Advertisement
paris 2024 olympics
-
ప్యారిస్ ఒలింపిక్స్ : మంగోలియన్ల యూనిఫాం హాట్ టాపిక్
జూలై 26 నుండి ప్రారంభం కానున్న ప్యారిస్ ఒలింపిక్స్-2024 వేడుకల కోసం టీం మంగోలియా తన స్టయిల్తో ప్రపంచాన్ని మెస్మరైజ్ చేసింది. సంస్కృతి, ఫ్యాషన్ కలగలిసిన యూనిఫాంతో అందర్నీ అబ్బురపర్చింది. అలాగే ఈ యూనిఫాంలోని ఇతర హైలైట్లను చూసి క్రీడా ఫ్యాన్స్, నెటిజన్లు శభాష్ మంగోలియా అంటున్నారు. ఉలాన్బాతర్కు చెందిన ఫ్యాషన్ లేబుల్ మిచెల్ అండ్ అమెజాన్కా ఈ దుస్తులను రూపొందించారు. మంగోలియాకు సొంతమైన క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, తదితర మంగోలియన్ మూలాంశాలు, ఆ దేశ జెండాలోని “సోయోంబో” చిహ్నం , జాతీయ రంగులైన నీలం, ఎరుపు బంగారు రంగుల మేళవింపుతో వీటిని తయారు చేశారు. అలాగే ఈ ప్యారిస్ ఒలింపిక్ వేడుకలకు గుర్తుగా ఈఫిల్ టవర్ ఒలింపిక్ క్రీడా జ్యోతి మరింత హైలైట్గా నిలిచాయి.మంగోలియన్లు ధరించే సంప్రదాయ గౌనుకు డిజైనర్లు 'డీల్' అనే సొగసైన టచ్ ఇచ్చారు. ప్రారంభ వేడుకలో కాంటెంజెంట్ కవాతులో పాల్గొనే మంగోలియన్ క్రీడాకారులు ధరించే దుస్తులు, ఫ్లాగ్ జెండా బేరర్ల దుస్తులకు భిన్నంగా ఉంటాయి. ఇది స్టేడియం లోపల కాకుండా సెయిన్ నది వద్ద నిర్వహించనున్నారు. మంగోలియన్ అథ్లెట్లు గత రెండు ఒలింపిక్స్ క్రీడల సందర్భంగా మిచెల్ అండ్ అమెజాన్కా రూపొందించిన దుస్తులను ధరించడం గమనార్హం. View this post on Instagram A post shared by Michel&Amazonka (@michelamazonka)ప్రతి అథ్లెట్ బాడీ కొలతలను తీసుకుని 3 నెలలకు పైగా సమయం పట్టిందని డిజైనర్లు వెల్లడించారు. ఒక్కో సెట్ రూపొందించడానికి 6 దశల్లో సగటున 20 గంటలు పట్టిందని డిజైనర్లు చెప్పారు.కాగా 1964 గేమ్స్ నుండి, లాస్ ఏంజిల్స్ 1984 మినహా ప్రతి వేసవి ఒలింపిక్స్లో మంగోలియా పాల్గొంటూ వస్తోంది. ప్రస్తుతం క్రీడా సమరంలో మంగోలియన్ బృందంలో 30 మందికిపైగా అథ్లెట్లు ఉన్నారు. 2008లో బీజింగ్ గేమ్స్లో జూడో , బాక్సింగ్ క్రీడలో బంగారు పతకాలను గెల్చుకున్నమంగోలియన్లు ఈసారి మరిన్ని బంగారు పతకాలను గెల్చుకోవాలని ఆశిస్తున్నారు. నాలుగేళ్లకోసారి జరిగే 33వ ఎడిషన్ 2024 వేసవి ఒలింపిక్స్ జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరగబోతున్నాయి. 200 పైగా దేశాలు తమ అథ్లెట్లను 32 బరిలోకి దింపనున్నాయి. -
దేశం వద్దు పొమ్మంది.. అయినా పట్టువీడలే! సాహసం చేసి మరీ..
