన రాములు (44) భార్య కృష్ణమ్మ, పిల్లలతో కలిసి గత కొన్నేళ్లుగా నగరానికి వచ్చి బాలానగర్ గౌతమ్నగర్లో ఉంటున్నాడు. ప్లంబర్గా పనిచేస్తుంటాడు. కొంతకాలం నుంచి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రాములుకు బీపీతో పాటు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అంతేకాకుండా ప్రతిరోజు ఇంట్లో చికాకుగా ఉంటూ కుటుంబ సభ్యులను కొట్టి హింసిస్తుండేవాడు. దీనికితోడు మానసికంగా కుంగిపోతున్న రాములు.. గురువారం రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న భార్య కృష్ణమ్మ, కుమార్తెలు భవాని (15), శివాని, కుమారులను నిద్రలో నుంచి లేపాడు. భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో రాములు భార్య కృష్ణమ్మ, పెద్దకుమార్తె భవాని, శివాని, కుమారులను రాడ్డుతో చితకబాదాడు. దీంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. భయాందోళనకు గురైన చిన్న కుమార్తె శివాని కిందకు వెళ్లి విషయం పక్కింటి వారికి చెప్పింది. దీంతో వారు పైకి వచ్చారు. ఇదే సమయంలో రాములు మూడవ అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. తీవ్రగాయాల పాలైన రాములు, భార్య కృష్ణమ్మ, కుమార్తె భవానిలను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా.. ఆ రాత్రే రాములు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమార్తె భవానికి కూడా తీవ్రమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. భార్య కృష్ణమ్మ కూడా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడం, కృష్ణమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యుల బాధ వ ర్ణించనలవి కాకుండా ఉంది. వీరి రోదన చూసినవారి హృదయాలను ద్రవించి వేసింది. బాలానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'మానసిక ఒత్తిడే అసలు సమస్య'
ఇండియాకి అతి పెద్ద సవాలు ఉగ్రవాదం కాదు. జనవిస్ఫోటనం కాదు. పర్యావరణం కాదు, గ్లోబల్ వార్మింగ్ కానే కాదు. భారతదేశంలో అతి పెద్ద సమస్య మానసిక ఒత్తిడి. ప్రాణాలు తీయడంలో మానసిక ఒత్తిడే ఫస్ట్ అని టవర్స్ వాట్సన్ అనే సుప్రసిద్ధ మానవ వనరుల సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. బారతదేశంలో ఉద్యోగంలో యాజమాన్యం ఆపేక్షకీ, ఉద్యోగి ఆకాంక్షకి లంకె కుదరకపోవడం 40 శాతం మందిలో ఒత్తిడికి కారణం అని సంస్థ వెల్లడించింది. తక్కువ స్టాఫ్ తో ఎక్కువ పనిచేయించడం కూడా 38 శాతం మందిలో మానసిక ఒత్తిడికి దారి తీస్తోంది. పని ఒత్తిడి, కుటుంబ సమస్యల మధ్య లంకె లేకపోవడం కూడా 38 శాతం మందిలో ఒత్తిడిని పెంచుతోంది. తక్కువ జీతం, నిరంతరం పెరుగుతున్న ఆర్ధికావసరాలు కూడా ఒత్తిడికి కారణమౌతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 22 వేల మంది ఉద్యోగులను సర్వే చేశారు. వీరిలో 2006 మంది మన దేశానికి చెందిన వారు. చాలా సంస్థల్లో మానవ వనరులను సరిగా ఉపయోగించుకునే విషయంలో, ఉద్యోగుల ఒత్తిడిని తగ్గించే విషయంలో సరైన వ్యూహాలు లేవని కూడా సంస్థ తన నివేదికలో చెప్పింది. ఒత్తిడి వల్ల హై బీపీ, డయాబెటిస్, నాడీ మండల వ్యాధులు, స్థూలకాయం, గుండెపోటు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని కూడా నివేదిక తెలిపింది. -
ఆ విషయంలో... వయసును బట్టే వాయిదా!
