odissa
-
గిరి ‘గడబ’ ప్రకృతితో మమేకం
ఆధునిక ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న గిరిజన తెగ ‘గడబ’ ఇప్పుడిప్పుడే తన రూపు మార్చుకుంటోంది. అయితే, వీరి అరుదైన సంస్కృతి అంతరించిపోకుండా కాపాడుకుంటోంది. ప్రాచీన కాలం నుంచి ఈ తెగ గోదావరి పరివాహక ప్రాంతానికి దాపుగా ఉంటోంది. ‘గ’ అంటే గొప్పతనం అని, ‘డ’ అంటే నీటికి సూచిక అని అర్థం. ‘గడ’ అంటే గొప్పదైనా నీరు అని, గోదావరి అనే పేరు ఉంది. ఒరియాలో ‘గడబ’ అంటే సహనం గలవాడు అని అర్థం. గడబ తెగలు ఒరిస్సా వింద్య పర్వత ప్రాంతాల్లో స్థిరపడ్డాయి. మధ్యప్రదేశ్లోనూ ఈ తెగ ఉంది. ఈ తెగను భాష గుటబ్! వీరిలో అక్షరాస్యులు, నిరక్షరాస్యులూ ఉన్నారు. మన రాష్ట్రంలో గడబలు విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో ప్రముఖంగా కనిపిస్తారు. అటవీ ఉత్పత్తులే ఆధారంగా!వీరు గడ్డి, మట్టి, కలపను ఉపయోగించి ఇండ్లను నిర్మించుకుంటారు. ఈ గుడెసెలు త్రికోణాకారంలోనూ, మరికొన్నింటికి కింది భాగం గుండ్రంగా ఉండి పైకప్పు కోన్ ఆకారంలో ఉంటుంది. మహిళలు కుట్టని రెండు వస్త్రాల ముక్కలను ధరిస్తారు. అలాగే, రెండు వలయాలుగా ఉండే నెక్పీస్ను ధరిస్తారు. వీటిలో అల్యూమినియమ్, వెండి లోహం ప్రధానమైంది. తృణధాన్యాలు, వరి పండిస్తారు. అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడే వీరంతా సహజ పద్ధతుల్లో తయారుచేసుకున్న సారాయి, కల్లు పానీయాలను సేవిస్తారు. థింసా నృత్యంమహిళలు అర్థచంద్రాకారంలో నిలబడి, ఒకరి మీద ఒకరు చేతులు వేసి, ఒక వైపుకు లయబద్ధంగా కాళ్లు కదుపుతూ నృత్యం చేస్తారు. వీరు నృత్యం చేస్తున్నప్పుడు పురుషులు సంగీతవాయిద్యాలను వాయిస్తారు. ఈ థింసా నృత్యం ఆధునిక ప్రపంచాన్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. సులువైన జీవనంఇంటిపేర్లను బట్టి వావివరసలను లెక్కించుకుంటారు. మేనబావ, మేనమరదలు వరసలు గలవారు వీరిలో ఎక్కువగా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి వద్దని అమ్మాయి అనుకుంటే కుల పెద్దలతో పంచాయితీ నిర్వహించి వారి సమక్షంలో ఓలి ఖర్చు పెట్టుకుంటే చాలు విడిపోవచ్చు. అబ్బాయి కూడా ఇదే పద్ధతి పాటిస్తాడు.అన్నీ చిన్న కుటుంబాలే!గడబలో ఎక్కువగా చిన్నకుటుంబాలే. వీరికి ఇటెకుల, కొత్త అమావాస్య, తొలకరి, కులదేవత పండగలు ప్రధానమైనవి. వీరిని గడ్బా అని మధ్య ప్రదేశ్లో, గడబాస్ అని ఆంధ్రప్రదేశ్లో పేరుంది.(చదవండి: నా నుదుటి రాతలోనే నృత్యం ఉంది..!) -
యూట్యూబ్ సాయంతో గవర్నమెంట్ జాబ్..
ఒరిస్సాలోని గిరిజన తెగ. కోచింగ్కు డబ్బులు లేవు. ఇంట్లో ఇంటర్నెట్ రాదు.కాని జీవితంలో ఏదైనా సాధించాలి. ఇంటికి, ఊరికి దూరంగా వెళ్లి మరీ సిగ్నల్ ఉన్న చోట కూచుని యూట్యూబ్ వీడియోల సాయంతో ‘ఒరిస్సా సివిల్ సర్వీసెస్’లో ఉద్యోగం సాధించింది బిని ముడులి. సోషల్ మీడియా వల్ల కలిగిన మేలు ఇది. ఒరిస్సాలో బోండా తెగ నుంచి స్టేట్ సివిల్స్లో ఉద్యోగం సాధించిన మొదటి మహిళ బిని పరిచయం...ఒక్కొక్కరూ ఒక్కొక్కరూ వస్తూ ఉంటే కాసేపటికి ఆ బోండా ఘాట్ జనాలతో నిండిపోయింది. అందరూ బిని ముడులిని చూసి అభినందించేవారే. దిష్టి తీసేవారే. కారణం ఆ అమ్మాయి తమ బోండా తెగ గౌరవాన్ని పెంచింది. తమ తెగ నుంచి ‘ఒరిస్సా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్’ (ఓపిఎస్సి)లో ర్యాంక్ సాధించి గవర్నమెంట్ అధికారి అవుతున్న మొదటి అమ్మాయి బిని ముడులి. ‘నాకు ఉద్యోగం వస్తే నా కంటే మావాళ్లే ఎక్కువ ఆనందిస్తున్నారు’ అంటుంది 24 ఏళ్ల బిని ముడులి. మొన్నటి శనివారం విడుదలైన ఓపిఎస్సి ఫలితాల్లో ఎస్.టి. కోటాలో 596వ ర్యాంకు పొంది ఉద్యోగానికి అర్హత సాధించింది బిని. ఓపిఎస్సి 2022–23 పరీక్షకు మొత్తం 92,194 మంది అభ్యర్థులు ΄ోటీ పడితే వారిలో 683 మంది అర్హత సాధించారు. విశేషం ఏమిటంటే టాప్ టెన్ ర్యాంకుల్లో ఐదు మంది అమ్మాయిలున్నారు. అర్హత సాధించిన వారిలో 258 మంది అమ్మాయిలే.యూట్యూబ్ పాఠాలతో2020లో ఓపిఎస్సి పరీక్ష రాసి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యింది బిని. ‘నా ప్రిపరేషన్ సరి΄ోదని నాకు అర్థమైంది. కాని కోచింగ్కు వెళ్లేందుకు డబ్బు లేదు. అదీగాక నేను సంపాదించి ఇంటికి సాయపడాల్సిన సమయం. అందుకే ఆయుర్వేదిక్ అసిస్టెంట్గా పని చేయడం మొదలెట్టాను. మా ఊరిలో ఇంటర్నెట్ ఉండదు. అందుకే దగ్గరిలోని గోవిందపల్లి టౌన్కు వచ్చి అక్కడ యూట్యూబ్లో దొరికే పాఠాలతో ప్రిపేర్ అయ్యాను. ఆన్లైన్లో దొరికే మెటీరియల్ను చదువుకున్నాను. అనుకున్నది సాధించాను’ అంది బిని.అమ్మాయిలను స్కూళ్లకు పంపండి‘ఆడపిల్లలను బాగా చదివించండి అనేదే నా పిలుపు. చదువులోనే వారి అభివృద్ధి ఉంది. డబ్బు లేక΄ోయినా ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఉచితంగా అనేక కోర్సులు, కోచింగ్లు దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. నేను అధికారి అయ్యాక స్త్రీల స్వయంసమృద్ధి కోసం పని చేస్తాను. అంతేకాదు మా బోండా తెగ కోసం వారికి అందాల్సిన సంక్షేమ ఫలాల కోసం పని చేస్తాను’ అంది బిని.వంటలు చేస్తూ పెంచాడుఒరిస్సాలోని మల్కన్గిరి జిల్లాలో ముదులిపడ అనే చిన్న బోండాల ఊరు బిని ముడులిది. తండ్రి మధుముడిలి అక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వంటచేస్తాడు. తల్లి సునమణి ఊళ్లో అంగన్వాడి కార్యకర్తగా పని చేస్తోంది. ఒరిస్సాలో మొత్తం 13 గిరిజన తెగలు అంతరించిపోయే ప్రమాదంలో ఉంటే వాటిలో ఒకటి బోండా తెగ. ఆ తెగ నుంచి తాను బాగా చదువుకుని పైకిరావాలనుకుంది బిని ముడులి. జేపోర్లోని బిక్రమ్దేబ్ యూనివర్సిటీలో జువాలజీలో ఎంఎస్సీ చేసింది. ప్రభుత్వ అధికారి అయి ప్రజలకు సేవ చేయాలనేది బిని కల. (చదవండి: వీధుల్లో బిక్షాటన చేసే అమ్మాయి నేడు డాక్టర్గా..!) -
పూరీ తీరంలో పర్యాటకుడు మృతి
భువనేశ్వర్: పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక పర్యాటకుడిని బుధవారం పూరీ సముద్రం స్వర్గ ద్వారం తీరంలో స్నానం చేస్తుండగా కెరటాలు ఈడ్చుకుపోయాయి. తీరం చేర్చి ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు స్థానిక జిల్లా ప్రధాన ఆస్పత్రి వైద్య వర్గాలు ప్రకటించాయి. మృతుడు పశ్చిమ బెంగాల్ బంకురాలోని నిత్యానందపూర్కు చెందిన సుశాంత్ అధికారి (54)గా గుర్తించారు.విచారణకు కమిటీ..భువనేశ్వర్: గతంలో బిజూ జనతా దళ్ ప్రభుత్వం ఒడిశా రాష్ట్ర ఆహార కమిషన్ చైర్పర్సన్ను నియమించింది. ఈ నియామకం పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆహార సరఫరాలు మరియు వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణచంద్ర పాత్రో బుధవారం ప్రకటించారు. నియామక ప్రక్రియ సరికాదని తేలితే సంబంధిత వ్యక్తిని ఒడిశా రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తామని పేర్కొన్నారు.బంగారం దుకాణంలో చోరీ..కొరాపుట్: బ్రహ్మపుర నగరంలోని బంగారు దుకాణంలో చోరీ జరిగింది. బైద్యనాథ్ పోలీస్స్టేషన్ పరిధిలోని జనని ఆస్పత్రి రోడ్డులో ఉన్న ఓం శ్రీ జ్యూయలర్స్లో దొంగలు పడ్డారు. ఉదయం షాపు తెరవడానికి యజమాని జమ్మల శ్రీధర్ వెళ్లినప్పుడు దొంగతనం జరిగినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విలువైన బంగారు వస్తువులను స్ట్రాంగ్ సేఫ్ లాకరులో ఉంచడంతో దానిని తెరవడానికి గ్యాస్ కట్టర్లు ద్వారా దొంగ ప్రయత్నం చేసి విఫలం అయ్యాడు. అయితే బయట ఉన్న కొన్ని బంగారు నగలు, సుమారు 20 కేజీల వెండి పట్టుకుపోయాడు.పట్టుబడిన టేకు కలప..పర్లాకిమిడి: గంజాం జిల్లా దక్షిణ ఘుమసుర అటవీ శాఖ పరిధి అస్కా రేంజ్లో నువాభావనపూర్ జంక్షన్ వద్ద బుధవారం అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలతో సహా డ్రైవర్ను అరెస్టు చేశారు. వాహనంలో పట్టుకున్న కలప దుంగలు 57 ఘన చదరపు అడుగులు ఉన్నవి.వెయిట్ లిఫ్టింగ్ పోటీలు..మల్కన్గిరి: జిల్లా కేంద్రంలో ఉన్న స్టేడియంలో తొలిసారిగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో మనీష మొహంతి, రెండో స్థానంలో సిప్రా, మూడో స్థానంలో ఉషా శర్మలు, పురుషుల విభాగంలో ఆలీ సర్ధార్, బిజేంద్ర బిహారీ, రంజాన్ సాహులు తొలి మూడు స్థానాల్లో నిలిచారు.ఆశ్రమ పాఠశాల సందర్శన..జయపురం: కుంద్ర సమితి అసన గ్రామ పంచాయతీ ఉదల్గుడ గ్రామంలోని కేడీఎఫ్ ఆశ్రమ పాఠశాలను జయపురం సబ్ కలెక్టర్ ప్రభాత్ కుమార్ పొరిడా సందర్శించారు. ఆశ్రమ పాఠశాలలో విషాహారం తినడం వలన 69 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వీరిలో నలుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని జయపురం జిల్లా కేంద్రా ఆస్పత్రికి బుధవారం తరలించారు. దీంతో ఆయన హాస్టల్ను సందర్శించి పరిశుభ్రత, సౌకర్యాలను పరిశీలించారు. విషాహారంపై సంబంధిత అధికారులతో చర్చించారు.రాయగడలో డీఆర్ఎం పర్యటన..రాయగడ: విశాఖపట్నం రైల్వే డివిజన్ మేనేజర్ సౌరభ్ ప్రసాద్ బుధవారం రాయగడలో పర్యటించారు. విజయనగరం నుంచి రాయగడ వరకు కొనసాగుతున్న మూడో రైల్వేలైన్ నిర్మాణం పనులను సమీక్షించారు. అనంతరం రన్నింగ్ రూమ్, కొత్తగా నిర్మించిన స్టేషన్ బిల్డింగ్ను పరిశీలించారు. ఆయన వెంట రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.సత్తాచాటిన జయపురం ఆటగాళ్లు..జయపురం: కొరాపుట్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీల్లో జయపురం ఆటగాళ్లు సత్తాచాటారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో గెలిపొందిన వారికి బహుమతులు అందజేశారు.దరఖాస్తుల స్వీకరణ..రాయగడ: రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం కొత్తగా అమలు చేసిన సుభద్ర పథకం దరఖాస్తుల పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అంగన్వాడీ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం రాయగడలో ప్రారంభమయ్యింది. మహిళలు తమ దరఖాస్తులను సమర్పించేందుకు పెద్ద సంఖ్యతో హాజరవుతున్నారు. దీంతొ అంగన్వాడీ కేంద్రాలు మహిళలతో రద్దీగా ఉన్నాయి.వెబ్ పోర్టల్ మెరాయింపు..పర్లాకిమిడి: పట్టణంలో బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన సుభద్ర పథకం పోర్టల్ మొరాయించింది. దీంతో అప్లయ్ చేసుకోవడానికి వచ్చిన మహిళలు నిరాసతో వెనుదిరిగారు. కాగా సుభద్ర ఫారాలను కొందరూ డబ్బులకు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. -
ఒడిస్సీ బాలినీస్ నృత్యాల వందేమాతర సంగమం!
బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ విరచిత ‘వందేమాతరం‘ ఖ్యాతి మరోసారి విశ్వ యవనికపై తొణికిసలాండింది! వియత్నాంలోని బాలీలోని భారతీయ దౌత్య కార్యాలయం దీనికి వేదికైంది. భారత నృత్య శైలుల్లో ఒకటైన ఒడిస్సీకి బాలినీస్ శైలి కూడా తోడైంది. వందేమాతరమంటూ.. పదాలు సొగసుగా కదిలాయి. హావభావాలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియో కాస్తా ఇప్పుడు నెట్లో వైరల్గా మారింది. పలువురి అభిమానాన్ని చూరగొంటోంది. ఎందుకు? ఏమిటి? ఎలా? చూసేయండి మరి! కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా బాలిలో వందేమాతరం పాటకు ప్రత్యేక శైలిలో నృత్య ప్రదర్శన జరిగింది. భారతదేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బాలిలో నిర్వహించారు. ఇది ఒడిస్సీ, బాలినీస్ సంప్రదాయ నృత్యాలను మిక్స్ చేసిన నృత్య ప్రదర్శన. ఇది ఎంతగా ఆకట్టుకుంటుందంటే..ప్రేక్షకులు మైమరిచి చూస్తుండి పోయేంతగా! ఆ యువతులిద్దరూ చాలా చక్కటి అభినయంతో చేశారు. బంకిం చంద్ర ఛటోపాధ్యాయ రాసిన జాతీయ గీతం వందేమాతరం పాట ప్రతి భారతీయుడిలో దేశభక్తి ఉప్పొంగేలే చేస్తుంది. తెలియని అనుభూతి కలిగుతుంది. అలాంటి అద్భుతమైన గీతానికి చక్కటి నృత్యంతో అబ్బురపరిచారు ఆ యువతులు. ఈ నృత్య ప్రదర్శన ఇచ్చిన ఇద్దరు యువతుల్లో ఒకరు బాలిలో ఒడిస్సీ టీచర్ డా పాంపిపాల్ కాగా, మరోకరు బాలినీస్ డ్యాన్సర్ మెలిస్సా ఫ్టోరెన్స్ షిల్లెవోర్ట్. ఇద్దరు వేర్వేరు డ్యాన్సర్లు కలిసి ఒక దేశ భక్తి పాటకు ఇచ్చి ఈ ప్రదర్శన అద్భుతః ! అన్నంతగా నెటిజన్లను ఆకట్టుకుంది. Vandhe Maatram - Odissa & Bali dancers pic.twitter.com/hzj4bSv26o — Aviator Anil Chopra (@Chopsyturvey) April 11, 2024 (చదవండి: అత్యంత ఖరీదైన టీకప్పు..ధర వింటే షాకవ్వుతారు!) -
మీకు తెలుసా.. ఒక అసెంబ్లీ స్థానానికి ఇద్దరు ఎమ్మెల్యేలు!
కొరాపుట్: ఎక్కడైనా ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఒక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించడం సర్వసాధారణం. కానీ గతంలో ఒక అసెంబ్లీ స్థానానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయం ఒడిశా అసెంబ్లీ రికార్డుల్లో సైతం నమోదై ఉంది. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో మాత్రమే ఈ నిబంధన ఉండేదని తెలుస్తోంది. బలహీన వర్గాలకు చేయూతనివ్వడానికి ఒక నియోజకవర్గంలో ఒక జనరల్ కేటగిరి ఎమ్మెల్యేతో పాటు ఒక రిజర్వ్ కేటగిరి ఎమ్మెల్యే ఉండేవారు. నబరంగ్పూర్ విధానసభ స్థానం నుంచి 1951లో కాంగ్రెస్ పార్టీ తరుపున జనరల్ కేటగిరి కింద సదాశివ త్రిపాఠి, రిజర్వ్ కేటగిరిలో ముది నాయక్ ప్రాతినిధ్యం వహించారు. 1957లో ఇదే స్థానం నుంచి అదే పార్టీకి చెందిన సదాశివ త్రిపాఠితో పాటు రిజర్వ్ కేటగిరిలో మిరు హరిజన్ కొనసాగారు. ఈ నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసింది. జయపూర్, ఉదయగిరి, అనుగుల్, పాల్ లక్రా కే నగర్, డెంకనాల్, భవానీపట్న, జునాగఢ్, నువాపడా, టిట్లాగఢ్, పాట్నగఢ్, బొలంగీర్, పదంపూర్, సోహేలా, రైరాకోల్, జర్సుగుడ, బెమ్రా, సుందర్ గఢ్, కెంజోర్, ఆనంద్పూర్, పంచ్పిర్, బరిపద, నిలగిరి, చందబలి, సుకింద, జాజ్పూర్, బింజాపూర్, అవౌల్, సాలేపూర్, కటక్ రూరల్, నిమాపరా, భువనేశ్వర్, నయాగడ్, కేంద్రపడా, దసపల్లా, అస్కా, బ్రహ్మపుర, పర్లాకిమిడి స్థానాల్లో సైతం ఇద్దరేసి ఎమ్మెల్యేలు ఉండేవారు. -
పొత్తు లేనట్లే.. బీజేపీ తేల్చేసిందా?