ఫరీబా హషిమి, యుల్డుజ్ ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు. వారిద్దరికి చిన్నతనం నుంచి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. ఒలింపిక్స్లో తమ దేశం తరుపన సత్తాచాటాలని ఎన్నో కలలు కన్నారు. విశ్వవేదికపై తమ జాతీయ జెండాను రెపరెపలాడించాలని తహతహలడారు. కానీ విధి మాత్రం మరోలా తలపిచింది.సొంత దేశమే వారికి అండగా నిలవలేదు. వారి కలను ఆదిలోనే తుంచేయాలని అక్కడి పాలకులు నిర్ణయించారు. మహిళలలు క్రీడల్లో పాల్గోకూడదని ఆంక్షలు విధించారు. కానీ ఆ అక్కచెల్లెల్లు మాత్రం ఎక్కడా నిరాశచెందలేదు. విశ్వక్రీడలే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఏకంగా దేశాన్ని విడిచి మరి ఒలిపింక్స్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యారు. తమ కలలను మరో వారం రోజుల్లో సాకారం చేసుకునేందుకు ఉర్రూతలూగుతున్నారు. ఇదింతా ఏ దేశమే కోసమో ఇప్పటికే మీకు ఓ అంచనా వచ్చి ఉంటుంది. అవును మీరు అనుకున్నది నిజమే. ఆ దేశమే తాలిబాన్లు పరిపాలిస్తున్న అఫ్గానిస్తాన్. ప్యారిస్ ఒలిపింక్స్ నేపథ్యంలో ఈ అఫ్గాన్ సైక్లిస్ట్ సిస్టర్ల స్టోరీపై ఒ లుక్కేద్దాం.అఫ్గాన్ ధీర వనితలు..2021లో అఫ్గానిస్తాన్ను తాలిబాన్లు ఆధీనంలో తీసుకున్నాక మహిళలు క్రీడల్లో పాల్గొనడంపై నిషేధం విధించారు. ఈ క్రమంలో ఫరీబా హషిమి, యుల్డుజ్ తమ కలలను సాకారం చేసుకునుందుకు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో అఫ్గానిస్తాన్లో చిక్కుకున్న తమ దేశ సైక్లిస్ట్ల తరలింపు కోసం ఇటలీ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది.దీంతో ఫరీబా, యుల్డుజ్ సైతం ఇటలీ వెళ్లే విమానం ఎక్కారు. అక్కడ వెళ్లాక సరైన కోచింగ్ను పొందేందుకు ఇటలీలోని సైక్లింగ్ టీమ్లో ఈ అఫ్గాన్ సోదరిలు చేరారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్లో ఏవోసీ(అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ) ప్యారిస్ ఒలింపిక్స్కు వెళ్లేందుకు లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ ఆరుగురు సభ్యులతో కూడిన అఫ్గాన్ జట్టును ప్రకటించింది. అందులో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ జాబితాలో ఫరీబా హషిమి, యుల్డుజ్లు చోటుదక్కించుకున్నారు. దీంతో ఒలిపింక్స్లో పాల్గోవాలన్న తమ కలను నేరువేర్చుకునేందుకు ఈ అక్కచెల్లెల్లు అడుగు దూరంలో నిలిచారు.మాకంటూ ప్రత్యేకమైన బలమేమి లేదు. మాకు మేమే బలం. నేను ఆమెకు ధైర్యంగా ఉంటాను. ఆమె నాకు సపోర్ట్గా ఉంటుంది: యుల్డుజ్ఒలింపిక్స్లో పాల్గోనే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. మేము సాధించిన ఈ ఘనతను అఫ్గానిస్తాన్ మహిళలకు అంకితమివ్వాలనకుంటున్నాము. ఎందుకంటే వారి వాళ్లే మేము ఒలింపిక్స్లో ఆడాలని నిర్ణయించుకున్నాము. మా హక్కులను కాలరాసినప్పటకి, మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలమని నిరూపించాం. ఈ విశ్వక్రీడల్లో మేము 20 మిలియన్ల ఆఫ్ఘన్ మహిళల తరపున ప్రాతినిథ్యం వహిస్తాము: ఫరీబా -
Paris 2024 Olympics: పతాకధారిగా సింధు
