new Chief Minister
-
30 ఏళ్ల క్రితం.. ఢిల్లీ సీఎం ఫొటో షేర్ చేసిన కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తాకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత అల్కా లాంబా(Alka Lamba) ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. రాజకీయాలకు పక్కనపెట్టి రేఖతో ఉన్న స్నేహబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.1995లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) అధ్యక్షురాలిగా కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ తరఫున ఆల్కా లాంబా ప్రమాణం చేశారు. ప్రధాన కార్యదర్శిగా ఏబీవీపీ తరఫున రేఖా గుప్తా ప్రమాణం చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. రేఖాకు అభినందనలు తెలియజేశారామె.రేఖా గుప్తా ముఖ్యమంత్రి అని తెలియగానే 30 ఏండ్లు వెనక్కి వెళ్లా. విద్యార్థి సంఘాల నేతలుగా మేం ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాకు ఇంకా గుర్తు. సిద్ధాంతపరంగా మాకు ఎప్పుడూ పడేది కాదు. కానీ, ఏడాది పాటు మేం కలిసి పని చేసిన రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి అని అన్నారామె.ఇక యమునా నది(Yamuna River) ప్రక్షాళన ప్రధాన హామీగా బీజేపీ ఢిల్లీ ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆ అంశంపై దృష్టిసారించాలని ఆల్కా లాంబా సీఎం రేఖా గుప్తాకు సూచించారు. ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేఖా గుప్తాకు అభినందనలు. యమునా మాత శుభ్రమవుతుందని, యమునా పుత్రులంతా ఇక సురక్షితంగా ఉంటారని మేం ఆశిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారామె.1995 की यह यादगार तस्वीर - जब मैंने और रेखा गुप्ता ने एक साथ शपथ ग्रहण की थी- मैंने @nsui से दिल्ली विश्वविद्यालय छात्र संघ (DUSU) #अध्यक्ष पद पर जीत हासिल की थी और रेखा ने #ABVP से #महासचिव पद पर जीत हासिल की थी- रेखा गुप्ता को बधाई और शुभकामनाएँ.दिल्ली को चौथी महिला… pic.twitter.com/csM1Rmwu9y— Alka Lamba 🇮🇳 (@LambaAlka) February 19, 2025 -
రేఖా గుప్తా అనే నేను
-
నేడే ఢిల్లీ సీఎం పట్టాభిషేకం
-
ఎల్ఆర్ఎస్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
సాక్షి,హైదరాబాద్ : ఎల్ఆర్ఎస్పై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 25 శాతం రాయితీతో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాయితీ అమలు మార్చి 31 వరకు గడువు విధించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగు సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు కొన్న వారికి రాయితీ వర్తించనుంది. ఒక లేఅవుట్లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండి మిగిలిపోయిన 90 శాతం ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్కు అవకాశం కల్పించింది. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి సైతం 31లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా
ఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా (Delhi Cm Rekha Gupta) ఎంపికయ్యారు. సీఎంగా బీజేపీ (bjp) ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ, స్పీకర్గా విజేందర్ గుప్తా ఎన్నికయ్యారు. సీఎంగా రేఖా గుప్తా రేపు(గురువారం) మధ్యాహ్నం 12:35 గంటలకు రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేఖాగుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.26 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీఎం ఎంపికపై బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. సమావేశంలో 47 మంది ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై పరిశీలకులుగా మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్టీ జాతీయ కార్యదర్శి ఓం ప్రకాష్ ధన్ఖడ్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తాను సీఎంగా ఎన్నుకున్నారు. ఢిల్లీకి 4వ మహిళా సీఎంగా రేఖ గుప్తా2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. సీఎంగా ఆ పార్టీ షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖ గుప్తాను ఎంపిక చేసింది. ఢిల్లీలో బీజేపీ నుంచి చివరగా 1998లో సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీజేపీ తరుఫున ఢిల్లీ సీఎంగా సుష్మా స్వరాజ్ తర్వాత రేఖ గుప్తా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురు మహిళలు ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ కాగా, కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్,ఆప్ నుంచి అతిషీ మర్లేనా సీఎంలుగా సేవలందించారు. తాజాగా రేఖ గుప్తా ఢిల్లీకి నాలుగవ మహిళా సీఎంగా పనిచేయనున్నారు. రేఖ గుప్తా రాజకీయ ప్రస్థానంఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఎంపికైన యాబైఏళ్ల రేఖా గుప్తా (Who is Rekha Gupta) బీజేపీ సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. ఆమె ఢిల్లీలోని షాలిమార్ బాగ్ (ఉత్తర-పశ్చిమ) నియోజకవర్గం నుండి 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 68,200 ఓట్లతో విజయం సాధించారు. రేకా గుప్తా విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవ, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. యూనివర్సిటీలో అనుబంధ డౌలత్ రామ్ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషద్, ఆర్ఎస్ఎస్లో యాక్టీవ్ మెంబర్గా పనిచేశారు. ఢిల్లీలో మూడుసార్లు మున్సిపల్ కౌన్సిలర్గా,ఒకసారి మేయర్గా సేవలందించారు. 1996-97లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2003-2004 మధ్య బీజేపీ యువ మోర్చా ఢిల్లీ కార్యదర్శిగా పనిచేశారు. 2004-2006 మధ్య ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.2007లో ఉత్తరీ పితాంపుర, ఢిల్లీ నగర పంచాయతీ కౌన్సిలర్గా గెలుపొందారు2007-2009 మధ్య రెండు వరుస సంవత్సరాల పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా సంక్షేమం, బాల అభివృద్ధి కమిటీ ఛైర్ పర్సన్గా వ్యవహరించారు2009లో ఢిల్లీ రాష్ట్ర మహిళా మోర్చా బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు2010లో బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా ఎన్నియ్యారు2023 ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో తన ప్రత్యర్థి,ఆప్ నేత షెల్లీ ఒబెరోయి చేతిలో ఓడిపోయారు. 2025లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ముమ్మర ఏర్పాట్లురామ్ లీలా మైదానంలో ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత సమాచారం మేరకు.. రామ్ లీలా మైదానంలో మూడు వేదికలను సిద్ధం చేయనున్నారు. ఒక వేదికపై ఢిల్లీ కొత్త సీఎం, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ వీ.కే. సక్సేనా, రెండో వేదికను మత గురువులు కోసం, మూడో వేదికపై బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీలకు చెందిన 200 పైగా ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం సిద్ధం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఆప్ అధినేత,మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అలాగే కాంగ్రెస్ ఢిల్లీ శాఖాధ్యక్షుడు దేవేందర్ యాదవ్లను సైతం ఆహ్వానించిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి గ్రాండ్ గా ఏర్పాట్లు
-
ఢిల్లీ సీఎం ప్రకటనపై బిగ్ ట్విస్ట్
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి (Delhi Next CM) ఎవరు? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేఎల్పీ భేటీ నేపథ్యంలో ఇవాళ సాయంత్రంలోపు స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో ఆ భేటీని వాయిదా వేస్తూ బీజేపీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.ఇవాళ జరగాల్సిన బీజేఎల్పీ(BJLP) సమావేశాన్ని వాయిదా వేసింది ఆ పార్టీ. ఢిల్లీ స్టేషన్ తొక్కిసలాట ఘటనకు సంఘీభావంగానే సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించింది. తిరిగి.. ఫిబ్రవరి 19న ఈ భేటీని నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే అదే తేదీన సీఎంతో పాటు కేబినెట్ కూర్పుపైనా ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు రేపు మరోసారి సీఎం అభ్యర్థిపై అధిష్టానం సమాలోచనలు జరపనున్నట్లు సమాచారం. బీజేపీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. 19వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన బీజేఎల్పీ జరగనుంది. ఆ భేటీలో సీఎం అభ్యర్థి పేరు ప్రకటన ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సరాసరి లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్తారు. బీజేఎల్పీ నేత, కేబినెట్ పేర్లు ఉన్న వివరాలు అందజేసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని ఎల్జీని కోరనున్నారు.అందుకే ఆలస్యం!ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు(Delhi Assembly Elections) పోలింగ్ జరగ్గా.. 8వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 గెలుచుకున్నాయి. సుమారు మూడు దశాబ్ధాల తర్వాత ఢిల్లీ పీఠం కమలం కైవసం చేసుకుంది. అయితే.. సీఎం ఎంపికలో ఆచీచూతీ వ్యవహారించాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు జేపీ నడ్డా నాయకత్వంలో అంతర్గత సంప్రదింపులు సైతం జరిపింది. అదే సమయంలో.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఎంపిక ఆలస్యమైంది. ఈలోపు ఢిల్లీ విషాదంతో.. మరోసారి ఆ భేటీ వాయిదా పడింది. ఇక 19వ తేదీన జరగబోయే బీజేఎల్పీ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శులు సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాదిరే.. ఢిల్లీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు(Delhi Deputy CMs) ప్రతిపాదనను అధిష్టానం సీరియస్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం.ప్రమాణం ఎప్పుడంటే..ఆ మరుసటిరోజు(ఫిబ్రవరి 20న) రామ్ లీలా మైదానం(Ram Leela Maidan)లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించాలనుకుంటోంది. ఎన్టీయే పాలిత ప్రాంతాలకు ఇప్పటికే ఆహ్వానం వెళ్లింది. గురువారం సాయంత్రం 4గం.30ని. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. మోదీ, అమిత్ షా సహా బీజేపీ అగ్ర నేతల సమక్షంలో సీఎం, మంత్రి వర్గం ప్రమాణం చేయనుంది. ఈ మేరకు కార్యక్ర కో ఆర్డినేటర్లుగా వినోద్ తావ్డే,తరుణ్ చుగ్లను బీజేపీ హైకమాండ్ నియమించింది.ఇక.. ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ(న్యూ ఢిల్లీ), రేఖా గుప్తా (షాలిమార్ బాగ్), విజేందర్ గుప్తా (రోహిణి), సతీష్ ఉపాధ్యాయ్ (మాల్వియా నగర్), ఆశిష్ సూద్ (జనక్పురి), పవన్ శర్మ (ఉత్తమ్ నగర్), అజయ్ మహావార్ (ఘోండా)ర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జనాల్లో ‘క్లీన్ ఇమేజ్’ ఉన్న నేతకే ఢిల్లీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం ఓ అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: వద్దని తిరిగి వెళ్లిపోతుండగా ప్రాణం పోయింది!! -
ఢిల్లీ సీఎం సస్పెన్స్కు నేడు తెర!
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం సస్పెన్స్కు నేడు తెర పడనుంది. సోమవారం మధ్యాహ్నాం ఢిల్లీ బీజేపీల్పీ(Delhi BJPLP) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల, పార్టీ జాతీయ కార్యదర్శుల సమక్షంలో జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాబోయే ముఖ్యమంత్రిని ప్రకటించనున్నారు. ఈ మేరకు అధిష్టానం అంతర్గత సంప్రదింపులు సైతం పూర్తి చేసినట్లు తెలుస్తోంది.ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు(Delhi Assembly Elections) పోలింగ్ జరగ్గా.. 8వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 గెలుచుకున్నాయి. సుమారు మూడు దశాబ్ధాల తర్వాత బీజేపీ అధికారం చేపట్టబోతోంది. ఇవాళ సీఎం అభ్యర్థి ప్రకటన తర్వాత.. ప్రమాణ స్వీకారం ఎప్పుడుంటుంది అనే దానిపై స్పష్టత రానుంది.ఇక నేటి సమావేశంలో కొత్త సీఎం, మంత్రివర్గం కూర్పుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నా.. మాజీ సీఎం కేజ్రీవాల్ను (Arvind Kejriwal) ఓడించిన పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే.. అశీశ్ సూద్, రేఖా గుప్తాల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాదిరే.. ఢిల్లీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు(Delhi Deputy CMs) ఉండనున్నట్లు సమాచారం. మొత్తంగా ఫిబ్రవరి 19 లేదా 20వ తేదీన నూతన ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉన్నట్లు , రామ్లీలా మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. -
ఢిల్లీ సీఎం అభ్యర్థిని ఖరారు చేయనున్న బీజేపీ హైకమాండ్
-
హస్తిన ముఖ్యమంత్రి ఎవరో?
-
ఢిల్లీ సీఎం ఎంపికలో సర్ప్రైజింగ్ నిర్ణయం!
దేశ రాజధాని రీజియన్లో దాదాపు.. మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. అయితే ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో తొందరపాటు పనికి రాదని భావిస్తోంది. ఇందుకు గత అనుభవాలతో పాటు ప్రస్తుత సామాజిక పరిస్థితులు కారణాలుగా తెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్యాకేజీల సర్ప్రైజ్లను ఇవ్వబోతుందని సంకేతాలు అందుతున్నాయి.ఢిల్లీకి 1991లో పాక్షిక రాష్ట్ర హోదా దక్కింది. 1993లో జరిగిన ఢిల్లీ తొలి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే.. ఐదేళ్ల కాలంలో రాజకీయ ఒత్తిళ్లు, ప్రజల అసంతృప్తి నడుమ ముగ్గురు ముఖ్యమంత్రులను(మదన్ లాల్ ఖురానా, షాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్) మార్చాల్సి వచ్చింది. ఆపై అధికారం కోసం మళ్లీ ఇన్నేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ తరుణంలో.. సుదీర్ఘ కాలం తర్వాత దక్కిన అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనుకుంటోంది.సర్ప్రైజ్ తప్పదా?ఈ మధ్య గెలిచిన రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ నిర్ణయాలు రాజకీయ వర్గాల అంచనాలను సైతం బోల్తా కొట్టించాయి. మధ్యప్రదేశ్కు మోహన్ యాదవ్, రాజస్థాన్కు భజన్ లాల్ శర్మ, ఛత్తీస్గఢ్కు విష్ణుదేవ్ సాయ్లను ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనం. ఇందులో.. రాజస్థాన్ విషయంలో ఏకంగా తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన భజన్ లాల్కు సీఎం పగ్గాలు ఇవ్వడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఢిల్లీ విషయంలోనూ ఇలాంటి సర్ప్రైజ్ నిర్ణయం వెలువడే అవకాశం లేకపోలేదు. అదే ఫార్ములా!ఢిల్లీ కోసం ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను బీజేపీ తెరపైకి తెస్తోంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్లలో ఇదే పద్ధతిని అవలంభిస్తోంది. అలాగే.. ఢిల్లీని బీజేపీ మినీ ఇండియాగా భావిస్తోంది. బీజేపీ విజయంలో పంజాబీలు, సిక్కులు, పూర్వాంచలీస్, ఉత్తరాఖండీస్, వైశ్యాస్, జాట్.. ఇలా అన్ని వర్గాల ప్రజలు భాగమయ్యారని బీజేపీ భావిస్తోంది. కాబట్టి డిప్యూటీ సీఎంల ఎంపికలోనూ సామాజిక సమీకరణను ప్రముఖంగా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది.రేసులో ఎవరంటే..ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ బీజేపీ మాజీ ఛీప్లు విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయలతో పాటు సీనియర్ నేతలు మంజిదర్ సింగ్ సిర్సా, పవన్ శర్మ, అశిష్ సూద్ మహిళా నేతలు రేఖా గుప్తా, శిఖా రాయ్ పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఇక.. కొత్తగా ఎమ్మెల్యేలుగా నెగ్గిన కర్ణెయిల్ సింగ్, రాజ్కుమార్ భాటియా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. హ్యాట్రిక్ ఎంపీ మనోజ్ కుమార్ తివారీ(సింగర్), కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా పేరును సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో జాతీయ నాయకత్వం ఇప్పటికే ఢిల్లీ బీజేపీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. సీఎం రేసుతో పాటు కేబినెట్ కోసం పలువురి పేర్లతో కూడిన జాబితాను పరిశీలిస్తోంది. అవినీతి ప్రభుత్వంగా పేర్కొంటూ ఆప్ను బీజేపీ గద్దె దించింది. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి విషయంలో కుల సమీకరణాలతో పాటు ‘క్లీన్ ఇమేజ్’ను పరిగణనలోకి తీసుకుంటోందని సమాచారం. ప్రస్తుతం బీజేపీ అగ్రనేత, ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి రాగానే బీజేపీ అగ్రనేతలతో సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నారు. అలాగే.. సోమ, లేదంటే మంగళవారాల్లో బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఆ భేటీ తర్వాత సీఎం ఎవరనేదానిపై స్పష్టమైన ప్రకటన వెలుడే అవకాశం ఉంది. ఈ నెల 19 లేదంటే 20వ తేదీ ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలు ఉన్నాయన్నది తాజా సమాచారం. -
ఢిల్లీ సీఎంపై జోరుగా కసరత్తు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ దంగల్లో ఆప్ను చిత్తు చేసిన బీజేపీ నూతన ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కొత్త సీఎం ఎంపికపై వారిద్దరూ చర్చించారు. ముఖ్యమంత్రి రేసులో పర్వేశ్ వర్మ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. సతీశ్ ఉపాధ్యాయ, విజేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మతో పాటు పార్టీ ఎంపీ మనోజ్ తివారీ పేరు కూడా చక్కర్లు కొడుతోంది. జాట్ నేత అయిన పర్వేశ్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఓడించి సంచలనం సృష్టించడం తెలిసిందే. ఆయనే సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్నా రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మాదిరిగా కమలనాథులు అనూహ్య నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. పూర్వాంచల్ నేపథ్యమున్న నేతను, లేదా మహిళను, లేదంటే సిక్కు వర్గం నాయకుడిని సీఎం ఎలా చేస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా బీజేపీ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, భవిష్యత్తు అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో పెద్దగా పేరు ప్రఖ్యాతుల్లేని నేతలను ముఖ్యమంత్రులుగా బీజేపీ నియమించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏం చేస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కొత్త సీఎం ఎంపికపై తుది నిర్ణయం అధిష్టానానిదేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా పునరుద్ఘాటించారు. తమ కొత్త ఎమ్మెల్యేలందరికీ సీఎంగా రాణించగల సత్తా ఉందన్నారు. అతిశీ రాజీనామా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ రాజీనామా చేశారు. ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనాకు రాజీనామా లేఖ సమర్పించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరేదాకా కొనసాగాలని ఆయన కోరారు. మరోవైపు ఫలితాల నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీని ఎల్జీ రద్దు చేశారు. ఈ నిర్ణయం శనివారం నుంచే అమల్లోకి వచి్చంది. అతిశీ గతేడాది సెపె్టంబర్లో అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో సీఎంగా ఆతిశీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే. తాజా ఫలితాల్లో కేజ్రీవాల్ ఓడినా ఆమె మాత్రం నెగ్గారు. పథకాలను బీజేపీ ఆపకుండా చూస్తాం: ఆప్22 మంది ఆప్ కొత్త ఎమ్మెల్యేలతో పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సమావేశమయ్యారు. ప్రజల కోసం పనిచేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని వారిని కోరారు. తమ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అనంతరం ఆతిశీ మీడియాకు చెప్పారు. ‘‘మార్చి 8 నుంచి మహిళలకు బీజేపీ నెలకు రూ.2,500 కచ్చితంగా ఇవ్వాలి. ప్రజలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇతర సౌకర్యాలు కల్పించాలి. పదేళ్లుగా ఆప్ అమలు చేసిన ఉచిత సేవలు, పథకాలను నిలిపేయకుండా మేం చూస్తాం’’ అన్నారు.మోదీ అమెరికా నుంచి తిరిగి వచ్చాకే! ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో పర్యటించనున్నారు. 13వ తేదీన ఆయన తిరిగొస్తారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఆ తర్వాతే జరిగే అవకాశముందని బీజేపీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. సీఎం ఎంపిక కూడా మోదీ వచ్చాకే జరగవచ్చని తెలిపాయి. -
ఢిల్లీ సీఎం ఎవరన్న దానిపై కొనసాగుతున్న ఉత్కంఠ
-
మహారాష్ట్ర సీఎం పదవిపై ఉత్కంఠ!
-
మహా సస్పెన్స్.. షిండేది కేవలం అలకేనా..? అల్లాడించే వ్యూహమా...?
-
మహారాష్ట్ర ఆపధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అలకపాన్పు !
-
తుది అంకానికి చేరిన ‘మహా’ హైడ్రామా.. సీఎంగా ఫడ్నవిస్?