కౌన్సెలింగ్ సంతానం కలగక ఇబ్బంది పడేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. కాలుష్యం, ఒత్తిడి, ఆహారపుటలవాట్లు... కారణమేదైతేనేం అనేకమంది మాతృత్వానికి నోచుకోలేకపోతున్నారు. పిల్లలు కలగకపోవడం ఒక సమస్య అయితే ఆ సమస్య కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతూ డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారు. పెళ్ళయ్యాక చాలామంది దంపతులు ముందుగా వారు ఆర్థికంగా, ఉద్యోగపరంగా స్థిరపడాలని కోరుకుంటున్నారు. అలా చేయడం మంచిదే కాని మీ వయసును దృష్టిలో పెట్టుకుని అలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మూడేళ్ళు...నాలుగేళ్ళు అంటూ నియమం పెట్టుకునే మందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ముప్ఫై ఏళ్ళు దాటాక పిల్లలు కనడం మహిళల విషయంలో మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. చాలామంది దంపతుల విషయంలో డాక్టర్లు ఏ లోపమూ లేదని చెబుతారు. ఇంకొంత కాలం ఎదురు చూడమంటారు. ఈలోగా ఇంట్లో పెద్దవాళ్ళ మాటలు దంపతుల్ని అనవసరపు ఒత్తిడికీ, ఆందోళనకూ గురి చేస్తుంటాయి. మాటిమాటికీ పిల్లల తలంపు ఎత్తడం వల్ల ఏర్పడే ఒత్తిడి దాంపత్య జీవితంపై చాలా ఉంటుంది. ముఖ్యంగా ఈ విషయంలో మహిళలపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇటు పుట్టింటివారు, అటు అత్తింటి వారు మాటిమాటికి అమ్మాయినే అడగడం, తోటివారితో పోల్చడం వల్ల మానసికంగా కుంగిపోతున్న మహిళలు చాలా మంది ఉన్నారు. దంపతులిద్దరూ పెద్దవాళ్ళకు నిర్మొహమాటంగా తమ ప్లానింగ్ గురించి చెప్పేయడం ఉత్తమం. ఒకవేళ డాక్టర్లు లోపం ఉందని చెబితే దాని గురించి కూడా వివరంగా చెప్పి, మీ భవిష్యత్ ప్రణాళిక గురించి ముందుగా మీరే చెబితే వారు కూడా ప్రశాంతంగా ఉంటారు. పిల్లలు పుట్టకపోవడానికి లోపం దంపతులిద్దరిలో ఉంటుంది. మహిళలకు లోపం ఉంటే ఆ విషయాన్ని వెంటనే అందరికీ చెప్పేస్తారు. అదే అబ్బాయికి ఏదైనా సమస్య ఉంటే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. ఇలా చేయడం వల్ల భార్య అనవసరపు అభాండాలకు గురవుతూ డిప్రెషన్లోకి వెళ్లిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో మగవాళ్ళు అవసరమైన చికిత్సకు ముందుకెళ్ళి సమస్యను పరిష్కరించుకోవాలి. ఎంత వైద్యం చేయించుకున్నా ప్రయోజనం లేకపోతే అనవసరపు బెంగలు పెట్టుకోకుండా దత్తత మార్గాన్ని ఎంచుకోవడంలో తప్పు లేదు. ఏళ్ళ తరబడి పిల్లల కోసం ఎదురుచూస్తూ, వైద్యం పేరుతో ఆరోగ్యం పాడుచేసుకునే బదులు ఓ బిడ్డను పెంచుకుని ప్రశాంతంగా ఉండొచ్చు. - డాక్టర్ పద్మా పాల్వాయి, సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పటల్ -
'విధి ఆ కుటుంబంతో వింత నాటకం ఆడుకుంది'
