Modernization
-
ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం..
ఆంధ్రప్రదేశ్లో న్యాయ వైద్యశాస్త్ర విభాగానికి సంబంధించి ఇటీవలి కాలం (2017)లో... హైకోర్టు క్రిమినల్ అప్పీల్ నం. 326లో వెల్లడించిన ఆదేశాలను అనుసరించి, ఒక సమూల ప్రక్షాళనకై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. హైకోర్టు న్యాయమూర్తులు తమ తీర్పులో శవపరీక్షల నిర్వహణలో పాటించాల్సిన శాస్త్రబద్ధమైన ప్రమాణాలు, తదనంతరం తయారు చేసే నివేదికల నిబద్ధతపై విస్తృతంగా చర్చించారు. ఆధునిక సమాజంలో ప్రజల అసహజ మరణాలకు గల కారణాలను తెలుసుకోవడం, దోషులను శిక్షించడం, నేరాలను నివారించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ ప్రక్రియలో పోలీసులు, కోర్టు లతో పాటు ఫోరెన్సిక్ వైద్యుల పాత్ర చెప్పుకోదగ్గది.గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున వైద్యుల నియామకాలు జరిగిన పుణ్యమా అని చాలాచోట్ల ఫోరె న్సిక్ వైద్యులు అందుబాటులో ఉండడంచేత శవపరీక్షలు నాణ్యతా ప్రమాణాలతో నిర్వహించడానికి అవకాశం ఏర్పడింది. అయితే హైకోర్టు ఆశించిన విధంగా న్యాయ వైద్య శాస్త్రంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడానికి నియమ నిబంధనావళి రూపొందించడం ఈ విశేషజ్ఞుల కమిటీకి పెద్ద కష్టమైన పని కాకపోయినప్పటికీ... దానిని ఆచరణలో పెట్టాలంటే మన శవాగారాలను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాల చోట్ల శవాలను భద్రపరిచే శీతల వ్యవస్థ (కోల్డ్ స్టోరేజ్) అవసరాలకు సరిపోయేలా లేదు.మన మార్చురీలలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ.. ముఖ్యంగా ద్రవ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి వుంది. శవపరీక్షలు చేయడానికి కావల్సిన ఆధునిక పనిముట్లు చాలాచోట్ల అందుబాటులో లేవు. ప్రపంచం అంతా ఎలక్ట్రిక్ రంపాలతో పుర్రెలను తొలచి మెదడును పరీక్షిస్తుంటే, మనం మాత్రం పాత పద్ధతిలో ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం. కొన్ని అసహజ మరణాలను పరిశోధించడానికి బాడీ శాంపుల్స్ను దూరంగా ఉన్న ప్రయోగశాలలకు పంపాల్సి ఉంటుంది, అప్పటివరకు ఆ నమూనాలను పరిరక్షించడానికి డీప్ ఫ్రీజర్లు, అవి చెడిపోకుండా ఉండడానికి ప్రత్యేక సంరక్షక ద్రవ్యాలు అవసరం అవుతాయి. ఈ ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పన పని నాణ్యతను పెంచడానికి ఎంతగానో దోహదపడతాయి.చదవండి: నిజంగా పవన్ కల్యాణ్కు ఆ ధైర్యం ఉందా?ఆంధ్రప్రదేశ్లోని న్యాయ వైద్య శాస్త్ర ప్రయోగశాలలు (ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీస్) అనేక విష పదార్థాల కారణంగా మరణించినవారి శవపరీక్షలలో పరిమాణాత్మక ఫలితాలను అందించ లేకపోతున్నాయి. అనేక విషాలను గుణాత్మకంగా గుర్తించడంలో పేలవంగా ఉన్నాయి. కాలం చెల్లిన విశ్లేష ణాత్మక విషశాస్త్ర పద్ధతులు (ఎనటికల్ టాక్సికాలజీ) ఉపయోగించడమే దీనికి గల ముఖ్య కారణం. ఎఫ్ఎస్ఎల్లు న్యాయ వైద్య విభాగం మధ్య సరిగ్గా సమన్వయం లేక పోవడం కొన్ని కేసుల న్యాయ విచారణ విఫలమయ్యేందుకు కూడా కారణ మవుతోంది.మొత్తంగా న్యాయ వైద్యశాస్త్ర విభాగం బాగుపడాలంటే... మన మార్చురీలలో, న్యాయ వైద్య ప్రయోగశాలల్లో, పోలీస్ వ్యవస్థలో, అలాగే సంబంధిత వ్యక్తులకు వృత్తి పట్ల అంకిత భావంలో పెను మార్పులు అవసరం.– కట్టంరెడ్డి అనంత రూపేష్ రెడ్డిసహాయ ఆచార్యులు, న్యాయ వైద్య శాస్త్రం– విష విజ్ఞాన శాస్త్రం, ఆంధ్ర వైద్య కళాశాల -
GMR: నాగ్పూర్ విమానాశ్రయం ఆధునీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్పోర్ట్స్ డెవలపర్ జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ తాజాగా నాగ్పూర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రమాణాల పెంపు, ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ఈ ప్రాజెక్టుకు బుధవారం శంకుస్థాపన చేశారు. విమానాశ్రయాన్ని అధునాతన సౌకర్యాలతో ఆధునిక విమానయాన హబ్గా మార్చనున్నట్టు జీఎంఆర్ తెలిపింది. ‘వ్యూహాత్మకంగా మధ్య భారత్లో ఉన్న నాగ్పూర్ ప్రయాణికులకు, సరుకు రవాణాకు కీలక కేంద్రంగా పనిచేస్తుంది. దశలవారీగా ఏటా 3 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే స్థాయికి అభివృద్ధి చేస్తాం. కార్గో హ్యాండ్లింగ్ సామ ర్థ్యం 20,000 టన్నులకు చేరనుంది. తద్వారా నాగ్పూర్ను లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దుతుంది. తొలి దశ లో ప్యాసింజర్ టెరి్మనల్ సామర్థ్యం 40 లక్షల మంది ప్రయాణికుల స్థాయి లో తీర్చిదిద్దుతాం. మల్టీ మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్, ఎయిర్పోర్ట్ ఎట్ నాగ్పూర్తో (మిహా న్) జీఎంఆర్ నాగ్పూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పో ర్ట్కు కన్సెషన్ ఒప్పందం కుదిరింది’ అని జీఎంఆర్ తెలిపింది. -
ఆధునీకరణవైపు వేగంగా డిస్కంల అడుగులు
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థల ఆధునీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) ద్వారా రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్)ల్లో పనుల వేగవంతానికి రాష్ట్ర ఇంధన శాఖ చర్యలు చేపట్టింది. విద్యుత్ పంపిణీ, సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, ప్రస్తుత వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు రీవాంప్డ్ డి్రస్టిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ఉపయోగపడుతుంది. పాత నెట్వర్క్ను పునర్వ్యవస్థీకరించడం ద్వారా వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయడం ఈ పథకం ముఖ్యఉద్దేశం. ఈ పథకంలో ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ వ్యవస్థను బాగుచేసి, కొత్త పరికరాలతో ఆధునీకరించేందుకు ప్రణాళికలను ఇప్పటికే అధికారులు రూపొందించారు. దీనివల్ల వినియోగదారులకు, ముఖ్యంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని అధికారులు భావిస్తున్నారు. కొత్త కొత్తగా కరెంట్ వ్యవస్థ విద్యుత్ ప్రమాదాలు జరగడానికి, విద్యుత్ సరఫరా నష్టాలు రావడానికి ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు బలంగా లేకపోవడం, ఓవర్ లోడ్ కావడమే ప్రధాన కారణమవుతుంది. ఆర్డీఎస్ఎస్లో భాగంగా వాటిని గుర్తించి లోడ్ సరిచేస్తారు. ఒకే ఫీడర్పై వ్యవసాయ, ఇతర సర్వీసులు ఉన్న చోట వాటిని వేరు చేసి, వ్యవసాయానికి ప్రత్యేక లైన్లు అందుబాటులోకి తెస్తారు. తద్వారా వ్యవసాయ బోర్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా విద్యుత్ సరఫరా జరుగుతుంది. గృహాలకు నిరంతర సరఫరాకు విఘాతం రాకుండా ఉంటుంది. అదే విధంగా ప్రకృతి విపత్తులు సంభవించినపుడు దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను బాగుచేయడానికి కూడా ఇందులో నిధులు కేటాయించారు. మొదటి దశలో రాష్ట్రంలో 30 శాతం ఓవర్ లోడ్ అయిన ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను సరిచేసి, అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయడం, 33కేవీ, 11కేవీ, ఎల్టీ లైన్లలో 200 కిలోమీటర్ల మేర పాత కండక్టర్లు మార్చడం, సాంకేతిక సంబంధిత (ఐటీ) పనులు, తుపాన్లు వంటి ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవించే ప్రాంతంలో భూగర్భ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయడం వంటి పనులను డిస్కంలు చేపడుతున్నాయి. ఏడాదిన్నరలోపే పెట్టుబడి వెనక్కి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, బ్రేకర్ల జీవితకాలం 25 ఏళ్లుగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. వినియోగ సమయం పెరిగేకొద్దీ కోర్ సాచురేషన్, వైండింగ్ ఇన్సులేషన్ డ్యామేజ్, ఆయిల్ నాణ్యత లోపించడం కారణంగా ట్రాన్స్ఫార్మర్లలో నష్టాలు పెరుగుతాయి. పాత ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయటం వల్ల సమస్యలు తగ్గుతాయి. స్టార్రేటెడ్ ట్రాన్స్ఫార్మర్ల వినియోగం ద్వారా సుమారు 20 నుంచి 25 శాతం మేరకు సాంకేతిక నష్టాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. పెట్టిన పెట్టుబడి ఏడాదిన్నరలోపే వెనక్కి వస్తుంది. నాణ్యమైనవి కొనడం వల్ల ఇతర డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లతో పోల్చితే ఫెయిల్యూర్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. వచ్చే ఏడాదికల్లా మొదటిదశ పూర్తి ఆర్డీఎస్ఎస్ పథకం తొలి దశలో పాతవైపోయిన పవర్ ట్రాన్స్ఫార్మర్లు,డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, బ్రేకర్లు మార్చడం ద్వారా నెట్వర్క్ను బలోపేతం చేయడం, వ్యవసాయ విద్యుత్తు ఫీడర్లు విభజన, తుపాను ప్రభావిత ప్రాంతంలో భూగర్భ విద్యుత్ కేబుల్స్ ఏర్పాటు, స్మార్ట్ మీటర్లు టెండర్ల ప్రక్రియను దశల వారీగా చేపట్టి, పనులను సంబంధిత గుత్తే దారులకు అప్పగించారు. రెండవ దశ విద్యుత్ వ్యవస్థ ఆధునికరణకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) తనిఖీ కోసం డిస్కంలు పంపించాయి. అక్కడి నుంచి క్లియరెన్స్ రాగానే డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను తయారు చేసి డిపార్ట్మెంటల్ రివ్యూ కమిటీ (డీఆర్సీ), రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం కోసం ఇంధన శాఖకు పంపుతాయి. ఆర్డీఎస్ఎస్ పనులను డిస్కంలు నిరీ్ణత సమయంలో పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వ గ్రాంటు లభిస్తుంది. మొదటి దశ పనులు ఇప్పటికే ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనులను పూర్తి చేయడానికి 2025 వరకూ గడువు ఉంది. -
72 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ
ఆంధ్రప్రదేశ్లోని 72 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఆధునికీకరణ, అప్గ్రేడేషన్ కోసం గుర్తించినట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2023–24లో జూన్ 2023 వరకు దక్షిణ మధ్య రైల్వేలో అభివృద్ధి నిమిత్తం రూ.83.64 కోట్లు వ్యయం చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ సంజీవ్కుమార్ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఐదేళ్లలో 79 ర్యాంకుల మెరుగు ప్రపంచబ్యాంకు డూయింగ్ బిజినెస్ రిపోర్టు (డీబీఆర్)–2020 ప్రకారం భారతదేశ ర్యాంకు 2014లో 142 ఉండగా 79 ర్యాంకులు మెరుగై 2019కి 63వ ర్యాంకుకు చేరుకుందని కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్ప్రకాశ్.. వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్రెడ్డి, మార్గాని భరత్రామ్, ఎన్.రెడ్డెప్ప ప్రశ్నకు జవాబిచ్చారు. దక్షిణమధ్య రైల్వేలో ఖాళీలు దక్షిణమధ్య రైల్వేలో గ్రూప్ ఏ, సీల్లో పలు ఖాళీలున్నట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గ్రూపు ఏలో 110, గ్రూపు సీలో 10,338 ఖాళీలున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ చింతా అనూరాధ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఏపీ ప్రాంతాలు సికింద్రాబాద్ఆర్ఆర్బీ పరిధిలో ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాలు సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరిధిలోకి వస్తాయని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ సంజీవ్కుమార్ ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. దక్షిణమధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వేలు సికింద్రాబాద్ పరిధిలోకి వస్తాయని చెప్పారు. సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ల ప్రకారం దేశంలోని 21 బోర్డుల్లో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో పాస్పోర్టు కేంద్రం ఏర్పాటు చేయండి అనకాపల్లి జిల్లాలో కేంద్ర ప్రాంతీయ పాస్పోర్టు సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విదేశాంగమంత్రి జయశంకర్కు వైఎస్సార్సీపీ ఎంపీ బి.వి.సత్యవతి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో పాస్పోర్టు సేవాకేంద్రం ఏర్పాటుచేస్తే అల్లూరి, కాకినాడ, విజయనగరం, విశాఖ జిల్లాల వాసులకు కూడా ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. -
చరిత్ర సృష్టించిన విశాఖ పోర్టు
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ పోర్టు అథారిటీ చరిత్ర సృష్టించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో తన రికార్డును తానే తిరగరాసింది. మునుపెన్నడూ లేనివిధంగా 73.73 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది. 7 శాతం వృద్ధిని నమోదు చేసి తూర్పు తీరంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ దఫా స్టీమ్ కోల్, క్రూడ్ ఆయిల్, కుకింగ్ కోల్, ఎరువులు వంటి సరుకు రవాణాలో వృద్ధిని నమోదు చేసింది. పోర్టులో ఆధునికీకరణ పనులు భవిష్యత్లో విశాఖ పోర్టు మరింత ప్రగతి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఆధునికీకరణ వైపు పయనిస్తోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 2022–23 ఆర్థిక సంవత్సరంలో పోర్టు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయడంతో ప్రగతి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. 2022 డిసెంబర్ 31 నుంచి బేబీ కేప్(260 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పు) వెస్సల్స్ ఇన్నర్ హార్బర్లోకి వచ్చే విధంగా ఆధునికీకరణ చేపట్టారు. రూ.151 కోట్ల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. పోర్టును ల్యాండ్లార్డ్ పోర్టు చేయడంలో భాగంగా పీపీపీ పద్ధతిలో రూ.655 కోట్లు విలువైన ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో రెండు ప్రాజెక్టులు తుది దశలో ఉన్నాయి. స్టాక్ నిల్వ కేంద్రాల నుంచి కాలుష్యం వెదజల్లకుండా ఉండేందుకు రూ.120 కోట్లతో 15 లక్షల నిల్వ సామర్థ్యంతో కవర్డ్ స్టోరేజ్ యార్డుల నిర్మాణం చేపట్టారు. మరిన్ని ప్రాజెక్ట్లు పురోగతిలో ఉన్నాయి. తుది దశలో క్రూయిజ్ టెర్మినల్ ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా క్రూయిజ్ టెర్మినల్ పనులు జోరుగా సాగుతున్నాయి. 2,500 మంది పర్యాటకులు ఉండే క్రూయిజ్ వెస్సల్ను ఈ బెర్త్లో అపరేట్ చేసే విధంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ క్రూయిజ్ టెర్మినల్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రికార్డు స్థాయిలో కార్యకలాపాలు ♦ 2022 ఫిబ్రవరి 25న ఈస్ట్ క్యూ–6 బెర్త్లో ఎంవీ దిస్పిన.కె నౌక నుంచి రికార్డు స్థాయిలో 20,050 టన్నుల క్రోమ్ ఓర్ను పోర్టులో దించింది. ♦ 2022 సెపె్టంబర్ 25న వెస్ట్ క్యూ–1 బెర్త్లో ఫెర్రో మాంగనీస్ స్లాగ్ను ఎంవీ ఎస్జే స్టార్ నౌక నుంచి పోర్టులో దించారు. ♦ 2022 అక్టోబర్ 16న ఈస్ట్ క్యూ7 బెర్త్ నుంచి హై కార్బన్ ఫెర్రో మాంగనీస్ను ఎంవీ ఆలమ్ సయాంగ్ నౌకలోకి ఎక్కించారు. ♦ 2022 అక్టోబర్ 17న వెస్ట్ క్యూ–1 బెర్త్లో 29,500 టన్నుల ఐరన్ ఓర్(పిల్లెట్స్)ను ఎంవీ విశ్వవిజేత నౌకలోకి లోడింగ్ చేశారు. ♦ 2022 డిసెంబర్ 1న వెస్ట్ క్యూ–3 బెర్త్లో 23,030 టన్నుల ఐరన్ ఓర్ ఆక్సైడ్ను ఎంవీ అగియా ఇరిని ఫోర్స్ నౌక నుంచి అన్లోడ్ చేశారు. ♦ 2022 డిసెంబర్ 23న వెస్ట్ క్యూ–6 బెర్త్లో 16,478 టన్నుల ఫ్లైయా‹Ùను ఎంవీ కింగ్ ఫిషర్ నౌకలోకి ఎక్కించారు. ♦ 2023 మార్చి 10న ఈస్ట్ క్యూ–6 బెర్త్ నుంచి 8,864 టన్నుల స్టీల్ బ్లూమ్స్ను ఎంవీ ఎంఎక్స్ డిక్సియామెన్ నౌకలోకి లోడ్ చేశారు. ♦ 2023 ఏప్రిల్ 26న వెస్ట్ క్యూ–2 బెర్త్లో 44,374 టన్నుల ఐరన్ ఓర్ను ఎంవీ జల కల్పతరు నౌకలోకి ఎక్కించారు. ♦ 2023 ఏప్రిల్ 29న ఈస్ట్ క్యూ–1 బెర్త్లో 36,177 టన్నుల పెట్రోలియం కోక్ను ఎంవీ అన్ చాంగ్ నౌక నుంచి దించారు. -
కేజ్రీవాల్ బంగ్లా దర్యాప్తు అధికారికి ఉద్వాసన
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారం రాష్ట్ర సర్కార్కే ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిన నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేజ్రీవాల్ అధికార బంగ్లా ఆధునీకరణకు రూ.45 కోట్లు వెచ్చించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్ అధికారి, సీనియర్ ఐఏఎస్ రాజశేఖర్ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తును విజిలెన్స్ విభాగంలోని ఇతర అసిస్టెంట్ డైరెక్టర్లు పంచుకోవాలని, నివేదికలను నేరుగా విజిలెన్స్ సెక్రటరీకి సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు మాటున రాజశేఖర్ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విజిలెన్స్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. -
ఇండియా సిమెంట్స్ ఆధునీకరణ
చెన్నై: ప్రయివేట్ రంగ కంపెనీ ఇండియా సిమెంట్స్ పాత తయారీ ప్లాంట్లను ఆధునీకరించేందుకు ప్రణాళికలు వేసింది. ఇందుకు రూ. 1,500–1,600 కోట్ల పెట్టుబడి వ్యయాలను అంచనా వేస్తోంది. నిధులను అంతర్గత వనరుల నుంచి సమకూర్చుకోనున్నట్లు కంపెనీ వైస్చైర్మన్, ఎండీ ఎన్.శ్రీనివాసన్ వెల్లడించారు. ఆధునీకరణ ప్రణాళికలకోసం రెండు అంతర్జాతీయ కన్సల్టెంట్ సంస్థలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం పాత సిమెంట్ ప్లాంట్ల సామర్థ్యాలను మెరుగుపరచేందుకు పూర్తిస్థాయిలో ఆధునీకరించనున్నట్లు తెలియజేశారు. ఇందుకు 15–18 నెలల్లో రూ. 1,500–1,600 కోట్ల పెట్టుబడి వ్యయాల కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. భూముల మానిటైజేషన్ ఇండియా సిమెంట్స్ చేతిలో 26,000 ఎకరాల భూమి ఉన్నదని, ల్యాండ్ బ్యాంక్ను మానిటైజ్ చేయడం ద్వారా నిధులను సమీకరించనున్నట్లు శ్రీనివాసన్ తెలియజేశారు. పాత ప్లాంట్ల ఆధునీకరణపై సలహాలకు క్రుప్ పాలిసియస్, ఎఫ్ఎల్ స్మిత్ను నియమించుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని మల్కాపూర్, విష్ణుపురం ప్లాంట్లతో ఆధునీకరణ పనులు ప్రారంభంకానున్నట్లు కంపెనీ అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తమిళానడులోని శంకరి, రాజస్తాన్లోని బన్సారాలోని ఆధునిక ప్లాంట్లను ఈ జాబితాలో చేర్చబోరని తెలియజేశాయి. ఆంధ్రప్రదేశ్లోని చిలంకూర్, యర్రగుంట్ల, తమిళనాడులో శంకరనగర్, శంకరి, దలవాయ్లలోనూ కంపెనీకి సిమెంట్ తయారీ ప్లాంట్లున్నాయి. చెన్నై, మహారాష్ట్రలలో రెండు గ్రైండింగ్ యూనిట్లను సైతం కలిగి ఉంది. ఈ యూనిట్లు ఉమ్మడిగా మొత్తం 16 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్లాంట్లను రెండు దశాబ్దాల క్రితం సొంతం చేసుకుంది. క్యూ3లో రూ. 133 కోట్ల నికర లాభం ఇండియా సిమెంట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం భారీగా ఎగసి రూ. 133 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 16 కోట్లు మాత్రమే ఆర్జించింది. అనుబంధ సంస్థ స్ప్రింగ్వే మైనింగ్ ప్రయివేట్(ఎస్ఎంపీఎల్) విక్రయం ద్వారా నమోదైన ఆర్జన లాభాలకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం ఆదాయం 10 శాతంపైగా వృద్ధితో రూ. 1,281 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 1,161 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,153 కోట్ల నుంచి రూ. 1,458 కోట్లకు పెరిగాయి. 2022 అక్టోబర్ 10న దాదాపు రూ. 477 కోట్లకు ఎస్ఎంపీఎల్ విక్రయాన్ని పూర్తి చేసింది. ఫలితాల నేపథ్యంలో ఇండియా సిమెంట్స్ షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం బలహీనపడి రూ. 191 వద్ద ముగిసింది. -
Nandyal: అత్యాధునికంగా సర్వజనాసుపత్రి
బొమ్మలసత్రం: పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నే రీతిలో ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతోంది. ఈ కోవలోనే నంద్యాల సర్వజన ఆసుపత్రిలో రూ.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక పరికరాలను సమకూర్చడంతో పాటు వివిధ విభాగాలకు ప్రత్యేక గదులను నిర్మించింది. ఆసుపత్రి ఏర్పాటైనప్పటి నుంచి ఈ స్థాయిలో ఆధునీకరించడం ఇదే ప్రప్రథమం కావడం విశేషం. అందుబాటులోకి తీసుకొచ్చిన అధునాతన యంత్రాల ద్వారా ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ విభాగాల్లో దాదాపు 23 రకాల శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయనున్నారు. ఇవే కాకుండా సిబ్బంది కోసం ప్రత్యేకంగా 18 గదులను నిర్మించారు. ఇదే సమయంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది నియామకం కూడా పూర్తి చేశారు. అందుబాటులోకి ఆధునాతన వైద్యం నంద్యాల జిల్లా కేంద్రంలో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల రూపుదిద్దుకుంటోంది. స్థానిక సర్వజన ఆసుపత్రిలో ఇప్పటికే ఓపీ భవనం, జిరియాట్రిక్ భవనం, డీఈఐసీ భవన నిర్మాణాలు పూర్తి చేసి ప్రతి రోజు 1,400 మందికి పైగా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆసుపత్రిలోని పాడుబడిన భవనంలోనే ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆసుపత్రి రూపురేఖలు మార్చేయడంతో ఆపరేషన్ థియేటర్లో మెరుగైన వైద్యం అందుతోంది. ఈ శస్త్ర చికిత్సలన్నీ ఇక్కడే.. ఆర్థో విభాగం: చేతులు, కాళ్లలో విరిగిన ఎముకలకు సర్జరీ, ఎముకలకు రాడ్లు, ప్లేట్లు అమర్చడం చేస్తారు. జనరల్ సర్జరీ విభాగం: హెర్నియా, హైడ్రోసిల్, అపెండిక్స్, పైల్స్, పిస్టులా, కొలొసెక్టమి, పారాటిడ్, పర్ఫరేషన్, లంప్ బ్రిస్ట్, సింపుల్ థైరాయిడ్, లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సలు. ఈఎన్టీ విభాగం: అడినో టోన్సిలెక్టోమీ, టింపోనిప్లాస్టి, మిరిన్గోటోమి, సెప్టోప్లాస్టి, ఫెస్, టర్బినో ప్లాస్టి తదితరాలు. అధునాతన యంత్రాలు.. ఉపయోగాలు ► ఎండోస్కోపి యంత్రం: ఈ యంత్రాన్ని రూ.20 లక్షలతో ఏర్పాటు చేశారు. కడుపు లోపలి భాగంలోని అల్సర్, క్యాన్సర్ గడ్డలను సులభంగా గుర్తిస్తుంది. ► లాప్రోస్కోపి : ఈ యంత్రం దాదాపు కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితం. పేదలకు నాణ్యమైన వైద్యం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.22 లక్షలతో ప్రభుత్వాసుపత్రిలోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. కోత లేకుండా శరీరంపై చిన్న రంద్రం చేసి ఆపరేషన్ చేయడం ఈ యంత్రం ప్రత్యేకత. ► సీఏఆర్ఎం : ఈ యంత్రం ఖరీదు రూ.12 లక్షలు. ఆపరేషన్ తర్వాత ఎముకలు సరైన క్రమంలో అమర్చినట్లు నిర్ధారించుకుంటారు. ► హారిజాంటల్ ఆటోక్లేవ్: ఈ యంత్రాల ఖర్చు రూ.11 లక్షలు. 120 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆపరేషన్కు ఉపయోగించే పరికరాలు, బట్టలపై క్రిములను నశింపజేస్తాయి. ► ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్: ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా ఖాళీ అయినప్పుడు ఈ యంత్రం ద్వారా రోగికి కృత్తిమ ఆక్సిజన్ అందిస్తారు. ఈ యంత్రం ఖరీదు రూ.50వేలు. అవసరానికి తగిన విధంగా ప్రత్యేక గదులు ► సీఎస్ఎస్డీ గది: ఇన్ఫెక్షన్కు సంబంధించిన ప్రీ మెటీరియల్ను ఆసుపత్రిలో అవసరమయ్యే గదులకు పంపుతారు. ► సెప్టిక్ ఓపి గది: శరీరంలోని గాయాలకు ఇన్ఫెక్షన్ సోకి సెప్టిక్ అయితే వారికి ఈ గదిలో చికిత్సలు అందిస్తారు. ► స్టాఫ్ నర్సులు, సర్జరీ వైద్యుల కోసం ప్రత్యేకంగా రెండు గదులు ఏర్పాటు. ► ప్రీ అనస్తీషియా గది: అనస్తీషీయా డ్రెస్సింగ్ గదులు నిర్మించారు. ► థియేటర్లో సిలిండర్ స్టోర్, శస్త్రచికిత్సలకు అవసరమయ్యే పరికరాలకు ప్రత్యేక గదులు. ► పీజీ విద్యార్థులకు అవసరమయ్యేలా స్టూడెంట్ డెమో గది. ► అనస్తీషియా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ప్రత్యేక గదులు. ► ఆపరేషన్ తరువాత శుభ్రం చేసిన నీటిని డర్టీకారిడార్ ద్వారా బయటకు పంపేందుకు డిస్పోజల్ జోన్. ► ఆపరేషన్ థియేటర్లో మందులు నిల్వకు డ్రగ్స్ స్టోర్. ఆపరేషన్ థియేటర్ను ఆధునీకరించాం నాలుగు నెలలుగా ఆపరేషన్ థియేటర్లో చేపట్టిన పనులన్నీ పూర్తయ్యాయి. రోగులకు శస్త్ర చికిత్సలన్నీ ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చేస్తాం. ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.5 కోట్లు ఖర్చు చేసింది. కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నే రీతిలో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడంతో పేదలకు మెరుగైన వైద్యం మరింత చేరువ కానుంది. – ప్రసాదరావు, సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్, నంద్యాల -