న్యూఢిల్లీ: వరుసగా మూడో ఒలింపిక్స్లోనూ పతకంపై గురి పెట్టిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు గొప్ప గౌరవం లభించింది. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి ఆంధ్రప్రదేశ్కు చెందిన సింధు నేతృత్వం వహించనుంది. విశ్వ క్రీడల్లో పతాకధారిగా వ్యవహరించనున్న సింధు భారత బృందాన్ని ముందుండి నడిపించనుంది. మరో ఫ్లాగ్ బేరర్గా తమిళనాడుకు చెందిన దిగ్గజ టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ ఆచంట శరత్ కమల్ వ్యవహరిస్తాడు. ఐదోసారి ఒలింపిక్స్లో పోటీపడుతున్న 41 ఏళ్ల శరత్ను పతాకధారిగా గత మార్చి నెలలోనే భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. విశ్వ క్రీడా వేదికపై లింగ సమానత్వం ఉండాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2020 టోక్యో ఒలింపిక్స్ నుంచి ప్రారం¿ోత్సవ వేడుకల్లో ఆయా దేశాలు పురుష ఫ్లాగ్ బేరర్తోపాటు ఒక మహిళా ఫ్లాగ్ బేరర్కు కూడా అవకాశం ఇవ్వాలనే నిబంధనను అమల్లోకి తెచి్చంది. టోక్యో ఒలింపిక్స్లో భారత్ నుంచి హాకీ ప్లేయర్ మన్ప్రీత్ సింగ్, మహిళా బాక్సర్ మేరీకోమ్ పతాకధారులుగా వ్యవహరించారు. వరుసగా రెండు ఒలింపిక్స్లో పతకాలు నెగ్గిన ఏకైక భారత మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన 29 ఏళ్ల సింధు 2022 కామన్వెల్త్ గేమ్స్లో ఫ్లాగ్ బేరర్గా గౌరవం పొందింది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం నెగ్గిన సింధు, 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. పారిస్ క్రీడల్లోనూ సింధు పతకం సాధిస్తే ఒలింపిక్స్ చరిత్రలో మూడు వ్యక్తిగత పతకాలు నెగ్గిన ఏకైక భారతీయ ప్లేయర్గా సింధు రికార్డు సృష్టిస్తుంది. సింధు కంటే ముందు రెజ్లర్ సుశీల్ కుమార్ మాత్రమే ఒలింపిక్స్లో రెండు వ్యక్తిగత పతకాలుసాధించాడు. చెఫ్ డి మిషన్గా గగన్ నారంగ్ మరోవైపు పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి చెఫ్ డి మిషన్గా తెలంగాణ షూటర్ గగన్ నారంగ్ వ్యవహరిస్తాడు. ముందుగా మేరీకోమ్ను చెఫ్ డి మిషన్గా ప్రకటించినా వ్యక్తిగత కారణాలరీత్యా ఈ బాధ్యతలు తీసుకోలేనని ఆమె ప్రకటించింది. దాంతో గగన్ నారంగ్కు చెఫ్ డి మిషన్ బాధ్యతలు అప్పగిస్తున్నామని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపింది. చెఫ్ డి మిషన్ హోదాలో గగన్ ఒలింపిక్స్లో పాల్గొనే మొత్తం భారత క్రీడాకారుల వ్యవహారాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. 41 ఏళ్ల గగన్ నారంగ్ 2012 లండన్ ఒలింపిక్స్లో పురుషుల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించాడు. 4: భారత్ తరఫున ఒలింపిక్స్ క్రీడల్లో ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించనున్న నాలుగో మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు గుర్తింపు పొందనుంది. గతంలో ఈ ఘనత షైనీ విల్సన్, అంజూ బాబీ జార్జి, మేరీకోమ్లకు మాత్రమే దక్కింది. అథ్లెట్ షైనీ విల్సన్ 1992 బార్సిలోనా ఒలింపిక్స్లో... లాంగ్జంపర్ అంజూ బాబీ జార్జి 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో... బాక్సర్ మేరీకోమ్ 2020 టోక్యో ఒలింపిక్స్లో ఫ్లాగ్ బేరర్స్గా ఉన్నారు. -
నరసాపురం లేసులు.. ఒలింపిక్స్ వరకూ అల్లుకున్నాయి..