మనిషికి గర్భశోకానికి మించిన శాపమేముంది. అల్లారు ముద్దుగా పెంచి, అడిగింది అందించి, ఉన్నత విద్యావంతులను చేస్తే...తల్లిదండ్రుల శ్రమ, ఆశ ఫలించే దశలో ఆ బిడ్డలే బలవన్మరణం పొందితే అంతకు మించి కష్టం, నష్టం ఏముంటుంది. జిల్లా జైలు పర్యవేక్షణాధికారి సీహెచ్ ఈశ్వరయ్య కుటుంబంతో విధి ఈ విషాద నాటకమే ఆడుకుంది. నిరుడు ఎంఎస్ చేస్తున్న కూతురు, నేడు సాప్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న కొడుకు బలవన్మరణానికి గురయ్యాడు. అనంతపురానికి చెందిన సీహెచ్ ఈశ్వరయ్య ఏడాది కాలంగా ఇక్కడ జిల్లా జైలు పర్యవేక్షణాధికారిగా వ్యవహిస్తున్నారు. ఆయన కుమారుడు ప్రవీణ్ కుమార్ శుక్రవారం హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజినీరింగ్ చదివిన ప్రవీణ్ కుమార్ డీఎల్ఎఫ్ సంస్థలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు మాత్రమే అతను ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఈశ్వరయ్యే తరచూ హైదరాబాద్ వెళ్లి కుమారుని యోగ క్షేమాలు తెలుసుకుని వస్తుండేవారు. కుమారుని అకాల మృతి వార్తతో హుటాహుటీన హైదరాబాద్ వెళ్లారు. కాగా ప్రవీణ్ కుమార్ మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కాగా గత ఏడాది జూన్ 24న ఈశ్వరయ్య కుమార్తె హరిప్రసన్న ఆత్మహత్య చేసుకుంది. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో ఎం.ఎస్ చేస్తున్న ఆమె ఆరోగ్యం బాగోలేదని ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లోనే ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ దుఖం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈశ్వరయ్య కుటుంబాన్ని ప్రవీణ్ ఆత్మహత్య మళ్లీ తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: సంస్థ నిర్వహించిన పరీక్షలో ఫెయిల్ కావడం.. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... కర్నూలుకు చెందిన ఈశ్వరయ్య విజయవాడ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు సి.ప్రవీణ్కుమార్ (24) కరీంనగర్లో బీటెక్ చదివి, హైదరాబాద్లో ఎంటెక్ చేశారు. అనంతరం క్యాంపస్ సెలక్షన్స్లో ఎంపికై గత అక్టోబర్ 31న సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధుల్లో చేరాడు. గచ్చిబౌలి ఇందిరానగర్లోని ఒక హాస్టల్లో ఉంటూ.. ఆఫీసుకు వెళ్లి వచ్చేవాడు. అయితే, శుక్రవారం ఉదయం 8 గంటలకు తన రూమ్మేట్, సహోద్యోగి అయిన ప్రసన్నతో కలిసి టిఫిన్ తిన్నాడు. తర్వాత డ్యూటీకి వస్తానని చెప్పి, ప్రసన్నను పంపేసి.. హాస్టల్లో ఉండిపోయాడు. ప్రవీణ్ ఆఫీసుకు రాకపోవడంతో.. లంచ్ సమయంలో ప్రసన్న వచ్చి చూడగా హాస్టల్ గదికి లోపలి నుంచి గడియపెట్టి ఉంది. హాస్టల్ నిర్వాహకుడి సమాచారం మేరకు పోలీసులు వచ్చి గది తలుపులు తెరిచి చూడగా... ప్రవీణ్ ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయి ఉన్నాడు. ఇటీవల కంపెనీ నిర్వహించిన పరీక్షలో ప్రవీణ్ ఫెయిలైనట్లు తెలిసింది. దాంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు చెప్పారు. కాగా.. ప్రవీణ్ సోదరి ప్రసన్నకుమారి మెడిసన్ చదువుతూ ఆరు నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. ఆ బాధతో పాటు కంపెనీ నిర్వహించిన పరీక్షలో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే పేర్కొంటున్నారు. -
ఆస్తమా నుంచి ఉపశమనమెలా...?