ముంబై/థానే: ఎవరికీ మెజారిటీరాని, హంగ్ సందర్భాల్లో కనిపించేంత ఉత్కంఠను కొనసాగించిన ‘మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు?’ అంశానికి నేటితో తెరపడనుంది. గతంలో ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా సేవలందిస్తున్న మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం దాదాపు ఖాయమైంది. మహాయుతి కూటమిని శాసనసభ ఎన్నికల పర్వంలో విజయతీరాలకు చేర్చినందుకు మళ్లీ తననే సీఎంగా చేయాలని పట్టుబట్టిన శివసేన చీఫ్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కాస్తంత మెత్తబడ్డారు. దీంతో ఫడ్నవిస్ పట్టాభిషేకానికి అవరోధాలు దాదాపు తొలగిపోయాయి. నేడు ఢిల్లీలో బీజేపీ అగ్రనేత అమిత్ షాతో ఏక్నాథ్ షిండే భేటీ తర్వాత కేబినెట్ కూర్పుపై తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కూటమి ధర్మాన్ని పాటిస్తూ మళ్లీ తనకే సీఎం పదవి ఇవ్వాలని పట్టుబట్టిన షిండే బుధవారం పట్టు సడలించారు. నూతన సీఎం ఎంపికపై ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్షాల నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని బుధవారం షిండే చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి. దీంతో ఫడ్నవిస్ సారథ్యంలో బీజేపీ సర్కార్ కొలువుతీరడం దాదాపు ఖాయమైంది. ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ చీఫ్ అజిత్పవార్లు ఉప ముఖ్యమంత్రి పదవులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 30 లేదా డిసెంబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండొచ్చని అజిత్ పవార్ బుధవారం చెప్పారు.2, 3 గంటలే నిద్రపోయా‘‘మహాయుతికి ఘన విజయం అందించిన మహారాష్ట్ర ఓటర్లకు కృతజ్ఞతలు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం విస్తృతంగా తిరిగా. ఎన్నికల ప్రచారం వేళ రోజుకు కేవలం 2,3 గంటలే నిద్రపోయా. ప్రజల కోసం నేరుగా పనిచేయడంలో నేను ఇప్పటికీ కార్యకర్తనే. నా దృష్టిలో సీఎం అంటే కామన్మ్యాన్. నేనేమీ అసంతృప్తిలో లేను. మేం పోరాటం చేశాం. ఇక్కడ ఏడ్వాల్సిన అవసరం లేదు. పాపులర్ అవ్వాలని సీఎంగా చేయలేదు. ప్రజల సంక్షేమం కోసమే పదవిలో కొనసాగా’’ అని షిండే వ్యాఖ్యానించారు. బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని షిండే ప్రకటించడం ఆనందంగా ఉందని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే చెప్పారు. ‘‘ విపక్షాల పుకార్లను పటాపంచలు చేస్తూ షిండే చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఆయనను చూసి గర్వపడుతున్నా. సీఎంగా ఆయన అద్భుతంగా పాలించారు’’ అని బవాంకులే పొగిడారు. షిండే మహాయుతి ప్రభుత్వానికి కన్వీనర్గా ఉంటారని వార్తలొచ్చాయి. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో తాజా ఎన్నికల్లో మహాయుతి కూటమి 230 సీట్లను కైవసం చేసుకుని ఘన విజయం సాధించడం తెల్సిందే. బీజేపీ 132, శివసేన(షిండే) 57, ఎన్సీపీ(అజిత్పవార్) 41 చోట్ల గెలిచాయి.మా వైపు స్పీడ్ బ్రేక్ లేదన్న షిండేఘన విజయం తర్వాత ఐదు రోజులకు తొలిసారిగా బుధవారం థానేలోని స్వగృహంలో 60 ఏళ్ల షిండే మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ కొత్త సీఎం విషయంలో మోదీ, అమిత్ షాల నిర్ణయంతో ఏకీభవిస్తా. ఈ ఎంపిక ప్రక్రియలో నేను అవరోధంగా ఉండబోను. బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు, శివసేనకు సమ్మతమే అని నిన్ననే వాళ్లతో ఫోన్ సంభాషణల్లో స్పష్టం చేశా. రెండోదఫా అవకాశం దక్కదని తెల్సి నిరాశచెందానన్న వార్తల్లో నిజం లేదు. వాస్తవానికి సీఎంగా నా ప్రభుత్వానికి బీజేపీ మద్దతు పలికిందన్న విషయం మర్చి పోవద్దు. కొత్త సీఎం వ్యవహారంలో శివసేన నేతల్లో ఎలాంటి కోపతాపాలు, అసహనం లేవు. గురువారం ఢిల్లీలో అమిత్ షాను నేను, ఫడ్నవిస్, అజిత్పవార్ కలవ బోతున్నాం. ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు ఖరారవుతాయి’’ అని అన్నారు. ‘‘ కొత్త ప్రభుత్వం కొలువు తీరే అంశం గురువారంతో తేలిపోనుంది’’ అని షిండే అన్నారు. నవంబర్ 30 లేదా డిసెంబర్ ఒకటో తేదీన సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ చెప్పారు. -
మహారాష్ట్ర సీఎంపై సస్పెన్స్ వీడనుందా!
-
నాదీ భరతుడి వ్యథే!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఆతిశి బాధ్యతలు స్వీకరించారు. మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పై తనకున్న ప్రభు భక్తిని చాటుకున్నారు. ఇన్నాళ్లూ ఆయన కూర్చున్న ఎర్ర రంగు కుర్చీని ఖాళీగానే ఉంచి, ఆ పక్కనే మరో తెల్ల రంగు కుర్చీలో కూర్చుని సాదాసీదాగా సోమవారం సచివాల యంలో ఆమె ఢిల్లీ 8వ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆతిశి మీడియాతో మాట్లాడారు.ఈ కుర్చీ కేజ్రీవాల్దిరామాయణంలో శ్రీరాముడి సోదరుడు భరతుడి మాదిరిగానే తాను వ్యథ చెందుతున్నానని ఆతిశి అన్నారు. ‘ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. ఆనాడు భరతుడి వ్యథలాగే.. నేడు నా మనసు వ్యథ చెందుతోంది. శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసానికి వెళ్లినప్పుడు భరతుడు అయోధ్య రాజ్య పాలన బాధ్యతలు తీసుకోవాల్సివచ్చింది. శ్రీరాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి ఆయన రాజ్యపాలన చేశారు. అదే తీరుగా వచ్చే నాలుగు నెలలు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తాను. తండ్రికిచ్చిన మాట కోసం శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం చేశారు. అందుకే మనం ఆయనను మర్యాద పురుషోత్తముడిగా పిలుచుకుంటాం. శ్రీరాముడి జీవితం మర్యాద, నైతికతకు నిదర్శనం. అదే విధంగా కేజ్రీవాల్ కూడా మర్యాద, నైతికతకు నిదర్శనంగా నిలిచారు. గత రెండేళ్లుగా కేజ్రీవాల్పై బురదజల్లేందుకు బీజేపీ ఏ అవకాశాన్నీ వదిలి పెట్టలేదు. అయితే, నిజాతీపరుడినని నిరూపించుకునే వరకూ సీఎం పీఠంలో కూర్చోనని ఆయన పదవికి రాజీమా చేశారు. కానీ, ఈ కుర్చీ (తన పక్కనే ఖాళీగా ఉన్న కుర్చీని చూపెడుతూ) కేజ్రీవా ల్ది. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు తమ ఆశీర్వాదంతో కేజ్రీవాల్ను సీఎం పీఠంపై కూర్చో బెడతారనే నమ్మకం నాకుంది’’ అని ఆతిశి అన్నారు. సీఎం పదవికే అవమానంకేజ్రీవాల్ వాడిని కుర్చీలో కూర్చోరాదంటూ సీఎం ఆతిశి తీసుకున్న నిర్ణయంపై బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా మండిపడ్డాయి. ‘ఆతిశి చేసిన పని ఆదర్శం ఎంతమాత్రమూ కాదు. ఆమె సీఎం పదవిని అవమా నించడమే కాదు, ఢిల్లీ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు’’ అని ఆ పార్టీ ప్రతినిధులు ధ్వజమెత్తారు. -
ప్రభుత్వ సలహాదారు నుంచి ప్రభుత్వాన్నే నడిపించేదాకా..
ఢిల్లీ ఆప్ సర్కార్లో కీలక మంత్రులంతా జైల్లో ఊచలు లెక్కబెడుతుంటే డజనుకుపైగా మంత్రిత్వ శాఖలను ఒంటిచేత్తో నడిపి సమర్థవంతమైన నాయకురాలిగా నిరూపించుకున్న అతిశికి సరైన మన్నన దక్కింది. మధ్యప్రదేశ్లోని కుగ్రామంలో ఏడు సంవత్సరాలపాటు ఉండి అక్కడి రైతులకు సేంద్రీయ వ్యవసాయంపై పాఠాలు బోధించిన అతిశి తర్వాతి కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. సోషలిస్ట్ విప్లవయోధులు మార్క్స్, లెనిన్ పేర్లను కలిపి అతిశి తల్లిదండ్రులు ఆమెకు ‘మార్లెనా’ పేరును జోడించారు. అయితే రాజకీయరంగ ప్రవేశానికి ముందే 2018లో మార్లెనా పదాన్ని తన పేరు నుంచి అతిశి తొలగించుకున్నారు. రాజకీయ నామధేయం పోయినా ఈమెకు రాజకీయాలు బాగా అబ్బడం విశేషం. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణల కోసం పాటుపడి మంచి పేరు తెచ్చుకున్నారు. పలు శాఖలను నిర్వర్తించిన పాలనా అనుభవం సీఎంగా ఆమెకు అక్కరకు రానుంది.రాజకీయ ప్రవేశం2013లో ఆప్ పార్టీలో చేరారు. 2013లో ఆప్ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించిన ముసాయిదా కమిటీలో కీలక సభ్యురాలిగా ఉన్నారు. పట్టణ, మధ్యతరగతి వర్గాల్లో ఆప్ ఇమేజ్ పెరిగేలా ముసాయిదా కమిటీకి అతిశి కీలక సూచనలు ఇచ్చినట్లు చెబుతారు. 2015లో మధ్యప్రదేశ్లోని ఖంద్వా జిల్లాలో జల సత్యాగ్రహం దీక్ష చేపట్టి పార్టీలో ముఖ్యురాలిగా మారారు. అప్పటి నుంచి మూడేళ్లపాటు మనీశ్ సిసోడియాకు ముఖ్య సలహాదారుగా సేవలందించారు. 2019లో ఈస్ట్ ఢిల్లీ స్థానం నుంచి లోక్సభకు పోటీచేశారు. అయితే అక్కడి బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో ఓడిపోయారు. 2020లో ఢిల్లీలోని కాల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. పలుశాఖలకు మంత్రిగా: మనీశ్ సిసోడియా అరెస్ట్ తర్వాత 2023 ఫిబ్రవరిలో విద్యా, ప్రజాపనులు, సంస్కృతి, పర్యాటక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఎక్సయిజ్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ కావడంతో పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అన్నీ తానై ఆర్థికశాఖసహా 14 మంత్రిత్వ శాఖల బాధ్యతలు తన భుజస్కంధాలపై మోశారు. 2024లో ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అతిశి ఒకప్పుడు రిషివ్యాలీ టీచర్ కురబలకోట(అన్నమయ్య జిల్లా): అన్నమయ్య జిల్లా మదనపల్లెకు సమీపంలోని కురబలకోట మండలం రిషివ్యాలీ స్కూల్లో అతిశి గతంలో టీచర్గా పనిచేశారు. 2003 జూలై నుంచి 2004 మార్చి వరకు హిస్టరీ టీచర్గా చేశారు. 6, 7 తరగతులకు ఇంగ్లీషు టీచర్గా పనిచేశారు. తమ పూర్వ టీచర్ ఢిల్లీ సీఎం కానుండటంతో రిషివ్యాలీ స్కూ ల్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి రిషివ్యాలీ స్కూల్ను స్థాపించారు. – సాక్షి, నేషనల్డెస్క్జననం: 1981 జూన్ 8తల్లిదండ్రులు: విజయ్ సింగ్, త్రిప్తా వాహీ(వీళ్లిద్దరూ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు)భర్త: ప్రవీణ్ సింగ్ (పరిశోధకుడు, విద్యావేత్త)విద్యార్హతలు: ఢిల్లీలోని స్ప్రింగ్డేల్స్ స్కూల్లో చదువుకున్నారు. 2001లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి టాపర్గా నిలిచారు. చెవెనింగ్ స్కాలర్షిప్ సాయంతో ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 2005లో రోడ్స్ స్కాలర్షిప్తో ‘ఎడ్యుకేషన్’లో మాస్టర్స్ చేశారు. -
ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి.. ప్రకటించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా మంత్రి అతిషి మర్లేనాను ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మంగళవారం ఉదయం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ప్రస్తుత సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆమె పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో.. కేజ్రీవాల్ సాయంత్రంలోపు తన పదవికి రాజీనామా చేయనున్నారు.ఈ క్రమంలో ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసేందుకు అరవింద్ కేజ్రీవాల్ నేడు అపాయింట్మెంట్ కోరారు. సాయంత్రం 4 గంటలకు ఎల్జీతో భేటీ కానున్నారు. గవర్నర్ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. అయితే ఎల్జీ ఎంతవేగంగా కేజ్రీవాల్ రాజీనామాపై నిర్ణయం తీసుకుంటే.. అతిషి సీఎంగా ఎప్పుడు ప్రమాణం చేస్తారనేదానిపై స్పష్టత వస్తుంది.ఇక.. ఆప్ నుంచి కొత్త ముఖ్యమంత్రి రేసులో కేజ్రీవాల్ సతీమణి సునీత సహా పలువురి పేర్లు వినిపించాయి. చివరకు అతిషి మర్లెనకు అవకాశం దక్కింది. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ జైలుకు వెళ్లాక.. పాలన కుంటుపడకుండా అతిషీనే చూసుకున్నారు. వివాదాలకు దూరంగా ఉంటారని ఆమెకు పేరుంది. ప్రస్తుతం ఆమె విద్యాశాఖతో పాటు పలు మంత్రిత్వ శాఖలు చూసుకుంటున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. తిహార్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మళ్లీ విజయం సాధించిన తర్వాతే సీఎం పదవిని చేపడతానని కేజ్రీవాల్ ప్రకటించారు. ‘ప్రజలు తమ తీర్పును ప్రకటించే వరకు తాను సీఎం కుర్చీలో కూర్చోనని స్పష్టం చేశారు.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ముందస్తుగా ఈ నవంబర్ లోనే ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ కోరుతున్నారు. నవంబర్ నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ ఇప్పటికే డిమాండ్ చేశారు. దీంతో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇదీ చదవండి: రాజీనామా వ్యూహమిదే! -
జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై వీడిన సందిగ్ధత
-
Bihar political crisis: మళ్లీ కూటమి మారిన నితీశ్
పట్నా: బిహార్ రాజకీయ రగడకు ఊహించిన విధంగానే తెర పడింది. గోడదూకుళ్లకు పెట్టింది పేరైన జేడీ(యూ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ మళ్లీ కూటమి మారారు. ఆదివారం ఇండియా కూటమికి గుడ్బై చెప్పి మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ గూటికి చేరారు. ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సర్కారుకు చరమగీతం పాడారు. సాయంత్రానికల్లా బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తద్వారా 72 ఏళ్ల నితీశ్ బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పగ్గాలు చేపట్టారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరుల సమక్షంలో రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్ బీజేపీ చీఫ్ సమ్రాట్ చౌధరి, పార్టీ నేత విజయ్కుమార్ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. నితీశ్ చర్యపై కాంగ్రెస్తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆప్ తదితర పారీ్టలు మండిపడ్డాయి. బిహార్ ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నాయి. భాగస్వాములను మోసగించడంలో సిద్ధహస్తుడైన ఆయన మరోసారి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. నితీశ్ వంటి ఆయారాం, గయారాంల ని్రష్కమణతో ఇండియా కూటమికి నష్టమేమీ లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘ఆయన ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. ఎన్డీఏలోకి వెళ్లడం ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలు, ఆయన కుమారుడు తేజస్వి కూడా నాకు చెప్పారు. కానీ ఇండియా కూటమి చెదిరిపోకుండా ఉండాలని నేను బయటికి చెప్పలేదు’’ అన్నారు. ఆట ఇప్పుడే ఆరంభమైందని తేజస్వి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో జేడీ(యూ) మట్టి కరవడం ఖాయమంటూ శాపనార్థాలు పెట్టారు. నితీశ్ది ద్రోహమంటూ సీపీఐ (ఎంఎల్) దుయ్యబట్టింది. గోడ దూకుడుకు పర్యాయపదంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారంటూ ఎన్సీపీ (శరద్ పవార్) ఎద్దేవా చేసింది. ‘‘స్నోలీగోస్టర్ (విలువల్లేని వ్యక్తి) పదం నితీశ్కు బాగా సరిపోతుంది. ఇదే వర్డ్ ఆఫ్ ద డే’’ అంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ చమత్కరించారు. పదేపదే కూటములు మార్చడం నితీశ్కు పరిపాటేనని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. జేడీ(యూ) మాత్రం కాంగ్రెస్ స్వార్థపూరిత వైఖరి వల్లే నితీశ్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని చెప్పుకొచి్చంది. కొత్త సర్కారుకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బిహారీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పాటుపడుతుందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక ఎటూ వెళ్లను: నితీశ్ అంతకుముందు ఆదివారం రోజంతా పట్నాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. ఉదయమే జేడీ(యూ) శాసనసభా పక్షం నితీశ్ నివాసంలో భేటీ అయింది. ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కును ఆయనకు కట్టుబెడుతూ తీర్మానించింది. వెంటనే నితీశ్ రాజ్భవన్కు వెళ్లి సీఎం పదవికి రాజీనామా సమరి్పంచారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మహాఘట్బంధన్లో పరిస్థితులు సజావుగా లేకపోవడం వల్లే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు నితీశ్కు మద్దతిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానించారు. ఆ వెంటనే తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాల్సిందిగా గవర్నర్ను నితీశ్ కోరడం, సీఎంగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. తర్వాత నితీశ్ మరోసారి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏను వీడి ఇకపై ఎటూ వెళ్లేది లేదని చెప్పుకొచ్చారు. ఆయన తమ సహజ భాగస్వామి అని బీజేపీ చీఫ్ నడ్డా అన్నారు. జేడీ(యూ)తో కలిసి లోక్సభ ఎన్నికల్లో బిహార్లో మొత్తం 40 సీట్లనూ స్వీప్ చేస్తామని అన్నారు ఇండియా కూటమికి చావుదెబ్బ! తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇచి్చన ఇటీవలి షాక్లకు ఇప్పటికే మూలుగుతున్న కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి నితీశ్ తాజా ని్రష్కమణతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే దూకుడు మీదున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఈ పరిణామం మరింత బలోపేతం చేసింది. లోక్సభ ఎన్నికల్లో పశి్చమబెంగాల్లో అన్ని స్థానాల్లోనూ తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించడం తెలిసిందే. పంజాబ్లోనూ ఆప్ది ఒంటరిపోరేనని రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కూడా అదే రోజు స్పష్టం చేశారు. అధికారమే పరమావధి 2020లో ఏర్పాటైన ప్రస్తుత బిహార్ అసెంబ్లీ పదవీకాలంలో నితీశ్ సారథ్యంలో ఇది ఏకంగా మూడో ప్రభుత్వం కావడం విశేషం! అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ మద్దతుతో నితీశ్ సీఎం అయ్యారు. జేడీ(యూ)లో చీలికకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022లో ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాఘట్బంధన్ సర్కారును ఏర్పాటు చేశారు. 18 నెలలకే దాన్నీ పడదోసి తాజాగా మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ సీఎంగా పీఠమెక్కారు. మొత్తమ్మీద కూటములు మారడం నితీశ్కు ఇది ఐదోసారి. ఆయన తొలిసారిగా 2000లో బిహార్ సీఎం పదవి చేపట్టారు. 2013లో ఎన్డీఏతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నారు. కానీ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్తోకలిసి పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరి 2022 దాకా అందులో కొనసాగారు. -
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సీఎంలుగా మోహన్ యాదవ్, విష్ణుదేవ్ ప్రమాణం
భోపాల్/రాయ్పూర్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని లాల్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ మంగూభాయి పటేల్ సీఎంగా మోహన్ యాదవ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఉప ముఖ్యమంత్రులుగా జగదీష్ దేవ్దా, రాజేంద్ర శుక్లా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి బీజేపీ టికెట్పై ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తానని చెప్పారు. అలాగే ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో సీఎంగా విష్ణుదేవ్ సాయితో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా అరుణ్ సావో, విజయ్ శర్మ ప్రమాణం చేశారు. మోహన్ యాదవ్, విష్ణుదేవ్ సాయి ప్రమాణం స్వీకారోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. -
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం
-
రాజస్తాన్ సీఎం పీఠంపై ఫస్ట్టైం ఎమ్మెల్యే
జైపూర్: మధ్యప్రదేశ్లో రేస్లోలేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన బీజేపీ అధిష్టానం మరోసారి అలాంటి అనూహ్య నిర్ణయమే తీసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్లాల్ శర్మను రాజస్తాన్ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు బీజేపీ మంగళవారం ప్రకటించింది. దీంతో ఇటీవల బీజేపీ విజయబావుటా ఎగరేసిన మూడు రాష్ట్రాలు.. ఛత్తీస్గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్లలో కొత్త ముఖాలే సీఎం పీఠంపై కనిపించనున్నాయి. మంగళవారం జైపూర్లో 115 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై భజన్లాల్ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ భేటీకి బీజేపీ అధిష్టానం తరఫున పార్టీ సీనియర్ నేతలు రాజ్నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. సమావేశం తర్వాత భజనలాల్ వెంటనే రాష్ట్ర గవర్నర్ కల్రాజ్ మి శ్రాను కలిశారు. నూతన ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సిందిగా భజన్లాల్కు గవర్నర్ ఆహ్వనం పలికారు. పదవుల్లో కులాల సమతుల్యం పాటిస్తూ బ్రాహ్మణ వర్గానికి చెందిన భజన్లాల్ను సీఎంగా, రాచరిక వారసురాలైన మహిళా ఎమ్మెల్యే దియా కుమారిని డిప్యూటీ సీఎంగా, దళిత నేత ప్రేమ్చంద్ బైర్వాలను డిప్యూటీ సీఎంగా, సింధ్ వర్గానికి చెందిన వాసుదేవ్ దేవ్నానీని స్పీకర్గా ఎంపికచేశారు. కాంగ్రెస్ అభ్యర్థిమరణంతో వాయిదాపడిన కరణ్పూర్ అసెంబ్లీ స్థానంలో జనవరి 5న పోలింగ్ జరగనుంది నేడు మోహన్కు పట్టం భోపాల్: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణం చేయనున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు హాజరవుతారు. సంస్థాగతం నుంచి సీఎం దాకా... భజన్లాల్ చాలా సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో సంస్థాగత పదవుల్లోనే కొనసాగారు. మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. వెనువెంటనే ఆయన్ను సీఎం పదవి వరించడం విశేషం. భరత్పూర్ జిల్లాకు చెందిన 56 ఏళ్ల భజన్లాల్.. సంగనేర్ నియోజకవర్గం నుంచి 48,000కుపైగా భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. గతంలో ఈయనకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తో మంచి అనుబంధం ఉంది. విద్యార్థి దశలో రాజనీతి శాస్త్రంలో పోస్ట్గ్రాడ్యుయేషన్ చేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. -
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