పారిస్ అంటే ఫ్యాషన్కు పుట్టినిల్లు. కానీ, మన తెలుగు మహిళలు ఆ ఫ్యాషన్ కేంద్రానికే ఫ్యాబ్రిక్స్ ఎగుమతి చేస్తున్నారు. పారిస్లో జరగనున్న ఒలింపిక్స్లో క్రీడాకారులు ఉపయోగించే లేస్ వస్త్రాలు, దిండ్లు, తువాళ్లు మన నరసాపురం నుంచి తయారయ్యి విమానం ఎక్కాయి. ఇదీ మన ఘనత.సూది మొనకు దారం తగిలించి చకచకా వారి మునివేళ్లు కదిలించారంటే చాలు వన్నెచిన్నెల లేసులు క్షణాల్లో కళ్లముందు ఆవిష్కృతమవుతాయి. ఔరా అనిపించేలా హ్యాండ్ మేడ్ ఉత్పత్తులు సిద్ధమవుతాయి. అబ్బురపరిచే అల్లికలతో గోదావరి జిల్లాలకు ఖండాంతర గుర్తింపు తెచ్చిన అతివల హస్త నైపుణ్యం ఇప్పుడు పారిస్లో జరగనున్న ఒలింపిక్స్ వరకూ చేరింది. ఆ ఘనతను సాధించింది జిల్లా, నరసాపురం రూరల్కి చెందిన మారుమూల గ్రామం సీతారామపురం.లేసుల పరిశ్రమబ్రిటిష్ కాలంలో నరసాపురం జలరవాణాకు‡కేంద్రంగా ఉండేది. అప్పట్లో ఇక్కడకు వచ్చిన క్రిస్టియన్ మిషనరీ సంస్థలు పేద మహిళలకు ఉపాధిగా లేసు అల్లికలు నేర్పించారు. కాలక్రమంలో ఈ పని పెద్ద పరిశ్రమగా విస్తరించింది. పేద, ధనిక తేడా లేకుండా తీరిక వేళల్లో కాలక్షేపంగా అల్లికలు సాగిస్తుంటారు. నరసాపురం కేంద్రంగా కోనసీమ, రాజ మహేంద్రవరం, భీమవరం ్రపాంతాల్లో వేలాది కుటుంబాలు ఈ హస్తకళ ద్వారా జీవనోపాధి పొందుతున్నాయి. ఈ పనిలో ఉన్న మహిళలకు తోడ్పాటును అందించేందుకు 2005లో నాటి సి.ఎం. వైఎస్ రాజశేఖరరెడ్డి సీతారాంపురం వద్ద లేస్పార్క్ను ్రపారంభించారు. టవల్స్, టేబుల్ క్లాత్స్, లంచ్ మ్యాట్స్, క్రోషే బ్యాగ్స్, డెకో కుషన్స్, బీచ్ కలెక్షన్స్ తదితర మన హ్యాండ్ మేడ్ లేసు ఉత్పత్తులకు విదేశాల్లో మంచి ఆదరణ ఉంది. నరసాపురం పరిసరాల్లో లేసు ఉత్పత్తులను ఎగుమతి చేసే కంపెనీలు వంద వరకు ఉన్నాయి. మారుతున్న ఫ్యాషన్, అభిరుచులు, ఆర్డర్లకు అనుగుణంగా తమ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటూ ట్రెండింగ్లో ఉంటూ చైనా, వియత్నాం దేశాలకు గట్టిపోటీనిస్తున్నారు గోదావరి జిల్లాల మహిళలు.. ఎంతో గర్వంగా ఉంది పారిస్ ఒలింపిక్స్కు మన లేసు, క్లాత్తో తయారుచేసిన ఉత్పత్తులు అందించే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. ఈ లేస్ ఇండస్ట్రీని ప్రభుత్వాలు గుర్తించి వ్యవస్థీకృతం చేస్తే విదేశాల్లో మనదేశ మహిళల నైపుణ్యానికి గుర్తింపు వస్తుంది. ఒలింపిక్స్కు పని చేసే అవకాశాన్ని మహిళలు ఎంత సంతోషంగా స్వీకరించారంటే ప్రతి ఒక్కరూ తామే గోల్డ్మెడల్ సాధించినంత ఆనందంగా ఉన్నారు.– కలువకొలను రామ్చంద్రుడు, జేజే ఎక్స్పోర్ట్స్ అధినేతపదేళ్లుగా లేసు అల్లికలుమా చిన్నతనంలో మా అమ్మ, పిన్నమ్మలు అంతా కూడా లేసు అల్లికలు అల్లేవారు. నాకు అçప్పటి నుంచి అల్లికలపై అవగాహన ఉంది. గత 10 ఏళ్లుగా లేసు అల్లికలు చేస్తున్నాను. పిల్లలిద్దరినీ కూడా ఉన్నత చదువులు చదివించుకోగలుగుతున్నాం. ఇంట్లో పనులు అయ్యాక ఖాళీ సమయంలో లేసు అల్లికల ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. – పులపర్తి లక్ష్మికుమారి, మొగల్తూరుపారిస్ వేదిక మీద మన లేసుఈ నెల 26 నుంచి పారిస్ వేదికగా ్రపారంభం కానున్న ఒలింపిక్స్ క్రీడా సంగ్రామంలో నరసాపురం ఉత్పత్తులు