నా వయసు 46. నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమా జబ్బు ఉంది. చలికాలంలో తప్పనిసరిగా బయటపడుతుంది. పిల్లికూతలతో కూడిన ఆయాసం వస్తుంది. దగ్గు కూడా వస్తుంటుంది. చాలా మందులు వాడాను. కానీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. శాశ్వత నివారణకు ఆయుర్వేద మందులు తెలియజేయ ప్రార్థన. - భ్రమరాంబ, చేవెళ్ల మీకున్న సమస్యను ఆయుర్వేదంలో ‘తమకశ్వాస’ అంటారు. దీనికి కారణాలు అనేకం. ఉదాహరణకు... అసాత్మ్యత (అలర్జీ) కావచ్చు. ఇది ఆహారపదార్థాలతో రావచ్చు. బాహ్యవాతావరణంలోని అంశాలు కావచ్చు. గాలిలో తేమ, దుమ్ము, ధూళి, మేఘావృత వాతావరణం, అతిశీతల వాతావరణం, మరికొన్ని కంటికి కనిపించని ఇతర పదార్థాలు మొదలైనవి. అదేవిధంగా కొన్ని వృత్తుల్లో ఉన్నవారికి సిమెంట్, కెమికల్స్, ఆయిల్స్ మొదలైనవి పడకపోవచ్చు. కొంతమందికి వారసత్వం ఒక కారణం. మానసిక ఒత్తిడి కూడా ఒక ప్రధాన కారణం. కొంతమందిలో జ్వరం కూడా ఉంటుంది. ఆయుర్వేదం దీన్ని ‘యాప్య’ వ్యాధిగా స్పష్టీకరించింది. అంటే పూర్తిగా నయం కాకపోయినా, సరైన ఆహార, విహార, ఔషధాల ద్వారా నియంత్రించుకోగల్గిన వ్యాధి అని అర్థం. ఆయాసం ఉన్నప్పుడు విశ్రాంతి అవసరం. పరిశ్రమచేస్తే ఇది మరింత ఎక్కువవుతుంది. చలి నుంచి కాపాడుకోవాల్సిన దుస్తులు ధరించాలి. కొంచెం బోర్లా పడుకునే భంగిమలో ఉపశమనం లభిస్తుంది. ఆయాసం తగ్గేవరకు వేడివేడిగా ఉండే తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. చల్లటి వస్తువులను దూరంగా ఉంచాలి. మందులు ఆయాసంగా ఉన్నప్పుడు కనకాసవ లేదా సోమాసవ (ద్రావకం) మూడు చెంచాల మందులో సమానంగా గోరువెచ్చని నీరు కలిపి, రోజుకి మూడు లేక నాలుగు సార్లు తాగాలి. దగ్గు, కఫం తగ్గడానికి: వాసారిష్ట, పిప్పలాసవ... ఈ రెండు ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక గ్లాసులో పోసుకొని, నాలుగు చెంచాలు నీళ్లు కలిపి, రోజుకి మూడుసార్లు తాగాలి. భారంగ్యాది చూర్ణం: ఒక చెంచా చూర్ణం రోజుకి రెండుసార్లు, వేడినీటితో కర్పూరతైలాన్ని ఛాతీకి ముందు, వెనక వైపు పూతగా పూసి (మెల్లగా మసాజ్ చేసి), వేడినీటి ఆవిరితో కాపడం పెట్టాలి. ఆయాసం తగ్గిన అనంతరం ఈ కింది ఔషధాలను రెండు మూడు నెలలపాటు వాడితే ‘క్షమత్వం’ వృద్ధి చెంది తమక శ్వాస వచ్చే తీరు బలహీనపడుతుంది. శృంగారాభ్రరస మాత్రలు: ఉదయం 1, రాత్రి 1 అగస్త్యహరీతకీ రసాయన (లేహ్యం): ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా చప్పరించి తిని, పాలు తాగాలి. గృహవైద్యం ఒక చెంచా ఆవనూనె, ఒక చెంచా తేనె కలిపి సేవిస్తే ఆయాసం నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అల్లంతో చేసిన టీ రోజుకి నాలుగైదు సార్లు తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. రెండు చిటికెలు ఇంగువను బెల్లంతో తిన్నా ప్రయోజనం ఉంటుంది ఆయాసం లేనప్పుడు, రెండుపూటలా ప్రాణాయామం చేయడం దినచర్యలో భాగం చేసుకుంటే పుప్ఫుసాలకు (ఊపిరితిత్తులకు) క్రియాపరమైన