muthireddy yadagiri reddy
-
ఘన్పూర్లో రాజయ్యకు, జనగాంలో ముత్తిరెడ్డికి నో టికెట్స్
-
ఇద్దరు కలిసిపాయిండ్రు
-
జనగామ బీఆర్ఎస్ లో టికెట్ జగడానికి తెరపడినట్లేనా..?
-
పల్లా, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య కుదిరిన సయోధ్య..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని హీటెక్కించిన జనగామ జగడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెక్ పెట్టారు. పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చారు. మినిస్టర్స్ క్వార్టర్స్లో జనగామ ప్రజాప్రతినిధులు, పల్లా రాజేశ్వర్రెడ్డి, ముత్తిరెడ్డి లతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డిని గెలిపించుకోవాలని కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ భేటీలో మరో ఇద్దరు టికెట్ ఆశావహులు మండల శ్రీరాములు మరో ఆశావాహి కిరణ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అయితే, తెలంగాణ ఆర్టీసీ సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినా.. జనగామలో బీఆర్ఎస్ తరపున బరిలో తానే ఉంటానంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. మరోవైపు, జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్న తరుణంలో పల్లాను గెలిపించుకోవాలంటూ.. ఈ రోజు జరిగిన భేటీలో కేటీఆరే స్వయంగా చెప్పారు. ఆగస్టు 21న 115 మంది అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని పెండింగ్లో పెట్టారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టీఎస్ఆర్టీసీ చైర్మెన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టింది. పల్లాకు లైన్ క్లీయర్ చేసేందుకే ముత్తిరెడ్డికి ఆ పదవిని ఇచ్చినట్లు సమాచారం. చదవండి: ఎమ్మెల్సీకి లైన్ క్లియర్ అయినట్టేనా? ‘పల్లా’ కేనా..!? -
జనగామ బరిలో నేనే ఉంటా
జనగామ: తెలంగాణ ఆర్టీసీ సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినా.. జనగామలో బీఆర్ఎస్ తరపున బరిలో తానే ఉంటానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం టీఎస్ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడానికి కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి హైదరాబాద్ వెళ్లిన ముత్తిరెడ్డి.. కార్యక్రమం అనంతరం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని, ఆ మేరకే ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు. అంతకుముందు ఆయన హైదరాబాద్లోని బస్భవన్లో ఆర్టీసీ చైర్మన్గా బాధ్య త లు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి దేవుళ్ల చిత్రపటాల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఫైల్పై తొలి సంతకం చేశారు. సీఎం కేసీఆర్ తనపై నమ్మకం ఉంచి అప్పగించిన ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంస్థ పురోగతికి కృషి చేస్తానన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఎండీగా ఉంటూ సంస్థను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారని, తాను కూడా సంస్థ ఉద్యోగుల్లో ఒకడిగా వ్యవహరిస్తూ సంస్థ బాగుకు యత్నిస్తానని తెలిపారు. అనంతరం ఎండీ సజ్జనార్ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి అభినందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవుల వల..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను, ఓ కార్పొరేషన్కు వైస్ చైర్మన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యకు కీలక పదవులు లభించాయి. వీరితో పాటు ఇటీవల పారీ్టలో చేరిన ఉప్పల వెంకటేశ్ గుప్తా, నందికంటి శ్రీధర్కు కూడా అధికారిక పదవులు దక్కాయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆరీ్టసీ) చైర్మన్గా, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య రైతుబంధు సమితి చైర్మన్గా నియమితులయ్యారు. ఇక ఉప్పల వెంకటేశ్ గుప్తా (కల్వకుర్తి)ను మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా, నందికంటి శ్రీధర్ (మల్కాజిగిరి)ను ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. రాజీ ఫార్ములాలో భాగంగానే..! బీఆర్ఎస్ టికెట్లు దక్కని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యకు రాజీ ఫార్ములాలో భాగంగా ఈ పదవులు దక్కాయి. జనగామలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, స్టేషన్ ఘనపూర్లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మల్కాజిగిరి కాంగ్రెస్ టికెట్ ఆశించిన నందికంటి శ్రీధర్ నాలుగు రోజుల క్రితమే బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు టికెట్ ఇచ్చినా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో..ఆ పార్టీకి చెందిన నందికంటి శ్రీధర్ను బీఆర్ఎస్లోకి ఆహ్వానించి తాజాగా ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. మరోవైపు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడిన నేపథ్యంలో అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా ఉప్పల వెంకటేశ్కు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ పదవి అప్పగించారు. చదవండి: సిక్కిం వరదల్లో నిజామాబాద్ ఆర్మీ జవాన్ మృతి -
వర్గాల పేర్లతో క్యాడర్ ను విభజిస్తున్నారు: ముత్తిరెడ్డి
-
మార్పు కోసం ఒప్పించక తప్పదు: పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, జనగామ: తెలంగాణ ఎన్నికలకు సన్నాహాకాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వేళ.. రాజకీయ పరిణామాలు వేగం పుంజుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధికారికంగా జాబితా ప్రకటించేసింది. కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ప్రకటనను వీలైనంత త్వరగా ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి పెండింగ్లో ఉన్న స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో.. పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారి తీసింది. జనగాం అసెంబ్లీ టికెట్ పల్లా రాజేశ్వరరెడ్డికి దక్కుతుందనే ప్రచారం బలంగా సాగుతున్నవేళ.. ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ముత్తిరెడ్డి మద్దతు, కేసీఆర్ ఆశీర్వాదంతో జనగాంలో జెండా ఎగరవేద్దామని ట్వీట్ చేశారు. ‘‘ఎక్కడైనా మార్పు జరగాలనుకున్నప్పుడు ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలను ఒప్పించి ముందుకు సాగాలన్నారు. స్టేషన్ ఘనపూర్లోను ఎమ్మెల్యే రాజయ్యను మార్చి కడియం శ్రీహరికి ఇచ్చారని, దీంతో తాము రాజయ్యను కలిసి మాట్లాడామన్నారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ను కచ్చితంగా గెలిపించుకోవాలన్నారు. జనగామలోను ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పదేళ్లుగా బాగా పని చేశారన్నారు. ఆయన ఉద్యమంలో కూడా ఉన్నారని గుర్తు చేశారు. అయితే కొన్ని ఇబ్బందులవల్ల జనగామలో మనం(BRS) ఓడిపోయే అవకాశం ఇవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం కేసీఆర్కు ముత్తిరెడ్డి అంటే గౌరవం ఉందన్నారు. ముత్తిరెడ్డిని పిలిపించి మాట్లాడుతారని, అందరం ఏకతాటిపై వెళ్దామన్నారు. తాను కేసీఆర్, ముత్తిరెడ్డిల ఆశీర్వాదం తీసుకున్నానన్నారు. రేపు ఎన్నికల్లో కేసీఆర్ ఆశీర్వాదంతో పాటు మంత్రులు, ముత్తిరెడ్డి సహా అందరం కలిసికట్టుగా ముందుకు సాగి జనగామలో బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. రేపో ఎల్లుండో కేసీఆర్ టిక్కెట్ ప్రకటించాక అందరం కలిసి వెళ్దామన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ముత్తిరెడ్డి గారి మద్దతు, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో జనగాంలో గులాబీ జెండా ఎగరేద్దాం. pic.twitter.com/Y1eRUr9jDC — Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS) September 23, 2023 పార్టీకి, కేసీఆర్ గారికి గెలుపోవటములే గీటురాయి.. ఎవరూ దగ్గర, దూరం కాదు. pic.twitter.com/bXmzDHSitA — Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS) September 23, 2023 కేసీఆర్ గారు అప్పగించిన ప్రతి పనిని బాధ్యతగా సక్రమంగా నిర్వహించడం జరిగింది. pic.twitter.com/DBBQ1tQiKR — Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS) September 23, 2023 -
పల్లాకు డబ్బు మదం ఎక్కువైంది: ముత్తిరెడ్డి
సాక్షి, చేర్యాల(సిద్దిపేట): బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పల్లా రాజేశ్వర్రెడ్డికి డబ్బు మదం ఎక్కువైందని, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ పార్టీని మలినం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది అధర్మం, సీఎం సంకల్పానికి విరుద్ధమని ముత్తిరెడ్డి ఆరోపించారు. ఆయన సిద్దిపేట జిల్లా చేర్యాలలో విలేకరులతో మాట్లాడారు. ఇక్కడి ప్రజాప్రతినిధులకు ఫోన్లుచేస్తూ డబ్బులు పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన వారిని ‘కుక్కలు’అనడం పల్లా అహంకారానికి నిదర్శనమన్నారు. నాకే నర్సాపూర్ టికెట్ ఇవ్వాలి.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని, తనకు నర్సాపూర్ టికెట్ కావాలని సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏ ఆలోచనతో నర్సాపూర్ టికెట్ ప్రకటించకుండా ఆపారో తెలియదని, పునరాలోచించి తనకే ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్లో పదవులు అనుభవించి బీఆర్ఎస్లో చేరారని, ఇక్కడ కేబినెట్ కేడర్ హోదాలో ఉన్నారని పరోక్షంగా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి అన్నారు. తనకు మంత్రి హరీశ్రావు అండదండలు ఉన్నాయన్నారు. టికెట్ ఇవ్వకుంటే ఏం చేస్తారని విలేకరులు అడగ్గా.. టికెట్ తనకే వస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. చదవండి: Thummala: తుమ్మల చేజారిపోకుండా.. టికెట్ ఇవ్వకుంటే రాజకీయ సన్యాసం సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఈసారి తనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు. ఆయన సోమవారం మహబూబాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా మహబూబాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని, ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇంత బలం ఉన్న తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ఒక వేళ ఇవ్వకపోతే ఖద్దరు బట్టలు కాకుండా.. ఎర్రటి వస్త్రాలు ధరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తానని వెల్లడించారు. -
పల్లాపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
సాక్షి, జనగామ: జనగామ బీఆర్ఎస్ ఆధిపత్య పోరు మరింత రాజుకుంటోంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తాజా వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణ చెప్పాలని పల్లాను డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు, ఇన్ బ్యాలెన్స్ ఉండేందుకు. అందుకే ఆహ్వానించారే తప్ప కుక్కల్ని చేయడానికి కాదని విషయాన్ని గమనించాలి. పల్లా తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. తప్పు జరిగిందని క్షమాపణ చెప్పాలి అని ముత్తిరెడ్డి డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పల్లా రాజేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చారు. ‘ బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుక్కలు. అటువైపు ఉంటే మొరుగుతారనే బీఆర్ఎస్లో చేర్చుకొని దొడ్లో కట్టేశారు. అటువైపు ఉన్న కుక్కలను ఇటు తీసుకుని.. వారిని పిల్లిలాగా కేసీఆర్ మార్చేశారు. అలా కేసీఆర్ వారిని గీత దాటకుండా చేసేశారు’ అని వ్యాఖ్యానించారు పల్లా. ముత్తిరెడ్డి ఆగ్రహం.. పల్లా వ్యాఖ్యలపై ముత్తిరెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘బలుపెక్కువై డబ్బు ఎక్కువ ఉన్నవారు అమాయక ప్రజల మీద డబ్బులు చల్లి అయోమయానికి గురి చేస్తున్నారు. అలా చేయడం సీఎం కేసీఆర్ సంకల్పానికి విరుద్ధం. అమ్ముడుపోయేవారు ఆగమై మట్లే కలిసిపోతారు. కేసీఆర్ నిర్ణయం శిరోధార్యం. కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే అందరం కలిసే ప్రయాణం చేస్తాం. ప్రజల అభిమానాన్ని కోరికను కేసీఆర్ తీరుస్తాడు. ముఖ్యమంత్రి పై నాకు పూర్తి విశ్వాసం ఉంది. 14ఏళ్లుగా మీ కష్టాలు మీ జ్ఞాపకాలు కేసీఆర్ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి సీఎం కోరిక తీరుస్తాడు. సముచిత నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. భారీ మెజార్టీతో గెలుస్తాం’’ అని ముత్తిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చైర్పర్సన్ ప్రసంగానికి అంతరాయం దివ్యాంగుల ఆసరా పెంపు కార్యక్రమంలో ఇవాళ ముత్తిరెడ్డి పల్లాపై మండిపడ్డారు. అయితే.. ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ జమున మాట్లాడారు. ముత్తిరెడ్డి కూడా తన బాధను చెప్పుకున్నారని, ఎవరికీ టికెట్ ఇచ్చిన పని చేయాలని ప్రసంగించారు. ఆ సమయంలో కార్యకర్తలు చైర్పర్సన్ ప్రసంగానికి అడ్డుతలిగారు. ముత్తిరెడ్డి కి అనుకూలంగా నినాదాలు చేయడంతో ఆ కార్యక్రమం గందరగోళంగా మారింది. దీంతో ముత్తిరెడ్డి జోక్యం చేసుకునితన అనుచరుల్ని శాంతింపజేశారు. మరోవైపు జనగామ అభ్యర్థిని త్వరగా ఖరారు చేసి ఉత్కంఠకు తెరదించాలని ముత్తిరెడ్డి వర్గం బీఆర్ఎస్ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తోంది. -
జనగామపై వీడని పీటముడి!
సాక్షిప్రతినిధి, వరంగల్: జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేదానిపై పీటముడి ఇంకా వీడలేదు. ఉమ్మడి వరంగల్లో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ ఒక్క స్థానంపై కమిటీ మరోసారి సమావేశమై 25న నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దీంతో జనగామ నుంచి బరిలో నిలిచే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థిత్వం ఖరారుపై గడువు పెరిగిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలు ఎవరికి వారుగా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. వాస్తవానికి ఉమ్మడి వరంగల్లో స్టేషన్ఘన్పూర్, జనగామ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. స్టేషన్ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరి పేరు వినిపించగా.. జనగామకు ఏడాదిన్నరగా పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి పేరే వినిపించింది. అయితే హఠాత్తుగా జనగామ నుంచి పోటీ చేసేందుకు పల్లా రాజేశ్వర్రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చిందన్న ప్రచారం గందరగోళానికి దారితీసింది. ఇదే సమయంలో పల్లా రాజేశ్వర్రెడ్డి ముఖ్య అనుచరులు హైదరాబాద్లోని ఓ హోటల్లో రహస్యభేటీ నిర్వహించగా.. అక్కడికి వెళ్లిన యాదగిరిరెడ్డి ఇది కరెక్టు కాదని పార్టీ నాయకులకు నచ్చజెప్పారు. ఆ తర్వాత ముత్తిరెడ్డి హైదరాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించి బలప్రదర్శన చేశారు. కాగా, సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం కేసీఆర్ అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారన్న సమాచారం మేరకు ఉదయమే హైదరాబాద్కు వెళ్లిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ కవితలను కలసినట్లు సమాచారం. అలాగే పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల అనుచరులు సైతం హరీశ్రావును కలసి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. మరోవైపు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలు కూడా వేర్వేరుగా పార్టీ పెద్దలను కలసినట్లు సమాచారం. దీంతో కేసీఆర్ ఈ స్థానంపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. 25న ఎన్నికల కమిటీ మరోసారి భేటీ అయి అభ్యర్థి పేరును ఖరారు చేస్తుందని ప్రకటించారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. ఫైనల్గా తనకే ఛాన్స్ ఉంటుందని చెపుతుండగా, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు సైతం ధీమాగా ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే అమెరికా పర్యటనలో ఉన్న పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వచ్చాకే ఈ వివాదం పరిష్కారం అవుతుందన్న మరో వాదన పార్టీ ముఖ్యనేతల నుంచి వినిపిస్తోంది. 25న అభ్యర్థుల ఎంపిక కమిటీ భేటీ అయినప్పటికీ.. సెప్టెంబర్ 1న కేటీఆర్ వచ్చాకే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉందని అంటున్నారు. -
జనగామకు ‘పల్లా’ వద్దే వద్దు
జనగామ: బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే టికెట్ విషయం మరింత వేడెక్కింది. తమ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్రెడ్డి జోక్యం ఏమిటంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి వర్గాలు రోడ్డెక్కాయి. నియోజకవర్గంలోని 8 మండలాలతోపాటు జనగామ అర్బన్కు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు శనివారం ‘పల్లా గో బ్యాక్’, ‘ముత్తిరెడ్డికి మూడోసారి టికెట్ ఇవ్వండి.. లేదంటే పోచంపల్లికి ఇచ్చినా పర్వాలేదు’అంటూ పట్టణంలో ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో హైదరాబాద్–వరంగల్ హైవేపై నిరసనకు దిగాయి. పల్లా రాజేశ్వర్రెడ్డి అనుచరులు జనగామ బీఆర్ఎస్ టికెట్ కోసం స్థానిక ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లా కొంటున్నారని ఆరోపించారు. పల్లాకు జనగామతో పనేమిటని, ఆయనకు టికెట్ ఇస్తే తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఆందోళనకారులు పల్లా రాజేశ్వర్రెడ్డి దిష్టిబోమ్మను దహనం చేసేందుకు ప్రయతి్నంచినా తర్వాత విరమించుకున్నారు. మొత్తంగా ముత్తిరెడ్డి, పోచంపల్లి వర్గీయుల ఆందోళనతో జనగామలో నాలుగు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమంలో నాయకులు కర్రె శ్రీనివాస్, మసివుర్ రెహమాన్, విష్ణువర్ధన్రెడ్డి, రేఖ, శ్రీనివాస్, మల్లాగారి రాజు, స్వప్నరాజు, శ్రీశైలం, మామిడాల రాజు, రామక్రిష్ణ, ఉడుగుల కిష్టయ్య, ప్రభాకర్, తిప్పారపు విజయ్, నాగరాజు, మిద్దెపాక లెనిన్, జూకంటి కిష్టయ్య, రమేష్, వంగ ప్రణీత్రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, బూరెడ్డి ప్రమోద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్లాకు జనగామలో ఏం పని: ముత్తిరెడ్డి సింహం లాంటి సీఎం కేసీఆర్ పక్కన ఉండి కూడా పల్లా రాజేశ్వర్రెడ్డి చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శించారు. శనివారం జనగామలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జనగామ టికెట్ కోసం పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పోటీపడుతున్నారంటూ ప్రచారం జరిగినప్పుడు ఆయన నా ఆఫీసుకు వచ్చి ప్రెస్మీట్ పెట్టి మరీ అది అబద్ధమని చెప్పారు. ఆయన చూపిన సంస్కారానికి నా నమస్కారం. కానీ పల్లా ఎంత ఎత్తులో ఉన్నారో అంతటి స్థాయిలో కుట్రలకు తెరలేపారు. నా వెనుక ఉన్న నాయకులకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. జనగామను మరో హుజూరాబాద్ చెయ్యాలని చూస్తున్నారు. పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నారు. నా కుటుంబంలో కలహాలు రేపించినది ఎవరో అందరికీ తెలుసు..’’అని ముత్తిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యమంలో 2002 నుంచి కేసీఆర్ వెంట సైనికుడిలా పనిచేస్తున్నానని, తనకు తొలి జాబితాలోనే టికెట్ ప్రకటించాలని సీఎంకు దండం పెట్టి విన్నవిస్తున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యారు. -
కేసీఆర్కు ఇదే నా విన్నపం: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
సాక్షి, జనగామ: నియోజకవర్గపు టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికే అంటూ ప్రచారం జరుగుతుండడంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఓవైపు ముత్తిరెడ్డి అనుచరులు పల్లాకి టికెట్ ఇవ్వొద్దంటూ రోడ్డెక్కి రచ్చ చేస్తున్న వేళ.. మరోవైపు ముత్తిరెడ్డి మీడియా ముందుకొచ్చారు. పల్లాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే కంటతడి పెట్టారాయన. ‘‘బుక్కెడు బువ్వ దొరకని జనగామ నియోజక వర్గాన్ని భారత దేశానికే అన్నం పెట్టేలా తీర్చిదిద్దాను. గెలిచే నియోజకవర్గాన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిస్ట్రబ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ గా గెలిపిస్తే ఏడేళ్ళ లో జనగామకు ఏం చేశావో చెప్పు. పల్లా రాజేశ్వర్ రెడ్డి నియోజకవర్గానికి అసలేం చేశారు?. పైగా ఇప్పుడు డబ్బులు పంచి ప్రలోభ పెడుతున్నారు. ఎన్నికల ముందు డబ్బులు పంచి హుజురాబాద్లా జనగామను మార్చాలనుకున్నావా?.అధినేతను, పార్టీని డిస్ట్రబ్ చేయడం పల్లా మానుకోవాలి అని ముత్తిరెడ్డి హితవు పలికారు. నా బిడ్డను బజారుకు ఎక్కించావ్ ‘‘ఇంటెలిజెన్స్ అంటు నీ కాలేజీ వాళ్ళతో సర్వే చేసి పార్టీని నాశనం చేస్తున్నావు. కొమ్మూరి ప్రతాపరెడ్డి కొడుకు నీ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు. (కొమ్మూరి కొడుకు తన కూతురు భర్త ఇద్దరూ క్లాస్ మేట్స్ అని చెప్పుకొచ్చారాయన). నా కుటుంబంలో కలహాలకు పల్లానే కారణం. నా బిడ్డ ను బజారుకు ఎక్కించింది పల్లానే. పల్లా జనగామ నాయకుల్ని మిస్ గైడ్ చేసి టూరిజం ప్లాజాకు తీసుకొచ్చారు. పార్టీ కి విరుద్దంగా గ్రూప్ లను ఎందుకు ప్రోత్సాహిస్తున్నావు పల్లా?. పార్టీ కి విరుద్దంగా పని చేయడం మానుకోండి. కేసిఆర్ వెంట 22ఏళ్ళు ఉన్నా, ఉద్యమంలో పల్లా నీ పాత్ర ఏంటీ? అంటూ నిలదీశారాయన. కేసీఆర్కు రిక్వెస్ట్ ‘‘పల్లా చేసే అధర్మ పని మానుకోవాలి. సీఎం ప్రకటించే వరకు ఎందుకు ఆగడం లేదు. పోచంపల్లి శ్రీనివాస రెడ్డి సంస్కారానికి నమస్కారం. ఉద్యమకారులను డిస్టర్బ్ చేస్తే కేసిఆర్ సహించరు. సూర్య చంద్రులు ఉన్నంత వరకు కేసిఆర్ ను జనగామ ప్రజలు మరువలేరు. నాటి నుంచి నేటి వరకు కేసిఆర్ కు సైనికుడిగా పని చేశాను. 2004లో సామాజిక పరంగా టిక్కెట్ లభించకపోయిన ఇండిపెండెంట్ గా పోటీ చేసి కేసిఆర్ నినాదంతో ప్రచారంతో 60 వేల ఓట్లు తీసుకువచ్చా. 2009లో పాలకుర్తికి పోయినా కేసిఆర్ అడుగుజాడల్లో పనిచేశాను. 2014, 2018 లో కేసిఆర్ ఆశీస్సులతో జనగామ నుంచి పోటీ చేసి గెలిచి ప్రజా సేవలో నిమగ్నమయ్యాను. కేసిఆర్ సైనికుడిగా ఉంటా. ఆయన ఏ పని చెప్పినా చేస్తా.. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని, మొదటి లిస్ట్లోనే జనగామ టికెట్ ప్రకటించాలని సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వినతి చేశారు. బోరున విలపించిన సర్పంచ్ ప్రెస్ మీట్ సమయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని వడ్లకొండ సర్పంచ్ బొల్లం శారద పట్టుకుని బోరున విలపించారు. ‘కేసీఆర్ సార్ మమ్మల్ని ఏడ్పించకండి. ఒక్కసారి ముత్తిరెడ్డి కి అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే మేమొచ్చి మాట్లాడుతాం సార్. ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి కేసీఆర్ సార్’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