కొలువుదీరే అవకాశం దక్కింది. సీతారాంపురంలోని జేజే ఎక్స్పోర్ట్స్ సంస్థ కేంద్రం పరిధిలోని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండీక్రాప్ట్స్ (ఈపీసీహెచ్) ద్వారా ఈ అర్డర్ సాధించినట్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు. దాదాపు వంద రకాల డిజైన్లు పంపిస్తే వాటిలో ఆరు డిజైన్లను నిర్వాహకులు ఎంపిక చేశారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చే సందర్శకులకు గుర్తుండిపోయే విధంగా ఒలింపిక్స్ థీమ్, లోగోలతో లేస్, ఫ్యాబ్రిక్లను ఉపయోగించి టవల్స్, డెకో కుషన్స్, బీచ్ కలెక్షన్స్, క్రోషే మ్యాట్స్ తదితర హ్యాండ్ మేడ్ ఉత్పత్తులను డిజైన్ చేసి సిద్ధం చేసి పారిస్కి పంపారు. త్వరలో మన లేసు ఉత్పత్తులు ఒలింపిక్స్ క్రీడాకారులతో పాటు సందర్శకుల చేతుల్లోకి చేరనున్నాయి. తమ ఉత్పత్తులకు అరుదైన గుర్తింపు దక్కడం పట్ల ఈ ్రపాంత మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు– విజయ్కుమార్ పెనుపోతుల, సాక్షి, భీమవరం.ఫొటోలు : సవరం కృష్ణానందం -
వరల్డ్ ఒలింపిక్స్ చారిత్రక నిర్ణయం
ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్లో స్వర్ణ పతక విజేతలకు నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించింది. వ్యక్తిగత, రిలే విభాగాల్లో (48 ఈవెంట్స్) స్వర్ణాలు గెలిచే వారికి 50,000 అమెరికన్ డాలర్లు ప్రైజ్మనీగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది పారిస్లో జరుగబోయే ఒలింపిక్స్ నుంచి స్వర్ణ పతక విజేతలకుప్రైజ్మనీ పంపిణీ అమల్లోకి వస్తుందని తెలిపింది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ నుంచి రజత, కాంస్య పతక విజేతలకు కూడా ప్రైజ్మనీ అందిస్తామని పేర్కొంది. నాలుగేళ్లకు ఒకసారి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి వచ్చే ఆదాయ వాటాతో (2.4 మిలియన్ల అమెరికన్ డాలర్లు) నగదు బహుమతులు ఇస్తామని వెల్లడించింది. ఒలింపిక్స్లో ప్రైజ్ మనీ అందజేసే తొలి అంతర్జాతీయ సమాఖ్య తమదేనని వరల్డ్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో ప్రకటించారు. -
భారత్లో కొన్ని రోజులైనా శిక్షణ ఇచ్చేందుకు ససేమిరా.. అందుకే ఇలా!
న్యూఢిల్లీ: కరోనా కాలంలో విదేశీ కోచ్ల వెంట పడకుండా... 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు భారతీయ కోచ్ల ఆధ్వర్యంలో తమ ప్రదర్శ నకు మెరుగులు దిద్దుకోవాలని భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, రవి దహియా నిర్ణయం తీసుకున్నారు. టోక్యో ఒలింపిక్స్లో రవి రజతం... బజరంగ్ కాంస్యం సాధించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య వీరిద్దరి కోసం భారత్లో అందుబాటులో ఉన్న ఉత్తమ కోచ్లను నియమించే పనిలో ఉంది. ‘విదేశీ కోచ్లు వారి దేశంలోనే 80 శాతం కోచింగ్ ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు కానీ భారత్లో కొన్ని రోజులైనా శిక్షణ ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. అందువల్లే స్వదేశీ కోచ్పై దృష్టి పెట్టాను’ అని ఉన్న బజరంగ్ అన్నాడు. చదవండి: SA vs IND: రిషభ్ పంత్కి భారీ షాక్!