సాక్షి, భువనేశ్వర్ : బీజేపీ - బీజేడీల మధ్య ఇక పొత్తు లేనట్లేనని తెలుస్తోంది. ఈ సారి లోక్సభ ఎన్నికలకు 15 ఏళ్ల తర్వాత పాత మిత్రులు మళ్లీ ఒక్కటవ్వనున్నారని అందరూ అనుకున్నారు. కానీ తాజా రాజకీయ పరిణామాలు అందుకు తావు ఇవ్వడం లేదని సమాచారం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించారు. ఆ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేడీ అధినేత, ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్లు మంతనాలు జరిపారు. అనంతరం 15 ఏళ్ల తర్వాత బీజేపీతో జతకట్టేలా సంకేతాలిచ్చారు. అమిత్ షా తో సుదీర్ఘంగా చర్చలు ఇందులో భాగంగా పొత్తు పెట్టుకుని లోక్సభ ఎన్నికల బరిలో దిగేలా ఇరు పార్టీల అగ్రనేతలు చర్చలు జరిపారు. అయితే, సీట్ల పంపకాల్లో విభేదాలు తలెత్తడంతో.. బీజేపీ ఒంటరిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ ప్రకటించారు. పొత్తుపై చర్చించేందుకు అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన మన్మోహన్ సాముల్.. కేంద్రమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొత్తులపై మన్మోహన్ సాముల్ మాట్లాడుతూ.. ‘మా జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ ఏది చెబితే అది తుది నిర్ణయం’ అని అన్నారు. సీనియర్ నేతలతో సీఎం భేటీ ఆ తర్వాతే ఒడిశాలో బీజేపీ సొంతంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ ఎక్స్.కామ్లో ఓ పోస్ట్ పెట్టారు. కొద్ది సేపటికే ఆ పోస్ట్ను డిలీట్ చేశారు. మరోవైపు బీజేడీ పార్టీ అధ్యక్షుడు, సీఎం నవీన్ పట్నాయక్ తన నివాసంలో పార్టీ సీనియర్ నేతల సమావేశాన్ని నిర్వహించారు. ఇలా వరుస పరిణామాలతో ఒడిశా రాష్ట్ర రాజకీయాలు రసకందాయంగా మారాయి. పోలింగ్కు సమయం ఉంది కాబట్టి పొత్తులపై బీజేపీ- బీజేడీలు చర్చలు జరుపుతుంటే.. ఇరు పార్టీల నేతలు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుండడం గమనార్హం. -
ఒడిశా టు హైదరాబాద్.. తాజాగా పట్టుబడిన గంజాయి ‘చాక్లెట్లు’
ఖమ్మం: ఒడిశా నుంచి తెలంగాణలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలించే స్మగ్లర్లకు జిల్లా రాచబాటగా మారింది. ఎక్సైజ్, పోలీసు అధికారులు ఎంత కట్టడి చేసినా.. తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నా ఎక్కడో చోట గంజాయి పట్టుబడడం సర్వసాధారణమైపోయింది. అయితే, ఇన్నాళ్లు గంజాయిని బస్తాల్లో.. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం వాహనాల్లో ఇతర సరుకుల కింద తరలించేవారు. అనంతరం నూనెగా మార్చి కూడా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇదంత ఎందుకు అనుకున్నారో ఏమో కానీ ఏకంగా గంజాయిని చాక్లెట్ల రూపంలోకి మార్చి తరలిస్తుండగా ఎక్సై జ్ అధికారులు గుర్తించారు. తాజాగా జిల్లా కేంద్రంలో చేపట్టిన తనిఖీల్లో ఈ గంజాయి చాక్లెట్లు పట్టుబడగా అవాక్కవడం ఎక్సైజ్ పోలీసుల వంతు అయింది. ఒడిశా టు హైదరాబాద్.. ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా గంజాయి సాగుకు పెట్టింది పేరు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పలువురు అక్కడకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి ప్యాకెట్లుగా తీసుకెళ్తుంటారు. తాజాగా అక్కడే గంజాయిని చాక్లెట్ల రూపంలోకి మార్చి ఎవరికీ అనుమానం రాకుండా మహిళల చేత రవాణా చేయిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు మహిళలు ఖమ్మంలో పట్టుబడగా... తనిఖీ చేసిన అధికారులే నివ్వెరపోయారు. ఒక్కో ప్యాకెట్లో ఐదు గ్రామాల చొప్పున 40చాక్లెట్లుగా ఉండగా ఆ ప్యాకెట్ను రూ.90కు కొనుగోలు చేసి రూ.400 చొప్పున విక్రయిస్తున్నట్లు గుర్తించారు. చార్మినార్ గోల్డ్, మున్కా తదితర పేర్లతో ఈ చాక్లెట్లు ఒడిశా ప్రాంతంలోనే తయారవుతున్నట్లు తెలిసింది. చాక్లెట్లకు డిమాండ్.. గంజాయికి అలవాటు పడిన వారు పొడి కొనుగోలు చేయడం.. పీల్చడం చేస్తుంటారు. అయితే, ప్యాకెట్ల రవాణా సమయంలో తరచుగా పట్టుబడుతండడంతో అమ్మకం, కొనుగోలుదారులు చాక్లెట్లపై దృష్టి సారించినట్లు సమాచారం. దీంతో ఒడిశాలోని స్మగ్లర్లు గంజాయి చాక్లెట్లు తయారుచేస్తున్నట్లు తెలిసింది. తద్వారా వీటి వాడకం సులువవుతుందని, తనిఖీల్లోనూ పట్టుబడే అవకాశాలు తక్కువగా ఉంటాయనే భావనకు వచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాక కావాల్సినప్రాంతాలకు చేరవేసి అమ్మడం సులువవుతుందని గంజాయిని చాక్లెట్ల రూపంలో మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో కొన్నాళ్ల క్రితం చాక్లెట్లు పట్టుబడగా మూడు రోజుల క్రితం వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద మూడు కేజీల గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనం కలిగించింది. పోలీసులకు చిక్కేది కొందరే.. గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కుతున్న వారు కొందరేనని.. అది కూడా కూలీలేనని సమాచారం. అసలు సూత్రధారులు ఎక్కడా పట్టుపడకుండా తెర వెనక ఉండి దందా నడిపిస్తుంటారని తెలిసింది. ఒడిశా నుంచి గంజాయితో జిల్లాకు చేరుకుంటున్న పలువురు సాధారణ ప్రయాణికుల మాదిరి బస్సుల్లో వెళ్తుండగా.. ఇంకొందరు రైళ్లను ఎంచుకుంటున్నారు. అయితే, తెలంగాణలో మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాక ఇదే అదునుగా రద్దీగా ఉంటున్న బస్సుల్లో గంజాయిని తరలిస్తున్నట్లు తెలిసింది. అయితే, అసలు సూత్రధారులు దొరకనంత కాలం గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. ఇవి చదవండి: కమీషన్లకు ఆశపడి.. -
స్పైసీ స్పైసీ ఎర్ర చీమల చట్నీ: ఇక వరల్డ్ వైడ్గా మారు మోగనుంది
చీమల పచ్చడి గురించి ఎపుడైనా విన్నారా? ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్, ఒడిశాలోని మయూర్భంజ్లోనూ ఇది ఫ్యామస్. రుచికరమైన చట్నీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజ నాలున్నాయని తాజాగా పరిశోధకులు తేల్చారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్తో సహా జిల్లాలోని ప్రతి బ్లాక్ ఏరియాలోని అడవులలో ఏడాది పొడవునా సమృద్ధిగా కనిపిస్తాయి. ఒడిశాలోని మయూర్భంజ్ ప్రజలు దీన్ని విరివిగా వాడతారు. వీరు తయారు చేసే స్పైసీ స్పైసీ రెడ్ యాంట్ చట్నీకి ఇప్పటికే భిన్నమైన గుర్తింపు లభించడంతో పాటు ఇపుడిక జీఐ ట్యాగ్ కూడా అందుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో రెడ్ యాంట్ చట్నీ ఇక వరల్డ్ వైడ్గా గుర్తింపును తెచ్చుకోనుంది. మయూర్భంజ్ రెడ్ యాంట్ చట్నీకి GI ట్యాగ్ మయూర్భంజ్లోని రెడ్ చట్నీపై చేసిన పరిశోధనలో, శాస్త్రవేత్తలు రెడ్ వీవర్ చీమలను విశ్లేషించారు. ఇందులో ప్రోటీన్, కాల్షియం, జింక్, విటమిన్ బి-12, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, కాపర్, అమినో యాసిడ్లు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పోషకాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులను నివారించవచ్చని గుర్తించారు. రెండ్ యాంట్ చట్నీ కేవలం రుచికి మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దాని వైద్యపరమైన లక్షణాల కారణంగా ఇది స్థానిక ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రకృతితో ముడిపడి ఉన్న ప్రజల పోషకాహార భద్రతకు ఇది చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. స్థానికుల విశ్వాసంతో పాటు, ఈ చట్నీలోని ఔషధ గుణాలను నిపుణులు ఇప్పటికే గుర్తించారు. జ్వరం, జలుబు, దగ్గు, ఆకలిని తగ్గించడానికి, కంటి చూపు, కీళ్ల నొప్పులు, ఆరోగ్యకరమైన మెదడును మెరుగుపరచడంలో సహాయపడుతుందని తేల్చిన సంగతి తెలిసిందే. ఈ చీమల నుండి తయారుచేసిన సూప్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందట. స్థానికంగా చాప్ డా అని పిలిచే ఈ చీమల పచ్చడికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎర్ర చీమల చట్నీ ఎలా తయారు చేస్తారంటే ఈ రెడ్ వీవర్ చీమలను వాటి గుడ్లతో పాటు గూళ్ళ నుండి సేకరించి శుభ్రం చేస్తారు. దీని తరువాత, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, కారం కలిపి, గ్రైండ్ చేయడం ద్వారా చట్నీ తయారు చేస్తారు. ఈ చట్నీ కారం..కారంగా , పుల్లగా ఉంటుంది కానీ చాలా రుచిగా ఉంటుంది. స్థానిక గిరిజనులు తమ ఆహారంలో చేర్చుకుంటారు. ఇందులోని ప్రొటీన్, కాల్షియం, ఫామిక్ యాసిడ్, ఇతర పోషక గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి మారుమూల గిరిజనవాసులకు ఎంతో మేలు చేస్తాయి. ఈ చట్నీ మలేరియా, కామెర్లు తదితర కొన్ని రకాల వ్యాధులను కూడా నయం చేస్తుందని స్థానిక గిరిజనుల విశ్వాసం. అలాగే కొలంబియా, మెక్సికో, బ్రెజిల్లోనూ చీమలను ఆహారంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే OUAT బృందం 2020లో శాస్త్రీయ ఆధారాలతో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపుకోసం చేసిన ప్రయత్నం ఫలించింది. -
అయ్యో.. ఎంత ఘోరం..! ముగ్గురు ఒకేసారి ఇలా..
ఒడిశా: విద్యుత్ తీగలు వారి పాలిట మృత్యు పాశాలయ్యాయి. ఇనుప రాడ్ రూపంలో ప్రాణాలను కబళించాయి. ఎప్పటిలా కాకుండా ముందుగా ప్రారంభిద్దామనుకున్న పనే వారి పాలిట శాపమైంది. విద్యుత్ షాక్ రూపంలో ముగ్గురిని బలి తీసుకుంది. కుటుంబీకులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. హృదయ విదారకమైన ఈ ఘటన సంతకవిటి మండలం సోమన్నపేటలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు.. సంతకవిటి మండలం సోమన్నపేట గ్రామంలో గురువారం విద్యుత్ షాక్కు గురై గ్రామానికి చెందిన పాండ్రంకి కేసరినాయుడు(24), గండ్రేటి చంద్రశేఖర్(18), దూబ రెయ్యమ్మ(57) మృతి చెందారు. పాండ్రంకి రామినాయుడు ఇంటి మొదటి అంతస్తు నిర్మాణ పనుల్లో భాగంగా అతని కుమారుడు కేసరినాయుడు, అదే గ్రామానికి చెందిన అతని స్నేహితుడు గండ్రేటి చంద్రశేఖర్ను పనికి పిలిచి డాబా ఎక్కారు. ఆ సమయంలో డాబా మీద ఉన్న 12 ఎంఎం ఇనుప రాడ్ను డాబా వెనుక వైపు నెట్టగా, డాబాకు కొద్ది దూరంలో ఉన్న 230 ఓల్ట్స్ విద్యుత్ సరఫరా తీగలకు రాడ్ తగలడంతో రాడ్ను పట్టుకున్న ఇద్దరు యువకులు పెద్దగా కేకలు వేస్తూ మృతి చెందారు. డాబా మీద యువకుల అరుపులను ఎదురుగా ఉన్న అంగన్వాడీ ఆయా దూబ రెయ్యమ్మ విని వెంటనే డాబా పైకి వెళ్లి పొరపాటున ఇనుప చువ్వను ముట్టుకోవడంతో ఈమె కూడా మృతి చెందింది. ఈ విషయాన్ని గమనిస్తున్న ఒకరిద్దరు ఏదో జరుగుతుందని ఊహించి డాబా ఎక్కకుండా పొలాల్లో ఉన్న కుటుంబీకులకు సమాచారం అందించారు. గ్రామంలోకి వచ్చిన కిరాణా సరుకుల రవాణా వ్యాపారి డోల ప్రసాద్ డాబా వెనుక వైపునకు వెళ్లి ఇనుప రాడ్ స్ట్రీట్ లైన్ విద్యుత్ తీగలకు తగిలి ఉండడాన్ని గమనించి ఎలక్ట్రికల్ ఏఈకి వెంటనే ఫోన్ చేసి విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయించారు. అనంతరం డాబా ఎక్కి ముగ్గురు పడి ఉండడాన్ని గమనించి వారిని కిందకు దించారు. ముగ్గురిలో చంద్రశేఖర్ కొన ఊపిరితో ఉన్నాడనే అనుమానం రావడంతో వెంటనే ప్రైవేట్ వాహనంలో సంతకవిటి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో తిరిగి గ్రామానికి తీసుకొచ్చారు. వీఆర్వో కనకమ్మ ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా రాజాం రూరల్ సీఐ సీహెచ్ ఉపేంద్ర, సంతకవిటి ఎస్ఐ బి.లోకేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం రాజాం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించి అనంతరం బంధువులకు అప్పగించారు. జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఎంపీ, ఎమ్మెల్యేల సంతాపం.. సోమన్నపేట గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధించి రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత పొగిరి సత్యంనాయుడుతో పాటు సంతకవిటికి చెందిన జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరో వైపు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఈ ఘటనపై మృతుల కుటుంబాలకు సానుభూతి తెలపడంతో పాటు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని సూచించారు. ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్లో జరగకుండా చర్యలు చేపట్టాలని ఎలక్ట్రికల్ అధికారులకు ఆదేశించారు. సంఘటనా స్థలానికి విద్యుత్ శాఖ రాజాం డీఈఈ జీవీ రమణ, ఏఈలు కుమార్, సయ్యద్లు చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. ముగ్గురి జీవితాల విషాద గాధ.. ఈ ఘటనలో మృతి చెందిన పాండ్రంకి కేసరినాయుడు తల్లి చిన్నమ్మడు ఆరు నెలలు క్రితమే మృతి చెందింది. కేసరినాయుడుతో పాటు తండ్రి రామినాయుడు, సోదరుడు కోటిబాబు కలసి ఉంటున్నారు. కేసరినాయుడు డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటూ తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తున్నాడు. అన్నయ్య విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఊరికి వచ్చిన తన సోదరుడు బుధవారం విశాఖపట్నం వెళ్లిపోయాడు. ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. ఆరు నెలల వ్యవధిలో తల్లీకొడుకులు మృతి చెందడం స్థానికులను కన్నీరు పెట్టించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన గండ్రేటి చంద్రశేఖర్ కుటుంబానిది మరో విషాద గాధ. గండ్రేటి కేసరి, సూరీడమ్మలకు చంద్రశేఖర్ ఒక్కడే కుమారుడు. ఒక్కగానొక్క కుమారుడిని అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తల్లిదండ్రులు రాజాంలో నాగావళి ఐటీఐలో ఫిట్టర్ కోర్సులో చేర్పించారు. గురువారం కళాశాల ఉన్నప్పటకీ స్నేహితుడు కేసరినాయుడు ఇంటి పనికి వచ్చాడు. మృత్యువులో కూడా స్నేహితునితో కలసి వెళ్లిపోయాడు. తమ కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక ఆ తల్లిదండ్రులు మాకెందుకు ఈ జీవితం అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన దూబ రెయ్యమ్మ ఒక్కర్తే ఉంటున్నారు. ఈమెకు భర్త లేరు. గ్రామంలో అంగన్వాడీ ఆయాగా ఉంటూ కాలం నెట్టుకొస్తుంది. ఈమెకు ఒక్క కుమార్తె భవానీ కాగా ఆమెకు పెళ్లి చేసి, తానొక్కర్తే జీవనం సాగిస్తుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు ఏమి జరిగిందో తెలుసుకుని వారిని కాపాడేందుకు డాబా ఎక్కి మృత్యువాత పాడింది. ఈమె మృతిని కుమార్తె జీర్ణించుకోలేక బోరున విలపిస్తుంది. మిగిలిన వారి ప్రాణాలు కాపాడిన ఆ ముగ్గురు.. ఇదిలా ఉండగా ఈ ఘటనలో మరింత మంది మృత్యువాత పడే ప్రమాదం ఘటనా స్థలంలో నెలకొంది. అయితే విద్యుత్ ఎర్త్ అవుతుందని అనుమానం వచ్చిన స్థానికురాలు నగిరి పద్మ మిగిలిన వారిని డాబా ఎక్కనీయకుండా అడ్డుకుంది. లేకుంటే మరో ఒకరిద్దరు ప్రాణాలు కోల్పోయి ఉండేవారు. గ్రామంలోకి వచ్చిన కిరాణా రవాణా వ్యాపారి డోల ప్రసాద్ డాబా ఎక్కుతుండగానే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవుతుందని గమనించి డాబా వెనుక వైపు వెళ్లి స్ట్రీట్ లైన్కు ఇనుపరాడ్ డాబా మీద నుంచి ఉన్నట్లు గుర్తించి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలుపుదల చేయించి ప్రాణ నష్టాన్ని నివారించాడు. ఇంకో వైపు విద్యుత్ తీగలు మధ్య ఉన్న రాడ్ను గ్రామానికి చెందిన ఆబోతుల అప్పారావు గుర్తించి, వెంటనే అక్కడకు వచ్చి ఎదురు కర్రతో రాడ్ను తొలగించి పెద్ద ప్రమాదాన్నే తప్పించారు. లేకుంటే విద్యుత్ సరఫరా డాబా మీదకు వస్తుందని చెబుతున్నప్పటకీ కొంతమంది ఆత్రుతతో డాబా ఎక్కే ప్రయత్నం చేశారు. ఇనుప రాడ్ విద్యుత్ తీగల నుంచి తప్పించకుంటే ప్రమాదం ఇంకా పెద్దదయ్యేది. మరింత ప్రాణ నష్టం జరిగేది. -
ఒడిశా రైలు ప్రమాదం.. 3 నెలల ముందుగానే హెచ్చరిక