జనగామలో టెన్షన్ టెన్షన్.. పల్లా గో బ్యాక్.. ముత్తిరెడ్డి వర్గీయుల నిరసన
సాక్షి, జనగామ: బీఆర్ఎస్లో జనగామ టిక్కెట్ వివాదం తారస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనుచరులు రచ్చ రచ్చ చేశారు. పల్లా రాజేశ్వర్రెడ్డికి టిక్కెట్ ఖరారు చేశారనే ప్రచారంతో ముత్తిరెడ్డి అనుచరులు గో బ్యాక్ పల్లా అంటూ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. చౌరస్తాలో బైఠాయించి ముత్తిరెడ్డికి టిక్కెట్ ఇస్తే గెలిపించి గిఫ్ట్ ఇస్తామని లేకుంటే పార్టీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని హెచ్చరించారు. అటు స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యే రాజయ్య అనుచరులు కడియంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగి దిష్టిబొమ్మలు దహనం చేశారు. చదవండి: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు -
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బల ప్రదర్శన
జనగామ /కుషాయిగూడ (హైదరాబాద్): నియోజకవర్గంలో అసమ్మతి నేపథ్యంలో జనగామ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బల ప్రదర్శనకు దిగారు. నియోజకవర్గంలో స్థానిక పార్టీ శ్రేణులతో ర్యాలీలు, సమావేశాలు జరపడంతోపాటు హైదరాబాద్లోనూ భేటీ అయ్యారు. స్థానిక నాయకత్వం తన వెంటే ఉందని చాటుకునే ప్రయత్నం చేశారు. బుధవారం హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో అసమ్మతి వర్గం సమావేశం కావడం, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్కడికి వెళ్లడంతో వాగ్వాదం జరగడం తెలిసిందే. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఈ అసమ్మతిని రాజేస్తున్నాడని ముత్తిరెడ్డి ఆరోపించారు కూడా. ఈ క్రమంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులు తనతోనే ఉన్నాయనేలా గురువారం బల ప్రదర్శనకు దిగారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల పరిధిలో భారీ ర్యాలీలు నిర్వహించడంతోపాటు ఏకకాలంలో మీడియా సమావేశాలు పెట్టి స్థానిక నేతలతో తనకు మద్దతు ప్రకటించేలా చేశారు. తర్వాత వారందరితో హైదరాబాద్లోని మల్లాపూర్లో ఉన్న నోమా ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సెలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర నేతలు తమ మద్దతు ముత్తిరెడ్డికే ఉంటుందని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీలన్నీ ముత్తిరెడ్డికి మద్దతు ఇస్తున్నట్టుగా చేసిన తీర్మానాల పత్రాలను ముత్తిరెడ్డికి అందజేశారు. కావాలని అభాసుపాలు చేస్తున్నారు: ముత్తిరెడ్డి తనపై కుట్రలు కొత్తేమీ కాదని.. ఇంతకుముందు 2014లో, 2018లోనూ కుట్రలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. తానేమిటో తెలిసిన సీఎం కేసీఆర్ రెండుసార్లు తనకే టికెట్ ఇచ్చారని.. నియోజకవర్గ ప్రజలు గెలిపించారని చెప్పారు. మల్లాపూర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘నాటి కుట్రల పాచికలు పారకపోవడంతో తాజాగా కుటుంబ కలహాల బూ చితో నన్ను అభాసుపాలు చేసేందుకు, వివాదా స్పదుడిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. నాకు అధినేత కేసీఆర్పై నమ్మకముంది. ఉద్యమ నాయ కుడిగా, పార్టీ సైనికుడిగా నాకు గుర్తింపునిస్తూనే వచ్చారు. భవిష్యత్తులో కూడా నాకు ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఈ సమావేశానికి సంబంధించిన అంతర్యాన్ని, నిర్ణయాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా..’’ అని తెలిపారు. -
జనగామ ఎమ్మెల్యే టికెట్పై పోటాపోటీ సమావేశాలు
-
BRS Party: కారులో ‘సిట్టింగ్’ లొల్లి!..తెరపైకీ రోజుకో పంచాయితీ
సీన్ –1 హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజా.. జనగామ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ స్థానిక సంస్థల నేతలు భేటీ అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వ్యతిరేకంగా.. ఈసారి జనగామ బీఆర్ఎస్ టికెట్ను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి ఇవ్వాలంటూ వారు సమావేశమయ్యారు. ఈ సమాచారం తెలిసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నేరుగా హరిత ప్లాజాకు వెళ్లడం, అక్కడి నేతలతో వాగ్వాదం వంటివి జరిగాయి. అసమ్మతి భేటీకి వచ్చినవారిలో ముఖ్య నేతలెవరూ లేరని ముత్తిరెడ్డి ప్రకటించగా.. నియోజకవర్గంలోని మున్సిపల్ చైర్మన్లు, పలువురు సర్పంచ్లు, ఇతర ప్రజా ప్రతినిధులు భేటీకి వచ్చినట్టు అసమ్మతి వర్గం తెలిపింది. సీన్ –2 మంథని నియోజకవర్గంలో.. ఆ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు మీడియా సమావేశం పెట్టారు. మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకు ఈసారి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వొద్దంటూ బహిరంగంగా డిమాండ్ చేశారు. ఆయన పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇతరులకు ఎవరికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. పుట్టమధుకు వ్యతిరేకంగా త్వరలో నియోజకవర్గంలో పాదయాత్ర చేపడతామనీ ప్రకటించారు. ..అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అధికార బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసమ్మతి సెగలు బయటపడుతున్నాయి. ఆయా ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తిగా ఉన్నవారు, టికెట్ ఆశిస్తున్న ఇతర నేతల అనుచరులు బహిరంగంగానే ఈ వ్యతిరేకతను బయటపెడుతున్నారు. ఇప్పటికే కల్వకుర్తి, దేవరకొండ, చొప్పదండి, రామగుండం, నాగార్జున సాగర్, కోదాడ.. ఇప్పుడు జనగామ, మంథని.. ఇలా చాలాచోట్ల అసమ్మతి వ్యక్తమవుతోంది. వీటిపై దృష్టిపెట్టిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు సన్నాహాలు చేస్తున్నారనే సంకేతాలు ఆ పార్టీలో ‘లొల్లి’ రేపుతున్నాయి. సిట్టింగ్ స్థానాల్లో అసమ్మతులు, ఆశావహుల ప్రయత్నాలతో నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు బలంగా తెరపైకి వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి తమకు అవకాశం ఇవ్వాలని కొందరు నేతలు నేరుగా కోరుతుండగా.. మరికొందరు తెర వెనుక అసమ్మతిని రాజేస్తున్నారు. మరికొన్నిచోట్ల ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదని, పైగా పోలీసు కేసులు, ఇతర రూపాల్లో వేధిస్తున్నారని నియోజకవర్గ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిలో తాజా, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పీఏసీఎస్ చైర్మన్లు, ఇతర గ్రామ, మండల స్థాయి క్రియాశీల నేతలు ఉంటుండటం గమనార్హం. అంతర్గత భేటీలే కాకుండా మీడియా సమావేశాలు పెట్టి మరీ తమ అసమ్మతిని, అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అసమ్మతి పెరిగితే నష్టమనే అంచనాతో.. పార్టీ టికెట్ల కేటాయింపుపై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్కు రాష్ట్రవ్యాప్తంగా ఏయే నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉందనే నివేదికలు అందుతున్నట్టు సమాచారం. వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన నేతలు, సిట్టింగ్లు సహా చాలా మందిపై క్షేత్రస్థాయి నుంచి ఆరోపణలు వస్తున్నాయని.. ఏకపక్ష ధోరణి, బంధుప్రీతి, అవినీతి, గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అన్ని విషయాల్లో జోక్యం, పోలీసు, రెవెన్యూ అధికారులతో సొంత పార్టీ నేతలనే ఇబ్బందులకు గురిచేయడం వంటి అంశాలు నివేదికల్లో ఉన్నాయని తెలిసింది. పార్టీ కేడర్ను ఎన్నికల దిశగా సన్నద్ధం చేసేందుకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలను విశ్లేషించగా.. చాలాచోట్ల విభేదాలు సమసిపోలేదని గుర్తించినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ పాలన, కేసీఆర్ విధానాల పట్ల క్షేత్రస్థాయిలో ‘ఫీల్ గుడ్’ భావన ఉన్నా.. పార్టీ నేతల మధ్య కలహాలు నష్టం చేస్తాయని కేసీఆర్ ఆలోచనకు వచ్చారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీలైనంత త్వరగా టికెట్ కేటాయింపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అసమ్మతి కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని, వీలైనంత త్వరగా చెక్పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఎర్రవల్లి ఫామ్హౌజ్లో ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి తదితరులతో జరిపిన భేటీలో అసమ్మతుల కట్టడికి వ్యూహాన్ని ఖరారు చేసినట్టు తెలిసింది. ‘‘వీలైనంత త్వరగా అభ్యర్థులను నిర్ణయించాలని సీఎం కేసీఆర్ను కోరాం. సిట్టింగ్లకు ఇవ్వాలా, అవసరమైన చోట కొత్త వారికి ఇవ్వాలా అనేది పూర్తిగా ఆయనే చూసుకుంటారు. త్వరగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా పార్టీ లో ఉండేదెవరో, వీడేదెవరో అన్నదానిపై స్పష్టత వస్తుంది. తద్వారా అసమ్మతి కట్టడి, ఇతర పార్టీల నుంచి చేరికలు, ప్రచారం తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించేందుకు అవకాశం కలుగుతుందని కేసీఆర్కు వివరించాం’’ అని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కేటీఆర్, హరీశ్ సహా కీలక నేతలకు బాధ్యతలు అసమ్మతులు, అసంతృప్తుల సమస్యను చక్కదిద్దే పనిని మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ కవిత వంటి కీలక నేతలకు కేసీఆర్ అప్పగించినట్టు తెలిసింది. వేములవాడలో కేటీఆర్, హుస్నాబాద్, మెదక్, జహీరాబాద్లో హరీశ్రావు, రామగుండంలో కొప్పుల ఈశ్వర్, చొప్పదండిలో గంగుల కమలాకర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్, బోధన్, జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత, మానకొండూరులో మాజీ ఎంపీ వినోద్ ఇప్పటికే రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వరుసగా.. అసంతృప్తి సెగలు! ► కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్కు టికెట్ కేటాయించవద్దంటూ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్దాస్, జెడ్పీ వైస్చైర్మన్ బాలాజీసింగ్ తదితరులు ఇటీవల సమావేశమై పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ► దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్కు టికెట్ ఇవ్వద్దంటూ మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్త్యా దేవేందర్ నాయక్, మరో 70 మంది ముఖ్య కార్యకర్తలు డిండి మండలం రుద్రాయిగూడంలో సమావేశమై తీర్మానించారు. ఎమ్మెల్యే తీరుపై విమర్శలు చేశారు. ► చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా తప్పించాలంటూ స్థానిక నేతలు కొందరు సీఎంకు ఫిర్యాదు చేశారు. ► రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు వ్యతిరేకంగా అసంతృప్తి నేతలు ఏకమయ్యారు. కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి సర్దుబాటు చేసుకోవాలని నచ్చచెప్పినా.. అక్కడ అసమ్మతి నేతలు, ఎమ్మెల్యే మధ్య పంచాయతీ కొనసాగుతూనే ఉంది. ► నాగార్జునసాగర్, కోదాడ, మహబూబాబాద్, మహేశ్వరం, తాండూరు, ఉప్పల్, పెద్దపల్లి, ఇల్లందు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోకూడా పార్టీ ఎమ్మెల్యేలపై పార్టీ నేతలే బహిరంగంగా వ్యతిరేకత చూపుతున్నారు. ► కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్పై పలు ఆరోపణలు వస్తుండటంతో ఆయనను మార్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అక్కడ మరో బీసీకి అవకాశం ఇస్తారని, జూలూరి గౌరీ శంకర్ పేరు తెరపైకి వస్తోందని ప్రచారం జరుగుతోంది. ► రాష్ట్రవ్యాప్తంగా మరో 30కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే అసమ్మతి వ్యక్తమవుతోంది. ‘పుట్ట మధుకు టికెట్ ఇవ్వొద్దు’ ముత్తారం (మంథని): మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకు ఈసారి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వొద్దని అసమ్మతి నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రామగిరి ఎంపీపీ అరెల్లి దేవక్క, మాజీ జెడ్పీటీసీలు నాగినేని జగన్మోహన్రావు, మైదం భారతి, దుర్గం మల్లయ్య, బండం వసంతరెడ్డి, పలువురు సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను పుట్ట మధు పట్టించుకోవడం లేదని, నియంత పోకడలతో అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సొంత ఎజెండాను మంథనిలో అమలుపరుస్తూ.. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెడుతున్నారని మండిపడ్డారు. మంథని టికెట్ పుట్ట మధుకు ఇవ్వవద్దని, ఆయనకు తప్ప ఎవరికి ఇచ్చినా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. పుట్ట మధుకు వ్యతిరేకంగా త్వరలో నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తామన్నారు. జనగామ ‘టికెట్’ రాజకీయం! హైదరాబాద్ హరిత ప్లాజాలో ‘పల్లా’ క్యాంపు అసమ్మతి నేతలు జనగామ: జనగామ నియోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ లొల్లి హైదరాబాద్కు చేరింది. బుధవారం ఇక్కడి బేగంపేటలోని హరిత ప్లాజాలో అసమ్మతి నేతల సమావేశం హాట్టాపిక్గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని 8 మండలాల నుంచి ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపుమేరకు.. జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి నేతృత్వంలో ఈ భేటీ జరిగిందని, పల్లాకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్తో సీఎంను కలవాలని వారు నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం. వారికి సీఎం అపాయింట్మెంట్ కూడా దొరికిందని, ఆయన నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తూ హరిత ప్లాజాలో వేచి ఉన్నారని తెలిసింది. అయితే.. ఈ సమావేశం విషయం తెలిసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నేరుగా అక్కడికి వెళ్లారు. అకస్మాత్తుగా సమావేశ గది తలుపులు తీసుకునిలోనికి వెళ్లిన ఆయనను చూసి.. అసమ్మతి నేతలు కొంత ఉలికిపాటుకు గురయ్యారు. ఇక్కడికి ఎందుకు వచ్చారని నేతలను ఎమ్మెల్యే అడగడంతో.. మంత్రి హరీశ్రావును కలిసేందుకు వచ్చామని, రాజకీయమేదీ లేదని చెప్పుకొచ్చారు. దీంతో ముత్తిరెడ్డి స్పందిస్తూ.. ప్రగతిభవన్కు తీసుకెళ్తానని, తనతో రావాలని వారితో చెప్పగా, తాము విడిగానే కలుస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ సమయంలో సదరు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. ‘పల్లా’కు అనుకూలంగా.. జనగామ నుంచి పల్లా రాజేశ్వర్రెడ్డికి అవకాశం కల్పించాలని నియోజకవర్గంలోని కొందరు ముఖ్యనేతలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ఇందులో భాగంగా నర్మెట పీఏసీఎస్ చైర్మన్ పెద్ది రాజరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, మద్దూరు ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి, జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునలింగయ్య, నాగిళ్ల తిరుపతిరెడ్డి, చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ భర్త అంకుగాని శశిధర్రెడ్డి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ పగిడిపాట సుగుణాకర్రాజు, జనగామ పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్రెడ్డి, కొందరు సర్పంచ్లు, నాయకులు హరిత ప్లాజా భేటీకి వెళ్లినట్టు తెలిసింది. కాగా.. హోటల్లో గొడవ జరుగుతోందని తెలిసి వెళ్లానే తప్ప, తానే నాయకులను తీసుకువచ్చినట్టు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని జనగామ జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి పేర్కొన్నారు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామన్నారు. ఇలా చేయడం బాధాకరం: ముత్తిరెడ్డి జనగామ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు హరిత ప్లాజాకు వచ్చారనే సమాచారం మేరకు అక్కడికి వెళ్లానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. అక్కడ ముఖ్య కార్యకర్తలు ఎవరూ లేరని, అన్ని మండలాల అధ్యక్షులు తన వెంటే ఉన్నారని పేర్కొన్నారు. అయినా అధిష్టానం ఇటువంటి చర్యలను క్షమించబోదన్నారు. గతంలో పల్లా రాజేశ్వర్రెడ్డి తనకు స్వయంగా ఫోన్ చేసి ఇలాంటివి ప్రోత్సహించబోనని చెప్పారని.. ఇప్పుడిలా చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. హరీశ్రావుతో ‘పల్లా’ వర్గం భేటీ! హరిత ప్లాజాలో భేటీ అయిన ‘పల్లా’ వర్గీయులు సాయంత్రం ప్రగతిభవన్లో మంత్రి హరీశ్రావును కలసి పరిస్థితిని వివరించారు. దీనిపై హరీశ్రావు స్పందిస్తూ.. జనగామ టికెట్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారని, మరో మూడు రోజుల్లో తేల్చేస్తామని చెప్పినట్టు సమాచారం. ముత్తిరెడ్డితో నెల రోజులక్రితమే మాట్లాడి.. ఆయన కుమార్తెతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని చెప్పామని, అయినా సరిదిద్దుకోక ఆయన సీటుకు ఎసరొచ్చే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేసినట్టు సమాచారం. -
అసమ్మతి మీటింగ్కు ముత్తిరెడ్డి! షాకైన నేతలు
సాక్షి, హైదరాబాద్: జనగామ బీఆర్ఎస్ టికెట్ రేస్ పంచాయితీ హైదరాబాద్కి చేరింది. ప్రగతి భవన్కి కూతవేటు దూరంలో క్యాంప్ రాజకీయం ఆసక్తికరంగా సాగింది. ఎమ్మెల్సీ పల్లాను కలిసేందుకు బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్కు రాగా, వారు హైదరాబాద్ వెళ్లారనే సమాచారంతో హుటాహుటిన నగరానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి వచ్చారు. టూరిజం ప్లాజాలో ఆయన ప్రత్యక్షమవడంతో జనగామ బీఆర్ఎస్ నేతలు షాకయ్యారు. ముత్తిరెడ్డికి తెలియకుండానే పల్లా పిలిపించాడని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అధిష్టానం ఇలాంటి చర్యలను క్షమించదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. ‘‘ఇక్కడకు వచ్చిన వారిలో ముఖ్య కార్యకర్తలు ఎవరూ లేరు. జడ్పీటీసీ, ఎంపీపీ, మండలాధ్యక్షులు నా వెంటే ఉన్నారు. కొంత మంది మా నియోజకవర్గ పార్టీ నేతలు హరిత ప్లాజాకు వచ్చారని తెలిసింది. ఎవరు వచ్చారో తెలుసుకుందామని వచ్చాను. ..తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నడిచిన వ్యక్తిని నేను. గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి నాకు ఫోన్ చేసి ఇలాంటివి ప్రోత్సహించనని చెప్పారు. అసమ్మతి సంగతి అధిష్టానం చూసుకుంటుంది’’ అని ముత్తిరెడ్డి అన్నారు. చదవండి: టార్గెట్ కేసీఆర్.. రేవంత్ ఆరోపణలకు అర్థాలు లేవులే! -
కూతురితో వివాదం.. ముత్తిరెడ్డికి బిగ్ రిలీఫ్
సాక్షి, జనగామ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన కూతురు తుల్జా భవానీరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తండ్రి మీద మీడియా ముందు విపరీతమైన ఆరోపణలు చేస్తూ వస్తోంది తుల్జా భవానీ. అయితే ఈ తండ్రీకూతుళ్ల కోల్డ్వార్ కొత్త మలుపు తిరిగింది. భవానీ అడ్డగోలుగా తన మీద ఆరోపణలు చేయకుండా నిలువరించేలా.. కోర్టు ద్వారా భవానీకి నోటీసులు జారీ చేశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. తన పరువుకి భంగం కలిగించేలా కూతురు తుల్జా భవానీరెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దని.. అందుకు తగ్గ ఆదేశాలు జారీ చేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ముత్తిరెడ్డి విజ్ఞప్తిని కోర్టు పరిశీలించింది. ప్రెస్, మీడియా, వాట్సాప్ ద్వారా ప్రకటనలు. YouTube, ఇతర ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాతో సహా మౌఖిక లేదంటే వ్రాత రూపంలో నేరుగాకానీ, పరోక్షంగాకానీ మాట్లాడవద్దని తుల్జా భవానీరెడ్డికి మధ్యంతర నిషేధ ఉత్తర్వు జారీ చేసింది కోర్టు. తద్వారా ముత్తిరెడ్డికి భారీ ఉపశమనం లభించినట్లయ్యింది. భూవ్యవహారంతో మొదలైన ఈ తండ్రీకూతుళ్ల మాటల యుద్ధం రోజురోజుకీ ముదురిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూట్యూబ్ సహా అన్ని మీడియా ఛానెల్స్ ముందు తండ్రిపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారామె. అంతేకాదు.. తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని చెబుతూనే.. తన తండ్రి దుర్మార్గుడని, సీటు ఇవ్వొద్దంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు విజ్ఞప్తి చేసిందామె. ముత్తిరెడ్డి మాత్రం తమ కుటుంబ సమస్యలను ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని, తన కూతురిని తప్పు దోవ పట్టిస్తున్నారని చెబుతున్నారు . మరోవైపు తన కూతురు, అల్లుడు తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ దాఖలైన కేసులో విచారణ కొనసాగుతోంది కూడా. -
జనగామ నియోజకవర్గ గొప్ప రాజకీయ చరిత్ర.. ఈ సారి మాత్రం..