సామర్థ్యం పెరుగుతుంది. ఇది పరిశోధనాశాస్త్ర నిరూపితం. గమనిక: కొంతమంది నాటువైద్యులు, నకిలీవైద్యులు ఈ వ్యాధిని పూర్తిగా నయం చేస్తామని అనేక ప్రకటనలు, ప్రచారాలు చేస్తూ వారి వారి మందులు అమ్ముకుంటుంటారు. ఇలాంటి మోసాలకు బలికావద్దు. మరికొంతమంది కొన్ని ఆయుర్వేద మందులలో అల్లోపతికి సంబంధించిన ‘స్టెరాయిడ్స్’ కలిపి అమ్ముతుంటారు. స్టెరాయిడ్స్ వల్ల నాటకీయ ప్రయోజనం కలుగుతుంది. ఆ విధంగా వారి వలలో పడతారు. ఇది ప్రమాదమని గ్రహించాలి. మీకు దేనివల్ల ఆసాత్మ్యత కలుగుతోందన్న అంశాన్ని లేదా ఇతర కారణాలను గమనించగలిగితే దానిని దూరం చేయాలి. దీనిని ‘నిదానపరివర్జనం’ అంటారు. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
నడుమునొప్పి -ఆయుర్వేద చికిత్స
ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని జీవనం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధంగా ఉంటోంది. పెరిగిపోతున్న పని ఒత్తిడి, పోషకాహారం సరిగా తీసుకోకపోవడం వలన, ఈరోజుల్లో 40 ఏళ్లకే నడుము నొప్పి వస్తోంది. ముఖ్యంగా ఆహార లోపాలు, అస్తవ్యస్తమైన దినచర్యలు, స్వప్న విపర్యం అంటే రాత్రివేళ నిద్రపోకపోవటం, పగటిపూట నిద్రించడం వంటి అలవాట్లు శరీర వ్యవస్థను బాగా దెబ్బ తీస్తున్నాయి. అలాగే ఆందోళన, మానసిక ఒత్తిడి వంటి కారణాలు కూడా అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. వీటిలో అతిముఖ్యమైనది నడుము నొప్పి (కటిశూల). ఆయుర్వేద శాస్త్రం నడుము నొప్పికి గుద్రసీవాతంగా నామకరణం చేసింది. నూటికి 90 శాతం మంది తమ జీవితకాలంలో ఎపుడో ఒక్కసారి నడుము నొప్పి బారిన పడతారని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. కారణాలు: ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవటం, స్థూలకాయం, విశ్రాంతి అనేది లేకుండా ఎక్కువ గంటలు విపరీతంగా శ్రమించడం, అతిగా బరువులు మోయటం, ద్విచక్రవాహనం మీద ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రుగ్మతలు, వంశపారంపర్యం వ్యాధులు ఇవి అన్ని నడుమునొప్పికి కారణమవుతుంటాయి. ఈ కారణాల వల్ల ముఖ్యంగా వాత ప్రకోపం జరుగుతుంది. ఫలితంగా ముందు పిరుదులకు పైభాగాన స్థబ్దతను, నొప్పిని కలిగించి, ఆ తరువాత నడుముభాగం, తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాల్లోకి వ్యాపిస్తుంది. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువ అవుతుంది. నడుము భాగంలో ప్రత్యేకించి ఎల్-4, ఎల్-5 వెన్నుపూసల మధ్య ఉండే సయాటికా నరం మీద ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పి వస్తుంది. నడుము నొప్పికి ఆయుర్వేద చికిత్స నడుము నొప్పి అనే సమస్యకు ఆయుర్వేద శాస్త్రంలో సమగ్రమైన చికిత్సా పద్ధతులున్నాయి. అందులో నిదాన పరివర్జనం, శమన చికిత్స, శోధన చికిత్స అనే మూడు ప్రధానమైనవి. నిదాన పరివర్జనము: నిదాన పరివర్జనము అనగా వ్యాధికి కారణమైన విషయాలను పాటించకపోవడం. ఉదా: విరుద్ధ ఆహార - విహారసేవన. (రాత్రి