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికిగల కారణాలు దర్యాప్తు రిపోర్టు వచ్చిన తరువాత వెల్లడికానున్నాయి. అయితే ఈ విషయమై ఒక అధికారి రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ లేఖలో ఆ రైల్వే అధికారి రాబోయే ప్రమాదాన్ని 3 నెలల ముందుగానే ఊహించి, ఉన్నతాధికారులకు తెలియజేశారు. సిగ్నల్ సిస్టమ్లోని లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. హరిశంకర్ వర్మ అనే ఈ రైల్వే అధికారి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో విధులు నిర్వహిస్తున్నారు. దీనికి ముందు ఆయన పశ్చిమ మధ్య రైల్వేలో పనిచేశారు. అప్పుడు ఆయన ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో దక్షిణ పశ్చిమ రైల్వేలో రైలు మరో లైనులో వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఇంటర్లాకింగ్ కోసం తయారు చేసిన సిస్టమ్ను బైపాస్గా మార్చినపుడు లొకేషన్ బాక్సులో జరిగిన గడబిడ గురించి ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిని తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా ఆయన రైల్వే బోర్డుకు తెలియజేశారు. అలాగే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని కూడా పేర్కొన్నారు. ఈ సిస్టమ్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, రైలు బయలుదేరిన తరువాత డిస్పాచ్ రూట్ మారిపోతున్నదని పేర్కొన్నారు. సిగ్నల్కు సంబంధించిన కీలకమైన పనులు కింది ఉద్యోగుల చేతుల్లో ఉన్నాయని, దీనివలన అనుకోని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదం విషయానికి వస్తే రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ట్రైన్ నంబర్12481 కోరమండల్ ఎక్స్ప్రెస్ బహన్గా బాజార్ స్టేషన్కు చెందిన మెయిన్ లైన్లోవెళుతోంది. ఇంతలో అది పట్టాలు తప్పి లూప్లైన్లో నిలిచివున్న గూడ్సు రైలును ఢీకొంది. ఆ సమయంలో రైలు ఫుల్ స్పీడులో ఉంది. ఫలితంగా ఆ రైలుకు సంబంధించిన 21 కోచ్లు పట్టాలు తప్పాయి. మూడు కోచ్లు డౌన్లైన్లోకి చేరుకున్నాయి. నిజానికి బహన్గా బాజార్ స్టేషన్లో ఈ ట్రైన్కు స్టాపేజీ లేదు. అందుకే ఈ రైలు స్పీడుగా వెళ్లి గూడ్సును ఢీకొన్నప్పుడు దాని మూడు కోచ్లో డౌన్లైన్లోకి చేరుకోగా.. అటువైపుగా వస్తున్న యశ్వంత్పూర్- హౌరా ఎక్స్ప్రెస్కు చెందిన రెండు బోగీలు పట్టాలపై ఉన్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ బోగీలను ఢీకొన్నాయి. ఈ ప్రమాదం భువనేశ్వర్ రైల్వేస్టేషన్కు సుమారు 171 కిలోమీటర్లు, ఖగర్పూర్ రైల్వేస్టేషన్కు సుమారు 166 కిలోమీటర్ల దూరంలోని బాలాసోర్ జిల్లాలోని బహన్గా బాజార్ స్టేషన్ వద్ద జరిగింది. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: అయినవారి ఆచూకీ తెలియక.. -
బాలాసోర్ రైలు ప్రమాదం: ‘కూతురి మొండితనమే ప్రాణాలు నిలబెట్టింది’
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదాన్ని ఎవరూ అంత త్వరగా మరచిపోలేరు. ప్రమాదంలో కొందరు ఇంటిలోనివారిని కోల్పోగా, మరికొందరు క్షతగాత్రులుగా మిగిలారు. దీనికి భిన్నంగా కొందరు విచిత్ర పరిస్థితుల్లో ప్రాణాలతో బతికి బయటపడ్డారు. అటువంటి కథనం ఒకటి వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే తన 8 ఏళ్ల కుమార్తెతో పాటు ఒక తండ్రి కోరమండల్ ఎక్స్ప్రెస్లో కటక్ వెళ్లేందుకు బయలుదేరారు. వారు కరగ్పూర్లో రైలు ఎక్కారు. వారికి థర్డ్ ఏసీలో సీటు రిజర్వ్ అయ్యింది. అయితే వారికి కిటికీ దగ్గరి సీటు లభ్యం కాలేదు. అయితే కుమార్తె తనకు కిటికీ దగ్గరి సీటు కావాలని మొండిపట్టు పట్టింది. తండ్రి ఎంత నచ్చజెప్పినా ఆ చిన్నారి మాట వినలేదు. దీంతో ఆ తండ్రి టీసీని సంప్రదించి, కిటికీ దగ్గరి సీటు కావాలని రిక్వస్ట్ చేశారు. దీనికి టీసీ సమాధానమిస్తూ మీరు మరో ప్రయాణికుని అడిగి వారి సీటు అడ్జెస్ట్ చేసుకోండని సలహా ఇచ్చారు. దీంతో ఆ తండ్రి మరో కోచ్లోని ఇద్దరు ప్రయాణికులను రిక్వస్ట్ చేయడంతో వారు అందుకు అంగీకరించారు. దీంతో ఆ తండ్రీకుమారులు ఆ రెండు సీట్లలో కూర్చున్నారు. కొద్దిసేపటికి వారు ప్రయాణిస్తున్న రైలు బాలాసోర్ చేరుకున్నంతలోనే ప్రమాదానికి గురయ్యింది. ఆ తండ్రీకూతుర్లు కూర్చున్న కోచ్కు ఈ ప్రమాదంలో ఏమీకాలేదు. అయితే అంతకుమందు వారికి కేటాయించిన సీట్లు కలిగిన బోగీ తునాతునకలైపోయింది. ఆ బోగీలోని చాలామంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం బారి నుంచి బయటపడిన ఆ తండ్రి పేరు ఎంకే దేవ్. అయిన మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె మొండితనం వలనే ఈరోజు తాము ప్రాణాలతో బయటపడగలిగామన్నారు. కాగా అతని కుమార్తె చేతికి స్వల్పగాయమయ్యింది. ఆ చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: ‘ ట్రైన్ టాయిలెట్లో ఉన్నాను... ఒక్క కుదుపుతో..’ -
‘ ఒక పెద్ద కుదుపు.. అంతా అయిపోయింది’
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన భయానక రైలు ప్రమాదం అందరిలోనూ దడ పుట్టించింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకూ 275 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మృత్యుముఖాన్ని చూసి, ప్రాణాలతో బతికి బట్టకట్టారు. అలాగే ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారు కూడా చాలామంది ఉన్నారు. వీరు ఈ ఘటనను మరువలేకపోతున్నామని చెబుతున్నారు. బాలేశ్వర్కు చెందిన జితేంద్ర నాయక్ ఈ ఘటనను ప్రత్యక్షంగా చూశారు. ఆయన ఈ దుర్ఘటన సంభవించిన సమయంలో తనకు ఎదురైన అనుభూతిని మీడియాకు తెలిపారు. జితేంద్ర నాయక్ మీడియాతో మాట్లాడుతూ ‘ నేను ఆ సమయంలో కోరమాండల్లోని జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నాను. ఆ బోగీలో 100 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. దీంతో బోగీ రద్దీగా మారింది. బోగీలో నేను కింద కూర్చున్నాను. రైలు ముందుకు కదిలిన కొద్దసేపటికే రైలులో వైబ్రేషన్ మొదలయ్యింది. ట్రైన్ అటుఇటు కదులుతున్నట్లు అనిపించింది. కొన్ని నిముషాల తరువాత హఠాత్తుగా పెద్ద కుదుపు వచ్చింది. దాని తరువాత ఏమయ్యిందో తెలియలేదు. చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’ రైలు అంతా పొగమయంగా మారిపోయింది. కళ్లు నులుముకుని చూసే సరికి, కొందరు చేతులు తెగి పడినవారు, కాళ్లను కోల్పోయినవారు, ముఖం, శరీరంపై తీవ్ర గాయాలయినవారు కనిపించారు. నేను రైలులో నుంచి ఎలాగోలా బయటకు వచ్చాను . అప్పుడు నాకు కొత్త జీవితం దొరికినట్లు అనిపించింది. ఆ సమయంలో నన్ను ఎవరూ కాపాడలేదు. నేనే అతి కష్టం మీద శిధిలాల నుంచి బయటపడ్డాను. ఆ సమయంలో చాలామంది క్షతగాత్రులు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. నేను ప్రయాణించిన జనరల్ బోగీలోని ప్రయాణికులెవరూ బతికివుండే అవకాశం లేదు. భగవంతుడు నాకు నూతన జీవితాన్ని ప్రసాదించాడు. అందుకు నేను భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు. -
ఒకే కుటుంబంలోని ముగ్గురు సోదరులు మృతి
ఒడిశాలో చోటుచేసుకున్న రైలు ప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. పలు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. కొన్ని కుటుంబాలు ఇంటికి పెద్ద దిక్కును కోల్పోగా, మరికొన్ని కుటుంబాల్లో ఎదిగొచ్చిన పిల్లలు అకాల మృత్యువు పాలయ్యారు. అలాంటి ఉదంతం ఒకటి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఉపాధి కోసం పశ్చిమ బెంగాల్కు చెందిన ముగ్గురు సోదరులు రైలులో తమిళనాడు బయలుదేశారు. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వీరు దుర్మరణం పాలయ్యారు. వీరిని 24 పరగణా జిల్లాలోని చర్నీఖలీ గ్రామానికి చెందిన హరన్ గోయెన్(40) నిశికాంత్ గోయన్(35) దివాకర్ గోయెన్(32)గా గుర్తించారు. వీరు ఏడాదిలో చాలాకాలం తమిళనాడులోనే ఉంటూ, అక్కడ దొరికిన పనులు చేస్తుంటారు. ఇటీవలే వీరు స్వగ్రామానికి వచ్చారు. కొన్నాళ్లు ఉన్నాక తిరిగి తమిళనాడు వెళ్లేందుకు కోరమండల్ ఎక్స్ప్రెస్లో బయలుదేరారు. రైలు ప్రమాదంలో ఈ ముగ్గురు సోదరులు మరణించారనే వార్త తెలియగానే వారి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు సోదరులలో ఒకరైన హరన్ భార్య అంజిత చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇప్పుడు ఆమె గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. మృతి చెందిన ముగ్గురు సోదరుల తమ్ముడు ఇటీవలే ఒక హోటల్లో పనిలో చేరాడు. తండ్రిలేని ఈ కుటుంబానికి దిక్కు లేకుండా పోయిందని స్థానికులు విలపిస్తున్నారు. నిశికాంత్ కుటుంబం విషయానికొస్తే ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా పశ్చిమ బెంగాల్కు చెందిన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రైలు ప్రమాదంలో 24 పరగణా జిల్లాకు చెందిన 12 మంది మృతి చెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. 110 మంది ఆచూకీ తెలియడం లేదు. ఇప్పుటి వరకూ 16 మంది బాధితులు వారి ఇళ్లకు చేరుకున్నారు. -
మానవత్వం మరచిన అంబులెన్స్ డైవర్లు!
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో బీహార్లోని మోతిహర జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మృతి చెందాడు. జిల్లాకు చెందిన పలువురు గాయాలపాలయ్యారు. కాగా మృతుడు చికనీ గ్రామానికి చెందిన భూలన్ పటేల్ పెద్ద కుమారుడు రాజా కుమార్ అని చెబుతున్నారు. మృతుడు పెయింటింగ్ పనులు చేస్తుంటాడని, ఈ పనుల కోసమే వేరే ప్రాంతం వెళ్లాడని సమాచారం. ఇదే గ్రామానికి చెందిన 9మంది రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరు స్వయంగా ఫోను చేసి, కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు. కాగా రాజా కుమార్ మరణవార్త తెలియగానే గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుని తల్లి, భార్యల రోదనలు మిన్నంటాయి. రాజా కుమార్కు రెండు సంవత్సరాల క్రితమే వివాహమయ్యింది. ఆ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే రాజా కుమార్ మృతదేహం ఇంకా గ్రామానికి చేరుకోలేదు. మృతదేహాన్ని గ్రామం వరకూ తీసుకురావాలంటే అంబులెన్స్ డ్రైవర్ రూ. 45 వేలు అడుగుతున్నాడని మృతుని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజా కుమార్ తల్లి మాట్లాడుతూ తమ కుటుంబ బాధ్యత రాజానే చూసుకుంటున్నాడని తెలిపారు. కేరళలో పని చేస్తూ తమ కుటుంబాన్ని పోషిస్తున్నాడన్నారు. రూ. 45 వేలు చెల్లించి కుమారుని మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చేంతటి స్థోమత తమకు లేదని ఆమె వాపోయింది. మృతుని తండ్రి భవన్ పటేల్ మాట్లాడుతూ తమ కుమారుని మృతదేహన్ని ఇక్కడికి తీసుకువచ్చేందుకు గ్రామస్తులు చందాలు సేకరిస్తున్నారన్నారు. ఒడిశాలో జరిగిన ఈ రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య తాజాగా 288కి చేరింది. 900 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయని సమాచారం. స్థానికంగా ఉన్న పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం చూస్తే ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు అంచనావేస్తున్నారు. కాగా ఎన్డీఆర్ఎఫ్, రైల్వే, ఇతర శాఖల సిబ్బంది క్రేన్లు, బుల్డోజర్లు, గ్యాస్ కట్టర్ల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదానికి గురైన రెండు రైళ్ల ఇంజిన్ డ్రైవర్లు, గార్డులకు తీవ్ర గాయాలయ్యాయని, వారికి చికిత్స అందిస్తున్నట్టు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. కాగా ఈ ఘటనలో గూడ్స్ రైలు డ్రైవర్, గార్డుకు ఎటువంటి గాయాలు కాకపోవడం విశేషం. -
కోరమండల్ ఎక్స్ప్రెస్కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..
జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అత్యంత ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఒక గూడ్సు రైలును వెనుక నుంచి కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కోరమండల్ ఎక్స్ప్రెస్కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పి, పక్కనున్న ట్రాక్పైకి దొర్లాయి. ఆ సమయంలో ఆ ట్రాక్ మీదుగా యశ్వంత్పూర్-హౌరా ఎక్స్ప్రెస్ వెళ్తోంది. అవి యశ్వంత్పూర్-హౌరా ఎక్స్ప్రెస్ను ఢీకొన్నాయి. దాంతో ఈ ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. అయితే గూడ్సును కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొనడమే ఘటనకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. అయితే కోరమండల్ ఎక్స్ప్రెస్కు ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. కోరమండల్ ఎక్స్ప్రెస్ హౌరాలోని షాలీమార్ స్టేషన్ నుంచి చెన్నై వరకూ నడుస్తుంది. ఈ రైలు ప్రతిరోజూ నడుస్తుంది. అలాగే నాలుగు రాష్ట్రాల మీదుగా అంటే పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల గుండా ప్రయాణిస్తుంది. కోరమండల్ తీరం అనేది భారత్కు ఆగ్నేయ తీరం. కోరమండల్ తీరం వెంబడి నడుస్తున్నందునే ఈ ఎక్స్ప్రెస్ రైలుకు ఈ పేరు వచ్చింది. ఈ రైలులో ప్రయాణించేవారు కోరమండల్ తీరంలోని సుందర దృశ్యాలను తిలకించవచ్చు. ఈ మార్గంలో దట్టమైన అడవులతో పాటు పలు చారిత్మాక, సాంస్కృతిక స్థలాలు కూడా దర్శనమిస్తాయి. కోరమండల్ తీరం సుమారు 22,800 చదరపు కిలోమీటర్ల మేరకు వ్యాప్తిచెందింది. ఇది సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తులో ఉంది. కోరమండల్ తీరం వ్యవసాయానికి కూడా ఎంతో పేరుగాంచింది. ఈ ప్రాంతంలో వరితో పాటు వివిధ రకాల పప్పు ధాన్యాలు కూడా పండుతాయి. చెరకు పంట కూడా పండుతుంది. అలాగే చేపల పెంపకం, షిప్పింగ్ లాంటి పరిశ్రమలకు నెలవుగా ఉంది. -
మలేసియాలో ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి గ్రామానికి: రారాజులా లాభాల పంట
విదేశంలో ఉద్యోగం.. ఐదెంకల ఐటీ ఉద్యోగం. అయినా ఇవేవీ సంతోషాన్ని ఇవ్వలేదు. అందుకే లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి తనకెంతో ఇష్టమైన రైతుగా మారి పోయాడు. మలేషియాలో ఉద్యోగానికి బైబై చెప్పేసి ఆర్గానిక్ ఫామింగ్ (సేంద్రీయ వ్యవసాయం) ద్వారా లక్షలు సంపాదిస్తున్నాడు. ఒడిశాలోని రాయగడ జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సత్య ప్రబిన్ వినూత్న వ్యవసాయ పద్ధతులతో విజయం సాధించి సమాజానికి ప్రేరణగా నిలుస్తున్నాడు. బీటెక్ పూర్తి చేసిన సత్య, మలేషియా ఐటీ కంపెనీలో టెకీగా 11 ఏళ్లు పని చేశాడు. నెలకు రూ.2 లక్షల వేతనం సౌకర్య వంతమైన జీవితం. అయినా అతనికి వ్యవసాయం మీద ఉన్న మక్కువ పోలేదు. ముఖ్యంగా తన చిన్నతనంలో తండ్రి జీవనోపాధి కోసం కూరగాయలు పండించేవారు. అది అతని మనసులో ఎపుడూ మెదులుతూ ఉండేది. వన్ ఫైన్ మార్నింగ్ ఇక ఉద్యోగాన్ని వదిలేసి గ్రామానికి వెళ్లి వ్యవసాయాన్ని మొదలు పెట్టాలనుకున్నాడు. క్షణం ఆలస్యం చేయ కుండా చకచకా పనులన్నీ చక్క బెట్టుకుని తనకున్న అభిరుచుని నెరవేర్చుకునేందుకు రంగంలోకి దిగిపోయాడు. 2020లో సొంత గ్రామానికి వచ్చేసి 34 ఎకరాల భూమిలో డ్రిప్ సిస్టమ్, సేంద్రీయ ఎరువులు వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం ప్రారంభించాడు. అంతే నమ్ముకున్న భూమి అతనికి గొప్ప విజయాన్ని అందించింది. సేంద్రీయ పద్ధతుల్లో భూమి సారాన్ని కాపాడుకుంటూ, వ్యవసాయంలో చక్కటి ఫలాలను అందుకుంటూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలిచాడు. సంకల్పం, పట్టుదల, వ్యవసాయంపై మక్కువతో కష్టపడి పనిచేస్తే విజయం తప్పక వరిస్తుందని ఆయన చేసి చూపించాడు. రైతుగా సత్య సాధించిన విజయాలు సమాజంలోని ఇతరులకు ఆదర్శంగా నిలవడమే కాదు ఆయన వ్యవసాయ విధానం అద్వితీయంగా, వినూత్నంగా ఉండడంతో స్థానికుల అభిమానాన్ని, అధికారుల దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు తన గ్రామం, చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 60 మందిని ఎంచుకుని వ్యవసాయాన్ని ముందుకు నడిపించాడు. తద్వారా అనేక కుటుంబాలకు అండగా నిలబడటమే కాదు, స్థానిక ఆర్థికవ్యవస్థకుగణనీయమైన ఎనలేని సహకారాన్ని అందించాడు. కలెక్టర్లు, ఇతర స్థానిక ఉ ఉన్నతాధికారులు పలువురి ప్రశంసలందుకున్నాడు. చుట్టుపక్కల సన్నకారు రైతులంతా సత్యను ఆదర్శంగా తీసుకుని సేంద్రియ ఎరువులతో తమ భూమిలో కూరగాయలు పండించి స్వయం సమృద్ధి సాధించి ఆర్థికస్థితిని మెరుగు పరుచుకోవాలని పిలుపునిచ్చారు. సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలతో అందరి ఆరోగ్యానికి తోడ్పటమే కాదు, స్థానికి ఆర్థిక పరిపుష్టికి తన వంతు సాయం అందించడం విశేషంగా నిలిచింది. వ్యవసాయంలో రారాజుగా నిలవాలన్న ఆత్మవిశ్వాసమే ఆయనను ఈరోజు విజయ వంతమైన రైతుగా నిలబెట్టి, ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలిచింది. -
ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే?
సాక్షి, ముంబై: దేశీయ ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. తన నెలవారీ రీచార్జ్ ప్లాన్ ఏకంగా 57 శాతం పెంచేసింది. తన కనీస రీఛార్జ్ ధర 28 రోజుల మొబైల్ఫోన్ సర్వీస్ ప్లాన్ ధరను సుమారు 57 శాతం పెంచి రూ. 155కి పెంచినట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇదీ చదవండి: వన్ప్లస్ ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే లక్కీ చాన్స్! కంపెనీ వెబ్సైట్ ప్రకారం కంపెనీ రూ.99 కనీస రీఛార్జ్ ప్లాన్ను నిలిపివేసింది. ఇప్పుడు అపరిమిత కాలింగ్, 1 జీబీ డేటా, 300 SMSలతో రూ.155 ప్లాన్ను ప్రారంభించింది. అయితే ఈ ప్లాన్ హరియాణా, ఒడిశాలకు పరిమితమైన ఈ కొత్త ప్లాన్ను మిగిలిన ప్రదేశాల్లో కూడా అమలు చేయనుందనే ఆందోళన యూజర్లలో నెలకొంది. అటు తొలుత ట్రయల్గా లాంచ్ చేసిన ఈ ప్లాన్ను భారతదేశం అంతటా విడుదల చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో, 2021లో ఎంపిక చేసిన సర్కిల్లలో కనీస రీఛార్జ్ ఆఫర్ను రూ.79 నుండి రూ.99కి పెంచినప్పుడు కంపెనీ ఇదే తరహా విధమైన కసరత్తు (మార్కెట్-టెస్టింగ్) చేసిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక పేర్కొంది. ఇది చదవండి: ‘రస్నా’ ఫౌండర్ కన్నుమూత, ‘మిస్ యూ’ అంటున్న అభిమానులు -
ఒడిస్సా: ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన గూడ్స్ రైల్..