భోపాల్: బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఓబీసీ వర్గం నాయకుడు మోహన్ యాదవ్(58) పేరును ఖరారు చేసింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వి.డి.శర్మ వెల్లడించారు. కేంద్ర పరిశీలకుల ఆధ్వర్యంలో బీజేపీ శాససనసభాపక్షం సోమవారం సాయంత్రం భోపాల్లో సమావేశమైంది. తమ నాయకుడిగా మోహన్ యాదవ్ను ఎన్నుకుంది. ఆయన పేరును ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్సింగ్చౌహాన్ ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. మోహన్ యాదవ్ ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే. ఆయన ఉజ్జయిని సౌత్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ఉన్నత విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి పదవికి పోటీపడిన వారిలో తొలుత మోహన్ యాదవ్ పేరు లేదు. రా్ష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తో మొదటి నుంచి సంబంధాలు ఉండడం, రాష్ట్రంలో 48 శాతం జనాభా ఉన్న ఓబీసీ నేత కావడంలో బీజేపీ పెద్దలు ఆయనవైపు మొగ్గు చూపించినట్లు తెలుస్తోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా మోహన్ యాదవ్ ఎన్నిక కావడంతో ముఖ్యమంత్రి పదవికి శివరాజ్సింగ్ చౌహాన్ రాజీనామా సమరి్పంచారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా పనిచేస్తానని యాదవ్ చెప్పారు. తనను ఎంపిక చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు పార్టీ అగ్రనేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరడుగట్టిన హిందుత్వావాది మోహన్ యాదవ్ విద్యార్థి దశ నుంచి నాయకుడిగా ఎదిగారు. కరడుగట్టిన హిందుత్వావాదిగా ముద్రపడ్డారు. కళాశాలల్లో ‘రామచరిత మానస్’ను ఆప్షనల్ సబ్జెక్టుగా ప్రవేశపెడతామని 2021లో ప్రకటించారు. మోహన్ యాదవ్ 1965 మార్చి 25న ఉజ్జయినిలో జని్మంచారు. 1982లో ఉజ్జయినిలోని మాధవ్ సైన్స్ కాలేజీలో జాయింట్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. 1984లో అదే కాలేజీలో ఉపాధ్యక్షుడిగా విజయం సాధించారు. ఎల్ఎల్బీ, ఎంబీఏతోపాటు పీహెచ్డీ పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచే ఆయనకు ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది. 1993 నుంచి 1995 దాకా ఆర్ఎస్ఎస్ ఆఫీసు బేరర్గా పనిచేశారు. తొలిసారిగా 2013లో ఉజ్జయిని సౌత్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018, 2023లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. 2020లతో మొదటిసారిగా మంత్రి అయ్యారు. ఉజ్జయిని ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మొట్టమొదటి నాయకుడు ఆయనే. -
ఛత్తీస్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్
రాయ్పూర్: బీజేపీ అగ్రనాయకత్వం తీవ్ర చర్చోపచర్చల తర్వాత ఛత్తీస్గఢ్లో నూతన ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం లభించింది. ఆదివారం రాయ్పూర్లో బీజేపీ ఎమ్మెల్యేలు హాజరైన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో విష్ణుదేవ్ సాయ్ను సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. 59 ఏళ్ల విష్ణుదేవ్ రాష్ట్రంలోని సుర్గుజా ప్రాంతంలోని జష్పూర్ జిల్లా కుంకురీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ప్రాంతంలోని మొత్తం 14 స్థానాల్లోనూ బీజేపీనే విజయబావుటా ఎగరేసింది. ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాక ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డాలకు విష్ణుదేవ్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఎన్నిలక హామీ ప్రకారం వెంటనే హౌజింగ్ పథకం కింద 18 లక్షల ఇళ్లు ఇస్తామని ఆయన ప్రకటించారు. రాయ్పూర్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల భేటీకి 54 మంది పార్టీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ అధిష్టానం పంపిన పర్యవేక్షకులు అర్జున్ ముండా, శర్బానంద సోనోవాల్, దుష్యంత్ కుమార్ గౌతమ్లు హాజరయ్యారు. సమావేశం తర్వాత రాష్ట్ర గవర్నర్ను విష్ణుదేవ్ తదితరులు కలిశారు. దీంతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కాబోయే ముఖ్యమంత్రి విష్ణుదేవ్ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆహా్వనించారని రాజ్భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. 90 సీట్లున్న ఛత్తీస్గఢ్ అసెంబ్లీలో బీజేపీ 54 చోట్ల గెలిచింది. సర్పంచ్గా మొదలై ఆదివాసీ సీఎం దాకా... ఛత్తీస్గఢ్లో బీజేపీ కీలక నేతల్లో విష్ణుదేవ్ ఒకరు. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చారు. సర్పంచ్గా రాజకీయ జీవితం మొదలెట్టి ఆ తర్వాత పలుమార్లు లోక్సభ ఎన్నికల్లో గెలిచి మోదీ తొలి కేబినెట్లో కేంద్ర మంత్రిగా సేవలందించారు. పార్టీ రాష్ట్ర చీఫ్గా మూడుపర్యాయాలు పనిచేసి అధిష్టానం మెప్పు పొందారు. 1990లో బగియా గ్రామ సర్పంచ్గా గెలిచారు. అదే ఏడాది అవిభాజ్య మధ్యప్రదేశ్లో తప్కారా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999, 2004, 2009లో రాయ్గఢ్ ఎంపీగా గెలిచారు. మోదీ తొలిసారి ప్రధాని అయ్యాక కేంద్ర ఉక్కు, గనుల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఛత్తీస్గఢ్ అసెంబ్లీలో మెజారిటీ సీట్లు గెలిస్తే విష్ణుదేవ్ను ‘పెద్దనేత’ను చేస్తామని ఇటీవల ఎన్నికల ప్రచారసభలో అమిత్ షా ప్రకటించడం తెల్సిందే. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక అజిత్ జోగీ తొలి ఆదివాసీ సీఎంగా రికార్డులకెక్కారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్న ఆదివాసీ నేతగా విష్ణుదేవ్ పేరు నిలిచిపోనుంది. విష్ణుదేవ్ తాత బుద్ధనాథ్ సాయ్ 1947–52 వరకు నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన పెదనాన్న నరహరి ప్రసాద్ రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, జనతాపార్టీ ప్రభుత్వంలో సహాయ మంత్రిగాచేశారు. ఇంకో పెదనాన్న సైతం గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. -
Mizoram Chief Minister Lalduhoma: ఎమ్మెల్యేలకు కొత్త కార్లు కొనబోము
ఐజ్వాల్: మిజోరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నూతన ముఖ్యమంత్రి లాల్దుహోమా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు కొత్త కార్లు కొనుగోలు చేయబోమని కరాఖండీగా చెప్పేశారు. కొత్త ప్రభుత్వం కొలువుతీరిన ప్రతిసారీ కొత్త కార్ల కొనుగోలుతో ప్రజాధనం వృథా అవుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల దిగిపోయిన మంత్రులు, ఓడిన ఎమ్మెల్యేలు వాడిన ప్రభుత్వ వాహనాలనే కొత్త మంత్రులు, శాసనసభ్యులు వాడుకోవాలని సూచించారు. -
Assembly Elections 2023: మూడు రాష్ట్రాల్లో సీఎంల ఎంపికపై బీజేపీ కసరత్తు!
న్యూఢిల్లీ: రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ మూడు రాష్ట్రాల్లో నూతన ముఖ్యమంత్రుల ఎంపికపై దృష్టి పెట్టింది. పార్టీ సీనియర్ నేతలు సోమవారం సమాలోచనల్లో మునిగిపోయారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చలు జరిపారు. ముఖ్యమంత్రుల ఎంపికపై అభిప్రాయాలు పంచుకున్నారు. మూడు రాష్ట్రాల్లో పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత బీజేపీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం అతిత్వరలో మూడు రాష్ట్రాలకు పరిశీలకులను నియమించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. కొత్త సీఎంలు ద ఇప్పటివరకైతే అధికారికంగా ఎవరూ నోరువిప్పలేదు. బీజేపీ అధిష్టానం గుంభనంగా వ్యవహరిస్తోంది. మూడు రాష్ట్రాల్లోనూ ఆశావహులు చాలామందే ఉన్నారు. సీఎం పదవే లక్ష్యంగా పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయతి్నస్తున్నారు. మధ్యప్రదేశ్లో మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని శివరాజ్ సింగ్ చౌహాన్ భావిస్తున్నారు. ఇక్కడ కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్రసింగ్ తోమర్తోపాటు సీనియర్ నేత విజయ్వర్గియా కూడా రేసులో ఉన్నారు. రాజస్తాన్, ఛత్తీస్గఢ్లో సీనియర్లను పక్కనపెట్టి అనూహ్యంగా కొత్త ముఖాలను తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజస్తాన్లో మాజీ సీఎం వసుంధర రాజే, ఛత్తీస్గఢ్లో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తమ ప్రయత్నాలు ఆపడం లేదు. రాజస్తాన్లో మహంత్ బాలక్నాథ్ యోగి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఛత్తీస్గఢ్లో అరుణ్ కుమార్ సావో, ధర్మలాల్ కౌషిక్, మాజీ ఏఐఎస్ అధికారి ఓ.పి.చౌదరి సీఎం పోస్టు కోసం పోటీపడుతున్నారు. వీరంతా ఓబీసీ వర్గానికి చెందిన నాయకులే. -
మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖరారు!?
New Chief Ministers: ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయాలను నమోదు చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయనుంది. ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లను కూడా బీజేపీ హైకమాండ్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫలితాలు వెలువడిన ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఖరారైన ముఖ్యమంత్రుల పేర్లను బీజేపీ ఇంకా వెల్లడించలేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో బీజేపీ రికార్డ్ స్థాయిలో సీట్లు గెలుపొందింది. మధ్యప్రదేశ్లో 163 సీట్లు, రాజస్థాన్లో 115 సీట్లు, ఛత్తీస్గఢ్లో 54 సీట్లు గెలిచి కాషాయ పార్టీ చరిత్ర సృష్టించింది. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. సీఎం అభ్యర్థులు వీళ్లే..? మధ్యప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలోని ప్రముఖ నాయకులలో ఒకరిగా ఉన్నారు. అక్కడ బీజేపీ అఖండ విజయంలో ఆయన పాత్ర గణనీయంగా ఉందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనే మరోసారి కొనసాగించే అవకాశం ఉంది. బుద్ని నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శివరాజ్ చౌహాన్.. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నాయకుడు విక్రమ్ మస్టల్ శర్మపై 1,04,974 ఓట్ల బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. బుద్ని అసెంబ్లీ నియోజకవర్గం 2006 నుంచి ఆయనకు కంచుకోటగా ఉంది. మరోవైపు ఛత్తీస్గఢ్లోనూ మాజీ ముఖ్యమంత్రి రమణ్సింగ్కు మరోసారి అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. ఇక రాజస్థాన్లో కాంగ్రెస్ నుంచి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక్కడ బీజేపీ సీనియర్ నాయకుడు, అల్వార్ ఎంపీ మహంత్ బాలక్నాథ్ యోగి, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేలలో ఎవరో ఒకరికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. -
మా మద్దతు...సీఎం అతనే..!
-
సీఎం ప్రకటన.. నేడే ప్రమాణ స్వీకారం !?
-
కర్ణాటక సీఎంగా సిద్ధూ ప్రమాణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో వీరి చేత గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు. వీరితోపాటు మరో 8 మంది.. డాక్టర్ జి.పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీశ్ జారకిహోళి, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్ ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దేవుని పేరిట, డీకే శివకుమార్ శ్రీ గంగాధర అనే ఆయన తాత గారి పేరిట ప్రమాణం చేశారు. పరమేశ్వర రాజ్యాంగంపై, సతీశ్ బుద్ధుడు, బసవణ్ణ అంబేడ్కర్ పేరిట, జమీర్ అహ్మద్ అల్లా, తన తల్లి పేరిట ప్రమాణం చేశారు. మిగిలిన వారు దేవుని పేరిట ప్రమాణం చేశారు. అనంతరం, సాయంత్రం నూతన సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో మంత్రివర్గం మొట్టమొదటి సమావేశం జరిగింది. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన వివిధ హామీల అమలుకు కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వీటి అమలుకు ఏడాదికి రూ.50 వేల కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతుందని అంచనా. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఆర్థికం సహా ఎటువంటి ఇబ్బందులెదురైనా తప్పక అమలు చేస్తామని అనంతరం సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ఈనెల 22 నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుందన్నారు. నూతన ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని, కొత్త స్పీకర్ ఎంపిక ఈ సమావేశాల్లో ఉంటుందని చెప్పారు. ఇలా ఉండగా, సీఎం, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన సిద్ధరామయ్య, శివకుమార్లకు ప్రధాని మోదీ, మాజీ ప్రధాని దేవె గౌడ, మాజీ సీఎం బొమ్మై అభినందనలు తెలిపారు. జాతీయ నేతలు హాజరు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీ హాజరు కాలేదు. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ప్రదేశ్ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్, సుఖ్వీందర్ సింగ్లతోపాటు తమిళనాడు, బిహార్, జార్ఖండ్ సీఎంలు ఎంకే స్టాలిన్, నితిశ్ కుమార్, హేమంత్ సోరెన్లు పాల్గొన్నారు. వీరితోపాటు బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆర్ఎస్పీ అధ్యక్షుడు ఎన్కే ప్రేమచంద్రన్, సీపీఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, వీసీకే అధ్యక్షుడు డాక్టర్ తిరుమల వలన్, ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి, నటుడు కమల్ హాసన్ కూడా ఉన్నారు. నేతలంతా చేతులు కలిపి సంఘీభావం ప్రదర్శించారు. -
ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణంస్వీకారం
-
Live: శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్న సిద్ధరామయ్య
-
రేపు సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం
-
కర్ణాటక కాబోయే సీఎం సిద్ధరామయ్య..?
-
కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగుతోన్న సస్పెన్స్
-
అదే తీరు.. అదే తకరారు!
దక్షిణాదిన కీలక రాష్ట్రం కర్ణాటక బీజేపీ నుంచి కాంగ్రెస్ చేతిలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడంలో మాత్రం ఇక్కట్లు ఎదుర్కొంటోంది. సీఎం కుర్చీ కోసం ఇద్దరు హేమాహేమీలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడుతున్నారు. ఎవరిని ఎంపిక చేయాలో తేల్చుకోలేక కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకుంటోంది. ఈ పరిణామం చివరకు ఎటు దారి తీస్తుందో తెలియక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో నెగ్గడం కంటే కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడమే పెద్ద సవాలుగా మారడం గమనార్హం. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్లో ఇలాంటి విపత్కర పరిస్థితి ఇదే మొదటిసారి కాదు. సుదీర్ఘ కసరత్తు తర్వాత సీఎంను నియమించినప్పటికీ పార్టీలో, ప్రభుత్వంలో లుకలుకలు కొనసాగడం, అసంతృప్త సెగలు రగలడం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రత్యేకత. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటే కాంగ్రెస్కు గ్రహపాటుగా మారుతోంది. సీఎంలను ఎంపిక చేయడంలో తప్పటడుగులు వేయడం, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోలేక ఉక్కిరిబిక్కిరి కావడం ఆ పార్టీలో ఒక ఆనవాయితీగా మారింది. ఇదే కాంగ్రెస్ సంస్కృతి అని సరిపెట్టుకోవాలేమో! అశోక్ గహ్లోత్ వర్సెస్ పైలట్ రాజస్తాన్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. పీసీసీ చీఫ్, యువ నాయకుడు సచిన్ పైలట్ సీఎం పోస్టు ఆశించారు. తన నాయకత్వంలోనే పార్టీ గెలిచినందున పదవి తనకే దక్కుతుందని భావించారు. కానీ సోనియా కుటుంబం మరోలా ఆలోచించింది. కారణాలేమైనా సీనియర్ నేత అశోక్ గహ్లోత్ను సీఎం చేసింది. దాంతో పార్టీ రెండు వర్గాలుగా చీలింది. పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేశారు. 2021లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు విఫలయత్నం ప్రయత్నించారు. సమస్య పరిష్కారానికి 2022లో గహ్లోత్ను ఏఐసీసీ అధ్యక్షుడిగా, పైలట్ను సీఎంగా నియమించేందుకు పార్టీ పెద్దలు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ కుర్చీ వీడేందుకు గహ్లోత్ అంగీకరించలేదు. ఈ విషయమై పెద్ద హైడ్రామానే నడిచింది. చివరికి అధిష్టానమే దిగిరాక తప్పలేదు. పైలట్కు సీఎం కుర్చీ ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. రాజస్తాన్లో గహ్లోత్ సర్కారుపై పైలట్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. రెండు వర్గాల మధ్య సయోధ్య సాధ్యం కావడం లేదు. అధిష్టానం కూడా చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. పంజాబ్లో పరాభవం పంజాబ్లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలు కాంగ్రెస్ కొంప ముంచాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. సిద్ధూ సీఎం పదవిని కోరుకున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ అధిష్టానం దళిత కార్డు ప్రయోగించింది. చరణ్జిత్ సింగ్ చన్నీని సీఎంగా గద్దెనెక్కించింది. అమరీందర్ సింగ్ సొంత దారి చూసుకున్నారు. ఎన్నికల్లో సిద్ధూ వర్గం సహాయ నిరాకరణ చేసింది. ఫలితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం దక్కింది. ఎందుకు ఈ పరిస్థితి? అధికార బీజేపీలో మోదీయే ఏకైక పవర్ సెంటర్. పార్టీలో ఆయన మాటకు తిరుగులేదు. ఎవరిని సీఎంగా నియమించాలన్నా మోదీదే తుది నిర్ణయం. కాంగ్రెస్లో అలా కాదు. సోనియా, రాహుల్, ప్రియాంక రూపంలో మూడు పవర్ సెంటర్లున్నాయంటారు. డీకే శివకుమార్కు సోనియా అండదండలుంటే ప్రియాంక మాత్రం సిద్ధరామయ్య వైపు మొగ్గుతుంటే రాహుల్ సైతం ఆమెను సమర్దిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ‘‘రాష్ట్రాల్లో ఎవరో ఒక్కరే శక్తివంతులుగా పెత్తనం చెలాయించడం కాంగ్రెస్ అధిష్టానానికి ఇష్టముండదు. అభద్రతాభావమే ఇందుకు కారణం. అందుకే పలు పవర్ సెంటర్లను ప్రోత్సహిస్తుంది’’ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అస్సాం చేజారింది ఈశాన్య భారతదేశంలో కీలక రాష్ట్రం అస్సాం. ఈ రాష్ట్రం ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. రాహుల్ గాంధీ వ్యవహార శైలి పట్ల విసుగెత్తిపోయిన హిమంత బిశ్వ శర్మ 2015లో బీజేపీలో చేరారు. తర్వాత ఎన్నికల్లో నెగ్గి ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రి అయ్యారు. అస్సాం బీజేపీ ఖాతాలో చేరింది. అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభావం గాలిలో దీపమే. ఛత్తీస్గఢ్లోనూ... ఛత్తీస్గఢ్లో సైతం కాంగ్రెస్ పరిస్థితి గొప్పగా లేదు. పార్టీలో గ్రూప్లు భగ్గుమంటున్నాయి. తనను ముఖ్యమంత్రిని చేస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందని, ఇప్పటికీ నిలబెట్టుకోలేదని సీనియర్ నేత టీఎస్ సింగ్ దేవ్ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలపై, సీఎం భూపేష్ భగేల్పై కారాలు మిరియాలు నూరుతున్నారు. మధ్యప్రదేశ్ను వదిలేసుకున్నారు మధ్యప్రదేశ్లోనూ చేతికందిన అధికారం కాంగ్రెస్ తప్పిదంతో చేజారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే జ్యోతిరాదిత్య సింధియా సీఎం పదవి డిమాండ్ చేశారు. సోనియా కుటుంబం కమల్నాథ్ వైపు మొగ్గింది. దాంతో సింధియా 2020లో తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు. మెజార్టీ లేక కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివరాజ్సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఒప్పందంలో భాగంగా జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. రాష్ట్రంలో కాంగ్రెస్కు మిగిలింది గుండు సున్నా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బెంగళూరు నుంచి ఢిల్లీ బయల్దేరిన ఏఐసీసీ పరిశీలకులు
-
వీడియో: కర్ణాటక సీఎం ఎవరు?.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
-
కర్ణాటక సీఎం ఎవరనేదానిపై కొనసాగుతున్న సస్పెన్స్
-
ఢిల్లీకి చేరిన కర్ణాటక కొత్త సీఎం పంచాయతీ
-
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రాజీనామా.. 12న ప్రమాణ స్వీకారం
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ అఖండ విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆయన మంత్రివర్గం శుక్రవారం రాజీనామా చేశారు. గాంధీనగర్లోని రాజ్భవన్కు చేరుకుని రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు రాజీనామా పత్రాలను సమరించారు. సీఎం భూపేంద్ర పటేల్తో పాటు గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్, పార్టీ చీఫ్ విప్ పంకజ్ దేశాయ్లు హాజరయ్యారు. గురువారం వెలువడిన ఫలితాల్లో 182 స్థానాలకు గానూ బీజేపీ 156 సీట్లు గెలుపొంది రికార్డులు తిరగరాసింది. భూపేందర్ పటేల్ మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపడతారని ఎన్నికలకు ముందే ప్రకటించింది బీజేపీ. ఫలితాలు వెలువడిన క్రమంలో గురువారం బీజేపీ రాష్ట్ర చీఫ్ సైతం అదే విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో ఫార్మాలిటీ కోసం రాజీనామాలు చేశారు. మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆయన మంత్రివర్గం రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు పటేల్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. గాంధీనగర్లోని కమలం పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమవుతారు. మధ్యాహ్నానికి పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నికపై గవర్నర్కు తెలియజేస్తాం. గవర్నర్ సూచనల మేరకు సీఎం, కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది.’ అని తెలిపారు పార్టీ చీఫ్ విఫ్ పంకజ్ దేశాయ్. మరోవైపు.. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం గాంధీనగర్లోని హెలిపాడ్ గ్రౌండ్లో సోమవారం ఉంటుందని పార్టీ చీఫ్ సీఆర్ పాటిల్ ప్రకటించారు. సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు హాజరవుతారని చెప్పారు. ఇదీ చదవండి: Gujrat Polls 2022: మున్సిపాలిటీ సభ్యుడి నుంచి సీఎం స్థాయికిపాలిటీ సభ్యుడి నుంచి సీఎంగా -
Manipur: మణిపూర్కు కొత్త సీఎం?