మేల్కొనుట, పగలు నిద్రించుట మొదలైనవి) శమన చికిత్స: వ్యాధి దోషాలను శమింపచేయటానికి తెచ్చే ఔషధాలు, ఇందులో రోగ తీవ్రతను బట్టి, రోగి బలాన్ని బట్టి చూర్ణాలు, గుటికలు, కషాయాలు, లేహ్యాలు, తైలాలు ఇత్యాది ఔషధాలు రోగికి ఇవ్వబడతాయి. కానీ, ఈ శమనచికిత్స వలన ప్రకోపించిన దోషాలు మళ్లీ తిరగబడవచ్చు. అందుకే వ్యాధి తీత్రవను బట్టి శమన చికిత్సలతోపాటు, కొందరికి పంచకర్మ (శోధన చికిత్స) కూడా అవసరం. తద్వారా ప్రకోపించిన దోషాలను (వాత, పిత్త, కఫ) సమంగా చేసి శరీర శుద్ధిని, అగ్నిబలాన్ని పెంపొందించవచ్చును. ఆయుర్వేదాన్ని స్నేహకర్మ ద్వారా వెన్నుపూసల మధ్య, స్నిగ్ధత్వాన్ని పెంపొందించి కీళ్ల కదలికను సులభతరం చేసే అవకాశం ఏర్పడుతుంది. స్వేదకర్మ ద్వారా బిగుసుకుపోయిన కీళ్ళను వదులుగా, మృదువుగా మారేలా చేయవచ్చు. కటివస్తి: ఈ విధానం ఆయుర్వేదంలోని ఒక విశిష్ట ప్రక్రియ. అరిగిపోయిన మృదులాస్థికి (కార్టిలేజ్) రక్తప్రసరణను పెంచి నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే క్రమంలో సర్వాంగధార చికిత్స కూడా వీరికి బాగా ఉపయోగపడుతుంది. వస్తికర్మ: ఆయుర్వేద శాస్త్రంలో వస్తికర్మ అనే చికిత్స అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వస్తికర్మ ముఖ్యంగా చిన్నప్రేవులు, పెద్దప్రేవులలోని ఎంటరిక్ వర్వస్ సిస్టమ్పై ప్రభావం చూపుతుంది. తద్వారా నాడీకణాలలో ఏర్పడిన లోపాలను సరిచేసి బలం చేకూర్చవచ్చు. అలాగే పక్వాశయలో వాతస్థానం కాబట్టి ప్రకోపించిన వాతాన్ని కూడా సహజస్థితికి తీసుకునిరావచ్చును. జాగ్రత్తలు: అవసరమైన పోషకాహారం తీసుకుంటూ, వ్యాధి తిరిగి రాకుండా వైద్యులు సూచించిన విధానాలను అనుసరించడం చాలా అవసరం. ఔషధ చికిత్సల తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తే నడుము నొప్పి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది. డిస్క్లో వచ్చే మార్పులు వెన్నుపూసల మధ్య ఉండే డిస్కుల్లో కొన్ని మార్పులు జరిగినప్పుడు, డిస్క్ల మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో వాపు రావటం, డిస్క్కి రక్త ప్రసరణ సరిగా లేకపోవటం, డిస్కు అరిగిపోవడం వంటి అనేక సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్కులో వాపు వస్తే అందులోంచి చిక్కని ద్రవం బయటికి వచ్చి మేరుదండం నుంచి వచ్చే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల వెన్ను నొప్పి వస్తుంది. లక్షణాలు నడుములో నొప్పి, వాపు, ఏ కాస్త శ్రమించినా నొప్పి తీవ్రం కావటం, సూదులతో గుచ్చినట్లుగా నొప్పి, కాళ్లల్లో తిమ్మిర్లు, మంటలు ఉంటాయి. సకాలంలో చికిత్స అందకపోతే స్పర్శజ్ఞానం కోల్పోతారు. సమస్య తీవ్రమైతే కొందరు మలమూత్రాల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్లో మలబద్దకం, జీర్ణాశయ సమస్యలు వస్తాయి. వెన్ను సంబంధిత సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి రాకుండా పోతుంది. -
బాబుకు తరచూ తలనొప్పి... ఏం చేయాలి?