-
75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్ , బిగ్ ఇన్వెస్టర్గా అదానీ
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ.74,620 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు. మేకిన్ ఒడిశా చొరవలో భాగంగా వీటికి ఒడిశా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో 24వేలమందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా. ఒడిశా ప్రభుత్వం ఆమోదించిన 10 పారిశ్రామిక ప్రాజెక్టులలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, మెటల్, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులున్నాయి. అలాగే టాటా గ్రూప్, అదానీ గ్రూప్ , ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ పెద్ద పెట్టుబడిదారులుగా ఉన్నాయి. (Moto G62 5G:మోటో కొత్త 5జీ స్మార్ట్ఫోన్, స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే?) బిగ్ ఇన్వెస్టర్గా అదానీ 7,750 మందికి ఉపాధి అవకాశాలను కల్పించే రూ. 41,653 కోట్ల పెట్టుబడితో కాశీపూర్లో 4.0 MTPA అల్యూమినా రిఫైనరీ, 175 MW CPP ప్లాంట్ను ఏర్పాటు చేయాలన్న అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రతిపాదనను కమిటీ ఆమోదించింది. టాటా స్టీల్ పారాదీప్లో రూ.2,000 కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ (20 కేటీపీఏ), గ్రీన్ అమ్మోనియా (100 కేటీపీఏ) ప్లాంట్ల ఏర్పాటు ప్రతిపాదనకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్లాంట్ల వల్ల 2,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ ప్లాంట్లు రాష్ట్రంలోని ఉక్కు, ఎరువుల రంగాల డిమాండ్ను తీర్చడంతో పాటు పర్యావరణంపై కూడా సానుకూల ప్రభావం చూపుతాయని ఒడిశా సర్కార్ ప్రకటించింది. "విజన్ 2030’’ కి ఊతమిచ్చేలా మెటల్ సెక్టార్లో డౌన్స్ట్రీమ్ యూనిట్ల అభివృద్ధికి ప్రోత్సాహాన్నిస్తున్నట్టు తెలిపింది. వెయ్యి కోట్ల పెట్టుబడితో 60,000 MT పారిశ్రామిక నిర్మాణం, 6,000 MT స్టీల్ ప్లాంట్ పరికరాల సౌకర్యాల ఏర్పాటుకు టాటా స్టీల్ ఆమోదం పొందింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2,451 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. జగత్సింగ్పూర్, రాయగడ, జాజ్పూర్, భద్రక్, కెందుఝర్, కటక్ , మయూర్భంజ్లలో ఈ ప్రాజెక్టులు అమలు కానున్నాయి. కళింగలో 2.5 MTPA స్టీల్ ప్లాంట్, 370 MW CPP ప్లాంట్ను కూడా ఒరిస్సా అల్లాయ్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 8,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసి 5,000 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది .డాల్కీలో 6 MTPA బెనిఫికేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్రతిపాదనను ,1,490 కోట్ల రూపాయల పెట్టుబడితో డాల్కీలోని డబునా స్లరీ పంపింగ్ స్టేషన్ యూనిట్కు ప్రతిపాదిత ప్లాంట్ నుండి 12 MTPA స్లర్రీ పైప్లైన్ను కూడా కమిటీ ఆమోదించింది. దీని 600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సోంపురి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 24 MTPA పెల్లెట్ ప్లాంట్ మరియు 6 MTPA ఫిల్టర్ కేక్, ఆర్తి స్టీల్స్ ద్వారా స్టీల్ ప్లాంట్ విస్తరణ కూడా ప్రభుత్వం ఆమోదించిన కొన్ని ఇతర ప్రాజెక్టులుగా ఉండనున్నాయి. అయితే అదానీ గ్రూప్కు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ ఆమోదం పొందిందని వార్తలు వెలువడ్డాయి. ఆసియాలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ వేగంగా విస్తరిస్తున్న తన సామ్రాజ్యానికి మరో ప్రాజెక్టును చేర్చనున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఒడిశాలో అల్యూమినా రిఫైనరీని ఏర్పాటు చేయడానికి 5.2 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని పలు ఊహాగానాలొచ్చాయి. The High-Level Clearance Authority under the chairmanship of CM @Naveen_Odisha approved 10 industrial projects worth ₹74,620 Cr with an employment potential of 24,047. The approved projects include Metal & Metal Downstream, Green Hydrogen, Green Ammonia & Industrial Structure. pic.twitter.com/WdAY3RguP9 — CMO Odisha (@CMO_Odisha) August 10, 2022 -
చివరి వరకు వెనుకబడి.. ఆఖర్లో అద్భుతం
భువనేశ్వర్: ప్రొ హాకీ లీగ్లో భాగంగా స్పెయిన్ పురుషుల జట్టుతో శనివారం జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు అద్భుతం చేసింది. ఒక దశలో 1–4తో వెనుకబడి ఓటమి ఖాయమనుకున్న స్థితి నుంచి టీమిండియా అనూహ్యంగా తేరుకుంది. వరుసగా నాలుగు గోల్స్ సాధించి చివరకు 5–4తో విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మరో ఎనిమిది సెకన్లలో ముగుస్తుందనగా హర్మన్ప్రీత్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్ను లక్ష్యానికి చేర్చి భారత్ను గెలిపించాడు. భారత్ తరఫున హర్మన్ప్రీత్ సింగ్ (15వ, 60వ ని.లో) రెండు గోల్స్ చేయగా... శిలా నంద్ లాక్రా (41వ ని.లో), షంషేర్ సింగ్ (43వ ని.లో), వరుణ్ కుమార్ (55వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. స్పెయిన్ జట్టుకు కెప్టెన్ మార్క్ మిరాలెస్ (20వ, 23వ, 40వ ని.లో) మూడు గోల్స్, పౌ కునిల్ (14వ ని.లో) ఒక గోల్ అందించారు. మహిళల జట్టూ గెలిచింది... మహిళల ప్రొ హాకీ లీగ్లో భాగంగా స్పెయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు 2–1తో విజయం సాధించింది. ఆట 18వ నిమిషంలో మార్టా సెగూ గోల్తో స్పెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 20వ నిమిషంలో జ్యోతి గోల్తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. అనంతరం 52వ నిమిషంలో నేహా చేసిన గోల్తో భారత్ 2–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. ప్రొ లీగ్లో భారత్కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. ఇటీవల ఒమన్లో చైనాతో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ భారత్ గెలుపొందింది. -
యాస్ తుపాను: మూడు రాష్ట్రాలకు వెయ్యి కోట్ల తక్షణ సాయం
న్యూఢిల్లీ: ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పర్యటించారు. ఒడిశాలోని భద్రాక్ బాలేశ్వర్ జిల్లాల్లో, పశ్చిమ బెంగాల్లోని పూర్బా మెడినిపూర్లో తుపాను ప్రభావిత ప్రాంతాలలో నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే చేపట్టారు. అనంతరం ఒడిశా, బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు తక్షణ సహాయక చర్యల కింద రూ.1,000 కోట్ల ఆర్ధిక సహాయం ప్రకటించారు. భువనేశ్వర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పునరావాస చర్యలకు సంబందించి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాస్ తుపాను కారణంగా గరిష్ట నష్టం ఒడిశాలో జరిగిందని, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలు కూడా ప్రభావితమైనట్లు ప్రధానికి అధికారులు వివరించారు. ఇందులో ఒడిశాకు రూ.500 కోట్లు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు కలిపి రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు మోదీ ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని, ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, పునర్నిర్మాణానికి అవసరమయ్యే అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. తుఫాను కారణంగా బాధపడుతున్న వారందరికీ ప్రధాని తన సంపూర్ణ సంఘీభావం తెలిపారు. తుఫాను కారణంగా తుపాను వల్ల చనిపోయినవారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సందర్శించడానికి ఒక మంత్రి బృందాన్ని నియమించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఆ కేంద్ర బృందం నివేదిక ఇచ్చిన ఆధారంగా మరింత సహాయం అందించనున్నట్లు తెలిపింది. చదవండి: యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే -
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు సీఎం వైఎస్ జగన్ లేఖ
-
పొలిమేరలో ఉన్న సమీప బంధువు ఇంటికి తీసుకెళ్లి..
తననే నమ్ముకొని ఏడడుగులు వేసి ... మూడు ముళ్లు వేయించుకొని కోటి ఆశలతో పుట్టినింటిని వీడి అత్తవారింట అడుగు పెట్టింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే భార్యను కిరాతకంగా కొట్టి ... పీక నులిమి హత్య చేశాడు. తప్పించుకుందామని పరారైన నిందితులు ఎట్టకేలకు చట్టం చేతికి చిక్కారు. రామభద్రపురం: భార్యను హత్య చేసి పరారైన నిందితుడు ఎట్టకేలకు అరెస్టయ్యాడు. మండలంలోని రావివలస పంచాయతీ పరిధిలోని మూలసెగాం గ్రామానికి చెందిన ఎన్నికల ఎర్రమ్మ (30)ను భర్త పెంటయ్య గత నెలలో హత్య చేసి కొండల్లోని లోయల్లో పడేసి పరారైన సంఘటన తెలిసిందే. ఎట్టకేలకు ఈ కేసును పోలీసులు ఛేదించి సోమవారం నిందితుడితోపాటు అతనికి సహకరించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలు ప్రకారం... నిందితుడు పెంటయ్య ఫిబ్రవరి 23న అతని చెల్లి ఇంటికి పాచిపెంట మండలం కొండతాడూరు వెళదామని మాయమాటలు చెప్పి బయలు దేరించాడు. మార్గమధ్యలో పాచిపెంట మండలం శీతం గ్రామం వద్ద ఇద్దరూ గొడవ పడ్డారు. ఎర్రమ్మను బాగా కొట్టడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఈమెను పొలిమేరల్లో ఉన్న దూరపు బంధువైన వి.సోమయ్య ఇంటికి తీసుకెళ్లాడు. వారింట్లో గత నెల 24,25 తేదీల్లో ఉన్నారు. అయినా భార్య సరిగా కోలుకోలేదు. కోలుకున్న తరువాత కొట్టిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులతో ఎక్కడ చెబుతుందోనన్న భయంతో 26వ తేదీన పీక నులిమి చంపేశాడు. మృత దేహాన్ని సోమయ్య సహాయంతో భర్త పెంటయ్య కట్టిన డోలీలో పెదసెలగాం పరిసరాల్లో దిబ్బగుడ్డి వద్ద కొండ లోయల్లో పడేసి పరారయ్యారు. పరారైన వారిని ఎట్టకేలకు సోమవారం అదుపులోకి తీసుకొని సీఐ అప్పలనాయుడు, ఎస్.కృష్ణమూర్తిలు సాలూరు కోర్టుకు తీసుకువెళ్లారు. చదవండి: ఫోన్కు ఓటీపీలు వస్తాయి చెప్పమ్మా అంటూ.. -
పాత కక్షలు.. వ్యాపారి దారుణహత్య
జయపురం: నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్లో శుక్రవారం రాత్రి తుపాకీ తూటాలు గర్జించాయి. ఆ తూటాలకు ఒక వ్యాపారి కుప్పకూలాడు. రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ సంఘటన పట్టణ ప్రజలలో భయాందోళన రేకెత్తించింది. వ్యాపార శతృత్వంతోనే ఈ సంఘటన జరిగి ఉండొచ్చని ప్రజలు అనుమానిస్తున్నారు. స్థానిక వ్యాపారి సంజీవ సుబుద్ధి రాత్రి 9 గంటలకు తన దుకాణం మూసివేసి ఇంటికి బయల్దేరాడు.దారిలో ఎలక్ట్రికల్ కార్యాలయం వద్ద టీ తాగి మిత్రులతో కాసేపు ముచ్చటించి రాత్రి 9.45 గంటలకు బైక్ నెమ్మదిగా నడుపుకుంటూ ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమీపంలో ముగ్గురు దుండగులు వ్యాపారిపై కాల్పులు జరిపారు. ఆ కాల్పులకు గురైన సంజీవ్ సుబుద్ధి సంఘటనా స్థలంలోనే నేలకూలాడు. గమనించిన ఆ ప్రాంత ప్రజలు వెంటనే వ్యాపారిని ఉమ్మరకోట్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అక్కడినుంచి నవరంగపూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అయితే వ్యాపారి సుబుద్ధి మరణించినట్లు అక్కడి డాక్టర్లు ప్రకటించారు. కొద్ది రోజుల కిందట సంజీవ్ సుబుద్ధి కొంత మందితో గొడవ పడ్డాడు. ఆ సంఘటనపై ఉమ్మరకోట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల క్రితం ముసుగులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు సంజీవ్ సుబుద్ధి ఫర్నిచర్ దుకాణానికి వచ్చారని అయితే వారి మధ్య ఏం జరిగిందో తెలియదని చుట్టుపక్కల దుకాణదారులు చెబుతున్నారు. గత రాత్రి జరిగిన కాల్పుల సంఘటనను ఉమ్మరకోట్ పోలీసులు సీరియస్గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దుండగుల ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తుపాకీ కాల్పుల్లో వ్యాపారి దుర్మరణం చెందిన సమాచారం తెలుసుకున్న నవరంగపూర్ మాజీ ఎంపీ ప్రదీప్ మఝి హాస్పిటల్కు వెళ్లి మృతుని కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. -
కస్టమర్ కు రూ.45వేలు చెల్లించిన అమెజాన్
ఒడిశా: ఆన్లైన్లో సహజంగానే ఈ-కామర్స్ సైట్లలో అప్పుడప్పుడు కొన్ని వస్తువులు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. కొన్ని సార్లు ఈ ఆఫర్లు నిజమేనా అని మనం కూడా ఆశ్చర్యపోతుంటాం. ఈ-కామర్స్ సైట్ల నిర్వాహకులు సాధారణ సమయాలలో కూడా పలు సేల్స్ పేరిట వస్తువులను తక్కువ ధరకే విక్రయిస్తుంటారు. తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సైట్లో తలెత్తిన సాంకేతిక కారణంగా ఒక వినియోగదారుడికి నష్టపరిహారంగా రూ.45వేలు చెల్లించాల్సి వచ్చింది.(చదవండి: పెన్షన్ పొందేవారికి కేంద్రం శుభవార్త) వివరాల్లోకి వెళ్లితే.. ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్ మహాపాత్ర అనే న్యాయ విద్యార్థి 2014లో అమెజాన్లో ఒక ల్యాప్టాప్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు రూ.23,499 విలువైన ల్యాప్టాప్ రూ.190 ఆఫర్ కింద లభించడంతో దాన్నీ ఆర్డర్ చేసుకున్నాడు. అతను ఆర్డర్ చేసిన రెండు గంటల తర్వాత ఆ ఆర్డర్ రద్దు కావడంతో అమెజాన్ కస్టమర్ను సంప్రదించాడు. అమెజాన్ కస్టమర్ కేర్ సర్వీస్ డిపార్ట్మెంట్ సాంకేతిక సమస్య కారణంగా తక్కువ ధర చూపించిందని తెలపడంతో పాటు ఆ ఆర్డర్ ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అతను ఈ విషయాన్నీ విడిచిపెట్టకుండా ఒడిశా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అత్యవసరంగా ల్యాప్టాప్ అవసరం ఉన్నందున తాను రూ.190కి ల్యాప్టాప్ అని చూసి దాన్ని ఆర్డర్ చేస్తే అమెజాన్ దాన్ని రద్దు చేసిందని, కనుక తనకు న్యాయం చేయాలని అతను కోరాడు. కొన్నేళ్ల పాటు సాగిన ఈ విచారణ తాజాగా ముగిసింది. ఒడిశా రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఆర్డర్ రద్దు చేసినందుకు బాధితుడికి నష్ట పరిహారం కింద రూ.40వేలు, ఖర్చుల కింద మరో రూ.5వేలను అమెజాన్ చెల్లించాలని తీర్పు ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ వార్త చదివిన చాలా మంది నిజమే వినియోగదారుడిని మోసం చేసినందుకు అమెజాన్ కు కమిషన్ సరైన శిక్ష విధించిందని పేర్కొన్నారు. -
ఎంఆర్ఎస్ఏఎం క్షిపణి ప్రయోగం విజయవంతం
భువనేశ్వర్: ఒడిశా తీరంలో గల చండీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, ఆర్మీ వెర్షన్ నుండి ప్రయోగించిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్(MRSAM) పరీక్ష విజయవంతమైంది. భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే లక్ష్యంతో ఇజ్రాయెల్తో కలిసి సంయుక్తంగా డీఆర్డీవో స్వదేశీ పరిజ్ఞానంతో భారత సైన్యం కోసం ఈ క్షిపణిని రూపొందించింది. పరిక్షదశలో ఈ క్షిపణి వేగవంతమైన మానవరహిత వైమానిక లక్ష్యాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఈ ప్రయోగంలో భాగంగా మొదట బ్రిటిష్ డ్రోన్ మానవరహిత వైమానిక వాహనం(యుఎవి) బాన్షీని గగన్ తలంలోకి పంపించి.. ఆ తర్వాత మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్తో దాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రయోగించిన మొదటి దశలోనే లక్ష్యాన్ని ఛేదించినట్లు అధికారులు తెలిపారు. ప్రయోగానికి ముందు డీఆర్డోవో ప్లాంట్కు 2.5కి.మీ పరిధిలో గల ప్రజలను ఖాళీ చేయడంతో పాటు స్థానిక మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని రెవిన్యూ అధికారులు సూచించారు. దాదాపు 100కి.మీ దూరంలోని లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదు. అలాగే 60కేజీ పేలోడ్, 4.5 మీటర్ల పొడవైన అణు సామర్థ్యం గల క్షిపణిలను ఇది మోసుకెళ్లగలదు. దీని బరువు సుమారు 2.7 టన్నులు. మెరుపువేగంతో భూతలం నుంచి గగనతల లక్ష్యాలను ఇది ఛేదించగలదు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ మిషన్లో పాల్గొన్న డీఆర్డీఓ, అనుబంధ బృంద సభ్యుల కృషిని ప్రశంసించారు. స్వదేశీ ఆధునిక ఆయుధ వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధిలో భారతదేశం ఉన్నత స్థాయి సామర్థ్యాన్ని సాధించిందని అన్నారు. క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు డీఆర్డీఓ బృందాన్ని డీఫెన్స్ ఆర్ అండ్ డీ కార్యదర్శి, ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి అభినందించారు. -
ఒడిశా : లోయలోకి దూసుకెళ్లిన బస్సు
భువనేశ్వర్ : ఒడిశాలో ప్రమాదవశాత్తూ శుక్రవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ బస్సు లోయలో పడిపోయింది. కందమాల్ జిల్లా గడియపొడ ఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని.. వీరిలో 25 మంది గాయపడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.పుల్వాని నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. -
అసెంబ్లీ సాక్షిగా తల్లి మెడపై కత్తి పెట్టి..