AP: రూ.3,364 కోట్లతో సకల వసతులు.. మారనున్న రూపురేఖలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని హాస్టళ్ల రూపురేఖలు మార్చి, అత్యుత్తమ విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా రూ.3,364 కోట్లతో 3,013 సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల ఆధునీకరణకు నాడు–నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లోనూ నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లలో మంచి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కిచెన్లు సైతం ఆధునీకరించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలన్నారు. హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలని, సమాజంలో అట్టడుగున ఉన్న వారు చదువుకోవడానికి తగిన పరిస్థితులు కల్పించాలని చెప్పారు. బంకర్ బెడ్స్, తదితర అన్ని సౌకర్యాలు నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని, భవనాలను పరిగణనలోకి తీసుకుని వాటి డిజైన్లను రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలి. పిల్లలు చదువుకోవడానికి మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. హాస్టళ్లలోకి వెళ్లగానే జైల్లోకి వెళ్లామనే భావన వారికి కలగకూడదు. చదువులు కొనలేని కుటుంబాల వారే పిల్లలను హాస్టళ్లకు పంపిస్తారు. అందువల్ల అలాంటి పిల్లలు బాగా చదువుకుని, బాగా ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలి. మన పిల్లలనే హాస్టళ్లలో ఉంచితే ఎలాంటి వసతులు, వాతావరణం ఉండాలనుకుంటామో సంక్షేమ హాస్టళ్లన్నింటినీ అలా తీర్చిదిద్దాలి.’ – సీఎం వైఎస్ జగన్ మూడు దశల్లో పనులు ► మూడు దశల్లో హాస్టళ్ల ఆధునీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తంగా 3,013 చోట్ల రూ.3,364 కోట్లతో నాడు–నేడు పనులు చేపట్టాలి. మొదటి దశలో మొత్తం సుమారు 1,366 చోట్ల పనులు చేపట్టాలి. దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ తొలి విడతలోనే బాగు చేయాలి. తొలి విడత పనులు జనవరి నుంచి ప్రారంభించి, ఏడాదిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. ► హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు, కిచెన్లను కూడా ఆధునీకరించే పనులు చేపట్టాలి. కిచెన్కు అవసరమైన దాదాపు 10 రకాల వస్తువులను కొనుగోలు చేయాలి. హాస్టళ్ల పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు స్పష్టంగా కన్పించాలి. పిల్లలకు ఇవ్వాల్సిన వస్తువులను సకాలంలో నాణ్యమైన వాటిని అందించాలి. హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలి. మండలాల వారీగా పర్యవేక్షణ ఉండాలి. వెల్ఫేర్ అధికారులు, కేర్ టేకర్ల పోస్టులు భర్తీ చేయండి ► హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలి. ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్ టేకర్ల పోస్టులను భర్తీ చేయాలి. గిరిజన సంక్షేమ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్–4 ఉద్యోగుల నియామకంపై దృష్టి పెట్టాలి. ప్రతి హాస్టల్ను పరిశీలించి, కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలి. ► హాస్టళ్ల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రతి హాస్టల్లో ఒక నంబర్ ఉంచాలి. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక నంబర్ ఉంచాలి. అంగన్వాడీలలో నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ఉండాలి. టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి. అంగన్వాడీల్లో ఫ్లేవర్డ్ మిల్క్ ► అంగన్వాడీలలో సూపర్వైజర్ల పోస్టులను భర్తీ చేసినట్టు అధికారులు సీఎం వైఎస్ జగన్కు తెలిపారు. గత సమీక్షలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని ఈ సందర్భంగా వివరించారు. అంగన్వాడీలలో పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ► అక్టోబర్ నెలలో నూటికి నూరు శాతం పాల సరఫరా జరిగింది. డిసెంబర్ 1 నుంచి ఫ్లేవర్డ్ మిల్క్ను అంగన్వాడీల్లో సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం’ అని వివరించారు. ► మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్లేవర్డ్ మిల్క్ను సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్, ప్ర«భుత్వ ప్రధాన కార్యాదర్శి సమీర్ శర్మ, బీసీ సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు జి.జయలక్ష్మి, ముద్దాడ రవి చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీ డీడీసీఎఫ్ ఎండీ ఎ.బాబు, మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్లు ఎ.సిరి, ఎం.జాహ్నవి, జీసీ కిషోర్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Jagananna Gorumudda: ‘గోరుముద్ద’లో కొత్త రుచులు -
సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణకు లైన్క్లియర్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను పూర్తిస్థాయిలో ఆధునీకరించే ప్రాజెక్టు పట్టాలకెక్కింది. ఇదిగో అదిగో అంటూ ఇంతకాలం ఊరించిన రైల్వే.. ప్రస్తుత భవనాలను కూల్చి వాటి స్థానంలో విమానాశ్రయం తరహా వసతులతో పునర్నిర్మించే ప్రాజెక్టుకు నిర్మాణ సంస్థను ఖరారు చేసింది. రూ.699 కోట్లకు కోట్ చేసిన ఢిల్లీ సంస్థ గిరిధారిలాల్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ టెండర్ను దక్కించుకుంది. 36 నెలల్లో పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థతో రైల్వే ఒప్పందం కుదుర్చుకుంటోంది. ప్రయాణికులకు సౌకర్యం కోసం.. దేశవ్యాప్తంగా 123 స్టేషన్లను రూ.50 వేల కోట్లతో ఆధునీకరించాలని రైల్వే నిర్ణయించింది. అందులో భాగంగా నాన్ సబర్బన్ గ్రేడ్–1 పరిధిలోకి వచ్చే సికింద్రాబాద్ స్టేషన్ను అప్గ్రెడేషన్ ప్రాజెక్టు కోసం గతంలోనే రైల్వే బోర్డు ఎంపిక చేసింది. రూ.500 కోట్ల వార్షికాదాయం లేదా సంవత్సరానికి 20 మిలియన్ల ప్రయాణికులు ఉపయోగించే స్టేషన్ను ఈ గ్రేడ్ కింద గుర్తిస్తారు. సికింద్రాబాద్ స్టేషన్ను రోజుకు సగటున 1.8 లక్షల మంది ప్రయాణికులు వినియోగించుకుంటారు. నిత్యం 200 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేసిన రైల్వేబోర్డు.. ఈ స్టేషన్ను పూర్తిగా ఆధునీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం టెండర్లు ఖరారు చేసింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను అప్గ్రేడ్ చేయడం చాలా అవసరమని, అందుకే ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్కుమార్ జైన్ చెప్పారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థకు సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. భారీ భవనాలు, పార్కింగ్ సదుపాయాలతో.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రెండు వైపులా మూడంతస్తులతో రెండు భారీ భవన సముదాయాలు ఉంటాయి. రెండు భవనాలను అనుసంధానిస్తూ ట్రావెలేటర్స్ (ఆటోవాకింగ్ వ్యవస్థ) ఏర్పాటు చేస్తారు. ఇక దక్షిణ భాగం వైపు 2వేల వాహనాలను నిలిపేలా మల్టీలెవల్ అండర్గ్రౌండ్ పార్కింగ్ ఉంటుంది.. ఉత్తరభాగం వైపు మూడు వేల వాహనాలను నిలిపేలా ఐదు అంతస్తుల పార్కింగ్ టవర్ నిర్మిస్తారు. ప్లాట్ఫామ్లన్నింటినీ ఆధునీకరిస్తారు. అన్నింటినీ కవర్ చేస్తూ పైకప్పు ఉంటుంది. రైల్వేస్టేషన్ను మెట్రోరైల్స్టేషన్లకు అనుసంధానిస్తూ స్కైవేలను నిర్మిస్తారు. -
నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు పచ్చజెండా
సాక్షి, అమరావతి: నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ ప్రణాళికకు దక్షిణ మధ్య రైల్వే ఆమోదం తెలిపింది. ఈ మేరకు టెండర్లను ఖరారు చేసింది. దేశంలో ప్రధాన రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా మన రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ, నెల్లూరు రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. ఇప్పటికే తిరుపతి రైల్వే స్టేషన్లో రూ.360 కోట్లతో అభివృద్ధి ప్రణాళికను ఆమోదించారు. తాజాగా రూ.102కోట్లతో నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి ప్రణాళికను దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది. ప్రస్తుతం నెల్లూరు రైల్వే స్టేషన్కు రోజూ సగటున 30వేల మంది ప్రయాణికులు వచ్చి, వెళుతుంటారు. భవిష్యత్లో ప్రయాణికుల రద్దీ మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా స్టేషన్లో వసతులను మెరుగుపరిచేందుకు రూ.102కోట్లతో ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా నెల్లూరు రైల్వే స్టేషన్కు పశ్చిమ వైపు కొత్తగా జీ+2 భవనం నిర్మిస్తారు. తూర్పు వైపు రైల్వే స్టేషన్ భవనాన్ని జీ+1గా విస్తరిస్తారు. ప్లాట్ఫారాలు 1, 2, 3, 4లను అభివృద్ధి చేసి, కొత్తగా ఫ్లోరింగ్, పైకప్పులు నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న సబ్ వేను రైల్వేస్టేషన్ తూర్పు, పశ్చిమ దిశల నుంచి ప్లాట్ఫాం–4తో అనుసంధానిస్తారు. రక్షిత మంచినీటి వ్యవస్థను, వాటర్ ట్రీట్మెంట్, సివరేజ్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తారు. ఈ పనులను 21 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రయాణికులకు మరింత మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ ప్రణాళికను రూపొందించామని దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జ్ జీఎం అరుణ్కుమార్ జైన్ చెప్పారు. -
రూ.600 కోట్లతో 3 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు రైల్వేస్టేషన్లను మల్టీమోడల్ రైల్వేస్టేషన్లుగా అభివృద్ధి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. విజయవాడ, నెల్లూరు, తిరుపతి రైల్వేస్టేషన్లను అందుకోసం ఎంపిక చేసింది. మొదట పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని రైల్వేశాఖ భావించింది. కానీ ప్రైవేటు సంస్థల నుంచి ఆశించినస్థాయిలో స్పందన లేకపోవడంతో సొంత నిధులతో వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రాథమిక నివేదికను ఇటీవల ఆమోదించింది. వీటి అభివృద్ధికి రూ.600 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించింది. దీనిపై రైల్వే డెవలప్మెంట్ కార్పొరేషన్ తుది ఆమోదం తెలిపితే తదుపరి ప్రక్రియను చేపట్టాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు భావిస్తున్నారు. వచ్చే మార్చి నాటికి అభివృద్ధి పనులు పూర్తిచేయాలని భావిస్తున్నామని రైల్వే వర్గాలు తెలిపాయి. ఆధునికీకరణ, వసతులకు ప్రాధాన్యం గతంలో పీపీపీ విధానంలో అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మల్టీప్లెక్స్లు, మాల్స్, రెస్టారెంట్లు, ఇండోర్ గేమ్స్ మొదలైన ప్రాజెక్టులు ఉండేవి. కానీ ప్రస్తుతం రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి ప్రణాళికను ఖరారు చేసింది. ప్రధానంగా రైల్వేస్టేషన్లకు కొత్తరూపు ఇవ్వడం, ప్రయాణికుల వసతులు మెరుగుపరచడం వంటి పనులతోపాటు భద్రతకు ప్రాధాన్యమివ్వనున్నారు. అందుకోసం ప్రయాణికులకు వసతులు, ఇంటర్మోడల్ కనెక్టివిటీ, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ, ఆహ్లాదకర అంశాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, రైల్వే సమాచార వ్వవస్థ అనే ఆరు కేటగిరీల కింద అభివృద్ధి చేయనున్నారు. రైల్వే స్టేషన్లలో కల్పించనున్న వసతులు ► ప్రాంత విశిష్టత, సంస్కృతిని ప్రతిబింబించేలా రైల్వేస్టేషన్కు కొత్తరూపు తీసుకొస్తారు. ► రైల్వేస్టేషన్ ప్రాంగణాన్ని ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టంతో అనుసంధానిస్తారు. సీసీ కెమెరాలు, లగేజీ స్కానింగ్ వ్యవస్థ, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటుతోపాటు రద్దీకి అనుగుణంగా భద్రతా సిబ్బందిని నియమిస్తారు. రైల్వేస్టేషన్ ప్రాంగణాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తారు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను వేర్వేరుగా ఏర్పాటు చేస్తారు. ► స్టేషన్లోనే ఇంటర్ఫేసెస్, స్వైపింగ్ టికెట్ మెషిన్లు, డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటు. ► అన్ని ప్లాట్ఫామ్లపై ఎస్కలేటర్లు, ప్రధాన ద్వారం వద్ద తగినన్ని ఎలివేటర్లను ఏర్పాటు చేస్తారు. బ్యాటరీ వాహనాలను అందుబాటులో ఉంచుతారు. ► ఇంటర్మోడల్ కనెక్టివిటీ కారిడార్ ఏర్పాటు చేస్తారు. రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనే సిటీ బస్సులు, ట్యాక్సీలు, ఆటోరిక్షాల కోసం మల్టీమోడల్ ట్రాన్సిట్ హబ్ను నెలకొల్పుతారు. ప్రయాణికులు రైల్వేస్టేషన్ నుంచి ఆ ప్రత్యేక మార్గంలో బయటకు వచ్చి బస్స్టేషన్, విమానాశ్రయంతోపాటు ప్రధాన ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. విశాలమైన పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తారు. ► రైల్వేస్టేషన్లో ఎగ్జిక్యూటివ్ లాంజ్లు ఏర్పాటు చేస్తారు. ప్లాట్ఫాంలను విశాలంగా తీర్చిదిద్దుతారు. ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు అంబులెన్స్ను అందుబాటులో ఉంచుతారు. మందుల దుకాణాలు, రిటైల్ దుకాణాలు, ఏటీఎంలు మొదలైనవి ఏర్పాటు చేస్తారు. -
అమరవీరులను అవమానించడమే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జలియన్వాలా బాగ్ మెమోరియల్ ఆధునీకరణ పనులను ‘అమరవీరులకు కలిగిన అవమానం’గా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బలిదానం అంటే అర్ధం తెలియని వారే ఇలా అవమానించగలరని ప్రధాని మోదీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘నేను అమరవీరుడి కొడుకును. అమరులకు కలిగిన అవమానాన్ని ఏ మాత్రం సహించబోను. స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకోని వారు దీనిని అర్థం చేసుకోలేరు’ అని పేర్కొన్నారు. జలియన్ వాలాబాగ్ మెమోరియల్ సముదాయంలో ఆధునీకరణ పేరుతో చేసిన మార్పులు, చేర్పులు చరిత్రను నాశనం చేసేవిగా ఉన్నాయంటూ వెల్లువెత్తుతున్న విమర్శలపై ఒక మీడియా కథనాన్ని మంగళవారం ఆయన ట్విట్టర్లో ట్యాగ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన మార్పులు బ్రిటిష్ పాలన, జనరల్ డయ్యర్ పాల్పడిన అకృత్యాలను ప్రజలకు స్మరణకు తెచ్చేలా చేయడానికి బదులు..తుడిచేసేలా ఉన్నాయని కాంగ్రెస్ నేత జైవీర్ షేర్గిల్ ఆరోపించారు. ఆధునీకరించిన జలియన్ వాలాబాగ్ మెమోరియల్ సముదాయాన్ని శనివారం ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా ఉన్నారు. కొత్తగా చేపట్టిన మార్పులపై కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శలు కురిపించగా అదే పార్టీకి చెందిన సీఎం అమరీందర్ మాత్రం ప్రశంసలు కురిపించడం గమనార్హం. జలియన్వాలా బాగ్ మెమోరియల్ సముదాయం ఆధునీకరణ అనంతరం చూడటానికి చాలా బాగుందన్నారు. ఈ సముదాయంలో ఏఏ నిర్మాణాలను తొలగించారో తనకు తెలియదన్నారు. రాహుల్ ట్విట్టర్లో విమర్శించిన విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. -
తెలుగును పరిరక్షించుకుందాం
సాక్షి, న్యూఢిల్లీ: సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు భాషను చదవడం, రాయడం, మాట్లాడటం ప్రతీ ఒక్కరి అభిరుచి కావాలని సూచించారు. మాతృభాషలో మాట్లాడటాన్ని గర్వ కారణంగా భావించాలన్నారు. భారతదేశంలోని అనేక ప్రాచీన భాషల్లో ఒక్కటైన తెలుగును పరిరక్షించుకుని, మరింత సుసంపన్నంగా తీర్చిదిద్దడమే గిడుగు రామ్మూర్తి పంతులుకు ఇచ్చే నిజమైన నివాళి అన్న ఆయన, తెలుగు భాష పరిరక్షణ కోసం 16 సూత్రాలను ప్రతిపాదించారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆదివారం వర్చువల్ వేదికగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు నిర్వహించిన ‘తెలుగు భవిష్యత్తు – మన బాధ్యత’ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాషను సమున్నతంగా తీర్చిదిద్దడమే గిడుగు వారికిచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. తెలుగు భాషను కాపాడుకోవాలనే సత్సంకల్పంతో తెలుగు వారంతా ఒకే వేదిక మీదకు రావడం అభినందనీయమన్న ఆయన, ఈ కార్యక్రమ ఏర్పాటుకు ప్రోత్సాహాన్ని అందించిన ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంస్థాపక అధ్యక్షుడు విక్రమ్ పెట్లూరి, వీధి అరుగు సంస్థాపక అధ్యక్షుడు వెంకట్ తరిగోపుల సహా వివిధ దేశాల భాషావేత్తలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. -
ఫోరెన్సిక్ ల్యాబ్ల ఆధునీకరణ
న్యూఢిల్లీ: నేర ఘటనలలో సమర్థవంతమైన దర్యాప్తు జరిపేందుకు వీలుగా దేశంలోని ఆరు కేంద్ర ఫోరెన్సిక్ ప్రయోగశాలలను అప్గ్రేడ్ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. చండీగఢ్, హైదరాబాద్, కోల్కతా, భోపాల్, పుణే, గువాహటిలలో ఉన్న ఆరు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలు (సీఎఫ్ఎస్ఎల్)లను ఆధునీకరించనుంది. ఈ ఆరు సీఎఫ్ఎస్ఎల్ల సామర్థ్యాన్ని పెంచాలని హోం శాఖ నిర్ణయించిందని ఒక అధికారి తెలిపారు. తీవ్రమైన నేరాలలో మరింత సమర్థవంతమైన, శాస్త్రీయ విధానంలో దర్యాప్తును సులభతరం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. పరిశోధన కార్యకలాపాలను నిర్వహించడానికి ఇటీవల ఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సర్వీసెస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిహేవియరల్ సైన్సెస్, గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. దీని ద్వారా విద్యావేత్తలు–అభ్యాసకుల మధ్య భాగస్వామ్యాన్ని పెండడంతోపాటు అత్యాధునిక పరిశోధనలకు దోహదపడుతుందని భావిస్తున్నారు. -
దేశ రక్షణలో ఒత్తిళ్లకు తలొగ్గం
న్యూఢిల్లీ: దేశ రక్షణ విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సైనిక బలగాల బలోపేతానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కార్గిల్ యుద్ధం 20వ వార్షికోత్సవం సందర్భంగా సైనికాధికారులు, మాజీ సైనికులతో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. పొరుగు దేశం చేసిన కుట్ర పన్నాగాన్ని రెండు దశాబ్దాల క్రితం వమ్ము చేసిన మన సైనిక బలగాలు మరోసారి దుస్సాహసానికి పాల్పడకుండా బుద్ధిచెప్పాయని పాక్నుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుత యుద్ధ క్షేత్రం భూమి నుంచి అంతరిక్షం, సైబర్ రంగాలకు మారిపోయిందన్నారు. కార్గిల్ విజయం అందరికీ స్ఫూర్తి ‘దేశ సైనిక వ్యవస్థ ఆధునీకరణ అత్యంత అవసరం. అది మనకు చాలా ముఖ్యం. జాతి భద్రత విషయంలో ఎటువంటి ఒత్తిడికి గానీ ఎవరి పలుకుబడికి గానీ లొంగబోం. సముద్రగర్భం నుంచి విశాల విశ్వం వరకు భారత్ సర్వ శక్తులు ఒడ్డి పోటీపడుతుంది’ అని అన్నారు. ఉగ్రవాదం, పరోక్ష యుద్ధం ప్రపంచానికి ప్రమాదకరంగా మారాయన్న ప్రధాని.. యుద్ధంలో ఓటమికి గురై నేరుగా తలపడలేని వారే రాజకీయ మనుగడ కోసం పరోక్ష యుద్ధానికి, ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్నారని పాక్నుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘మానవత్వంపై నమ్మకం ఉన్న వారంతా సైనిక బలగాలకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇది ఉగ్రవాదంపై పోరుకు ఎంతో అవసరం’ అని తెలిపారు. ‘యుద్ధాలను ప్రభుత్వాలు చేయవు, దేశం మొత్తం ఏకమై చేస్తుంది. కార్గిల్ విజయం ఇప్పటికీ దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తోంది’ అని అన్నారు. ‘కార్గిల్ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న సమయంలో అక్కడి యుద్ధ క్షేత్రానికి వెళ్లాను. ఆ పర్యటన ఒక తీర్థయాత్ర మాదిరిగా నాకు అనిపించింది’ అని ప్రధాని ఉద్వేగంతో చెప్పారు. ‘సైనిక బలగాల ఆధునీకరణ వేగంగా సాగుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వనరుల అభివృద్ధి జరుగుతోంది. అక్కడి ప్రజల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నాం’ అని ప్రధాని పేర్కొన్నారు. -