జనగామ నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో చేర్యాల నియోజకవర్గం రద్దై జనగామ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. జనగామ నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రెండోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై 28490ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. యాదగిరి రెడ్డిపై పలు ఆరోపణలు, విమర్శలు వచ్చినా, ఆయన భారీ మెజార్టీతో గెలుపొందడం విశేషం. కాగా పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ ఐ పార్టీ చివరి వరకు టిక్కెట్ ఖరారు చేయలేదు. మద్యలో తెలంగాణ జనసమితి అదినేత కోదండరామ్ ఇక్కడ నుంచి పోటీచేస్తారని భావించారు. కానీ చివరికి బిసి నేతగా పొన్నాలకే కాంగ్రెస్ ఐ టిక్కెట్ ఇచ్చింది. అయినా పలితం దక్కలేదు. ముత్తిరెడ్డికి 91036 ఓట్లు రాగా పొన్నాలకు 62546 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎస్.ఎఫ్ బి అభ్యర్దిగా పోటీచేసిన లక్ష్మణ్ భీమాకు పదివేలకు పైగా ఓట్లు వచ్చాయి. తెలంగాణ ఆవిర్భావం బిల్లు ఆమోదం పొందాక తెలంగాణ కాంగ్రెస్ఐకి అద్యక్షుడుగా అయిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తన సొంత నియోజకవర్గం జనగామలో 2014లో కూడా భారీతేడాతో ఓడిపోయారు. తెలంగాణలో అదికారంలోకి వస్తామని కాంగ్రెస్ ఆశించగా, ఏకంగా పార్టీ అధ్యక్షుడే ఓటమి పాలవడం ఆ పార్టీకి అప్రతిష్టగా మారింది. 2014లో పొన్నాల టిఆర్ఎస్ అభ్యర్ధి ఎమ్.యాదగిరిరెడ్డి చేతిలో 32695 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో బిజెపి-టిడిపి కూటమి అభ్యర్దిగా రంగంలో దిగిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి 21113 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు. పొన్నాల లక్ష్మయ్య సుదీర్ఘకాలం నీటి పారుదల శాఖ మంత్రిగా ఆంద్రప్రదేశ్ సమైఖ్య రాష్ట్రంలో పనిచేసిన రికార్డు పొందారు. లక్ష్మయ్య 1989లో తొలిసారి గెలిచి, నేదురుమల్లి క్యాబినెట్లో మంత్రి అయ్యారు. 1999, 2004, 2009లలో కూడా గెలుపొందారు. 2004లో గెలిచాక వై.ఎస్. క్యాబినెట్లో మంత్రి అయ్యారు. అనంతరం రోశయ్య, కిరణ్ క్యాబినెట్లలో మంత్రిగా కొనసాగారు. 2004, 2008 ఉప ఎన్నికలోను చేర్యాలలో గెలుపొందిన టిఆర్ఎస్ నేత కె.ప్రతాపరెడ్డి ఆ నియోజకవర్గం రద్దు కావడంతో జనగామ నుంచి పోటీచేశారు. 2009లో టిఆర్ఎస్ తరపున, 2014లో బిజెపి తరపున పోటీ చేసి ఓటమి చెందారు. జనగామలో ఏడుసార్లు రెడ్లు, ఆరుసార్లు బిసి (మున్నూరుకాపు), రెండుసార్లు ముస్లింలు, మూడుసార్లు ఎస్.సిలు గెలుపొందారు. జనగామలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి తొమ్మిదిసార్లు, సిపిఎం రెండు సార్లు, టిడిపి ఒకసారి, టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచాయి. ఒకసారి పిడిఎఫ్ గెలిచింది. అయితే ఈ నియోజకవర్గం ద్విసభ్య స్థానంగా ఉన్నప్పుడు కాంగ్రెస్తోపాటు పిడిఎఫ్ కూడా ఒక సీటు గెలుచుకుంది. 1967లో ఇక్కడ గెలిచిన కమాలుద్దీన్ అహ్మద్ 1962లో చేర్యాలలో నెగ్గారు. ఈయన వరంగల్ నుంచి ఒకసారి, హనుమకొండ మూడు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. పిసిసి అధ్యక్షునిగా, కేంద్ర మంత్రిగా కూడా ఈయన పనిచేశారు. కొద్దికాలం బిజెపిలో చేరి ప్రణాళిక సంఘం సభ్యునిగా కూడా వ్యవహరించారు. గోకా రామలింగం ఇక్కడ ఒకసారి, భువనగిరిలో మరోసారి గెలుపొందారు. అయితే 1962లో రామలింగం ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటించి సిపిఐకి చెందిన రాఘవులు ఎన్నికైనట్లు ప్రకటించింది. చేర్యాల (2009లో రద్దు) 1962లో ఏర్పడిన చేర్యాల శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ)లు కలిసి నాలుగుసార్లు, తెలుగుదేశం నాలుగుసార్లు, సిపిఐ ఒకసారి గెలుపొందాయి. టి.ఆర్.ఎస్. 2 సార్లు, గెలిచింది. తెలుగుదేశం అభ్యర్దిగా నిమ్మ రాజిరెడ్డి నాలుగుసార్లు ఇక్కడ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా మహమ్మద్ కమాలుద్దీన్ 1962లో చేర్యాలలోను, 1967లో జనగామలోను గెలుపొందారు. కమాలుద్దీన్ లోక్ సభకు కూడా ఎన్నికై కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత బిజెపిలో చేరి ప్రణాళికా సంఘం సభ్యుడిగా కొంతకాలం పనిచేశారు. నిమ్మ రాజిరెడ్డి 1989లో ఎన్.టి.ఆర్.క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. 2009లో ఈ నియోజకవర్గం రద్దు అయింది. ఈ నియోజకవర్గంలో ఆరుసార్లు రెడ్లు, రెండుసార్లు బిసిలు, రెండుసార్లు ముస్లింలు గెలుపొందారు. జనగామ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
జనగామలో జగడం.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెడుతున్న ఎమ్మెల్సీ
జనగామ గులాబీ గూటిలో ముసలం ముదిరిందా?... సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెడుతుంది ఎమ్మెల్సీలేనా?... ఇంటిపోరుతో సతమతం అవుతున్న ముత్తిరెడ్డి సీటుకు ఎసరు పెట్టారా?...అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తుంది. గ్రూప్ రాజకీయాలతో గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తున్న పుల్లల రాయుడు ఎవరు?.. జనగామ జగడానికి కారణం ఏంటీ? ఉద్యమాల ఖిల్లా జనగామలో బీఆర్ఎస్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యతిరేక వర్గం తాజా ఆడియో సంభాషణ కలకలం సృష్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన సీటును పదిలపర్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఓ వైపు ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి, మరోవైపు వ్యతిరేక వర్గం వ్యూహాలు ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రసవత్తరంగా జనగామ రాజకీయం ఇదే సమయంలో స్వపక్షంలోని స్థానికులు గ్రూప్ కట్టి స్థానికతను తెరపైకి తీసుకొస్తున్నారు. ఓ ఎమ్మెల్సీ అందుకు ఆజ్యం పోస్తున్నట్లు తాజా ఆడియో వైరల్ తో స్పష్టమౌతుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి స్థానికేతరుడనేది అడొస్తే.. పట్టభద్రుల స్థానానికి మరో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కలిసేందుకు జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి పలువురితో సంప్రదింపులు జరపడం హాట్ టాఫిక్గా మారింది. పోచంపల్లి'.. లేదంటే 'పల్లా'కు జై జనగామ నుంచి పోటీ కోసం ఇప్పటికే యాదగిరిరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిల పేర్లుండగా.. తాజాగా తెరమీదకు ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు వచ్చింది. ఈ మేరకు జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి పలువురు నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే క్రమంలో నర్మెట జెడ్పీటీసీ సభ్యుడు ఎం.శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. చదవండి: పిల్లల టిఫిన్ బాక్సులు తెరిచి చూసి షాకయ్యా: గవర్నర్ తమిళిసై జడ్పీ చైర్మన్ ఆడియో వైరల్ కలకలం 'పల్లా రాజేశ్వర్ రెడ్డి లోకల్ వాడు.. జనగామ నియోజకవర్గం నుంచి నిలబడమని మనం సపోర్ట్ చేద్దాం.. ఇంకొకటి ఏమిటంటే మొత్తం జనగామ నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి.. కాబట్టి 4 మండలాల వారు (చేర్యాల, మద్దూరు, దులిమిట, కొమురవెల్లి) వస్తారో రారోగాని నువ్వు, మన 4 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు కలిసి ఒక రిప్రజెంటేషన్ కేసీఆర్ సార్కు ఇవ్వాలి. అన్ని నేను చూసుకుంటా.. సీటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి వస్తే అభ్యంతరం లేదు.. శ్రీనన్న కనుక నాన్ లోకల్ అంటే మనం రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వమందాం.. మన ఆలోచన ఇది. నువ్వు వెంటనే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఫోన్ చెయ్యి, సారుతోటి మంచిగా మాట్లాడు. మీకు అంతా అనుకూలంగా ఉంటది. అందరూ ఒకే అంటారు అని చెప్పు.. నర్మెట సీను ఫోన్ చేస్తాడని చెప్పిన మన తమ్ముడే, మీరంటే పడి చస్తాడని చెప్పిన నువ్ కూడా అదే విధంగా మాట్లాడు.. మళ్లీ నాకు వెంటనే కాల్ చేసి చెప్పు' అంటూ జెడ్పీటీసీ శ్రీనివాస్తో మాట్లాడిన పాగాల సంపత్ రెడ్డి ఆడియో రాజకీయవర్గాల్లో దుమారం రేపుతోంది. ముత్తిరెడ్డికి ఇంటిపోరు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొంత కాలంగా వివాదాలకు కేంద్రంగా ఉన్నారు. ఇటీవల తన కూతురు తుల్జా భవానిరెడ్డి ఆయన తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడమే కాకుండా చేర్యాలలో తండ్రి ఇచ్చిన స్థలాన్ని కూడా మున్సిపాలిటీకి ధారాదత్తం చేశారు. ఓ వైపు ఇంటిని చక్కబెట్టుకుంటూనే అధిష్టానాన్ని కన్విన్స్ చేసుకుంటున్న తరుణంలో సొంత పార్టీలోనూ కుంపటి రాజుకుంటోంది. ఆయనంటే ససేమిరా అనే గ్రూపు ఈసారి ఎన్నికల నుంచి తప్పించాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తుంది. చదవండి: కమలం గూటికి జయసుధ.. ఎవరికి చెక్ పెట్టేందుకు?.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదేనా? ఈ క్రమంలో ముత్తిరెడ్డి వ్యతిరేక వర్గం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సన్నిహితంగా వ్యవహరిస్తూ ఆయనను కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆయనతో దిగిన ఫొటో లతోపాటు కార్యక్రమాలను విస్తృతంగా ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఇంత జరుగుతున్నా తన పని తాను చేసుకుంటూ పోతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. 'సిట్టింగ్'గా ఉన్న టికెట్ నాకే, గెలుపు నాదే నంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇదే సమయంలో తెరపైకి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు రావడం నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తుంది. గ్రూప్ రాజకీయాలు అందుకు ఆజ్యం పోస్తున్నాయి. పుల్లల రాయుడి ఫిట్టింగ్ గ్రూపు రాజకీయాలకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ పెడుతుంది పుల్లల రాయుడిని ప్రచారం సాగుతుంది. అధిష్టానం పెద్దలకు దగ్గరగా ఉండే నాయకుడు అటు జనగామ, ఇటు స్టేషన్ ఘన్పూర్, మరోవైపు వరంగల్ పశ్చిమ లో సిట్టింగ్ ఎమ్మెల్యే లు సీట్లకు ఎసరు పెట్టి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలకు అంతర్గత విబేదాలకు పుల్లల రాయుడు కారణమని భావిస్తున్నారు. ఇప్పటికే స్టేషన్ ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు బదులు ఎమ్మెల్సీ కడియం పేరు తెరపైకి రావడం, అటు జనగామలో ముత్తిరెడ్డికి బదులు పోచంపల్లి, పల్లా పేర్లు తెరపైకి తేవడం వెనుక పొలిటికల్ డ్రామాగా ఓరుగల్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఇంకా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. -
24 గంటల్లో 31 కాన్పులు
జనగామ: జనగామ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) ప్రసవాల్లో మరో రికార్డు సృష్టించింది. 24 గంటల వ్యవధిలో 31 కాన్పులు చేసి.. వైద్యులు సర్కారు దవాఖానా సత్తా చాటారు. సాధారణ ప్రసవాలు–17, ఆపరేషన్లు 14 కాగా... ఇందులో 12మంది మగపిల్లలు, 19 మంది ఆడపిల్లలు జన్మించారు. అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్రాజు ఆధ్వర్యంలో అసిస్టెంటు ప్రొఫెసర్ డాక్టర్ స్రవంతి, డాక్టర్లు సౌమ్యారెడ్డి, సిరిసూర్య, సిబ్బంది సంగీత, విజయరాణి, సెలెస్టీనా ప్రసూతి కాన్పులు చేశారు. ఎంసీహెచ్ వైద్యుల అంకితభావంతో సర్కారు దవాఖానాలపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ట్వీట్ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా వీరిని అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ సర్కారు దవాఖానాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
మా నాన్న వచ్చే ఎన్నికల్లో సర్పంచ్ గా కూడా గెలవలేడు
-
2ఎకరాల కోసం సొంత బావమరిది భార్యను చంపించాడు
-
పొలిటికల్ ఎంట్రీపై ముత్తిరెడ్డి కూతురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
జనగామ: ‘రాజకీయాలంటే ఇష్టం లేదు.. ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదు.. అందుకే నాన్న పంచాయితీ విషయంలో సీఎం కేసీఆర్ను కలవలేదు’ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జా భవానీరెడ్డి అన్నారు. తన అధికారిక కార్యక్రమాలను కూతురు, అల్లుడు రాహుల్రెడ్డి అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా పోలీసులు వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక, ఈ కేసు విషయమై విచారణ నిమిత్తం తుల్జా భవానీరెడ్డి బంధువు రామకృష్ణను పోలీసులు బుధవారం పిలిపించగా, అల్లుడు, కూతురు సైతం జనగామ పీఎస్కు వచ్చారు. ఎమ్మెల్యే అధికారిక పర్యటనను అడ్డుకున్నారనే ఆరోపణలతో పాటు ఇతర విషయాలను పోలీసులు అడిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి రామకృష్ణ నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. తుల్జా భవానీరెడ్డి, రాహుల్రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కాగా, ముత్తిరెడ్డి అధికారిక కార్యక్రమాన్ని తాను ఎప్పుడూ అడ్డుకోలేదని తుల్జాభవానీరెడ్డి అన్నారు. ఇదే సమయంలో తాను చేర్యాల భూమిని మున్సిపాలిటీకి ఇచ్చిన తర్వాత తన తండ్రి స్వాగతిస్తున్నానని అన్నారని, ఇప్పుడేమో కేసులు పెట్టి మళ్లీ తమను ఇబ్బంది పెడుతున్నాడని మండిపడ్డారు. తాను ఆ భూమిని కబ్జా చేశానని తన తండ్రి ఓపెన్గా ఒప్పుకున్నారని.. మరి ఆయన తన పదవిలో ఎందుకు ఉన్నారు? రాజీనామా ఎందుకు చేయడం లేదు? అని ప్రశ్నించారు. భూమి ఆయన కబ్జా చేశాడని, భూమి తాను ఇచ్చానని, కాబట్టి ఈ విషయంలో తండ్రి కూడా వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కన్నకూతురిపై ఓ తండ్రి ఇలా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం ఏమాత్రం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: బస్సు రూట్లో కాంగ్రెస్ -
సొంతంగా పోటీ చేసిన సర్పంచ్గా కూడా గెలవలేడు: తుల్జా భవాని
-
మా నాన్న మంచోడు కాదు.. ముత్తిరెడ్డికి కూతురు షాక్
సాక్షి, హైదరాబాద్: జనగాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కూతురు మరోసారి షాకిచ్చింది. తన తండ్రి మంచోడు కాదంటూ, ముత్తిరెడ్డిలాంటి అవినీతిపరుడిని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో తెలియడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి. ఎమ్మెల్యే యాదగిరి రెడ్డిని ప్రశ్నించాల్సింది, ఓడించాల్సింది ప్రజలేనని ఆమె అన్నారు. ప్రజల ఆస్తిని తాను తిరిగి ప్రజలకే ఇచ్చేశానని తెలిపారు. కబ్జా చేశానని ఒక ఎమ్మెల్యే బహిరంగంగా చెప్పినా.. ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి అవినీతిపరులకు పార్టీ టికెట్ ఇవ్వకూడదని, సొంతంగా పోటీ చేసినా సర్పంచ్గా కూడా తన తండ్రి గెలవడని వ్యాఖ్యానించారు. కేవలం కేసీఆర్ పేరు చెప్పుకొని మళ్లీ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. సాక్షితో ఆమె మరికొన్ని విషయాలు పంచుకున్నారు.. అవి తన మాటల్లోనే సంబంధిత వార్త: చేర్యాల ప్రజలు మా నాన్నను క్షమించండి: భవానీ రెడ్డి 1) ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కూతురు అంటే ఇష్టం లేదా? చిన్నప్పటి నుంచి ఇంతేనా? ఇటీవల కాలంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వర్సెస్ ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డిగా మారింది.. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు.. ఇదంతా ఎందుకు అంటే తుల్జా భవాని రెడ్డి ఒకటే చెప్తున్నారు మహిళ అంటే ఆయనకు చిన్న చూపు ఆయన గురించి ఒక మహిళ ఎదురు తిరిగి మాట్లాడితే ఆయన సహించలేరని అంటున్నారు.. చిన్నప్పటి నుంచి కూడా వారి కుటుంబంలో ఆమె అమ్మానాన్న ఆమె సోదరుడు అంతా ఒక్కటి అయితే తుల్జా భవాని రెడ్డి మాత్రం ఒక్కటిగా ఉండేదని చెప్తున్నారు.. ఆమె పుట్టడమే ఆయనకు ఇష్టం లేనట్లుగా సమాధానం ఇచ్చారు. 2 )ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆయన కూతురికి మధ్య విభేదాలు ఏంటి? సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రభుత్వ భూమి నీ ఎమ్మెల్యే కబ్జా చేసి తన పేరున రాశారని పేర్కొన్నారు .2020 డిసెంబర్లో ఈ కబ్జా గురించి విషయం బయటకువచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఇంట్లోనే తేల్చుకునేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు కానీ వినకపోవడంతో బయటకు వచ్చి అక్కడ స్థానికంగా అందరి ముందు ఆమె తండ్రిని నిలదీసింది. ఇది వరకే ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు ఉన్నాయని.. చెరువు భూమి అంటే ఎమ్మెల్యేకి చాలా ఇష్టం అని అందుకే అక్కడ కబ్జా లు చెరువుల పక్కన స్థలాలను కబ్జా చేస్తుంటారని చెప్పుకొచ్చారు. జనగాం జిల్లాలో ఎవరిని అడిగినా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అవినీతి గురించి చెబుతారని ఒకసారి ఏకంగా కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టారంటే అర్థం చేసుకోవాలని అన్నారు.. 3) ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు? కబ్జా చేసినట్లు ఎమ్మెల్యే బహిరంగంగా ఒప్పుకున్నట్లు ఒక క్లిప్పింగ్ వచ్చిందని ఆమె అన్నారు..అన్ని ఒప్పుకున్న తర్వాత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలాంటీ అవినీతి ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ ఇవ్వకూడదనీ అన్నారు. ఒక కూతురు అయిన బయటకు మా నాన్న కబ్జాలు చేస్తున్నాడని చెప్పినా ఇప్పటి వరకు ఆయనపై చర్యలు లేవని బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎటువంటి ఫోన్లు రాలేదని అన్నారు 4) రాజకీయ ప్రవేశం? రాజకీయ ప్రవేశం పై అసక్తి లేదనీ అన్నారు తుల్జా భవానీ. న్యాయం వైపు పోరాడితే ప్రజల కోసం చూస్తే రాజకీయాల్లోకి వస్తున్నారని ఆలోచన కరెక్ట్ కాదు అన్నారు. తనకు ఏ పార్టీ కూడా అండ దండ లేదని, తను ఒకతే ఫైట్ చేస్తున్నట్లు తెలిపారు. ఏవైతే కబ్జా ఉన్నాయో ఆ స్థలాలని తీసుకొని ప్రజలకు ఇచ్చేస్తున్నట్లు తెలిపారు అంతే తప్ప రాజకీయాల్లోకి ఎవరు పిలిచినా వెళ్ళేది లేదని కరాఖండిగా చెప్పారు. 5) ఇలాంటి అవినీతిపరులను ఎందుకు ప్రజలు ఎన్నుకుంటున్నారు ? ఒక ప్రజా ప్రతినిధిని ఎన్నుకుంటున్న సమయంలో లీడర్ ఎలా ఉండాలి అని ప్రజల ఆలోచించాలని అన్నారు. ఇలాంటి అవినీతిపరులకు ఓట్లు వేస్తే ప్రజలకు నష్టమే తప్ప లాభం ఉండదని తెలిపారు.. ప్రజలు అవినీతిని ప్రశ్నించాలే తప్ప గెలిపించద్దనీ అన్నారు.. సీఎం కేసీఆర్ను చూసి ఓట్లు వేసి గెలిపించారు ప్రజలు.. ఒక్కసారి రిజైన్ చేసి సర్పంచ్గా పోటీ చేసి గెలిచి చూపించమని ఆయన కూతురు సవాల్ విసిరారు. త్యాగాలను చేసి తెలంగాణ తెచ్చుకుంది ఇలాంటి అవినీతిపరుల చేతిలో ప్రజాస్వామ్యాన్ని పెట్టేందుకు కాదని సమాధానం ఇచ్చారు. 6) ఎమ్మెల్యే కబ్జా చేసిన బాధితులు ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడిప్పుడే చాలా మంది బాధితులు ఫోన్ లు చేస్తున్నట్లు తెలిపారు.. వారి పేర్లను ఇప్పుడు నేను బయట పెట్టాలి అనుకోవడం లేదని అన్నారు. తన పేరుపై ఎన్నో ఫోర్జరీలు చేశారని కూడా తెలిపారు 7) అల్లుడు అంటే ఎమ్మెల్యే ముత్తీ రెడ్డి కి ఇష్టం లేదా అందుకే ఇదంతా జరుగుతుందా? తుల్జ భవానీ రెడ్డి తమది లవ్ కం అరేంజ్డ్ వివాహంగా పేర్కొన్నారు... పెళ్ళి చేసే సమయం లో సంతోషంగానే వివాహం చేశారని ఆమె అన్నారు..ఆ వివాహా నికి సీఎం కేసీఆర్ వచ్చినట్లుగా కూడా తెలిపారు.. ఇప్పుడు తను పిల్లలతో , భర్త తో ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు.. తన భర్త ఏ విధంగా కూడా ఆమె తండ్రిపైకి తిరగబడేలా ట్రాప్ చేయలేదనీ చెప్పారు.. 8) ఎన్నికలకి ముందే వేల కోట్ల ఆస్థులు.. 70 ఏళ్ల వయసు... ఇంకా ఎందుకు కబ్జాలు? ఎన్నికలకు ముందే వేల కోట్లు సంపాదించారని అన్నారు.. ప్రస్తుతం అయనకి 70 ఏళ్ల వయసు. ఇప్పటికీ ఇంకా కొన్ని రెంట్స్ కూడా కోటిన్నరకు పైగా వస్తున్నాయని అన్నారు. ఇవన్నీ కాకుండా చెరువుల పక్కన ఆయనకి సాయంత్రం వేళ కూర్చొని ఎంజాయ్ చేయడం ఇష్టంతో కబ్జాలు చేస్తున్నారని అన్నారు. 9) కూతురు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆస్తినీ ఎందుకు తీసుకోలేదు? రూపాయి అస్థి కూడా తీసుకోకుండా భర్తనీ పెళ్ళి చేసుకుని ఇంట్లో నుంచి బయటికీ సంతోషంగా వచ్చినట్లు ఆమె వ్యక్తం చేశారు. మామూలుగా నలుగు పెట్టే సమయం లో ఆడపిల్లలు ఏడుస్తారు కానీ తనకి ఒక కంటి చుక్క కూడా రాలేదని అన్నారు. తన భర్త కట్నం తీసుకోలేదని తనకి పెట్టిన కొన్నిటింని కూడ డబ్బుల రూపంలో తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. 10 ) ఎమ్మెల్యే కబ్జా పై ఒప్పుకున్న తర్వాత కూడా కేసులు ఎందుకు? తన పై ఎమ్మెల్యే ఐదు కేసులు పెట్టించరాని తుల్జా భవనీ అన్నారు.. బహిరంగంగా కబ్జా చేశాను అని ఒప్పుకున్న తర్వాత కూడా పోలీస్లు మాకు ఫోన్ లు చేసి వేధిస్తున్నారని మనస్థాపం చెందారు. -సుస్మిత, సాక్షి టీవీ చదవండి: Video: మానవత్వం చాటుకున్న కేటీఆర్.. -
నా కూతురుపై కేసు పెట్టలేదు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
సాక్షి, జనగామ జిల్లా: రాజకీయ కుట్రలో తన కుమార్తె తుల్జాభవానిరెడ్డి పావుగా మారిందని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. మూర్ఖులు, దౌర్భాగ్యులు, అధర్ములు తన బిడ్డను రోడ్డు పాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అడపిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తన కుటుంబ సమస్యను ఇంట్లోనే పరిష్కరించుకుంటామని, చిల్లరగాళ్లకు తగిన గుణపాఠం చెబతానని తెలపారు. బంగారుతల్లి లాంటి తన కూతురుపై కేసు పెట్టలేదని ముత్తిరెడ్డి స్పష్టం చేశారు. కేవలం తన ప్రజా జీవితానికి ఆటంకం కల్పిస్తున్నారని హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రజాక్షేత్రంలో ధైర్యంగా ఎదుర్కోలేని వారే తన బిడ్డను తనపై ఉసిగొల్పారన్నారు. అలా చేయడం మంచిది కాదని, వారికే అరిష్టంగా మారుతుందని మండిపడ్డారు. ప్రజలు క్షమించరని, తిప్పికొడతారని పేర్కొన్నారు. తాను ప్రజాసేవకుడిని, ప్రజాసేవలో ఉంటానని.. శక్తి ఉంటే ప్రజా సేవ చేసి ప్రజల మన్ననలు పొంది ప్రజాక్షేత్రంలో గెలువాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సవాల్ విసిరారు. కాగా అధికారిక విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారంటూ కుమార్తె తుల్జాభవానీరెడ్డి, అల్లుడు రాహుల్రెడ్డిలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జూన్ 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ముత్తిరెడ్డి ఫిర్యాదుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనగామ, చేర్యాల పోలీసులను శుక్రవారం ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యే కుమార్తె, అల్లుడికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 25కు వాయిదా వేసింది. చదవండి: ఖమ్మంలో బెదిరింపు లేఖ కలకలం.. శవాలు కూడా మిగలవంటూ.. -
ఇంటిపోరుతో సతమతమవుతున్న జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి
-
ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మరోసారి షాకిచ్చిన కూతురు భవానీ రెడ్డి
సాక్షి, జనగామ: జనగామ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, కూతురు తుల్జా భవానీ రెడ్డి మధ్య భూవివాదం మరోసారి హైలైట్ అయ్యింది. ఈ క్రమంలో ముత్తిరెడ్డిపై కూతురు భవానీ రెడ్డి మరోసారి సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయామే చేర్యాల చేరుకున్న తుల్జా భవానీ రెడ్డి.. తన పేరుపై ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చేశారు. దీంతో, ఈ అంశం మళ్లీ హాట్ టాపిక్గా మారింది. వివరాల ప్రకారం.. తుల్జా భవానీ రెడ్డి ఆదివారం ఉదయం చేర్యాల చేరుకున్నారు. అనంతరం.. తన పేరుపై ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చేశారు. తన తండ్రి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి తన పేరున రిజిస్ట్రేషన్ చేశారనీ.. ఆ భూమి తనకు వద్దని ఆమె తెలిపారు. ఈ క్రమంలోనే ఆ భూమిని మున్సిపాలిటికి అప్పగిస్తానని స్పష్టం చేశారు. గ్రామ స్థలాన్ని తన తండ్రి తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసినందుకు క్షమించాలని గ్రామస్థులను కోరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు మత్తడి వద్ద 1270 గజాల స్థలాన్ని నాపేరు మీద రాశారు. అక్రమంగా తండ్రి సంపాదించిన 1402సర్వే నెంబర్లో ఉన్న 1270గజాల స్థలాన్ని మున్సిపాలిటికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. ఈ స్థలం మళ్లీ ఎవరి పేరు మీదకు అక్రమ రిజిస్ట్రేషన్ కాకుండా కోర్టు ద్వారా చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తాను. ఎమ్మెల్యే అయి ఉండి ఇటువంటి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం తప్పు. నా తండ్రి ముత్తిరెడ్డికి ఎమ్మెల్యే అవకముందే వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. నెలకు కోటిన్నర రూపాయల రెంట్లు వస్తాయి. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు చేయడం తప్పు. దీనిపై చేర్యాల ప్రజలు క్షమించండి అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బండ్ల గణేష్ పొలిటికల్ ట్వీట్.. రాజకీయాల్లోకి రీఎంట్రీ! -
రిటైర్డ్ ఎంపీడీఓ హత్యలో ఎమ్మెల్యే హస్తం
జనగామ: రిటైర్డ్ ఎంపీడీఓ రామకృష్ణయ్య హత్య ఉదంతంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హస్తం ఉందని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, దళిత వర్గానికి చెందిన రామకృష్ణయ్య బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరాచకా లను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకురావడంతోనే అంతమొందించారని అన్నారు. హత్యలు చేయడం సమస్యకు పరిష్కారం కాదని పేర్కొన్నా రు. కబ్జాలు, భూదాహం వల్లే నియోజకవర్గంలో భూ సెటిల్మెంట్లు, అరాచకాలు పెరిగిపోతున్నాయ ని మండిపడ్డారు. హత్య కేసులో ఎమ్మెల్యేను సైతం చేర్చాలని డిమాండ్ చేశారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే హత్య జరిగేది కాదని, భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి : సీపీఎం రామకృష్ణయ్య హత్య ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యదర్శివర్గ సభ్యుడు సాంబరాజు యాదగిరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఆర్థిక సాయం అందించాలన్నారు. ఈ కేసులో గిరబోయిన అంజ య్యతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికా ర పార్టీ నాయకులపై హత్య, కుట్ర నేరం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. పరోక్షంగా హత్యకు కారకులైన బచ్చన్నపేట ఎస్ఐ నవీన్కుమార్ను విధుల నుంచి డిస్మిస్ చేయాలని, ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి నైతిక బాధ్యత వహించి అంజయ్య సతీమణిని జెడ్పీ వైస్ చైర్పర్సన్ పదవి నుంచి బర్తరఫ్ చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు బూడిద గోపి, జోగు ప్రకాష్, బోడ నరేందర్, బి.వెంకటేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ లో చీడపురుగులు..