భువనేశ్వర్ : ఒడిశా రాజధాని భువనేశ్వర్లో అసెంబ్లీ భవన్ ఎదుట గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సాక్షిగా ఒక వ్యక్తి తన కన్నతల్లి మెడపై కత్తిపెట్టి చంపేస్తానంటూ సైకోలాగా ప్రవర్తించాడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ ప్రభుత్వంలో కొందరు అవినీతి మంత్రులు ఉన్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. లేకుంటే తన తల్లిని చంపేస్తానంటూ గట్టిగట్టిగా అరిచాడు. తన దగ్గరకు రావాలని చూసిన వారిని కత్తితో బెదిరించాడు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. (చదవండి : హత్రాస్ బాధితురాలిపై రేప్ జరగలేదు) అయితే యువకుని తల్లి వివరాల మేరకు సదరు యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని తెలిసింది. కొడుకును ఆసుపత్రిలో చూపించేందుకు తల్లి, కొడుకులు ఆటోలో కలసి బయలుదేరారు. అసెంబ్లీ భవన్ వద్దకు చేరుకోగానే యువకుడు సైకోలాగా ప్రవర్తిస్తూ బ్యాగ్లో ఉన్న కత్తిని తీసుకొని ఆటో నుంచి కిందకు దిగాడు. ఆ తర్వాత తల్లి మెడపై కత్తి పెట్టి చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో పాటు బీజేడీ ప్రభుత్వంలో ఉన్న అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలంటూ గట్టిగట్టిగా నినాదాలు చేశాడు. అయితే పోలీసులు జోక్యం చేసుకొని అతని వద్ద నుంచి కత్తి స్వాధీనం చేసుకొని తల్లిని విడిపించి యువకుడిని కస్టడీలోకి తీసుకున్నారు. యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని.. ఆసుపత్రిలో చూపించేందుకు తీసుకెళుతుండగా.. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుందని భువనేశ్వర్ డీసీపీ ఉమాశంకర్ దశ్ పేర్కొన్నారు. కాగా యువకుడు కత్తితో సైకోలాగా ప్రవర్తిస్తూ హల్చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (చదవండి : భారీ చేపతో బామ్మకు జాక్పాట్) -
కరోనా ఇంజెక్షన్ల కలకలం
భువనేశ్వర్ : రాష్ట్రంలో కరోనా ఇంజెక్షన్ల తయారీ కలకలం రేపింది. బర్గడ్ జిల్లా భెడేన్ సమితిలోని రుసుడా గ్రామంలో కరోనా మందులు తయారు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఆ మందుల తయారీ శిబిరంపై సంబల్పూర్ డ్రగ్ ఇన్స్పెక్టర్, పోలీసులు ఉమ్మడిగా దాడులు ఆకస్మికంగా చేపట్టారు. ఈ శిబిరంలో మందుల తయారీకి వినియోగిస్తున్న సామగ్రిని జప్తు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రపంచ ప్రజానీకాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి చికిత్సకు ఇంజక్షన్ ఆవిష్కరించినట్లు రుసుడా గ్రామానికి చెదిన ప్రహ్లాద్ బిసి (32) అధికారులకు తెలపడంతో ఆయన వివరణ కోరుతూ అధికారులు నోటీసులు జారీ చేశారు. (చదవండి : ఉమా భారతికి కరోనా పాజిటివ్) రెండు రకాలుగా ఇంజెక్షన్లు ఈ వ్యవహారంపట్ల ప్రహ్లాద్ బిసి స్పందించి కరోనా మహమ్మారి ప్రాణాల్ని బలిగొంటున్న తరుణంలో తాను ఈ ఇంజెక్షన్లు ఆవిష్కరించానని, ఇవి 2 రకాలుగా ఉంటాయని తెలిపాడు. ఒకటి ఎరుపు, రెండోది నీలం రంగులో ఉంటుందని చెప్పాడు. కోవిడ్–19 పాజిటివ్ ఖరారైతే ఒక ఇంజెక్షన్, మరో 2 గంటల తర్వాత మరో రంగు ఇంజెక్షన్ ఇస్తానని, ఇలా ఇచ్చిన 8 గంటల తర్వాత రోగి పూర్తిగా కోలుకుంటాడని తెలిపాడు. ఇతరులకు కరోనా సంక్రమించకుండా ఈ ఇంజెక్షన్లు దోహదపడతాయని వివరించాడు. ఈ ఇంజెక్షన్ల ఆవిష్కరణ, ప్రయోగం, వినియోగానికి సంబంధించి స్థానిక డ్రగ్ ఇన్స్పెక్టరు, రాష్ట్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా అభ్యర్థించినట్లు ప్రహ్లాద్ బిసి తెలిపాడు. కరోనా చికిత్సకు ఈ మందు చక్కగా పని చేస్తుంది. ఈ ఇంజెక్షన్ 100 శాతం విజయవంతమైన ఔషధంగా పేర్కొన్నాడు. దీని ప్రయోగం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా అభ్యర్థించడంతో ఆయన అభ్యర్థన పట్ల స్పందించిన డ్రగ్ ఇన్స్పెక్టర్, మరో ఇద్దరు ప్రభుత్వ అధికారులు గ్రామానికి వచ్చి మందుల తయారీని పర్యవేక్షించారు. భువనేశ్వర్ ప్రయోగ శాలకు పరీక్షల కోసం నమూనాల్ని సిఫారసు చేశారు. ఏ శిక్షకైనా సిద్ధం ఈ మందు నకిలీ కాదు. కరోనా రోగుల ప్రాణాల్ని రక్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజానీకాన్ని కలవరపరుస్తున్న కరోనా రోగులకు ఉన్నత చికిత్స అందజేస్తుందని ప్రహ్లాద్ బిసి తెలిపాడు. మందు నకిలీ లేదా హానికరం అని తేలితే ఎటువంటి శిక్షనైనా అనుభవించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఈ వ్యవహారంలో పోలీసులు తనను అరెస్టు చేయనట్లు ప్రహ్లాద్ బిసి స్పష్టం చేశాడు. -
ప్రాణం తీసిన గప్చుప్
భువనేశ్వర్ : ఆబాలగోపాలం లొట్టలేసుకుని ఆరగించే గప్చుప్ ఓ మహిళ ప్రాణాల్ని బలిగొంది. బంగాళదుంప మిశ్రమం కూరిన చిన్న డొల్ల పూరీలో చురచురలాడించే చింతపండు నీరు నింపుకుని గుటుక్కున (గప్చుప్) మింగేయడంలో జరిగిన తొందరపాటు చర్య ఈ ప్రమాదానికి కారణమైంది. సుందరగడ్ జిల్లా లెఫ్రిపడా పోలీసు స్టేషన్ పరిధి సరఫ్గడ్ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ విషాదం జరిగింది. స్థానికురాలైన ఫూలమతి కిషాన్ (30) అనే మహిళ సరదాగా మింగబోయిన గప్చుప్ ఆమె గొంతు గుండా శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో ఉక్కిరి బిక్కిరై అక్కడికక్కడే కుప్పకూలింది. భర్త, కుమారుడితో కలిసి ఇంటి ఆవరణలో గప్చుప్ తింటుండగా ఈ విషాదం సంభవించింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణం పోయినట్లు వైద్యులు ప్రకటించారు. -
ఒకటే ఊరు.. రెండు పంచాయతీలు
భువనేశ్వర్ : ఒకే గ్రామం కానీ రెండు పంచాయతీలు. రెండు పంచాయతీలకు చాలా వరకు ఒకటే. ఒకే ఊరికింద వారంతా కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఆ గ్రామాలే మండలంలో కాశిదొరవలస, నారాయణప్పవలస పంచాయతీలు. 26 ఏళ్లక్రితం వరకు ఈ పంచాయతీలు రెండూ నారాయణప్పవలస గ్రామంపేరిట ఉండేవి. అప్పట్లో నాటి ప్రభుత్వం ఈ గ్రామాన్ని రెండు పంచాయతీలుగా విభజించింది. నారాయణప్పవలస గ్రామంలో ప్రధానవీధిలో ఓ స్తంభం వద్ద ఈ రెండు పంచాయతీలకు సరిహద్దు నిర్ణయించారు. అంతవరకు ఒకే గ్రామంగా ఉన్నవారంతా రెండు గ్రామాల వారిగా విడిపోయారు. బొబ్బిలి రూరల్ : ఒకే గ్రామంలో రెండు పంచాయతీలు కావడంతో నారాయణప్పవలసలో రామాలయం ఉంటే, కాశిందొరవలసలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. రేషన్షాపు, పాఠశాల నారాయణప్పవలసలో ఉన్నాయి. ఒకే రైల్వేస్టేషన్ కాశిందొరవలసలో ఉంది. దీనిని నారాయణప్పవలస రైల్వేస్టేషన్ అంటారు. కంచరగెడ్డ రిజర్వాయర్ కాశిందొరవలసలో ఉంది. ఒకే గ్రామంలో రెండు పంచాయతీలు ఉండడంతో అంతా కలిసి వేడుకలు, సంబరాలు చేసుకుంటారు. నారాయణప్పవలస గ్రామం ఒక పంచాయతీ కాగా దీని పరిధిలో ఏ గ్రామాలూ లేవు. కాశిందొరవలస గ్రామానికి కాశిందొరవలస, దీని పరిధిలో డొంగురువలస, ఎరకందొరవలస, చిలకమ్మవలస, మోసూరువలసలు ఉన్నాయి. గ్రామంలోఅంతా కలిసి హాయిగా కలిసి మెలిసి జీవిస్తున్నారు. -
ప్రకృతి ఆ ఇంటి మీద పగబట్టిందేమో
భువనేశ్వర్ : ఇల్లు కట్టాలంటే పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. ఈరోజుల్లో ఇళ్లు కట్టాలంటే మాత్రం స్థోమతకు మించిన పనిలా తయారైంది. మరీ అలాంటిది.. కష్టపడి కట్టుకున్న ఇళ్లు కళ్ల ముందే కూలిపోతే ఆ ఇంటి యజమాని బాధ వర్ణణాతీతం అని చెప్పొచ్చు. ఒడిశాలో గత కొన్ని రోజులగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల దాటికి వాగులు, వంగులు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా భారీ వర్షాల వల్ల ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా మధుబన్లో రెండు అంతస్తుల భవనం ఇంటి యజమాని ముందే కుప్పకూలింది. అయితే ఇక్కడ ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు. భవనం కూలే సమయంలో ఇంటి సభ్యులందరూ బయటకు వచ్చేశారు కాబట్టి సరిపోయింది లేదంటే ఎవరు బయట పడేవారు కాదు. భవనం కదులుతుందని తెలియగానే హుటాహుటిన అందులో నివసిస్తున్న వాళ్లంతా బయటకు వచ్చేశారు. పాపం.. విలువైన వస్తువులను బయటకు తెచ్చుకునేంత సమయం కూడా ప్రకృతి వారికి ఇవ్వలేకపోయింది. ఆశ్చర్యం ఏంటంటే.. భవనం కూలిన పక్కనే ఉన్న మరో రెండస్తుల భవనం నుంచి చిన్న పెచ్చుకూడా ఊడి కిందపడలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రకృతి ఆ ఇంటి మీద పగబట్టిందేమో అని కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : అతని తిండిపై కన్నేసిన పక్షులు) -
అసెంబ్లీ ఆవరణలో నాగుపాములు
భువనేశ్వర్ : రాష్ట్ర శాసన సభ ఆవరణలో నాగు పాములు తిరుగాడుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ వ్యవధిలో వరుసగా రెండు సార్లు నాగు పాముల్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా సోమవారం అసెంబ్లీ కార్యాలయంలోని స్విమ్మింగ్ పూల్ పరిసరాల్లో పాము తిరుగాడుతున్నట్లు భద్రతా సిబ్బంది దృష్టిలో పడడంతో స్నేక్ హెల్ప్ లైన్కు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న సంస్థ ప్రతినిధి సువేందు మల్లిక్ ఆ ప్రాంతానికి చేరి స్విమ్మింగ్ పూల్లో మెట్ల మధ్య నక్కిన పామును మెలకువగా అదుపులోకి తీసుకున్నారు. అది 6 అడుగుల నాగుపాము అని నగర శివారులోని అటవీ ప్రాంతంలో దానిని సురక్షితంగా విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. -
విశాఖ గ్యాస్ లీక్ : పెళ్లైన రెండు నెలలకే
పెళ్లై రెండు నెలలైంది. ఇంతలోనే ఆషాఢం రావడంతో భార్యను పుట్టింటికి పంపారు. వారం రోజుల కిందట భార్య వద్దకు వెళ్లిన భర్త వారం రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పి తన విధులకు యథావిధిగా వెళ్లాడు. ఇంతలోనే తను పని చేస్తున్న విశాఖలోని పరవాడలోని సాయినార్ లైఫ్సైన్సెస్లో గ్యాస్లీక్తో సంభవించిన ప్రమాదంలో తనువు చాలించాడు. దీంతో ఇటు మృతుని కన్నవారింట, అటు అత్తవారింట విషాదం అలుముకొంది. పూసపాటిరేగ : ఆషాఢం కారణంగా కన్నవారి ఇంటి వద్ద ఉన్న భార్యకు వారం రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పి విధులకు వెళ్లిన భర్త గ్యాస్ లీక్ ఘటనలో మృత్యువాతపడ్డాడు. పెళ్లినాటి జ్ఞాపకాలు కూడా మరవక ముందే నవజంటపై దేవుడుకు కన్నుకుట్టిందా..! అంటూ మృతుడు స్వగ్రామం రెల్లివలసలో రోదనలు మిన్నంటాయి. రెండు నెలల క్రితమే వివాహమైన జంటలో భర్త మృతిని తట్టుకోలేని భార్య రోదనలు చూపరులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే... పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన మహంతి గౌరీశంకర్రావు (28) విశాఖ పరవాడలో సాయినార్ లైఫ్సైన్సెస్లో నాలుగేళ్లుగా కెమిస్ట్గా పని చేస్తున్నాడు. పరిశ్రమలో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ లీక్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. మృతి చెందిన వారిలో రెల్లివలసకు చెందిన మహంతి గౌరీశంకర్ వున్నారు.(విష వాయువు లీక్.. ఇద్దరు మృతి) రెల్లివలస నుంచి హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లిన వరకు తమ కుమారుడు ప్రమాదంలో మృతి చెందాడనే విషయం తెలియదని మృతుడు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబంలో అన్నయ్య, అక్క తరువాత జన్మించి చిన్నవాడైన గౌరీశంకర్పై కుటుంబం ఆధారపడి వుంది. చిన్న కుమారుడు గౌరీశంకర్ మృతిని తట్టుకోలేని తల్లిదండ్రులు రమణ, నాగరత్నం బోరున విలపించారు. కొడుకు ప్రయోజకుడు అయ్యాడని పుట్టెడు సంతోషంతో వున్న కుటుంబాన్ని అనాధ చేసావా.. అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్నారు. రెండు నెలలకే... రెల్లివలసకు చెందిన మహంతి గౌరీశంకర్రావుకు ఈ ఏడాది ఏప్రిల్ 8న శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మితో వివాహమైంది. ఈ నెల 21న ఆషాఢం కారణంగా పుట్టింటికి వెళ్లిన వెంకటలక్ష్మి వద్దకు గత బుధవారం గౌరీశంకర్ వెళ్లాడు. భార్యతో మూడు రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పి విధులకు వెళ్లిన నవ వరుడు గ్యాస్లీక్ ఘటనలో మృత్యువాత పడటంతో భార్య గొల్లుమంది. ఘటనతో మృతుడు అత్తవారి గ్రామం సంచాం, స్వగ్రామం రెల్లివలస గ్రామంలోను విషాదం నెలకొంది. గౌరీశంకర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామం తీసుకురావడానికి బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ప్రాణత్యాగం చేస్తే కరోనా పోతుందని..
కటక్ : కాలం ఎంత అభివృద్ది చెందుతున్న కొంతమంది మనుషులు మాత్రం ఇంకా మూడ నమ్మకాలనే బలంగా నమ్ముతున్నారనడానికి ఈ వార్త ఉదాహరణగా చెప్పవచ్చు. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఈ యుగంలో ఇంకా ఇలాంటి మూడనమ్మకాలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో ప్రాణత్యాగం చేస్తే కరోనా పారిపోతుందంటూ ఒక పూజారి నిండు మనిషి ప్రాణం తీసేశాడు. ఈ దారుణ ఘటన బుధవారం రాత్రి ఒడిశాలోని కటక్లో చోటుచేసుకుంది.(నిబంధనలు గాలికొదిలేసిన టీడీపీ నేతలు) వివరాలు.. కటక్ జిల్లా బందాహుదా గ్రామానికి చెందిన సన్సారి ఓజా( 72) బందా మా బుద్ద బ్రాహ్మణి దేయి గుడిలో పూజారీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సరోజ్ కుమార్ ప్రధాన్(52) పూజ చేసేందుకు ఆలయంలోకి వచ్చాడు. పూజ నిర్వహించిన అనంతరం ప్రధాన్ ఓజాను పలకరించాడు. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న సమయంలో ఎవరైనా ఒక వ్యక్తి ప్రాణత్యాగం చేస్తే దేవుడు కరుణించి కరోనాను మాయం చేస్తానని దేవుడే స్వయంగా కలలో వచ్చి తనకు చెప్పాడంటూ సన్సాన్ ఓజా ప్రధాన్తో పేర్కొన్నాడు. టెక్నాలజీ ఇంత పెరుగుతున్న సమయంలో ఇంకా ఇలాంటి మూడ నమ్మకాలెందుకంటూ ప్రధాన్ తెలిపాడు. దీంతో ఇరువరి మధ్య మాటమాట పెరిగింది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన ఓజా తనకే దేవుడే స్వయంగా వచ్చి చెప్పాడంటూ అప్పటికే సిద్ధం చేసుకున్న గొడ్డలితో ప్రధాన్ తలపై బలంగా బాధడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పోలీసులు ఓజారు అదుపులోకి తీసుకొని ప్రధాన్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ప్రధాన్ను హత్య చేసేందుకు వాడిన గొడ్డలిని ఫోరెన్సిక్ రిపోర్టుకోసం సీజ్ చేసి ఓజాపై కేసు నమోదు చేశారు.(అద్దె చెల్లించలేదని దంపతుల్ని కాల్చిచంపాడు) ఇదే విషయమై సెంట్రల్ రేంజ్ డీఐజీ ఆశిష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ' ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తోన్న సన్సారి ఓజా మూడ నమ్మకాలను బలంగా నమ్మేవాడు. ఈ నేపథ్యంలోనే దేవుడే తనకు స్వయంగా చెప్పాడంటూ ప్రధాన్ను హత్య చేశాడు. అయితే హత్య చేపే సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు మా ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం మృతదేహాన్ని మామిడిచెట్టు పైకి ఎక్కించి రాత్రంతా పక్కనే కూర్చున్నాడు. కొంతకాలంగా ఓజా మనసిక పరిస్థితి సరిగా లేదని, ఇంతకుముందు కూడా తనకు దేవుడు కనిపించేవాడంటూ చెప్పేవాడని స్థానికులు పేర్కొన్నారు. కాగా గురువారం ఉదయం మత్తు దిగాక ఓజా చెట్టు మీద నుంచి దిగి తానే ఈ హత్య చేసినట్లు ఓజా పోలీసులకు లొంగిపోయాడు. మనిషి ప్రాణం త్యాగం చేస్తే కరోనా పారిపోతుందనే ఉద్దేశంతోనే ప్రధాన్ను హత్య చేశాడంటూ' తెలిపారు. -
ఏడాది తర్వాత ఆ అద్భుతాన్ని చూశా
భువనేశ్వర్ : మనం రోజు చూసే ప్రకృతిలో కొన్ని దృశ్యాలు మనం ఎప్పుడు మరిచిపోలేని అనుభూతులు మిగిలిస్తాయనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాగర తీరాన ఒకేసారి వేళ తాబేళ్లు సముద్రంలోకి పరిగెడుతున్నఅద్భుతాన్ని ఎప్పుడు చూడకపోతే మాత్రం ఇప్పుడు చూసేయండి. ఒడిశాలోని గహిర్మాతా బీచ్లో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు గుడ్లు పెట్టడానికి ప్రతీ ఏడాది సముద్రం అడుగుబాగం నుంచి ఒడ్డుకు వస్తాయి. గుడ్లను పెట్టడంతో పాటు పొదిగిన తర్వాత వాటి పిల్లలు ఉండడానికి ఇసుక గూళ్లు తయారుచేస్తుంటాయి. ఈ ప్రక్రియను అరిబాడా అనే పేరుతో పిలుస్తారు. తమ పిల్లలు కొంచెం ఎదిగాక ఒకేసారి అన్నీ కలిసి యధావిధిగా సముద్ర అడుగుబాగంలోకి చేరుకుంటాయి. అలాంటి వీడియోనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుషాంత నంద తన ట్విటర్లో షేర్ చేశారు. ' ఏడాది తర్వాత మళ్లీ ఆ అద్భుతాన్ని చూశాను. ఒడిశాలోని గహిర్మాతా బీచ్లో గుడ్ల పెట్టడానికి ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వచ్చే దృశ్యం ఎంతో బాగుంటుంది. దాదాపు 2 కోట్ల ఆలివ్ రిడ్లీ తాబేళ్లు 4 లక్షల ఇసుక గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయి . తమ పిల్లలను తీసుకొని ఒకేసారి సముద్రంలోకి వెళ్లే దృశ్యం మాత్రం చూపరులను ఆకట్టుకుంటుంది.ఇప్పుడు ఈ వీడియో మీకు చూపిస్తున్నా..' అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
కరోనా లేదన్నా ఇంట్లోకి రానివ్వలేదు
సాక్షి, శ్రీకాకుళం : ఆ మహిళ వేరే రాష్ట్రం నుంచి తను ఉంటున్న ప్రాంతానికి వచ్చింది. వేరే ప్రాంతం నుంచి రావడంతో అధికారులు ఆమెకు కరోనా పరీక్షలు చేయిస్తే నెగిటివ్ వచ్చింది. అయినా స్థానికులు మాత్రం ఆమెను ఇంటికి రానీయకపోవడంతో వార్డు సచివాలయాన్ని ఆశ్రయించింది. శ్రీకాకుళం నగరంలోని గుజరాతీపేట పాత పోస్టాఫీసు వీధిలో వావిలపల్లి లక్ష్మి అద్దె ఇంట్లో ఉంటూ చుట్టుపక్కల ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. లాక్డౌన్కు ముందు ఒడిశా రాష్ట్రం రాయగడలోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడ చిక్కుకుపోయింది. ఎక్కువ కాలం అక్కడ ఉండిపోతే ఇళ్లల్లో పనులు పోతాయన్న భయంతో 53 ఏళ్ల వయసులో అష్టకష్టాలు పడి 120 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూనే శ్రీకాకుళం చేరుకుంది. అయితే ఆమె అద్దెకుంటున్న వీధి వారు కరోనా భయంతో ఆమెను పోలీసులు, వైద్య సిబ్బందికి అప్పగించారు. ఈ నెల 21న శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించి.. ఐసోలేషన్ వార్డులో ఉంచి కరోనా పరీక్షలు జరపగా నెగిటివ్ వచ్చింది. దీంతో ఆమెను అంబులెన్స్లో ఆమె అద్దెకుండే ఇంటి వద్ద విడిచిపెట్టారు. అయితే ఆ వీధివాసులు, ఇంటి యజమాని సైతం ఆమెను ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె వార్డు సచివాలయానికి వెళ్లింది. తనకు కరోనా నెగిటివ్ వచ్చినా ఇంట్లోకి రానీయడం లేదని వారి ముందు తన గోడు వెళ్లబోసుకుంది. చివరకు ‘సాక్షి’ చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి స్థానికులకు సర్ది చెప్పి ఆమెను ఇంటికి చేర్చారు. (బాంబులతో లేపేస్తా.!) -
ఇదీ! సీఎం నవీన్ పట్నాయక్ అంటే..