Will Biren Singh Again CM For Manipur: మణిపూర్కు కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నాడా?.. ప్రస్తుత సీఎంగా ఉన్న బీరేన్ సింగ్కి అధిష్టానం మొండి చెయ్యి చూపించనుందా? ముందుగానే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడం.. ముఖంలో జోష్ లేకపోవడం వెనుక వెనుక ఆంతర్యం ఏంటి? ఇప్పటిదాకా మణిపూర్కు సీఎం అభ్యర్థి పేరును బీజేపీ ఎందుకు ఖరారు చేయలేదు.. ఈ పరిణామాలన్నిపై రాజకీయ విశ్లేషకులు జోరుగా చర్చించేస్తున్నారు. మణిపూర్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఘనమైందే. ఎందుకంటే 2017 ఎన్నికల్లో 21 స్థానాలు గెలిచి.. సంకీర్ణ ప్రభుత్వంతో నెట్టుకొచ్చింది. అయితే 2022 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ను గల్లంతు చేస్తూ.. 32 స్థానాలు గెలిచి మ్యాజిక్ ఫిగర్తో నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ అందుకుంది. అయితే సోమవారం ఒక విచిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. ఇంఫాల్ అసెంబ్లీ హాల్లో 12వ శాసనసభ సభ్యుడిగా బీరెన్ సింగ్ ప్రమాణం చేశారు. ప్రమాణ సమయంలోనూ ముఖాభావంగా కనిపించారాయన. అంతకుముందు ఆయన రాజీనామాను మణిపూర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్కు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ముఖ్యమంత్రిగా Incumbent కొనసాగాలని గవర్నర్, బీరెన్ను కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బీరెన్ సింగ్ హెయిన్గాంగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రత్యర్థి పీ శరత్చంద్రను ఓడించారు. అయితే ఎన్నికల ప్రచార సమయం నుంచి సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే వస్తోంది. బీజేపీ కూడా అభ్యర్థి ఎవరనే దానిపై పెదవి విప్పడం లేదు. అయితే బీరెన్ సింగ్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేస్తారని తోటి ఎమ్మెల్యేలు చెప్తుండగా.. ఆయన అల్లుడు-ఎమ్మెల్యే అయిన రాజ్కుమార్ ఇమో సింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ తరుణంలో అధిష్టానం నుంచి మాత్రం సానుకూలత కనిపించడం లేదు. ఇదిలా ఉండగా.. మణిపూర్ అసెంబ్లీ గడువు మార్చి 19వ తేదీతో ముగియనుంది. -
గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్: ఆయనే ఎందుకు
గాంధీనగర్: గుజరాత్లో 2017లో తొలిసారిగా బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర పటేల్(59)ను అదృష్టం వరించింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆదివారం సమావేశమైన బీజేపీ శాసనసభా పక్షం ఆయనను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా, 112 మంది బీజేపీ సభ్యులున్నారు. శాసనసభా పక్ష సమావేశానికి వీరంతా హాజరయ్యారు. తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్ పేరును శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విజయ్ రూపానీ ప్రతిపాదించారు. ఇందుకు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. శాసనసభా పక్ష సమావేశానికి బీజేపీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషీ, సీనియర్ నేత తరుణ్ చుగ్ హాజరయ్యారు. కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ఎన్నికతో రూపానీ వారసుడు ఎవరన్న దానిపై సస్పెన్స్కు తెరపడింది. భూపేంద్ర పటేల్ ఆదివారం సాయంత్రం గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ను కలిశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయనకు తెలియజేశారు. ఈ సందర్భంగా భూపేంద్ర వెంట నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషీ, విజయ్ రూపానీ, సి.ఆర్.పాటిల్ తదితరులు ఉన్నారు. నేడు భూపేంద్ర ఒక్కరే ప్రమాణం భూపేంద్ర పటేల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రమాణ స్వీకా రం చేస్తారని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ ప్రకటించారు. కేవలం ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్నారు. సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపి, 2, 3 రోజుల్లో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడిం చారు. ఉప ముఖ్యమంత్రి పదవిపై పార్టీ శాసనసభా పక్ష భేటీలో ఎలాంటి చర్చ జరుగలేదన్నారు. మోదీ, షా, నడ్డాలకు కృతజ్ఞతలు తనపై నమ్మకం ఉంచి, ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినందుకు గాను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు భూపేంద్ర పటేల్ కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్ ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. విజయ్ రూపానీ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని ఉద్ఘాటించారు. భూపేంద్ర పటేల్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో, భూపేంద్ర నాయకత్వంలో గుజరాత్ అభివృద్ధికి కొత్త ఉత్సాహం, ఊతం లభిస్తాయని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ అధికారం దక్కించుకోవాలనే.. గుజరాత్ తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్ను ఎన్నుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపర్చింది. నిజానికి తొలుత కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలి, డయ్యూ, డామన్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్లు వినిపించాయి. కొత్త ముఖ్యమంత్రిగా వారిద్దలో ఒకరిని ఎంపిక చేస్తారన్న ప్రచారం సాగింది. ఆశావహుల జాబితాలో భూపేంద్ర పటేల్ పేరు లేదు. తొలిసారిగా ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయనను ఏకంగా సీఎం పదవి వరించడం గమనార్హం. భూపేంద్ర పటేల్ గుజరాత్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలమైన పాటిదార్ సామాజిక వర్గానికి చెందినవారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. మళ్లీ అధికారం దక్కించుకోవాలంటే పాటిదార్ వర్గాన్ని మచ్చిక చేసుకోక తప్పదన్న అంచనాతోనే బీజేపీ నాయకత్వం భూపేంద్ర వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. విజయ్ రూపానీ మొదటిసారిగా 2016 ఆగస్టు 7న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది ఆగస్టు 7న సీఎంగా మొత్తం ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు. వార్డు కౌన్సిలర్ నుంచి సీఎం దాకా.. అహ్మదాబాద్: గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న భూపేంద్ర పటేల్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘాట్లోడియా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్ను రికార్డు స్థాయిలో 1,17,000 ఓట్ల తేడాతో మట్టికరిపించారు. భూపేంద్ర ఎమ్మెల్యేగా నెగ్గడం ఇదే మొదటిసారి. గుజరాత్ మాజీ సీఎం, ఉత్తరప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఆనందిబెన్ పటేల్ 2012 నుంచి 2017 దాకా ఘాట్లోడియా స్థానం నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. భూపేంద్ర పూర్తిపేరు భూపేంద్ర రజనీకాంత్ భాయి పటేల్. అభిమానులు, అనుచరులు దాదా అని పిలుచుకుంటారు. అనందిబెన్ పటేల్కు సన్నిహితుడిగా పేరుగాంచిన ఆయన 1999 నుంచి 2000 దాకా మేమ్నగర్ నగర పాలిక అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2010 దాకా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ బోర్డు వైస్ చైర్మన్గా వ్యవహరించారు. 2010 నుంచి 2015 వరకూ అహ్మదాబాద్లోని థాల్టెజ్ వార్డు కౌన్సిలర్గా పనిచేశారు. అహ్మద్బాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా, అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా సేవలందించారు. అహ్మదాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్లో డిపొ్లమా పూర్తిచేసిన భూపేంద్ర పటేల్ పాటిదార్ సామాజికవర్గంలోని కాడ్వా అనే ఉప కులానికి చెందినవారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన పాటిదార్ వర్గం నేతలు లియువా అనే ఉప కులానికి చెందినవారు. భూపేంద్ర పాటిదార్ సంస్థలైన సర్దార్ధామ్, విశ్వ ఉమియా ఫౌండేషన్ ట్రస్టీగా కూడా పనిచేస్తున్నారు. మంత్రిగా పని చేయకుండానే ఆయన సీఎం అవుతుండడం విశేషం. ఆయనే ఎందుకు? వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మరోసారి గెలిపించే బాధ్యతను అధిష్టానం భూపేంద్ర పటేల్పై మోపింది. ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు ఆయనను సీఎం పదవిలో కూర్చోబెట్టడం ఆసక్తికరంగా మారింది. బలమైన పాటిదార్(పటేల్) సామాజికవర్గంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసు చూరగొన్న వ్యక్తి కావడమే ఆయనకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో భూపేంద్ర అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. నగర అభివృద్ధి విషయంలో మోదీ ప్రణాళికలను చక్కగా అమలు చేశారు. అప్పుడే మోదీ దృష్టిలో సమర్థవంతుడైన నాయకుడిగా ముద్రపడ్డారు. ఇటీవల కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు బాధితుల కోసం భూపేంద్ర ఆక్సిజన్ సిలిండర్లు విరివిగా సమకూర్చారు. ఆసుపత్రుల్లో పడకలు ఏర్పాటు చేయించారు. పదవిలో ఉన్నప్పటికీ ఆడంబరాలు, ఆర్భాటాలకు దూరంగా ఉండడం, తన పని తాను నిశ్శబ్దంగా చేసుకుపోవడం భూపేంద్ర ప్రత్యేకత. ఇవన్నీ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక ఆనందిబెన్ పటేల్ సిఫారసు కూడా బీజేపీ నాయకత్వం భూపేంద్ర వైపు మొగ్గు చూపేలా చేసింది. కొత్త ముఖ్యమంత్రి ఎంపికలో తమ పార్టీ అధిష్టానం ఆనందిబెన్ అభిప్రాయానికి విలువనిచి్చందని బీజేపీ నేత ఒకరు తెలిపారు. లేకపోతే నితిన్ పటేల్ గానీ, మరొకరు గానీ ముఖ్యమంత్రి అయ్యేవారని వెల్ల డించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత మన్సుఖ్ మాండవియా(ప్రస్తుతం కేంద్ర మంత్రి) గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డారు. పాటిదార్ వర్గం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల వెనుక చేరకుండా చూడాలన్నదే ప్రధాని మోదీ ఉద్దేశమని మరో నేత చెప్పాడు. గుజరాత్ జనాభాలో పాటిదార్ వర్గం దాదాపు 14 శాతం ఉంటుంది. దాదాపు 90 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను నిర్దేశించేది పాటిదార్లే. రాష్ట్రంలో ప్రతి ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు పాటిదార్ కావడం గమనార్హం. 1995 నుంచి బీజేపీకి అండగా నిలుస్తున్న పాటిదార్లు 2015లో రిజర్వేషన్ల ఆందోళనతో కొంత దూరమయ్యారు. -
మంచి పాలన అందించండి
సాక్షి బెంగళూరు: ప్రజలకు ఉత్తమ పాలన అందించాలని కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బసవరాజబొమ్మై తొలిసారిగా శుక్రవారం ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలను కలుసుకున్నారు. తనపై నమ్మకం ఉంచి సీఎంగా బాధ్యతలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర షెకావత్, హోం మంత్రి అమిత్ షాతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అన్ని విధాల సహకారం అందిస్తాం... ప్రధానితో భేటీ సందర్భంగా సీఎం బసవరాజ బొమ్మై కర్ణాటక రాష్ట్ర పరిస్థితులను వివరించారు. మోదీ స్పందిస్తూ ప్రజలకు మంచి పాలన అందించాలని, కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచించారు. ఇదే సమయంలో వరద నష్ట పరిహారం అందించాలని, హుబ్లీ–ధారవాడ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్, రాయచూరుకు ఎయిమ్స్ తరహాలో వైద్య సంస్థను మంజూరు చేయాలని ప్రధానికి సీఎం విన్నవించారు. కలబురిగి ఈఎస్ఐ వైద్య కళాశాల, స్థానిక ఆస్పత్రిని ఎయిమ్స్గా అప్గ్రేడ్ చేయాలని కోరారు. సీఎం విజ్ఞప్తులపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించి.. రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించి వారం రోజుల్లోగా మంత్రివర్గ విస్తరణ చేపడతానని తెలిపారు. -
కర్ణాటక 20వ సీఎంగా రేపు బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం
బెంగళూరు: కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉ.11 గంటలకు రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్.. బొమ్మైచే ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. అంతకుముందు కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైను బీజేపీ శాసన సభాపక్షం ఎన్నుకుంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, యడియూరప్ప సమక్షంలో మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. లింగాయత్ సామాజిక వర్గానికి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడే బసవరాజు. యడియూరప్ప వారసుడిగా ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న బసవరాజు వైపే పార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు. దీంతో అధిష్టానం ఆదేశాలతో పరిశీలకులు బసవరాజు పేరును ఖరారు చేశారు. తాజా మాజీ సీఎం యడియూరప్ప కూడా తదుపరి సీఎంగా బసవరాజునే సూచించిన విషయం తెలిసిందే. జనతా దళ్ పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన బసవరాజు 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2008లో బీజేపీలో చేరి కీలక నాయకుడిగా అవతరించారు. షిగ్గాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యడియూరప్ప మంత్రివర్గంలో హోంమంత్రిగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం రేసులో అరవింద్ బెల్లాద్, బసన్నగౌడ పాటిల్, సీటీ రవి తదితర పేర్లు తెరమీదకు వచ్చాయి. చివరకు బసవరాజు బొమ్మైకే ఆ అదృష్టం వరించింది. బసవరాజు గతంలో టాటా గ్రూప్లో ఇంజనీర్గా బసవరాజు పని చేశారు. రెండు, మూడు రోజుల్లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
బ్రేకింగ్: కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై
బెంగళూరు: కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైను బీజేపీ శాసన సభాపక్షం ఎన్నుకుంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, యడియూరప్ప సమక్షంలో మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. లింగాయత్ సామాజిక వర్గానికి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడే బసవరాజు. యడియూరప్ప వారసుడిగా ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న బసవరాజు వైపే పార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు. దీంతో అధిష్టానం ఆదేశాలతో పరిశీలకులు బసవరాజు పేరును ఖరారు చేశారు. తాజా మాజీ సీఎం యడియూరప్ప కూడా తదుపరి సీఎంగా బసవరాజునే సూచించిన విషయం తెలిసిందే. జనతా దళ్ పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన బసవరాజు 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2008లో బీజేపీలో చేరి కీలక నాయకుడిగా అవతరించారు. షిగ్గాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యడియూరప్ప మంత్రివర్గంలో హోంమంత్రిగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం రేసులో అరవింద్ బెల్లాద్, బసన్నగౌడ పాటిల్, సీటీ రవి తదితర పేర్లు తెరమీదకు వచ్చాయి. చివరకు బసవరాజు బొమ్మైకే ఆ అదృష్టం వరించింది. బసవరాజు గతంలో టాటా గ్రూప్లో ఇంజనీర్గా బసవరాజు పని చేశారు. రెండు, మూడు రోజుల్లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
Karnataka: కౌన్ బనేగా కర్ణాటక సీఎం?
తమకు కొత్త ముఖ్యమంత్రిగా ఎవరొస్తున్నారనే ప్రశ్న ప్రస్తుతం కర్ణాటక పౌరుల మెదళ్లను తొలచేస్తోంది. త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చే సత్తా ఉన్న నేతనే సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. లింగాయత్, ఒక్కలిగ, బ్రాహ్మణ వర్గాల నుంచి బలమైన నేతను నేనేనంటూ చాలా మంది ముందుకొచ్చినా.. బీజేపీ ఢిల్లీ నాయకత్వం కొందరి పేర్లనే పరిశీలనలోకి తీసుకుందని సమాచారం. నిఘా వర్గాలు, ప్రభుత్వంతో సంబంధంలేని ప్రైవేట్ సీనియర్ సలహాదారులు,ఆర్ఎస్ఎస్, ఉన్నతస్థాయి ప్రభుత్వాధికారుల నుంచి తెప్పించిన నివేదికలను అగ్రనేతలు పరిశీలిస్తున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబళె తుది నిర్ణయం తీసుకోవడమే తరువాయి అని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. లింగాయత్, ఒక్కలిగ ఇలా ఒక వర్గం వ్యక్తికే సీఎం పదవి ఇస్తున్నామనేలా కాకుండా విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఎంపికచేయాలని పార్టీ భావిస్తోంది. సీఎం పదవి వరించే అవకాశముందని పేర్లు వినిపిస్తున్న వారిలో ముఖ్యల గురించి క్లుప్తంగా.. బసవరాజ్ బొమ్మై(61) ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో హోం మంత్రి అయిన బసవరాజ్ సోమప్ప బొమ్మై.. యడియూరప్పకు అత్యంత దగ్గరి వ్యక్తి. లింగాయత్. మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై కుమారుడైన బసవరాజ్ కూడా ‘జనతా పరివార్’కు చెందినవారే. 2008లో బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో జలవనరుల శాఖ మంత్రిగానూ చేశారు. మురుగేశ్ నిరానీ(56) ప్రస్తుతం గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. లింగాయత్లలో ప్రముఖమైన పంచమ్శాలీ లింగాయత్ వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. వృత్తిపరంగా పారిశ్రామికవేత్త అయిన ఈయనకు చెందిన విద్యుత్, చక్కెర తదితర పరిశ్రమల్లో లక్షకుపైగా కార్మికులు ఉన్నారు. హోం మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా చెబుతారు. అరవింద్ బెల్లాద్(51) ఉన్నత విద్యను అభ్యసించిన అరవింద్ బెల్లాద్కు నేతగా మంచి పేరుంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ చట్టసభ్యుడైన చంద్రకాంత్ బెల్లాద్ కుమారుడే ఈ అరవింద్. ఆర్ఎస్ఎస్ మూలాలున్న అరవింద్కు యువనేతగా కర్ణాటకలో ఏ అవినీతి మచ్చాలేని రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించారు. బసన్నగౌడ పాటిల్(57) విజయపుర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బసన్నగౌడ గతంలో కేంద్రంలో టెక్స్టైల్స్, రైల్వే శాఖల సహాయమంత్రిగా చేశారు. లింగాయత్ వర్గానికి చెందిన ఈయన గతంలో రెండుసార్లు ఎంపీగా, ఒకసారి ఎంఎల్సీగానూ పనిచేశారు. ఈ ఏడాది ఆరంభంలో పంచమశాలీ లింగాయత్లనూ బీసీలుగా గుర్తించాలని, రిజర్వేషన్ కల్పించాలని జరిగిన ఉద్యమానికి సారథ్యం వహించారు. సీటీ రవి(54) బీజేపీ ప్రస్తు జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన సీటీ రవి ఒక్కలిగ వర్గానికి చెందిన నేత. సంఘ్ పరివార్కు చెందిన వ్యక్తి. బీజేపీ జాతీయ ఆర్గనైజేషన్ సెక్రటరీ బీఎల్.సంతోష్కు బాగా సన్నిహితుడు. కర్ణాటకలో గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల రాష్ట్ర మంత్రిగా రాజీనామా చేసి కేంద్రంలో పార్టీ పనుల్లో క్రియాశీలకంగా మారారు. సీఎన్ అశ్వథ్ నారాయణ్(52) కర్ణాటక డెప్యూటీ సీఎంగా సేవలందిస్తున్నారు. వైద్యవిద్యను అభ్యసించిన సీఎన్ అశ్వథ్ నారాయణ్ ఆధునిక భావాలున్న వ్యక్తి. 2008 నుంచి మల్లేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. యువ నాయకత్వానికి ప్రాధాన్యతనిచ్చి పార్టీ.. ఒక్కలిగ వర్గానికి చెందిన ఈయనను డిప్యూటీ సీఎంను చేసింది. ప్రహ్లాద్ జోషి(58) కేంద్ర బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అయిన ప్రహ్లాద్ జోషి బ్రాహ్మణ వర్గానికి చెందిన సీనియర్ నేత. ధర్వాడ్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ప్రధాని మోదీకి దగ్గరి వ్యక్తిగా పేరుంది. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత ఈయనకు కేబినెట్ మంత్రి పదవి కట్టబెట్టారు. ఆర్ఎస్ఎస్ వర్గాలతో మంచి సంబంధాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు చక్కబెడతారని ఈయనకు పేరుంది. విశ్వేశ్వర హెగ్డే కగెరి(60) ప్రస్తుతం సిర్సి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విశ్వేశ్వర హెగ్డే కగెరి ఏకంగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత కర్ణాటక అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ప్రాథమిక విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ఈయన ఏబీవీపీ విద్యార్థి నేతగా తన ప్రస్థానం మొదలుపెట్టారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
Himanta Biswa Sarma: అస్సాం సీఎంగా హిమంత
గువాహటి: అస్సాం నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత, నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్ కన్వీనర్ హిమంత బిశ్వ శర్మ ఎన్నికయ్యారు. రాష్ట్ర 15వ సీఎంగా సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఆదివారం తమ శాసనసభా పక్ష నేతగా శర్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత ఎన్డీఏ కూడా ఆయనను తమ శాసన సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రస్తుత సీఎం సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వ శర్మ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ రేసులో ఎట్టకేలకు శర్మ విజయం సాధించారు. పార్టీ అధిష్టానం ఈ ఇద్దరు నేతలను శనివారం ఢిల్లీకి పిలిపించి, చర్చలు జరిపింది. శాసనసభాపక్ష భేటీలో హిమంత బిశ్వ శర్మ పేరును సర్బానంద సోనోవాలే ప్రతిపాదించడం విశేషం. అన్ని కోవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ అసెంబ్లీ భవనంలోని బీజేపీ కాన్ఫరెన్స్ హాల్లో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి శర్మ, సోనోవాల్ కలిసి ఒకే వాహనంలో వచ్చారు. అంతకుముందు, ఉదయం సీఎం సర్బానంద సోనోవాల్ గవర్నర్ జగదీశ్ ముఖికి రాజీనామా సమర్పించారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడ్డాయి. 126 స్థానాల అసెంబ్లీలో ఎన్డీయే 75 సీట్లు గెలుచుకోగా, బీజేపీ సొంతంగా 60 సీట్లలో విజయం సాధించింది. సోనోవాల్ నా మార్గదర్శి హిమంత బిశ్వ శర్మ ఆదివారం సాయంత్రం గవర్నర్ జగదీశ్ ముఖిని కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఎన్డీయే ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు సమర్పించారు. శర్మతో పాటు సీఎం పదవి నుంచి దిగిపోతున్న సర్బానంద సోనోవాల్ కూడా రాజ్భవన్కు వెళ్లారు. అస్సాం సీఎంగా శర్మతో సోమవారం మధ్యా హ్నం 12 గంటలకు శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రలో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. అంతకుముందు, శర్మ మాట్లాడుతూ.. సర్బానంద సోనోవాల్ తనకు మార్గదర్శిగా కొనసాగుతారన్నారు. ముఖ్యమంత్రిగా ప్రజాసేవకు అవకాశం కల్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితర నేతలు, రాష్ట్ర ప్రజలకు శర్మ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా నిజాయితీగా, నిబద్ధతతో పని చేస్తానన్నారు. ముఖ్యమంత్రిగా సోనోవాల్ గొప్పగా పనిచేశారని, ఆయన హయాంలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని సోనోవాల్పై శర్మ ప్రశంసలు గుప్పించారు. ముందు చూపున్న, రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసిన, విలువలతో కూడిన నేత సోనోవాల్ అని పేర్కొన్నారు. 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రధాని మోదీ ఈశాన్య ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని, తాజా ఎన్నికల ప్రచారంలోనూ రాష్ట్రమంతా పర్యటించారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. అస్సాంను మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తారు శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన హిమంత బిశ్వ శర్మ తనకు తమ్ముడులాంటి వాడని తాత్కాలిక సీఎం సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్డీఏ పక్షాల సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘హిమంతకు పెద్ద బాధ్యతలు అప్పగించారు. ఆయనకు నా ప్రేమ, ఆశీస్సులు అందజేస్తున్నాను. రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసం ఆయన కృషి చేస్తారు’ అని ఆకాంక్షించారు. -
అసోం సీఎంగా హిమంత బిశ్వ శర్మ!