మా బాబు వయసు ఎనిమిదేళ్లు. తరచూ తలనొప్పితో బాధపడుతున్నాడు. ఇంతకుముందు అరుదుగా వచ్చేది. కాని ఇటీవల చాలా తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్కు చూపిస్తే కొన్ని పరీక్షలు చేసి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. కొంతకాలం బాగానే ఉంటోంది. మళ్లీ మళ్లీ తలనొప్పి వస్తోంది. మా బాబు విషయంలో తగిన సలహా ఇవ్వండి. - ప్రభాకర్ నాయుడు, చిత్తూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబు దీర్ఘకాలిక తలనొప్పి (క్రానిక్ హెడేక్)తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఇలా వచ్చే తలనొప్పులకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మైగ్రేన్. ఇది పెద్దల్లో ఎంత సాధారణమో పిల్లల్లో అంతగా సాధారణం కానప్పటికీ అరుదేమీ కాదు. మైగ్రేన్తో పాటు టెన్షన్ హెడేక్, మెదడు లోపలి సమస్యలు, సైనస్, జ్వరాలు రావడం, పళ్లకు సంబంధించిన సమస్యలు, కంటి లోపాలు, మానసికమైన సమస్యల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) తలనొప్పులు రావచ్చు. మీరు చేయించిన ప్రాథమిక పరీక్షల్లో రిపోర్టులు నార్మల్గా ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి మీ బాబుది మైగ్రేన్ వల్ల తలనొప్పి అని భావించవచ్చు. ఈ మైగ్రేన్లోనూ చాలారకాలు ఉన్నాయి. ఆహారంలో నైట్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం, అలసట, నిద్రలేమి... వంటి కారణాల వల్ల ఇది మరింత పెరుగుతుంది. కొద్దిమంది పిల్లల్లో వెలుతురు చూడటానికి ఇష్టపడకపోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఇది తీవ్రంగా ఉండే కొంతమంది లో దీనివల్ల శరీరంలోని కొన్ని అవయవాలు బలహీనంగా మారడం కూడా కనిపించవచ్చు. చికిత్స చాలా ప్రశాంతంగా ఉండే వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవడం నుదుటిపై చల్లటి నీటితో అద్దడం నొప్పి తగ్గించడానికి డాక్టర్ సలహా మేరకు మందులు (ఉదాహరణకు ఆస్పిరిన్ లేదా ఎన్ఎస్ఏఐడీ గ్రూప్ మందులు) వాడటం నీళ్లు ఎక్కువగా తాగించడం ఆందోళన, టెన్షన్, మానసిక ఒత్తిడిని నివారించడం పైన పేర్కొన్న జాగ్రత్తలతో మైగ్రేన్ కారణంగా తరచూ వచ్చే తలనొప్పి ఎటాక్స్ను చాలావరకు తగ్గించవచ్చు. అయితే ఇది తరచూ వస్తుంటే మాత్రం ప్రొఫిలాక్టిక్ చికిత్సగా మూడు నుంచి ఆరు నెలల పాటు డాక్టర్ సలహా మేరకు కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మరొకసారి మీ న్యూరోఫిజీషియన్ లేదా మీ ఫ్యామిలీ పీడియాట్రీషియన్ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోవడం ప్రధానం. డాక్టర్ రమేశ్బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
హోమియోలో మైగ్రేన్కు మంచి చికిత్స...