సాక్షి, భువనేశ్వర్ : మానవీయ దృక్పథం వాస్తవ కార్యాచరణను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యక్షంగా ప్రతిబింబింపజేశారు. అధికారిక కార్యక్రమాలు ముగించుకుని, ఆదివారం సాయంత్రం తన ఇంటికి వెళ్తున్న ముఖ్యమంత్రికి అదే దారిలో అంబులెన్స్ సైరన్ వినిపించింది. దీంతో అప్రమత్తమైన ఆయన కాన్వాయ్ను నిలపాలని, ఆ అంబులెన్స్ వెళ్లిన తర్వాత కాన్వాయ్ ముందుకు పోవాలని ఆదేశించారు. ఈ సంఘటనను చూసిన అక్కడి ప్రజలు ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (ఎన్ఆర్సీపై నవీన్ పట్నాయక్ కీలక వ్యాఖ్యలు) (ఒడిశా సీఎం సంచలన నిర్ణయం) -
కాఫర్ డ్యామ్పేరుతో కపట నాటకం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాకాలు ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు గుదిబండలా మారుతున్నాయి. ఒక్కదాని తర్వాత ఒకటిగా వస్తున్న సమస్యలు, న్యాయ వివావాదాలు ఇంజినీర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పొరుగు రాష్ట్రాలతో వివాదాలను రాష్ట్రస్థాయిలోనే పరిష్కరించుకునేందుకు గతంలోని చంద్రబాబు సర్కారు ఏ మాత్రం కృషి చేయలేదు. దీంతో ప్రాజెక్టు పనులు నిలిపేయాలని కోరుతూ పొరుగు రాష్ట్రమైన ఒడిశా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్లో గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కారణంగా తమ రాష్ట్రంలోని సంరక్షిత గిరిజన గ్రామాలు ముంపుకు గురవుతాయని, బచావత్ ట్రైబ్యూనల్ ఆదేశాలు ఉల్లంఘిస్తూ నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఒడిశా ఆరోపిస్తోంది. ఒడిశా చేస్తున్న ఆరోపణలన్నీ చంద్రబాబు నిర్వాకాలను తేటతెల్లం చేస్తున్నాయి. ఇక ఏపీకి మరో వైపు ఉండే ఛత్తీస్గఢ్, తెలంగాణ కూడా పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు గడప తొక్కాయి. రేలా అనే స్వచ్ఛంద సంస్థ కూడా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. నియమావళికి నీళ్లు భారీ ప్రాజెక్టుల నిర్మించేటప్పుడు రాజకీయాలకు తావులేకుండా ఇంజినీరింగ్ ప్రమాణాలు అనుసరించాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. కాని రాష్ట్ర ప్రయోజనాలకంటే సొంత ప్రయోజనాలకు చంద్రబాబు పెద్ద పీట వేసుకుంటూ సాగించిన వ్యవహారశైలి ఇప్పుడు పోలవరానికి ఇబ్బందికరంగా మారింది. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్వేను పక్కన పెట్టి కాఫర్ డ్యామ్ నిర్మించడమన్నది చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం. అంతే కాకుండా ప్రచారమే తప్ప ముంపు బాధితుల పునరావాసంపై దృష్టి సారించకపోవడంతో ఇప్పుడది అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్లింది. పోలవరంపై చేసిన ప్రచార ఆర్భాటంలో కనీసం కొంతైనా పునరావాసంపై దృష్టి సారించి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు పోలవరం పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నాయి. ఆయన సృష్టించిన సమస్యలు, న్యాయపరమైన వివాదాల నుంచి గట్టెక్కేందుకు అధికారులు తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒడిశా అభ్యంతరాలపై జవాబు ఇచ్చేందుకు కేంద్రం, ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నాయి. గత ప్రభుత్వం ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడం, పునరావాసం, పునర్నిర్మాణ పనులను పట్టించుకోకపోవడంతో కొత్త చిక్కులు వచ్చే ప్రమాదం కనిపిస్తోందని ఇంజినీరింగ్నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ, తూర్పు, పశ్ఛిమ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల్లో 540 గ్రామాలకు తాగునీరు అందిస్తుంది పోలవరం ప్రాజెక్టు. దాదాపు 3 లక్షల హెక్టార్లకు సాగు నీరు సమకూర్చడంతో పాటు 960 మెగావాట్ల స్థాపిత సామర్ధ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే జలవిద్యుత్కేంద్రం కూడా ఏర్పాటు కానుంది. వీటి ద్వారా ఆంధ్రపదేశ్ముఖచిత్రం పూర్తిగా మారిపోవడం తథ్యం. పచ్చ ప్రచారం వాస్తవాలు జనాలకు తెలిస్తే ఎక్కడా తమను మరింత ఛీత్కరించుకుంటారనే భయంతో చంద్రబాబు తన అనుకూల మీడియాలో విపరీతంగా దుష్ప్రచారం చేయిస్తున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం పనులు నిలిచిపోయాయంటూ టీడీపీ, దానికి అండగా ఉండే మీడియా గోబెల్స్ తరహాలో ప్రచారం చేస్తోంది. నిజానికి కోర్టు ఆదేశాల కారణంగా హైడల్ పవర్స్టేషన్ పనులు నిలిచిపోయినా ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన పనులన్నీ జోరుగా సాగుతున్నాయి. కాని పునరావాసం, పునర్నిర్మాణం పనులు నిదానించడం సమస్యగా మారింది. పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.51,424 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో ఆర్అండ్ ఆర్, భూ సేకరణకే రూ.32,509 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అంటే నిర్మాణ పనుల కన్నా వీటికే భారీ మొత్తం కేటాయించాల్సి వస్తుంది. 2013లో తీసుకొచ్చిన పటిష్టమైన భూసేకరణ చట్టం ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా నష్టపోయేవారికి, ముంపు బాధితులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తోంది. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 13 అనుమతులకు గాను 11 అనుమతులు అప్పటి ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి సమయంలోనే లభించాయి. భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ పనులకు సంబంధించి కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ, ప్రణాళిక సంఘం, కేంద్ర జలసంఘం నుంచి అప్పటి సీఎం వైఎస్సార్ అనుమతులు సాధించారు. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన కిరణ్కుమార్ప్రభుత్వం ప్రాజెక్టు పనులకు టెండర్ పిలిచింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కాని ప్రాజెక్టు పనులు చేయలేని స్థితిలో ఉన్న కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించి తమ వారికి సబ్కాంట్రాక్టులు దన్నుకున్నారు. అపార నష్టం చంద్రబాబు చర్యలతో పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టం మాటల్లో చెప్పలేనిది. ప్రాజెక్టు పనులతో పాటు భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ పనులు సమాంతరంగా సాగాలి. కాని చంద్రబాబు ఏలుబడిలో నిర్మాణ పనులు ఇంజినీరింగ్ నియమ నిబంధనలకు విరుద్ధంగా సాగాయి. ప్రాజెక్టులో ముందు స్పిల్వే పనులు జరగాల్సి ఉండగా దాన్ని పట్టించుకోకుండా కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టారు. ఈ కారణంగా అసలు పనులు నిలిచిపోయాయి. అదే సమయంలో గోదావరికి వచ్చిన వరదలతో స్పిల్వే నుంచి నీరు పోవడంతో ముంపు పెరిగింది. గతేడాది గోదావరికి వచ్చిన భారీ వరదతో అప్పుడు పనులు నిలిచిపోవడమే కాదు ఎగువ భాగంలో ముంపు సమస్య తీవ్రమైంది. ఈ కారణంగా ఈ ఏడాది జనవరి వరకు కూడా పనులు చేపట్టేందుకు స్థలం లేకుండా పోయింది. భారీ వరదల కారణంగా రోడ్లు పూర్తిగా కొట్టుకుపోవడంతో వాటిని మళ్లీ నిర్మించాల్సి వచ్చింది. అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరుతుండటంతో ఇప్పుడిప్పుడే పనుల్లో వేగం పెరిగింది. దిద్దుబాటు చర్యలు గత ప్రభుత్వ వైఖరి కారణంగా చోటుచేసుకున్న ఇంజినీరింగ్లోపాలు సరిదిద్దుతూ, రాజకీయాలు, కాంట్రాక్టర్ప్రయోజనాలకు అతీతంగా ఇంజినీరింగ్ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పుడు పనులు చేయిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమైన పనులన్నీ వచ్చే ఏడాది ఏప్రిల్నాటికి పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించిన ప్రభుత్వం వచ్చే ఏడాది జూన్నాటికి మొత్తం పనులన్నీ ముగిసేలా సమాయత్తమవుతోంది. కాఫర్ డ్యామ్పేరుతో కపట నాటకం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపు తలెత్తి పనులు అధిక కాలం ఆగిపోవడానికి ముఖ్య కారణం కాఫర్డ్యామ్. తన హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తికాదని గ్రహించిన చంద్రబాబు అప్పట్లో కాఫర్డ్యామ్పేరుతో కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు. రూ. 50 వేల కోట్లకు పైగా ఖర్చుతో చేపట్టిన ప్రాజెక్టు కోసం రాష్ట్రంలో నిధులు లేకపోవడం, అటు కేంద్రం కూడా రిక్తహస్తం చూపడంతో కాఫర్ డ్యామ్ కట్టేసి దాన్నే పోలవరం ప్రాజెక్టుగా చూపేందుకు చంద్రబాబు కుటిల పన్నాగాలు పన్నారు. 42.5 మీటర్ల ఎత్తులో కాఫర్ డ్యామ్ నిర్మించాలని బాబు ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదన తీసుకురాగా ఎత్తు తగ్గించాలని సూచిస్తూ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కేంద్రం అనుమతి మంజూరు చేసింది. జలాశయాల నిర్మాణంలో ఎక్కడా, ఎప్పుడూ లేనిరీతిలో కాఫర్డ్యామ్ నిర్మించి పోలవరం తొలి దశ పూర్తి చేసినట్టు చెప్పుకునేందుకు చంద్రబాబు ప్రచారం రూపొందించుకున్నారు. పోలవరం కాఫర్ డ్యామ్పేరుతో ఆంధ్రప్రదేశ్కు తీరని ద్రోహం చేశారు. అసలు కాఫర్ డ్యామ్ అంటే ఏంటి? జలాశయాలు నిర్మించేటప్పుడు ఆ పనులకు నీరు అడ్డు రాకుండా నదీ ప్రవాహం మళ్లించేందుకు నిర్మించే తాత్కాలిక కట్టడం కాఫర్ డ్యామ్. ప్రధాన పనులు పూర్తైన తర్వాత దీన్ని తొలగిస్తారు. ఇది ఏ మాత్రం పటిష్టంగా, స్థిరంగా ఉండదు. శాశ్వతంగా అసలు ఉపయోగపడదు. అలాంటి నిర్మాణం పూర్తి చేసి దాంతో పోలవరం మొదటి దశ పూర్తి చేసినట్టు చెప్పుకునేందుకు అప్పట్లో చంద్రబాబు సర్కారు విపరీతంగా ప్రయత్నించింది. దీని వలన ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లగా కాంట్రాక్టరుకు మాత్రం భారీ లబ్ధి చేకూరింది. -
ఓ అనామిక కథ!
ఆ చిన్నారి ఐదేళ్ల వయసులో ఒడిశాలో తప్పిపోయింది. తల్లిదండ్రులు అప్పట్లో వెతికినా బిడ్డ ఆచూకీ దొరకలేదు. ఆశలు వదులుకుని వారు స్వగ్రామానికి వచ్చేశారు. ఆ బాలికను ఒడిశా ప్రభుత్వం సంరక్షించి చదివిస్తోంది. ఎప్పటికైనా తన తల్లిదండ్రులను చూడకపోతానా అని ఆశతోనే ఉండేది. అధికారుల సాయంతో తన స్వస్థలం వీకోట మండలంలోని బోడిగుట్టపల్లెగా తెలుసుకుంది. అయితే తల్లిదండ్రులు మృతి చెందారని తెలిసి కన్నీరుమున్నీరవుతోంది. సాక్షి, పలమనేరు:చిన్న తనంలో ఒడిశాలో తప్పిపోయిన బాలికకు పదేళ్ల తర్వాత తన పుట్టిన నేల గురించి తెలిసినా.. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. పూర్తి వివరాలు తెలుసుకునే సరికి కన్నవారు లేరన్న నిజం జీర్ణించుకోలేకపోతోంది. కనీసం తన కుటుంబీకులను కలుసుకోవాలని ఆరాటపడుతోంది. పదేళ్ల తర్వాత ఆమెకు తన వివరాలు ఎలా లభించాయి. అసలు ఏం జరిగిందంటే.. వీకోట మండలం బోడిగుట్టపల్లెకు చెందిన పరమేష్, లక్షమ్మ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం చిన్న కూతురితో పాటు ఒడిశా రాష్ట్రం పూరి సమీపంలోని కనాస్ ప్రాంతానికి వలసకూలీలుగా వెళ్లారు. అక్కడ బిడ్డ తప్పిపోయింది. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్కు వెళ్లారు. బాలిక ఫొటో కావాలన్నారు. తమవద్ద లేదని చెప్పడంతో కేసు కూడా నమోదుచేయలేదు. కొన్నాళ్లు తప్పిపోయిన ప్రాంతంలో వెతికి చేసేదిలేక స్వగ్రామానికి తిరిగొచ్చేశారు. ఇక్కడ కూలిపనులు చేసుకుంటూ ఉండిపోయారు. వికోట మండలం బోడిగుట్టపల్లిలో బాలిక కుటుంబ సభ్యులను విచారిస్తున్న అధికారులు బాలికను చేరదీసిన స్వచ్ఛంద సంస్థ ఒడిశాలోని కనాస్లో అనాథగా తిరుగుతున్న చిన్నారిని నిలాచల్ సేవా ప్రతిష్టాన్ అనే స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. అక్కడి ఐసీపీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్) అధికారులకు అందజేసింది. వారు అక్కడి ప్రభుత్వ చిల్డ్రన్ హోమ్(దయావిహార్)కు అప్పగించారు. ఆ సంస్థ నిర్వాహకులు ఆ బాలికకు అనామిక అని పేరు పెట్టి అక్కడే చదివిస్తున్నారు. బాలిక పెరిగి పెద్దయ్యాక రెండేళ్ల క్రితం తమది ఆంధ్రరాష్ట్రం చిత్తూరు జిల్లాలోని బోడిగుట్టపల్లె అని చెప్పింది. అక్కడి అధికారులు చిరునామా కనుగొనేందుకు బాలిక 8వ తరగతి ఫొటోను చిత్తూరు ఐసీడీఎస్ అధికారులకు పంపారు. బోడిగుట్టపల్లి పేరిట పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో రెండు, మూడు గ్రామాలుండడంతో స్థానిక సీడీపీఓలు రెండేళ్లుగా చిరునామా కోసం విచారిస్తున్నానే ఉన్నారు. ఇలా ఉండగా వికోట మండలం బోడిగుట్టపల్లెకు చెందిన ఓ బాలిక ఒడిశాలో తప్పిపోయిందని స్థానికుల ద్వారా సీడీపీఓ రాజేశ్వరికి సమాచారం అందింది. ఆమె నాన్ ఇన్స్టిట్యూషన్ కేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శివకు ఆ విషయం తెలిపారు. ఆయన బోడిగుట్టపల్లికి చేరుకుని బాలికకు సంబంధించిన ఫొటో, వివరాలను చెప్పారు. కుటుంబ సభ్యుల ఫొటోలను ఒడిశాలో బాలిక ఉంటున్న చైల్డ్హోమ్కు వాట్సాప్లో పంపారు. వారిని చూసిన బాలిక తన అన్న, అక్కలుగా గుర్తించింది. అంతలోనే కన్నీరుమున్నీరు తన వారిని గుర్తించిన బాలిక తల్లిదండ్రులు ఎలా ఉన్నారో చూపాలని ఆత్రుతగా అడిగింది. వారు మృతి చెందారనే సమాచారం తెలుసుకుని బాలికకు చెప్పారు. దీంతో అనామిక కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కనీసం తన బంధువుల వద్దకు వెళతానని బాలిక కోరింది. దీంతో జిల్లా ప్రొటెక్షన్ ఆఫీసర్, స్థానిక సీడీపీఓలు మంగళవారం బోడిగుట్టపల్లెలోని కుటుంబ సభ్యులను విచారించారు. వీడియో కాల్ ద్వారా బాలికతో మాట్లాడించారు. ఈ వివరాలతో నివేదికను ఒడిశా ప్రభుత్వానికి పంపి ఆపై బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు సీడీపీఓ రాజేశ్వరి తెలిపారు. కాగా అనామిక ప్రస్తుతం అక్కడి పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. పరీక్షలు పూర్తయ్యాక ఇక్కడికి పంపనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారని విచారణకు వచ్చిన అధికారి శివ తెలిపారు. 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన బిడ్డ బతికే ఉందని, ఆ బాలిక ఇప్పుడెలా ఉందో చూడాలని వారి కుటుంబ సభ్యులే కాదు.. ఆ గ్రామస్తులంతా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. -
ఆపరేషన్ ఆర్కే పేరుతో గాలింపు చర్యలు
సాక్షి, మల్కన్గిరి: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా చిత్రకొండ పరిసరాల్లో ఉన్నట్లు సమాచారం అందడంతో ఒడిశా పోలీస్ యంత్రాంగం కూంబింగ్ ముమ్మరం చేసింది. ఆర్కేతోపాటు మరో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు ఉదయ్, చలపతి కూడా ఇదే ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆపరేషన్ ఆర్కే పేరుతో గాలింపు మొదలుపెట్టారు. ఎస్వోజీ, డీబీఎఫ్లతో పాటు ఆంధ్ర గ్రేహౌండ్స్, తూర్పు గోదావరి జిల్లా పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఉనికి కోసం మావోయిస్టుల యత్నాలు గతంలో చిత్రకొండ కటాఫ్ ఏరియా మావోయిస్టులకు అడ్డాగా ఉండేది. కానీ ఇప్పుడు కటాఫ్ ఏరియాలో రహదారుల నిర్మాణం జరగడం, అలాగే ఎక్కడికక్కడ బీఎస్ఎఫ్ క్యాంపులు ఏర్పాటై జవాన్లు నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తుండటంతో మావోయిస్టుల అలజడి తగ్గుముఖం పట్టింది. ఈ ప్రాంతంపై తిరిగి పట్టు సాధించేందుకు మావోయిస్టులు ఇక్కడ జరుగుతున్న రోడ్ల నిర్మాణాలను అడ్డుకోవడం, కాంట్రాక్టర్ల వాహనాలు కాల్చివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఈ ఏరియాలోనే ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఈ నెల 15వ తేదీన చిత్రకొండ కటాఫ్ ఏరియాలో కూంబింగ్ చేపట్టగా ఎదురు కాల్పులు జరిగాయి. ఆ సమయంలో అగ్రనేతలు తప్పించుకున్నారు. అనంతరం మావోయిస్టు శిబిరం నుంచి పోలీసులు మావోల సామగ్రితో పాటు ఒక పెన్డ్రైవ్ను స్వాధీనం చేసుకున్నారు. పెన్డ్రైవ్లో ఉన్న వివరాలను మాత్రం బయటకు పొక్కనివ్వలేదు. -
అతను బిచ్చగాడు కాదు.. ఇంజనీర్
పూరి : పూరిలోని జగన్నాథ ఆలయం వద్ద సుమారు 51 ఏళ్ల వయసున్న ఒక బిచ్చగానికి , రిక్షావాడికి చిన్నపాటి గొడవ జరిగింది. అంతటితో ఆగకుండా వారిద్దరు రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. రోడ్డు మీద వెళ్లేవారు చూస్తూ ఉన్నారే తప్ప ఒక్కరు కూడా ఆపడానికి ప్రయత్నించలేదు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి వారిద్దరిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఇద్దరి మధ్య గొడవకు కారణాన్ని ఫిర్యాదు రూపంలో రాయమని పోలీసులు ఇద్దరిని అడిగారు. రిక్షా అతడికి చదువు రాకపోవడంతో ఫిర్యాదును సరిగా రాయలేకపోయాడు. కానీ విచిత్రంగా పక్కనే ఉన్న బిచ్చగాడు మాత్రం ఫిర్యాదును ఇంగ్లీష్లో రాయడంతో ఆశ్చర్యపోవడం పోలీసులు వంతైంది. అందులోనూ ఆ బిచ్చగాడు రాసిన ఫిర్యాదులో ఒక్క తప్పు కూడా లేకపోవడం విశేషం. దీంతో బిచ్చగాడి గురించి పోలీసులు ఆరా తీయగా అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. అతను బిచ్చగాడు కాదని... ఒక ఇంజనీర్ అని తెలిసింది. వినడానికి అచ్చం సినిమా కథను తలపిస్తున్నా.. ఇది అక్షరాల నిజం. ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన గిరిజా శంకర్ మిశ్రా .. తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అనాథ ఆశ్రమంలో పెరగుతూ మిశ్రా కష్టపడి బీఎస్సీ గ్రూప్లో డిగ్రీ చదివాడు. ఆ తర్వాత ముంబయి వెళ్లి కొన్ని రోజులు ఉద్యోగం చేశాడు. తర్వాత సీపెట్ నుంచి ప్లాస్టిక్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేసి హైదరాబాద్లోని మిల్టన్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేశాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ చేస్తున్న ఉద్యోగాన్ని, హైదరాబాద్ను వదిలి ఒడిశాలోని పూరికి తిరిగి వచ్చి జగన్నాథ ఆలయం దగ్గర బిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఇదే విషయమై గిరిజా శంకర్ మిశ్రాను అడడగా.. ' ఈ విషయం గురించి నేను ఏమి మాట్లాడలేను. నేను బిచ్చగాడిగా మారడానికి నాకు కొన్ని సొంత కారణాలు ఉన్నాయి. నేను ఇంజనీర్గా పని చేసిన మాట నిజమే.. కానీ నాపై అధికారులతో విభేదాలు వచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చి ఇలా బిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నానని' తెలిపాడు. అయితే ఎలాంటి కేసు నమోదు చేయొద్దని మిశ్రా పోలీసులను అభ్యర్థించడంతో వారు అందుకు అంగీకరించి ఇద్దరిని వదిలిపెట్టారు. మిశ్రా తన ఉద్యోగాన్ని వదిలేసి బిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నా.. రోజు రాత్రిళ్లు మాత్రం వీధి దీపాల కింద వార్తా పత్రికలను క్రమం తప్పకుండా చదువుతాడని తెలిసింది. -
అగ్ని–2 రాత్రి పరీక్ష విజయవంతం
బాలాసోర్ (ఒడిశా) : భూతలం నుంచి భూతలంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని 2’కు మొదటిసారి రాత్రిపూట నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని డాక్టర్ అబ్దుల్ కలామ్ ద్వీపంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) కాంప్లెక్స్ 4 నుంచి దీన్ని పరీక్షించామని రక్షణ శాఖ తెలిపింది. ఈ క్షిపణికి 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంది. దాదాపు 20 మీటర్ల పొడవున్న ఈ క్షిపణి బరువు సుమారు 17 టన్నులు. మరో 1000 కేజీల పేలోడ్ను ఇది మోసుకెళ్లగలదు. అగ్ని–2 క్షిపణిని మొదటిసారి 1999 ఏప్రిల్ 11న పరీక్షించారు. చివరిసారిగా 2018 ఫిబ్రవరి 20న పరీక్షించిన ఈ క్షిపణి ఇప్పటికే సైన్యం అమ్ముల పొదిలో చేరింది. -
ఒడిశా విశ్వ కవి సమ్మేళనం
ప్రతి ఏటా నిర్వహించే విశ్వ కవి సమ్మేళనం, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు, కళింగ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 39వ సమ్మేళనాన్ని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీ వేదికగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. 82 దేశాల నుంచి 1,300 మంది కవులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. యునెస్కో అనుబంధంగా ప్రపంచ సాంస్కృతిక మరియు కళల సంస్థలో భాగమైన ఈ విశ్వ కవుల వేదిక (గిఇ్క) 1969లో ప్రారంభమైంది. మనదేశంలో జరుగుతున్న మూడో విశ్వ కవి సమ్మేళనం ఇది. తమ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే అవకాశం కలగడం తనకు గర్వకారణమని సామాజిక వేత్త, లోక్సభ సభ్యులు ప్రొఫెసర్ అచ్యుతా సామంత తన అధ్యక్షోపన్యాసంలో పేర్కొన్నారు. గత ఏడాది చైనాలో నిర్వహించిన సమ్మేళనంలోకన్నా ఎక్కువ మంది ప్రతినిధులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కవిత్వం, ప్రపంచ శాంతి దిశగా మానవీయ తత్వపు లక్ష్యాల దిశగా కొనసాగగలదని వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పొయెట్రీ అధ్యక్షుడు డాక్టర్ మారస్ యంగ్ ఆశించారు. గతంలో రెండు ఉత్సవాలను భారతదేశంలో ఎంతో ఘనంగా నిర్వహించారని ఆయన గుర్తు చేసుకున్నారు. నాటి సభలకు దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారనీ, కలామ్ రెండు పుస్తకాలను తాను చైనీస్లోకి అనువాదం చేయగా అవి ఎంతో పాఠకాదరణ పొందాయనీ అన్నారు. వేదిక ఉపాధ్యక్షులు, అర్జెంటీనా కవి ప్రొఫెసర్ ఎర్నెస్టో కహాన్, కవులంతా మానవత్వాన్ని ఆపేక్షించే విశ్వ కుటుంబమని కొనియాడారు. ఈ సభలో ప్రసిద్ధ రచయిత రస్కిన్ బాండ్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. సమ్మేళనం మొదటి రోజు ఆఫ్రికా, ఫ్రాన్స్, మంగోలియా, జపాన్, చైనా తదితర దేశాల యువ కవులు తమ కవితలను సొంత భాషలోనూ, ఇంగ్లిష్ అనువాదాలనూ వినిపించడం సభలో ఉత్సాహాన్ని నింపింది. సమ్మేళనం రెండో రోజు జరిగిన ప్రారంభ కార్యక్రమంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక సభ్యుల చేతుల మీదుగా తెలంగాణకు చెందిన ప్రముఖ కవి సిద్ధార్థ ఆంగ్ల కవితా సంపుటి జాస్మిన్ వాటర్ (మల్లెల తీర్థం) ఆవిష్కరణ ఘనంగా జరిగింది. కరుణ ప్రధానంగా సాగిన ఈ సంపుటి ప్రపంచ పాఠకులను ఆకట్టుకోగలదని మారస్ యంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ భావావేశాన్ని తెలుగులో పట్టినంత ఉద్వేగంగా ఆ అంతస్సారాన్ని ఇంగ్లిష్లోకి కూడా తర్జుమా చేయడంలోనూ సిద్ధార్థ కృతకృత్యులయ్యారు. ఈ కవితా సంపుటిని విశ్వవేదిక మీద ఆవిష్కరించేలా కృషి చేసిన బ్లూజే ప్రింట్స్ నిర్వాహకులు, పాత్రికేయులు, డాక్యుమెంటరీ డైరెక్టర్ రాజా రమేశ్ అభినందనీయులు. -
రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరవుతారు. ఉదయం 7:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకుంటారు. సీఎం జగన్ ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. రాష్ట్రాల్లో నక్సలిజం సమస్యపై తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సారథ్యంలో సమావేశం జరుగుతుంది. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎం లు, ఇతర కీలక పోలీసు అధికారులు దీనిలో పాల్గొంటారు. మన రాష్ట్రంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న నక్సలిజం సమస్యపై చర్చ జరగనుంది. సాయంత్రం వరకూ ఈ సమావేశం కొనసాగుతంది. మంగళవారం ఉదయం బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరిగి విజయవాడ చేరుకుంటారు. -
రేపు ఒడిశాలో నరేంద్ర మోదీ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ : ఫొని తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ఒడిశాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆదివారం ఆయన ఒడిశాలో పర్యటించి, పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ మేరకు ప్రధాని శనివారం తన ట్వీటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. కాగా ఫొని తుపానుకు ఒడిశాలో ఎనిమిదిమంది మృతి చెందారు. Day after tomorrow, on the 6th morning, I will be going to Odisha to take stock of the situation arising in the wake of Cyclone Fani. — Chowkidar Narendra Modi (@narendramodi) 4 May 2019 మరోవైపు ఒడిశాలో ముందుజాగ్రత్త చర్యగా రైలు, విమాన సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. భువనేశ్వర్, కోల్కతా విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతోంది. భువనేశ్వర్, పర్యాటక క్షేత్రం పూరీ రైల్వేష్టేన్లు తీవ్ర గాలుల ధాటికి పూర్తిగా దెబ్బతిన్నాయి. పై కప్పులు ఎగిరిపోయాయి. ఇక వివిధ ప్రాంతాల్లో 34 సహాయక బృందాలు పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఫొని తుపాను గండం నుంచి బయటపడినా, భారీ వర్షాలు కురవడంతో ఒడిశాలో జన జీవనం స్తంభించిపోయింది. -
ఆంధ్రప్రదేశ్ తీరం దాటేసిన ఫొని తుపాను
-
ఉత్తరాంధ్రకు ముప్పు తప్పింది..