‘గుంటూరు చానల్’లోనూ కమీషన్ల కక్కుర్తి
సాక్షి, అమరావతి : గుంటూరు చానల్ ఆధునికీకరణ పనులు కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్కు దక్కవని నిర్ధారణకు వచ్చిన ముఖ్య నేత.. జలవనరుల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి టెక్నికల్ బిడ్ స్థాయిలోనే టెండర్ను ఈ నెల 7న రద్దు చేయించారు. తాజాగా అంచనా వ్యయాన్ని మరింతగా పెంచేయించి, ఎంపిక చేసిన కాంట్రాక్టర్కే పనులు దక్కేలా నిబంధనలను మార్చేసి టెండర్ నోటిఫికేషన్ ఇప్పించారు. ఫిబ్రవరి 4న టెక్నికల్ బిడ్, 8న ప్రైస్ బిడ్ తెరిచి టెండర్లు ఖరారు చేసి అనుకూల కాంట్రాక్టర్కు కట్టబెట్టనున్నారు. ఆ వెంటనే మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి కమీషన్గా రూ.100 కోట్లు వసూలు చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు చానల్కు నాలుగు టీఎంసీలు కేటాయించారు. బ్యారేజీ ఎగువన ప్రారంభమయ్యే ఈ కాలువ 47 కి.మీ.ల పొడవున తవ్వారు. గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, చేబ్రోలు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు మండలాల్లో 28,500 ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది. అలాగే గుంటూరు కార్పొరేషన్, మంగళగిరి మున్సిపాల్టీలకు మంచినీటితోపాటు కాలువ పరిసర 27 గ్రామాలకు తాగునీటి కోసం 32 చెరువులకు దీని ద్వారానే నీటిని సరఫరా చేస్తారు. 600 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో తవ్విన ఈ కాలువ పాడైపోయింది. దీంతో కాలువను విస్తరించి లైనింగ్ చేయడంతోపాటూ సుద్దపల్లి మేజర్, కోవెలమూడి మేజర్ డిస్ట్రిబ్యూటరీలను ఆధునికీకరించేందుకు కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ పంపిన ప్రతిపాదనలపై సర్కార్ 2015, మే 27న ఆమోదముద్ర వేసింది. ఆధునికీకరణ పనులకు రూ.378.25 కోట్లను మంజూరు చేస్తూ మే 27, 2015న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మూడున్నరేళ్ల తర్వాత టెండరా? ఐదేళ్లుగా గుంటూరు చానల్ కింద ఆయకట్టుకు సర్కార్ సక్రమంగా నీళ్లందించిన దాఖలాలు లేవు. ఏటా పంటలు ఎండిపోవడం వల్ల రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెల్లుబుకుతోంది. గుంటూరు చానల్ను ఆధునికీకరించడానికి నిధులు మంజూరు చేసిన మూడున్నరేళ్ల తర్వాత టెండర్ పిలవడానికి సర్కార్ సిద్ధమైంది. ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందిస్తామని రైతులను మభ్యపెట్టడం, ఎంపిక చేసిన కాంట్రాక్టర్కే పనులు అప్పగించి భారీ ఎత్తున కమీషన్ దండుకోవడమే లక్ష్యంగా ఆ పనులు చేపట్టింది. 750 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ విస్తరణ.. ఆధునికీకరణ పనులకు కి.మీ.కు గరిష్టంగా రూ.3 కోట్లకు మించి వ్యయం కాదని ఇంజనీరింగ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. 47 కి.మీ. కాలువ విస్తరణ, లైనింగ్ పనులకు రూ.141 కోట్లు ఖర్చవుతుంది. కాలువపై 172 సిమెంటు కట్టడాల (అండర్ టన్నెల్స్, సూపర్పాసేజ్లు, బ్రిడ్జిలు)ను తొలగించి.. కొత్తగా నిర్మించడానికి రూ.88 కోట్లు వ్యయమవుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఈ లెక్కన గుంటూరు చానల్ ఆధునికీకరణ పనులకు రూ.229 కోట్లకు మించి వ్యయం కాదు. కానీ అంచనా వ్యయాన్ని రూ.330 కోట్లకు పెంచేసి డిసెంబర్ 17న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 31న టెక్నికల్ బిడ్.. జనవరి 4న ప్రైస్ బిడ్ ఖరారు చేయాలని నిర్ణయించారు. ఆరుగురు కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు చేశారు. అయితే ఎంపిక చేసిన కాంట్రాక్టర్కు పనులు దక్కవనే నెపంతో సాంకేతిక బిడ్ తెరవకుండానే ముఖ్య నేత టెండర్ను రద్దు చేయించారు. కాంట్రాక్టర్కు అనుకూలంగా నిబంధనలు తాజాగా అంచనా వ్యయాన్ని రూ.332 కోట్లకు పెంచేసి.. 24 నెలల్లో పనులు పూర్తి చేయాలనే నిబంధన పెట్టి ఈ నెల 19న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో పదేళ్లలో కనీసం ఒక్క ఏడాదైనా 7.70 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి, 1,33,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేసి ఉండాలని నిబంధన పెడితే.. తాజాగా కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్కు అనుకూలంగా మట్టి పనుల పరిమాణాన్ని 3 లక్షల క్యూబిక్ మీటర్లకు, కాంక్రీట్ పనుల పరిమాణాన్ని 1.31 లక్షలకు తగ్గించారు. పదేళ్లలో ఒక్క ఏడాదైనా కనీసం రూ.83 కోట్ల విలువైన ఇదే రకమైన పనులు పూర్తి చేసి ఉండాలని మరో నిబంధన పెట్టారు. గత ఐదేళ్లలో సీడీఆర్ (కార్పొరేట్ డెట్ రీకన్స్ట్రక్షన్), బీఐఎఫ్ఆర్ (బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్), ఎస్డీఆర్ (స్టాటజిక్ డెట్ రీకన్స్ట్రక్షన్) విధానాలు అమలు చేయని కాంట్రాక్టర్లే అర్హులని నిబంధనలు విధించారు. షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో సిమెంటు లైనింగ్ చేసిన కాంట్రాక్టర్లే షెడ్యూలు దాఖలు చేయడానికి అర్హులని షరతు విధించారు. ఇతరులు ఎవరైనా టెండర్లు దాఖలు చేస్తే.. టెక్నికల్ బిడ్లో అనర్హత వేటు వేయించి, కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్కే పనులు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారంలో రూ.వంద కోట్లకుపైగా అక్రమాలు చోటుచేసుకున్నాయని అధికార వర్గాలు చెబుతుండటం గమనార్హం. -
మరికొద్ది సేపట్లో ప్లాట్ఫాం నం..
దేశంలో రైలు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా, సుఖవంతంగా మార్చే చర్యలు ఊపందుకున్నాయి. ఈ దిశలో చేపడుతున్న కార్యక్రమాలు ఒక్కటొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. గతంలోని ఇమేజీకి భిన్నంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని నవీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా అందివస్తున్న సాంకేతిక ఫలాల రూపంలో ప్రయాణికులు సౌకర్యాలు, ప్రయోజనాలు పొందేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రతి లోకో మోటివ్ ఇంజన్లో జీపీఎస్ పరికరాలు అమర్చడం మొదలు డేటా లాగర్స్ రైలు ప్రయాణ సమయ పర్యవేక్షణ, కృత్రిమ మేధ (ఆర్ఐ) ను ఉపయోగించి మెయింటెనెన్స్, అందుబాటులోని రైల్వే ఆస్తుల వినియోగం, పర్యవేక్షణ, సెన్సర్ ఆధారిత వ్యవస్థలతో కూడిన స్మార్ట్ కోచ్ల వినియోగం ఇలా అనేక అంశాల్లో నూతనత్వాన్ని సంతరించుకుంటోంది. ఇలాంటి నూతన ప్రణాళికల అమల్లో భాగంగా పలు ప్రా జెక్టులు చేపడుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అవేమిటంటే.. నిర్దేశిత సమయానికి రైళ్లు రాకపోకలు సాగించేలా గతంలో స్టేషన్ మాస్టార్లు రైళ్ల సమయాన్ని రికార్డు చేసే విధానానికి బదులుగా ఇంటర్ చేంజ్ పాయింట్లలోనే ఈ సమయం నమోదు చేసేందుకు డేటా లాగర్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా కంప్యూటర్లో రైళ్ల సమాచారం కనిపిస్తుంది. డేటా లాగర్స్ వల్ల గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 73–74 శాతం సమయపాలన పెరిగినట్లు రైల్వే మంత్రి చెబుతున్నారు. ప్రతి లోకోమోటివ్ ఇంజన్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) అమర్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ విధంగా మొబైల్ ఫోన్లో ప్రతి రైలు ఎక్కడుందో తెలుసుకునే వీలుంటుంది. దీంతో ఎప్పటికప్పుడు రైలు గమనం.. ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైల్వేల విద్యుదీకరణ వల్ల ఏటా 200 కోట్ల డాలర్ల మేర ఆదా చేయొచ్చని రైల్వే శాఖ అంచనా. డీజిల్ ఇంజన్లకు మరమ్మతులు చేస్తారు. విద్యుత్ ఇంజన్లలను ఉపయోగించడం వల్ల కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. సమర్థతను పెంచుకునేందుకు వీలుగా ‘స్మార్ట్ టైం టేబుళ్లు’ అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే కృషి జరుగుతోంది. ప్రస్తుత రైళ్ల వేగాన్ని గణనీయంగా పెంచే చర్యలతో పాటు లక్షన్నర వరకున్న బ్రిడ్జీల స్థితిగతులను పరిశీలించి, వాటిని మరింత మెరుగ్గా చేస్తారు. -
నిర్మాణాల్లో ‘పోలీస్’ వేగం
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖతోపాటు ఇతర ప్రభుత్వ విభాగాల భవన నిర్మాణాలను నిర్మిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ వెల్లడించారు. పదవీ బాధ్యతలు స్వీకరించి సోమవారానికి ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తోడ్పాటుతో పోలీసుశాఖకు కొత్త భవనాలు, క్వార్టర్లు, ఠాణాల ఆధునీకరణ చేపడుతున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 95 శాతం వృద్ధిరేటు సాధించామని, ఈ ఏడాది బడ్జెట్లో భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ. 464.46 కోట్లను పోలీసు హౌసింగ్ కార్పొరేషన్కు మంజూరు చేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ హౌసింగ్ కార్పొరేషన్పై ప్రభుత్వాలు దృష్టి సారించలేదని అన్నారు. పోలీసు భవనాలనే కాకుండా జైళ్ల, అగ్నిమాపకశాఖ, హార్టి్టకల్చర్ కాలేజీలు, ఇతర విభాగాల్లోని భవనాల నిర్మాణ బాధ్యతలనూ కార్పొరేషన్ చేపట్టడం గర్వకారణమన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో 13 జిల్లాల్లో పోలీస్ హెడ్క్వార్టర్లు(డీపీవో), పరేడ్ గ్రౌండ్స్, క్వార్టర్లు నిర్మిస్తున్నట్టు దామోదర్ తెలిపారు. సిద్దిపేటతోపాటు రామగుండం కమిషనరేట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 313 పోలీసు స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, 103 కొత్త ఠాణాలను నిర్మిస్తున్నామని, రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పోలీసు గెస్ట్హౌస్, వెల్ఫేర్ సెం టర్ నిర్మాణం జరుగుతోందన్నారు. సింగరేణి యాజమాన్యం సహాయంతో మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మిస్తున్నామని చెప్పారు. నిర్మాణాలు పారదర్శకంగా జరగడంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఐజీ బి. మల్లారెడ్డి కృషి ఎంతో ఉందని, సీఈ గోపాలకృష్ణ, ఎస్ఈ విజయ్కుమార్ తో పాటు మిగిలిన సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని దామోదర్ కొనియాడారు. సీఎం తోడ్పాటు మరువలేనిది: మల్లారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు హౌసింగ్ కార్పొరేషన్కు పెద్దగా గుర్తింపు లేదని, కానీ స్వరాష్ట్రం లో పక్కా నిర్మాణాలన్నింటినీ తామే చేపట్టడం గర్వంగా ఉందని కార్పొరేషన్ ఎండీ మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు. వరంగల్ కమిషనరేట్ నిర్మాణం వేగంగా సాగుతోందన్నారు. నిర్మల్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణ పనులను వేగంగా చేపడుతున్నట్లు చెప్పారు. గతేడాదిలో రూ. 220 కోట్ల పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి బిల్లు పంపించామని, ఇది మొత్తం పోలీస్ హౌసింగ్ చరిత్రలో రికార్డు అని మల్లారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తోడ్పాటు, కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ సూచనలతో హౌసింగ్ కార్పొరేషన్ మరిన్ని విజయాలు సాధించాలని మల్లారెడ్డి ఆకాం క్షించారు. అధికారులు, సిబ్బంది కృషి వల్లే నిర్మాణాలు, ఆధునీకరణ వేగవంతమవుతోందన్నారు. కాగా, పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో పోలీసుశాఖలో భవనాలు, హెడ్ క్వార్టర్ల నిర్మాణంలో క్రియాశీలపాత్ర పోషిస్తున్న దామోదర్తోపాటు అంకితభావంతో పనిచేస్తున్న ఐజీ, ఎండీ మల్లారెడ్డిని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. -
జిల్లా పోలీసింగ్ ఆధునీకరణకు 150 కోట్లు
సైబర్, ఫోరెన్సిక్ ల్యాబ్ల ఏర్పాటుకు కసరత్తు సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖ ఆధునీ కరణలో భాగంగా జిల్లా పోలీస్ కమిషనరేట్లలో టెక్నాలజీ పరిచయానికి ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. సీసీటీవీల ఏర్పాటుపై ఇప్పటికే కార్యాచరణ ప్రకటించిన పోలీస్ అధికారులు సైబర్ ల్యాబ్లు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ల ఏర్పాటుకు నిధులు కేటాయించినట్టు డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా రూ.150 కోట్లు కేటాయించగా, ప్రతీ జిల్లా/కమిషనరేట్కు రూ.3 కోట్ల చొప్పున విడుదల చేసినట్టు తెలిసింది. సైబర్ క్రైమ్ను నియంత్రించేందుకు ప్రతీ జిల్లా పోలీస్/కమిషనరేట్లో సైబర్ క్రైమ్ వింగ్, దానికి అనుసంధానంగా ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అక్కడి నుంచే జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ నియంత్రణపై శిక్షణ ఇవ్వనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. మరో 100 కోట్లకు ప్రతిపాదనలు.. హైదరాబాద్ కమిషనరేట్లో ఉపయోగి స్తున్న సెక్యూరిటీ యాప్స్ను జిల్లాల్లో కూడా ప్రవేశపెట్టేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టనున్నారు. సంచలనాత్మకంగా మారే కేసుల్లో కీలక ఆధారాల సేకరణకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కీలకం కావడంతో రీజియన్ల వారీగా ఏర్పాటుకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అదే విధంగా జిల్లాకో అత్యాధునిక సాంకేతికత కలిగిన మొబైల్ ఫోరెన్సిక్ వ్యవస్థ ఏర్పాటుకు ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు మొదటి దశలో భాగంగా రూ.150కోట్లు కేటాయించగా, మరో దఫాలో రూ.100కోట్లకు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. -
సమయం లేదు మిత్రమా !
పంట కాలువలకు నీటి సరఫరాను ఆపేసి సుమారు నెలరోజులు కావస్తోంది. జూన్ 1న మళ్లీ నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ కాలువల ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్వహణ పనులూ ముందుకు సాగడం లేదు. ఫలితంగా రానున్న రోజుల్లోనూ అన్నదాతలకు, ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. కాళ్ల: కాళ్ల మండలంలోని అన్నయ్యకోడు కాలువలో సుమారు 280 మీటర్ల మేర రూ.75 లక్షలతో రెండు చోట్ల రిటెయినింగ్వాల్ నిర్మాణ పనులు చేపట్టారు. సమయం ముంచుకొస్తున్నా.. ఈ పనులు కొలిక్కి రాలేదు. నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులను నాణ్యత లేకుండా నీటిలోనే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలువలకు నీరు వదిలితే ఈ పనులు సగంలో నిలిచిపోయే దుస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే పలు కాలువల్లో మట్టి మేట వేసింది. జువ్వలపాలెం నుంచి శివారు కలవపూడి వరకూ అన్నయ్యకోడులో కర్రనాచు మేట వేసి ఉంది. కర్రనాచువల్ల ప్రతి ఏటా శివారు గ్రామాలకు నీరు అందడం లేదు. గురువారమే ఈ పనులు చేపట్టారు. ఇవి కూడా గడువులోపు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. అలాగే కాళ్ల కె.లంక చానల్ శివారు నుంచి ఎర్త్వర్క్ పనులు ఇటీవలే చేశారు. నిబంధనల మేరకు ఈ పనులు జరగ లేదని, నీళ్లల్లోనే తవ్వకం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువలకు నీరు విడుదల కాకముందే పనులు పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు. అన్నయ్యకోడు అభివృద్ధి పనులు మొదలెట్టాం అన్నయ్యకోడు పంటకాలువ అభివృద్ధి పనులు గురువారం ప్రారంభించాం. కాలువలో పేరుకుపోయిన కర్రనాచు, మట్టి దిబ్బలను తొలగిస్తాం. దీని వల్ల శివారు గ్రామాలకు నీటి ఇబ్బంది లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నాం. – నంబూరి త్రినాథమూరి్తరాజు, కలవపూడి నీటి సంఘం అధ్యక్షుడు కంటి‘తూడు’పు చర్యలే నిడదవోలు : జిల్లాలో కాలువలు కట్టిన తరువాత యుద్ధ ప్రాదిపదికన చేపట్టాలి్సన ఓ అండ్ ఎం (ఇరిగేషన్ ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ )తూడు పనులకు ఆలస్యంగా ఆమోదం లభించింది. జిల్లాలో 2017–18 సంవత్సరానికి పశ్చిమ డెల్టాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో 202 పనులకు రూ.5.06 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆరు రోజుల వ్యవధిలో కాలువలకు నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ పనులు చేపడతారా, లేదా అనే సందిగ్ధం నెలకొంది. కాలువలకు నీరు విడుదల చేయక ముందే వాటిల్లో పేరుకుపోయిన కర్రనాచు, గుర్రపుడెక్క తొలగించేందుకు రసాయనాలు పిచికారీ చేయాలి. అయితే ఆలస్యంగా నిధులు మంజూరు కావడంతో పనులను తూతూ మంత్రంగా చేపడతారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవి కేవలం కంటితుడుపు చర్యలేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం శిథిలావస్ధలకు చేరుకున్న స్లూయిస్ల మరమ్మతులSనైనా పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏటా ఇదే తంతు ఏటా తూడు పనుల మంజూరులో ఆలస్యం జరుగుతూనే ఉంది. కాలువలు మూసివేసిన తరువాత ఏటా పశ్చిమడెల్టా ప్రధాన కాలువతోపాటు తాడేపల్లిగూడెం, ఉండి, తణుకు, నరసాపురం సబ్ డివిజన్ల పరిధిలోని ఉప కాలువలు, పిల్ల కాలువల్లో పేరుకుపోయిన తూడు, డెక్క తొలగింపు, స్లూయిస్ల నిర్వహణ, షట్టర్ల మరమ్మతులు, గ్రీజు, ఆయిల్ పంపింగ్, స్లూయిస్ల అడుగు భాగంలో పేరుకుపోయిన నాచు తొలగింపు పనుల చేపట్టా ల్సి ఉంది. ఏటా వీటి కి నిధుల మంజూరులో ఆలస్యం జరగడంతో పనులు పూర్తికావడం లేదు. తూడు పనులు.. నీటి సంఘాలకే... ఈ పనులన్నింటినీ కొన్నేళ్లుగా నామినేషన్ పద్ధతిపై నీటి సంఘాలకే కట్టబెడుతున్నారు. అంతక్రితం అన్ని పనులనూ టెండర్లు వేసి చేపట్టేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత టెండర్ల ప్రక్రియకు స్వస్తి పలికారు. పనులను టీడీపీ వర్గీయులైన నీటి సంఘాల ప్రతినిధులకు అప్పగిస్తున్నారు. ఫలితంగా ఇవి నాణ్యంగా ఉంటాయో లేదోనన్న అనుమానం నెలకొంది. యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి భీమవరం టౌన్ : డెల్టా ఆధునికీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. స్థానిక ఏఎస్సార్ సాంస్కృతిక కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.గోపాలకృష్ణంరాజు మాట్లాడారు. నీటిని విడుదల చేసేలోపే పనులను పూర్తి చేసేందుకు చొరవ చూపాలని కోరారు. నందమూరు అక్విడెక్టు పాతనిర్మాణాన్ని తొలగించొద్దని విజ్ఞప్తి చేశారు. కొత్త అక్విడెక్టు నిర్మాణం వల్ల నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దాని పరీవాహక ప్రాంతంలో గట్లు మరింత పటిష్టం చేయాల్సి ఉందన్నారు. గట్లు పటిష్టం చేసిన తరువాతే పాత అక్విడెక్టు నిర్మాణాన్ని తొలగించాలని కోరారు. సమావేశంలో సమితి నాయకులు మేళం దుర్గా ప్రసాద్, పాతపాటి మురళీరామరాజు, మెంటే సోమేశ్వరరావు, నల్లం నాగేశ్వరరావు, సీతారామరాజు, లక్ష్మీపతిరాజు పాల్గొన్నారు. -
నీలినీడలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :డెల్టా ఆధునికీకరణ పనులు ఈ ఏడాది కూడా జరిగే అవకాశం కనబడటం లేదు. ఈ జిల్లా రుణం తీర్చుకోలేనిదంటూ ఇక్కడ పర్యటించినప్పుడల్లా ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగునీటి సమస్యలపై మాట్లాడిన పాపాన పోలేదు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి, జానంపేట అక్విడెక్ట్ వద్దకు తరచూ రావడం, మీడియాతో మాట్లాడి వెళ్లడం తప్ప జిల్లాలోని సాగునీటి ఇబ్బందులపై ఏనాడూ సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఈ ఏడాది ఆధునికీకరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఇంకా అమోదానికి నోచుకోలేదు. దీంతో ఈ పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రూ.136 కోట్లతో 167 పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొం దించిన జల వనరుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. వీటికి జనవరి నెలలోనే అమోదం లభించి, టెండర్లు పూర్తవ్వాల్సి ఉంది. అలా జరిగి తేనే కాలువలు మూసివేసిన వెంటనే పనులు ప్రారంభించే అవకాశం ఉండేది. ఈ నెలాఖరు నాటికి కాలు వలు మూసివేసేందుకు యంత్రాంగం నిర్ణయించగా, ఆధునికీకరణ పనుల ప్రతిపాదనలకు ఆమోదం రాలేదు. ఫలితంగా టెండర్లు పిలిచే అవకా శం లేకుం డాపోయింది. ఇప్పటికప్పుడు ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. టెండర్లు ఖరారయ్యేందుకు నెల రోజులు పడుతుంది. ఒకవేళ రానున్న రోజుల్లో ఆమోదం లభించినా ఆదరాబాదరాగా పనులు చేపట్టి తూతూమంత్రంగా ముగించే ప్రమాదం ఉంది. గత ఏడాది రూ.72 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలవగా.. అప్పట్లో పనులు చేపట్టలేదు. ఈ ఏడాది ఆ పనులతో సరిపెట్టే అవకాశం కనపడుతోంది. రూ.1,300 కోట్లతో డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకూ రూ.700 కోట్ల విలువైన పనులు కూడా పూర్తికాలేదు. 2012లో దీర్ఘవిరామం (లాంగ్ క్లోజర్) సమయంలో మాత్రమే ఓ మాదిరిగా పనులు జరిగాయి. తర్వాత ఏటా మొక్కుబడి పనులతో సరిపెడుతూ వస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకూ రూ.112 కోట్ల విలువైన పనులు మాత్రమే చేశారు. పంట కాలువలు పూడుకుపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా పొలాలు ముంపునకు గురవుతున్నాయి. సాధారణ రోజుల్లో మాత్రం పంట కాలువల్లో నీరు పారక వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. 2015లో డిసెంబర్లో కురిసిన చిన్నపాటి వర్షాలకు 1.32 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. 2016లోనూ వర్షాలకు నారుమడులన్నీ నీట మునిగి రైతులు ఇబ్బందులు పడ్డారు. కాలువల ఆధునికీకరణ జరగకపోవడం వల్ల ఖరీఫ్తోపాటు రబీలోనూ నీటి సమస్యతో రైతులు కష్టాలు పడుతున్నారు. గడచిన రెండేళ్లలో అయిల్ ఇంజిన్లు, నీటి మోటార్లు ఉపయోగించకుండా రైతులు పంట పండించలేని పరిస్థితి ఏర్పడింది. -
నాలాల సర్వేకు మోకాలడ్డు!
సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో వాననీటి కష్టాలకు కారణమైన నాలాలను ఆధునీకరించడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. ఈ మేరకు ముందుగా చేపట్టిన నాలాల సర్వే పనులకు ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, తదితర ప్రజాప్రతినిధులు మోకాలడ్డుతున్నారని తెలుస్తోంది. ఆధునీకరణలో భాగంగా కోల్పోయే వ్యక్తిగత ఆస్తుల కొలతలు తీసుకునేందుకు వారు అడ్డుపడుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో ఈపనులు ముందుకు సాగడం లేదు. ఇలా.. విస్తరణలో భాగంగా కోల్పోనున్న 238 ఆస్తుల(భవనాల) కొలతల్ని అధికారులు ఇప్పటికీ తీసుకోలేకపోయారు. ప్రజా ప్రతినిధులు అడ్డుకోవడంతో ఆస్తుల విస్తీర్ణం లెక్కించలేకపోయిన ప్రాంతాలు. -
రూ. 263 కోట్లతో విజయ డెయిరీ ఆధునీకరణ
మంత్రులు ఈటల, తలసాని వెల్లడి సాక్షి, హైదరాబాద్: విజయ డెరుురీని రూ.263 కోట్లతో ఆధునీకరించనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సచివాలయంలో మంగళ వారం పశుసంవర్థక అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు ఈటల, తలసాని మాట్లాడుతూ... ప్రైవేటు డెరుురీ ల కన్నా విజయ డెరుురీ ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు నూతన పాల శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఉన్న కేంద్రాల సామర్థ్యం పెంచుతామన్నారు. ఉత్పత్తుల విక్రయాలు పెంచేందుకు పలు చోట్ల ఔట్లెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో పెరుగు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సంచార వైద్యశాలల ఏర్పాటుకు చర్యలు రైతుల ఇంటి వద్దకే వెళ్లి పశు వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన సంచార పశు వైద్య శాలల సేవలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 40 కోట్ల చేప పిల్లలను ఉచితంగా రిజర్వాయర్లు, చెరువుల్లో విడుదల చేశామన్నారు. ఈ నెలాఖరుకు చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. చేపల విక్రయానికి అవసరమైన స్థలాలను సేకరిస్తే మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. సభ్యత్వం కలిగిన ప్రతీ మత్స్యకారుడు, గొర్రెల పెంపకం దారుడికి రూ. 5 లక్షల బీమా కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో గొర్రెలు, మేకల పెంపకం దారుల ఫెడరేషన్ చైర్మన్ రాజయ్య యాదవ్, పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా, టీఎస్ఎల్డీఏ చైర్మన్ రాజేశ్వర్రావు, విజయ డెరుురీ ఎండీ నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
కేసీ ఆధునీకరణకు రూ.35 కోట్లు మంజూరు
కర్నూలు (టౌన్): కేసీ కెనాల్ ఆధునీకరణ పనులకు ప్రభుత్వం రూ.35 కోట్లు నిధులను మంజూరు చేసింది. మంగళవారం ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్కుమార్ పరిపాలనా అనుమతులకు సంబంధించి జీఓ 710 జారీ చేశారు. రూ.35 కోట్లు వెచ్చించి కేసీ కెనాల్ ఆధునీకరణ ప్రాజెక్టు కింద సీసీ లైనింగ్ పనులు చేపడతారు. కిలోమీటర్ 130.100 నుంచి కి .మీ.149.670 వరకు కేసీ కెనాల్ సీసీ లైన్ పనులతో పాటు మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిధులకు సంబంధించి కర్నూలు చీఫ్ ఇంజనీరు (ప్రాజెక్టు) తదుపరి చర్యలు చేపట్టాలని ఆ జీఓలో ఆదేశాలు జారీ చేశారు. -
నంద్యాలను నందనవనం చేస్తాం
– జిల్లా కలెక్టర్ విజయమోహన్ – పట్టణంలో విస్తృతంగా పర్యటన నంద్యాల: పట్టణాన్ని నందనవనం చేస్తామని జిల్లా కలెక్టర్ విజయమోహన్ చెప్పారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, ప్రజలు సహకరించాలని కోరారు. రోడ్లపై ఆటోలు, బైక్లు ఉన్నాయని, దీని వల్ల ట్రాఫిక్ స్తంభిస్తోందన్నారు. ఆర్టీఓ, ఆర్డీఓ, కమిషనర్, పోలీస్ అధికారులు తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై తోపుడు బండ్లను తొలగించి, వారికి ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని చూపించాలన్నారు. టీపీఓపై ఆగ్రహం... పట్టణంలో రోడ్లు ఆక్రమించి తోపుడుబండ్లు, బంకులు కళ్లెదుటే కనపడుతున్న టౌన్ప్లానింగ్ అధికారి సామాన్యుడిలా పట్టించుకోకుండా ఉన్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలను తొలగించాలనే బాధ్యతను విస్మరించారని, ఇప్పుడైనా బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే చర్యలు తప్పవన్నారు. ప్రణాళిక బద్ధంగా రోడ్ల విస్తరణ... పట్టణంలో రోడ్ల విస్తరణను ప్రణాళిక బద్ధంగా నిర్వహిస్తామని, కలెక్టర్ విజయమోహన్ చెప్పారు. వెంటనే సర్వే చేయించి నివేదికను పంపాలని, అవసరమైతే మండల స్థాయిలో ఉన్న సర్వేయర్ల సహాయాన్ని తీసుకోవాలన్నారు. టూరిజం శాఖ అధికారులు సరైన నివేదికలతో రాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగమేశ్వరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తిగా ఉన్నారని, కాని పర్యాటక శాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారని అన్నారు. కలెక్టర్ విస్తృత పర్యటన... జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్ ఉదయం ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నుండి బయల్దేరి పెద్దకొట్టాల చేరుకొని బైపాస్ రోడ్డు నిర్మాణం ప్లాన్ను పరిశీలించారు. తర్వాత చిన్న చెరువు కట్టను ఆధునీకరించే ప్రతిపాదనను పరిశీలించి, గాంధీచౌక్ సందర్శించి ఇరుకైన రోడ్లను చూశారు. అక్కడి నుంచి ఎస్బీఐ కాలనీ, శ్యాంనగర్ ప్రాంతాలను సందర్శించి శ్యామకాల్వపై ఉన్న వంతెనలను పరిశీలించారు. పర్యటనలో వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్కుమార్, ఆర్డీఓ సుధాకర్రెడ్డి, కమిషనర్ విజయభాస్కరనాయుడు, తహసీల్దార్ శివరామిరెడ్డి, హౌసింగ్ ఈఈ సుధాకర్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ సుబ్బారెడ్డి, కౌన్సిలర్లు శివశంకర్, కొండారెడ్డి, కృపాకర్, ముర్తుజా, దిలీప్కుమార్లు పాల్గొన్నారు. -
'సాగర్ ఆధునీకరణ పనులకు 8 ఏళ్లా?!'
హైదరాబాద్: నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆధునీకరణ పనులు 8 ఏళ్లుగా కొనసాగుతుండటంపై నీటి పారుదల శాఖా మంత్రి హరీష్రావు విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సూచించారు. శుక్రవారం ఆ శాఖ అధికారులు ఆయనకు నివేదిక సమర్పించారు. సాగర్ ఎడమ కాల్వ ఆధునీకరణలో భాగంగా ఏ ప్యాకేజీల పనులు ఏ మేరకు పూర్తయ్యాయో వివరించారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి కాగా మిగతా వాటిని వేగంగా చేస్తున్నట్లు చెప్పారు. ఎడమ కాల్వ అభివృధ్ధి కోసం ప్రపంచబ్యాంకు నిధులతో మొత్తం రూ.1,611 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పనులు పూర్తయితే ఎడమ కాల్వ కింద 1.50లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. -
మాచ్ఖండ్కు వెలుగులు
6 దశాబ్దాల తర్వాత ఆధునికీకరణకు ఆమోదం పెరగనున్న విద్యుత్ ఉత్పత్తి సీలేరు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని మాచ్ఖండ్ ప్రాజెక్టు వెలుగులీననుంది. ప్రాజెక్టును ఆధునీకరణ చేపట్టేందుకు ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా సిద్ధం అవుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటిసారిగా సహజ నీటి వనరుల ఆధారంగా రెండు రాష్ట్రాల ఖర్చుతో మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాకులు దూరని కారడవిలో విదేశీ పరిజ్ఞానంతో దీనిని నెలకొల్పారు. మొదటి రాష్ట్రపతి బాబూరాజంద్రప్రసాద్ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభం అయింది. అయితే కొన్నాళ్లు తర్వాత ఈ ప్రాజెక్టును ఇరు రాష్ట్రాలు పట్టించుకోకపోవడంతో విద్యుత్ ఉత్పత్తికి చీకట్లు అలముకున్నాయి. తరచూ కేంద్రం మరమ్మతులకు గురువుతూ వచ్చింది. అయినా పెద్దగా దృష్టి పెట్టింది లేదు. అయితే ఇప్పుడు ఆధునికీకరణకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. మరో 30 ఏళ్లు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. దశల వారీగా పనులు మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లు ఉన్నాయి. ఒకటి, రెండు, మూడు 15 మెగావాట్లు, మిగిలినవి 27 మెగావాట్లు చొప్పున ఉత్పత్తి చేస్తాయి. ఈ యూనిట్ల వయోపరిమితి 40 ఏళ్లు కాగా.. 20 ఏళ్లు పైబడి వినియోగించారు. దీంతో ఉత్పత్తి తగ్గుతూ వస్తోంది. రెండు రాష్ట్రాల అంగీకారంతో ఈ యూనిట్లకు కొత్త పరికరాలు అమర్చనున్నారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి పెరగనుంది. ప్రస్తుతం ఇక్కడ 120 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఆధునికీకరణ చేపడితే ఒక్కో యూనిట్కు 3 నుంచి 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుందని జెన్కో ఇంజనీర్లు చెబుతున్నారు. పెరిగే విద్యుత్ ఉత్పత్తిని ఒడిశాకు పంపించినా మన వాటా విద్యుత్ను పెందుర్తి ఫీడర్కు సరఫరా అవుతుందని అంటున్నారు. విద్యుత్ కొరత తీరుతుంది ఆధునికీకరణకు నోచుకోక తరచూ ఇబ్బందులు పడుతున్నాం. విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగిన మాచ్ఖండ్కు ఆధునికీకరణ అనుమతులు సిద్ధం అవడం ఆనందంగా ఉంది. ఇదే జరిగితే 15 మెగావాట్లకు పైబడి ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో విద్యుత్ కొరత తీరుతుంది. – ఎన్.మురళీమోహన్, సీలేరు ఎస్ఈ -
నల్లవాగు వృథా నీటిని మళ్లిస్తాం
రూ. 18 కోట్లతో కాలువల ఆధునీకరణకు ప్రతిపాదనలు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి.. ఆయకట్టుకు నీటి విడుదల కల్హేర్: జిల్లాలోని మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు నల్లవాగు వృథా నీటిని చెరువులకు మళ్లిస్తామని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. కాలువల ఆధునీకరణ కోసం రూ. 18 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. సోమవారం నల్లవాగు ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో తెప్పోత్సవం నిర్వహించారు. గంగమ్మ, కట్ట మైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నల్లవాగు వృథా నీటిని మళ్లింపు పనుల కోసం రూ. 200 కోట్లతో ప్రతిపాదనలు రుపొంచినట్లు తెలిపారు. త్వరలో నిధులు మంజూరయ్య ేఅవకాశం ఉందన్నారు. వృథా నీటి మళ్లింపుతో మండలంలోని మీర్ఖాన్పేట, బాచేపల్లి, రాపర్తి, తదితర గ్రామాల రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అదనంగా 3 చెక్డ్యాంలు నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వం రైతుల బాగు కోసం మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మించాలని చూస్తుంటే కాంగ్రెస్, టీడీపీ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మల్లన్నసాగర్ నిర్మాణం ఆగదన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయకట్టు రైతులకు సూచించారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఈఈ రాములు, డీఈఈ జలంధర్, కంగ్టి ఎంపీపీ రామరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేశం, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గుండు నరేందర్, టీఆర్ఎస్ కల్హేర్, మనూర్ మండలాల అధ్యక్షులు కృష్ణమూర్తి, పండరి యాదవ్, నాయకులు రాంసింగ్, గుండు మోహన్, బాసిత్, రాఘవరెడ్డి, సాయగౌడ్, మహిపాల్రెడ్డి, గుండు విటల్, సర్పంచ్లు మనష్ పాటిల్, రాములు, ఎంపీటీసీలు సంజీవరావు, రాజుకుమార్, ప్రకాశ్, నారాయణఖేడ్ ఉపసర్పంచ్ నజీబ్ పాల్గొన్నారు. -
ఆస్పత్రుల ఆధునికీకరణకు సర్వే
జిల్లాలో 89 ఆస్పత్రుల భవనాలపై డాక్యుమెంటరీ ఎంకే సీనియర్ ఇంజనీర్ విద్యాసాగర్ ఏటూరునాగారం : జిల్లాలోని 89 ఆస్పత్రులను ఆధునికీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎంకే ప్రైవేట్ సంస్థ బృందం ఇంజనీర్లు సర్వే చేపట్టారు. గురువా రం మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రి భవనం, పరిసరాలను పరిశీలించారు. భవ నం పరిస్థితి ఎలా ఉందని, శిథిలావస్థకు చేరిం దా లేక దీనిని ఆధునీకరణ చేస్తే పనిచేస్తోం దని అనే కోణంలో సర్వే చేసినట్లు ఎంకే సీని యర్ ఇంజనీర్ విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంకే టీం సభ్యులు జిల్లాలోని 89 ఆస్పత్రులను పరిశీలిస్తున్నామ న్నారు. ఇందులో ఎంజీఎం, సీకేఎం, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రి, పీహెచ్సీలు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఆస్పత్రి భవనాల అభివృద్ధి, సిబ్బంది క్వార్టర్స్, పరి సర ప్రాంతాల్లో చేపట్టే పనులపై అధ్యయనం చేసి డాక్యుమెంటరీని రూపొందిస్తున్నామన్నారు. ఈ డాక్యుమెంటరీ ఎస్ఈ దేవేందర్కుమార్ సమర్పిస్తామని వెల్లడించారు. ఆయ న ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. అలాగే మరో బృందం వైద్యులు ఖాళీలు, సామగ్రి, ఆపరేషన్ పరికరాలు, ఇతర మౌళిక వసతులను కూడా సర్వే చేసేందుకు వస్తోందని చెప్పారు. ఇలా రెండు బృందాలు చేపట్టిన ఆధారాలతో ఆస్పత్రుల రూపురేఖలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చనుందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని శిథి లావస్థ భవనాలు తొలగించి నూతన భవనాలు నిర్మించే ఆలోచన చేస్తోందని వెల్లడిం చారు. ఈ రెండు అంశాలపై సమగ్ర సర్వే చేసేందుకు వచ్చినట్లు ఎంకే సంస్థ సీనియర్ ఇంజనీర్ విద్యాసాగర్ తెలిపారు. ఎంకే ప్రిన్సిపల్ కన్సల్టెంట్ ఎస్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నామని చెప్పారు. -
21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ
♦ ఏపీలోని మార్గాల్లో ♦ రూ.22వేల కోట్ల పనులు ♦ రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెల్లడి సాక్షి, విజయవాడ/తిరుమల: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 21 రైల్వేస్టేషన్లను విమానాశ్రయాల తరహాలో ఆధునికీకరిస్తామని రైల్వేమంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. రాష్ట్రం నుంచి వెళ్లే రైలు మార్గాల్లో రూ.22వేల కోట్లతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం విలేకర్ల సమావేశంలో సురేష్ ప్రభు మాట్లాడుతూ కలకత్తా-చెన్నై, అమరావతి-బెంగళూరు మధ్య హైస్పీడ్ రైలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎయిర్ పోర్టులు, పోర్టులను రైల్వే లైన్లకు అనుసంధానం చేసే విషయంపై చర్చించామన్నారు. ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్యాలెస్ ఆన్ వీల్స్ తరహాలో రైలును ప్రారంభించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీని సరుకు రవాణా హబ్గా, ఎగుమతులు దిగుమతులు కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రత్యేక జోన్ను అవకాశం ఉన్నంత వరకు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు మాట్లాడుతూ రైల్వేమంత్రితో సమావేశంలో రైల్వేలైన్లు, కొత్తరైళ్లు, సరుకు రవాణాకు ఏర్పాట్ల అంశాలపై చర్చించామని తెలిపారు. విభజన చట్టంలోనే ఉన్నందున రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరామని చెప్పారు. అంతకుముందు ఉదయం తిరుమల వెళ్లిన రైల్వే మంత్రి శ్రీవేంకటేశ్వర స్వామివారిని ద ర్శించుకుని మొక్కులు చెల్లించారు. -
అయ్యో.. అన్నమయ్య
♦ డ్యాం ఆధునికీకరణలో జాప్యం ♦ పర్యాటకపరంగా నోచుకోని అభివృద్ధి ♦ నరకప్రాయంగా ప్రాజెక్టు రోడ్డు ♦ డ్యాం నిర్వహణపై కలెక్టరు అసంతృప్తి రాజంపేట: చెయ్యేరు నదిపై నిర్మితమైన అన్నమయ్య జలాశయం ఆధునికీకరణలో జాప్యం కొనసాగుతోంది. బడ్జెట్లో కూడా అరకొరగా నిధులు కేటాయించడంతో అభివృద్ధికి నోచుకోని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు నిధులు పుష్కలంగా ఉన్నాయని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ వెళ్లడించడంతో ఇక ఆధునికీకరణ పనులు చేపట్టడానికి కారణాలు ఏమిటో అంతుబట్టడం లేదు. గేట్లకు రబ్బరు సీలు, గ్రీసు, పెయింటింగ్ లేక జలాశయం బోసిపోయింది. పర్యాటకపరంగా అభివృద్ధికి నోచుకోలేదు. 2.33948 టీఎంసీ స్టోరేజీ కెపాసిటీతో నిర్మితమైన జలాశయ నిర్మాణానికి తొలుత అంటే 1996-97లో రూ.68.92కోట్ల వ్యయంతో ప్రారంభించారు. అప్పటి నుంచి దశలవారీగా నిర్మాణం పూర్తి చేసుకుంది. 2001-2002లో రూ.57.347కోట్లు వ్యయం చేశారు. 2003లో వరదలకు గేట్లు డ్యామేజీ కావడంతో రూ.1.20కోట్లు 2004 జూన్ నాటికి పూర్తి చేశారు. 2003-2004 లో రూ3.కోట్లు కేటాయించారు. ఆది నుంచి అన్నమయ్య డ్యాం అరకొర నిధులతోనే ముందుకు సాగుతూ వచ్చింది. ప్రతిపాదన దశలో.. జలాశయం అభివృద్ధి చేయడానికి నిధులు కోసం ఎదురు చూపులతో కాలయాపన జరుగుతోంది. ఉన్న అరకొర నిధులకు సంబంధించి ప్రతిపాదన దశలో ఉందని సమాచారం. అంధకారంలో ఉన్న జలాశయానికి సోలార్ వెలుగులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వానికి రూ.25లక్షలతో ఎస్టిమేట్స్ వెళ్లాయి. అలాగే పెయింటింగ్ కోసం రూ.1.60కోటి నిధుల విడుదలకు సంబంధించి ఎస్టిమేట్స్ ప్రభుత్వానికి పంపారు. పవర్లైను రిపేరు కోసం రూ.1.4లక్షలు, జనరేటర్కు రూ. 1.63లక్షలు, క్రైన్మెయింటెనెన్స్కు రూ.136లక్షలు, ఎర్త్ డ్యాం గ్యాలరీ కోసం రూ.2.1లక్షలు, స్పిల్వేకు రూ.2.8లక్షలు, రబ్బర్సీలింగ్ (గేట్ల) రూ.9.9లక్షలు, స్పాట్లాగ్ ఎలిమెంట్స్ రూ.9.9లక్షలు, ఆయిల్, గేట్ మెయింటెన్స్ కోసం రూ.8.42లక్షల కోసం ప్రతిపాదనలు పంపారు. టెండర్లను కూడా త్వరలో పిలవనున్నారు. సీఈ పరిధిలో జలాశయం మెయింటెన్స్కు ఈ పనులు చేట్టనున్నారు. పర్యాటకపరంగా నోచుకోని అభివృద్ధి.. గత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరెడ్డి పాలనలో అన్నమయ్య డ్యాంను పర్యాటక పరంగా అభివృద్ది చేయాలని ప్రతిపాదనలు చేశారు. ఆ ప్రతిపాదనలను తర్వాత వచ్చిన పాలకులు ఆటకెక్కించారు. అలాగే పర్యాటకులు ఉండటానికి అతిథి గృహం కూడా శిధిలావస్థకు చేరుకుంది. పర్యాటకులు పోవడానికి వీలులేని విధంగా డ్యాం రోడ్డు కొనసాగుతోంది. కొన్నాళ్లుగా రోడ్డులో వెళ్లాలంటే వాహనదారులకు నరక ప్రాయం చూపిస్తోంది. ఈ డ్యాంను జిల్లా కలెక్టరు సందర్శించి డ్యాం నిర్వహణపై పెదవి విరిచారు. నిధులు ఉన్నా డ్యాం ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఏ అధికారి వచ్చినా డ్యాం గురించి నిర్వహణ లోపాలను ఎత్తిచూపడమే తప్ప మరొకటి ఉండదనే భావన పర్యాటకుల్లో నెలకొంది. -
ఆబ్కారీ చెక్పోస్టుల ఆధునీకరణ
మరింత పకడ్బందీగా తనిఖీలు సరిహద్దు రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా మద్యం రవాణా సాక్షి, హైదరాబాద్: నాటుసారా అక్రమ రవాణాను నియంత్రించడంలో భాగంగా చెక్పోస్టులను ఆధునికీకరించాలని ఆబ్కా రీ శాఖ నిర్ణయించింది. గోవా, మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలకు అక్రమంగా సారా తరలివస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ సూచనల మేరకు చెక్పోస్టు వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఆబ్కారీ డిప్యూటీ కమిషనర్లకు కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్ ఆదేశాలు జారీ చేశారు. ఆధునికీకరణకు అవసరమయ్యే నిధులు, ఇతర మౌలిక వసతుల కోసం సమగ్ర ప్రతిపాదనలు పంపాలని పేర్కొన్నారు. 4 ఇంటిగ్రేటెడ్ సహా 24 చెక్పోస్టులు రాష్ట్రానికి అక్రమంగా ఎన్డీపీఎల్ దిగుమతికి ఆస్కారమున్న ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో ప్రధాన రహదారుల వద్ద చెక్పోస్టులున్నాయి. అయితే చెట్టు నీడ, దాబా, వాణిజ్యపన్నుల శాఖ చెక్పోస్టులే ఆబ్కారీ సిబ్బందికి ఆవాసాలు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం దిగుమతిని ఈ చెక్పోస్టులు అడ్డుకోలేకపోతున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ మినహా 8 జిల్లాలను గుడుంబా రహిత జిల్లాలుగా ప్రకటించినా, సింగరేణి కోల్బెల్ట్ ఏరియా, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్లలో గుట్టుచప్పుడు కాకుండా గుడుంబా ప్రవహిస్తోందని ఎన్ఫోర్స్మెంట్ విభాగం గుర్తించింది. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 24 అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని ఆబ్కారీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిల్లో నాలుగు ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులను నిర్మించాలని అకున్ సబర్వాల్ సూచించారు. ఈ మేరకు బుధవారం కమిషనర్ చంద్రవదన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, యుద్ధప్రాతిపదికన చర్యలకు ఆదేశించారు. జిల్లాల నుంచి వచ్చిన డిమాండ్కు అనుగుణంగా వారంలోగా సర్కార్కు చెక్పోస్టుల ఆధునికీకరణ ఫైలును పంపించనున్నారు. నిధులు సమకూర్చేందుకు సర్కార్ ఆసక్తి చూపని పక్షంలో టీఎస్బీసీఎల్ నిధుల్లోంచి సుమారు రూ.100 కోట్ల వరకు వెచ్చించాలని నిర్ణయించారు. సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులు, కెమెరాలు, కంప్యూటర్లు, గోడౌన్లను సమకూర్చే అవకాశముంది. -