మెదడు చుట్టూ ఉండే రక్తనాళాల్లో అకస్మాత్తుగా రక్తం ప్రవహించడంతో అవి ఒక్కసారిగా వ్యాకోచిస్తాయి. ఫలితంగా అక్కడి నరాలపై ఒత్తిడి పడుతుంది. దాంతో నరాల నుంచి కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. రక్తనాళాలు వ్యాకోచించినకొద్దీ నొప్పి అధికమవుతుంది. ఈ సమస్యనే మైగ్రేన్ అంటారు. ఈ సమస్య తీవ్రస్థాయికి చేరినప్పుడు నరాల వ్యవస్థ దెబ్బతినడం వల్ల మెదడులో సమస్య ఉన్న భాగం నుంచి వచ్చే నరాల పనితీరు ప్రభావితమై శరీరంలోని కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. దాంతోపాటు మైగ్రేన్ ఉన్నవారికి కళ్లు తిరగడం, తలతిరగడం, వస్తువులు రెండుగా కనిపించడం వంటి లక్షణాలూ ఉంటాయి. హెమీప్లీజిక్, రెటినల్, ఆక్యులార్ మైగ్రేన్లలో శరీరం పక్షవాతం వచ్చినట్లుగా ఉండటం, చూపు ఒకవైపు సరిగ్గా కనిపించకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కారణాలు : మానసిక ఒత్తిడి నిద్రలేమి ఉపవాసం హార్మోన్ల సమస్యలు అధిక వెలుతురు వాసనలు మత్తుపదార్థాలు, పొగాకు వాడకం, పొగతాగడం కాఫీ వంటి పానీయాలు మహిళలలో రుతుక్రమం ముందర ఈస్ట్రోజెన్ హార్మోన్లు ఎక్కువగా ఉండటం వల్ల పై లక్షణాలు కనిపించవచ్చు. ఈ కారణాలు సాధారణంగా తలనొప్పి వచ్చే తత్వం ఉన్నవారికి సమస్య మరింత అధికమయ్యేలా చేస్తాయి. లక్షణాలు : తలనొప్పి అధికంగా, వేగంగా కొట్టుకుంటున్నట్లు, తలను ముక్కలు చేస్తున్నట్లుగా, ఒకవైపు లేదా రెండువైపులా ఉండవచ్చు నొప్పి సాధారణంగా నుదురు, కళ్లచుట్టూ, తల వెనక భాగంలో రావచ్చు తలనొప్పి ఒక పక్క నుంచి మరో పక్కకు మారవచ్చు రోజువారీ పనులు చేస్తుంటే నొప్పి ఎక్కువ కావచ్చు వికారం, వాంతులు, విరేచనాలు, ముఖం పాలిపోవడం, కాళ్లు, చేతులు చల్లబడటం, వెలుతురు చూసి తట్టుకోలేకపోవడం, శబ్దం వినలేకపోవడం * నిద్రలేమి, చికాకు, నీరసం, ఉత్సాహం లేకపోవడం, ఆవలింతలు, కొందరిలో తీపి ఇంకా కారపు పదార్థాలను ఎక్కువగా ఇష్టపడటం మైగ్రేన్ సమస్య ఉన్నవారిలో తలనొప్పికి ముందు కొన్ని లక్షణాలను గమనించవచ్చు. దీనినే మైగ్రేన్ ఆరా అంటారు. ఈ ఆరా లక్షణాలు... కళ్ల ముందు మెరుపులు, ప్రకాశవంతమైన జ్యోతులు కనిపించడం వంటివి. ఈ మెరుపులు ముందర మధ్యలో మొదలై... చివరలకు వెళ్లినట్లుగా కనిపిస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు : =ఎక్కువ శబ్దం లేని, వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవాలి =తగినంత నిద్రపోవాలి = మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లు మానుకోవాలి =తలనొప్పి ఎక్కువగా ఉన్న సమయంలో కొవ్వు పదార్థాలు, మాంసం, పప్పుదినుసులు ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. సాధ్యమైనంత వరకు అల్పాహారాన్ని తీసుకోవాలి = తగినంత నీరు తాగాలి = జీవనశైలిలో మార్పులు చేసుకుని రోజూ వ్యాయామం చేయాలి = మానసిక ఒత్తిడిని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. ఒత్తిడి కలిగించే అంశాలకు దూరంగా ఉండాలి. హోమియో చికిత్స : ఈ సమస్యకు హోమియోలో వాడదగిన మందులు సాంగ్వినేరియా, బ్రయోనియా, నేట్రమ్మూర్, పల్సటిల్లా, నక్స్వామికా, సెపియా, లాకెసిస్, స్పైజీలియా వంటివి. వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకుని పై మందులను వాడాల్సి ఉంటుంది. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్