-
కూతురు పెట్టిన పోలీసు కేసుపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్పందించారు
-
వీడియో: కూతురు ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. ఏమన్నారంటే!
-
కూతురు ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. జరిగింది ఇదే!
సాక్షి, జనగామ: తనపై ఫిర్యాదు నమోదవ్వడంపై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తన కూతురు తుల్జాభవాని సంతకం ఫోర్జరీ చేయలేదని పేర్కొన్నారు. కూతురు పేరు మీదనున్న ఫ్లాట్ ఆమె పేరుతోనే ఉందని స్పష్టం చేశారు. చేర్యాలలో సర్వే నెం 1402లో 1200 గజాల ల్యాండ్ తన బిడ్డ పేరు మీదే రిజిస్టర్ చేసి ఉందని, ఇందులో ఎలాంటి అవినీతి, ఫోర్జరీ జరగలేదని తెలిపారు. ఉప్పల్ పీఎస్ పరిధిలో తుల్జాభవాని పేరుపై 125 నుంచి 150 గజాల వరకు భూమి ఉందని, అందులోనూ ఎలాంటి ఫోర్జరీ జరగలేదన్నారు. అయితే దీనిని తన కుమారుడు నామమాత్రంగా కిరాయికి ఇచ్చారని అది కూడా తనకు తెలియకుండానే జరిగిందని తెలిపారు. అంతేగాని ఎలాంటి ప్రాపర్టీ బదలాయింపు జరగలేదని చెప్పారు. సదరు ఆస్తి కూతురు పేరు మీదే ఉండటం వల్ల కిరాయి కూడా ఆమెకే వెళ్తుందని తెలిపారు. ఇది కుటుంబ సమస్య అని.. ఏ కుంటుంబంలో అయినా చిన్న చిన్న సమస్యలు సహజమేనని తెలిపారు. కూతురిని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులు తనపై ఉసిగొలుపుతున్నారని విమర్శించారు. రాజకీయంగా గిట్టనివారు దీనిని వివాదంగా మార్చారని ఆరోపించారు. ఒకవేళ తాను తప్పు చేస్తే ప్రజలు శిక్ష వేస్తారని, తమ అధినేత సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకు నియోజకవర్గంలో ఉంటానని పేర్కొన్నారు. వివాదలు సృష్టించే వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు. చదవండి: వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి! కాగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆయన కూతురు తుల్జాభవని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం తెలిసిందే 159 గజాల నాచారం ల్యాండ్ కమర్షియల్ బిల్డింగ్ విషయంలో ఆమె ఫిర్యాదు చేశారు. కినారా గ్రాండ్కు తన తండ్రి అక్రమ అగ్రిమెంట్ చేశారని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారాడు అధికార పార్టీ బీఆర్ఎస్కు చెందిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేస్తాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముత్తిరెడ్డిపై సొంత కూతురే కేసు పెట్టడం కలకలం రేపుతోంది. నాచారంలో తన పేరిట ఉన్న ప్లాట్ ను ఫోర్జరీ సంతకాలతో లీజ్ అగ్రిమెంట్ చేయించాడని కూతురు తూల్జ భవాని రెడ్డి ఉప్పల్ స్టేషన్లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే పై చీటింగ్తోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేరు కొంత కాలంగా వివాదస్పదంగా బయటకు వస్తోంది. నోటి దురుసుతనం, వ్యవహార శైలితో ఇంటా బయట విమర్శలు ఎదుర్కునే పరిస్థితి ఏర్పడింది. తాజాగా సొంత కూతురు తూల్జ భవాని రెడ్డి తన పేరిట నాచారంలో ఉన్న 159 గజాల కమర్షియల్ బిల్డింగ్కు సంబంధించి తన సంతకాన్ని తండ్రి ఫోర్జరీ చేసి కినారా గ్రాండ్కు అక్రమంగా లీజ్ అగ్రిమెంట్ చేయించాడని ఉప్పల్ పోలీసులకు ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. పోలీసులు పిబ్రవరి 4న ముత్తిరెడ్డి పై సెక్షన్ 406, 420, 463,464,468, 471, R/w 34ipc,156 (3)crpc ప్రకారం కేసులు నమోదు చేశారు. ముత్తిరెడ్డిపై ఆరోపణలు ► యశ్వంతపూర్లో బతుకమ్మ కుంట 6 ఎకరాల భూమిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆక్రమించారని గతంలో హైకోర్టుకు వెళ్ళారు మాజీ సర్పంచ్. బతుకమ్మ కుంట భూఆక్రమణపై అప్పటి కలెక్టర్ దేవసేనతో ముత్తిరెడ్డికి గొడవ సైతం జరిగింది. ► నర్మెట్ట మండలం హన్మంతపూర్ శివారులో ప్రభుత్వ భూమి 70 ఎకరాలు ఎమ్మెల్యే కబ్జా చేశాడని ఆరోపణలున్నాయి. ► చేర్యాల మండల కేంద్రంలోని అంగడి స్థలం ఎకరం 20 గుంటలు ఆక్రమించి ప్రహరీ నిర్మించాడని విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయంపై గతంలో అఖిలపక్షం ఆందోళనకు దిగి చెర్యాల బంద్కు పిలుపునిచ్చింది. ► గొల్లకురుమలు జీవనోపాధి కోసం కొనుగోలు చేసిన భూమిని సైతం ఎమ్మెల్యే వదల లేదనే ఆరోపణలు ఉన్నాయి. చదవండి: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు పెట్టిన కుమార్తె -
వీడియో: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు పెట్టిన సొంత కూతురు
-
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు పెట్టిన కుమార్తె
సాక్షి, హైదరాబాద్: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు నమోదైంది. ఆయన కూతురు తుల్జాభవని రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. 159 గజాల నాచారం ల్యాండ్ కమర్షియల్ బిల్డింగ్ విషయంలో ఆమె ఫిర్యాదు చేశారు. కినారా గ్రాండ్కు తన తండ్రి అక్రమ అగ్రిమెంట్ చేశారని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ముత్తిరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆయనపై సెక్షన్ 406, 420, 463,464,468, 471, R/w 34ipc,156 (3)crpc ప్రకారం కేసులు నమోదయ్యాయి. చదవండి: అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ యువతి మృతి -
సర్కారు బడుల్లో వన్ క్లాస్–వన్ టీవీ
జనగామ: దేశంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో కేంద్రం త్వరలోనే ‘వన్ క్లాస్–వన్ టీవీ’ కార్య క్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా డిజిటల్ బ్యాంకు యూని ట్ సేవలను ఆదివారం ప్రారంభించారు. జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డీబీయూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద గిరిరెడ్డితోపాటు కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అన్ని రకాల బ్యాంకు సేవలు డిజిటల్లో సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టార న్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించిన రూ.25లక్షల కోట్ల నగదును జన్ధన్ ఖాతాల ద్వారా అందించిందన్నారు. రాష్ట్రంలో 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ముద్ర రుణాల కింద రూ.2,750కోట్ల రుణాలను డిజిటల్ ద్వారా చెల్లించామని వెల్లడించారు. నిధులు పక్కదారి పట్టకుండా ఉత్తరాది రాష్ట్రాలకు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో చెల్లింపు ప్రక్రియ జరుగుతోందని, దీనిని దేశవ్యాప్తంగా అమలు చేసే ఆలోచన ప్రధాని చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు డిజిటల్ పద్ధతిలో రూ.300కోట్ల స్కాలర్షిప్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించిన ఖాతాలను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కోరారు. -
నేలపై పడుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసన
సాక్షి, జనగామ: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి యశ్వంతపూర్ గ్రామం వద్ద శనివారం వినూత్న నిరసనకు దిగారు. జనగామ మున్సిపాలిటి నుంచి యశ్వంతపూర్ వాగులోకి మళ్లించే మురికి కాల్వ విషయంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ సుశీల తన తీరు తీరు మార్చుకోవాలని కోరారు. యశ్వంతపూర్ వాగులోకి జనగామ మున్సిపాలిటీ మురికి కాల్వ వద్దని చెప్పి గతంలో తెచుకున్న కోర్టు స్టేను వెనక్కి తీసుకోవావాలని విజ్ఞప్తి చేశారు. మాజీ సర్పంచ్ తనకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నేలపై పడుకొని నిరసన తెలిపారు. స్టేను వెనక్కి తీసుకుంటేనే అభివృద్ది పనులకి శంకుస్థాపన చేస్తానని భీష్మించుకు కూర్చున్నారు. దాంతో మాజీ సర్పంచ్ సుశీల తన స్టే వెనక్కి తీసుకొని ఎమ్మెల్యేకి సహకరిస్తానని చేప్పడంతో ఆయన లేచి అభివృద్ది పనులకి శంకుస్థాపన చేశారు. గ్రామస్తుల ఆరోపణలివే.. యశ్వంతపూర్ గ్రామస్తుల అభ్యంతరాలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వివరణ ఇచ్చారు. ఫిల్టర్ చేసిన నీటినే వాగులోకి తరలిస్తామని చెప్పారు. అయినా కూడా తనను అడ్డుకోవడం సమంజసం కాదని హితవు పలికారు. విషయమేంటంటే.. జనగామ మున్సిపాలిటీకి సంబంధించి మురికి నీటి కాలువ బతుకమ్మ కుంటవద్ద నుంచి నెల్లుట్ల చెరువులోకి చేరుకునేది. ప్రస్తుతం కాలువను యశ్వవంతపూర్ వాగులోకి డైవర్ట్ చెయ్యడానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్లాన్ చేశారు. అయితే, బతుకమ్మ కుంట నుంచి నీటి కాలువ వెళ్లకుండా చేసి ముత్తిరెడ్డి భారీగా లాభ పడుదామని చూస్తున్నారని యశ్వంతపూర్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే తన అనుచరులతో బతుకమ్మ కుంట కింద వెంచర్ చేయించే ఆలోచనలో ఉన్నట్టు చెప్తున్నారు. -
అడవి పందులను చంపాలి.. తినాలి
సాక్షి, జనగామ: గ్రామాల్లో పంటలను నాశనం చేస్తున్న అడవి పందులను చంపడంతో పాటు తినే హక్కును కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి డిమాండ్ చేశారు. జనగామలో శనివారం ఆయన మాట్లాడారు. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలను తెలంగాణలో కూడా అమలు చేయాలన్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలను సాగు చేస్తున్న రైతులు.. అడవి పందులతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. -
రాజాసింగ్ను వెంటాడుతున్న కరోనా భయం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను కరోనా భయం వెంటాడుతోంది. తాజాగా ఆయన గన్మెన్కు కరోనా పాజిటివ్గా తేలడంతో ముందుస్తు జాగ్రత్తగా రాజాసింగ్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వాటి రిపోర్టు రావాల్సి ఉంది. దీంతో ఎమ్మెల్యేతో సమీపంగా మెలిగిన వారంతా ఆందోళన చెందుతున్నారు. కాగా తెలంగాణలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. జనగామ శాసస సభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాటు ఆయన కుటుంబ సభ్యులకు సైతం కరోనా పాజిటివ్గా తేలింది. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధర్, బీగాల గణేష్ గుప్తాకు సైతం వైరస్ సోకింది. (కరోనా వైరస్ బారిన మరో ఎమ్మెల్యే) తాజాగా నిర్వహించిన పరీక్షల్లో బాజిరెడ్డి భార్యతో పాటు ఆయన డ్రైవర్, గన్మెన్కు కూడా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారితో ప్రత్యేక్షంగా కలిసి వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి సైతం కరోనా సోకిన విషయం తెలిసిందే. మరోవైపు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు వైరస్ బారిన పడుతుండటంతో వారిని ప్రత్యక్షంగా కలిసి వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సైతం హోం క్వారెంటైన్లోకి వెళ్లారు. అనంతరం వీరికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్గా తేలడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక పోలీస్ శాఖలోనూ కరోనా తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులు వైరస్ బారినపడగా.. తాజాగా ముగ్గురు ఐపీఎస్ అధికారులకు పాజిటివ్గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగికి వైరస్ సోకడంతో.. అడిషనల్ డీజీ స్థాయి అధికారి హోం క్వారంటైన్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా జీహెచ్ఎంపీ పరిధిలో ఇప్పటి వరకు 180 మంది పోలీస్ సిబ్బంది కరోనా బారినపడ్డారు. -
ముత్తిరెడ్డిని కలిసిన ఏపీ టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి : ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి ప్రజా ప్రతినిధులు సైతం భయాందోళనకు గురువుతున్నారు. ఇటీవల తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలతో సహా, వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. దీంతో వారిని నేరుగా కలిసివారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన రేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సైతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా పాజిటివ్గా తేలిన జనగామ శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ఆయన ఇటీవల కలవడంతో వైద్యుల సూచన మేరకు సెల్ఫ్ క్వారెంటైన్కు వెళ్లారు. దీంతో శుక్రవారం రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలకు తాను హాజరుకావడం లేదంటూ అనగాని సత్యప్రసాద్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు లేఖ ద్వారా తేలియజేశారు. లేఖలో ఆయన ప్రస్తుత పరిస్థితిని వివరించారు. (టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్) ‘కరోనా నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న నేను రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ పాల్గొన్నలేకపోతున్నాను. ఇటీవల వ్యాపార రీత్యా జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డిని కలిశాను. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో నేను కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సెల్ఫ్ క్వారంటైన్ ఉంటున్నాను. కనుక శుక్రవారం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల ఓటింగ్కు వైద్యుల సలహా మేరకు హాజరు కాలేకపోతున్నాను. కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను హరిస్తున్నందున ఎవరి ప్రాణాలకు ముప్పు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొనకపోవడం చాలా బాధాకరంగా ఉంది.’ అంటూ లేఖలో పేర్కొన్నారు. (కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్) -
‘ముత్తిరెడ్డి’ డ్రైవర్ కుటుంబానికి కరోనా పరీక్షలు
రాయపర్తి: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి డ్రైవర్ రాయపర్తి మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ఉల్లెంగుల మధుకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన విషయం విధితమే. ఈ క్రమంలో డీఎంహెచ్ఓ మధుసూదన్ నేతృత్వంలో మైలారానికి చేరుకొని మధు కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. కరోనా లక్షణాలు కన్పించలేదని తెలిపారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. మాస్క్లు ధరించాలని కోరారు. జెడ్పీటీసీ రంగు కుమారస్వామి, వైద్యాధికారులు డాక్టర్ విపిన్, వెంకటేష్, సీహెచ్ఓ నెహ్రూచంద్, ఏఎన్ఎం అరుణ, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్
సాక్షి, జనగామ: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆయనకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అలాగే.. ఎమ్మెల్యే సతీమణి, డ్రైవర్, గన్మన్, వంట మనిషికి కూడా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో వీరంతా హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం జలుబు, దగ్గుతో బాధ పడుతున్న ముత్తిరెడ్డి.. డాక్టర్లను సంప్రదించారు. ఈనెల 11వ తేదీన హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. కాగా, కరోనా అనుమానంతో ఎమ్మెల్యే సతీమణి, డ్రైవర్, గన్మన్, వంట మనిషిలకు సైతం పరీక్షలు నిర్వహించగా.. శనివారం సాయంత్రం పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం తమ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎమ్మెల్యే సతీమణి వాయిస్ రికార్డు ద్వారా స్పష్టం చేశారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం రాష్ట్రంలో ఇదే తొలి కేసు. -
ఎమ్మెల్యే భార్యతో పాటు మరో ముగ్గురికి కరోనా
సాక్షి, హైదరాబాద్ : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు ఆయన భార్య కూడా కరోనావైరస్ బారిన పడ్డారు. ముత్తిరెడ్డి భార్య పద్మలతతో పాటు డ్రైవర్, గన్మెన్, వంట మనిషికి కూడా కరోనా సోకింది. దీంతో వీరంతా హోం క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారు. (చదవండి : టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్) కాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాదగిరిరెడ్డి ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం జలుబు, దగ్గు రావడంతో ముత్తిరెడ్డి వైద్యులను సంప్రదించారు. ఈనెల 11వ తేదీన ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్గా తేలింది. దీంతో అదే ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం రాష్ట్రంలో ఇదే తొలికేసు. మరోవైపు తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముత్తిరెడ్డి భార్య నియోజకవర్గ ప్రజలకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. -
ముత్తిరెడ్డికి పాజిటివ్.. భార్య స్పందన
సాక్షి, హైదరాబాద్ : జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంపై ఆమె సతీమణి పద్మలతా రెడ్డి స్పందించారు. ఆయన ఆరోగ్యంపై స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వాట్సప్ వాయిస్ రికార్డు ద్వారా ఓ ప్రకటన చేశారు. ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్గా తేలిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్తిరెడ్డి.. శుక్రవారం హైదరాబాద్లో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా తేలిందని చెప్పారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఎమ్మెల్యేకు వైరస్ సోకడంతో అధికారులు సూచనల మేరకు తమ కుటుంబ సభ్యులంతా పరీక్షలు చేయించుకున్నామని, వాటి రిపోర్టు రావాల్సి ఉందన్నారు. (ఎమ్మెల్యేకు పాజిటివ్: నిర్బంధంలోకి హరీష్) ప్రస్తుతానికి తామంతా స్వీయ నిర్బంధంలో ఉన్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని మరో వారంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. తమ నాయకుడి ఆరోగ్యంపై ఆరా తీస్తున్న కార్యకర్తలు, అభిమానులందరికీ ఆమె క్షతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని పద్మలతా సూచించారు. కాగా తెలంగాణలో కరోనా బారినపడిన తొలి ఎమ్మెల్యే ముత్తిరెడ్డినే కావడం గమనార్హం. మరోవైపు మంత్రి హరీష్ రావు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సైతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. -
రాజకీయ నేతలకు కరోనా భయం
-
ఎమ్మెల్యేకు పాజిటివ్: నిర్బంధంలోకి హరీష్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ రాజకీయ నేతలను వెంటాడుతోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గతరెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. ముత్తిరెడ్డి ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యేకు వైరస్ సోకడంతో ఆయన వెంట తిరిగిన నాయకులు, కార్యకర్తలంతా భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఆయన సమీప వ్యక్తులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. (కరోనా కల్లోలంలో హైదరాబాద్ బిర్యానీ!) మరోవైపు ఇప్పటి వరకు సేఫ్ జోన్గా సిద్దిపేటలో కరోనా కలకలం రేపుతోంది. మంత్రి హరీష్ రావు సమీప వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలడంతో.. మంత్రి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. మరోవైపు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయన వ్యక్తిగత సిబ్బంది, అధికారుల్లో కొంతమంది వైరస్ సోకడంతో ఎంపీ ముందస్తు జాగ్రత్తగా సెల్ఫ్ క్వారెంటైన్కు వెళ్లారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. మరోవైపు జీహెచ్ఎంసీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే మేయర్ బొంతు రామ్మోహన్ కారు డ్రైవర్కు కరోనా పాజిటివ్గా తేలడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. నేడు మరోసారి మేయర్కు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. మరికొందరు రాజకీయ ప్రముఖులు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు హైదరాబాద్ పయనమైనట్లు సమాచారం. (భయం గుప్పిట్లో సిద్దిపేట!) ఇక భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి రావడంతో ముందు జాగ్రత్త చర్యగా కలెక్టర్ సెల్ఫ్ క్వారంటైన్కు వెళ్లారు. దీంతో జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు అంతా అప్రమత్తమయ్యారు. కలెక్టర్ కార్యాలయంలోని పలువురు అధికారులు, వ్యక్తిగత సహాయకులు, భద్రతా సిబ్బంది, రాజకీయ నాయకులు.. ఒక్క శుక్రవారం రోజే మొత్తం 34 మంది తమ గొంతు స్రావాలను సిద్దిపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరీక్షలకు ఇచ్చారు. (స్వీయ నిర్బంధంలోకి సిద్దిపేట కలెక్టర్) -
వారు సభలో డబ్బాలు కొట్టుకునేవారు కానీ....