రూ.700 కోట్లతో కాల్వలకు సొబగులు
గలగలపారే కృష్ణమ్మ. భూమికి పచ్చని రంగేసినట్లు గ్రీనరీ, సేదతీరేందుకు పార్కులు, నగరం నడిబొడ్డునే హుషారు నింపే బోటింగ్.. ఇవన్నీ ఊహించుకుంటేనే భలే థ్రిల్లింగ్గా ఉంది కదూ. వీటన్నింటినీ నగర ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు నగరపాలక సంస్థ కసరత్తు చేస్తోంది. కాలుష్య కాసారాలుగా మారిన కాల్వల్ని ఆధునికీకరించాలని నిర్ణయించింది. ఇందుకు సుమారు రూ.700 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. విదేశీ కన్సల్టెంట్లకు డిజైన్ల బాధ్యతను అప్పగించనుంది. విజయవాడ సెంట్రల్ : కాల్వల్లో కాలుష్య భూతానికి చెక్పెట్టేందుకు నగరపాలక సంస్థ కసరత్తు మొదలుపెట్టింది. దీనికి ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, సీఆర్డీఏ, పంచాయతీరాజ్ అధికారుల సహకారం కోరింది. ఈ మేరకు రెండు రోజుల కిందట కమిషనర్ ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు కాల్వల్ని ఆధునికీకరణ చేయాలని నిర్ణయించారు. నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ ఇరిగేషన్ అధికారులను దీనిపై నివేదిక కోరారు. అది అందిన వెంటనే జపాన్ లేదా సింగపూర్ కన్సల్టెంట్లకు డిజైన్ బాధ్యతలను అప్పగించాలనే యోచనలో కమిషనర్ ఉన్నట్లు తెలుస్తోంది. కాల్వల్ని ఆధునికీకరించి, అత్యాధునిక వసతులు సమకూర్చేందుకు సుమారు రూ.700 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రాజధాని నిర్మాణం నేపథ్యంలో కాల్వల ఆధునికీకరణ అనివార్యమైంది. పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఏడాదిన్నర క్రితమే కాల్వల్ని అందంగా తీర్చిదిద్దాలని నగరపాలక సంస్థ అధికారులు భావించారు. నిధులలేమి కారణంగా ఆ అంశాన్ని పక్కన పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాల్వల సుందరీకరణకు సంబంధించి నివేదిక కోరారు. సీఆర్డీఏ నుంచి నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. స్మార్ట్ రెవెన్యూ రాజధాని విజయవాడకు కొత్త అందాలు అద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా పర్యటకుల్ని ఆకర్షించాలనే యోచనలో ఉంది. కాల్వల్ని ఆధునికీకరించడంతో పాటు సుందరంగా తీర్చిదిద్దినట్లయితే దండిగా ఆదాయం సమకూర్చుకోవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు విదేశీ కన్సల్టెంట్లను రంగంలోకి దించుతున్నారు. బందరు, ఏలూరు, రైవస్ కాల్వలతోపాటు బుడమేరును ఆధునికీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాల్వల పరీవాహక ప్రాంతాలను సుందరీకరిస్తారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో పార్కులు, ఫుడ్కోర్టులు, బోటింగ్ను ఏర్పాటుచేయనున్నారు. వీటితోపాటు వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం రావచ్చని భావిస్తున్నారు. ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి రాబట్టుకునేందుకు టెండర్ల ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే వ్యూహాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. -
రాష్ట్రవ్యాప్తంగా పోలీసుస్టేషన్ల ఆధునీకరణ
అబిడ్స్ స్టేషన్ను ప్రారంభించిన డీజీపీ అనురాగ్శర్మ హైదరాబాద్: ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్స్టేషన్లను ఆధునీకరిస్తామని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. కార్పొరేట్ స్థాయిలో సకల హంగులతో ఆధునీకరించిన అబిడ్స్ పోలీసు స్టేషన్ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ధైర్యంగా పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసుకొనే చక్కటి వాతావరణంతో పాటు పోలీసు అధికారులు విధుల్లో అలసత్వం ప్రదర్శించకుండా ఉండేందుకు టెక్నాలజీని కూడా అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ‘పోలీస్స్టేషన్కు రాగానే రిసెప్షనిస్టు మర్యాదపూర్వకంగా ఫిర్యాదుదారుడిని ఆహ్వానిస్తారు. సమస్యను అడిగి తెలుసుకుని ఫిర్యాదును స్వీకరిస్తారు. ఆ ఫిర్యాదును జీడీలో రిజిస్టర్ చేసి విచారణ చేపడతారు. బహిరంగంగా కేసు గురించి చెప్పేందుకు ఇష్టపడనివారి కోసం ఇంటర్వ్యూ గదులు ఉంటాయ’ని డీజీపీ వివరించారు. తొలి దశలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని పోలీస్స్టేషన్లను ఆధునీకరిస్తున్నామన్న ఆయన...హైదరాబాద్లో ఠాణా భవనాల ఆధునీకరణ కోసం రూ.20 కోట్లు, రంగారెడ్డి జిల్లా సైబరాబాద్లో ఉన్న పోలీస్స్టేషన్ల ఆధునీకరణ కోసం రూ.45 కోట్లు, సీసీ కెమెరాల ఏర్పాటు కోసం హైదరాబాద్కు 58.5 కోట్లు, సైబరాబాద్కు రూ.25 కోట్లు కేటాయించామన్నారు. అబిడ్స్ పోలీసు స్టేషన్ మాదిరిగానే ఇతర ఠాణాలను నయా హంగులతో తీర్చిదిద్దుతామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో సీఐడీ డీజీ సత్యనారాయణ, సిట్, క్రైం ఏసీపీ స్వాతిలక్రా, ట్రాఫిక్ ఏసీపీ జితేంద్ర, ఐదు జోన్ల డీసీపీలతో పాటు స్థానిక పోలీసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.400 కోట్లతో ఉపాధి కల్పన కార్యాలయాల ఆధునీకరణ
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి కల్పన కార్యాలయాలను ఆధునీకరించేందుకు మొదటి దశగా రూ.400 కోట్ల ఖర్చు చేయనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. దిల్కుషా అతిథి గృహంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 20న ఢిల్లీలో 3 రోజుల పాటు జాతీయ కార్మిక సదస్సును నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారని చెప్పారు. కనీస వేతనాలను కనీసం రూ.15 వేల వరకైనా పెంచాలని జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. అయితే కేంద్రం నిర్ణయం తీసుకున్నా, రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేయాలని పేర్కొన్నారు. కార్మికుల శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తున్నామని అందులో భాగంగానే ఈఎస్ఐలో మెరుగైన సేవలు అందించడంతో పాటు త్వరలోనే 8వేల ఉద్యోగాలకు నియామకాలు చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 5 లక్షల కార్మిక కుటుంబాలు ఈ సేవలను ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. -
చకచకా
నాగార్జునసాగర్ ఆధునికీకరణలో భాగంగా మొదటి ప్యాకేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2016 జూలై నాటికి పనులు పూర్తికావాల్సి ఉంది. ఇప్పటికే 90 శాతం సీసీ లైనింగ్ పూర్తికాగా, కేవలం నాలుగు కిలోమీటర్ల మేర పెండింగ్లో ఉంది. హాలియా : ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో చేపట్టిన నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆధునికీకరణ పనులు మొదటి ప్యాకేజీలో శరవేగంగా జరుగుతున్నాయి. 2016 జూలై నెలాఖరు నాటికి కాల్వ పనులు పూర్తి కావాల్సి ఉంది. అంటే మరో ఏడాది సమయమే ఉండటంతో పనులు ఊపందుకున్నాయి. ఎడమ కాల్వలో అల్వాల, తెట్టేకుంట, కొత్తపల్లి గ్రామాల వద్ద నీటికి అక్కడక్కడ అడ్డుకట్టలు వేయడంతోపాటు పేరుకుపోయిన షిల్ట్ను తొలగిస్తున్నారు. మరోవైపు కాల్వ సీసీ లైనింగ్, కాల్వకట్టపై మట్టిపోసే పనులు నిర్వహిస్తున్నారు. పనులు ఇలాగే కొనసాగితే మరో నెల నుంచి రెండు నెలలలోపే మొదటి ప్యాకేజీ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. 4 కిలోమీటర్ల మేర సీసీ లైనింగ్.. ఆధునికీకరణ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ఎడమ కాల్వను ఐదు ప్యాకేజీలుగా విడదీశారు. 0 నుంచి 29.291 కిలోమీటర్ వరకు మొదటి ప్యాకేజీగా నిర్ణయించారు. 95.49కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. ఇప్పటికే 90 శాతం సీసీ లైనింగ్ పూర్తయ్యింది. మరో 4 కిలోమీటర్ల మేర (తెట్టెకుంట నుంచి అల్వాల వరకు) సీసీ లైనింగ్ పనులు మిగిలి ఉన్నాయి. అదే విధంగా డీప్కట్లో షాట్క్రీట్ పనులు 1.5 కిలోమీటర్లు మిగిలాయి. -
ఆధునికీకరణకు నిధులేవీ?
అమలాపురం :ఈ సీమవాసుల భాగ్యరేఖ నుదుటిపై కాదు.. నీటిబొట్టుపై రాసి ఉంటుంది. దాన్ని తొలుత రాసిన వాడు సర్ ఆర్థర్ కాటన్. ఆయన సృష్టించిన గోదావరి డెల్టాకు కాలువలు, చానళ్లు, బోదెలు జీవనాడులు. క్షామ పీడిత ప్రాంతంలో సిరులు కురిపించి.. డెల్టావాసుల తలరాతలు మార్చిన భాగ్యరేఖలు. పచ్చని పంటపొలాలు.. పాలవెల్లువలతో డెల్టా రైతుల కుటుంబాలు భోగభాగ్యాలు అనుభవిస్తున్నాయంటే అందుకు ధవళేశ్వరం ఆనకట్ట, తరువాత కాలంలో బ్యారేజ్ ఎంత కారణమో.. బ్యారేజ్ వద్ద నుంచి నీరు పంట చేలకు అందించే పంట కాలువలు, చానళ్లు, బోదెలు అంతే కారణం. కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ, కోట్ల రూపాయల ఆదాయాన్ని పంచుతున్న ఆ కాలువలు కనీస మరమ్మతులకు నోచుకోక కుచించుకుపోవడంతో డెల్టా రైతులు అవస్థలు పడుతున్నారు. నష్టాల పాలవుతున్నారు. పూర్తయినవి అతి తక్కువ పనులే.. గోదావరి డెల్టా పంటకాలువలు, మురుగునీటి కాలువలు పూడుకుపోయి, నానాటికీ చిక్కి శల్యమవుతున్నాయి. దశాబ్దాలుగా కనీస మరమ్మతులకు నోచుకోని ఈ కాలువల ఆధునికీకరణకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ పనులు పూర్తయి ఉంటే డెల్టా పూర్వవైభవం సంతరించుకునేది. అయితే టెండర్లు ఖరారు కాకపోవడం, ఖరారైన చోట పనులు పూర్తి కాకపోవడం, కాంట్రాక్టర్లు దోపిడీ కోసం కేవలం మట్టిపనులు మాత్రమే చేయడం, అందుకు అధికారులు వత్తాసు పలకడం, రైతులు సకాలంలో రబీ పూర్తి చేయకపోవడం, లాంగ్ క్లోజర్కు సమయం లేదని చిన్నచిన్న పనులతో సరిపెట్టడం వెరసి డెల్టా ఆధునికీకరణ మరుగున పడిపోయింది. జిల్లాలో రూ.1,670 కోట్లతో 2008లో మొదలైన ఈ పనుల్లో ఇప్పటి వరకు కేవలం రూ.319 కోట్ల పనులు మాత్రమే పూర్తి కావడం గమనార్హం. వీటిలో పంట కాలువలపై రూ.245 కోట్లు, మురుగునీటి కాలువలపై రూ.74 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. బాబు రాకతో కొండెక్కనున్న ఆధునికీకరణ! దివంగత నేత వైఎస్ఆర్ హయాంలో పరుగులు పెట్టిన డెల్టా ఆధునికీకరణ పనులు తరువాత ముఖ్యమంత్రులుగా ఉన్న కె.రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి హయాంలలో మందగించాయి. ఇక చంద్రబాబు ప్రభుత్వం రాకతో ఆధునికీకరణ పనులు కొండెక్కుతాయని రైతులు అనుమానిస్తున్నారు. ఈ పనులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు, అధికారులు ఖర్చుపెట్టిన తీరు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. గత ఏడాది రూ.75 కోట్లతో పనులు చేయాలని తొలుత నిర్ణయించి, కేవలం రూ.30 కోట్ల పనులు కూడా చేయలేదు. ఇది చూసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.30 కోట్లు కేటాయించింది. పశ్చిమ వాటా పోగా మన జిల్లాకు వచ్చేది రూ.15 కోట్లు కావడం గమనార్హం. ఈ కేటాయింపులు చూపి బాబు ఉండగా డెల్టా ఆధునికీకరణ పూర్తయ్యే అవకాశం లేదని రైతులు ఒక అంచనాకు వస్తున్నారు. ఆధునికీకరణ పనులకు పెద్దగా కేటాయింపులు చేయని ప్రభుత్వం డెల్టాను ఎడారి చేస్తుందేమోనని రైతులు భయపడుతున్న తరుణంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి మొత్తం నిధులు కేటాయించి ఏడాదిలో పూర్తి చేయాలని నిర్ణయం విశేషం. ఏటా రూ.150 కోట్లకు పైగా నష్టం డెల్టాలో పంట, మురుగునీటి కాలువలు పూడుకుపోవడంతో రైతులు ఏటా కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. ఖరీఫ్లో చేలు మునిగిపోవడం, రబీలో ఎండిపోవడం షరామామూలుగా మారింది. ఈ నష్టం ఏటా రూ.150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కనీసం పంటకాలువల్లో పూడిక తొలగించకపోవడం వల్ల శివారుకు నీరందక చేలు ఎండిపోతున్నాయి. డెరైక్ట్ పైప్లు(డీపీలు) పూడుకుపోతున్నా పట్టించుకునేవారు లేక శివారు, మెరక భూములకు నీరు చేరడంలేదు. ప్రస్తుత రబీలో సుమారు 15 వేల ఎకరాల్లో పంటదెబ్బతినే అవకాశం ఉందని అంచనా. నిధులు కేటాయించకపోవడంతో చానల్లు, డ్రైన్లు, పంటకాలువలు, పంటబోదెలను ఉపాధి హామీ పథకంలో మరమ్మతులు చేయాల్సి వస్తోంది. కూలీలు లెవెల్స్ పాటించకుండా ఇష్టానుసారం పనులు చేపట్టడంతో రైతులకు ఏ మాత్రం ప్రయోజనం ఉండడంలేదు. -
నాడు గలగ ల.. నేడు వెలవెల!
గలగల శబ్దం చేస్తూ తుంగభద్ర తడిపిన పొలాలను రైతులు చూసి చాలాకాలమే అయ్యింది.. మూడు దశాబ్దాలుగా ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వెలవెలబోయింది.. ఆర్డీఎస్ ఆధునికీకరణ నాయకులు హామీగా మిగిలిపోయింది.. రైతుఘోషను ఆలకిస్తూ ఆర్డీఎస్ నీటిని చివరి ఆయకట్టుకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గంపై దృష్టిసారించింది. అందులో భాగంగానే ఇంతకాలానికి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం సర్వే పనులకు ఆమోదముద్ర వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. - అలంపూర్ -
మంచైనా..చెడైనా మీతోనే!
కేసుల నమోదులో జాగ్రత్త పోలీసు అధికారుల సమీక్షలో హోంమంత్రి చినరాజప్ప విజయవాడ సిటీ : ‘క్షేత్రస్థాయిలో పని చేసేది మీరే. మంచైనా, చెడైనా మీపైనే ఆధారపడి ఉంది. మీ పని తీరు కారణంగానే పోలీసు కమిషనర్కు, ప్రభుత్వానికి పేరొస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పని చేయండి’ అంటూ రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పోలీసు అధికారులకు హితవుపలికారు. నగర పోలీసు కమిషనరేట్లోని సమావేశ మంది రంలో ఆయన ఎస్ఐ ఆపై స్థాయి అధికారులతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహిం చారు. సేకరించిన సమాచారం ప్రకారం.. సమావేశంలో హోంమంత్రికి కమిషనరేట్లోని అధికారులను సీపీ ఎ.బి.వెంకటేశ్వరరావు పరిచయం చేశారు. ఇతర కమిషనరేట్లలో నేరాల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది నియామకం, వాహనాల కొరత, పోలీసు స్టేషన్ల ఆధునికీకరణ వంటి అంశాలను ప్రస్తావిస్తూ తాము చేపట్టిన కార్యక్రమాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇక్కడ జరిగే నేరాలు, నిలువరించేందుకు తాము చేపడుతున్న చర్యలను పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ల పదోన్నతులు, డ్రైవర్ల కొరత, పోలీసు పిల్లలకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు, ఆస్పత్రి నిర్మాణం వంటి అంశాలను ఈ సందర్భంగా కొందరు అధికారులు ప్రస్తావించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నేరాల నియంత్రణకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. ఇందుకు అనుగుణంగా పోలీసుశాఖ పని చేయాలని కోరారు. రాజధాని కావడంతో భూ వివాదాలు పెరిగే అవకాశం ఉందని, వాటిని మొగ్గలోనే తుంచివేయాలని హోం మంత్రి ఆదేశించారు. పరస్పరం కేసుల నమోదు విషయంలోనూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరోపణలు రాకుండా కేసుల నమోదు, నిందితుల అరెస్టుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలకు సానుకూలత...వైద్యశాలకు వ్యతిరేకత పోలీసు ఉద్యోగుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించేందుకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటుపై హోంమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. సీఎంతో చర్చించి పాఠశాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజధానిలో పోలీసుల సంఖ్య పెంపు, వాహనాల సమకూర్చడం వంటి అంశాలపై హోంమంత్రి సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. పోలీసులకు ప్రత్యేకంగా ఆస్పత్రి ఏర్పాటు చేయాలనే సూచనను హోంమంత్రి అంగీకరించలేదు. పెద్ద జబ్బులకు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి ‘భద్రత’ పథకం కింద బిల్లులు పెట్టుకునే అవకాశం ఉన్నందున ఆస్పత్రి అవసరం లేదన్నారు. ఇసుక మాఫియాకు చెక్ పెట్టండి ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిందని చినరాజప్ప చెప్పారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని అధికారులకు స్పష్టంచేశారు. సీపీకి కితాబు పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై సీపీని హోంమంత్రి ప్రశంసించినట్లు తెలిసింది. డీసీపీ(పరిపాలన) జి.వి.జి.అశోక్కుమార్, వివిధ విభాగాలకు చెందిన అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
సాగర్ కాల్వల ఆధునీకరణ ఏమైంది?
అసెంబ్లీలో సభ్యుల ప్రశ్న 2016లో పూర్తిచేస్తాం: మంత్రి జవాబు హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణను సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, కాలువల ఆధునీకరణను త్వర గా పూర్తిచేసి భూములకు నీరందించాలని పలువురు శాసనసభ్యులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పోతుల రామారావు అడిగిన లిఖిత ప్రశ్నపై మంగళవారం శాసనసభలో చర్చ జరిగింది. రూ. 2,832.69 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన సాగ ర్కాల్వల ఆధునీకరణ పనులకు ప్రపంచ బ్యాంకు 48 శాతం, రాష్ట్రం 52 శాతం నిధు లు భరిస్తున్నాయని, ఇప్పటివరకు రూ. 810.94 కోట్లు వ్యయం చేశామని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. ఆధునీకరణ పనులను 2016 జూన్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. అయితే.. ఇన్ని నిధులు వ్యయం చేసినా ఏ కాల్వ పనీ పూర్తి కాలేదని, ప్రకాశం జిల్లాలో ఏ కాల్వకూ లైనింగ్ వేయలేదని, కాంట్రాక్టర్లు పనులను సగంలో వదిలేసి వెళ్లిపోవడం వల్ల తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తోందని గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కాలువ చివరి భూముల రైతుల ఇక్కట్లు పట్టించుకుని సాధ్యమైనంత త్వరగా నీరందించేలా చూడాలని స్పీకర్ కోడెల కూడా ప్రభుత్వానికి సూచించారు. ఈ నెల 27, 28 తేదీలలో కాల్వల పరిశీలనకు తనతో పాటు రావాలని మంత్రి ఉమ ఎమ్మెల్యేలను కోరారు. -
‘బకింగ్హాం’.. ఇక చక చక
మార్చిలో జల రవాణా పనులు మొదట పెదగంజాం నుంచి కృష్ణపట్నం వరకూ డ్రెడ్జింగ్ 500 టన్నుల సరుకు రవాణాకు వీలుగా కాలువ ఆధునీకరణ మంత్రి దేవినేనితో అంతర్గత జల రవాణా సీఈ భేటీ, చర్చలు సాక్షి, విజయవాడ బ్యూరో: కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకూ ఉన్న బకింగ్హాం కెనాల్ ద్వారా జల రవాణాకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే మార్చిలో కాలువలో అవసరమైన చోట డ్రెడ్జింగ్ పనులు మొదలు పెట్టాలని అధికారులు నిర్ణ యం తీసుకున్నారు. కేంద్ర జల రవాణా చీఫ్ ఇంజనీర్ ఎస్.దండపత్ ఆదివారం విజయవాడలోని సాగునీటి శాఖ కార్యాలయంలో ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జల రవాణాకు అనుకూలంగా బకింగ్హాం కాలువలో కేంద్రం చేపట్టబోయే పనులపై చర్చించా రు. మొత్తం 500 టన్నుల మేర సరకు రవాణాకు అనుకూలంగా కాలువ మార్గాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందని దండపత్ వివరించారు. ఈలోగా నాలుగు దశల్లో కాల్వపై పూర్తి స్థాయి సర్వే నిర్వహిస్తామని, ఆపైన దశల వారీగా పను లు చేపడతామని చెప్పారు. మొత్తం 1,095 కిలోమీటర్ల దూరం ఉన్న బకింగ్హాం కెనాల్ జల మార్గాన్ని పూర్తి స్థాయిలో సరకు రవాణాకు అనుకూలంగా మార్చే లక్ష్యంతో కాలువను కేంద్రం రెండుసార్లు సర్వే చేయించింది. కాలువ రూపురేఖలు, ఆక్రమణలను గుర్తించి సుమారు రూ. 542 కోట్లతో అభివృద్ధి పరచాలని అంచనావేసింది. ఇందుకోసం ఓ ఐఏఎస్ అధికారి, చీఫ్ ఇంజినీర్, సర్వే, ట్రాన్స్పోర్ట్ విభాగం అధికారులను కేటాయించింది. ఈ నేపధ్యంలో కేంద్ర జల రవాణా చీఫ్ ఇంజనీర్ దండపత్, సీనియర్ హై డ్రోలాజికల్ సర్వేయర్ సి.వి.ప్రసాద్లు రెండు రోజుల కిందట విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో జల రవాణా కార్యాలయాన్ని ప్రారంభించారు. శుక్ర, శనివారాల్లో బకింగ్హాం కాలువపై పర్యటించి స్థితిగతుల్ని పరిశీలించారు. మొదట డ్రెడ్జింగ్ పనులు... బకింగ్హాం కాలువ రూపురేఖలు విజయవాడ నుంచి పెద గంజాం వరకూ బాగానే ఉన్నాయి. అక్కడి నుంచి కృష్ణపట్నం వరకూ స్వరూపమే మారిపోయింది. చాలా చోట్ల ఆక్రమణలు పెరిగి కుచించుకుపోయింది. ఈ ఆక్రమణలను తొలగించి, అవసరమైన చోట వంతెనలు, ప్రత్యేక నిర్మాణాలు నిర్మించాల్సి ఉంది. కాలువ పక్కనే నిర్మించే టెర్మినల్స్ వరకూ సరకు తెచ్చేందుకు రోడ్లను కూడా నిర్మించాల్సి ఉంది. మార్చిలోగా దీన్ని పూర్తి చేసి ఆ తరువాత పెదగంజాం నుంచి కృష్ణపట్నం వైపు డ్రెడ్జింగ్ పనులు మొదలు పెట్టనుంది. కేంద్రం నుంచి విజయవాడ వచ్చిన చీఫ్ ఇంజనీర్ దండపత్ మంత్రి దేవినేనితో దీనిపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాలువవల్ల పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. -
సూపర్ ఫాస్ట్గా..