దిస్పూర్: అస్సాం నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్ వీడింది. ఆదివారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ పదవి కోసం సీనియర్ నేతలు సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వ శర్మ పోటీపడిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో సోనోవాల్ ముఖ్యమంత్రిగా, శర్మ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. మరో వైపు అసోం సీఎం సర్బానంద సోనోవాల్ రాజీనామా చేశారు. గవర్నర్కు తన రాజీనామా లేఖను సమర్పించారు. ఇక సీఎంగా ఎన్నికైన బిశ్వ శర్మ అస్సామీ బ్రాహ్మణుడు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. అస్సాంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకత్వం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు. అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లుండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 సీట్లు గెలుచుకుంది. దాని మిత్రపక్షాలైన ఏజీపీ 9, యూపీపీఎల్ 6 సీట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ఒట్టి చేతులతో వచ్చారేంటి.. సీఎస్పై గవర్నర్ ఫైర్ -
అస్సాం ముఖ్యమంత్రి ఎవరో?
న్యూఢిల్లీ: అస్సాం నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ పదవి కోసం సీనియర్ నేతలు సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వ శర్మ పోటీపడుతున్నారు. గత ప్రభుత్వంలో సోనోవాల్ ముఖ్యమంత్రిగా, శర్మ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. వారిద్దరూ శనివారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, పార్టీ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) బి.ఎల్.సంతోష్తో పలుమార్లు సమావేశమయ్యారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరో తేల్చాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. ఢిల్లీకి రావాలంటూ సోనోవాల్, శర్మకు శుక్రవారం వర్తమానం పంపింది. శనివారం పార్టీ పెద్దలతో భేటీ అనంతరం హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడారు. బీజేపీ అస్సాం శాసనసభాపక్ష సమావేశం ఆదివారం గువాహటిలో జరిగే అవకాశం ఉందని చెప్పారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై చర్చిస్తామని వెల్లడించారు. కొత్త ముఖ్యమంత్రి పేరు ఖరారుపై, నూతన ప్రభుత్వ ఏర్పాటుపై అన్ని ప్రశ్నలకు ఈ సమావేశంలోనే సమాధానం దొరుకుతుందన్నారు. ఢిల్లీలో సోనోవాల్, శర్మతో బీజేపీ అగ్రనేతలు రెండుసార్లు విడివిడిగా మాట్లాడారు. ఒకసారి ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి చర్చించారు. నడ్డా నివాసానికి వేర్వేరు వాహనాల్లో వచ్చిన సోనోవాల్, శర్మ తిరిగి వెళ్లేటప్పుడు ఒకే కారులో వెళ్లారు. సీఎం రేసులో ముందంజలో ఉన్నారని భావిస్తున్న సోనోవాల్ అస్సాంలోని స్థానిక సోనోవాల్–కచారీ గిరిజన తెగకు చెందిన నాయకుడు. ఇక శర్మ అస్సామీ బ్రాహ్మణుడు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. ఈసారి ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కాలని ఉవ్విళ్లూరుతున్నారు. అస్సాంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకత్వం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు. 2016లో ఎన్నికల కంటే ముందు సోనోవాల్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. రాష్ట్రంలో తొలిసారిగా గెలిచింది. ఆయనకు ముఖ్యమంత్రి పదవి అప్పగించింది. అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లుండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 సీట్లు గెలుచుకుంది. దాని మిత్రపక్షాలైన ఏజీపీ 9, యూపీపీఎల్ 6 సీట్లు దక్కించుకున్నాయి. -
బిహార్ పీఠం కొత్త తరానిదేనా?
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి పీఠం యువనేతకు దక్కుతుందా? లేక ప్రస్తుత సీఎం, అధికార జేడీయూ–బీజేపీ కూటమి నేత నితీశ్ కుమార్(69)కే మళ్లీ సొంతమవుతుందా? అనే సందేహం నేడు పటాపంచలు కానుంది. నితీశ్ వయస్సులో సగం కంటే తక్కువగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)యువ నేత తేజస్వీయాదవ్(31) నేతృత్వంలోని మహాఘట్ బంధన్కు అధికారం ఖాయమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో ఈ ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు 38 జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కాగా, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎమ్మెల్సీ కావడంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. భారీగా బందోబస్తు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద 19 కంపెనీల కేంద్రసాయుధ బలగాల తోపాటు, రాష్ట్ర పోలీసులను బందోబస్తుకు ఏర్పాటు చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి హెచ్ఆర్ శ్రీవాస్తవ వెల్లడించారు. మంగళవారం ఉదయం పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే ఈ స్ట్రాంగ్ రూంలను తెరుస్తామని చెప్పారు. కోవిడ్–19 మహ మ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో లెక్కింపు కేంద్రాల వద్ద గుమికూడ వద్దని రాజకీయ పార్టీల శ్రేణులకు ఆయన విజ్ఞప్తి చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీలకు కనెక్ట్ చేసిన డిస్ప్లే స్క్రీన్లను సీనియర్ అధికారులు పరిశీలిస్తూ అవసరమైన ఆదేశాలిస్తారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు మరో 59 కంపెనీ(వంద మంది చొప్పున)ల బలగాలను రంగంలోకి దించామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం పెద్ద సంఖ్యలో గుమి కూడకుండా నిషేధాజ్ఞలు విధించామన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు కూడా.. బిహార్లోని వాల్మీకినగర్ లోక్సభ స్థానం తోపాటు మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని 28 స్థానాలు, ఇతర పది రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెల్లడి కానున్నాయి. రఘోపూర్పైనే అందరి కళ్లూ రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28వ తేదీ మొదలుకొని నవంబర్ 7వ తేదీ వరకు మూడు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సీట్లలో తేజస్వీ యాదవ్ మరోసారి ఎన్నికయ్యేందుకు బరిలో నిలిచిన వైశాలి జిల్లాలోని రఘోపూర్పైనే అందరి దృష్టీ ఉంది. గతంలో ఈ స్థానం నుంచి తేజస్వీ తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ యాదవ్, రబ్రీదేవి పోటీ చేశారు. తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సమస్తిపూర్ జిల్లా హసన్పూర్ నుంచి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువురు కేబినెట్ మంత్రుల భవితవ్యం తేలనుంది. వీరిలో ప్రముఖులు నంద్కిశోర్ యాదవ్(పట్నా సాహిబ్), ప్రమోద్ కుమార్(మోతిహరి), రాణా రణ్ధీర్(మధుబన్), సురేశ్ శర్మ(ముజఫర్పూర్), శ్రావణ్ కుమార్(నలందా), జైకుమార్ సింగ్(దినారా), కృష్ణనందన్ ప్రసాద్ వర్మ(జెహనాబాద్) ఉన్నారు. -
కొలువుతీరిన ఠాక్రే సర్కార్
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: అనేకానేక ఉత్కంఠభరిత మలుపుల అనంతరం, మహారాష్ట్ర రాజకీయ డ్రామా ప్రస్తుతానికి ముగిసింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల కూటమి మహా వికాస్ ఆఘాడి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక శివాజీ పార్క్ గ్రౌండ్లో భారీగా తరలి వచ్చిన నేతలు, అభిమానుల మధ్య, అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ, తన తండ్రి బాల్ ఠాక్రేలను స్మరిస్తూ ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణం చేశారు. ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం అనంతరం శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే, సుభాష్ దేశాయి, ఎన్సీపీ నేతలు జయంత్ పాటిల్, ఛగన్ బుజ్బల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ తోరట్, నితిన్ రౌత్లతో మంత్రులుగా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రజలకు ఉద్ధవ్ శిరసు వంచి నమస్కరించారు. తర్వాత తల్లి మీనాతాయి సొంత చెల్లెలు, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తల్లి కుందాతాయి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమానికి మాజీ సీఎం, బీజేపీ నేత ఫడ్నవీస్ హాజరయ్యారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఎన్సీపీ చీఫ్, మహా వికాస్ ఆఘాడి ఏర్పాటు సూత్రధారి శరద్ పవార్, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు ఖర్గే, అహ్మద్ పటేల్, కపిల్ సిబల్, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, డీఎంకే నేత స్టాలిన్, ఎన్సీపీ నేత అజిత్పవార్, శరద్ పవార్ కూతురు సుప్రియ సూలే హాజరయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్∙ముకేశ్ అంబానీ, భార్య నీతా, కొడుకు అనంత్ వచ్చారు. బంతిపూల రహదారి ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి ముఖ్యమంత్రి అవుతుండటంతో ప్రమాణ స్వీకారం కోసం శివాజీ పార్క్లో భారీ వేదికను ఏర్పాటు చేశారు. వేదికపైననే కీలక నేతలు కూర్చొని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించారు. ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే భారీగా హాజరైన శివసైనికులు నినాదాలతో సభాప్రాంగణాన్ని హోరెత్తించారు. భారీగా బాణాసంచా పేల్చి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఠాక్రే నివాసం మాతోశ్రీ నుంచి శివాజీపార్క్ వరకు రహదారి పొడవునా బంతిపూలు చల్లి శివసేన అభిమాని ఒకరు తన అభిమానం చాటుకున్నాడు. మోదీ, సోనియా అభినందనలు మహారాష్ట్ర కొత్త సీఎం ఉద్ధవ్కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ఉద్ధవ్ అవిరళ కృషి చేస్తారన్న విశ్వాసం నాకు ఉంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రేకు శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ చీఫ్ లేఖ పంపించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన కాంగ్రెస్ నేతలను సైతం ఆమె అభినందించారు. ప్రమాణ స్వీకారానికి స్వయంగా హాజరుకాలేకపోయిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఉద్ధవ్కు అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి హాజరు కాలేకపోయినందుకు చింతిస్తున్నానన్న రాహుల్.. ఉద్ధవ్ ఠాక్రే చేపట్టిన కొత్త బాధ్యతల ప్రయాణం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించేందుకు ప్రయత్నించిన బీజేపీని ఎదుర్కొని మహా వికాస్ ఆఘాడీని ఏర్పాటు చేసినందుకు మూడు పార్టీల నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధి వినాయకుడికి విశేష పూజలు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఉద్ధవ్ ఠాక్రే ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఠాక్రే భార్య రష్మీ, వారి ఇద్దరు కుమారులు కూడా పూజల్లో పాల్గొన్నారు. అజిత్ పవార్ విషయంలో ఉత్కంఠ ఉద్ధవ్తో పాటు ఎన్సీపీ తరఫున డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేస్తారని గురువారం ఉదయం వరకు అంతా భావించారు. అయితే, తాను ప్రమాణ స్వీకారం చేయబోవడం లేదని, ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనల తరఫున ఇద్దరు చొప్పున మంత్రులుగా ప్రమాణం చేస్తారని అజిత్ గురువారం ఉదయం మీడియాకు చెప్పారు. అయితే, త్వరలోనే ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేస్తారని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. తొలి కేబినెట్ భేటీ ప్రమాణ స్వీకారం తరువాత ముఖ్యమంత్రి హోదాలో ఉద్ధవ్ ఠాక్రే గురువారం రాత్రి తొలి కేబినెట్ భేటీ నిర్వహించారు. మూడు పార్టీలకు చెందిన నూతన మంత్రులు సహ్యాద్రి గెస్ట్హౌజ్లో జరిగిన ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్బంగా సహ్యాద్రి గెస్ట్హౌజ్కు అజిత్ పవార్ కూడా రావడం విశేషం. ఉద్ధవ్ నంబర్ 8 మహారాష్ట్ర శాసన సభలో కానీ, శాసన మండలిలో కానీ సభ్యుడు కాకుండా ముఖ్యమంత్రి అయినవారిలో ఉద్ధవ్ ఠాక్రే 8వ నేత. అంతకుముందు, కాంగ్రెస్ నేతలు ఏఆర్ ఆంతూలే, వసంతదాదా పాటిల్, శివాజీరావు నిలాంగేకర్ పాటిల్, శంకర్రావు చవాన్, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్లు కూడా ఏ సభలోనూ సభ్యులు కాకుండానే సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ జాబితాలో ప్రస్తుత ఎన్సీపీ చీఫ్, అప్పట్లో కాంగ్రెస్ నేత అయిన శరద్పవార్ కూడా ఉండటం విశేషం. ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కాకుండా సీఎంగా ప్రమాణం చేసిన వ్యక్తులు, ఆరు నెలల్లోగా శాసన సభకు కానీ, శాసనమండలికి కానీ ఎన్నిక కావాల్సి ఉంటుంది. కేంద్రంలోని పీవీ నరసింహరావు ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న శరద్ పవార్ను 1993లో మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పంపించారు. ముంబై అల్లర్ల నేపథ్యంలో అప్పటి సీఎం సుధాకర్ రావు నాయక్ను తొలగించి శరద్ పవార్కు ఆ బాధ్యతలు అప్పగించారు. అజిత్ అసమ్మతికి ‘పవార్’ కారణమా? వారం రోజుల క్రితం శుక్రవారం రాత్రి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల ‘మహారాష్ట్ర వికాస్ ఆఘాడీ(మహారాష్ట్ర ప్రోగ్రెసివ్ ఫ్రంట్)’ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయాన్ని చర్చించేందుకు సమావేశమయ్యేంత వరకు అంతా బాగానే ఉంది. అయితే సాయంత్రం అయ్యేకొద్దీ ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ మొహంలో మారుతున్న రంగులను ఎవ్వరూ గుర్తించలేకపోయారు. అంతేకాదు.. సమావేశం నుంచి హఠాత్తుగా అజిత్ వెళ్ళిపోయిన సంగతిని కూడా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే తెల్లవారాక కానీ గత రాత్రి అజిత్పవార్లో కనపడిన అసహనానికి పర్యవసానం ఏమిటో వారికి అర్థమైంది. శనివారం తెల్లవారుజామున.. దేశమింకా పూర్తిగా నిద్రలేవకముందే.. బీజేపీ నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అప్పటి నుంచి అజిత్ పవార్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది. డిప్యూటీ సీఎం పదవిపై నోరు విప్పని శరద్ శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలను కున్నప్పుడు, ఎన్సీపీ శాసనసభాపక్ష నేతనైన తనకు డిప్యూటీ సీఎం పదవి లభిస్తుందని అజిత్ ఆశించారు. అయితే, కూటమి చర్చల్లో ఎన్సీపీ అధినేత శరద్పవార్ ఈ విషయం లేవనెత్తక పోవడం అజిత్ని బాగా గాయపరిచింది. అయితే వీరిద్దరి మధ్యా కోల్డ్ వార్ ఇప్పటిది కాదు. 2009లో మహారాష్ట్రకు అశోక్ చవాన్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇద్దరు పవార్ల మధ్య కోల్డ్ వార్ ప్రారంభం అయ్యింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కి 82, ఎన్సీపీకి 62 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. అప్పుడు కూడా డిప్యూటీ సీఎం పదవిని ఎంచుకునే అవకాశం శరద్ పవార్కి వచ్చింది. అయితే అనూహ్యంగా, అజిత్ను కాదని డిప్యూటీ సీఎం పదవిని చగన్ భుజ్బల్కి శరద్ కేటాయించారు. ఇప్పుడు, 2019లో కూడా అదే పరిస్థితి ఎదురవనుందా? అనే అనుమానమే అజిత్ పవార్ను బీజేపీకి దగ్గర చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో కాంగ్రెస్తో ఎన్నికల పొత్తుకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిర్ణయించుకున్నప్పటి నుంచి ఆర్ఆర్ పాటిల్, జయంత్ పాటిల్, ధనుంజయ్ ముండే, సుప్రియాసూలే వంటి ఇతర ద్వితీయ శ్రేణి నాయకులతో సమానంగా అజిత్ పవార్ని చూశారు. దీంతో ఎన్సీపీలో తాను నంబర్ 2 కావడంపై అజిత్ పవార్లో అనుమానాలు ప్రారంభమయ్యాయి. అజిత్ కుమారుడికి ఇస్తానన్న ఎంపీ సీటు ఆలస్యంగా ఇవ్వడం, ఆ తరువాత అతను ఓడిపోవడం కూడా అజిత్లో అసహనానికి మరో కారణంగా భావిస్తున్నారు. కాషాయం మసకబారుతోంది! న్యూఢిల్లీ: కాషాయ వికాసం క్రమేపీ మసకబారుతోంది. మహారాష్ట్ర సీఎం పీఠం కూడా ప్రతిపక్షం చేతుల్లోకి వెళ్లిపోవడంతో దేశంలో బీజేపీ పాలిత ప్రాంతం మరింత తగ్గిపోయింది. 2018 మార్చిలో బీజేపీ పలుకుబడి పతాకస్థాయికి చేరుకుంది. ఆ సమయంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు దేశంలోని 76 శాతం భూభాగాన్ని, 69 శాతం ప్రజలను పరిపాలించాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. తాజాగా, 2019 నవంబర్లో మహారాష్ట్రలోనూ కాషాయ దళం అధికారానికి దూరమయింది. ప్రస్తుతం బీజేపీ పాలిత ప్రాంతం దేశంలో వైశాల్యం రీత్యా 37.4 శాతం, జనాభాపరంగా చూసుకుంటే 45.6 శాతానికి పడిపోయింది. -
ఎన్సీపీకి డిప్యూటీ సీఎం.. కాంగ్రెస్కు స్పీకర్