సాక్షి, విశాఖ : ప్రచండ వేగంతో దూసుకొస్తున్న ఫొని తుపాను ఆంధ్రప్రదేశ్ను దాటడంతో ఉత్తరాంధ్రకు ముప్పు తప్పింది. తుపాను శ్రీకాకుళం జిల్లాను దాటినా, దాని ప్రభావం 30 కిలోమీటర్ల వరకూ ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఫొని తుపాను ప్రస్తుతం పూరికి 40 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ ఉదయం లేదా మధ్యాహ్ననికి పూరికి సమీపంలో తుపాను తీరం దాటనుంది. ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ, క్రమేణా బలహీనపడి అతి తీవ్ర తుపానుగా పశ్చిమ బెంగాల్ వైపు పయనించనుంది. తీరం దాటే సమయంలో 170 నుంచి 200 కిలోమీటర్ల వరకూ పెనుగాలులు వీయనున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లాలో 60 నుంచి 115 కిమీ వరకూ పెనుగాలులు వీచే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఫొని తుపాను జిల్లాను దాటింది: కలెక్టర్ ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ...ఫొని తుపాన్ జిల్లాను దాటిందని, కంచిలి మండలంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు తెలిపారు. ఇచ్చాపురం మండలంలో 140 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయని, సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలను తరలించినట్లు వెల్లడించారు. ఇచ్ఛాపురంలో మూడు ఇళ్లు మినహా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదన్నారు. విద్యుత్ స్తంభాలు కొన్ని దెబ్బతిన్నట్లు సమాచారం అందిందని, వాటిని తక్షణమే పునరుద్ధరణ చేస్తామన్నారు. రహదారిపై రాకపోకలకు అంతరాయం లేకుండా చూస్తామని, తుపాను అనంతరం వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, బహుదా, వంశధార నదులుకు వరదలు వస్తాయని, ఇసుక తవ్వకాలు లేదా ఇతర పనులకు నదుల్లోకి వెళ్లరాదని కలెక్టర్ సూచించారు. నదీతీరంలోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకున్నామని, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సెల్ సర్వీసులకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. తుపాను ప్రభావిత మండలాల్లో ఇంట్రా సర్కిల్ రోమింగ్ విధానం అమల్లో ఉందని, ఓ ఆపరేటర్ టవర్ పనిచేయకపోయినా ఆ ప్రాంతంలో ఉన్న ఇతర ఆపరేటర్ల టవర్ ద్వారా సెల్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో చెట్లు కూలాయి. ఓడ రేవుల్లో కొనసాగుతున్న ప్రమాద హెచ్చరికలు.. మరోవైపు ఓడ రేవుల్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. భీమునిపట్నం, కళింగపట్నం ఓడరేవుల్లో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, విశాఖ, గంగవరం పోర్టుల్లో 8వ నంబర్, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. -
‘ఫొని’ హెచ్చరిక, ప్రజలకు ఆర్టీజీఎస్ విజ్ఞప్తి
సాక్షి, విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫొని తుఫాను అలజడి సృష్టిస్తోంది. ప్రస్తుతం విశాఖ తీరానికి 235 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. శ్రీకాకుళం జిల్లాకు కేవలం 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం నుంచే ఒడిశా వైపుగా ప్రయణిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాకు భారీ ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. బంగాళాగాతంలో అతి తీవ్ర తుపాన్గా మారిన ఫొని ప్రభావంతో ఉత్తర శ్రీకాకుళం, తీరప్రాంత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రెండురోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫొని తుపాన్ ప్రస్తుతం కాకినాడ నుంచి తూర్పు ఆగ్నేయ దిశగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఉంది. దీని ప్రభావంతో విశాఖపట్నం,తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. నిన్న సాయంత్రం పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర ఈశాన్య దిశగా తుఫాన్ దిశ మార్చుకుంది. ప్రస్తుతం ఈశాన్య దిశలోనే కదులుతూ గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. రేపు మధ్యాహ్నం పూరీకి సమీపంలో తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వరకు ప్రచండ గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఫొని తుఫానును విశాఖ, మచిలీపట్నం, చెన్నైలోని రాడార్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. ఒకటిన్నర మీటర్ల ఎత్తులో అలలు తీరాన్ని తాకుతున్నాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా ఒడిశాలోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా అలలు ఎగసిపడే సూచనలు కనిపిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. శ్రీకాకుళం ఉత్తర, తీరప్రాంత మండలాల్లో రెడ్ అలర్ట్ ఫొని తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా ఉత్తర, తీరప్రాంత మండలాల్లో రెండురోజుల పాటు రెడ్ అలర్ట్ కొనసాగనుంది. శ్రీకాకుళం తీరప్రాంత మండలాల్లో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రాంతాల్లో పెనుగాలలు వీస్తాయని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. శ్రీకాకుళంలో తీవ్ర ప్రభావమున్న మండలాలు : గార, ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, సంతబొమ్మాళి, పలాస, పొలాకి, నందిగం, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం అలాగే విజయనగరం తీరప్రాంత మండలాల్లో గంటకు 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు వేస్తాయని... ఈరోజు అర్థరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు వరకు తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విజయనగరం: భోగాపురం, చీపురుపల్లి, డెంకాడ, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాల్లోని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, తుపాన్ తీరం దాటడానికి ముందు ఎవరూ బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని, వాహనాలపైన బయట సంచరించకూడదని ప్రజలకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సూచించింది. ఆర్టీజీఎస్ తుపాన్ గమనాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ...తీరప్రాంతాలను సర్వైలెన్స్ కెమెరాల ద్వారా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పర్యాటకులకు అనుమతి నిరాకరణ పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో అలల ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో పర్యాటకులను అధికారులు అనుమతించడం లేదు. తుపాను హెచ్చరికలతో పశ్చిమగోదావరి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మొగల్తూరు, నరసాపురం, భీమవరం, పాలకొల్లు, యలమంచిలి, ఆచంట మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 8 పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతంలో సముద్రపు అలలు సాధారణం కంటే రెండు, మూడు మీటర్ల ఎత్తు పెరుగుతుందంటూ హెచ్చిరించారు. తీర ప్రాంతంలోని ప్రతీ మండలానికి అందుబాటులో 108, 104 వాహనాలు ఉంచారు. ప్రజలకు ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) విజ్ఞప్తి తుపాన్ పర్యవేక్షణకు పరిష్కార వేదికలో ప్రత్యేక ఏర్పాట్లు ఆర్టీజీఎస్ నుంచి సర్వైలెన్స్ కెమెరాల ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యవేక్షణ కాకినాడ నుంచి తూర్పు ఆగ్నేయ దిశగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఫోని తుపాన్ శ్రీకాకుళం ఉత్తర, తీరప్రాంత మండలాల్లో కొనసాగుతున్న రెడ్ అలర్ట్ శ్రీకాకుళం తీరప్రాంత మండలాల్లో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రాంతాల్లో పెనుగాలలు విజయనగరం తీరప్రాంత మండలాల్లో గంటకు 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు ఈరోజు అర్థరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనున్న ఫొని తుపాన్ ఉత్తర, తీరప్రాంత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈరోజు మరియు రేపు అతి భారీ వర్షాలు కురిసే సూచనలు -
పొంచివున్న ‘ఫొని’ ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: ఊహించినట్టుగానే ‘ఫొని’ తుపాను తీవ్రరూపం దాల్చింది. అతి తీవ్ర తుపానుగా మారి ఉత్తర కోస్తాంధ్ర తీరం సమీపం నుంచి ఒడిశా వైపు దూసుకెళ్తోంది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పెను విధ్వంసం సృష్టించే దిశగా పయనిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను సోమవారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారింది. ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 690, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 760 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. మంగళవారం నాటికి అతి తీవ్ర తుపానుగా మారనుంది. ఒకటో తేదీ వరకు వాయవ్య దిశగా పయనిస్తూ పెను తుపాను (సూపర్ సైక్లోన్)గా బలపడనుంది. అనంతరం ఉత్తర వాయవ్య దిశగా మలుపు తిరిగి ఒడిశా తీరం వైపుగా కదులుతోంది. పెను తుపాను ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు అదే తీవ్రతతో కొనసాగనుంది. ఇదే ఇప్పుడు అందరిలోనూ తీవ్ర ఆందోళనను రేపుతోంది. బంగాళాఖాతంలో మంగళవారం గంటకు 135 నుంచి 160, బుధవారం నుంచి శుక్రవారం (3వ తేదీ) వరకు 160–200 కిలోమీటర్లు, 4వ తేదీన 150–190 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయనున్నాయి. ఒకటి, రెండు తేదీల్లో ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో గంటకు 60–85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఈ ఫొని తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై అధికంగా ఉండనుంది. మంగళ, బుధవారాల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, గురువారం నుంచి ఒడిశా, ఉత్తరాంధ్రల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్లో వెల్లడించింది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. మే 4వ తేదీ వరకు పెనుగాలుల ధాటికి సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడనున్నాయి. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఐదో నంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ కూడా హై అలర్ట్ ప్రకటించాయి. సుదీర్ఘ తుపాను.. ఫొని తుపాను ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఇది తీవ్రరూపం దాల్చడమే కాదు.. దీని వేగం రోజుకో విధంగా ఉంటోంది. నెమ్మది నెమ్మదిగా కదులుతూ మరింత బలం పుంజుకుంటోంది. ఎక్కువ రోజులు సముద్రంలోనే ఉంటూ రోజురోజుకు తీవ్రతను పెంచుకుంటోంది. దాదాపు పది రోజులపాటు కొనసాగుతూ అరుదైన తుపానుగా ప్రత్యేకతను సంతరించుకుంటోంది. సాధారణంగా అల్పపీడనం ఏర్పడ్డాక వాయుగుండం, తీవ్ర వాయుగుండం, తుపాను, తీవ్ర తుపానుగాను బలపడుతూ తీరాన్ని దాటతాయి. కానీ, ఈ ఫొని తుపాను అల్పపీడనంగా ఏర్పడిన రెండు రోజుకే తుపానుగా మారి వారం రోజుల పాటు బంగాళాఖాతంలోనే వివిధ రూపాలు మార్చుకుంటూ, బలం పెంచుకుంటూ సూపర్ సైక్లోన్ స్థాయికి చేరుకుంటోంది. ఇలాంటి తుపానులు అత్యంత అరుదని, ఇటీవల కాలంలో ఇంత సుదీర్ఘంగా కొనసాగిన తుపానులు లేవని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కోస్తా అంతటా అప్రమత్తం: ఎల్వీ అంతకు ముందు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. తుపాను ఎదుర్కొనేందుకు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను వివరించారు. ఇప్పటికే అందరు కోస్తా తీరప్రాంత జిల్లాల కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీచేశామని ఆయన తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, కోస్టుగార్డు, ఫైర్ సర్వీసెస్ తదితర ఏజెన్సీలను అప్రమత్తం చేశామన్నారు. తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాట్సప్, ఐవీఆర్ఎస్ ద్వారా కూడా తెలియబరుస్తున్నామని సీఎస్ వివరించారు. కాగా, రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ కింద.. కరువు సహాయ చర్యల కింద రూ.500 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని, ఎన్నికల నియామవళితో ఆ నిధులు రాలేదని సీఎస్ చెప్పగా దానికి ఎన్నికల నియామవళి అడ్డురాదని ఆ నిధులు కేంద్రం నుంచి విడుదల అవుతాయని కేబినెట్ కార్యదర్శి సిన్హా చెప్పారు. తుపానును ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధం నాలుగు రాష్ట్రాల సీఎస్లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి సిన్హా సమీక్ష సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ తుపానును ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్కుమార్ సిన్హాకు వివరించారు. ఈ తుపానును ఎదుర్కొనేందుకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలపై సిన్హా ఆయా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సోమవారం ఢిల్లీ నుంచి వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పూర్తి కార్యాచరణ ప్రణాళికలతో అన్ని విధాలా సన్నద్ధమై ఉండాలని, కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సిన్హా భరోసా ఇచ్చారు. ఈ తుపాను మరో 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నందున తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకు గల నాలుగు తీరప్రాంత రాష్ట్రాల యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, మత్య్సకారులు ఎవ్వరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే వేటకు వెళ్లి ఉంటే వారిని తిరిగి తీరానికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. -
ఎన్నారై భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్ష
పాతపట్నం: ఎన్నారై భర్త మోసం చేశాడంటూ భార్య మౌన పోరాటం చేసిన సంఘటన పాతపట్నం ఎస్సీ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలంలోని హరిజన గోపాలపురం గ్రామానికి చెందిన పట్నాల సింహాద్రి, భారతిల కుమార్తె శిరీషకు పాతపట్నం ఎస్సీ కాలనీకు చెందిన సాన ధర్మపురి, విజయల కుమారుడు సాన గౌరీశంకర్తో 2016లో వివాహం జరిగింది. గౌరీశంకర్లో బ్యాంకాక్లో పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో రూ.5 లక్షలు, 5 తులాల బంగారం, ఇతర వస్తువులు కానుకగా ఇచ్చారు. పెళ్లయిన నెల రోజుల నుంచే అదనపు కట్నం కావాలంటూ అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. రెండు నెలలు గడిచిన తర్వాత శిరీషను బ్యాంకాక్ తీసుకెళ్లిన గౌరీశంకర్ 15 రోజుల అనంతరం భార్యను ఒంటరిగా పాతపట్నం పంపించేశాడు. అప్పటి నుంచి శిరీష కన్నవారింట్లోనే ఉంటుంది. గౌరీశంకర్ మాత్రం పాతపట్నం రాకుండా విదేశాల్లోనే ఉంటున్నాడు. ఎప్పటికీ భర్త రాకపోవడంతో శిరీష శనివారం తన మూడేళ్ల కుమారుడు సుజిత్ శంకర్తో కలిసి మౌనదీక్షకు సిద్ధమైంది. విషయం తెలుసుకున్న అత్తమామలు ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా బాధితురాలు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయని, పోలీసులు స్పందించి తన భర్త పాతపట్నం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రాధేయపడింది. -
బీజేపీ, కాంగ్రెస్కు సమదూరం: నవీన్
భువనేశ్వర్: లోక్సభ ఎన్నికలకు ముందు విపక్షాలు ప్రతిపాదిస్తున్న మహాకూటమిలో చేరబోమని బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్లకు సమాన దూరం పాటిస్తామని బుధవారం తేల్చిచెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏకం కావాలని బీజేపీయేతర పక్షాలు ప్రయత్నిస్తున్న సమయంలో నవీన్ పట్నాయక్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మహాకూటమిలో చేరికపై నిర్ణయానికి కొంత సమయం కావాలని ఆయన ఢిల్లీలో చెప్పిన మరుసటి రోజే ఈ విధంగా స్పందించడం గమనార్హం. బీజేడీకి కాంగ్రెస్తో రహస్య అవగాహన ఉందని బీజేపీ ఆరోపించగా, బీజేడీ ఎప్పటికీ బీజేపీ పక్షమేనని కాంగ్రెస్ పేర్కొంది. -
చీకట్లోనూ పృథ్వీ–2 సక్సెస్
బాలాసోర్: అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన పృథ్వీ–2 క్షిపణి రాత్రిపూట ప్రయోగం విజయవంతమైంది. యాదృచ్ఛికంగా ఎంపికచేసిన ఈ క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) మొబైల్ లాంచర్ నుంచి శనివారం పరీక్షించారు. ఆర్మీకి చెందిన వ్యూహాత్మక విభాగం అధికారులు ఈ ప్రయోగం చేపట్టగా, డీఆర్డీఓ శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. సాధారణ శిక్షణలో భాగంగానే ఈ పరీక్ష నిర్వహించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. క్షిపణి ప్రయాణించిన మార్గాన్ని రాడార్లు, టెలిమెట్రి, ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థల ద్వారా పరిశీలించారు. -
గజగజ..!