విజయవాడ రైల్వేస్టేషన్ రాజధాని హంగులను సమకూర్చుకుంటోంది. రూ.4.5 కోట్లతో చేపట్టిన ఆధునికీకరణ పనులు పూర్తికావస్తున్నాయి. క్లోక్రూమ్, ఏసీ వెయిటింగ్ హాళ్లను విస్తరించనున్నారు. తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు మరో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. మూడు ప్లాట్ఫాంలపైనా మరిన్ని సౌకర్యాలు కల్పిచేందుకు రైల్వే అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. విజయవాడ : విజయవాడ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు వేగవంతమయ్యూరుు. నవ్యాంధ్ర రాజధానిగా తుళ్లూరును ప్రకటించిన నేపథ్యంలో మార్చి నాటికి పనులు పూర్తిచేసేందుకు చూస్తున్నారు. నవ్యాంధ్రలో విజయవాడ రైల్వేస్టేషన్ కీలకం కావడంతో ఏడాది కిందటే అభివృద్ధి పనులు ప్రారంభించారు. ముఖ్యంగా స్టేషన్ ముందుభాగాన్ని అందంగా రాచనగరిని తలపించేలా తీర్చిదిద్దడంతో పాటు ప్రయాణికులకు ఉపయోగపడేలా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ పనులన్నింటినీ వచ్చే మార్చి నాటికి పూర్తిచేసిన తరువాత మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారించే అవకాశం ఉంది. దాహార్తి తీర్చేందుకు రిజర్వాయర్లు ఇటీవల కాలంలో రైల్వేస్టేషన్లో నీటి అవసరాలు బాగా పెరిగాయి. సకాలంలో నీరు అందుబాటులో లేకపోవడం వల్ల దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలో నీటిని నింపడం సాధ్యపడటం లేదు. రైల్వేస్టేషన్, పరిసరాల్లో ఉన్న రైల్వే క్వార్టర్స్, ఎలక్ట్రికల్ లోకోషెడ్ అన్నింటికీ కలిపి రోజుకు 1.25 కోట్ల లీటర్ల నీరు అవసరమవుతోంది. ఇప్పటికే 10 వరకు రిజర్వాయర్లు ఉండగా, తాజాగా తారాపేట వైపు ఐదు లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ఈ రెండు రిజర్వాయర్ల నీరు స్టేషన్కు ఉపయోగిస్తారు. దీంతో నీటి కొరత తీర్చేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. రూ.4.5 కోట్లతో అభివృద్ధి పనులు రైల్వేస్టేషన్లో ఒకటో నంబరు ప్లాట్ఫాంపై రూ.4.5 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా స్టేషన్ ముందు భాగాన్ని బాగా విస్తరిస్తున్నారు. గతంలో స్టేషన్ ముందు భాగం కేవలం 50 మీటర్లే ఉండేది. ఇప్పుడు దీన్ని మరో 150 మీటర్లు పెంచి 200 మీటర్ల పొడవనా రాజప్రాకారం తరహాలో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇక ప్రయూణికుల రద్దీ ఎక్కువగా ఉండే రెండో ప్రవేశ ద్వారం వద్ద అంతా కూర్చునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి ప్లాట్ఫాంపైనే సాధారణ ప్రయాణికుల కోసం జనరల్ వెయిటింగ్ హాల్ నిర్మిస్తున్నారు. సుమారు 250 మంది విశ్రమించేందుకు వీలుగా వెయిటింగ్ హాల్ నిర్మాణం జరుగుతోంది. ఒకటో నంబరు ప్లాట్ఫాంపైనే 50 మంది కూర్చునేందుకు వీలుగా ఏసీ వెయిటింగ్ హాల్ ఉండేది. ఇటీవల ఏసీ బోగీల్లో ప్రయాణించేవారి సంఖ్య పెరగటంతో ఈ హాల్ చాలడం లేదు. ఇప్పుడు ఉన్న ఏసీ హాలును వందమంది వేచి ఉండేలా విస్తరిస్తున్నారు. సామాన్లు భద్రపరుచుకునే గది (క్లోక్రూమ్)కు కూడా అభివృద్ధి పరుస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని రైల్వే అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. 8, 9, 10 ప్లాట్ఫాంలపై ప్రత్యేక దృష్టి ప్రస్తుతం ఒకటో నంబర్ ప్లాట్ఫాంపై చేపట్టిన పనులు పూర్తికావస్తుండటంతో 8, 9, 10వ నంబరు ప్లాట్ఫాంలపై చేపట్టాల్సిన పనులపై అధికారులు దృష్టిసారించనున్నారు. ఈ మూడు ప్లాట్ఫాంలలో ప్రయాణికులకు అవసరమైన మేర వసతులు లేవు. ప్లాట్ఫాంల పొడవునా షెడ్లు లేకపోవడంతో వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ, చలికి వణుకుతూ ప్రయాణికులు రైళ్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. వచ్చే ఏడాది బడ్జెట్లో మూడు ప్లాట్ఫాంలకు మూడు కోట్లతో షెడ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. -
నగర రూపురేఖలు మారుస్తా..
బెజవాడ బ్యూటిఫికేషన్కు రూ.15కోట్లు కళాక్షేత్రం అభివృద్ధికి రూ.4కోట్లు డీఆర్ఆర్ ఇండోర్ స్టేడియానికి రూ.1.5 కోట్లు ఎయిర్పోర్టు టెర్మినల్ ఆధునికీకరణకు రూ.50కోట్లు కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై విచారణ విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు విజయవాడ : రాజధాని విజయవాడ నగరం చెత్తాచెదారంతో నిండిపోయిందని, తాను ఐదారుసార్లు పర్యటించి పూర్తిగా పక్షాళన చేసి రూపురేఖలు మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ప్రకటించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం సీఎం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఇరిగేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు. సిటీ బ్యూటిఫికేషన్ కోసం వివిధ శాఖ అధికారులతో కమిటీ వేస్తామని చెప్పారు. నగరాన్ని బ్యూటిఫికేషన్ చేసేందుకు రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పేపరు, ప్లాస్టిక్, మెటల్ వంటి వ్యర్థ పదార్థాలను వేరుచేసి ప్రక్షాళన చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించినట్లు సీఎం వివరించారు. కాల్వగట్లను అభివృద్ధి చేస్తామని, ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ రూ.1,500 కోట్లతో జలరవాణాను ప్రారంభిస్తుందని తెలిపారు. ఐదు ఎకరాల్లో నాలుగు వేల ఇళ్లను నిర్మించి నగరంలోని మూడు కాల్వల గట్లపై ఉన్న వారిని తరలిస్తామని చెప్పారు. ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లై ఓవర్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాం ఇంద్రకీలాద్రి వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపామని, కేంద్రం నిధులు మంజూరు కాగానే అభివృద్ధిపనులు ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. రామలింగేశ్వరనగర్లో రెండు లక్షల మంది కలుషిత నీరు తాగుతున్నారని, వారికి మంచినీరు అందించేందుకు రూ.52కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. నగరంలోని దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం అభివృద్ధికి రూ1.5 కోట్లు, తుమ్మలపల్లి కళాక్షేత్రానికి రూ.4కోట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నాలుగు రోడ్ల విధానం అమలుచేస్తామని తెలిపారు. గన్నవరం ఎయిర్పోర్టును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. టెర్మినల్ బిల్డింగ్ ఆధునికీకరణకు రూ.50 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. నిధుల దుర్వినియోగంపై విచారణ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ పథకాల అమలు కోసం రూ.350 కోట్లు అప్పు తెచ్చారని, ఈ నిధులతో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించకుండా బీఆర్టీఎస్ వంటి రోడ్లు నిర్మించారని సీఎం పేర్కొన్నారు.దీనివల్ల కార్పొరేషన్ ప్రతి నెల రూ.3 కోట్లు వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. నిధుల దుర్వినియోగంపై విచారణ చేయిస్తామన్నారు. అధికారుల గుండెల్లో నిద్రపోయా : సీఎం అధికారుల సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 100 సార్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధికారుల గుండెల్లో నిద్రపోయానని తెలిపారు. సమాజంలో మార్పు తీసుకురావడం కోసం అధికారుల్ని పరుగులు పెట్టించేవాడినని, బహిరంగంగా నిలదీసేవాడినని చెప్పారు. ప్రస్తుతం తన విధానం మార్చుకున్నానని, అందరూ కలిసి రావాలని, కష్టించేతత్వం గల అధికారుల్ని స్వాగతిస్తానని, పనిచేయని వారిని విడిచిపెట్టే ప్రశ్నే లేదన్నారు. ఇక నుంచి ప్రతి వారం ఆకస్మిక తనిఖీలు చేస్తానని, పనితీరు బాగుంటే పిలిచి కాఫీ ఇస్తానని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని సీఎం హెచ్చరించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, పి.నారాయణ, ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా, శ్రావన్కుమార్, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, మేయర్ కోనేరు శ్రీధర్, జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు, జాయింట్ కలెక్టర్ జె.మురళి, సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సి.హరికిరణ్, డెప్యూటీ మేయర్ గోగుల రమణ, తదితరులు పాల్గొన్నారు. -
బడుగులకు చిత్తశుద్ధితో సేవలందించాలి
మహిళ పోలీసులకు హోంమంత్రి నాయిని పిలుపు సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారానికి నీతి నిజాయితీతో పని చేయాలని, పేద, బలహీనవర్గాలకు చిత్తశుద్ధితో సేవలందించాలని మహిళాపోలీసులకు తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపు నిచ్చారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలోని అప్పా పోలీస్ అకాడమీలో 486 మంది మహిళా సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ ఆధునీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. డీజీపీ అనురాగ్శర్మ మాట్లాడుతూ తెలంగాణ పోలీసుశాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించటంతో ప్రతిష్ట పెరిగిందన్నారు. పోలీస్ అకాడమీ డెరైక్టర్ డాక్టర్ మాలకొండయ్య మాట్లాడు తూ 1986లో స్థాపించిన అకాడమీలో ఇప్పటివరకు 2865 బ్యాచ్ల ద్వారా లక్షారెండు వేల మందికి శిక్షణ ఇచ్చామన్నారు. 16 బృందాలుగా ఏర్పడిన పాసింగ్ అవుట్ పరేడ్కు కమాండర్గా ఆర్.కీర్తి వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన కవాతు, బ్యాండ్ అందరినీ అలరించా యి. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నాగజ్యోతి ఆల్రౌండర్గా నిలవగా వరంగల్లో శిక్షణపొందినవారిలో ఆల్రౌండర్గా రంగారెడ్డి జిల్లాకు చెందిన కె. మంజుల నిలిచారు. ఇండోర్ విభాగంలో బి.సంధ్య, ఖాజా ఉన్నీసాబేగం, బెస్ట్ ఫైరింగ్లో వై.రేణుక, జి.రాజేశ్వరి, బెస్ట్ ఇం డోర్, అవుట్ డోర్ విభాగంలో రాధికలు నిల వగా వారికి నాయిని పతకాలను అందజేశారు. -
నిర్ణయం బోర్డుదే
బోర్డు నిర్ణయానికి ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉంటాయి ఆర్బీసీ ఆధునికీకరణపై ఏపీ, కర్ణాటక సీఎంల ఉమ్మడి ప్రకటన కర్ణాటకలో ఆన్లైన్ ట్రేడింగ్ విధానం భేష్ : చంద్రబాబు ల్యాండ్పూలింగ్ ద్వారా రాజధాని నిర్మాణానికి భూమి సేకరణ ఈ చర్చ వల్ల ఒరిగింది శూన్యమన్న కర్ణాటక నీటిరంగ నిపుణులు బెంగళూరు : తుంగభద్ర రైట్ బ్యాంక్ కెనాల్ (ఆర్బీసీ) ఆధునికీకరణకు సంబంధించిన విషయంలో తుది నిర్ణయం తుంగభద్ర నదీ జలాల పంపకం కోసం ఏర్పాటైన బోర్డుదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉమ్మడిగా ప్రకటించారు. బోర్డు నిర్ణయానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కట్టుబడి ఉంటాయని వారు తెలిపారు. తుంగభద్ర నదీ జలాల పంపకం విషయమై ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రుల మధ్య సోమవారమిక్కడి సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణలో దాదాపు 45 నిమిషాలు చర్చలు జరిగాయి. అనంతరం సీఎం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ... ఆర్బీసీ ఆధునికీకరణ పూర్తయితే అనంతపురం, కడప, కర్నూలుతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు, కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక నీరావరి నిగమ్ వద్ద ఆర్బీసీ ఆధునికీకరణకు సంబంధించిన విషయం పరిశీలనలో ఉందన్నారు. ఇక్కడ నుంచి టెక్నికల్ సబ్ కమిటీకి అటుపై తుంగభద్ర బోర్డు ముందుకు ఆధునికీకరణ విషయం పరిశీలనకు వస్తుందన్నారు. ఆధునికీకరణకు సంబంధించి బోర్డు నిర్ణయాన్ని ఇరురాష్ట్రాలు విధిగా అంగీకరిస్తామని స్పష్టం చేశారు. ఆధునికీకరణకు అవసరమైన నిధుల విషయంలో కూడా బోర్డు నిర్ణయం అనంతరం స్పష్టత వస్తుందన్నారు. కాగా, చర్చల అనంతరం వ్యవసాయ రంగంలో కర్ణాటక అవలంభిస్తున్న నూతన విధానాలపై సంబంధిత అధికారులు కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి కృష్ణబైరేగౌడ సమక్షంలో సీఎం చంద్రబాబునాయుడుకు దాదాపు గంటపాటు పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... కర్ణాటకలో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కోసం అవలంబిస్తున్న ఆన్లైన్ ట్రేడింగ్ విధానం చాలా బాగుందని మెచ్చుకున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి దీనితో పాటు మరికొన్ని విధానాలను ఏపీలో అమలు చేయనున్నానని తెలిపారు. ల్యాండ్పూలింగ్ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణానికి భూమిని సేకరిస్తున్నామని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. డిజైన్లో మార్పులేదు - సిద్ధు తుంగభద్ర ఆర్బీసీ ఆధునికీకరణ జరిగినా కాలువ డిజైన్లో ఎటువంటి మార్పు ఉండదని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ప్రస్తుతం 190 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువలో పూడిక పేరుకుపోవడం వల్ల ఏడాదికి 32 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు కోల్పోతున్నాయన్నారు. ఈ పూడిక ఇలాగే కొనసాగితే 32 టీఎంసీలకు అదనంగా ప్రతి ఏటా 0.45 టీఎంసీల నీటిని నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఆధునికీకరణ విషయం తుంగభద్ర బోర్డు నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. తాజా చర్చల్లో కేవలం ఆర్బీసీ ఆధునికీకరణకు సంబంధించిన విషయం మాత్రమే చర్చకు వచ్చిందని... వరద నీటి కాల్వ విషయం ప్రస్తావనకు రాలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. చర్చల్లో రెండు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదలశాఖ మంత్రులు ఎంబీపాటిల్, దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ప్రయోజనం శూన్యం! తుంగభద్ర ఆర్బీసీ ఆధునికీకరణ విషయమై సోమవారం జరిగిన చర్చల వల్ల ఎటువంటి ప్రయోజనం కలగలేదని కర్ణాటక నీటిరంగ నిపుణులతోపాటు చర్చల్లో పాల్గొన్న మంత్రులు పేర్కొంటున్నారు. తుంగభద్ర నీటి పంపకాలకు సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు బోర్డుముందుకు తీసుకువెళ్లినా వాటిని కొట్టివేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. బోర్డు ముందుకు నేరుగా వెళితే ఎటువంటి ప్రయోజనం ఉండబోదని భావించడం వల్లనే ఏపీ ప్రభుత్వం నేరుగా కర్ణాటక దగ్గరకు వస్తోందని, అయితే ఈ చర్చల వల్ల కూడా ప్రయోజనం శూన్యమేనని చర్చల్లో పాల్గొన్న ఓ మంత్రి పేర్కొన్నారు. -
తుంగభద్ర కాల్వ డిజైన్ మారదు
బోర్డు నిర్ణయం మేరకే నీటి పంపిణీ, ఆధునికీకరణ ఏపీ, కర్ణాటక సీఎంల ఉమ్మడి ప్రకటన సాక్షి, బెంగళూరు: తుంగభద్ర రైట్ బ్యాంక్ కెనాల్ (టీబీఆర్బీసీ) ప్రస్తుత డిజైన్లో ఎటువంటి మార్పు ఉండబోదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉమ్మడిగా ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల కాల్వ ఆధునికీకరణ జరిగినా భవిష్యత్లో తుంగభద్ర నీటి పంపకాలకు సంబంధించి గొడవలు తలెత్తవని వారు అభిప్రాయపడ్డారు. తుంగభద్ర నదీ జలాల పంపిణీ విషయమై బెంగళూరులోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధుల మధ్య సోమవారం దాదాపు 45 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. చర్చల అనంతరం తొలుత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... తుంగభద్ర నీటి పంపకం కోసం ఏర్పాటైన బోర్డు కాల్వ ఆధునికీకరణ విషయమై కూడా నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఈ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందేనన్నారు. ప్రస్తుత చర్చల్లో కుడికాల్వ ఆధునికీకరణ విషయాన్ని మాత్రమే చర్చించినట్లు చెప్పారు. వరద కాలువ విషయం, మరో విషయమంటూ తమ మధ్య చర్చకు రాలేదని స్పష్టం చేశారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తుంగభద్ర కుడి కాల్వ ఆధునికీకరణ వల్ల హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ద్వారా బళ్లారితో పాటు అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆధునికీకరణ విషయమై ‘బోర్డు నిర్ణయం’ తర్వాతే నిధుల విషయంపై స్పష్టత వస్తుందని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల ఆన్లైన్ ట్రేడింగ్ చర్చల అనంతరం కర్ణాటకలో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వం అవలంభిస్తున్న విషయాలపై సంబంధిత అధికారులు, కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణభైరేగౌడ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు హోటల్ అశోకాలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియూతో మాట్లాడుతూ.. కర్ణాటకలో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కోసం అవలంభిస్తున్న ఆన్లైన్ ట్రేడింగ్ విధానం చాలా బాగుందని మెచ్చుకున్నారు. దీన్ని ఏపీలో అమలు చేయనున్నామని వెల్లడించారు. ల్యాండ్పూలింగ్ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణానికి భూమిని సేకరిస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. చర్చల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమ, పరిటాల సునీత పాల్గొన్నారు. -
గ‘ఘన’మేనా!
మెదక్: ఘనపురం ప్రాజెక్ట్ కాల్వల ఆధునికీకరణ కోసం రెండేళ్ల క్రితం రూ.21.86 కోట్లు మంజూరయ్యాయి. అయితే పనులు ముందుకు సాగ లేదు. గత ప్రభుత్వ హయాంలో కాల్వ పనులకు కొంతమంది రాజకీయ నాయకులే మోకాలు అడ్డం వేశారనే ఆరోపణలున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు ప్రారంభానికి 2014 జూన్ 19న మళ్లీ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఎంఎన్ కెనాల్ 76 చైనేజ్ నుంచి 480 చైనేజ్ వరకు జంగిల్ కటింగ్, పూడికతీత కార్యక్రమాలు కొనసాగాయి. అంతలోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో పనులను నిలిపివేశారు. ఈయేడు సింగూర్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున రబీ సీజన్కు ఎలాగు నీటిని వదిలే అవకాశం లేదు. తాజాగా టీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ ఘనపురానికి నిధులు కేటాయించారు. కనీసం ఇప్పుడైనా కాల్వల మరమ్మతులు ప్రారంభిస్తే తమ కలలు నెరవేరుతాయని చివరి ఆయకట్టు రైతులు ఆశిస్తున్నారు. తగ్గిన ఆయకట్టు విస్తీర్ణం ఘనపురం ప్రాజెక్ట్ను మంజీర నదిపై కొల్చారం, పాపన్నపేట మండలాల మధ్య 1905లో నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు ఆనకట్ట పరిధిలోని మహబూబ్ నహర్ కెనాల్, ఫతే నహర్ కెనాళ్లకు కనీస మరమ్మతులు చేయకపోవడంతో అవి పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ఫలితంగా 22వేల ఎకరాల ఆయకట్టు కాస్తా 12 వేల ఎకరాలకు పడిపోయింది. దీంతో 2009లో నగరబాటలో భాగంగా మెదక్ వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఘనపురం కాల్వల ఆధునికీకరణ కోసం రూ.9 కోట్లు మంజూరు చేశారు. అనంతరం పూర్తిస్థాయి మరమ్మతుల కోసం జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ కార్పొరేషన్ లిమిటెడ్(జైకా) కింద రూ.21.86 కోట్లు మంజూరయ్యాయి. వీటి ద్వారా మహబూబ్నహర్ కెనాల్ 34 కిలోమీటర్లు. ఫతేనహర్ కెనాల్ 19కిలో మీటర్ల నిడివి మేర మరమ్మతులు చేయాల్సి ఉంది. ఈ మేరకు హైదరాబాద్కు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఫిబ్రవరి 2012లో పనులు చేజిక్కించుకొని అగ్రిమెంట్ కుదుర్చుకుంది. రెండేళ్ల కాలపరిమితిలో కాల్వల లైనింగ్, పూడిక తీత, జంగిల్ కటింగ్ తదితర పనులు పూర్తి చేయాల్సి ఉంది. అడుగడుగునా అడ్డంకులే! జైకా పనులు దక్కించుకునేందుకు రాఘవ కన్స్ట్రక్షన్స్తోపాటు మరో కంపెనీ పోటీ పడినట్లు తెలిసింది. కాగా పనులు దక్కించుకోలేని కంపెనీ జిల్లాకు చెందిన ఓ మాజీ ముఖ్యనేత అండతో మరమ్మతు పనులు అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో పనులు పూర్తిచేసిన రూ.1.27కోట్లకు సంబంధించి బిల్లులు చెల్లించడంలో అధికారులు జాప్యం చేశారనే విమర్శలున్నాయి. చేసిన పనికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు 2013 జూన్ 3న ఎంబీ రికార్డు చేసి పీఏఓకు పంపారు. కానీ 37 రోజుల తర్వాత 2013 జూలై 08న ఎంబీలో కొన్ని పేజీలు చిరిగి పోయాయని చెబుతూ బిల్లును వాపస్ పంపారు. అసలు పేజీలు ఏ శాఖలో చిరిగి పోయాయన్నది ఇప్పటికీ అంతుబట్టని రహస్యం. అదే సమయంలో జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కాంట్రాక్ట్పై ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇలా ముప్పేట దాడితో విలవిల్లాడిన కాంట్రాక్టర్ పనులు నిలిపి వేసి కోర్టుకెక్కాడు. దీంతో జైకా పనులు సాగక రైతన్నల భూములకు నీరందక బీళ్లుగా మారాయి. ఈ క్రమంలో 2014 ఫిబ్రవరి 15తో కాంట్రాక్ట్ గడువు ముగిసిపోయింది. తనకు గడువు పెంచాలని కాంట్రాక్టర్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగస్టు 2015 వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి హరీష్ చొరవతో పనులు ప్రారంభం ఆగిపోయిన జైకా పనులు నీటి పారుదలశాఖ మంత్రి హరీష్రావు చొరవతో కొలిక్కి వచ్చాయి. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించగానే జైకా పనులపై ప్రత్యేక దృష్టి నిలిపారు. ఈ క్రమంలో పాత కాంట్రాక్టర్కు కాంట్రాక్ట్ పదవీ కాలాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జూన్ 19న జైకా పనులకు మంత్రి హరీష్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డిల ఆధ్వర్యంలో మరోసారి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఎం.ఎన్. కెనాల్లో సుమారు రూ.50 లక్షలు పనులు పూర్తయ్యాయి. అంతలోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో సింగూర్ నుంచి ఘనపురం ప్రాజెక్ట్కు నీటిని విడుదల చేశారు. దీంతో మరమ్మతు పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ముగిసినందున కాల్వల ఆధునికీకరణ పనులు తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉంది. -
ఆధునికీకరణకు నిధులివ్వాలి
గోవాడ, తుమ్మపాల సుగర్స్కు రూ.100 కోట్లు చొప్పున మంజూరు చేయాలి ప్రభుత్వానికి వామపక్ష నేతల డిమాండ్ ఫ్యాక్టరీలను సందర్శించిన బృందం అనకాపల్లి: హుదూద్ తుపాను కారణంగా తీ వ్రంగా నష్టపోయిన గోవాడ, తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం రూ.100 కోట్ల చొప్పు న మంజూరు చేయాలని జిల్లా వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. మండలంలోని తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీని బుధవారం సీపీఐ జిల్లా కార్యదర్శి ఏజె స్టాలిన్, సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాధం, వామపక్ష నేతలు కొండబాబు, రామచంద్రరావు, వీవీఎమ్ రెడ్డిలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఫ్యాక్టరీ యంత్రాలను, గొడౌన్, స్టోర్రూమ్ను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫ్యాక్టరీపై వేలాది రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. తుపానుకు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు. పంటనష్టాన్ని పారదర్శకంగా నమోదు చేయాలన్నారు. గ్రామీ ణ ప్రాంతాలలో 25 కిలోల బియ్యం మూడునెలల పాటు ఉచితంగా ఇవ్వాలన్నారు. జిల్లాలో తుపానుపై నష్టం వివరాలు నమోదు చేసి తమ పార్టీ నేతలకు అందజేస్తామన్నారు. వామపక్ష నేతలు బాలకృష్ణ, కోన లక్షణ్, రాజాన దొరబాబు, ఆడారి అప్పారావు పాల్గొన్నారు. జాతీయ విపత్తుగా పరిగణించాలి చోడవరం: హుదూద్ తుపానును జాతీయ విపత్తుగా పరిగణించి దెబ్బతిన్న సహకార చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం ఆదుకోవాలని వామపక్షాల బృందం డిమాండ్ చేసింది. సీపీఐ,సీపీఎం, సీపీఐఎంఎల్ న్యూ డెమొక్రసీ, సీపీఎం లిబరేషన్, ఎం సీపీఐ లకు చెందిన నాయకుల బృందం గోవాడ సహకార చక్కెర కర్మాగారాన్ని బుధవారం సందర్శించింది. ఉత్తరాంధ్ర జిల్లాల ను తుపాను తీవ్రంగా నష్టపరిచినందున జాతీ య విపత్తుగా కేంద్రం పరిగణించాలని బృంద సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక వామపక్షాల నాయకులు రెడ్డిపల్లి అప్పలరాజు, మట్టారమణ, నాగిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. -
నీళ్లొదిలారు!