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే(59) నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శివాజీ పార్క్ గ్రౌండ్లో గురువారం సాయంత్రం 6.40 గంటలకు సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల కూటమి ‘మహారాష్ట్ర వికాస్ అఘాడి’ తరఫున ఆయన సీఎంగా ప్రమాణం చేస్తారు. కొత్త ప్రభుత్వంలో ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి, కాంగ్రెస్కు స్పీకర్ పదవి లభించనున్నట్లు ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ బుధవారం రాత్రి వెల్లడించారు. ఉద్ధవ్తో పాటు మూడు పార్టీలకు చెందిన ఒకరిద్దరు ముఖ్యులూ ప్రమాణం చేస్తారు. ఉద్ధవ్ ప్రభుత్వంలో ఒకే ఉప ముఖ్యమంత్రి ఉంటారని స్పష్టం చేశారు. కాగా, ముంబైలోని వైబీ చవాన్ సెంటర్లో బుధవారం కూటమి ముఖ్య నేతలు కీలక చర్చలు జరిపారు. మంత్రిమండలిలో ఒక్కో పార్టీకి లభించే ప్రాతినిధ్యంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తదితరులు చర్చల్లో పాలుపంచుకున్నారు. ఆ తరువాత వారితో కాంగ్రెస్ మహారాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఖర్గే కలిశారు. శివసేనకు సీఎం సహా 15, ఎన్సీపీకి డిప్యూటీ సీఎం సహా 15, కాంగ్రెస్కు స్పీకర్ కాకుండా 13 మంత్రి పదవులు ఇవ్వాలనే సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు సేన వర్గాలు తెలిపాయి. అంతకుముందు, ఉదయం గవర్నర్ భగత్ కోశ్యారీని ఉద్ధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, 20 ఏళ్ల తరువాత శివసేన నేత సీఎం అవుతున్నారు. మహారాష్ట్రలో శివసేన తరఫున తొలి ముఖ్యమంత్రిగా 1995లో మనోహర్ జోషి బాధ్యతలు చేపట్టగా, 1999లో నారాయణ రాణె శివసేన తరఫున సీఎం అయ్యారు. ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు మహారాష్ట్రలో తొలిసారి ఠాక్రే కుటుంబ సభ్యుడు ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తుండటంతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శివాజీ పార్క్లో నేటి సాయంత్రం అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలు, శివసేన కార్యకర్తలు భారీగా తరలివస్తారని భావిస్తున్నారు. వేదికపైననే 100 మంది కూర్చునేలా భారీ వేదికను శివాజీ పార్క్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నారు. మైదానంలో 70 వేల కుర్చీలు వేస్తున్నారు.కాంగ్రెస్ చీఫ్ సోనియాను ఉద్ధవ్ కొడుకు ఆదిత్య ఆహ్వానించారు. సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఉద్ధవ్ స్వయంగా ఆహ్వానించారు. కార్యక్రమానికి సోనియాగాంధీతో పాటు పశ్చిమబెంగాల్, ఢిల్లీ, రాజస్తాన్ సీఎంలు, డీఎంకే చీఫ్ స్టాలిన్ తదితరులు హాజరయ్యే అవకాశముందని తెలిపాయి. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్, బీజేపీ అగ్రనేత అద్వానీలను శివసేన ఆహ్వానించిందని సమాచారం. ప్రమాణ స్వీకారానికి మహారాష్ట్రకు చెందిన 400 మంది రైతులను శివసేన ఆహ్వానించింది. వారిలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు ఉన్నారు. అజిత్కు డిప్యూటీ సీఎం? అజిత్ పవార్కి ఇచ్చే పదవిపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా అజిత్ను మరోసారి ఎన్నుకుంటారని, ఉప ముఖ్యమంత్రి పదవీ రావొచ్చని తెలుస్తోంది. భద్రతపై హైకోర్టు ఆందోళన ప్రమాణ కార్యక్రమాన్ని శివాజీ పార్క్లో జరపడాన్ని బొంబాయి హైకోర్టు తప్పుబట్టింది. ప్రమాణస్వీకారంపై తాము స్పందించడం లేదని, కేవలం శివాజీ పార్క్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల తలెత్తే భద్రతాపరమైన సమస్యలపైనే ఆందోళన వ్యక్తం చేస్తున్నామని జస్టిస్ ధర్మాధికారి, జస్టిస్ చాగ్లాల బెంచ్ బుధవారం వ్యాఖ్యానించింది. వీకామ్ ట్రస్ట్ అనే ఎన్జీవో వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. ఎన్సీపీ వెంటే.. బీజేపీకి మద్దతునివ్వడం ద్వారా నాలుగు రోజుల పాటు డిప్యూటీ సీఎంగా కొనసాగి ఫ్యామిలీ సెంటిమెంట్తో వెనక్కి తగ్గిన అజిత్ పవార్ తాను ఎన్సీపీలోనే ఉన్నానని చెప్పారు. మహారాష్ట్ర ఎమ్మెల్యేగా బుధవారం ప్రమాణం చేశాక ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రస్తుతానికి నేను కొత్తగా చెప్పడానికేమీ లేదు. సమయమొచ్చినపుడు చెప్తాను. నేను ఎన్సీపీలోనే ఉన్నాను. ఎన్సీపీలోనే కొనసాగుతాను. ఇందులో ఎలాంటి అయోమయానికి తావు లేదు’ అని చెప్పారు. ఇకపై పార్టీ ఆదేశాల మేరకే నడుచుకుంటానని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చాకే తాను నిర్ణయం మార్చుకొని, ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని అజిత్ పవార్ చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో అజిత్ పవార్ ప్రముఖ పాత్ర పోషిస్తారని, ఆయనకు సముచిత స్థానమే లభిస్తుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. ఇప్పుడు మహారాష్ట్రలో అధికారం చేపట్టనున్న శివసేన భవిష్యత్తులో కేంద్రంలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని రౌత్ వ్యాఖ్యానించారు. గత నెల రోజులుగా శివసేన తరఫున వ్యూహకర్తగా, మీడియా ప్రతినిధిగా వ్యవహరించిన రౌత్.. ఇకపై తాను పార్టీ పత్రిక ‘సామ్నా’ పనుల్లో నిమగ్నమవుతానన్నారు. అజిత్కు సుప్రియా ఆత్మీయ ఆహ్వానం మహారాష్ట్ర నూతన ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. 285 ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ కాళీదాస్ కొలంబ్కర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రత్యేక సమావేశాలకు వచ్చిన అజిత్ పవార్కు అనూహ్యమైన రీతిలో ఆత్మీయ ఆహ్వానం లభించింది. ఆయన సోదరి, లోక్సభ ఎంపీ సుప్రియా సూలే, అజిత్ పవార్కు ఎదురై నవ్వుతూ పలకరించి, ఆత్మీయంగా హత్తుకున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె అయిన సుప్రియా సూలే విధాన సభ ముఖద్వారం దగ్గరే నిల్చొని తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ స్వాగతం పలికారు. రాజకీయ ఉద్యమాలకు ఊతమిచ్చిన నేల మరాఠాయోధుడు ఛత్రపతి గుర్తుగా శివాజీ పార్కు రాజకీయ ఉద్దండులెందరినో పరిచయం చేసిన వేదికది. దేశం గర్వించదగ్గ క్రీడాకారుల ఆశలకూ, ఆకాంక్షలకూ ఊతమిచ్చిన క్రీడాప్రాంగణమది. యోధుడు ఛత్రపతి శివాజీ చరిత్రను అనునిత్యం గుర్తుచేసే మరాఠాల పోరాటాలకు పురిటిగడ్డ కూడా అదే ప్రాంతం. అన్నింటికన్నా ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే తండ్రి బాల్ ఠాక్రే అంతిమ సంస్కారాలకు వేదికగా నిలిచింది. ఠాక్రే వంశం నుంచి తొలిసారి ముఖ్యమంత్రి అవుతోన్న ఉద్ధవ్ ఠాక్రే నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సిటీలోనే అతిపెద్ద పార్కు ముంబైలోని దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్కు సిటీలోనే అతిపెద్ద పార్కు. ఎన్నో రాజకీయ, సామాజిక ఉద్యమాలకు ఊతమిచ్చిన పార్కు వైశాల్యం దాదాపు 28 ఎకరాలు. ఈ పార్కు క్రికెట్ క్రీడాకారులకు భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించింది. 1927 వరకు బ్రిటిష్ ఇండియాలో 1925లో ప్రారంభించిన ఈ పార్కు అనంతర కాలంలో ముంబైలోని ఎన్నో స్వాతంత్య్రోద్యమాలకు కేంద్రబిందువైంది. 1947 స్వాతంత్య్ర కాలం నుంచి సంయుక్త మహారాష్ట్ర చాల్వాల్ (మహారాష్ట్ర ఏకీకరణ) ఉద్యమానికి ఇదే పార్కు వేదికయ్యింది. ప్రముఖ పాత్రికేయులు, నాటకరచయిత, కవి, సామాజిక నేత ఆచార్య ప్రహ్లద్ కేశవ్ అత్రే నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమం 1960 మహారాష్ట్ర రాష్ట్ర ఏర్పాటుకి దారితీసింది. ఆ తరువాత శివసేన నడిపిన ఎన్నో రాజకీయ ఉద్యమాలు ఈ వేదికగా ప్రారంభించారు. మహిమా పార్కు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బ్రిటిష్ కాలంలో ఈ పార్కుని ఏర్పాటు చేశారు. 1927 వరకు ఈ పార్కుని మహిమా పార్కుగా పిలిచేవారు. మున్సిపల్ కౌన్సిలర్ అవంతీ గోఖలే ఆదేశాల మేరకు ఛత్రపతి శివాజీ పేరుని పెట్టారు. పార్కులోపలి వైశాల్యం 1.17 కిలోమీటర్లు. మొత్తం మైదానం 112,937 చదరపు మీటర్లు. ఈ ప్రాంగణంలో టెన్నిస్ కోర్టు, వ్యాయామశాల, పిల్లల, వృద్ధుల పార్కులు, లైబ్రరీలు ఉన్నాయి. సైలెన్స్ జోన్గా ప్రకటించిన కోర్టు నిత్యం రాజకీయ కార్యకలాపాలకు వేదికగా ఉన్న ఈ పార్కు వల్ల ధ్వని కాలుష్యం ఎక్కువైందంటూ స్థానికులు 2009లో కోర్టుకి వెళ్ళారు. దీంతో మే, 2010లో బాంబే హైకోర్టు ఈ ప్రాంగణాన్ని సైలెంట్ జోన్గా ప్రకటించింది. అసెంబ్లీ వద్ద సోదరుడు అజిత్ను ఆత్మీయంగా పలకరిస్తున్న సుప్రియా సూలే. -
పాత కూటమి... కొత్త సీఎం?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ గడువు శనివారంతో ముగుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత వచ్చినట్లే కనిపిస్తున్నా ఎప్పుడు ఏర్పడుతుందో చెప్పలేని పరిస్థితి. మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్తో భేటీ కావటం, బీజేపీ– సేన తెరవెనుక చర్చలు, గురువారం బీజేపీ నేతలు గవర్నర్ భగత్సింగ్ కోషియారిని కలవనుండటం ఇవన్నీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టతనిచ్చాయి. కానీ గవర్నరును కలిసే బీజేపీ నేతల్లో ఫడ్నవీస్ లేరు. బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ నేతృత్వంలో గవర్నర్ను కలవనున్నట్లు పార్టీ సీనియర్ నేత సుధీర్ ముంగంటివార్ చెప్పారు. పలు అంశాలను చర్చించడానికే తప్ప ప్రభుత్వ ఏర్పాటుపై మాట్లాడటానికి కాదని కూడా చెప్పారాయన. గవర్నరును కలవటంపై తమకు ఆహ్వానంలేదని శివసేన స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో... తెరవెనక పరిణామాలు చాలానే జరుగుతున్నట్లు తెలిసింది. వాటిలో గడ్కరీని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలనే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. మహా పీఠంపై గడ్కరీ? మంగళవారం రాత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ను కలిశారు. ప్రతిష్టంభన తొలగాలంటే గడ్కరీని సీఎంను చేయడమే పరిష్కారమని ఆరెస్సెస్ చీఫ్ భావిస్తున్నారనేది రాజకీయ వర్గాల సమాచారం. దీనికి శివసేన తేలిగ్గా అంగీకరిస్తుందన్న అంచనాలున్నాయి. ఎందుకంటే ఆది నుంచీ శివసేనతో గడ్కరీకి మంచి సంబంధాలే ఉన్నాయి. దివంగత అధ్యక్షుడు బాల్ థాకరేకు గడ్కరీ అత్యంత సన్నిహితుడు. థాకరే జీవించి ఉన్న రోజుల్లో గడ్కరీ ఆయన నివాసం మాతోశ్రీకి తరచూ వెళ్లేవారు. బీజేపీ – సేన మధ్య ఎప్పుడు విభేదాలొచ్చినా గడ్కరీయే మధ్యవర్తిత్వం నెరిపి పరిష్కరించేవారు. గడ్కరీని సీఎంను చేస్తే శివసేన 50–50 ఫార్ములాపై పట్టు వీడవచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. కాకపోతే ఇప్పటికే ఫడ్నవీస్ను తమ శాసనసభా పక్ష నేతగా మహారాష్ట్ర బీజేపీ ఎన్నుకుంది. సీఎంగా ఆయనే ఉంటారని బీజేపీ స్పష్టంగా చెప్పింది కూడా. తాజా పరిణామాల నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ నితిన్ గడ్కరీతో భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ తాను మహారాష్ట్ర రైతులకు రవాణా సౌకర్యాలపై మాట్లాడటానికే కలిశానని పటేల్ చెప్పారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటాం: పవార్ ప్రజా తీర్పును గౌరవించి మహారాష్ట్రలో వెంటనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ, శివసేనలకు శరద్ పవార్ స్పష్టం చేశారు. ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని చెప్పారాయన. శివసేన నేత సంజయ్ రౌత్ తనను కలిశాక పవార్ విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, శివసేన బంధం 25 ఏళ్లుగా ఉందని, ఆ రెండు పార్టీలే రేపో మాపో ఒక అవగాహనకు వస్తాయని చెప్పారాయన. 170 మంది ఎమ్మెల్యేల మద్దతుతో శివసేన సీఎం పదవిని చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై పవార్ ఆశ్యర్యం వ్యక్తం చేశారు. అంత మంది ఎమ్మెల్యేను శివసేన ఎలా తెస్తుందో చూడాలని ఆసక్తి ఉందన్నారు. సోనియా వద్దనడంతో..! 50–50 ఫార్ములాపై గట్టిగా కూర్చున్న శివసేన ఒక దశలో ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ను సంప్రతించి బీజేపీ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేసింది. కాకపోతే శివసేన–ఎన్సీపీ కలిసినంత మాత్రాన ఏమీ జరగదు. కాంగ్రెస్ సహకరించాలి. అందుకే పవార్ వెళ్లి సోనియాను కలిసి శివసేనకు మద్దతిచ్చేలా ఒప్పించబోయారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు కర్ణాటక ఉదంతం చూసిన సోనియా... సేనకు మద్దతిచ్చి బీజేపీకి అధికారాన్ని దూరంచేస్తే కర్ణాటకలో జరిగినట్లు తమ ఎమ్మెల్యేల్ని లాగేస్తారని సందేహపడ్డారు. దీనికితోడు బీజేపీ హిందూత్వ విధానాల్ని సేనను నమ్మితే ముస్లిం ఓట్లు దూరమవుతాయని సోనియా భయపడ్డారు. మొదటికే మోసం వచ్చి అది కూడా బీజేపీకి కలిసివస్తుందని కూడా ఆమె భావించారు. అందుకే ఈ ప్రతిపాదనకు సుతరామూ అంగీకరించలేదు. వేరే దారిలేని శివసేన బీజేపీతో ముందుకెళ్లేందుకు సిద్ధపడుతోంది. ఇక పవార్ కూడా తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని గట్టిగా చెప్పేశారు. -
కన్నడ పీఠంపై మళ్లీ ‘కమలం’
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో మరోసారి కమలనాథుల ప్రభుత్వం కొలువుదీరింది. కర్ణాటక 32వ ముఖ్యమంత్రిగా బూకనకెరె సిద్ధలింగప్ప యడియూరప్ప(76) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ వజూభాయ్వాలా శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి సదానంద గౌడతో పాటు మాజీ సీఎం ఎస్.ఎం.కృష్ణ, కర్ణాటక బీజేపీ ఇన్చార్జ్ మురళీధరరావు, బీజేపీ నేత శోభాకరంద్లాజే, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వీరితో పాటు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రోషన్బేగ్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజన్న ఈ వేడుకకు వచ్చి అందర్ని ఆశ్చర్యపరిచారు. కర్ణాటకలో హెచ్.డి.కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన మూడ్రోజులకే యడియూరప్ప ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయడం గమనార్హం. కాంగ్రెస్ నేతలెవరూ ఈ కార్యక్రమానికి రాలేదు. యెడ్డీకి అమిత్ షా ఫోన్.. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ముగ్గురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయడంతో బీజేపీ అధిష్టానం చకచకా పావులు కదిపింది. పలువురు న్యాయ నిపుణులతో చర్చలు జరిపిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. శుక్రవారం ఉదయాన్నే యడియూరప్పకు ఫోన్చేసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వజూభాయ్వాలా అపాయింట్మెంట్ తీసుకున్న యడియూరప్ప నేరుగా రాజ్భవన్కు వెళ్లిపోయారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలనీ, సభలో మెజారిటీని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇందుకు అంగీకరించిన గవర్నర్ వజూభాయ్వాలా సాయంత్రం 6–6.15 గంటల మధ్యలో ప్రమాణస్వీకారం చేయాలని ఆదేశించారు. యడియూరప్ప ఇప్పటికే ప్రతిపక్ష నేత కాబట్టి ఆయన్ను బీజేపీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా మరోసారి ఎన్నుకోలేదు. 29న అసెంబ్లీలో బలపరీక్ష.. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక యడియూరప్ప స్పందిస్తూ.. ఈ నెల 29న ఉదయం 10 గంటలకు బలపరీక్షను చేపడతామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరుస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన ఆర్థిక బిల్లును కూడా ఆమోదిస్తామని చెప్పారు. బీజేపీ చీఫ్ అమిత్ షాను సంప్రదించి త్వరలోనే మంత్రివర్గ విస్తరణను చేపడతామని పేర్కొన్నారు. మరోవైపు యడియూరప్ప విజ్ఞప్తి మేరకు సోమవారం సభను నిర్వహిస్తానని స్పీకర్ చెప్పారు. యడ్యూరప్ప కాదు.. యడియూరప్ప! కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తన పేరును మరోసారి మార్చుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని గవర్నర్కు రాసిన లేఖలో తన పేరును ఆయన ‘బీఎస్ యడియూరప్ప’గా రాశారు. న్యుమరాలజీ ప్రభావంతో యడియూరప్ప ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. 2007లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిరావడంతో న్యుమరాలజీ ప్రకారం యడియూరప్ప తన పేరును యడ్యూరప్పగా మార్చుకున్నారు. అయితే ఇది కలిసిరాకపోవడంతో ఈ బీజేపీ నేత తన పాత పేరునే వాడాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమా? ప్రస్తుత పరిస్థితుల్లో యడియూరప్ప చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 221 (స్పీకర్ను మినహాయించి)కి చేరుకుం టుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 112 అయింది. బీజేపీకి ప్రస్తుతం 106 మంది సభ్యుల (బీజేపీ 105, ఓ స్వతంత్ర ఎమ్మె ల్యే) బలముంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఆరుగు రిని బీజేపీ ఎలా సంపాదిస్తుందన్నది ఇప్పు డు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ స్పీకర్ రమేశ్ మిగిలిన 14 మంది రెబెల్స్ రాజీనామాలను ఆమోదిస్తే/ అనర్హత వేటేస్తే అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 208కి చేరుకుంటుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు 105 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోతుంది. ఇదే జరిగితే ఓ స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుతో బీజేపీ గట్టెక్కుతుంది. అయితే 14 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ప్రస్తుతం అస్పష్టత నెలకొంది. ప్రజానుకూల పాలన అందిస్తాం: అమిత్ షా కర్ణాటకలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సుస్థిరమైన, రైతు, ప్రజానుకూల పాలన అందిస్తుందని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు. కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్పకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. కర్ణాటక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. కలహాలవల్లే కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయిందనీ, తమ ప్రమేయం లేదన్నారు. మండిపడ్డ కాంగ్రెస్, జేడీఎస్.. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకా రం చేయడంపై కాంగ్రెస్, జేడీఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ‘బీజేపీకి అండగా నిలిచిన వజూభాయ్వాలా సాయంతో రాజ్యాంగ విరుద్ధంగా కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. అవినీతి రారాజు, జైలు పక్షి యడియూరప్ప రాజకీయ ప్రలోభాల విషయంలో తన అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి అధికారంలోకి వచ్చారు’ అని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శించింది. కర్ణాటక బీజేపీకి ప్రయోగశాలగా మారిపోయిందని సీఎల్పీ నేత సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. యడియూరప్ప వరాల జల్లు కర్ణాటకలో రైతులు, చేనేత కార్మికులకు సీఎం యడియూరప్ప వరాలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఎంపికైన రైతులకు అదనంగా రూ.4000ను రెండు విడతల్లో అందజేస్తామని తెలిపారు. ఈ పథకం కింద కేంద్రం ఏటా రూ.6 వేలు అందిస్తుందన్నారు. అలాగే చేనేత కార్మికులకు రూ.100 కోట్ల మేర ఉన్న అప్పులను మాఫీ చేస్తామని వెల్లడించారు. రైతుల రుణమాఫీ విషయంలో అన్నిపక్షాలను సంప్రదించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. 15 ఏళ్లకే ఆరెస్సెస్ కార్యకర్త కర్ణాటకలోని మాండ్యా జిల్లా బూకనకెరె గ్రామంలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సిద్దలింగప్ప, పుట్టతాయమ్మ దంపతులకు 1943, ఫిబ్రవరి 27న జన్మించారు. 15 ఏళ్ల వయసులోనే ఆరెస్సెస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపారు. తన స్వగ్రామం శికారిపురలో ఒక రైలు మిల్లులో పని చేశారు. ఆ మిల్లు యజమాని కుమార్తె మైత్రిదేవిని ప్రేమించి పెళ్లాడారు. ఆరెస్సెస్ శికారిపుర సంఘ్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో బీజేపీలో చేరిన యడ్యూరప్ప 1983 నుంచి శికారిపుర ఎమ్మెల్యేగా ఏడు సార్లు ఎన్నికయ్యారు. తొలిసారి 2007లో.. 2007 నవంబర్లో తొలిసారి యడియూరప్ప సీఎం అయ్యారు. జేడీ(ఎస్) మద్దతు ఉపసంహరించడంతో ఆయన ఏడు రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008 మేలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అక్రమ మైనింగ్ కేసులో లోకాయుక్త యడియూరప్పను దోషిగా తేల్చడంతో మూడేళ్లకే 2011 జులైలో సీఎం పదవిని వదులుకోవాల్సి వచ్చింది. వారం రోజులు జైల్లో ఉన్నారు. కొత్త పార్టీ.. మళ్లీ విలీనం ఆ తరువాత కర్ణాటక జనతా పక్ష (కేజేపీ) పేరుతో పార్టీ పెట్టారు. 2014లో కేజేపీని బీజేపీలో విలీనం చేశారు. 2018 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకోవడంతో యడియూరప్ప మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బలనిరూపణకు 15 రోజుల సమయం ఇచ్చారు. కానీ, దీనిపై కాంగ్రెస్, జేడీ(ఎస్) కోర్టుకెక్కడంతో సుప్రీంకోర్టు వెంటనే బలాన్ని నిరూపించుకోవాలంటూ ఆదేశించింది. కేవలం 3 రోజులు మాత్రమే సీఎంగా ఉన్న యెడ్డీ మే 19న బలపరీక్షకు కాస్త ముందు రాజీనామా చేశారు. -