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరవై ఏళ్లు గోస పడ్డ తెలంగాణను ఈ అయిదేళ్లలో సీఎం కేసీఆర్ అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లారని ప్రశంసించారు. సాగు, త్రాగు నీరు, పవర్, రైతు బంధు లాంటి పథకాలు పెట్టి అభివృద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. ప్రతి అంశాన్ని అవగాహన చేసుకొనిసీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రవేశ పెట్టారని చెప్పారు. గతంలో ఉన్న నేతలు సభలో ఉబ్బాలు కొట్టుకునేవారు కానీ అభివృద్ధిపై చర్చించేవారు కాదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు.. ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క యూనిట్ కూడా కరెంట్ ఎక్కువగా ఉత్పత్తి చేయలేదనడం విడ్డూరంగా ఉందన్నారు. తమ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నీరు అందుతోందని చెప్పారు. వ్యవసాయానికి కూడా సాగు నీరు పుష్కలంగా అందుతోందన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణను అనుకరిస్తుందన్నారునిధులు, అభివృద్ధి కావాలంటారు కానీఅప్పులు వద్దంటారు.. మరి అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. గత ప్రభుత్వాలు అప్పులు చేయలేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పుకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా.. ఇంకా మారలేదని విమర్శించారు. -
ఎన్నికల తర్వాతచంద్రబాబు జైలుకే..
జనగామ: ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డుకు చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తామని జనగామ టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెప్పారు. సోమవారం జనగామ మండలంలోని పెంబర్తిలో ముత్తిరెడ్డి ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి పాలనలో నీళ్లను దోచుకుని, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లను కాలబెట్టిన బాబుతో కాంగ్రెస్ జతకట్టడం సిగ్గుచేటన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కూలగొట్టేందుకు చంద్రబాబు, ఆయన కోవర్టు రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. తెలంగాణను విచ్ఛిన్నం చేసేందుకు బాబు మాట్లాడిన కూతలు రికార్డు అయ్యాయని.. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబును చర్లపల్లి జైలుకు పంపించడం ఖాయమన్నారు. కొడంగల్లో రేవంత్కు ఓటమి ఖాయమన్నారు. -
'గులాబీ'లా ప్రచారాలు
సాక్షి, వరంగల్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారాలను జోరుగా సాగిస్తున్నారు. ఈ గులీబీ నేతలు వింత వింత ప్రదర్శనలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఒకరు చాయ్ వాలా వేషం వేస్తే ఇంకొకరు రైతన్నగా దర్శనం ఇచ్చారు. ఇలా కొంతమంది టీఆర్ఎస్ నాయకుల వింత ప్రచార వేషాలు. చాయ్వాలా.. నర్మెట: కన్నెబోయిన గూడెంలో టీలు అందిస్తున్న టీఆర్ఎస్ జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఓట్ల ‘గని’ మీదే.. భూపాలపల్లి: భూపాలపల్లి ఏరియాలోని కేటికే 1వ గని కార్మికులను ఓటు వేయాలని కోరుతున్న టీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి మధుసూదనాచారి బతుకులు మార్చేస్తా... రాయపర్తి: ఆరెగూడెంలో ప్రచారంలో భాగంగా కుమ్మరిసారె తిప్పుతూ కుండలు చేస్తున్న టీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి దయాకర్రావు రైతన్నగా పెద్ది నల్లబెల్లి: లెంకాలపల్లి గ్రామంలో మొక్కజొన్న చేనులో నాగలి దున్నతున్న టీఆర్ఎస్ నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి -
కాంగ్రెస్ మాయమాటలకు మోసపోవద్దు
జనగామ: కాంగ్రెస్ మాయమాటలను నమ్మి మోసపోవద్దని తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ నియోజకవర్గం సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లి, రేబర్తి గ్రామాల్లో ఆయన సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ జీవితమంటూ ప్రచారం చేసుకుం టున్న పొన్నాల లక్ష్మయ్య.. ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్నారు. వరుస కరువుతో వ్యవసాయాన్ని వదులుకున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇవ్వలేక పోయిందన్నారు. నాడు నీళ్లమంత్రిగా ఉన్న పొన్నాల ఒక్క చెరువు కూడా నింపలేక పోయాడన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తాను గోదావరి జలాలతో ఊళ్లకు పునీతం చేసి రూ.20కోట్ల పంట దిగుబడుల నుంచి రూ.350 కోట్లకు తీసుకువచ్చానని అన్నారు. రైతుల పక్షాన నిలబడి.. అన్ని వర్గాల ప్రజలకు సర్కారు ఫలాలను అందించి.. 24 గంటల పాటు అందుబాటులో ఉన్నానని, ఈ సారి ఆశీర్వదిస్తే.. జనగామను మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ముత్తిరెడ్డికి ఆయా గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
నీటి ఎద్దడికి పొన్నాలే కారణం
వరంగల్ / నర్మెట: ‘తెలంగాణలో నీటి ఎద్దడికి పొన్నాలే కారణం.. ఆనాడు భారీ నీటి పారుదల శాఖామంత్రిగా ఉండి ఆంధ్రా నాయకులతో కుమ్మక్కై తెలంగాణ రైతులకు తీరని ద్రోహం చేశాడు’ అని తాజా మాజీ ఎమ్మల్యే, టీఆర్ఎస్ జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి «అన్నారు. మండలంలోని అమ్మాపూర్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం సాగించిన పొన్నాల దేవాదుల నిర్మాణంలో తక్కువ వ్యాసం కలిగిన పైపులైన్ల వినియోగంతో తెలంగాణకు తీరని అన్యాయం చేశాడని దీంతో నీటిపంపింగ్ సామర్థ్యం తగ్గడంతో చెరువులు, కుంటలు నింపడం ఆలస్యమవుతోందన్నారు. వెచ్చించిన వేలకోట్ల ప్రజాధనం వృథాచేసి కరువుకు కారణమైన లక్ష్మయ్యను గ్రామాల్లోకి రాకుం డా అడ్డుకుని ఓటు ఆయుధంతో గుణపాఠం చెప్పాలన్నారు. సాగు,తాగునీటికి అలమటిస్తున్న తెలంగాణకు ఒక్కపైసా ఇవ్వనన్న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డికి ప్రజల ఉసురు తాకి పత్తాలేకుండా పోయాడని, పొన్నాల ఓటమి పాలయ్యాడన్నారు. మహిళలు బోనాలు, బతుకమ్మలతో ముత్తిరెడ్డికి స్వాగతం పలకగా ఆయన వారితో కలిసి బతుకమ్మ ఆడారు. గుండెపోటుతో ఇటీవల మృతిచెందిన పార్టీ నాయకుడు పెద్ద చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని ఓదార్చారు. అనంతరం టీడీపీకి చెందిన వంద మంది నాయకులు, కార్యకర్తలు పిట్టల రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరగా వారికి ముత్తిరెడ్డి కండువా కప్పి స్వాగతించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది రాజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఎండీ గౌస్, టీఆర్ఎస్వీ జిల్లా కన్వీనర్ వంగ ప్రణీత్రెడ్డి, మాజీ సర్పంచ్లు దేవరాయ కనకయ్య, కుంటి లక్ష్మయ్య, మాజీ ఎంపిటీసి చెక్కిల్ల నర్సమ్మ, చెక్కిల్ల రవీందర్ దంపతులు, బండి నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, ఇర్రి గాల్రెడ్డి, బుచ్చాల గాలయ్య, మండల యూత్ నాయకులు పార్నంది సతీష్ శర్మ, శశిరథ్, రవి పాల్గొన్నారు. -
వివాదాస్పద ఎమ్మెల్యేలకూ టిక్కెట్లు!!
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు వెళ్లే వ్యూహంలో భాగంగా అసెంబ్లీని రద్దు చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 105 మంది అభ్యర్థులతో కూడిన టీఆర్ఎస్ జాబితాను ప్రకటించారు. దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ ఈ జాబితాలో చోటు దక్కింది. కాగా వివాదాల్లో ఉన్న నేతలకు కూడా టికెట్ ఖారారు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. భూ వివాదంలో చిక్కుకున్న జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మరో అవకాశమిచ్చిన కేసీఆర్.. జర్మనీ పౌరసత్వం విషయంలో చట్ట పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ను అభ్యర్థిగా ప్రకటించి ఆశ్చర్యపరిచారు. వీరితో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్ట మధు, శంకర్ నాయక్, తాటికొండ రాజయ్యలకు కూడా అవకాశమిచ్చారు. ఇక, కాంగ్రెస్ నేత డీకే అరుణ సోదరుడు చిట్టం రామ్మోహన్ రెడ్డికి మక్తల్ నుంచి పోటీచేసే అవకాశం కల్పించారు. కాగా బాబూమోహన్, నల్లాల ఓదేలు తదితర సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయిచూపిన కేసీఆర్... పార్టీ మారిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్ ఖరారు చేయడం విశేషం. ఒకే కుటుంబంలో ఇద్దరికి.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా.. ఆయన తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావులు సిట్టింగ్ స్థానాల నుంచి పోటీ చేయనుండగా.. రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఇద్దరికి అవకాశం దక్కింది. తాండూరు నుంచి పట్నం మహేందర్ రెడ్డికి టికెట్ ఖరారు కాగా.. ఆయన సోదరుడు నరేందర్ రెడ్డి కొడంగల్ నియోజక వర్గం నుంచి పోటీచేయనున్నారు. -
మరో వివాదంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
జనగాం: టీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. జనగాం మండలం పెంబర్తిలోని ఓ వెంచర్ విషయంలో రాత్రి సమయంలో మహిళా వీఆర్వీ ఇంటికి వెళ్లి హల్చల్ చేశారు. మహిళా వీఆర్ఓతో దుందుడుకుగా, దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో నొచ్చుకున్న ఆ మహిళా వీఆర్ఓ, రెవిన్యూ ఉద్యోగ సంఘాల నాయకులకు ఈ విషయం తెలియ జేసింది. ఎమ్మెల్యే తీరుపై టీఆర్ఎస్ నాయకులు మహిళ వీఆర్ఓతో సద్దుమనిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మహిళ వీఆర్ఓ మాత్రం బాగా నొచ్చుకుని ఉండటం వల్ల పై అధికారులకు ఫిర్యాదు చేసేందుకే సమాయత్తం అయినట్లు తెలిసింది. ఎమ్మెల్యే తీరుపై సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. -
రైతులకు పాదాభివందనం చేసిన ఎమ్మెల్యే
తరిగొప్పుల : అన్నం పెట్టే రైతు దేవుడితో సమానమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే రైతులకు రైతు బంధు చెక్కులు, పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన రైతులు గుర్జకుంట ఎల్లయ్య, లకావత్ రాములు, కొండ సాయిలు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే రైతులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ అన్నం పెట్టే రైతు, సరిహద్దుల్లో కాపలా కాసే జవాన్ దేశంలో గొప్పవారని అన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎల్లప్పుడు కృషిచేస్తారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్లు ఎర్రోజు భిక్షపతి, నాంబాలయ్య, ముడికె సంపత్, వైస్ ఎంపీపీ నూకల కృష్ణమూర్తి, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ పెద్దిరాజిరెడ్డి, సమితి మండల కోఆర్డినేటర్లు జుంలాల్ నాయక్, చింతకింది సురేష్, ఉపసర్పంచ్ ముక్కెర బుచ్చిరాజు, చిలువేరు లింగం, అర్జుల సుధాకర్రెడ్డి, బీరెడ్డి జార్జిరెడ్డి, పోగుల మల్లేషం, ఎం.భిక్షపతి, ప్రమోద్రెడ్డి, తాళ్లపల్లి పోషయ్య, కొండం మధుసూదన్రెడ్డి, జయ్పాల్రెడ్డి, అంకం వెంకటేష్, వంగ రామరాజు, గొలుసుల రామరాజు, రవీందర్చారి, బొగం శ్రీనివాస్, తహసీల్దార్ మహ్మద్ సలీం, ఏడీఏ కల్పన పాల్గొన్నారు. -
హరీశ్రావుకు కోపమొచ్చింది
సాక్షి, జనగామ: తన ప్రసంగానికి మధ్యమధ్యలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆటంకం కల్పించడంతో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావుకు కోపం వచ్చింది. దీంతో ఇక తాను మాట్లాడలేనంటూ మైక్ను విసిరివేసి మధ్యలోనే వెళ్లిపోయారు. జనగామ జిల్లా లోని నర్మెట మండలం బొమ్మకూరులో నిర్మించిన జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్–3 ద్వారా నిర్మించిన పంప్హౌస్ను మంత్రి హరీశ్రావు శనివారం సాయంత్రం ప్రారంభించారు. పంప్హౌస్ నుంచి కన్నెబోయినగూడెం, లద్నూరు, తపాస్పల్లి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేశారు. అనంతరం బొమ్మకూరులో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ సమయాభావం వల్ల మంత్రి హరీశ్రావు మాట్లాడతారని చెప్పి మైక్ను అందించారు. హరీశ్ ప్రసంగం మొదలు పెట్టినప్పటి నుంచి ఎమ్మెల్యే చీటికిమాటికి పక్కనున్న వాళ్లను పిలుస్తూ మాట్లాడారు. ముత్తిరెడ్డి సభలో చేస్తున్న హడావుడిని గమనిస్తున్న మంత్రి.. ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. ఆయనవైపు చూస్తూ మాట్లాడవద్దని సైగ చేశారు. అయినప్పటికీ ముత్తిరెడ్డి సభకు దూరంగా ప్రజాప్రతినిధులను, పార్టీ శ్రేణులను పిలుస్తున్నారు. ముత్తిరెడ్డి వ్యవహారంతోపాటు పక్కనే ప్రారంభించిన పంప్హౌస్ మోటార్ల శబ్దంతో విసిగిపోయిన మంత్రి చేతిలోని మైక్ను విసిరివేశారు. వేదిక నుంచి బయటకు వెళ్తున్న హరీశ్రావును ఎమ్మెల్యే ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఆగకుండా వెళ్లిపోయారు. దీంతో వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోయారు. -
బతుకమ్మకుంట రీసర్వే
సాక్షి, జనగామ: కలెక్టర్ శ్రీదేవసేన, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల నడుమ విభేదాలకు కారణమైన బతుకమ్మకుంట వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు బతకుమ్మకుంటలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హద్దులు వేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో వారు ప్రభుత్వానికి మళ్లీ ఎలాంటి నివేదికను అందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. జిల్లా కేంద్రంలోని సూర్యాపేట రోడ్డులో ఉన్న ధర్మోనికుంట అలియాస్ బతుకమ్మకుంట సర్వేనంబర్ 85లో 9.10 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నియోజకవర్గానికి ఒక మినీట్యాంకు బండ్ను మంజూరు చేయగా, బతుకమ్మ కుంటను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టారు. 2015లో రూ. 1.4 కోట్ల నిధులతో బండ్ అభివృద్ధి పనులు చేశారు. ఈ తరుణంలో బతకుమ్మకుంటను ఆనుకుని ఉన్న కనుకదుర్గమ్మ ఆలయాన్ని విస్తరించారు. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్ల సమయంలో కలెక్టర్ అల్లమరాజు శ్రీదేవసేన, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మధ్య వివాదం తలెత్తింది. నిబంధనలకు విరుద్ధంగా బతుకమ్మకుంటను నిర్మించారని, కుంట భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారని కలెక్టర్ ఆయనపై బహిరంగ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బతుకమ్మకుంటలో మరో సారి సర్వే చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇరిగేషన్ రిటైర్డ్ ఈఈ గోపాల్, ఇరిగేషన్ డీఈ పొన్నాల కొమురయ్య, ఇరిగేషన్ ఈఈ శంకర్రావు, రెవెన్యూశాఖ నుంచి ఆర్ఐ రాజు, సర్వేయర్ ప్రకాశ్ నేతృత్వంలో అధికారుల బృందం శుక్రవారం కుంట హద్దులను పరిశీలించారు. కుంట వద్దనే ఉండి 4 వెపులా కొలతలు వేశారు. అసరమైతే మరోసారి కొలతలను వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఉన్నతాధికారుల సూచన మేరకే మరోసారి కుంటలో హద్దుల కొలతలను చేపట్టామని.. అంతకుమించి తమను ఏమి అడగవద్దని అధికారులు చెబుతున్నారు. బతుకమ్మకుంట వద్ద సర్వే చేయడం చర్చనీయాంశంగా మారింది. -
నా తప్పుంటే చర్యలు తీసుకోవచ్చు: ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్ : జనగాం జిల్లాలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై ఇరువురి మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. బతుకమ్మ కుంట విషయంలో తన తప్పు ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చునని ఆయన చెప్పారు. ఈ అంశంపై మంగళవారం సచివాలయంలో సీఎస్ ఎస్పీ సింగ్ను ముత్తిరెడ్డి కలిసి అక్కడి పరిస్థితులపై నివేదిక ఇచ్చారు. అనంతరం సచివాలయం మీడియా పాయింట్ మాట్లాడుతూ... బతుకమ్మ కుంట కబ్జాకు గురికాకుండా ఉండాలనే గోడ కట్టామన్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి కమిటీ వేయలేదన్నారు. జనగామ చెరువు సుందరీకరణకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందన్నారు. అఖిల పక్షం కమిటీ సూచన మేరకే స్థానికుల సౌకర్యం కోసం చెరువు అభివృద్ధి చేశామన్నారు. కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని, కలెక్టర్ ప్రభుత్వాన్ని బదునాం చేస్తున్నారని తెలిపారు. అనుభవంలేని కలెక్టర్ వల్లే ఈ సమస్య అని, పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని, ప్రభుత్వ ఆలోచనలకు విరుద్ధంగా కలెక్టర్ పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎందుకు కలెక్టర్పై చర్యలు తీసుకోవడంలేదని విలేకరుల ప్రశ్నించగా, అందుకు తగిన సమయం రావాలన్నారు. ఇప్పటికే ఈ అంశంపై సీఎస్కు ఫిర్యాదు చేశామన్నారు. -
జనగాం కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే
సాక్షి, జనగాం : గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు మధ్య నెలకొంటున్న వివాదాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పాలనాపరంగా వారికి అడ్డుతగులుతున్నారని, అవసరమైతే బదిలీ వేటు వేస్తున్నారని ఎమ్మెల్యేలపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనగాం జిల్లా కలెక్టర్ దేవసేనకు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మధ్య కొనసాగుతున్న వివాదం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్రమాలను ఇంత కాలం ఓపిక పట్టానని, ఇకపై ఏమాత్రం సహించేది లేదన్న రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారు. తాజాగా బతుకమ్మ కుంట వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి మీడియా సాక్షిగా ఎమ్మెల్యే అవినీతిని బయటపెట్టే ప్రయత్నం చేశారు. దాదాపు ఐదెకరాల కుంటను పూడ్చినట్లు ఎమ్మెల్యే వర్గంపై కలెక్టర్ దేవసేన ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు, అభివృద్ది పేరు చెప్పి డబ్బులు ఎలా వసూలు చేసిందీ? ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాన్ని మీడియాకు పూసగుచ్చినట్లు ఆమె వివరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరును దేవసేన చెప్పుకొచ్చారు. అప్పట్లో ఎమ్మెల్యే ఓ గుడిని కూడా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, దాన్ని తానే రద్దు చేశానని చెప్పుకొచ్చారు. బతుకమ్మ కుంట ప్రదేశం వివాదాస్పద స్థలంగా ఉండటంతోనే అక్కడ వేడుకలు నిర్వహించట్లేదని కలెక్టర్ దేవసేన తెలిపారు. కాగా, ఈ స్థల వివాదాలకు సంబంధించి ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై కలెక్టర్ గతంలోనే డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారంట. అయినా సరే! పెద్దగా చర్యలేవీ లేకపోవడంతో.. తానే స్వయంగా ఆయన అక్రమాల గురించి మీడియాకు వెల్లడించినట్లు అర్థమౌతోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా కొన్నిరోజుల క్రితం జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కలెక్టర్ దేవసేనను నిలదీయగా, ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఎంపీ బూరనర్సయ్య గౌడ్ జోక్యం చేసుకోవటంతో ఇరువురు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఎమ్మెల్యే ఇంటి ముందు మహిళల ఆందోళన
హైదరాబాద్: హబ్సిగూడలోని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంటిముందు మహిళలు రెండో రోజు ఆందోళన కొనసాగించారు. గత పదిహేనేళ్లుగా పెండింగ్లో ఉన్న అమ్ముగూడా భూ వివాదాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇంటి ముందు బైఠాయించారు. సైనిక్ పురి అమ్ముగూడ వద్ద 15 సంవత్సరాల క్రితం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి లేఅవుట్ చేసి 120 ప్లాట్లను అమ్మారు. హుడా అప్రూవుడ్ లేఅవుట్ అని చెప్పడంతో చాలా మంది మాజీ సైనికులు ప్లాట్లు కొనుగోలు చేశారు. అనంతరం ఇళ్ళు కట్టుకోవడానికి అనుమతి తీసుకుందామని వెళితే అధికారులు ఈ లేఅవుట్ పై కేసు నడుస్తోంది అనుమతీ ఇవ్వలేము అని చెప్పారు. దీంతో గత 15 సంవత్సరాలు గా తమ సమస్యను పరిష్కరించాలని భాదితులు ముత్తిరెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ తమ సమస్యను పరిష్కరించకపోవడంతో భాదితులు గురువారం హబ్సిగూడలోని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. -
అవినీతిని నిలదీస్తే అడ్డంగా రోడ్డేశారు!