లోతట్టు ప్రాంతానికి తరలుతున్న జలసంపద జిల్లాలో 2,195 చిన్న నీటిపారుదల ప్రాజెక్టులున్నాయి. ఇందులో వంద ఎకరాలలోపు ప్రాజెక్టులు 1,912 కాగా, 283 ప్రాజెక్టులు వంద ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. వీటి పరిధిలో 1.28లక్షల ఎకరాలకు నీరందించే అవకాశం ఉందని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇందులో పలు చెరువులు అన్యాక్రాంతం కాగా.. మరికొన్ని ప్రాజెక్టుల్లో నీరు చేరడమే కష్టంగా మారింది. ఈ క్రమంలో సాగుకు నీరందే అవకాశం లేనప్పటికీ.. భూగర్భ జలాల పెంపులో కొంత మార్పునకు అవకాశముంది. వ్యవసాయానికి నీరందించే వాటిలో ప్రధానంగా నాలుగు ప్రాజెక్టులున్నాయి. ఇందులో కోట్పల్లి ప్రాజెక్టు పరిధిలో ఆరువేల ఎకరాలు సాగవుతుండగా, కాగ్నా, కాక్రవేణి, మల్కందాని ప్రాజెక్టుల పరిధిలో ఐదు వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఈ నాలుగు ప్రాజెక్టులను ఆధునికీకరిస్తే గరిష్టంగా 20 వేల హెక్టార్లకు సాగు నీరందించే అవకాశముందని భావించిన ప్రభుత్వం.. పనులకు అనుమతులు మంజూరు చేసింది. ఈమేరకు రూ.44.42 కోట్లు కేటాయించింది. ఎక్కడిపనులు అక్కడే.. నాలుగు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం వివిధ దశల్లో పనులకు అనుమతులిస్తూ నిధులు కేటాయించింది. అయితే ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాజెక్టు పనులు కూడా పూర్తికాలేదు. కాక్రవేణి ప్రాజెక్టు పనులను ప్రారంభించి నిధులు ఖర్చు చేసినప్పటికీ పనులు అర్ధంత రంగా నిలిచిపోయాయి. మరోవైపు జిల్లాను సస్యశ్యామలం చేసే ప్రాణాహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఇప్పటివరకు అతీగతీ లేదు. దీంతో సాగునీటి ప్రాజెక్టులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు ఇప్పటికీ నిరాశే మిగిలింది. కొత్త ప్రభుత్వమైనా దీనిపై స్పందించాల్సి ఉంది. -
చురుగ్గా ఎన్ఎస్పీ ఆధునికీకరణ
ప్రాజెక్ట్సు ఒంగోలు సీఈ వీ వీర్రాజు నూజివీడు : ఎన్ఎస్పీ మూడోజోన్ పరిధిలోని జిల్లాల్లో రెండేళ్లుగా రూ.210కోట్లతో నాగార్జునసాగర్ కాలువల ఆధునీకీకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయని ప్రాజెక్ట్సు ఒంగోలు సీఈ వి.వీర్రాజు అన్నారు. వేంపాడు, నూజివీడు మేజర్ కాలువలపై జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక ఎన్ఎస్పీ గెస్ట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు రూ.90కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయన్నారు. కాలువ కట్టల బలోపేతం, కాలువలపై ఉండే అండర్టన్నెళ్లు, వంతెనలు, ఎస్కేప్లు, లాకులు తదితర వాటిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నూజివీడు, మైలవరం బ్రాంచి కాలువలపై పలు కట్టడాలను నిర్మించాల్సిన రాణి కన్స్ట్రక్షన్ కంపెనీ పని సరిగా చేయడం లేదన్నారు. 2011లో పనిని తీసుకున్నప్పటికీ మొత్తం వర్కులో కేవలం 5శాతం పనులను మాత్రమే ఇప్పటికి పూర్తి చేశారని చెప్పారు. ఇప్పటికే ఆ కంపెనీకి నోటీసులు జారీ చేశామన్నారు. వేంపాడు మేజర్పై 40శాతం, నూజివీడు మేజర్పై 60శాతం, బాపులపాడు మేజర్పై 85శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. తిరువూరు సబ్డివిజన్లో రూ.52కోట్లకు గానూ ఇప్పటి వరకు రూ.40కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో గతంలో టేకులపల్లి సర్కిల్లో ఉన్న జిల్లాలోని ఎన్ఎస్పీ కార్యాలయాల పర్యవేక్షణను ప్రస్తుతం పులిచింతల సర్కిల్లో కలిపారని తెలిపారు. నూజివీడు సబ్డివిజన్ పరిధిలో ఉన్న 85 మైనర్ల అభివృద్ధికి రూ.40కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. -
సాగెట్లా ‘బాబూ’?
రిజర్వాయర్ల ఆధునికీకరణకు రూ.కోట్లు అవసరం బడ్జెట్లో రూ.30 లక్షలే కేటాయింపు రైతుల్లో తీవ్ర ఆగ్రహం చివరి ఆయకట్టుకూ నీరివ్వాలని డిమాండ్ వైఎస్ హయాంలో రూ.42 కోట్ల విడుదల వ్యవసాయానిక పెద్ద పీట వేస్తున్నామని గొప్పలు చెప్పిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం.. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణకు నిధుల మంజూరులో మాత్రం వివక్ష చూపింది. అసలే వర్షాలు లేక సాగు కష్టంగా మారిన తరుణంలో, కనీసం రిజర్వాయర్ల ఆధునికీకరణ జరిగితే పంటల సాగుకు ఢోకా ఉండదనుకుంటే రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. చోడవరం : జిల్లాలోని రైవాడ, పెద్దేరు, కోనాం, కల్యాణపులోవ రిజర్వాయర్ల ఆధునికీకరణ కోసం కొన్నేళ్లుగా రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ పనులు పూర్తయితే అదనంగా మరో 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వారి ఆశ. అయితే ఈ ఏడాది (2014-15) తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.లక్షకోట్ల బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు కేవలం మొక్కుబడిగా రూ.30లక్షలు మాత్రమే కేటాయించడంతో ఈ పనులు ప్రశ్నార్థకంగా మారాయి. వైఎస్ హయాంలో... 2004లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాలో రిజర్వాయర్ల ఆధునికీకరణకు ఒకే సారి రూ.42 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో చాలా మేరకు పనులు జరగడం, పెద్దేరు లాం టి పెద్ద రిజర్వాయరు పనులు పూర్తి జరిగి 15వేల ఎకరాలకు సా గునీరందివచ్చింది. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు పట్టించుకోకపోవడంతో నిధులు సరిపోక పెద్దేరు, కోనాం, కల్యాణపులోవల కాలువలు పూర్తిగా ఆధునికీకరణకు నోచలేదు. రైవాడ జలాశయం ఆధునికీకరణ పనుల్లో జాప్యం వల్ల తర్వాత నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. ఫలితంగా ఈ రిజర్వాయరు పరిధి కాలువల ఆధునికీకరణ పనులు నేటికీ పూర్తికాలేదు. ఈ పనులు చేపట్టాల్సి ఉంది: అలమండ, మేడిచర్ల, వారాడ, వేచలం, లక్కవరం , ఐదు డైవర్షన్ గేట్లు మరమ్మతులు చేయాల్సి ఉంది. కొత్తపెంట వరకు చివరి ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. ఎడమ కాలువ 15 కిలో మీటర్ల మేర లైనింగ్ పనులు జరగాల్సి ఉంది. ఈ పనులకు రూ.45 కోట్ల ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్నాయి. కోనాం రిజర్వాయరు పరిధిలో 75 చిన్నకాలువలు, అనుబంధంగా ఉన్న 250 సాగునీటి చెరువులకు గతంలో మంజూరైన రూ.3 కోట్లు విడుదల కావాల్సి ఉండగా, అదనంగా మరో రూ.5 కోట్ల వరకు నిధులు కావాల్సి ఉంది. కల్యాణపులోవ కాలువ మరమ్మతులకు రూ.10 లక్షల ప్రాతిపాదన పెట్టారు. పెద్దేరు రిజర్వాయరు ఆధునికీకరణకు రూ.21 కోట్లు వరకు ఖర్చవుతుంది. ఈ నాలుగు రిజర్వాయర్ల పనులు పూర్తయ్యి చివరి ఆయకట్టుకు నీరందాలంటే సుమారు రూ. 80 కోట్ల వరకు నిధులు కావాల్సి ఉంది. అయితే తాజా బడ్జెట్లో రైవాడకు రూ.15 లక్షలు, కోనాంకు రూ.10 లక్షలు, పెద్దేరు రిజర్వాయరుకు రూ.5 లక్షలు మాత్రమే కేటాయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నిధులు ఎందుకు పనికొస్తాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కోట్లు అవసరమైతే లక్షలు కేటాయిస్తారా? ఖరీఫ్ వర్షాలు లేక సాగుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కొత్త ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరై చివరి ఆయకట్టు వరకూ నీరందుతుందని ఆశపడ్డాం. తీరా బడ్జెట్లో చాలా ఘోరమైన కేటాయింపు చేశారు. రైతులకు మేలు చేస్తామన్న ప్రభుత్వం ప్రాజెక్టుల కేటాయింపులకు ఇంత తక్కువగా చేస్తే ఎలా?. కావలసిన నిధులు పూర్తిగా విడుదల చేస్తే సాగునీటి సమస్య కొంతైనా తీరుతుంది. -బొడ్డు వెంకటరమణ, రైవాడ జలాశయం ప్రాజెక్టు చెర్మన్ -
ములా, ముఠా నదులకు మహర్దశ
పింప్రి, న్యూస్లైన్ : ములా, ముఠా నదులకు మహర్దశ పట్టనుంది. పుణే నగరం నడిబొడ్డున మురికి కాలువలుగా మారిన ఈ నదుల ఆధునికీకరణకు పుణే కార్పొరేషన్ నడుంబిగించింది. ఇందుకోసం 715 కోట్ల రూపాయల వ్యయంతో ప్రణాళికను సిద్ధం చేసింది. మురికి నీటి కాలువలుగా పారుతున్న ఈ రెండు నదుల రూపురేఖలు మారనున్నాయి. నిధుల సమీకరణ ఇలా.. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేషనల్ రివర్ కన్జర్వేషన్ డెరైక్టరేట్ (ఎన్ఆర్సీడీ)కు నివేదించింది. ఈ ప్రణాళిక రూపుదిద్దుకోవడానికి కేంద్రం 50 శాతం నిధులు, 30 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం, 20 శాతం నిధులను పూణే కార్పొరేషన్ సమకూర్చాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వ వాటాను పుణే కార్పోరేషన్ సమకూర్చుకుంటుంది. ఈ విషయాన్ని కేంద్రానికి పంపిన నివేదికలో స్పష్టం చేసింది. 25న జాయ్కో కంపెనీ సర్వే ఈ నిధుల మంజూరుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం జపాన్కు చెందిన జాయ్కో కంపెనీకి పంపించింది. మొత్తం నిధుల్లో 85 శాతం నిధులను ఇవ్వడానికి ఆ కంపెనీ సిద్ధమైందని కార్పొరేషన్కు చెందిన అధికారి పేర్కొన్నారు. దీనికి సంబంధించి నదుల పరిసరాలను సర్వేను జరపడానికి కంపెనీకి చెందిన ఏడుగురు ప్రతినిధుల బృందం ఈ నెల 25వ తేదీన నగరానికి రానున్నారని తెలిపారు. అనంతరం నిధులను అందించే విషయంపై ఆ కంపెనీ తుది నిర్ణయం తీసుకొంటుంది. వచ్చే సంవత్సరం మార్చి నుంచి నదుల ఆధునికీకరణ పనులు జరుగనున్నాయని తెలిపారు. -
ఆధునికీకరణ అంతంతే!
సాగర్ కాలువ పనుల్లోనాణ్యత లోపాలు మరమ్మతుల దశలోనేఊడిపోతున్న సిమెంటు ఎగుడుదిగుడుగాకాలువ గోడల నిర్మాణం ఈపూరు: సాగర్ కాలువల ఆధునికీకరణ పనులు నాసిరకంగా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలోని ఊడిజర్ల 110-111 మైలురాయి వద్ద కాలువ డీప్కట్ షాట్ క్రీటింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక పైపు పనులు చేస్తుండగా మరో వైపు ప్లాస్టింగ్ ఊడిపోవడం పనుల్లో నాణ్యత లోపించడాన్ని తెలియజేస్తోంది. సాగర్ ఆధునికీకరణ పనుల్లో భాగంగా 11వ ప్యాకే జీ కింద బొమ్మరాజుపల్లి కాలువ నుంచి బొల్లాపల్లి మం డలంలోని 85 కిలోమీటరు వరకు చేపట్టే పనులకు సుమారు రూ. 40 కోట్లు కేటాయించారు. దాదాపు నెల కిందట ప్రారంభమైన ఈ పనులు నేటికీ కొనసాగుతున్నాయి. మంజూరైన నిధులతో శిధిలమైపోతున్న కాలువ కట్టల పునఃనిర్మాణం, డీఫ్కట్లలో లైనింగ్, బెడ్, కాలువకు ఇరువైపుల వాల్స్ నిర్మాణం తదితర పనులతో పాటు, కాలువల్లో సిల్ట్ తొలగింపు, యూటీ, ఎస్కేప్ల రిపేర్లు తదితర పనులు చేయాల్సి ఉంది.{పస్తుతం షాట్క్రీటింగ్ పనులు జరుగుతున్నాయి. అధికారుల పర్యవే క్షణ లేకపోవడం వల్ల పనులు నాసిరకంగా జరుగుతున్నాయని అంటున్నారు.{పధానంగా షాట్ క్రీటింగ్ పనులకు ఇసుక వాడకం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం పనులు చేయడం లేదని అంటున్నారు. కాలువ కట్టల గోడలు ఒకే లెవల్లో లేకపోవడంతో పలు చోట్ల నిర్మాణాలు ఎగుడుదిగుడుగా కనిపిస్తున్నాయి. పలు చోట్ల ఐరన్మెస్లు ఏర్పాటు చేయకుండా సిమెంటు పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అంచనా ప్రకారం జరగాల్సిన పనులు ఇష్టానుసారంగా చేయడం, పర్యవే క్షణ లోపించడం వల్ల నాణ్యత కనిపించడంలేదు.ఈపూరు మండల పరిధిలో జరుగుతున్న సాగర్ ఆధునికీకరణ పనులను క్వాలిటీ అధికారులు పరిశీలిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని అంటున్నారు.కాలువలో పూడిక తీయకుండానే షాట్ క్రీటింగ్ పనులు చేయడం పలు విమర్శలకు దారితీస్తోంది. జరుగుతున్న పనులను అధికారులు తక్షణమే పరిశీలించాలని మండల ప్రజలు కోరుతున్నారు.క్వాలిటీ అధికారులు పరిశీలిస్తున్నారు.. ఈ విషయమై ఎన్ఎస్పీ డీఈ రాజయ్యను వివరణ కోరగా, క్వాలిటీ అధికారులు పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉన్న సిబ్బంది పర్యవేక్షణ ఉంది. ఎక్కడా అవినీతి జరగడం లేదు. నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నాయి. కాలువలో కొన్ని చోట్ల తరువాత కూడా సిల్ట్ తీసే అవకాశం ఉంది. సిల్ట్ తీసిన తరువాత కొరవడిన పనులు చేస్తారని ఆయన వివరించారు. -
పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక క్లస్టర్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అవకాశాల స్వర్గంగా ఆధునిక హంగులు సొంతం చేసుకోనున్న మన జిల్లా త్వరలోవిశ్వ విపణిలో ఆధునిక నగరాల సరసన చేరనుంది. ప్రణాళికాబద్ధ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా నిలవబోతుంది. గ్లోబల్సిటీగా మలచాలనే కొత్త ప్రభుత్వం ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. షాంైఘై, చండీగఢ్ సిటీల తరహాలో పక్కా ప్రణాళికతో నగర శివార్లను అభివృద్ధిచేసే దిశగా అడుగులు వేస్తోంది. చారిత్రక నగరంగా పేరున్న హైదరాబాద్ మురికి మయంగా తయారుచేసిన గత పాలకుల నిర్వాకాలకు భిన్నంగా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ఘట్కేసర్, శామీర్పేట ప్రాంతాల్లో మధ్యస్థ విమానాశ్రయాలు, రేడియల్ రహదారులు, బల్క్డ్రగ్, ఫార్మా, ఐటీ, పారిశ్రామిక సంస్థలు నెలకొల్పేందుకు నూతన కారిడార్లు, మౌలిక వసతులు ఇలా.. అన్ని రంగాల్లో జిల్లాను అగ్రభాగాన నిలబెట్టేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మాస్టర్ ప్లాన్ ప్రాతిపదికగా అభివృద్ధిని వికేంద్రీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మార్గనిర్దేశానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం కోటి ఉన్న గ్రేటర్ హైదరాబాద్ జనాభా రానున్న ఐదేళ్లలో మూడు కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్న సర్కారు.. అందుకనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపరచడానికి కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు గ్లోబల్ కన్సల్టెన్సీల సహకారాన్ని కూడా వినియోగించుకోవాలని నిర్ణయించింది. అదే విధంగా జిల్లాలోని రెండు వేల చిన్ననీటి పారుదల చెరువుల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసింది. రీజినల్ రింగ్రోడ్డు: ప్రస్తుతం ఔటర్రింగ్ రోడ్డుకు అవతల రీజినల్ రింగ్రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానికి 60-70 కిలోమీటర్ల దూరంలో నగరాన్ని చుట్టుతూ ఈ రోడ్డు నిర్మితమవుతుంది. రెండు రింగ్రోడ్డుల మధ్య ఉన్న ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్గా మలచాలని సర్కారు యోచిస్తోంది. ఫార్మా, ఐటీ తదితర రంగాలకు ప్రత్యేక క్లస్టర్లను ప్రతిపాదించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రణాళికాబద్ధ అభివృద్ధికి పెద్దపీట వేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ పరిధి అంతటికీ ప్రత్యేక మాస్టర్ప్లాన్ను తయారు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీని ఆదేశించారు. రెండు ఎయిర్పోర్టులు: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికితోడు జిల్లాలో మరో రెండు కొత్త ఎయిర్పోర్టులు ఏర్పాటు కానున్నాయి. పట్టణీకరణ నేపథ్యంలో శివార్లు శరవేగంగా అభివృద్ది చెందుతాయని అంచనా వేసిన సర్కారు.. శామీర్పేట, ఘట్కేసర్ ప్రాంతాల్లో మధ్యతరహా ఎయిర్పోర్టులను నిర్మించాలని భావిస్తోంది. ఈ మేరకు భూసేకరణపై దృష్టి సారించింది. కనెక్టివిటీ: కొత్త పరిశ్రమల స్థాపన, నగరీకరణ ఇక పూర్తిగా ఔటర్ రింగ్రోడ్డు బయటే అవకాశమున్నందున.. ఆయా ప్రాంతాలకు సులువుగా చేరుకునేందుకు రవాణా సదుపాయాలను మెరుగు పరచనుంది. దీనికి కోసం మల్టీమోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్)ను విస్తరించాలని నిర్ణయించింది. శివారు ప్రాంతాలకు ఈ రైళ్లను పొడిగించడం ద్వారా రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. పారిశ్రామికవాడలు: పారిశ్రామిక అవసరాలకు జిల్లా యంత్రాంగం 19వేల ఎకరాలను సిద్ధం చేసింది. క్లస్టర్లుగా పరిశ్రమలను నోటిఫై చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. కొత్త సంస్థలకు కేటాయించేందుకు వీలుగా భూదాన్ యజ్జబోర్డు, సీలింగ్, యూఎల్సీ భూములతో ల్యాండ్బ్యాంకును తయారు చేస్తోంది. -
ఆధునీకరణకు రూ.490 కోట్లు
జంట కమిషనరేట్లలో మార్పులకు శ్రీకారం హైదరాబాద్: పోలీసు శాఖ ఆధునీకరణకు నడుం బిగించిన సర్కార్ రూ.490 కోట్లు ఖర్చు చేయనుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ల క్ష్యంతో ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమైంది. హైదరాబాద్, సైబరాబాద్ జంట కమిషనరేట్లకు కొత్తగా 1650 ఇన్నోవాలను, 1500 ద్విచక్ర వాహనాలను ఖరీదు చేయడంతోపాటు వాటికి జియో పొజీషన్ సిస్టం(జీపీఎస్)ను అనుసంధానం చేస్తున్నారు. సంఘటన స్థలికి 10 నిమిషాల్లోనే పోలీసులు చేరుకునేలా వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. ఇందుకు డయల్ 100లో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి పోలీసు అధికారుల సమావేశంలో ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. పోలీసు శాఖలో మార్పులకు తొలుత రూ.300 కోట్లు కేటాయించాలని భావించినా.. ఇతర మౌలిక సదుపాయాలు, అవసరాల కోసం మరో రూ.190 కోట్లు పెంచినట్టు అధికార వర్గాలు తెలిపాయి. జీపీఎస్తో అనుసంధానం కొత్తగా ఖరీదు చేయనున్న ఇన్నోవా వాహనాలలో జీపీఎస్ ఏర్పాటుతో పాటు ఘటనా స్థలంలో పరిసరాలను కెమెరాలో బంధించడానికి సీసీ కెమెరాలు, అత్యవసర చికిత్స కోసం అవసరమయ్యే మెడికల్ కిట్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు కూడా జీపీఎస్ను అనుసంధానం చేయనున్నారు. ఆ వాహనంపై గస్తీలో ఉన్న బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లకు అవసరమైన సమాచారాన్ని వెంటనే అందించడం, వారు ఎక్కడున్నారనేది కంట్రోల్ రూం నుంచి తెలుసుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం రెండు వేల మంది కానిస్టేబుళ ్లను హైదరాబాద్కు, మరో వేయి మంది కానిస్టేబుళ్లను సైబరాబాద్ కమిషనరేట్కు మంజూరు చేశారు. మరో మూడు వేల మంది డ్రైవర్ పోస్టులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్కు మూడు ద్విచక్రవాహనాలను కేటాయిస్తున్నారు. హైదరాబాద్లో శాంతి భద్రతల పరిరక్షణపై ద ృష్టి సారించిన అధికారులు విడతల వారీగా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, కరీంనగర్ రేంజ్లలో కూడా జీపీఎస్ సిస్టం, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. -
ఆధునికీకరణ పనుల్లో దగా!
లైనింగ్ పనులు పోయి రిటైనింగ్ వాల్ నిర్మాణాలు అధికారులతో కాంట్రాక్టర్ లాలూచీ రైతులకు ఉపయోగపడని పనులు చల్లపల్లి : కాంట్రాక్టర్లతో అధికారులు లాలూచిపడి ఇష్టారాజ్యంగా ఆధునికీకరణ పనులను మార్చేస్తున్నారు. రైతులకు ఉపయోగపడాల్సిన ఈ పనులు కాంట్రాక్టర్ల జేబులు నింపేవిగా మారాయి. సాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు ఆధునికీకరణ పనుల్లో భాగంగా ప్రధాన పంటకాలువలకు లైనింగ్ పనులు చేయాల్సి ఉండగా వాటిని మార్చి రైతులకు ఏవిధంగా ఉపయోగపడని రిటైనింగ్వాల్ నిర్మాణ పనులు చేపట్టడంపట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైనింగ్పోయి రిటైనింగ్ వచ్చే! రూ.2,180కోట్ల నిధులతో కృష్ణాజిల్లాలో డెల్టాను ఆధునికీకరించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 జూన్ 6న మోపిదేవి వార్పు వద్ద ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. మట్టిపని, లైనింగ్ చేయడం, వంతెనల నిర్మాణం, ఓటీలు, రెగ్యులేటర్లు, క్యాటిల్ ర్యాంపులు, మేజరు, మీడియం డ్రెయిన్ల పూర్తిస్థాయి ఆధునికీకరణ వంటి 25ప్యాకేజీల ద్వారా పనులు చేపట్టాల్సి ఉంది. శంకుస్థాపన నాటి నుంచి 51నెలల్లో పనులు పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఈ పనులు నత్తనడకన సాగాయి. పంటకాలువలకు లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. నాలుగు అంగుళాలలోపు మాత్రమే లైనింగ్ పనులకు ప్రభుత్వం అనుమతివ్వడంతో ఈ ప్రాంతంలో ఉన్న నల్లరేగడి నేలలో ఈ పనులు చేపడితే పగిలిపోతాయన్న ఉద్దేశంతో వీటిని రిటైనింగ్వాల్కు మార్చినట్లు అధికారులు చెబుతున్నారు. లైనింగ్ పనులు చేపడితే సాగునీరు వృథాకాకుండా పంటపొలాలకు సక్రమంగా నీరందుతుంది. కోడూరు మండలం దింటిమెరక నుంచి ఊటగుండం వరకు, మచిలీపట్నం మండలంలోని 9/7వ నంబరు కాలువలో పెదయాదర నుంచి పల్లెతుమ్మలపాలెం వరకు లైనింగ్ పనులు చేయాల్సి ఉండగా వాటిని మార్చి రిటైనింగ్వాల్ నిర్మాణ పనులు చేపట్టడంపట్ల ఈ ప్రాంత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైనింగ్ పనులు చేయాల్సిన రూ.40కోట్ల నిధులతో ప్రస్తుతం అవనిగడ్డ మండలంలోని పులిగడ్డ నుంచి అవనిగడ్డ వరకు, అవనిగడ్డ నుంచి కొత్తపేట వరకు, బందలాయిచెర్వు నుంచి గుడివాకవారిపాలెం వరకు రిటైనింగ్వాల్ నిర్మాణ పనులు చేస్తున్నారు. వీటి వల్ల తమకు ఎలాంటి ఉపయోగం ఉండదని రైతులంటున్నారు. రైతుల ప్రయోజనం కోసం రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం నేడు కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు ఉపయోగపడుతుందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. కోడూరు మండలం దింటిమెరక నుంచి ఊటగుండం వరకు 14, 14బీ కాలువకు 8కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉండగా రెండేళ్ల క్రితం దింటిమెరక మొదట్లో రెండు కిలోమీటర్లు లైనింగ్ పనులుచేసి తర్వాత రెండు కిలోమీటర్లు వదిలేశారు. దీని తర్వాత రామకృష్ణాపురంలో 14వ నెంబరు బీ కాలువలో మొదట్లో రెండు కిలోమీటర్లు లైనింగ్ పనులుచేసి తర్వాత రెండు కిలోమీటర్లు వదిలేశారు. ఇలా పూర్తిస్థాయిలో లైనింగ్ పనులు చేయకపోవడం వల్ల ఈ ప్రాంత పంటపొలాలకు సాగునీరు అందకపోవడంతో గతంలో రైతులు పలుసార్లు ఆందోళన చేశారు. గతంలో ఈ ప్రాంత రైతులు ఆందోళన చేసినప్పుడు అప్పటి కలెక్టర్ పీయూష్కుమార్ త్వరితగతిన లైనింగ్ పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ రెండేళ్ల నుంచి ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు. మేటవేసిన పంట కాలువలు ... ఆధునికీకరణలో భాగంగా తొలుత లైనింగ్ పనులు చేస్తామని చెప్పి తర్వాత వీటిని రిటైనింగ్వాల్గా మార్చటం వల్ల రైతులకు భవిష్యత్తులో సాగునీటి ఇబ్బందులు తప్పెటట్లు లేవు. పంటకాలువలు మట్టి మేటవేసి పూడుకుపోయాయి. ఈ విషయమై ఇరిగేషన్ డీఈ భానుబాబును వివరణ కోరగా నాలుగు అంగుళాలోపు మాత్రమే లైనింగ్ పనులకు అనుమతులివ్వడం వల్ల నల్లమట్టికి ఇవి అనుకూలంగా లేకపోవడంతో ఈ నిధులను రిటైనింగ్వాల్కు మార్చినట్లు చెప్పారు. దింటిమెరక, రామకృష్ణాపురంలో మిగిలిపోయిన లైనింగ్ పనులు ఈ ఏడాది చేపట్టలేమని తెలిపారు. -
ఆధునికీకరించిన ఎస్బీఐ కలెక్టరేట్ శాఖ ప్రారంభం
ఒంగోలు ఒన్టౌన్, న్యూస్లైన్ : స్థానిక ప్రకాశం భవనంలో ఆధునికీకరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కలెక్టరేట్ శాఖను కలెక్టర్ విజయకుమార్ శుక్రవారం ప్రారంభించారు. 2009లో ఎస్బీఐ ఎక్స్టెన్షన్ కౌంటర్గా ప్రారంభమై ప్రస్తుతం పూర్తిస్థాయి బ్యాంకు శాఖగా రూపుదిద్దుకోవడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రారంభంలో ఒకే గదిలో ఇరుకుగా ఉన్న ఎక్స్టెన్షన్ కౌంటర్ను ప్రస్తుతం పూర్తిస్థాయి బ్యాంకు శాఖగా స్థాయిపెంచి భవనాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. సెంట్రల్ ఏసీ సౌకర్యం కూడా కల్పించారు. బ్యాంకు శాఖను ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకులో డిపాజిట్లు సేకరించడంతో పాటు బంగారం తాకట్టుపై రుణాలు కూడా ఇస్తారన్నారు. వ్యక్తిగత రుణాలు కూడా పొందవచ్చని, ప్రభుత్వ చలానాల చెల్లింపులన్నీ ఈ బ్యాంకు శాఖ నుంచే జరుగుతున్నాయని వెల్లడించారు. బ్యాంకు సేవలను ప్రకాశం భవనంలోని ఉద్యోగులతో పాటు పరిసరాల్లోని ప్రజలు కూడా వినియోగించుకోవాలని సూచించారు. బ్యాంకు శాఖకు అనుబంధంగా రెండు ఏటీఎంలు, ఒక క్యాష్ డిపాజిట్ మిషన్ (సీడీఎం) ఏర్పాటు చేసేందుకు కలెక్టరేట్ కాంప్లెక్స్లో స్థలాన్ని సమకూర్చేందుకు కలెక్టర్ హామీ ఇచ్చారు. త్వరలో 11 ఏటీఎంలు... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు శాఖలకు అనుబంధంగా త్వరలో 11 ఏటీఎంలు ప్రారంభించనున్నట్లు ఆ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజుక్తారాయ్గురు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి బ్యాంకు శాఖ ఆవరణలో ఏటీఎం ఏర్పాటు చేయాలన్నారు. అక్కడ స్థలం సరిపోకపోతే కనీసం 500 మీటర్లలోపు ఏటీఎంను ఏర్పాటు చేయాలన్నారు. కొత్త ఏటీఎంలలో క్యాష్ డిపాజిట్ మిషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కందుకూరు, కనిగిరి, కంభం, ఒంగోలు అంజయ్యరోడ్డు, కలెక్టరేట్ శాఖల వారీగా 6 ఏటీఎంలు, 5 క్యాష్ డిపాజిట్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఖాతాదారులకు 24 గంటల పాటు నగదు లావాదేవీలు, డిపాజిట్లు, విత్డ్రాలకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఒంగోలు కలెక్టరేట్ కాంప్లెక్స్లో ఏటీఎంలు, సీడీఎంల ఏర్పాటుకు స్థలం సమకూర్చాలని కలెక్టర్ను కోరారు. కలెక్టరేట్ బ్యాంకు శాఖను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన ఆ శాఖ మేనేజర్ రాంబాబును డీజీఎంతో బ్యాంకు రీజినల్ మేనేజర్ కేఎస్ఆర్ మూర్తి, కలెక్టర్ అభినందించారు. వ్యక్తిగత రుణాలివ్వాలి... కలెక్టరేట్ శాఖలో ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలివ్వాలని ఎన్జీవో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా అధ్యక్షులు నాసర్ మస్తాన్వలి, మాలకొండయ్యలు ఆ బ్యాంకు డీజీఎం, ఆర్ఎంలను కోరారు. రుణాల మంజూరుకు అదనపు సిబ్బందిని నియమించాలని వారు విజ్ఞప్తి చేశారు. రుణాలిచ్చేందుకు డీజీఎం, ఆర్ఎంలు అంగీకరించారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో ఎస్.మురళి, వెలిగొండ స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు, జేడీఏ దొరసాని, బ్యాంకు ఆఫీసర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కె.కిశోర్కుమార్, కె.కృష్ణ, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఈ చానల్ ఇంతేనా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరు చానల్ ఆధునికీకరణ ప్రయత్నాలు అంచనాల గడపదాటడం లేదు. ఈ చానల్ ఆధునికీకరణ ప్రాధాన్యతను గుర్తించి సాగునీటి శాఖ ఇంజినీర్లు లైన్ ఎస్టిమేట్లు రూపొందించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపినా, ఫైల్ ముందుకు నడవడం లేదు. నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఉన్నతాధికారులు కాలయాపన చేస్తున్నారు. 1972లో ఏర్పాటైన ఈ చానల్కు అప్పటి నుంచి సాంవత్సరిక మరమ్మతులకు మాత్రమే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నది. ప్రత్యేక మరమ్మతులు చేయకపోవటం, డెల్టా ఆధునికీకరణలో దీనిని చేర్చకపోవడంతో రెగ్యులేటర్లు, ఇతర ముఖ్య కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ కాలువకు 40 సంవత్సరాల నుంచి పూర్తిస్థాయి మరమ్మతులు జరగలేదు. కాలువ పుట్టు పూర్వోత్తరాలు కృష్ణానదికి అనుసంధానంగా ఉండవల్లి అవుట్ఫాల్ స్లూయీస్ నుంచి 47 కిలోమీటర్ల నిడివిలో గుంటూరు చానల్ విస్తరించింది. 27 వేల ఎకరాల ఆయకట్టు, 38 చెరువులు, 10 ఎత్తిపోతల పథకాలకు నీటి సరఫరా అవుతోంది. తాడేపల్లి,మంగళగిరి, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. 1967లో ఈ కాలువ నిర్మాణ పనులు ప్రారంభమై 1972లో వినియోగంలోకి వచ్చింది. {పజల తాగునీటి అవసరాలతో ముడిపడి ఉండటంతో వేసవిలోనూ ఈ కాలువకు సాగునీటి సరఫరా కొనసాగుతోంది. దీని కారణంగా మరమ్మతులు చేసే అవకాశాలు లేక తూడు, గుర్రపుడెక్క పేరుకుపోయి నీటి ప్రవాహ వేగం తగ్గింది. నిర్మించి ఇప్పటికి 40 సంవత్సరాలు పూర్తికావడంతో అనేక కట్టడాలు, స్లూయీస్లు, రెగ్యులేటర్లు పూర్తిగా శిథిలమయ్యాయి. నాలుగేళ్ల క్రితమే ప్రారంభమైన ప్రయత్నాలు కాలువ దుస్థితిపై రైతుల నుంచి అనేక విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం 18.08.10 నుంచి ఆధునికీకరణకు పయత్నాలు ప్రారంభించింది. అంచనా మొత్తం రూ.127 కోట్లు కాలువ అడుగు భాగంతోపాటు సైడ్ వాల్స్ను పూర్తిగా సిమెంట్ లైనింగ్ చేసేందుకు అంచనా. వీటితోపాటు రెగ్యులేటర్లు, స్లూయీస్ల నిర్మాణానికి అంచనాలు తయారు చేశారు. స్పందించని ఉన్నతాధికారులు.. కాలువ మరమ్మతుల ఆవశ్యకతను గుర్తిం చిన జిల్లా అధికారులు లైన్ ఎస్టిమేట్లు చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. అయితే వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇక్కడి రైతుల్ని సంతృప్తిపరచడానికి నెల రోజుల క్రితం చీఫ్ ఇంజినీరు కార్యాలయం నుంచి నరేంద్రగౌడ్ అనే ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు గుంటూరు చానల్ను పరిశీలించారు. అయితే ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. ఇప్పటి పరిస్థితులను పరిశీలిస్తే అంచనాల ఆమోదం, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్, టెండర్ల దశలు దాటాలంటే కనీసం రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని ఆ శాఖ ఇంజినీర్లు చెబుతున్నార -
ఆధునికీకరణ జాప్యం.. అన్నదాతకు శాపం!
నత్తనడకన డ్రెడ్జింగ్ పనులు మరో రెండేళ్లు పొడిగించాలని కాంట్రాక్టర్ల వినతి రైతుల్లో ఆందోళన మచిలీపట్నం, న్యూస్లైన్ : అష్టకష్టాలు పడి సాగుచేసిన పంట చేతికందే సమయంలో రైతులను నట్టేట‘ముంచి’ నష్టాల నావ ఎక్కిస్తున్న డ్రెయిన్ల తవ్వకాలు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ల క్రితమే టెండర్లు పూర్తయినా ఇంకా కొన్ని పనులను ప్రారంభించకపోగా... ప్రారంభించిన పనులను డెల్టా ఆధునికీకరణ ముసుగులో కాంట్రాక్టర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సముద్ర తీరంలోని మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి, బందరు. మోపిదేవి తదితర మండలాల పరిధిలోని లక్ష ఎకరాల్లోని మురుగునీటిని సముద్రంలో కలిపే గుండేరు డ్రెయిన్ 44 కిలోమీటర్ల పొడవు ంది. ఈ డ్రెయిన్కు 0నుంచి 16 వ కిలో మీటరు వరకు డ్రెడ్జింగ్ ద్వారా పూడిక తీయాలని నిర్ణయించారు. మూడేళ్ల క్రితం ఈ పనులకు టెండర్లు పిలిచారు. రూ. 20 కోట్ల అంచనాలతో టెండర్లు పిలవగా రూ.18 కోట్లకు పనులను కాంట్రాక్టరు దక్కించుకున్నారు. టెండర్లు పూర్తయిన మూడేళ్ల వ్యవధిలో పూడికతీత పనులు పూర్తిచేయాలనే నిబంధన ఉంది. అయితే రెండేళ్లుగా కాంట్రాక్టర్ పనులే ప్రారంభించలేదు. పదిరోజుల క్రితం గుండేరు డ్రెయిన్ 0.0 కిలోమీటరు వద్ద డ్రెడ్జింగ్పనులను ప్రారంభించారు. ఈ పది రోజుల వ్యవధిలో డ్రెయిన్కు ఒకవైపున కిలోమీటరు మేర డ్రెడ్జింగ్ చేశారని డ్రెయినేజీ అధికారులు చెబుతున్నారు. రెండు సంవత్సరాలుగా పనులు చేయని కాంట్రాక్టర్ గడచిన రెండేళ్ల కాలపరిమితిని ఇప్పటినుంచి పొడిగించాలని కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాయడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రసాయనాల పిచికారీకి బ్రేక్.... గతంలో వేసవి కాలంలో డ్రెయిన్లలో పేరుకుపోయిన తూడు, గుర్రపుడెక్క, నాచులను తొలగించేందుకు రసాయనాలు పిచికారీ చేసేవారు. గత రెండు సంవత్పరాలుగా రసాయనాల పిచికారీని నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో సాగునీటి సంఘాల ద్వారా డ్రెయిన్లలో రసాయనాల పిచికారీ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. సాగునీటి సంఘాల పదవీ కాలం రెండేళ్ల క్రితమే ముగియడంతో డ్రెయిన్ల ఆలనాపాలనా పట్టించుకునేవారే కరువయ్యారు. దీనికి తోడు డ్రె యిన్ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేసిన ఏడాది కాలం వరకు డ్రెయిన్లలో తూడు, గుర్రపుడెక్క, నాచులను వారే తొలగించాలనే నిబంధన ఉంది. కాంట్రాక్టర్ పనులు చేయక, డ్రెయినేజీ అధికారులు పట్టించుకోకపోవడంతో మేజర్, మైనర్ డ్రెయిన్లలో పూడికతీత పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్లో కోలుకోలేని దెబ్బ ... జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పంట చేతికొచ్చే సమయానికి హెలెన్, లెహర్ తుపానులు సంభవించాయి. ప్రధాన డ్రెయిన్లతోపాటు మైనర్ డ్రెయిన్లు పూడుకుపోవడంతో చేతికొచ్చేదశలో వరి పంట దాదాపు 2 లక్షల ఎకరాల్లో దెబ్బతింది. రోజుల తరబడి పంట నీటిలోనే నాని పోవడంతో గత ఖరీప్సీజన్లో జిల్లా రైతులు దాదాపు రూ.200 కోట్ల పంటలను కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంత నష్టం జరుగుతున్నా డ్రెయినేజీ అధికారులు కాంట్రాక్టర్లతో పనులు చేయించేందుకు చొరవ చూపకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుండేరు డ్రెయిన్ పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన డ్రెయిన్లలోనూ పూడికతీత పనులు ఆశించినమేర జరగడం లేదని రైతులు చెబుతున్నారు. గూడూరు. బందరు మండలాల్లోని పలుగ్రామాల ఆయక ట్టునుంచి మురుగునీటిని సముద్రంలో కలిపే శివగంగ డ్రెయిన్ మొత్తం 11.50 కిలోమీటర్ల పొడవు ఉంది. రూ.1.59 కోట్ల అంచనాలతో 0.0 నుంచి 6.0 కిలో మీటర్ల వరకు డ్రెడ్జింగ్ ద్వారా మిగిలిన డ్రెయిన్ లో యంత్రాల ద్వారా పూడిక తీశారు. అయితే ఈడ్రెయిన్ గట్లను బలోపేతం చేయకుండా ఎక్కడి మట్టిని అక్కడే వదిలేశారు. దీంతో రైతుల అగచాట్లు అన్నీ, ఇన్నీ కాకుండా పోయాయి. -
ఆస్పత్రి ఆధునికీకరణకు రూ. 23 కోట్లు
భద్రాచలం, న్యూస్లైన్: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆధునికీకరణకు ప్రభుత్వం రూ. 23 కోట్ల నాబార్డు నిధులు విడుదల చేసిందని ఐటీడీఏ పీఓ వీరపాండియన్ అన్నారు. గురువారం ఏరియా ఆస్పత్రిని సందర్శించిన ఆయన భవన నిర్మాణాలు చేపట్టాల్సిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ నాబార్డు నిధులతో భవన నిర్మాణాలతో పాటు ఆహ్లాదాన్నిచ్చే మొక్కలు నాటాలని, ఆస్పత్రిని సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు. లే-అవుట్ ఫిక్షేషన్లో నూతన భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణ అందంగా తీర్చిదిద్దేందుకు లాన్గ్రాస్, కూర్చునేందుకు బల్లాలు, అందమైన మొక్కలు ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు ఉండాలని హార్టీకల్చర్ అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్ కోసం షెడ్లు, స్టోర్రూంలు ఉండేలా, ఆస్పత్రిలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణంతో పాటు ముఖ్యమైన మౌళిక సదుపాయాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట అదనపు జిల్లా వైద్యాధికారి పి పుల్లయ్య, ఏపీఓ అగ్రికల్చర్ వై నారాయణరావు, టీఏ బీవీవీ గోపాలరావు, యుగంధర్, శ్రీనాధ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
త్వరలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ
సాక్షి, ముంబై: నగరంలో నిరంతరం ప్రయాణికులతో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేసే దిశగా రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నాయి. ఈ రద్దీ రైల్వే స్టేషన్లను ఆధునీకీకరణ పనులు చేపట్టేందుకు ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ (ఎంఆర్వీసీ) ఆలోచిస్తోంది. తొలి విడతగా దాదర్, కుర్లా, బోరివలి రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు. తరువాతి దశలో అంధేరి, కళ్యాణ్, ఠాణే స్టేషన్లలో కూడా పనలు చేపడతారు. కార్పొరేషన్ ఈ ప్రతిపాదనలపై త్వరలోనే రైల్వే సీనియర్ అధికారులతో చర్చించనుంది. రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేపట్టే విషయంలో రాష్ట్రప్రభుత్వం, రైల్వే శాఖ కూడా ఆసక్తి చూపుతున్నాయని అధికారి ఒకరు వెల్లడించారు. ఈ అభివృద్ధి పనుల నిర్వహణకు ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు సేకరించనున్నట్ల ఎంఆర్వీసీ మేనేజింగ్ డెరైక్టర్ రాకేష్ సక్సేనా తెలిపారు. ఠాణేలో ఏర్పాటు చేసిన ఎస్కలేటర్కు వచ్చే స్పందనను పరిగణనలోకి తీసుకొని ప్రతి ప్లాట్ఫాంపై ఎస్కలేటర్లను ఏర్పాటు చేయడానికి ఎంఆర్వీసీ ఆలోచిస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్లలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి, రైలు దిగిన ప్రయాణికులు నేరుగా రైల్వే స్టేషన్ బయట బస్టాండ్, ఆటో స్టాండ్ వరకు వెళ్లే విధంగా వీలు కల్పించనున్నట్లు రాకేష్ సక్సేనా తెలిపారు. ప్లాట్ఫాంలను కేవలం ప్రయాణికుల వరకు పరిమితం చేయాలని ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. ఫుడ్ స్టాల్స్, టికెట్ కౌంటర్లు, కార్యాలయాలు, బుక్ స్టాల్స్, మరుగుదొడ్లు తదితరాలను మరో చోటికి మార్చనున్నట్లు వివరించారు. ప్లాట్ఫాం పైన డెక్ నిర్మించి దానిపైకి ఈ స్టాల్స్ను తరలించనున్నట్లు ఆయనన్నారు. అయితే ఈ రైల్వే స్టేషన్లలో రోజురోజుకు రద్దీ పెరిగి పోతుండడంతో ప్లాట్ఫాంలపై ఎలాంటి స్టాల్స్ను ఏర్పాటు చేయకుండా కేవలం ప్రయాణికులకే పరిమితం చేయడంతో ప్రయాణికులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందనీ భావిస్తున్నామన్నారు. ఈవిధంగా అయితే ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా వేగంగా రాకపోకలు జరిపే అవకాశం ఉంటుందని వివరించారు. పెరుగుతున్న రద్దీతో ఇప్పటికే నగరంలోని రైల్వే స్టేషన్లు ఇరుకుగా మారాయి. దీని వలన స్థలాభావం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు నగరంలోని రైల్వే స్టేషన్లలో ఎక్కువ భాగం వంద సంవత్సరాల పురాతనమైనవి. వీటి ఆధునీకరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆయా స్టేషన్లను బట్టి వాటికి తగిన నమూనాలను రూపొందించి ఆధునీకరిస్తామని ఎంఆర్వీసీ అధికారి పేర్కొన్నారు.