విజయంలో ఆ ముగ్గురు
-
అదే పెన్ను.. అదే సంక్షేమం
-
అవినీతి, వివక్ష లేని పాలన అందిస్తా
-
ఇక స్వచ్ఛమైన పాలన
వైఎస్ జగన్ అనే నేను.. ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూముఖ్యమంత్రి పదవినిస్వీకరిస్తున్నాను. 3,648 కిలోమీటర్లుఈ నేల మీద నడిచినందుకు,పదేళ్లుగా మీలో ఒకడిగానిలిచినందుకు ఆకాశమంతవిజయాన్ని అందించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు,ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి,ప్రతి స్నేహితుడికి రెండు చేతులూ జోడించి పేరు పేరున హృదయపూర్వకకృతజ్ఞతలు తెలుపుతున్నాను. సాక్షి, అమరావతి : అవినీతి రహిత పాలన అందిస్తామని నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో వినూత్న, విప్లవాత్మకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను 72 గంటల్లోనే ప్రజల ముంగిటకు చేరుస్తామని తెలిపారు. లంచాలు లేని వ్యవస్థను ప్రజల ముందుకు తెస్తూ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలోని అవినీతి కాంట్రాక్టులను రద్దు చేసి, దోచుకున్నదెంతో ప్రజల ఎదుట ఉంచుతామన్నారు. నవరత్నాల అమలులో భాగంగా అవ్వాతాతల పెన్షన్ను పెంచుతూ తొలి సంతకం చేశారు. ఐదు నెలల్లో రాష్ట్రంలో 5.60 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని యువతకు తీపి కబురు చెప్పారు. పాలనలో తీరు తెన్నులపై స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికే కబురందించేలా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో ఆఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అశేష జనవాహిని ఆనందోత్సాహాల మధ్య ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, తమిళనాడులోని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, సతీమణి వైఎస్ భారతితో పాటు అతిరథ మహారథులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి తొలి ప్రసంగం చేశారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి నే విన్నాను.. నేనున్నాను.. పదేళ్లుగా నా రాజకీయ జీవితంలో, 3,648 కిలో మీటర్ల పాదయాత్రలో పేదలు పడ్డ కష్టాలుచూశాను. మధ్యతరగతి ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు విన్నాను. వారి కష్టాలు చూసిన, విన్న నేను.. ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ మీ అందరికీ నేనీ రోజు మాటిస్తున్నాను. మీ కష్టాలను నేను చూశాను.. మీ బాధలు నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని ఇవాళ మీ అందరికీ చెబుతున్నాను. అందరి ఆశలు, అందరి ఆకాంక్షలు పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటూ మేనిఫెస్టో తీసుకువచ్చాం. మేనిఫెస్టోను కేవలం రెండే రెండు పేజీలతో ఎప్పుడూ ప్రజలకు గుర్తుండేట్టుగా, ప్రజలకు ఎప్పుడూ కన్పించే విధంగా తీసుకొచ్చాం. గత పాలకుల మాదిరిగా పేజీలకు పేజీలు.. బుక్కులు తీసుకురాలేదు. ఇందులో ప్రతి కులానికో పేజీ పెట్టి ఎలా మోసం చెయ్యాలన్న ఆలోచనతో తీసుకురాలేదు. ఎన్నికలయిపోయాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే పత్రం కింద, ఒక బుక్కు కింద తీసుకు రాలేదు. మేనిఫెస్టో అంటే ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. ఇది వైఎస్సార్ పెన్షన్ కానుక నవరత్నాల్లో మీ అందరికీ మాటిచ్చినట్టుగానే, మేనిఫెస్టోలోని ఒక అంశం గురించి మీ అందరికీ చెబుతాను. ఈ రోజు ఆ అవ్వా తాతల ఆశీస్సులు తీసుకునేందుకు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా తీసుకునే నిర్ణయం చెబుతున్నా. నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఆ అవ్వా తాతలను పెన్షన్ ఎంత అని అడిగితే రూ.వెయ్యి అని చెప్పారు. కొంతమంది అవ్వలైతే అది కూడా రావడం లేదని చేతులూపుతూ చెబుతుండేవాళ్లు. ఎన్నికలకు కేవలం రెండు నెలలు మాత్రమే గడువున్నప్పుడు పింఛన్ను పెంచారు. అందుకే ఈ పరిస్థితి పూర్తిగా మార్చబోతున్నాను. నవరత్నాలలో ప్రతి అవ్వ, తాత, ప్రతి వితంతువుకు ఇచ్చిన మాట ప్రకారం వారి పెన్షన్ను రూ.3 వేల వరకు పెంచుకుంటూ వెళతాను. ఆ అవ్వా తాతల పెన్షన్ను జూన్ నెల నుంచి అక్షరాల రూ.2,250 నుంచి మొదలు పెట్టబోతున్నాను వైఎస్సార్ పెన్షన్ కానుకగా. దీనికి సంబంధించిన ఫైల్పై నేనీ రోజు మొట్ట మొదటి సంతకం పెడుతున్నాను. (సంతకం పెట్టారు.) ఈ సంవత్సరం రూ.2,250తో మొదలు పెడుతున్నాం. రేపు సంవత్సరం రూ.2,500కు తీసుకెళ్తాం. ఆ తర్వాత సంవత్సరం రూ.2,750కు.. ఆ తర్వాత ఏడాది రూ.3 వేలకు తీసుకెళ్తాం. అవ్వా తాతలకు ఇచ్చిన మాటను నెరవేర్చబోతున్నామని చెబుతూ.. ఆశీస్సులు ఇవ్వమని పేరుపేరునా ప్రతి అవ్వా తాతను మీ మనవడిగా రెండు చేతులు జోడించి కోరుతున్నా. ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు నవరత్నాల్లో చెప్పిన ప్రతి అంశమూ ప్రతి పేదవాడికీ అందాలి. ఇందులో కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు చూడకూడదు. ఇది జరగాలంటే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి. ఇందులో భాగంగా ఆగస్టు 15 నాటికి, అంటే ఇవాల్టి నుంచి కేవలం రెండున్నర నెలల కాలంలో గ్రామాల్లో గ్రామ వాలంటీర్లుగా అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని హామీ ఇస్తున్నా. ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు వీలుగా, లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులేస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను నియమిస్తున్నాం. గ్రామాల్లో చదువుకున్న పిల్లలు, సేవ చెయ్యాలనే ఆరాటం ఉన్న పిల్లలకు రూ.5 వేలు జీతమిస్తూ గ్రామ వాలంటీర్లుగా తీసుకుంటాం. రూ.5 వేలు ఎందుకిస్తున్నామో తెలుసా? ఈ వ్యవస్థలోకి లంచాలు రాకుండా చెయ్యాలని. ప్రజలకు చెందాల్సిన ఏ పథకంలో కూడా ఎటువంటి కక్కుర్తి, పక్షపాతం, లంచాలు ఉండకూడదని. సేవా దృక్పథం గల పిల్లలకు వేరే చోట మెరుగైన ఉద్యోగం దొరికే వరకు గ్రామ వాలంటీర్లుగా పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ నాలుగు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి వస్తాయి. సర్కారీ సేవ అందకపోతే ఫోన్ కొట్టండి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేవలు ఏ ఒక్కరికి అందకపోయినా, ఎక్కడైనా పొరపాటున లంచాలు కన్పించినా ఊరుకోం. అదే ఆగస్టు 15వ తేదీన ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. అది నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే అనుసంధానమై ఉంటుంది. ఏ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందకపోయినా, వివక్ష కన్పించినా, ఏ ఒక్కచోట లంచాలు కన్పించినా, ముఖ్యమంత్రి కార్యాలయానికే నేరుగా వక్రీకరణ వార్తలు రాసే మీడియాను కోర్టుకీడుస్తాం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఇంపుగా కన్పిస్తాడు. మిగిలిన వాళ్లను ఎప్పుడెప్పుడు దించాలా అని ఆలోచన చేస్తారు. వాళ్ల రాతలు అలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఇది మన ఖర్మ. వాళ్లందరికీ నేను ఒకటే చెబుతున్నా. పారదర్శకంగా, జ్యుడీషియల్ కమిషన్ ద్వారా కాంట్రాక్టులను ఖరారు చేసిన తర్వాత కూడా వక్రీకరిస్తూ, దురుద్దేశంతో వార్తలు రాస్తే ప్రభుత్వం పరువు నష్టం దావా వేస్తుంది. హైకోర్టు జడ్జి దగ్గరకు వెళ్లి, శిక్షించమని గట్టిగా అడుగుతాం. అమ్మానాన్నకు పాదాభివందనం... చెరగని చిరునవ్వులతో ఆప్యాయతను చూపించినందుకు పేరుపేరున ఇక్కడకు వచ్చిన, ఇక్కడికి రాలేకపోయిన, ఆశీర్వదించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికి మరోసారి పేరుపేరున హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. ఆశీర్వదించిన దేవుడికి, పైనున్న నాన్న గారికి, నా పక్కనే ఉన్న నా తల్లికి పాదాభివందనం చేస్తూ.. మీ అందరి చల్లని దీవెనలకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలు పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా గ్రామ సచివాలయాలను తీసుకొస్తున్నాం. మీ గ్రామంలో అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం కల్పిస్తూ, మీ గ్రామంలో అక్షరాల పది మందికి గ్రామ సెక్రటేరియట్లో నేరుగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తున్నామని అందరికీ హామీ ఇస్తున్నా. అక్టోబర్ 2, గాంధీ జయంతి నాడు ఈ కార్యక్రమం చేపట్టి, మరో 1.60 లక్షల ఉద్యోగాలు నేరుగా మీకు అందుబాటులోకి తెస్తాం. మీ పిల్లలే పది మంది మీ గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తారు. మీకు పెన్షన్, రేషన్ కార్డు, ఇల్లు, ఇంటి స్థలం, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, నవరత్నాల్లోని ఏ పథకమైనా, ఏది కావాలన్నా.. మీరు చెయ్యాల్సిందల్లా గ్రామ సెక్రటేరియట్కు వెళ్లి అప్లికేషన్ పెట్టండి. దరఖాస్తు చేసిన 72 గంటల్లోనే మీకు మంజూరయ్యేలా చేస్తాం. గత ప్రభుత్వంలో మాదిరిగా లంచాలుండవు. ఇప్పటి వరకు రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా మరేది కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలివ్వాల్సిన పరిస్థితి. పూర్తిగా లంచమనేదే లేకుండా, రికమండేషన్కు తావు లేకుండా ఏ ఒక్కరికైనా ఏ అవసరం ఉన్నా, 72 గంటల్లో మంజూరయ్యేలా చేస్తామని సీఎంగా హామీ ఇస్తున్నాను. గ్రామ వాలంటీర్లు గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై పని చేస్తారు. నవరత్నాలతో పాటు, ప్రతి ప్రభుత్వ పథకం లంచాలు, రికమండేషన్లకు తావులేకుండా నేరుగా మీ ఇంటికొచ్చేలా డోర్ డెలివరీ చేస్తారు. ఇదొక్కటే కాదు.. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నవరత్నాల్లోని ప్రతి ఒక్కటీ తూచా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇస్తున్నాను. కాంట్రాక్టుల్లో అవినీతి నిగ్గు తేలుస్తాం ఈ రాష్ట్రంలో అవినీతి, వివక్ష లేని స్వచ్ఛమైన పాలన అందించేందుకు పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు పూర్తిగా ప్రక్షాళన చేస్తాను. ఇందులో భాగంగా ఏయే కాంట్రాక్టుల్లో, ఏయే పనుల్లో అవినీతి జరిగిందో వాటిని పూర్తిగా రద్దుచేస్తాం. గతంలో చేసిన ట్రైలర్ మేడ్ ప్రీ క్వాలిఫికేషన్ కండీషన్స్ను పూర్తిగా మారుస్తూ ఎక్కువ మంది టెండర్లలో పాలు పంచుకునేలా అవకాశమిస్తూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొస్తాం. అంతేకాదు.. ఇంకో ఉదాహరణ. కరెంటు రేట్లు చూడండి. ఇతర రాష్ట్రాల్లో సోలార్, విండ్ పవర్ కోసం గ్లోబల్ టెండరింగ్ చేస్తూ యూనిట్ రూ.2.65కు, రూ.3కే అందుబాటులో ఉంటే, మన రాష్ట్రంలో ఎంతో తెలుసా? యూనిట్కు రూ.4.84తో నిన్నటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసింది. ఈ రకంగా దోచుకుంటున్న పరిస్థితి. అదే పీక్ అవర్స్ అయితే, దోచుకున్నది చాలదన్నట్టుగా అక్షరాల యూనిట్ రూ.6 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీ కళ్లెదుటకే తీసుకొచ్చి, మీ ఈ రేట్లన్నీ పూర్తిగా తగ్గిస్తాను. వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చెయ్యడంతోనే ఆగకుండా పారదర్శకతను తీసుకొస్తాం. ఇందులో భాగంగా రేపో మర్నాడో హైకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసి, ఓ హైకోర్టు జడ్జిని ఇవ్వమని కోరతాం. ఆయన ఆధ్వర్యంలో, ఆయన చైర్మన్గా జ్యుడీషియల్ కమిషన్ను నియమిస్తాం. టెండర్లకు పోకముందు, ప్రతి కాంట్రాక్టును జ్యుడీషియల్ కమిషన్కు పంపి, ఆ హైకోర్టు జడ్జి చేసే ఏ సూచనలు, మార్పుల మేరకు కాంట్రాక్టులకు పారదర్శకంగా, ఎక్కడా అవినీతి లేకుండా టెండర్లు పిలుస్తాం. -
ఒడిశా, అరుణాచల్ సీఎంల ప్రమాణం
భువనేశ్వర్/ఈటానగర్: ఒడిశా, అరుణాచల్ప్రదేశ్ల్లో నూతన ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బిజు జనతా దళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ ఒడిశా సీఎంగా వరుసగా ఐదోసారి ప్రమాణం చేశారు. భువనేశ్వర్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గవర్నర్ గణేశీలాల్ ఆయన చేత ప్రమాణం చేయించారు. అలాగే ఆయనతో పాటు 20 మంది నూతనంగా ఎన్నికైన బీజేడీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణంచేశారు.147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో బీజేడీ 112 స్థానాల్లో గెలుపొందింది. ఒడిశాలో 2000 సంవత్సరం నుంచి బీజేడీ అధికారంలో కొనసాగుతోంది. నవీన్ వరుసగా 2000, 2004, 2009, 2014ల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ‘పట్నాయక్కు అభినందనలు. ఒడిశా అభివృద్ధికి కేంద్రం నుంచి మా వంతు పూర్తి సహకారం ఉంటుంది’అని మోదీ ట్వీట్ చేశారు. అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ బీజేపీ సీనియర్ నేత పెమా ఖండూ అరుణాచల్ ప్రదేశ్ పదో సీఎంగా బుధవారం ప్రమాణం చేశారు. ఈటానగర్లో ఆ రాష్ట్ర గవర్నర్ మిశ్రా ఆయన చేత ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎం చౌనా మేతో సహా 11 మంది కేబినెట్ మంత్రులు పెమా ఖండూతో పాటు ప్రమాణం స్వీకారం చేశారు. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్ సీఎంలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెమా ఖండూ మాట్లాడుతూ.. ‘ఇది రాష్ట్రంలో చారిత్రాత్మక రోజు. మా ప్రభుత్వం అవినీతి రహితంగా పనిచేస్తుంది’ అని అన్నారు. 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్లో బీజేపీ 41 స్థానాల్లో గెలుపొందింది. -
‘మా రాష్ట్రానికి సీఎం కావాలి’
పనాజి: గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాష్ట్రానికి శాశ్వత సీఎంను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం మనోహర్ పారికర్ అనారోగ్యం కారణంగా గత రెండు నెలలుగా అమెరికాలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను ముగ్గురు మంత్రుల బృందం పరిశీలిస్తోంది. దీనిని నిరసిస్తూ శనివారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పనాజిలోని మాజీ సీఎం దయానంద్ బందోద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిరీష్ చోదన్కర్ మాట్లాడుతూ... మూడు నెలలుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేరని, ముగ్గురు మంత్రుల బృందాన్ని వెంటనే తొలగించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా రాష్ట్ర పరిస్థితిని గవర్నర్కి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా ఏలాంటి స్పందన లేదని విమర్శించారు. త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తన పోరాటాన్ని తీవ్రతరం చేయాలని భావిస్తోంది. దయానంద్ బందోద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ ధర్నా నిర్వహించడం గమనార్హం. బందోద్కర్ స్థాపించిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. -
గుజరాత్, హిమాచల్ కొత్త సీఎంలు ఎవరు ?
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ పార్టీ ఆ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఎవరిని నియమించాలనే విషయంపై కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ఉపన్యాసం ముగిసిన వెంటనే కేంద్ర పార్లమెంటరీ బోర్డు ఈ మేరకు సమావేశం అయింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రెండు పరిశీలక బృందాలు ఏర్పాటుచేశారు. జైట్లీ బృందం గుజరాత్ వెళ్లనుండగా, సీతారామన్ బృందం షిమ్లాకు వెళ్లింది. వీరి పరిశీలన పూర్తయ్యాక ఆ విషయాన్ని కేంద్రంలోని పెద్దలకు చెప్పిన తర్వాత తిరిగి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ 'రెండు రాష్ట్రాలకు రాబోయే కొత్త ముఖ్యమంత్రులు ఎవరనేది జైట్లీ, రామన్ బృందాలు పరిశీలిస్తాయి. ఆ బృందాలు ఆయా రాష్ట్రాలకు వెళ్లి ఈ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యి ముఖ్యమంత్రి అంశాన్ని చర్చించి వారి అభిప్రాయాలను సేకరిస్తాయి. ఆ వివరాలను కేంద్రంలో పెద్దలకు తెలియజేసిన తర్వాత ముఖ్యమంత్రులు ఎవరనేది నిర్ణయిస్తారు' అని చెప్పారు. తొలుత హిమాచల్ ప్రదేశ్కు పీకే దుమాల్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించినప్పటికీ ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో జేపీ నడ్డాను ముఖ్యమంత్రిగా చేస్తారని ఓ చర్చ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. -
సీఎం అయ్యేది ఈయనేనా?
ఆర్ఎస్ఎస్ ప్రచారక్ స్థాయి నుంచి మొదలుపెట్టి.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి సిద్ధంగా ఉన్న ఈ వ్యక్తి పేరు.. త్రివేంద్ర సింగ్ రావత్. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షాకు సన్నిహితుడైన ఈయన ఎంపికయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు. ఉత్తరాఖండ్లో స్పష్టమైన మెజారిటీ సాధించిన బీజేపీ.. శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకోడానికి శుక్రవారం సమావేశమవుతోంది. కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అధికారాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కట్టబెట్టారు. శుక్రవారం సాయంత్రంలోగా ఎంపిక ప్రక్రియ పూర్తయితే శనివారం నాడు రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్లో కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా హాజరవుతున్నారు. పొరుగు రాష్ట్రం ఉత్తరప్రదేశ్లాగే, ఉత్తరాఖండ్లో కూడా బీజేపీ బ్రహ్మాండమైన మెజారిటీ సాధించింది. మొత్తం 70 స్థానాలున్న అసెంబ్లీలో 57 స్థానాలు బీజేపీకే దక్కాయి. ఇంత మెజారిటీ వచ్చినా ఈ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఎవరన్నది ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నారు. మరోవైపు అసలు మెజారిటీయే దక్కని గోవా, మణిపూర్లలో మాత్రం ప్రమాణస్వీకారాలు కూడా అయిపోయాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని శనివారం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి సత్పాల్ మహరాజ్ లాంటి పేర్లు వినిపించినా, చివరకు త్రివేంద్ర సింగ్ రావత్ను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. 2014లో ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. రావత్కు ఆర్ఎస్ఎస్ మద్దతు ఉండటమే కాక, అమిత్ షా ఆశీస్సులు సైతం మెండుగా ఉన్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమిత్ షా యూపీ ఇన్చార్జిగా ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి పనిచేశారు. -
మణిపూర్ కొత్త ముఖ్యమంత్రి ఈయనే!