10.3.2018 టొంపటగూడ కుమార్ పాతపట్నం నియోజకవర్గంలోని కొత్తూరు మండలం రాయల పంచాయతీ పరిధి టింపటగూడ గిరిజన గ్రామానికి చెందిన యువకుడు. సమీపంలోని పొన్నుటూరు వద్ద చెరకు తోటలోకి వెళ్లిన అతనిపై ఏనుగులు దాడిచేసి చంపేశాయి. 14.4.2018 పాతపట్నం నియోజకవర్గంలోనే మెళియాపుట్టి మండలంలో హీరాపురం గ్రామానికి చెందిన ఎం నీలమ్మ అనే గిరిజన వృద్ధురాలు ఎప్పటిలాగే జీడితోటలోకి వెళ్లింది. ఏనుగులు ఆమెపై దాడిచేసి ప్రాణాలు తీశాయి. 15.4.2018 మెళియాపుట్టి మండలంలోనే పెద్దమడి గ్రామానికి చెందిన సవర రామారావు (47) ఎప్పటిలాగే జీడితోటలోకి పశువులను మేతకు తోలుకెళ్లాడు. అక్కడే ఉన్న ఏనుగుల గుంపు అతన్ని తొక్కి చంపేశాయి. రెండ్రోజుల తర్వాత మంగళవారం అతని మృతదేహం బయటపడింది. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం : ఈ ముగ్గురి ప్రాణాలు తీసినవీ ఒడిశా ఏనుగులే. ఒక గున్న ఏనుగు సహా మొత్తం ఎనిమిది ఏనుగులు గత రెండు నెలలుగా జిల్లాలో వీరవిహారం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటనే కాదు ప్రాణాలనూ బలిగొంటున్నాయి. ఏ నిమిషంలో ఎటువైపు నుంచి దాడి చేస్తాయోనని సరిహద్దు ప్రాంతంలోని రైతులు, గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ ఏనుగులను ఒడిశా దారి పట్టించడానికి గత నెల 27వ తేదీన ప్రారంభించిన ఆపరేషన్ గజేంద్ర తొలుత కొంతవరకూ సత్ఫలితాలను ఇచ్చింది. అయితే రెండు వారాలుగా ఒడిశా ఏనుగుల ధోరణి ప్రమాదకరంగా మారడంతో ఆ ఆపరేషన్ కాస్తఆలస్యమవుతోంది. సరిహద్దుకు సమీపంలోనే... ప్రస్తుతం ఒడిశా–ఆంధ్రా సరిహద్దు మండలమైన మెళియాపుట్టిలో రెండు వారాలుగా ఎనిమిది ఏనుగులు తిష్టవేశాయి. వాటిలో ఒకటి గున్న ఏనుగు. ఇది గాకుండా మిగిలిన ఏడు ఏనుగులు గత ఏడాది కాలంలో ఒడిశా నుంచి మన జిల్లాలోకి చొరబడటం, కొన్నాళ్ల తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లిపోవడం చేస్తుండేవి. అయితే ఎండాకాలం ప్రారంభంలో పలాస, మందస ప్రాంతంలోకి మరోసారి చొరబడిన ఈ ఏనుగులతో గున్న ఏనుగు కూడా తోడయ్యింది. ఆహారం, నీరు వెతుక్కోవడంతో పాటు ఆ చిన్న ఏనుగును రక్షించుకోవడంపైనే మిగతా ఏడు ఏనుగులు దృష్టి పెడుతున్నాయి. గత నెలాఖరులో ఆహారం, నీరు వెతుక్కుంటూ వంశధార నదీ వెంబడి ఆమదాలవలస రూరల్ ప్రాంతంలోకి వచ్చేశాయి. వాటిని వెనక్కి మళ్లించేందుకు అటవీశాఖ అధికారులు ఆపరేషన్ గజేంద్ర పేరుతో చర్యలు చేపట్టారు. 50 మంది సుశిక్షిత సిబ్బందిని రంగంలోకి దించారు. అలాగే చిత్తూరు నుంచి గణేష్, జయంతి అనే కుకీ (శిక్షణ పొందిన) ఏనుగులను రప్పించారు. వాటి సహాయంతో ఒడిశా ఏనుగులను వెనక్కి మళ్లించడానికి చర్యలు చేపట్టారు. ఈ ప్రారంభంలో సజావుగానే సాగింది. మెళియాపుట్టి వెళ్లిన తర్వాత మొండికేశాయి. జీడితోటలు, అరటితోటలతో పాటు చెరువుల్లో నీరు ఉండటంతో అక్కడే తిష్టవేశాయి. ఆపరేషన్ గజకు సంబంధించిన చర్యలతో పాటు వాటిని చూడటానికి వచ్చే ప్రజల హడావుడి, స్థానికులు టపాసులు, బాంబులను పేల్చి హోరెత్తించడంతో ఆ ఏనుగుల ధోరణిలో మార్పు వచ్చింది. అత్యంత ప్రమాదకరంగా మారాయి. తామున్న తోటల్లో ఎవరు వచ్చినా దాడిచేసి ప్రాణాలు తీస్తున్నాయి. గత వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఆ విధంగానే బలయ్యారు. సరిహద్దులో గజగజ... మెళియాపుట్టి మండలంలో నుంచి ఏనుగులను ఒడిశా సరిహద్దు దాటించాలంటే దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరమే ఉంది. మధ్యలోనున్న నందలకొండపైకి వాటిని మళ్లించాలి. ఈ మార్గంలో భరణికోట, భరణికోట కాలనీ, జక్కరివీధి, బంజీరు వంటి ఆరేడు గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో జీడిమామిడి, అరటి తోటలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఆహారం సమృద్ధిగా లభిస్తుండటంతో పగలంతా ఆ తోటల్లోనే ఏనుగులు ఉండిపోతున్నాయి. సాయంత్రం పూట కాస్త అక్కడి నుంచి కదిలినా ఆ సమయంలో కుకీ ఏనుగులు అక్కడికి వెళ్లే పరిస్థితి ఉండట్లేదని అటవీశాఖ సిబ్బంది చెబుతున్నారు. అయితే అవి మైదాన ప్రాంతం వైపు రాకుండా కుకీ ఏనుగులను అప్రమత్తం చేస్తున్నారు. ఒడిశా ఏనుగుల ధోరణి ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో బాణసంచా కాల్పులు కూడా ఆపేశారు. ప్రజలు ఏనుగులు ఉన్న తోటల్లోకి వెళ్లవద్దని హెచ్చరికలు చేస్తున్నారు. కానీ ఫలసాయం చేతికందే సమయంలో ఈ బెడద మొదలైందని, తాము తీవ్రంగా నష్టపోతున్నామని సరిహద్దులోని గిరిజనులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏనుగుల దాడిలో మృతులు... హిరమండలం మండలంలోని ఎగువ రుగడలో 2016 నవంబర్ 26వ తేదీన ఏనుగు దాడిలో పాతపట్నం మండలం సోద గ్రామానికి చెందిన కేసరి తవిటయ్య(70) ప్రాణాలు కోల్పోయాడు. 2007 డిసెంబరు 14న సీతంపేట మండలం చినబగ్గకు చెందిన పసుపురెడ్డి అప్పారావును, దోనుబాయ గ్రామానికి చెందిన సిరిపోతుల మేరమ్మను కోదుల వీరఘట్టం వద్ద ఏనుగులు మట్టుపెట్టాయి. 2007 డిసెంబరు 19వ తేదీన కుంబిడి నాగరాజు అనే వీరఘట్టానికి చెందిన విలేకరిని హుస్సేన్పురం వద్ద దారుణంగా చంపేశాయి. ఇదే మండలం సంతనర్సిపురం వద్ద తెంటు శ్రీనివాసరావును, వీరఘట్టం మండలం చలివేంద్రి వద్ద కొండగొర్రె సాంబయ్యను కూడా ఇదే తరహాలో ఏనుగులు పొట్టనపెట్టుకున్నాయి. ఒడిశాకు తరలించే ప్రయత్నాలు... ఎనిమిది ఏనుగులను ఒడిశాలోని అటవీ ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నాం. వాటి ధోరణి ప్రమాదకరంగా మారింది. అవి ఉన్న తోటల్లోకి వెళ్లవద్దని ప్రజలకు హెచ్చరికలు చేస్తున్నాం. కానీ కొంతమంది సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. అటవీ శాఖ సిబ్బంది అంతా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. జనావాసాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – సీహెచ్ శాంతిస్వరూప్, జిల్లా అటవీశాఖాధికారి, శ్రీకాకుళం. -
ఫ్రంట్: కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్ : దేశంలో గుణాత్మక మార్పుకోసం జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫెడరల్ ఫ్రంట్లో చేరే పార్టీలు, ఆ పార్టీ అధినేతలతో దశలవారీగా భేటీ కావడానికి ఇప్పటికే సీఎం రూట్మ్యాప్ రూపొందించుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవేగౌడలతో కేసీఆర్ భేటీ అయి ప్రస్తుత రాజకీయాలు, జాతీయ స్థాయిలో పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. తాజాగా కేసీఆర్ ఒడిశాలో పర్యటించనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్తో ఆయన సమావేశం కానున్నారు. ఒడిశాలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో మే మొదటి వారంలో నవీన్ పట్నాయక్తో భేటీ కావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. -
ఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం
ఒడిశా: ఒడిశాలో శుక్రవారం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కలహండి జిల్లా భవానీపట్నం వద్ద నది వంతెన పైనుంచి బస్సు అదుపు తప్పి కిందపడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో 34 మందికి గాయాలయ్యాయి. బస్సు దాదాపు 55 మంది ప్రయాణికులతో భువనేశ్వర్ నుంచి భవానీపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అధికారులు, పోలీసులు, స్థానికులు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. -
నాగావళిలో తల్లి మృతి, కుమారుడు గల్లంతు
విజయనగరం: స్నానం చేసేందుకు నదిలోకి దిగిన ముగ్గురు కుటుంబ సభ్యుల్లో తల్లి మృతిచెందగా కుమారుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఒరిస్సా రాయగడ మజ్జిగౌరీ అలయం వద్ద జరిగింది. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన శాంతి అనే మహిళ తన కుమార్తె ఇందు, కుమారుడు అఖిల్తో కలిసి స్నానం చేసేందుకు నాగావళి నదికి వెళ్లింది. నీట మునిగి శాంతి మృతిచెందగా అఖిల్ గల్లంతయ్యాడు. ఇందు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు అఖిల్ కోసం గాలింపు చేపట్టారు. -
ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
సాక్షి, భువనేశ్వర్: పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు హత్యచేశారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా చిత్రకొండ వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. అదేవిధంగా రహదారి పనులకు వినియోగిస్తున్న జేసీబీ, మూడు ట్రాక్టర్లను తగులబెట్టారు. ఏవోబీలో గడిచిన 15 రోజుల్లో ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఇప్పటి వరకు 15 మందిని చంపినట్లుగా సమాచారం. -
నీ భార్య తప్పు చేసిందని ఊరంతా చెప్పు!
ఒడిశా: భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.ప్రజాస్వామ్యంలో నచ్చిన వారికి ఓటు వేసుకునే అధికారం ఉంటుంది. కానీ అలా ఓటు వేసినందుకు ఓ గ్రామ కమిటీ ఆటవిక శిక్ష విధించింది. ఓ మహిళా ప్రజాప్రతినిధి, పంచాయతీ ఎన్నికల్లో గ్రామ కమిటీ నిర్ణయాన్ని ధిక్కరించి నచ్చిన అభ్యర్ధికి ఓటు వేసింది. దీంతో ఆ గ్రామ కమిటీకి కోపమొచ్చింది. తాము చెప్పిన అభ్యర్థికి ఓటు వేయలేదని ఆటవిక పద్దతిలో శిక్షించారు. వివరాల్లోకి వెళ్తే ఒడిశాలోని అనుగుల్ జిల్లా రగుడిపడాలో గ్రామంలో వార్డు సభ్యురాలు మల్లికా సాహు ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్థులు బలపరిచిన సర్పంచి అభ్యర్థికి ఓటు వేయలేదు. తనకు నచ్చిన అభ్యర్థికి వేశారు. ఈ విషయమై ఇటీవల గ్రామ కమిటీ సమావేశం నిర్వహించి వార్డు సభ్యురాలికి రూ.50వేలు జరిమానా వేసింది. అయితే మల్లికా సాహూ జరిమానా చెల్లించడంలో ఆలస్యమైంది. దీంతో ఆగ్రామ కమిటీకి కోపమొచ్చింది. ఆమె భర్త దుష్మంత్ సాహుకు కమిటీ సభ్యులు గురువారం శిక్ష విధించారు. జేగంట కొడుతూ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తిరుగుతూ తన భార్య తప్పు చేసిందని చెప్పాలని తీర్పు ఇచ్చారు. దీంతో గురువారం మల్లిక భర్త దుష్మంత్ సాహు తీవ్ర అవమాన భారంతో కుంగిపోయారు. జేగంట కొడుతూ పంచాయతీలోని గ్రామాలలో తిరుగుతూ గ్రామ కమిటీ సూచించినట్లు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామ కమిటీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒడిశాలో ప్రమాదం: ముగ్గురు మృతి
ఒడిశా: రాష్ట్రంలోని పూరి సమీపంలోని కోణార్క్ వద్ద ప్రయాణికుల బస్సు బోల్తాపడింది. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
ఏవోబీలో కాల్పులు.. మావోయిస్టు మృతి
ఒడిశా: భద్రాతాబలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందడంతో పాటు ఓ గిరిజనుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని నారాయణపట్నం లల్లేరి అటవీప్రాంతంలో బుధవారం ఉదయం ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలపై మావోలు కాల్పులు జరపడంతో.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందగా, ఓ గిరిజనుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన గిరజనుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు సమాచారం అందిస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. -
మావోయిస్టు అగ్రనేత సవ్యసాచి పండా అరెస్టు
రాయగడ : మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత సవ్యసాచి పండాను బరంపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని గంజాం జిల్లాలో సవ్యసాచి పండాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సవ్యసాచిపై రూ.17 లక్షల రివార్డు ఉంది. మరోవైపు ఒడిశాలో కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్ల నుంచి సీపీఐ మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే, దయ తప్పించుకున్నట్లు తెలిసింది. రాయగడ, కొరాపుట్ జిల్లాల సరిహద్దులో నారాయణపట్న, కొప్పడంగి ప్రాంతంలో గల బ్రిడ్జిగుడ గ్రామ సమీపంలోని అడవుల్లో సహీద్ వారోత్సవాలు నిర్వహించేందుకు మావోయిస్టులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడికి మావోయిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న వీహెచ్ఎఫ్ 118, 28వ బెటాలియన్ బలగాలు బుధవారం రాత్రి ఆ ప్రాంతంలో కూంబింగ్ ప్రారంభించాయి. సాయుధ బలగాల కదలికలను గమనించిన మావోయిస్టు నేతలు పరారయ్యారని తెలిసింది. తప్పించుకున్న వారిలో మావోయిస్టు నేతలు దయ, ఆర్కే, జంబు తదితరులున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు రఫ్కోన మీదుగా లులుపొదర్ కలహండి ప్రాంతానికి వెళ్లారని భావిస్తున్నారు. అక్కడున్న మావోయిస్టు శిబిరం నుంచి 4 టిఫిన్ క్యారియర్ బాంబులు, మందుపాతరకు వినియోగించే 50 మీటర్ల వైరు, ఎనిమిది ఎలక్ట్రానిక్ డిటొనేటర్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇక్కడ పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. -
తప్పించుకున్నమావోయిస్టు అగ్రనేతలు?
రాయగడ: ఒడిశాలో కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్ల నుంచి సీపీఐ మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే, దయ తప్పించుకున్నట్లు తెలిసింది. రాయగడ, కొరాపుట్ జిల్లాల సరిహద్దులో నారాయణపట్న, కొప్పడంగి ప్రాంతంలో గల బ్రిడ్జిగుడ గ్రామ సమీపంలోని అడవుల్లో సహీద్ వారోత్సవాలు నిర్వహించేందుకు మావోయిస్టులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడికి మావోయిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న వీహెచ్ఎఫ్ 118, 28వ బెటాలియన్ బలగాలు బుధవారం రాత్రి ఆ ప్రాంతంలో కూంబింగ్ ప్రారంభించాయి. సాయుధ బలగాల కదలికలను గమనించిన మావోయిస్టు నేతలు పరారయ్యారని తెలిసింది. తప్పించుకున్న వారిలో మావోయిస్టు నేతలు దయ, ఆర్కే, జంబు తదితరులున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు రఫ్కోన మీదుగా లులుపొదర్ కలహండి ప్రాంతానికి వెళ్లారని భావిస్తున్నారు. అక్కడున్న మావోయిస్టు శిబిరం నుంచి 4 టిఫిన్ క్యారియర్ బాంబులు, మందుపాతరకు వినియోగించే 50 మీటర్ల వైరు, ఎనిమిది ఎలక్ట్రానిక్ డిటొనేటర్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇక్కడ పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. -
కిడ్నీ రాకెట్ గుట్టురట్టు
-
కిడ్నీ రాకెట్ కేసులో విశాఖ సెవెన్ హిల్స్ ఎండీ అరెస్ట్!
విశాఖ : సంచలనం సృష్టించిన ఒడిశా కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ బాబును కటక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ బాబు విశాఖలోని సెవెన్స్ హిల్స్ ప్రయివేట్ ఆస్పత్రిలో ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. గత నాలుగు రోజులుగా కటక్ పోలీసులు ప్రబాకర్ బాబును అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే అనారోగ్యంగా ఉందంటూ ఆయన కేజీహెచ్లో చేరారు. మరోవైపు ఈ కిడ్నీ రాకెట్ కేసులో ప్రభాకర్ బాబును పోలీసులు A1గా చేర్చారు. కటక్ పోలీసులు అతడిని ఒడిశాకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
ఒడిశాలో నవీన్ మేజిక్
అసెంబ్లీ ఎన్నికల్లో 115 సీట్లలో బీజేడీ విజయ దుందుభి భువనేశ్వర్: దేశమంతా ఓవైపు నరేంద్ర మోడీ హవా కొనసాగుతున్నా ఒడిశాలో మాత్రం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మ్యాజిక్ పనిచేసింది. లోక్సభ ఎన్నికలతోపాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని అధికార బీజేడీ వరుసగా నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకొని విజయదుందుభి మోగించింది. మొత్తం 147 సీట్లకుగానూ మూడింట రెండొంతుల మెజారిటీతో 115 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్ 18, బీజేపీ 11, సమతా క్రాంతి దళ్ 1 సీటు గెలుచుకోగా రెండు చోట్ల స్వతంత్రులు గెలిచారు. అరుణాచల్ మళ్లీ కాంగ్రెస్దే ఇటానగర్: దేశవ్యాప్తంగా పేలవ ఫలితాలు కనబరిచినప్పటికీ అరుణాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంది. 60 సీట్లున్న అరుణాచల్ అసెంబ్లీలో 11 సీట్లు ఏకగ్రీవంకాగా మిగిలిన 49 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అధికార కాంగ్రెస్ 42 సీట్లతో (ఆ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచిన 11 సీట్లతో కలుపుకొని) విజయఢంకా మోగించింది. సిక్కింలో ఎస్డీఎఫ్కే: సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్)కే ప్రజలు పట్టం కట్టారు. మొత్తం 32 సీట్లుగల సిక్కిం అసెంబ్లీలో ఎస్డీఎఫ్ 23 సీట్లలో గెలుపొందగా సిక్కిం క్రాంతికారీ మోర్చా 9 సీట్లు గెలుచుకుంది -
పొంచి ఉన్న వరద ముప్పు
శ్రీకాకుళం, న్యూస్లైన్ ఒడిశాలో ఆదివారం సాయంత్రం భారీ వర్షాలు కురియటంతో వంశధార నదికి వరద వచ్చే పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వాస్తవానికి.. నాగావళి, వంశధార, బాహూదా నదుల్లో నీటి ప్రవాహం ఉదయంతో పోలిస్తే సాయంత్రానికి తగ్గుముఖం పట్టడంతో వరద ముప్పు తప్పినట్టేనని అధికారులు భావించారు. కానీ ఒడిశాలో వర్షాల కారణంగా సోమవారం ఉదయానికి పరిస్థితి మారి పోనుందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తు తం నాగావళి నదిలో శ్రీకాకుళం పాతవంతెన దగ్గర 5800 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. వంశధార నదిలో గొట్టా బ్యారేజీ వద్ద మధ్యాహ్నం 30 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించగా సాయంత్రానికి 24 వేల క్యూసెక్కులకు తగ్గింది. అయితే, రాత్రి పది గంటలకు ఇది 51,454 క్యూసెక్కులకు పెరిగింది. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షాలు కురియడంతో వంశధార నదికి వరద వచ్చే అవకాశం ఉందని భావిస్తూ కలెక్టర్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల మరో 10 వేల క్యూసెక్కుల నీరు అదనంగా చేరవచ్చని, దీనివల్ల వరద ప్రమాదం ఉండదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. 60 వేల క్యూసెక్కుల నీరు వస్తేనే వరద ముప్పు ఉంటుంద ని, అయితే ముందు జాగ్రత్తచర్యగా కలెక్టర్ హెచ్చరిక జారీ చేశారని అంటున్నారు. ఒడిశాలో వర్షాలు కొనసాగితే ముప్పు తప్పదని పేర్కొంటున్నారు. ఇక, ఇచ్ఛాపురంలో ఉదయం ఉగ్రరూపం దాల్చిన బాహుదా నది, సాయంత్రానికి కొంత శాంతించింది. ఉదయం 58,500 క్యూసెక్కుల నీరు ప్రవహించగా సాయంత్రం 6 గంటల సమయానికి ప్రవాహం 54 వేల క్యూసెక్కులకు తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 1999లో 73 వేల క్యూసెక్కులు ప్రవహించగా ఆ తర్వాత ఆదివారం ఉదయం ప్రవహించిన 58,500 క్యూసెక్కులే అత్యధికం కావటం గమనార్హం. ఇదిలా ఉండగా పంట కాలువలన్నీ నీట మునిగి ఉండడంతో ప్రస్తుతానికి నష్టాన్ని అంచనా వేసే పరిస్థితి లేదని నీటిపారుదల శాఖ అధికారులు చెప్పారు. తుపాను నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం ఎల్.ఎన్.పేట(హిరమండలం), న్యూస్లైన్: జిల్లాను వణికించిన పై-లీన్ తుపాను చేకూర్చిన నష్టాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తుపానుల రాష్ట్ర పరిశీలకుడు ఎస్.ఢిల్లీరావు అన్నారు. హిరమండలంలోని వంశధార ప్రాజెక్టు వద్ద ప్రవాహ వేగాన్ని ఆదివారం పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. తుపానుల నష్టాలను వెంటనే జిల్లా అధికారుల ద్వారా తమకు తెలియజేయూలని అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులకు ఆదేశించామన్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురవగా మరికొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు మాత్రమే వీచాయన్నారు. గాలులు కారణంగా పంటలు నేలకొరిగిపోవడం, పురిపాకలు పడిపోవడం, చెట్లు, తోటలు నేలమట్టం కావడంతో రైతులకు నష్టం వాటిల్లిందని చెప్పారు. పూర్తి స్థాయిలో నష్టాలను సేకరించాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. పై-లీన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఆయన వెంట హిరమండలం తహశీల్దారు డి.చంద్రశేఖరరావు వంశధార ఉద్యోగులు ఉన్నారు. వంశధార నదీతీర వాసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని డీఈ ఎస్. జగదీష్ తెలిపారు.