‘సాక్షి’ విలేకరి ఇంటి స్థలంలో దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణం ► జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కనుసన్నల్లో అనుచరుల అరాచకం ► కొమురవెల్లి ఆలయంలో అక్రమాలపై కథనాలు రాయడమే పాపం ► మిక్సర్ ప్లాంటులో సిమెంటు, కంకర కలిపి తెచ్చి 30 నిమిషాల్లో 100 మీటర్ల రోడ్డు.. మంత్రి హరీశ్రావుకు ఫిర్యాదు.. ► నివేదిక తెప్పించుకొని న్యాయం చేస్తానని మంత్రి హామీ సాక్షి, సిద్దిపేట: మల్లన్న సన్నిధిలో అక్రమాలను ప్రశ్నించినందుకు అరాచకానికి తెగబడ్డారు.. అవినీతిని నిలదీస్తూ కథనాలు రాసినందుకు కన్నెర్రజేశారు.. ఒక్కో చెమట చుక్కను పోగేసి కొన్న ఇంటి స్థలాన్ని కబ్జా చేశారు.. ఇదేం ఘోరం అని ప్రశ్నిస్తే ‘ఇంకా చేస్తాం.. చూస్తావా?’ అంటూ బెదిరి స్తున్నారు.. ఇదంతా సాక్షాత్తూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కనుసన్నల్లో ఆయన అనుచరులు సాగిస్తున్న దాదాగిరి ఇది! వీరి అరాచకాలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు సైతం వంత పాడుతుండడం గమనార్హం!! అక్రమాలను ఎండగట్టినందుకే.. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలోని మల్లన్న గుడిలో ఏళ్లుగా జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’ సమరశంఖం పూరించింది. అవినీతిని ఎండగడుతూ.. ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై ఇటీవల వరుస కథనాలు ప్రచురించింది. ఈ కథనాలకు అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి దగ్గర నుంచి పోలీసు విజిలెన్స్ అధికారుల వరకు కొమురవెల్లిని సందర్శించి రికార్డులు తనిఖీ చేసి సీజ్ చేశారు. దీంతో ఆలయంలో జరుగుతున్న అక్రమాలు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. కొమురవెల్లి విలేకరి మాంకాలి నగేష్ ఈ వార్తలకు సమాచారం అందించాడనే అక్కసుతో కొమురవెల్లి సర్పంచ్ గీస భిక్షపతి, దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యుడు బద్దిపడిగ కృష్ణారెడ్డి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. కొమురవెల్లి దేవస్థానం పక్కన 217 సర్వే నంబర్లో నగేశ్కు 530 గజాల ఇంటి స్థలం ఉంది. తన కుమారుడి భవిష్యత్తు కోసం ఆయన ఈ ప్లాట్ను 2004లో కొనుగోలు చేసి 2009లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అనుచరులైన భిక్షపతి, కృష్ణారెడ్డి.. ఈ ప్లాటును దౌర్జన్యంగా కబ్జా చేశారు. ఈ నెల 19న ప్లాటు మీదుగా ఎల్లమ్మ గుడికి సీసీ రోడ్డు వేశారు. దీన్ని ఆపాలంటూ నగేష్తో పాటు ‘సాక్షి’ ప్రతినిధులు స్థానిక పోలీసు స్టేషన్ లో సీఐ చంద్రశేఖర్ను కలిసి ఫిర్యాదు చేసినా ఆయన స్పందించలేదు. సరికదా సర్పంచ్ దురాగతానికి తన సిబ్బందితో కలిసి వచ్చి రక్షణగా నిలిచారు. ‘సాక్షి’ ప్రతినిధులు రోడ్డు నిర్మాణ పనులను ఆపేందుకు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారు. బాధితుడు తన వద్ద ఉన్న డాక్యుమెంట్లను పోలీసులకు చూపినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రైవేటు మిక్సర్ ప్లాంటులో సిమెంటు, కంకర కలిపి తీసుకొచ్చి 30 నిమిషాల వ్యవధిలో 100 మీటర్ల సీసీరోడ్డు వేశారు. ఈ అరాచకాన్ని వివరిస్తూ ‘సాక్షి’ ప్రతినిధులు మంత్రి హరీశ్రావును కలసి వినతిపత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన ఆయన వాస్తవ పరిస్థితులపై నివేదిక తెప్పించుకుంటానని హామీ ఇచ్చారు. దుర్మార్గమైన చర్య నిజాలను వెలికి తీయడమే మా పని. వరుస కథనాలు రాశారని జర్నలిస్టులపై కక్ష సాధింపులకు పాల్పడటం దుర్మార్గమైన చర్య. ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే ఎమ్మెల్యేనే కాదు.. ఎవరినీ వదలిపెట్టం. దౌర్జన్యంగా ఆక్రమించి రోడ్డు వేసిన ఇంటి స్థలాన్ని తిరిగి నగేష్కు అప్పగించకపోతే ఉద్యమానికి సిద్ధమవుతాం. – విరాహత్ అలీ, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థలాన్ని తిరిగి ఇప్పించాలి.. లేదంటే ఉద్యమం మల్లన్న సన్నిధిలో కొనసాగుతున్న రాక్షస రాజ్యానికి ఇది పరాకాష్ట. ముమ్మాటికి మల్లన్న ఆలయంలో అక్రమాలు జరిగాయి. జర్నలిస్టుగా మేం దీన్ని వేలెత్తి చూపెట్టాం. తప్పా? తప్పు దిద్దుకోవాల్సిన ప్రజాప్రతినిధులు బరితెగించి జర్నలిస్టులపై విరుచుకుపడడం సిగ్గుమాలిన చర్య. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కల్పించుకొని ఇంటి స్థలాన్ని తిరిగి విలేకరికి అప్పగించాలి. లేకుంటే జర్నలిస్టు సంఘాలతో ఐక్య కార్యాచరణ వేసి ఉద్యమానికి సిద్ధమవుతాం. – విష్ణువర్ధన్ రెడ్డి, టీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి (143) జర్నలిస్టులు రోడ్డెక్కాల్సి వస్తుంది అక్రమాలపై కథనాలు రాస్తే విలేకరి ఇంటి స్థలాన్ని బలవంతంగా లాక్కుంటారా? ఇది ప్రజాస్వామ్యమా? రాక్షస రాజ్యమా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతుంటే జర్నలిస్టులు రోడ్డెక్కాల్సి వస్తుంది. తప్పు దిద్దుకునే వరకు ఉద్యమించాల్సి వస్తుంది. – క్రాంతికిరణ్ టీయూడబ్ల్యూజే, (143) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
పేదల పాలిట వరం కళ్యాణలక్ష్మి
జనగామ ఎమ్మెల్యేముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పలువురికి కళ్యాణలక్ష్మి, రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత జనగామ : రాష్ట్రంలోని పేదలు తమ పిల్లల పెళ్లిళ్లు చేయడంలో ఇబ్బంది పడొద్దనే భావనతోనే సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆర్డీఓ వెంకట్రెడ్డి అధ్యక్షతన జరిగిన బచ్చన్నపేట, జనగామ టౌన్, రూరల్ పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను యాదగిరిరెడ్డి పంపిణీ చేసి మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం ఆలోచిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్లు చెన్నయ్య, విజయభాస్కర్, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ బండ పద్మ, ఎంపీపీ బైరగోని యాదగరి, పస్తం మహేష్, జెడ్పీటీసీలు బాల్దె విజయ, వేముల స్వప్నతో పాటు నాగారపు వెంకట్, ఎండీ.అన్వర్, కొణ్యాల జనార్దన్రెడ్డి, దేవరాయ ఎల్లయ్య, కన్నారపు ఉపేందర్, మేడ శ్రీనివాస్, వెన్నెం శ్రీల త, గజ్జెల నర్సిరెడ్డి, వేమెళ్ల పద్మ, ఎజాజ్, బండ యాదగిరిరెడ్డి, బాల్దె సిద్దులు, కలింగరాజు, నల్లగోని బాలకిషన్, ఇర్రి రమనారెడ్డి, బోడిగం చంద్రారెడ్డి, వడ్డెపల్లి మల్లారెడ్డి, కనకయ్య, కొండయ్య, చొక్కం నర్సింహులు, వేముల విద్యాసాగర్, జావీద్, షబ్బీర్, వీఆర్వో రమేష్ ఉన్నారు. పెళ్లి రోజే కళ్యాణలక్ష్మి కానుక : ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. రఘునాథపల్లి/ లింగాల ఘణపురం (స్టేషన్ఘన్పూర్) : ఇక నుంచి పెళ్లి రోజే కళ్యాణలక్ష్మి కానుక అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. మండల కేంద్రంలోని తహసీల్ కా ర్యాలయంలో కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న 49 మంది లబ్ధిదారులకు గురువారం ఆయన చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆ పోటోలు అమ్మాయి తరపు పెద్దల సంతకాలతో తహసీల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ముహుర్తం నాటికి కళ్యాణలక్ష్మి చెక్కు అందజేస్తామన్నారు. కాగా, కళ్యాణలక్ష్మి పథకంలో ధరఖాస్తు చేసుకున్న పలువురు ఎస్టీలకు చెక్కులు మంజూరు కాకపోవడం పట్ల ఆ వర్గానికి చెందిన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, లింగాలఘణపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో 55 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజయ్య చెక్కు లు అందజేసి మాట్లాడారు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీలు బానోతు శారద, రంజిత్రెడ్డి, తహసీల్దార్లు కె.నారాయణ, రాజేందర్, ఎంపీపీ దాసరి అనిత, ఎంపీడీఓలు బానోతు సరిత, రవితో పాటు మల్కపురం లక్ష్మయ్య, రా జేందర్, సూర్య, జ్యోతి, రంజిత్, సుధాకర్, రాములు, శ్రీహరి, కొంరయ్య, నర్సింహ్మ, నాగేశ్వర్, యమున, రమాదేవి, స్వర్ణలత, కుమార్, పెండ్లి మల్లారెడ్డి, దొంగ అంజిరెడ్డి, సత్యనారాయణ, వెంకటయ్య, రాంబాబు, చెంచు రమేష్, లక్ష్మీనారాయణ, యాదయ్య, శ్రీనువాస్, మల్లారెడ్డి, సోమయ్య, విజయ్భాస్కర్, మదార్, స త్తమ్మ, మధు, రేగు అంజయ్య, చిట్ల ఉపేందర్రెడ్డి, భాస్కర్రెడ్డి, భాగ్యలక్ష్మి, మోహన్, రాజు పాల్గొన్నారు. -
సూర్యాపేట హైవేలో ప్రభుత్వ కార్యాలయాలు
ఆలయ భూమి పరిశీలించిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ : పట్టణ శివారు సూర్యాపేట హైవేలోని దేవాదాయ శాఖ భూమిలో జనగామ జిల్లా కార్యాలయాల నిర్మా ణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి తెలిపారు. ఆర్డీవో వెంకట్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మంగళవారం సాయంత్రం స్థలపరిశీలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాన రహదారి పక్కనే దేశాదాయశాఖ పరిధిలో ఉన్న 25 ఎకరాల స్థలంలో అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట నిర్మించుకోవచ్చని తెలిపారు. దీని పక్కనే ఉన్న గార్లకుంటలో ఉన్న 15 ఎకరాలను పోలీసు పరేడ్ గ్రౌండ్ కోసం వినియోగించుకోవచ్చని చెప్పారు. దేవాదాయశాఖ స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయాల కోసం పరిశీ లించాల్సిందిగా జిల్లా కలెక్టర్ను కోరుతామన్నారు. అలాగే, తాత్కాలికంగా ధర్మకంచలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహంలో కలెక్టర్, ఎస్పీ, ట్రెజరీ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రజల కోరిక మేరకు జనగామను జిల్లా చేసిన సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, డాక్టర్ సుగుణాకర్రా జు, కారింగుల రఘువీరారెడ్డి, పసుల ఏబేలు, కే.ఉపేందర్, ఆర్ఐ రాజు, వీ ఆర్వో రాజయ్య, రావెల రవి ఉన్నారు. జిల్లా కార్యాలయాలకు భవనాల పరిశీలన జనగామను జిల్లా చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ సానుకూల ప్రకటన చేయగా అధికార యంత్రాంగం పరుగులు పెడుతోంది. దసరా పండగ రోజు నుంచే నూతన జిల్లా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్డీవో వెంకట్రెడ్డి, డీఎస్పీ పద్మనాభరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గాడిపల్లి ప్రేమలతారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం భవనాలను పరిశీలించారు. కలెక్టర్, ఎస్పీ, ట్రెజరీ కార్యాలయాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై సమాలోచనలు చేస్తున్నారు. పురపాలకసంఘంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న భవనంతోపాటు ఇంటిగ్రేటెడ్ బాలికల హాస్టల్, ప్రగతి ఫార్మసి, వ్యవసాయ మార్కెట్లోని కాటన్ యార్డు, దేవాదుల క్వార్టర్స్, ఇండోర్ స్టేడియం గదులు, ధర్మకంచలోని బాలికల వసతిగృహం, 9 కమ్యూనిటీ హాళ్లను పరిశీలించి, ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు గుర్తించిన నూతన భవనాలను చూసేందుకు బుధవారం జనగామకు జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ రానున్నట్లు ఆర్డీవో పేర్కొన్నారు. ఆర్ఐ రాజు, వీఆర్వో రాజయ్య, నాయకులు గజ్జెల నర్సిరెడ్డి, బొల్ శ్రీనివాస్, ఆకుల సతీష్ ఉన్నారు. -
ముత్తిరెడ్డికి షాక్
ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి రెండు స్థానాలు విపక్షాలకే.. చెరొక స్థానాన్ని గెలచుకున్న కాంగ్రెస్, సీపీఎం జనగామ ఎమ్మెల్యేకు ఇబ్బందికర ఫలితాలు సాక్షిప్రతినిధి, వరంగల్ : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. జనగామ నియోజకవర్గంలో జరిగిన ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. పార్టీ గుర్తుపై జరిగిన ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఓడిపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వివిధ కారణాలతో ఖాళీ అయిన ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబరు 8న ఉప ఎన్నికలు నిర్వహించింది. ఇదే రోజు జనగామ మండలం మరిగడి, బచ్చన్నపేట మండలం నారాయణపురం ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండు ఎంపీటీసీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్, సీపీఎం చెరొక స్థానాన్ని గెలుచుకున్నాయి. రెండు ఎంపీటీసీ ఎన్నికలే అయినా... రాజకీయ పార్టీల గుర్తుపై జరిగినవి కావడంతో ఫలితాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఈ ఫలితాలు ప్రస్తుత తరుణంలో మరింత ఇబ్బందులు పెంచే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాల పునర్విభజన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి జనగామలో ప్రతికూల పరిస్థితులు మొదలయ్యాయి. జనగామ జిల్లా ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆశించిన మేరకు స్పందించలేదనే అభిప్రాయం నియోజకవర్గంలో ఉంది. జిల్లా ఏర్పాటుపై ముందుగా దూకుడుగా వెళ్లి, తర్వాత ప్రభుత్వ స్థాయిలో సరైన రీతిలో స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాల ఏర్పాటు సాధన సమితి వరుసగా నిర్వహిస్తున్న ఉద్యమ కార్యక్రమాలతో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ బంద్ నిర్వహించిన రోజు పలువురు ఉద్యమకారులు ఏకంగా ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ పరిణామం తర్వాత ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నియోజకవర్గంలోని కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గిందని టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. జిల్లాల పునర్విభజన ప్రక్రియతో సొంత పార్టీలోనూ ముత్తిరెడ్డికి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ జిల్లా ఏర్పాటు విషయంలో భువనగిరి లోక్సభ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్తో ముత్తిరెడ్డికి విభేదాలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న విడుదల చేసిన జిల్లాల పునర్విభజన ముసాయిదాలో జనగామ జిల్లా ప్రస్తావన లేదు. అప్పటి నుంచి ముత్తిరెడ్డికి జనగామ నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందులు పెరిగాయి. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు... టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు ముత్తిరెడ్డికి మరింత ఇబ్బందికరంగా మారాయి. – జనగామ మండలం మరిగడి ఎంపీటీసీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి డి.సిద్ధయ్య విజయం సాధించారు. సిద్ధయ్యకు 963 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి కళింగరాజుకు 710, సీపీఎం అభ్యర్థి బి.వెంకటరాజుకు 512, టీడీపీ అబ్యర్థి అశోక్కు 166, నోటాకు 28 ఓట్లు వచ్చాయి. – బచ్చన్నపేట మండలం నారాయణపురం ఎంపీటీసీ ఉప ఎన్నికలో సీపీఎం అభ్యర్థి ఎం.డి.మహబూబ్ విజయం సాధించారు. మహబూబ్కు 633 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పి.ఐలమ్మకు 519, నోటాకు 26 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఐలమ్మ పోటీ చేశారు. -
ముత్తిరెడ్డికి షాక్
ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి రెండు స్థానాలు విపక్షాలకే.. చెరొక స్థానాన్ని గెలచుకున్న కాంగ్రెస్, సీపీఎం జనగామ ఎమ్మెల్యేకు ఇబ్బందికర ఫలితాలు సాక్షిప్రతినిధి, వరంగల్ : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. జనగామ నియోజకవర్గంలో జరిగిన ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. పార్టీ గుర్తుపై జరిగిన ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఓడిపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వివిధ కారణాలతో ఖాళీ అయిన ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబరు 8న ఉప ఎన్నికలు నిర్వహించింది. ఇదే రోజు జనగామ మండలం మరిగడి, బచ్చన్నపేట మండలం నారాయణపురం ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండు ఎంపీటీసీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్, సీపీఎం చెరొక స్థానాన్ని గెలుచుకున్నాయి. రెండు ఎంపీటీసీ ఎన్నికలే అయినా... రాజకీయ పార్టీల గుర్తుపై జరిగినవి కావడంతో ఫలితాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఈ ఫలితాలు ప్రస్తుత తరుణంలో మరింత ఇబ్బందులు పెంచే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాల పునర్విభజన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి జనగామలో ప్రతికూల పరిస్థితులు మొదలయ్యాయి. జనగామ జిల్లా ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆశించిన మేరకు స్పందించలేదనే అభిప్రాయం నియోజకవర్గంలో ఉంది. జిల్లా ఏర్పాటుపై ముందుగా దూకుడుగా వెళ్లి, తర్వాత ప్రభుత్వ స్థాయిలో సరైన రీతిలో స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాల ఏర్పాటు సాధన సమితి వరుసగా నిర్వహిస్తున్న ఉద్యమ కార్యక్రమాలతో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ బంద్ నిర్వహించిన రోజు పలువురు ఉద్యమకారులు ఏకంగా ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ పరిణామం తర్వాత ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నియోజకవర్గంలోని కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గిందని టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. జిల్లాల పునర్విభజన ప్రక్రియతో సొంత పార్టీలోనూ ముత్తిరెడ్డికి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ జిల్లా ఏర్పాటు విషయంలో భువనగిరి లోక్సభ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్తో ముత్తిరెడ్డికి విభేదాలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న విడుదల చేసిన జిల్లాల పునర్విభజన ముసాయిదాలో జనగామ జిల్లా ప్రస్తావన లేదు. అప్పటి నుంచి ముత్తిరెడ్డికి జనగామ నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందులు పెరిగాయి. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు... టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు ముత్తిరెడ్డికి మరింత ఇబ్బందికరంగా మారాయి. – జనగామ మండలం మరిగడి ఎంపీటీసీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి డి.సిద్ధయ్య విజయం సాధించారు. సిద్ధయ్యకు 963 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి కళింగరాజుకు 710, సీపీఎం అభ్యర్థి బి.వెంకటరాజుకు 512, టీడీపీ అబ్యర్థి అశోక్కు 166, నోటాకు 28 ఓట్లు వచ్చాయి. – బచ్చన్నపేట మండలం నారాయణపురం ఎంపీటీసీ ఉప ఎన్నికలో సీపీఎం అభ్యర్థి ఎం.డి.మహబూబ్ విజయం సాధించారు. మహబూబ్కు 633 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పి.ఐలమ్మకు 519, నోటాకు 26 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఐలమ్మ పోటీ చేశారు. -
జిల్లా ఏర్పాటు ఖాయం
జనగామ : జనగామ జిల్లా ఏర్పాటు విషయం లో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నా రు. ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జేఏసీ నాయకులతో కలిసి గురువారం డి ప్యూటీ సీఎం మహమూద్ అలీని కలిశా రు. జనగామ జిల్లాకు ఉన్న అర్హతలు, పూర్తి నివేదికను ఆయనకు సమర్పించా రు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ హన్మకొండ వద్దనే డిమాండ్ పెరుగుతుండడంతో జనగామకు అవకాశాలు మెరుగుపడుతున్నాయన్నారు. కార్యక్రమంలో మా జీ ఎమ్మెల్యే సీహెచ్ రాజరెడ్డి, జేఏసీ నాయకులు డాక్టర్ రాజమౌళి, పోకల లింగయ్య, పజ్జూరి గోప య్య, పసుల ఏబేలు తదితరులు ఉన్నారు. -
ఒత్తిడిలో ముత్తిరెడ్డి!
జనగామలో ఆగని జిల్లా సాధన పోరు ఎమ్మెల్యేకు ప్రతికూలంగా పరిణామాలు జిల్లా విషయంలో ఎంపీతో విభేదాలు జేఏసీ నిరసనలతో ఉక్కిరిబిక్కిరి నియోజకవర్గం చీలికతో మరింత ఇబ్బందులు సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. జిల్లా సాధన ఐక్యకార్యాచరణ సమితి(జేఏసీ) కొనసాగిస్తున్న ఉద్యమ కార్యక్రమాలు ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి రాజకీయంగా ప్రతికూలంగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనగామ జిల్లా ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమాలతో ఈ ప్రాంతంలో తమకు ఇబ్బందులు పెరుగుతున్నాయని టీఆర్ఎస్ ముఖ్యనేతలు సైతం అంగీకరిస్తున్నారు. ఇదే విషయంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్కు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మధ్య విభేదాలు తీవ్రమైన సంఘటనను గుర్తుచేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య అంతరం పెరిగి పార్టీకి నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగానే... జనగామ జిల్లా ఏర్పాటు ఖాయమనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమైంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సైతం ఇదే విషయాన్ని పలుసార్లు, పలు వేదికలపై ప్రకటించారు. జనగామ జిల్లా సాధన కోసం స్థానికంగా ఐక్యకార్యాచరణ సమితి(జేఏసీ) ఏర్పాటైంది. జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో 116 రోజుల పాటు దీక్షలను చేస్తూ వచ్చింది. జనగామ జిల్లా ఏర్పాటవుతుందని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలూ లేవని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దీక్ష శిబిరం వద్ద ప్రకటించారు. జేఏసీ దీక్ష విరమించాలని కోరారు. ఆ తర్వాత జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఊపందుకోవడంతో పరిస్థితి మారిపోయింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనల్లో జనగామను చేర్చలేదు. దీంతో జిల్లా సాధన కోసం ఉద్యమాలు తీవ్రమయ్యాయి. నిరసనలు, మానవహారాలు, రాస్తారోకోలు, బంద్లు జరుగుతూ వచ్చాయి. జేఏసీకి తోడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకే గొంతు వినిపించడం మొదలుపెట్టాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ఒత్తిడి పెరిగింది. ఈ దశలో ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. జిల్లా సాధన కోసం జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు హింసాత్మకంగా మారడంతో పరిస్థితి తీవ్రమైంది. లాఠీచార్జీలు, అరెస్టులతో జనగామ దద్దరిల్లిపోయింది. ఈ సంఘటన తర్వాత ఉద్యమం కొంత స్తబ్ధుగా ఉంది. అప్పుడు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డిరెడ్డి పలు మండలాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొన్ని రోజుల క్రితం బెయిల్పై వచ్చిన జేఏసీ నేతలు మళ్లీ ఉద్యమం మొదలుపెట్టారు. ప్రతిరోజూ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి అధికారిక కార్యక్రమాలు మళ్లీ తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కారక్రమాన్ని గత వారం జనగామలో భారీ స్థాయిలో నిర్వహించినా ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. గతంలో ప్రతిరోజూ నియోజకవర్గంలో పర్యటించే ఎమ్మెల్యే ఇప్పుడు ఆ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండడంలేదని జనగామ సెగ్మెంట్ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గం ముక్కలు... జిల్లాల పునర్విభజన అంశం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి రెండు రకాలుగా ఇబ్బందులు పెంచుతోంది. జనగామ కేంద్రంగా జిల్లా ఏర్పాటు అంశంపై ఇప్పటికీ అస్పష్టత కొనసాగుతుండడంతో స్థానికంగా ఎమ్మెల్యేపై ప్రతికూలత మొదలైందనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు జిల్లాల పునర్విభజనలో జనగామ నియోజకవర్గం మూడు ముక్కలు అవుతోంది. జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు మండలాలు ఉన్నాయి. ప్రభుత్వం రూపొందించిన ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం... ఈ ఐదు మండలాలు మూడు జిల్లాల్లో ఉండనున్నాయి. జనగామ, బచ్చన్నపేట మండలాలు యాదాద్రి జిల్లాలో... చేర్యాల, బచ్చన్నపేట మండలాలు సిద్ధిపేట జిల్లాలో... నర్మెట మండలం వరంగల్ జిల్లాలో కలపాలని ప్రభుత్వం ప్రతిపాదనల్లో పేర్కొన్నది. అసెంబ్లీ సెగ్మెంట్ మూడు జిల్లాల్లో ఉంటే... ఎమ్మెల్యేకు రాజకీయపరంగా పట్టు తగ్గుతుందనే ప్రచారం జరుగుతోంది. వేర్వేరు జిల్లాల్లో ఉండే ద్వితీయ శ్రేణి నేతలను ఇప్పటిలా సమన్వయం చేయడం ఆయనకు ఇబ్బందిగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
జనగామ జిల్లా పోరు ఉద్రిక్తం
- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంటి ముట్టడికి యత్నం - లాఠీచార్జి... ఆర్టీసీ బస్సును తగలబెట్టిన ఉద్యమకారులు జనగామ: వరంగల్ జిల్లాలోని జనగామను జిల్లా చేయాలన్న ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం తలపెట్టిన జనగామ బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల ముందుస్తు అరెస్టులతో మరింత వేడి రగిలి, రణరంగంగా మారింది. జనగామ జిల్లా ఏర్పాటు చేయూలని డిమాండ్ చేస్తూ అన్ని వర్గాల ప్రజలు వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపైకి వచ్చారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, వ్యాపార, వాణిజ్య, కార్మిక వర్గాలతో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు రహదారిని దిగ్బంధించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రాస్తారోకో మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. ఒక్కసారిగా ఉద్రిక్తం... శాంతియుతంగా జరుగుతున్న ఆందోళన ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఉద్యమకారులు కొంత మంది హైదరాబాద్ రహదారిలో ఉన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుంటూ ఎమ్మెల్యే ఇంటివైపు వెళుతుండడంతో పోలీసులు పలుమార్లు లాఠీచార్జి చేశారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. జేఏసీ ప్రతినిధి ఆకుల సతీశ్ను బలవంతంగా జీపులో ఎక్కించుకున్న పోలీసులు... మరికొందరు యువకులను లాక్కెళ్లారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆందోళన కొనసాగుతుండగానే గుర్తుతెలియని వ్యక్తులు హైదరాబాద్ రోడ్డుపైనున్న జనగామ డిపో ఆర్టీసీ బస్సుకు నిప్పంటించారు. మంటలా ర్పేందుకు వచ్చిన ఫైరింజన్ను మున్సిపల్ చైర్మన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, టీఆర్ఎస్, జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో బస్సు పూర్తిగా తగలబడిపోయింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆందోళన కొనసాగింది. ట్రాఫిక్ పెద్దఎత్తున నిలిచిపోరుుంది. కాగా, ఉద్యమకారులపై పోలీసుల లాఠీచార్జికి నిరసనగా శనివారం జనగామ నియోజకవర్గ బంద్ నిర్వహించనున్నట్టు జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి తెలిపారు. -
జిల్లా ఏర్పాటుకు ఎమ్మెల్యే కృషి
ముత్తిరెడ్డిపై ఆరోపణలు చేయడం తగదు టీఆర్ఎస్ నాయకులు జనగామ : జనగామ జిల్లా కోసం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మొదటి నుంచి ఎనలేని కృషి చేస్తూనే, ఉద్యమంలో కీ లక పాత్ర పోషించాడని మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, మండల అధ్యక్షులు మేకల కలింగరాజు, పసుల ఏబేలు, కారింగుల రఘువీరారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొణ్యా ల జనార్దన్రెడ్డి, కౌన్సిలర్లు గజ్జెల నర్సిరెడ్డి, ఎజాజ్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా ఏర్పాటు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని తెలిపారు. జిల్లాకు కావాల్సిన పూర్తి నివేదికను చీఫ్ సెక్రెటరీ రాజీ వ్ శర్మకు ఎమ్మెల్యే అందజేశారని అన్నారు. జనగామ జిల్లా కావడం లేద ని వస్తున్న పుకార్లలో నిజం లేదని, హైదరాబాద్లో ఆరూరి రమేష్, తాటికొండ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్రావు, గొంగిడి సునీతను కలుపుకుని ముత్తిరెడ్డి సీఎంను కలిసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా ఉద్యమంలో అధికార పార్టీ కీలకపాత్ర వహించడమే కాకుండా, ఎమ్మెల్యే స్వయంగా దీక్షలను సందర్శించి తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే దిష్టిబొమ్మలతో యాత్ర చేయడం సరి కాదన్నారు. అధికార పార్టీలో ఉంటూ జిల్లా కోసం తామంతా పనిచేస్తుంటే, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎక్కడ ఉన్నారో ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు చేర్యాల, మద్దూరును సిద్ధిపేటలో కలపాలని డిమాండ్ చేస్తూ, ఒకే నియోజకవర్గంలో రెండు రకాల ఉద్యమాలను చే స్తూ జిల్లా రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. జిల్లా సాధనలో పార్టీలకతీతంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి తామంతా ముందుండి పోరాడుతామని తెలిపారు. జిల్లా కోసం పనిచేసే ఎమ్మెల్యే రాజీనామా చేయాలని ఆయనపై ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. సమావేశంలో నాయకులు ఆలూరి రమేష్, ఉల్లెంగుల కృష్ణ, రామకృష్ణ, సింగరి ప్రశాంత్ ఉన్నారు. -
రగిలిన ‘జనగామ’
జనగామ జిల్లా కోసం రోడ్డెక్కిన ఉద్యమకారులు ఎమ్మెల్యే దిష్టిబొమ్మతో యాత్ర సీఎం ఫ్లెక్సీ దగ్ధం ఆందోళనకారుల తోపులాట, అరెస్టు జనగామ : జనగామ జిల్లా పోరు ఉగ్రరూపం దాల్చింది. కొత్త జిల్లా జాబితాలో పేరు చేర్చాల్సిందేనంటూ ఉద్యమ కారులు ఆందోళనను తీవ్రతరం చేశారు. వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, భూపాలపల్లి పేర్లు ప్రస్థావనకు రావడం, జనగామ పేరు లేకపోవడంతో బుధవారం పట్టణంలోని ఆర్టీసీ చౌరాస్తాలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. జిల్లా సాధన సమి తి, ఐకాసా ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దిష్టి బొమ్మతో నిర్వహించిన యాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీ సింది. ఎమ్మెల్యే దిష్టిబొమ్మతో యాత్ర చేస్తుం డగా..ఎస్సై సంతోషం రవీందర్ తన పోలీసుల బలగాలతో అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసులు, ఉద్యమకారుల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే దిష్టిబొమ్మను తగులబెట్టేం దుకు ప్రయత్నించగా, ఎస్సై , పోలీసు సిబ్బం ది దానిని లాక్కునేందుకు తీవ్ర ప్రయత్నం చేశా రు. ఈ క్రమంలోనే కొంత మంది సీఎం కేసీఆర్ ఫ్లెక్సికి నిప్పుపెట్టి దగ్ధం చేసి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి, ఉద్యమంలో కలవాలని నినాదాలు చేశారు. ఆందోళన చేస్తు న్న జిల్లా సాధన సమితి కన్వీనర్ మం గళ్లపల్లి రాజు, మేడ శ్రీనివాస్, జక్కుల వేణుమాధవ్, ఆకుల వేణుగోపాల్రావు, పర్శరాములు, తీగల సిద్దూగౌడ్, ధర్మపురి శ్రీనివాస్, రమేష్, మాజీ ద్, తిప్పారపు విజయ్ తదితరులను పోలీసులు బలవంతంగా వాహనం ఎక్కించారు. మంగళ్లపల్లి రాజు తప్పించుకుని తన అనుచరులతో పోలీసు వాహనానికి అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. డాక్టర్లు రాజమౌళి, సుగుణాకర్రా జు, లక్ష్మీనారాయణ నాయక్, పెద్దోజు జగదీష్, శ్రీనివాస్రెడ్డి, మాశెట్టి వెంకన్న, జి.కృష్ణ, కేమిడి చంద్రశేఖర్, కాసుల శ్రీనివాస్ వారి మద్దతుగా నిలిచారు. ఆర్టీసీ చౌరస్తాలో ఉద్రిక్తత పరిస్థితు లు నెలకొనడంతో మరికొంత మంది పోలీ సులు అక్కడకు చేరుకున్నారు. ఆందోళన చేస్తు న్న వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్యే రాజీనామా చేయాలని టవరెక్కిన యువకులు జనగామ జిల్లా కోసం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను తెలియజేయాలని కోరుతూ ఐదుగురు యువకులు సెల్టవర్ ఎక్కడ నిరసన తెలిపారు. పట్టణంలోని డాక్టర్ లక్ష్మీనారాయణ నర్సింగ్ హోమం పక్కన వ్యాపారి సిద్ధయ్య భవనంపై ఉన్న సెల్ టవర్ పైకి మాజీద్, గండి నాగరాజు, సౌడ మహేష్, ఇరుగు రమేష్, బొట్ల సాయిలు ఎక్కగా, నాగరాజు అనే యువకుడు పెట్రోల్ బాటిల్తో నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలసుకున్న ఎస్సై రవిందర్ చేరుకుని యువకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, జి.క్రిష్ణ, రెడ్డి రత్నాకర్రెడ్డి, డాక్టర్లు లక్ష్మీనారాయణ, రాజమౌళి ఫోన్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తో మాట్లాడారు. అక్కడి నుంచి సరైన సమాధా నం రాకపోవడంతో యువకులు కిందకు దిగేం దుకు నిరాకరించారు. యువకుడు మాజీద్ను బలవంతంగా కిందకు పిలిపించి ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడించి, చర్చలు జరిపినా నలుగురు యువకులు మాత్రం ఎమ్మెల్యే రాజీ నా మా చేసి, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఐ చెన్నూరి శ్రీనివాస్ అక్కడకు చేరుకోగా, అరెస్టు చేసిన వారిని విడుదల చేసి ఇక్కడకు తీసుకురావడమే కాకుండా, ఆర్డీఓ రావాలని పట్టుబట్టారు. టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు బండ యాదగిరిరెడ్డి, మేకల కలింగరాజులు ఆర్డీఓ వెంకట్రెడ్డితో పాటు అరెస్టు చేసిన ఉద్యమకారులను సెల్టవర్ వద్దకు తీసుకవచ్చారు. జనగామ జిల్లా సాధన ఉద్యమం, జిల్లాకు కావాల్సిన వనరులకు సంబంధించి ప్రభుత్వానికి మరోసారి తెలియజేస్తామని హామీ ఇవ్వడంతో యువకులు కిందకుదిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలేని జనగామను ఊహిం చుకోలేమని, అన్యాయం చేస్తే అగ్నిగుండా మారుస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉద్యమంలో కలిసి వస్తే జిల్లాకు మరింత బలం చేకూరుతుందన్నారు. రాజును ఏరియా ఆస్పత్రికి తరలింపు పోలీసుల పెనుగులాటలో గాయాలపాలైన మంగళ్లపల్లి రాజును ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు సుగుణాకర్రాజు పర్యవేక్షణలో వైద్య పరీక్షలు చేయగా, ల క్ష్మీనారాయణనాయక్, రాజమౌళి హుటాహుటిన అక్కడకు వెళ్లారు. -
విఐపి రిపోర్టర్ - ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
-
అందరికీ ‘ఆసరా’
తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం.. ఆ తర్వాత టీఆర్ఎస్ సర్కారు ఏర్పడి ఆరు నెలలు అవుతోంది. కొత్త ప్రభుత్వ నిర్ణయాలు, విధివిధానాలు, పథకాలు ఎలా ఉన్నాయి? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వంటి అంశాలపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్థానికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ‘సాక్షి’ తరఫున రిపోర్టర్గా మారారు. టీఆర్ఎస్ పాలన, నియోజకవర్గ అభివృద్ధి, ప్రస్తుత సమస్యలపై అక్కడి జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, రైతులు, మత్స్యకార్మికులు, మహిళలను అడిగి తెలుసుకున్నారు. కష్టాన్ని నమ్ముకుని ఆటోడ్రైవర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే అయ్యాను. పేదల కష్టాలు ఎట్లుంటయో తెలుసు. ప్రజల సంక్షేమమే ధ్యేయం. ‘సాక్షి’ వేదికగా నియోజకవర్గంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన సమస్యలపై స్పందిస్తా. నా స్థాయిలో ఉన్నవి తీరుస్తా. విధానాలకు సంబంధించిన వాటిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా. రిజర్వాయర్ పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తా. అన్నం పెట్టే అన్నదాతకు లో ఓల్టేజీ కరెంట్ కష్టాలు రావొద్దు. గానుగుపాడ్, వడ్లకొండ, బెక్కల్, మద్దూరులో సబ్స్టేషన్ల ఏర్పాటుతో సమస్యను పరిష్కరిస్తా. సబ్స్టేషన్ల కోసం స్థల సేకరణ వేగంగా జరుగుతోంది. నిత్యం జనానికి అందుబాటులో ఉంటా. కేసీఆర్ ఆశీస్సులతో అభివృద్ధి చేస్తా. - ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టింగ్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పథకం అర్హులకు అందుతుందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? బాల్దె విజయ : ‘ఆసరా’ అమలుతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు మేలు జరుగుతుంది. గత ప్రభుత్వాలు రూ.200 పింఛన్ ఇచ్చినా సరిపోక పోయేది. ఇప్పుడు ప్రభుత్వం వికలాంగులకు రూ.1500, మిగతా వారికి రూ.1000 ఇవ్వడం సంతోషంగా ఉంది. కొందరు అర్హులు పింఛన్ జాబితాలో పేరులేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. అటువంటి వారికి పింఛన్ ఇవ్వాలి. ముత్తిరెడ్డి : ‘కాకతీయ మిషన్’ ద్వారా మేలు జరుగుతుందని భావిస్తున్నారా? మేకల కళింగరాజు : జనగామ నియోజకవర్గం మొదటి నుంచీ కరువు ప్రాంతమే. ఎమ్మెల్యే కృషితో నియోజకవర్గంలోని రిజర్వాయర్లు, చెరువులను దేవాదుల నీటితో నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయి. ‘కాకతీయ మిషన్’ ద్వారా చెరువుల్లోని పూడిక తీసి పొలాల్లో వేస్తే చెరువుల్లో నీటి నిల్వలు పెరుగుతారుు. అదేవిధంగా.. పంట పొలాలకు భూసారం పెరుగుతుంది. తద్వారా మేలు జరుగుతుందని భావిస్తున్నాం. ముత్తిరెడ్డి : చెరువులు నింపడం ద్వారా మత్స్యకారులకు మేలు జరుగుతుందా? చిన్నబోయిన నర్సయ్య : చేపల పెంపకానికి అనువుగా ఉంటుంది. అలాగే.. మత్స్యకారులకు రుణాలు ఇవ్వాలి. చేప విత్తనాలు ప్రభుత్వం అందిస్తే బాగుంటుంది. ముత్తిరెడ్డి : హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుతో జనగామ ప్రాంతానికి ఎటువంటి లబ్ధి చేకూరుతుందని అనుకుంటున్నారు? పరిశ్రమలకు ఇక్కడ భూములు అనుకూలంగా ఉన్నాయా? బాల్దె సిద్ధులు : ఇండస్ట్రీయల్ కారిడార్తో ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని నమ్ముతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ ప్రకటించిన కారిడార్నిర్ణయంపై యువత ఆశలు పెంచుకుంది. పరిశ్రమలకు సరిపడా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు పెంబర్తి వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేయాలి. ఇది రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతం. ముత్తిరెడ్డి : రిజర్వాయర్ కాల్వలకు డెలివరీ పాయింట్స్ పెట్టారా? వ్యవసాయానికి లో ఓల్టేజీ సమస్య ఉందా? దాసరి రవి : గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చెరువుల్లోకి దేవాదుల నీటి పంపింగ్లో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు అవసరమున్న చోట డెలివరీ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నారు. దేవాదుల నీటితో రిజర్వాయర్లు, చెరువులు నింపడం రైతుల్లో ఆనందం నింపుతోంది. నియోజకవర్గంలో ఉన్న లో ఓల్టేజీ సమస్యను నివారించాలి. ఇందుకు గానుగుపాడ్లో సబ్స్టేషన్, ట్రాన్స్పార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు వేగంగా చేయూలి. ముత్తిరెడ్డి : జనగామ ప్రజలకు మునిసిపాలిటీ ద్వారా పాకు రు నీళ్లు సరఫరా అయ్యేవి? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? తిప్పారపు ఆనంద్ : జనగామ ప్రజలు పాకురు నీళ్లు తాగలేక కొన్ని నెలల క్రితం అవస్థలు పడ్డారు. చీటకోడూరు రిజర్వాయర్ శుద్ధికి చర్యలు తీసుకోవడంతో ప్రజలకు శుద్ధమైన నీళ్లు సరఫరా అవుతున్నాయి. ముత్తిరెడ్డి : చీటకోడూరు రిజర్వాయర్ నింపడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందా? ఏమైనా చెరువులు నింపారా? చిట్ల ఉపేందర్రెడ్డి : చీటకోడూరు రిజర్వాయర్ నింపడం ద్వారా భూగర్భజలాలు పెరిగాయి. రిజర్వాయర్ కాల్వ వెంట 170 మందికి పైగా రైతులు మోటార్లను బిగించుకుని పొలాలకు నీరు పారిచ్చుకున్నారు. ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి 14 కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ వెంట అశ్వరావుపల్లి రిజర్వాయర్ వరకు పాదయాత్ర చేశారు. కాల్వ వెంట తెరిచిన తూములను మూసివేసేందుకు రైతులకు నచ్చజెప్పారు. రిజర్వాయర్ నిండిన తర్వాత చైడారం చెరువులను నింపడం సంతోషం. మిగతా చెరువులు నింపితే బాగుంటుంది. ముత్తిరెడ్డి : జనగామలోని 53/1 సర్వే నంబర్లో ఇళ్ల పట్టాల సమస్యలు ఉన్నాయూ? పరిష్కారం అవుతాయన్న నమ్మకం మీకు ఉందా? ఉల్లెంగల కృష్ణ : 53/1 సర్వే నంబర్లో ఇళ్లు నిర్మాణం చేసుకున్న వారికి పట్టాలు రాలేదు. రుణాలు తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే హయాంలో సమస్య పరిష్కారమవుతుందని నమ్ముతున్నాం. ముత్తిరెడ్డి : జనగామ ఏరియా ఆస్పత్రిలో రోగులకు వైద్యం అందుతుందా? సమస్యలు పరిష్కారమయ్యాయా? సేవెల్లి సంపత్ : గతంతో పోలిస్తే వైద్య సేవలు మెరుగయ్యాయి. వైద్యులు మెరుగైన విధంగా పనిచేయాలి. పీహెచ్సీలో వైద్యుల నిర్లక్ష్యం ఉంది. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి వైద్యం అందించాలి. ముత్తిరెడ్డి : సీఎం సహాయ నిధితో ఏమైనా లబ్ధి..? మంద లక్ష్మణ్ : సీఎం సహాయ నిధి విషయంలో గతంలో నాయకులే దళారుల అవతారం ఎత్తేవారు. ఇప్పుడు అలా లేదు. నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు రూ.15 లక్షలకు పైగా నిధులు వచ్చినట్లు సమాచారం. ముత్తిరెడ్డి : పార్కుల పరిస్థితి ఎలా ఉంది? మేడబోయిన అనిత : పార్క్లు సేద తీరేందుకు అనువుగా లేవు. పార్కులను అభివృద్ధి చేసి వాడకంలోకి తేవాలి. ముత్తిరెడ్డి : మహిళల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ఆత్మకూరి రాణి : గతంలో మహిళా సంఘాలకు రూ.5 లక్షల రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడు రూ.10 లక్షలకు పెంచారు. మహిళా సమాఖ్య భవనాలు పూర్తి చేయూలి. మహిళలు ఎదిగేందుకు ఇంకా ప్రోత్సాహం అందించాలి. ముత్తిరెడ్డి : హస్తకళల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాలి? మనకు పెంబర్తి ఉంది కదా? బుడిగె శ్రీనివాస్ : హస్త కళాకారులకు కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలి. కూర్చొని పనిచేయడం వల్ల నడుము, కాళ్ల నొప్పులు, కంటి చూపు సమస్యలు వస్తున్నారుు. దీని దృష్ట్యా 50 ఏళ్లకే పింఛన్ సౌకర్యం కల్పించాలి. డీఆర్డీఏ ఆధ్వర్యంలో గతంలో ఇక్కడి కళాకారులు శిక్షణ పొందారు. బ్యాంకులు ఇచ్చే రుణాలు సరిపోవడం లేదు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల రుణాలివ్వాలి. కళాకారులు ఉత్పత్తి చేసే వస్తువులకు మార్కెటింగ్ అవకాశాలు పెంచాలి. ప్రభుత్వ వైబ్సైట్ ఏర్పాటు చేసి ప్రచారం కల్పించాలి. మల్యాల వేణు : పెంబర్తి హస్త కళాక్షేత్రంలో వస్తువులు అమ్మకానికి(డిస్ప్లే) పెట్టే విషయంలో సమస్య ఉంది. రూ.20 లక్షల నిధులు కావాలి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. రుణాలు అందించి కళాకారులకు చేయూత నివ్వాలి. ముత్తిరెడ్డి : కొమురవెల్లి ఆలయ అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాలి? ఇమ్మడి శ్రీనివాస్రెడ్డి : కొమురవెళ్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు ఈ నెలలో ప్రారంభం కానున్నాయి. మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ఆలయ అభివృద్ధికి కేసీఆర్ కృషి చేయాలి. ముత్తిరెడ్డి : గొర్ల కాపరుల సంక్షేమానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? కోరె మల్లేష్ : గొర్రెలను పేంచేందుకు గ్రామ శివార్లలో పోరంబోకు భూములు కేటాయించాలి. రుణాలు అందించి ఆర్థికంగా చేయూత ఇవ్వాలి. ముత్తిరెడ్డి : మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నాడా? బోళ్ల సంపత్, తిప్పారపు ఆనంద్ : అందుబాటులో ఉంటున్నాడు. గతంలో వారికంటే నయం. -
రియల్ హీరో
పదో తరగతిలోనే తెలంగాణ ఉద్యమంలోకి.. పోలీస్స్టేషన్పై దాడిచేసి మిత్రుడిని విడిపించుకున్నా 25పైసల కోసం ఆటోలు కడిగా తప్పుచేస్తే తిరగబడేటోడిని.. కలెక్టర్నే అందరిముందు నిలదీశా జిల్లాలో మొట్టమొదట బెంజికారు కొన్నది నేనే..సోనియాగాంధీ ఎంపీ టికెట్ ఇవ్వాలనుకున్నారు మూడో ప్రయత్నంలో పొన్నాలపై గెలిచా జనగామను అభివృద్ధిచేసి ప్రజల రుణం తీర్చుకుంటా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అంతరంగం ఆయన చూడడానికి ‘అంకుశం’ సినిమాలో విలన్ రాంరెడ్డి మాదిరిగా ఉంటారు. కానీ, నిజ జీవితంలో మాత్రం హీరోనే. కష్టాలు ఎదురైనా మనోస్థైర్యంతో ఎదుర్కొన్నారు. దసరా రోజు పస్తులున్న దుర్భరస్థితి నుంచి జిల్లాలోనే బెంజికారు కొన్న మొదటి వ్యక్తిగా నిలిచారు. చిన్నప్పటి నుంచీ తెగింపు స్వభావం. పదో తరగతిలోనే తెలంగాణ ఉద్యమంలో పోలీస్ స్టేషన్పై దాడిచేసి మిత్రుడిని విడిపించుకున్నారు. ఉద్యమం వద్దని తన మేనమామ మందలించడంతో హైదరాబాద్ బాట పట్టి ఆటో డ్రైవర్గా మారారు. యూనియన్కు అధ్యక్షుడిగా కూడా అయ్యారు. ఆ తర్వాత ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదించారు. అందులో జరుగుతున్న అవినీతిని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి అభినందనలతో పాటు ప్రమోషన్లు పొందారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం (సర్వేయర్) చేపట్టి ఎన్నో సంవత్సరాలుగా పంపిణీకి నోచుకోని భూమిని పేదలకు పంచి వారికి దేవుడయ్యారు. ఆ సందర్భంలో కలెక్టర్తో జరిగిన వాగ్వాదంలో కలెక్టర్ చొక్కాపట్టి లాగడంతో ఉద్యోగం పోయింది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిచయంతో ఆ రంగంలో అడుగుపెట్టి తొలిసారే రూ.1.50 లక్షల లాభం సంపాదించారు. ఆ తర్వాత రాజకీయ రంగం.. మొదట కాంగ్రెస్లో చేరినా సరైన అవకాశాలు రాలేదు. టీఆర్ఎస్లో చేరి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పొందినా.. మూడోసారి అనూహ్యంగా పీసీసీ అధ్యక్షుడిపై గెలిచి రాష్ట్రవ్యాప్తంగా హీరో అయ్యారు. నోమారెడ్డి.. కబడ్డీరెడ్డి, ముత్తిరెడ్డిగా పిలువబడుతున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అంతరంగం.. ఈ వారం ప్రత్యేకం.. వర్ధన్నపేట మండలం పున్నేలు మా సొంతూరు. నాన్న గోపాల్రెడ్డి, అమ్మ కౌసల్యదేవి. అన్న, తమ్ముడు, ఇద్దరు అక్కలు. భార్య పద్మలతారెడ్డి. ఆమెది మా మండలంలోనే లింగమారిగూడెం. మాకు ఇద్దరు పిల్లలు. కుమారుడు పృథ్వీరాజ్రెడ్డి సివిల్ ఇంజనీరింగ్లో ఎంఎస్ పూర్తి చేసి వ్యాపారాలు చూస్తున్నాడు. కూతురు తుల్జాభవానీ మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ పూర్తి చేసింది. నా జన్మనామం నోమరెడ్డి. ఈ పేరుతోనే వ్యాపారాలు ఎక్కువగా ఉన్నాయి. మొదట మా ఊళ్లోనే చదువుకున్నా. టెన్త్ కోసం మా ఊరు నుంచి మూడు కిలోమీటర్లు నడిచి బొల్లికుంట వెళ్లేవాడిని. చిన్నప్పుడు కబడ్డీ బాగా అడేవాడిని. అప్పుడు నన్ను కబడ్డీ రెడ్డి అనేటోళ్లు. 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. అప్పుడు వరంగల్ నగరం హన్మకొండ చౌరస్తా నుంచి రంగశాయిపేట వరకు తూర్పు డివిజన్గా, హన్మకొండ చౌరస్తా నుంచి కాజీపేట వరకు పశ్చిమ డివిజన్గా ఉండేది. అప్పుడు పీయూసీ(పదో తరగతి) పరీక్షలు మొదలయ్యాయి. పరీక్షలు నిలిపివేయాలన్న నిర్ణయం మేరకు స్కూళ్లోకి వెళ్లి అన్ని ప్రశ్నపత్రాలు తీసుకొచ్చాను. అప్పుడు వెంకట్రామిరెడ్డి అని ఇన్స్పెక్టర్ ఉండె. పేపర్లు తీసుకొస్తున్న నన్ను పట్టుకునేందుకు బాగా ప్రయత్నించిండు. నేను బాగా ఉరికిన. చివరికి గోడ దూకే క్రమంలో దెబ్బతాకింది. అక్కడే బాయిలో పడబోయిన. ఇన్స్పెక్టర్ కాపాడి ఎంజీఎంలో చేర్పించిండు. అప్పుడు చెన్నారెడ్డి వచ్చి నన్ను పరామర్శించిండు. నిన్ను తరిమింది ఎవరో చెప్పు అని అడిగిండు. కాపాడింది వెంకట్రామిరెడ్డి అని చెప్పిన. ఆ ఇన్స్పెక్టర్ కళ్లల్లో నీళ్లు తిరిగినయి. ఉద్యమం విషయంలో నన్ను ఎలాగైనా పట్టుకోవాలని మా ఫ్రెండ్ అఫ్జల్ను రంగశాయిపేట పోలీసుస్టేషన్లో పెట్టిండ్లు. అక్కడికి సమీపంలోని కొందరు ఆంధ్రావాళ్ల ఇళ్లు ఉండేవి. వాళ్ల పొగాకు వాములకు నిప్పు పెట్టాం. పోలీసులు అక్కడికి వెళ్లిన సమయంలో మా ఫ్రెండ్ను బయటికి తీసుకొచ్చాం. మా ఫ్రెండ్ వాళ్ల నాన్న అప్పుడు తహసీల్దారు. ఆయన సస్పెండ్ అయ్యారు. ఉద్యమం కారణంగా ఒక విద్యాసంవత్సరం వృథా అయింది. తర్వాత ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 1972లో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన. మేనమామ మాటలే... ఇంటర్మీడియట్లో ఉద్యమం తీవ్రత తగ్గినా దూకుడుగానే ఉండేవాడిని. మా అమ్మమ్మ ఊరు కట్య్రాల. ఒకరోజు అక్కడ ఒక ఫంక్షన్కు వెళ్లా. మా మేనమామ పోలీసు పటేల్. చక్కగా చదువుకోక ఏందిరా ఈ పనులు అని అందరి ముందు నన్ను గట్టిగా నిలదీశాడు. బాధపడ్డా. నేను ఎంటో చూపిస్తా అని తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయా. వరంగల్కు వచ్చి అక్కడ నుంచి రైళ్లో సికింద్రాబాద్ వెళ్లిపోయా. అక్కడ ఓ ఆటో డ్రైవర్ వద్ద ఉండేవాడి ఆటోలు కడిగేవాడిని. ఒక ఆటో కడిగితే 25పైసలు ఇచ్చేవారు. రాత్రిళ్లు ఆటో డ్రైవింగ్ నేర్చుకునేవాడిని. ఆ తర్వాత ‘ఆమ్ప్రోచ్’ ఫ్యాక్టరీలో చేరాను. భోజనం ఖర్చుపోను నెలకు రూ.88మిగిలేవి. అక్కడ సూపర్వైజర్ చేసే అక్రమాలను పైఅధికారులకు చెప్పాను. వారు విచారించి అత డిని పనిలో నుంచి తొలగించారు. దీంతో నాకు స్టోర్కీపర్గా ప్రమోషన్ ఇచ్చారు. మరో డిపార్ట్మెంట్లో అక్రమాలను గుర్తించి చెబితే సూపర్వైజర్గా ప్రమోషన్ ఇచ్చారు. రెండు నెలల్లోనే మంచి హోదా వచ్చింది. ఇంట్లో నుంచి వెళ్లిన నాలుగు నెలల్లోనే తహసీల్దారుతో సమానంగా రూ.250 జీతం వచ్చేది. ఈలోపు మా వాళ్లు నా అచూకీ కోసం డెక్కన్ క్రానికల్, ఆంధ్రప్రభ ప్రతికల్లో ప్రకటనలు వేశారు. చూసినా నేను స్పందించలేదు. నాలుగు నెలల తర్వాత యాదగిరిగుట్టలో గుండు చేయించుకుని... నాన్నకు దోతులు, అమ్మకు చీరలు తీసుకుని ఇంటికి వెళ్లా. అప్పుడు అందరు చూసి నన్ను అభినందించారు. కలెక్టర్తో గొడవ రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ సర్వేయర్ ఉద్యోగం చేస్తున్నా.. అప్పుడు డిప్యూటీ కలెక్టర్గా షీలాబేడీ ఉండేవారు. ఆమె బాగా స్ట్రిక్ట్ అధికారి. క్లిష్టమైన అంశాల్లో నన్ను తీసుకెళ్లేవారు. ఒకసారి పరిగి డివిజన్ కొత్తపల్లిలో భూ పంపిణీ చేయాల్సి వచ్చింది. అక్కడ 250 ఎకరాల ప్రభుత్వ భూమిని 125 కుటుంబాలకు పంచాలి. 15 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కలెక్టర్ మళ్లీ ఆదేశాలు ఇవ్వడంతో నేను అక్కడికి వెళ్లా. అప్పటికే అక్కడ అటవీశాఖ వాళ్లు టేకు చెట్లు పెట్టారు. రికార్డులను పరిశీలించాను. ప్రభుత్వ భూమి అని ఉంది. ఆ ఊరి వారు మొదట నన్ను పట్టించుకోలేదు. అందరు రావడం ఎంతోకొంత తీసుకుని వెళ్లిపోవడం సహజమనే అన్నారు. కానీ, నేను గ్రామస్తులో చైతన్యం నింపాను. ఒక్క పూటలో టేకు చెట్లు నరికించి వాటినే హద్దులుగా పెట్టి పంపిణీ చేశాను. అటవీ శాఖ వారు, పోలీసులు వచ్చి అడ్డుకోబోయారు. నా ఆదేశాలతో ఊరి వాళ్లు తిరగబడ్డారు. చివరికి డీఎస్పీ, కలెక్టర్ జోక్యం చేసుకున్నారు. నన్ను అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు. తెల్లారి నన్ను పిలించారు. కలెక్టర్ అన్ని వివరాలు అడిగారు. రోజంతా విచారణ చేశారు. మొత్తం వివరించా. నేను చేసింది కరెక్ట్ అన్నారు. మిగితా అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు అన్నారు. చివరికి నాపై కూడా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు జడ్జిమెంట్ ఇస్తవా అన్నారు. మీరు ఇచ్చిన ఆదేశాలో అమలు చేశా అని చెప్పా. అయినా అసలు విషయం పక్కనబెట్టి నీ తీరు సరిగా లేదు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడబోయారు. నేను ఎంత చెప్పినా వినలేదు. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక కలెక్టర్ చొక్కా పట్టుకున్నా. ప్రభుత్వ వ్యవస్థ ఇలా ఉండడం సరికాదని గట్టిగా చెప్పి వచ్చేశా. నన్ను సస్పెండ్ చేశారు. ఏడాదిలోపే మళ్లీ పోస్టింగ్ ఇచ్చారు. అయినా నేను జాయిన్ కాలేదు. దసరా రోజు తిండిలేదు మొదటిసారి ఇంటికి వెళ్లి వచ్చాక హైదరాబాద్లో డ్యూటీకి పోతున్నా. ఆరోజు కైసర్ అని పహిల్వాన్ నాకు ఎదురుపడి ఉద్యోగం మానేయాలని బెదిరించాడు. ఉద్యోగానికి వెళ్లలేదు. దసరా ముందు ఇది జరిగింది. దసరా రోజు అన్నం దొరకలేదు. ఉపవాసం ఉన్నా. జీవితం మళ్లీ మొదటికి వచ్చింది. ఉప్పల్కు చేరుకుని అడవుల్లో కట్టెలు కొట్టి అమ్మేవాడిని. ఆటో అడ్డాకు చేరా. వాటిని కడగడం.. రాత్రి నేర్చుకోవడం చేసేవాడిని. రూ.80 సంపాదించి లెసైన్స్ తీసుకున్నా. సహకార సంఘంలో ఆటోలు తీసుకుని నడిపాను. సికింద్రాబాద్ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యా. ఒకసారి ఎస్సై ఒక కొత్త ఆటోను కారణం లేకుండా కర్రతో కొట్టడంతో టాప్ చినిగిపోయింది. డ్రైవర్ పేదవాడు. నాకు కోపం వచ్చి ఎస్సైని కొట్టాను. అప్పుడు డీసీపీగా ఉన్న అధికారి పిలిచి అడిగారు. విషయం చెబితే సారి చెప్పి పంపించారు. అలా పోలీసులతో పరిచయాలు పెరిగాయి. ఒక పోలీసు అధికారి సహకారంతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను. రియల్ ఎస్టేట్తోనే... సర్వేయర్గా పనిచేసి ఉండడంతో రెవెన్యూ అంశాల్లో పట్టు ఉండేది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనవసరమైన కొర్రీలు పెట్టకుండా పనులు చేసేవాడిని. నా పనితీరును గమనించిన సత్యనారాయణ సోనీ అని ఒక ‘రియల్’ వ్యాపారి నా దగ్గరికి వచ్చి నెలకు రూ.10 వేలు, వ్యాపారంలో వచ్చే లాభంలో కొంత కమీషన్ ఇస్తానన్నారు. 40 ఎకరాలతో లేఅవుట్ చేశాడు. తర్వాత 90 ఎకరాలతో చేశాడు. లాభం వచ్చింది. నన్ను మోసం చేశాడు. నేనే సొంతంగా మొదలుపెట్టాను. పటాన్చెరువు ప్రాంతంలో 10 ఎకరాలతో మొదలుపెట్టాను. అప్పటికే అక్కడ జీవీకే వాళ్లు కొనుగోలు చేశారు. వాళ్లకు మరికొంత భూమి అవసరం ఉండి నన్ను అడిగారు. ఎక్కువ ధర చెప్పాను. దీంతో వాళ్లు నాకు అమ్మిన వాళ్ల దగ్గరికి వెళ్లి నా కంటే ఎక్కువ ధర ఇస్తానన్నారు. దీంతో నేను జీవీకే వాళ్ల కంటే ముందే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. చివరికి వాళ్లే నా దగ్గర రెట్టింపు ధరకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. అలా మొదట్లోనే రూ.1.50 లక్షల లాభం వచ్చింది. నేను ఎవరినీ మోసం చేయలేదు. నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం గట్టిగా సమాధానం చెప్పేవాడిని. కాంగ్రెస్తో అరంగేట్రం రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నప్పుడు తాలూకా వ్యవస్థ ఉండేది. రెవెన్యూ పనులపై వచ్చే ప్రతి వాళ్లకు సహకరించేవాడిని. 1983లోనే అక్కడి వారు నన్ను నన్ను ఎమ్మెల్యే అని పిలిచేవారు. మొదటి నుంచి నేదురుమల్లి జనార్దనరెడ్డికి దగ్గరగా ఉండేవాడిని. 1994లో కాంగ్రెస్ తరపున మేడ్చల్ టికెట్ కోసం ప్రయత్నించా. సీనియర్ అనే కారణంతో వేరేవారికి ఇచ్చారు. 1999లో జిల్లాలో పోటీ చేయాలని అనుకున్నా. 1999లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చిట్టచివరికి ఖరారు చేసిన టికెట్ వర్ధన్నపేటదే. అప్పుడూ నాకు అవకాశం రాలేదు. 2004 ఎన్నికల ముందు కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, శివశంకర్ వరంగల్లో నిర్వహించిన బీసీ సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ సభకు సోనియాగాంధీ వచ్చారు. బహిరంగసభ తర్వాత ఢిల్లీకి వెళ్లినప్పుడు ముత్తిరెడ్డి సహకారంతోనే సభ సక్సెస్ అయిందని సోనియాగాంధీకి వీహెచ్ చెప్పారు. జిల్లా అంతా పలుకుబడి ఉంది కనుక ఎంపీ టికెట్కు పరిశీలిద్దామని ఆమె హామీ ఇచ్చారు. కానీ, గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరాను. మూడో ప్రయత్నంలో... తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి పార్టీలో క్రీయాశీకలంగా పాల్గొన్నాను. వర్ధన్నపేట నియోజకవర్గంపై దృష్టి పెట్టాను. కాంగ్రెస్తో పొత్తులో ఈ సీటు టీఆర్ఎస్కు వచ్చింది. జిల్లాలోని కొందరు టీఆర్ఎస్ నేతల కారణంగా 2004 ఎన్నికల్లో నాకు బీఫారం రాలేదు. టికెట్ దక్కిన మాచర్ల జగన్నాథం వైదొలుగుతానన్నారు. బీసీల టికెట్ తీసుకున్నాననే అపప్రద వద్దని ఊరుకున్నాను. చివరికి నియోజకవర్గ ప్రజల ఒత్తిడితో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. నన్ను ఓడించేందుకు అప్పుడు కాంగ్రెస్, బీజేపీ నేతలతో పాటు మా పార్టీలోని కొందరు టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావుకు సహకరించారు. అయినా గట్టిపోటీ ఇచ్చాను. పోలింగ్కు ముందు కేసీఆర్.. నన్ను పార్టీ అభ్యర్థి అని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయాను. తర్వాత పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్గా బాధ్యతలు ఇచ్చారు. 2009 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో పాలకుర్తి టికెట్ టీడీపీకి పోయింది. ఆ ఎన్నికల్లో నేను ఉప్పల్ నుంచి పోటీ చేసి ఓడిపోయాను. ఎన్నికల తర్వాత జనగామలో కొమ్మూరి ప్రతాప్రెడ్డి పార్టీకి దూరమయ్యారు. కేసీఆర్ నాకు బాధ్యతలు అప్పగించారు. నాలుగున్నరేళ్లు కష్టపడ్డాను. ఇటీవలి ఎన్నికల్లో జనగామ ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై విజయం సాధించడంతో నాకు రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చింది. జనగామను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఇక్కడ ప్రజల సేవ చేయడమే ఇప్పుడు నా లక్ష్యం. టీఆర్ఎస్లో కేసీఆర్ నన్ను సోదరుడిలా చూసుకుంటున్నారు. సినిమా రంగంలోనూ ప్రవేశం వరంగల్లో బెంజ్ కారు కొన్న మొదటి వ్యక్తిని నేనే. అంకుశం సినిమా వచ్చాక నాకు కొత్త పేరు వచ్చింది. ఆ సినిమాలో విలన్ రామిరెడ్డికి, నాకు దగ్గరి పోలికలు ఉండడంతో చాలామంది నన్ను రామిరెడ్డిలా ఉన్నావు అనేవారు. ఒకసారి తిరుపతి వెళ్లినప్పుడు నన్ను రామిరెడ్డి అనుకుని ఆటోగ్రాఫ్ అడిగారు. నాకు సినీరంగంలోనూ ప్రవేశం ఉంది. కొన్ని సీరియళ్లలోనూ నటించాను. ఇదే పరిచయంతో సినిమాలో నటించాలని అడిగారు. 1995లో తపస్వి అనే సినిమాలో నేనే నటించి.. నిర్మించాను. ఎందుకో సినిమా వాతావరణం సరిపడలేదు. ఎన్నికల ప్రచార పాటలను నేనే దగ్గరుండి రాయించాను. నాకు మొదటి నుంచీ వ్యవసాయం అంటే ఇష్టం. రంగారెడ్డి జిల్లా చెంగిచెర్లలో 100 ఎకరాలు ఉండేది. రాజకీయాల్లోకి వచ్చాక ఇప్పుడు 25 ఎకరాలు మిగిలింది. వ్యవసాయంపై ఇష్టంతోనే ఇక్కడ(జనగామలో) భూమి కొనుగోలు చేసి తోటలు పెట్టాను. గొర్రెలు, ఆవులు ఉన్నాయి. అక్కడ నాకు ఎంతో రిలాక్స్గా ఉంటుంది.