మణిపూర్ కొత్త ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోడానికి సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం తమ నాయకుడిగా నాంగ్ తొంబమ్ బీరేన్ సింగ్ను ఎన్నుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గాను గవర్నర్ను కలిసి తమకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల వివరాలన్నీ ఇస్తామని ఆయన చెప్పారు. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 మంది సభ్యులుండగా ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 31 మంది మద్దతు అవసరం అవుతుంది. తమకు 32 మంది మద్దతు ఉందని బీజేపీ చెబుతున్న విషయం తెలిసిందే. గవర్నర్ నజ్మా హెప్తుల్లా కూడా బీజేపీ వాదనతో ఏకీభవించారు. పెరేడ్కు మొత్తం 32 మంది రావడంతో వాళ్లకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించి ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ను రాజీనామా చేయాలని చెప్పారు. తొలుత కాదన్నా.. 24 గంటల్లోగా రాజీనామా చేసేందుకు ఇబోబి సింగ్ అంగీకరించిన సంగతి తెలిసిందే. -
సీఎం స్వామి
-
కథ కంచికి చేరినట్టేనా?
-
వీడియో షాపు నుంచి సీఎం దాకా
శశికళ ప్రస్థానం సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్నదానికి ‘చిన్నమ్మ’ శశికళ చక్కని ఉదాహరణ. వీడియో షాపు నడిపిన స్థాయి నుంచి సీఎం పీఠం దాకా సాగిన ఆమె ప్రస్థానం ఆసక్తికరమే కాదు వివాదాస్పదం కూడా. జయలలితకు నెచ్చెలిగానే మొన్నటి వరకు తెలిసిన ఆమె.. ‘పురుచ్చితలైవి’ మరణానంతరం అన్నాడీంకేపై, ప్రభుత్వంపై పట్టుసాధించి రాజకీయాల్లోనూ దిట్ట అని నిరూపించుకున్నారు. పార్టీలో జయ తర్వాత మరో శక్తిమంతమైన నేత లేకపోవడం శశికళకు కలసొచ్చిన అంశం. పార్టీ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి పదవులు ఒకరి చేతిలోనే ఉండే సంప్రదాయాన్ని ఎంజీఆర్, జయల తర్వాత చిన్నమ్మ కొనసాగించనున్నారు. శశికళ 1957లో తిరుతిరైపూండిలో బలమైన దేవర్ సామాజికవర్గానికి చెందిన వివేకానందన్ , కృష్ణవేణి దంపతులకు జన్మించారు. ఆమెకు నలుగురు సోదరులు, ఒక సోదరి. తర్వాత వారి కుటుంబం మన్నార్గుడికి మారింది. 10వ తరగతి వరకు చదువుకున్న శశికళ 1973లో పౌరసంబంధాల అధికారి నటరాజన్ ను డీఎంకే చీఫ్ కరుణానిధి సమక్షంలో పెళ్లాడారు. శశికళ వీడియో షాపు నడిపేవారు. 1982లో అప్పటి సీఎం ఎంజీఆర్కు సన్నిహితుడైన నటరాజన్ .. చంద్రలేఖ అనే కలెక్టర్ సాయంతో భార్యకు జయను పరిచయం చేశారు. జయ హాజరయ్యే పెళ్లిళ్ల వీడియోలు శశికళ తీయించేవారు. అలా మొదలైన స్నేహం.. మధ్యలో కొన్ని పొరపొచ్చాలు మినహా జయ మరణం వరకూ దాదాపు 3 దశాబ్దాలు కొనసాగింది. పోయెస్ గార్డెన్ లో ఇద్దరూ కలసి ఉండేవారు. ఒకే రకం చీరలు, చెప్పులు, నగలు ధరించేవారు. శశి తనకు సోదరిలాంటిదని, అమ్మలేని లోటును తీరుస్తోందని జయ చెప్పేవారు. 1991లో జయ తొలిసారి సీఎం కావడంతో శశికళ వెలుగులోకి వచ్చారు. ఆమె సోదరి కుమారుడైన సుధాకరన్ ను జయ దత్తత తీసుకుని కోట్ల డబ్బుతో అంగరంగవైభవంగా పెళ్లి జరిపించారు. కలర్ టీవీల స్కాంలో 1996లో ‘అమ్మ’లిద్దరూ అరెస్టయి జైలుకెళ్లారు. తర్వాతి కాలంలో ఇద్దరి స్నేహం చెడిపోయింది. 1996 ఎన్నికల్లో జయ ఓటమికి శశికళే కారణమని విమర్శలొచ్చాయి. ఆమెతో సంబంధాలు చెడిపోయాయని జయ కూడా చెప్పారు. తర్వాత తనపై కుట్రపన్నుతున్నారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అంటూ 2011 డిసెంబర్లో శశికళ దంపతులతోపాటు వారి బంధుమిత్రులను పార్టీ నుంచి తప్పించారు. ఐదు నెలల తర్వాత చిన్నమ్మ రాతపూర్వక క్షమాపణ చెప్పడంతో తిరిగి ఇద్దరూ దగ్గరయ్యారు. అన్నాడీఎంకేలో, ప్రభుత్వంలో క్రమంగా తన వ్యతిరేకులను తప్పించి, అనుచరులకు చోటుకల్పిస్తూ శశికళ టీమ్ పావులు కదిపిందంటారు. జయ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి చనిపోయేవరకు శశికళ ఆమె వెంట ఉండడం అనుమానాలకు తావిచ్చింది. జయను ఎవరూ కలవకుండా అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. విమర్శలను, పార్టీలో వ్యతిరేకతను అధిగమించి శశికళ ‘పురుచ్చితలైవి’ స్థానాన్ని భర్తీ చేశారు. మూడో మహిళా సీఎం శశికళ తమిళనాడు కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న వీకే శశికళ ఆ రాష్ట్రానికి మూడో మహిళా ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇంతకు ముందు జానకి రామచంద్రన్ , జయలలిత సీఎంలుగా పనిచేశారు. వీరంతా ఏఐఏడీఎంకే పార్టీlవారే కావడం విశేషం. నాడు నెడుంజెళియన్.. నేడు పన్నీర్ సెల్వం సాక్షి నాలెడ్జ్ సెంటర్: ఆదివారం రాజీనామా చేసిన తమిళనాడు సీఎం పన్నీర్సెల్వం రాష్ట్ర చరిత్రలో మూడు సార్లు ‘తాత్కాలిక ముఖ్యమంత్రి’గా పనిచేసిన రికార్డు సొంతం చేసుకున్నారు. ఇటీవలే సీఎం జయలలిత కన్నుమూయటంతో ఆయన ముచ్చటగా మూడోసారి ‘తాత్కాలిక ముఖ్యమంత్రి’గా ప్రమాణం చేశారు. అంతకు ముందు జయ కోర్టు కేసుల కారణంగా ముఖ్యమంత్రి పదవికి తొలిసారి రాజీనామా చేసినప్పుడు 2001 సెప్టెంబర్ 21 నుంచి 2002 మార్చి ఒకటి వరకు, జయకు రెండోసారి జైలు శిక్ష పడినప్పుడు 2014 సెప్టెంబర్ 29 నుంచి 2015 మే 22 వరకూ పన్నీర్ సెల్వం సీఎం పదవిలో ఉన్నారు. ఏఐడీఎంకే మాతృక డీఎంకే 1967లో అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే పార్టీ నేత సీఎన్ అణ్ణాదురై మరణించాక పన్నీర్సెల్వం మాదిరిగానే సీనియర్ మంత్రి వీఆర్ నెడుంజెళియన్ 1969 ఫిబ్రవరి 3 నుంచి పది వరకు, 1987 డిసెంబర్లో ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు, ఎంజీ రామచంద్రన్ మరణించాక డిసెంబర్ 24 నుంచి జనవరి 7 వరకు రెండోసారి తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండోసారి నెడుంజెళియన్ ను తొలగించి ఎంజీఆర్ భార్య వీఎన్ జానకికి సీఎం పదవి అప్పగించారు. ఇప్పుడు శశికళ కోసం పన్నీర్తో రాజీనామా చేయించడం నాటి నెడుంజెళియన్ ఉద్వాసనను గుర్తుచేస్తోంది. -
శశికళ చక్రం తిప్పడం మొదలైంది
-
మళ్లీ శశికళ వద్దకు పన్నీర్ సెల్వం
చెన్నై: తమిళనాట ఏఐఏడీఎంకే రాజకీయాలు ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ కేంద్రీకృతంగా మారాయా? అప్పుడే ఆమె పార్టీ పవర్ను చేజిక్కించుకున్నారా? ఒక వేళ అదే నిజమైతే, అది జయ మరణం తర్వాతే జరిగిందా.. లేకుంటే ఆమె ఆస్పత్రి పాలయినప్పటి నుంచే తన వ్యూహాన్ని సిద్ధం చేసుకుని పావులు కదిపారా? మొత్తానికి ఏఐఏడీఎంకే భవితవ్యం శశికళ చేతులోకే వెళ్లిపోయిందా.. అంటే ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు అవుననే సంకేతాలను ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఆమె విశ్వసనీయుడు పన్నీర్ సెల్వం శనివారం తన బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. అందులో భాగంగా తొలిసారి రేపు ఉదయం11.30గంటలకు కేబినెట్ భేటీ నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే శశికళతో ఇప్పటికే సమావేశమైన పన్నీర్ సెల్వం మరోసారి శుక్రవారం తన మంత్రి వర్గంలోని ఉన్నత శ్రేణి నేతలతో కలిసి పోయెస్ గార్డెన్కు వెళ్లారు. అయితే, నేటి భేటీ వెనుక అజెండా ఏమై ఉంటుందనే విషయం మాత్రం బయటకు పొక్కనీయలేదు. అయితే, పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఎప్పుడు చేపడతారనే విషయాన్ని తెలుసుకునేందుకే వారు వెళ్లినట్లు ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. దాదాపు 27 ఏళ్లుగా పార్టీకి అన్నీ తానై జయ నడిపించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె మరణం వరకు కొనసాగారు. దీంతో ఆ పవర్ ఫుల్ పదవిని ఎప్పుడు, ఎవరు చేపడతారో అని అందరూ ఎదురుచూస్తున్నారు. -
ముఖ్యమంత్రిగా పన్నీర్.. అర్ధరాత్రి ప్రమాణం
శశికళకు పార్టీ నాయకత్వ బాధ్యతలు తమిళనాడు 19వ ముఖ్యమంత్రి గా పన్నీర్సెల్వం నియమితులయ్యారు. తన జేబులో అమ్మ జయలలిత ఫొటో పెట్టుకుని మరీ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇక పార్టీ నాయకత్వ బాధ్యతలను జయలలిత నెచ్చెలి శశికళకు అప్పగించాలని పార్టీ ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. దీనిపై కొంత అసంతృప్తి వ్యక్తమైనా, చివరకు పార్టీ పగ్గాలను ఆమెకే అప్పగించారు. ఓ పన్నీర్ సెల్వం (65) జయలలితకు అత్యంత విధేయుడు. గతంలో ఆమె జైలుకు వెళ్లినప్పుడు కూడా ఆయననే ముఖ్యమంత్రిగా నియమించినా, అప్పట్లో అమ్మ ఫొటోను మాత్రమే కుర్చీలో ఉంచి తాను విడిగా కూర్చుని కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఆయనకు మించిన విశ్వసనీయులు ఎవరూ ఉండరన్న ఉద్దేశంతో పన్నీరుకే ముఖ్యమంత్రి పదవి అప్పగించారు. దాంతో ఆయన మూడోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినట్లయింది. జయలలిత ఇన్నాళ్లూ వ్యక్తిగతంగా చూసిన 8 మంత్రిత్వ శాఖలను కూడా పన్నీర్ సెల్వంకే ఇచ్చారు. అర్ధరాత్రి 1.15 గంటల సమయంలో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆయనతో రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు జయలలిత కేబినెట్లో ఉన్న మొత్తం 31 మంది మంత్రులు కూడా మళ్లీ ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు పన్నీర్ సెల్వాన్ని తమ నాయకుడిగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా కలిసి ఎన్నుకున్నారు. జయలలిత తర్వాత ప్రభుత్వ, పార్టీ రథసారధులను ఎంపిక చేసుకోవడానికి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు సోమవారం ఉదయం 11 గంటలకు అపోలో ఆసుపత్రిలో సమావేశమయ్యారు. దీనికి ముందు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు విడిగా శశికళను కలిశారు. ఆ తర్వాత పన్నీర్ సెల్వంతో పాటు మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు శశికళను కలసి భవిష్యత్ ఏర్పాట్ల గురించి చర్చించారు. పన్నీర్ను సీఎం చేయడానికి అనుకూలంగా మెజారిటీ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన విషయం చర్చకు వచ్చింది. శశికళ కూడా పన్నీర్ వైపే ఉన్నారని ఆమె మద్దతుదారులైన ఎమ్మెల్యేలు వెల్లడించారు. పన్నీర్ను సీఎం చేసి శశికళకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చే విషయమై చర్చ జరిగింది. ప్రతిసారి పన్నీర్కే అవకాశం ఎందుకు ఇవ్వాలని మంత్రి ఎడపాడి పళనిస్వామి, ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీతో పాటు మరికొందరు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారని తెలిసింది. శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించే ప్రతిపాదనను సైతం సుమారు 45 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని, పార్టీని బతికించుకోవాలంటే ఇంతకుమించి మార్గం లేదని మరికొందరు తమ అభిప్రాయం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఇవ్వరాదనే అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. పన్నీర్ సెల్వం 2001లో ఆపద్ధర్మ సీఎంగా, 2015లో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు, 2016 సెప్టెంబర్ 22 నుంచి ఆపద్ధర్మ సీఎంగా పని చేశారు. -
అరుణాచల్లో అనూహ్య పరిణామాలు
-
అరుణాచల్లో అనూహ్య పరిణామాలు
నబమ్ టుకి ప్రభుత్వంపై తిరుగుబాటు ఎమ్మెల్యేల అవిశ్వాసం * కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకున్న తిరుగుబాటు సభ్యులు * స్పీకర్ తొలగింపు సహా అన్ని నిర్ణయాలపై గౌహతి హైకోర్టు స్టే గువాహటి/ఇటానగర్: ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం అనూ హ్య మలుపులు తిరుగుతోంది. గురువారం ఒక హోటల్లో సమావేశమైన ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు నబమ్ టుకి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టి.. తీర్మానానికి మద్దతు గా ఓటేశారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే కలిఖో పాల్ను రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. మరోవైపు గౌహతి హైకోర్టు స్పీకర్ తొలగింపు సహా అన్ని నిర్ణయాలను నిలుపుదల చేస్తూ స్టే విధించింది. ముఖ్యమంత్రి నబమ్ టుకి రాష్ట్రంలో పరిణామాలపై జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్జ్, ప్రధాని మోదీకి లేఖలు రాశారు. గురువారం స్థానిక హోటల్లో 11 మంది బీజేపీ, ఇద్దరు ఇండిపెండెంట్లతో పాటు 20 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. స్పీకర్ నబమ్ రెబియా ఆదేశాలతో బుధవారం నుంచి శాసనసభ ప్రాంగణం మూతపడటంతో వీరంతా హోటల్లోని కాన్ఫరెన్స్ హాలులోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు డిప్యూటీ స్పీకర్ టి.నార్బు థాంగ్డాక్ అధ్యక్షత వహించారు. బీజేపీ ఎమ్మెల్యేలు, స్వతంత్రులు టుకి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డిప్యూటీ స్పీకర్ థాంగ్డాక్ అవిశ్వాస తీర్మానాన్ని వాయిస్ ఓటు ద్వారా ఆమోదించారు. మొత్తం 60 మంది సభ్యులకుగానూ బీజేపీ, స్వతంత్ర, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు 33 మంది ఈ సమావేశంలో పాల్గొన్నా రు. ముఖ్యమంత్రి నబమ్టుకితో పాటు ఆయనకు మద్దతిస్తున్న 26 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. తరువాత ఆర్థిక మంత్రిగా పనిచేసిన కలిఖో పాల్ను 33 మంది ఎమ్మెల్యేలు నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అనంతరం పాల్ను శాసనసభా పక్ష నేతగా థాంగ్డాక్ ప్రకటించారు. అసెంబ్లీ తీర్మానాలను గవర్నర్ జేపీ రాజ్ఖోవాకు పంపనున్నట్టు తెలిపారు. మరోవైపు అరుణాచల్ అసెంబ్లీ స్పీకర్ రెబయా తొలగింపు సహా అన్ని నిర్ణయాలను నిలుపుదల చేస్తూ గౌహతి హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 24న జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను డిసెంబర్ 16కు మారుస్తూ ఈ నెల 9న గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. పార్లమెంట్లో దుమారం.. మరోవైపు అరుణాచల్ పరిణామాలు పార్లమెంట్లో దుమారం రేపాయి. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ లోక్సభ, రాజ్యసభల్లో ఆందోళనకు దిగింది. కాంగ్రెస్కు వామపక్షాలు, జేడీయూ మద్దతు తెలిపాయి. -
సీఎం పదవి దక్కే అదృష్టవంతుడెవరో?
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ కేంద్ర మంత్రివర్గానికి వెళ్లడం ఖాయం కావడంతో.. ఆ పదవిని భర్తీ చేయడానికి బీజేపీ కసరత్తులు మొదలుపెట్టేసింది. ముఖ్యమంత్రి పదవికి తాను శనివారం రాజీనామా చేయనున్నట్లు మనోహర్ పారిక్కర్ ప్రకటించారు. ఆ తర్వాత కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారన్నారు. బీజేఎల్పీ శుక్రవారం నాడు సమావేశం నిర్వహించి, ముగ్గురి పేర్లను ఈ పదవికి సూచిస్తుంది. ప్రధానంగా ఈ పదవి కోసం ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డసౌజా, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్, స్పీకర్ రాజేంద్ర అర్లేకర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ పేర్లను పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు నిర్ధారించారు. ఢిల్లీలో శనివారం సమావేశం కానున్న పార్టీ పార్లమెంటరీ బోర్డు వీటిలో ఏదో ఒకపేరును ఖరారు చేస్తుంది. ఇక కొత్త ముఖ్యమంత్రి ఎవరు అవుతారోనన్న విషయంపై గోవా రాజధాని పనజిలో రాత్రంతా చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలంతా ఓ హోటల్లో సమావేశమయ్యారు. దేశ రక్షణ మంత్రిగా గోవా సీఎం పారిక్కర్ వెళ్లడం గర్వకారణమని వారు భావిస్తున్నారు. అయితే, రాష్ట్రంలో మాత్రం ఆయన లేని లోటు ఉంటుందని పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ తెలిపారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో బీజేపీ రథసారథిగా ఉండి విజయకేతనం ఎగరేసిన పారిక్కర్.. తాను రాష్ట్ర రాజకీయాలకు దూరంగా వెళ్తున్న విషయాన్ని చాలా భారంగా ప్రకటించారు. -
మహారాష్ట్ర కొత్త సి.ఎమ్.దేవేంద్ర ఫడ్నవీస్
-
కుదిరిన ముహూర్తం 31న వాంఖడే స్టేడియంలో ప్రమాణస్వీకారం
కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఈ నెల 31వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనుంది. రాష్ట్రంలో బీజేపీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుండడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు ఆ పార్టీకి చెందిన అతిరథ మహారథులంతా వాణిజ్య రాజధానికి రానున్నారు. సాక్షి, ముంబై: నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 31వ తేదీన బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. స్థానిక మెరీన్లైన్స్ ప్రాంతృంలోని వాంఖడే స్టేడియంలో బీజేపీకి చెందిన తొలి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారని తెలియవచ్చింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా అతి పెద్దపార్టీగా అవతరించిన బీజేపీ... ఏ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందనే విషయంపై కొద్దిరోజులుగా ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్కంఠతకు మంగళవారం తెరపడనుంది. ఈ నెల 31వ తేదీన కొత్త ముఖ్యమంత్రితోపాటు ఇతర మంత్రులంతా ప్రమాణస్వీకారం చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ తొలిసారిగా అధికారంలోకి రానున్నందున ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులందరూ ప్రమాణ స్వీకారాత్సోవానికి హాజరుకానున్నట్టు తెలిసింది. తొలుత ఈ నెల 30వ తేదీన ప్రమాణం చేస్తారని పేర్కొన్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ సౌకర్యార్ధం కారణంగా మరో రోజు వాయిదావేశారు. దేవేంద్ర ఫడ్విస్ ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలను చేపట్టాలని బీజేపీకి చెందిన అనేకమంది మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. -
నాగాలాండ్ కొత్త సీఎం జెలియాంగ్
కోహిమా: నాగాలాండ్ నూతన ముఖ్యమంత్రిగా నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) నేత టి.ఆర్. జెలియాంగ్ శుక్రవారం నియమితులయ్యారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో నాగాలాండ్ లోక్సభా స్థానం నుంచి విజయం సాధించిన ప్రస్తుత ముఖ్యమంత్రి నిఫూ రియో శుక్రవారం సీఎం పదవికి, శాసనసభా స్థానానికి రాజీనామా చేయడంతో జెలియాంగ్ను గవర్నర్ అశ్వనీకుమార్ కొత్త సీఎంగా నియమించారు. శనివారం జెలియాంగ్, ఆయన మంత్రివర్గంతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేసే ఉద్దేశంతో పార్లమెంట్కు వెళ్లాలని నిర్ణయించుకున్న నిఫూ రియోను ప్రజలు 4 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిపించారు