purna
-
కుర్చీ మడతపెట్టిసి మరింత గ్లామర్గా మారిపోయిన 'పూర్ణ' (ఫోటోలు)
-
కంచె భామ స్టన్నింగ్ లుక్స్.. మరింత బొద్దుగా తయారైన పూర్ణ!
►హీరోయిన్ పూనమ్ కౌర్ బ్యూటిఫుల్ లుక్స్! ►కంచె భామ ప్రగ్యా జైశ్వాల్ స్టన్నింగ్ పోజులు! ►కలర్ఫుల్ శారీలో యాంకర్ లాస్య లుక్స్! ►మరింత బొద్దుగా తయారైన హీరోయిన్ పూర్ణ! View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) -
Poorna Latest Photos: కేరళ సంప్రదాయంలో పూర్ణ సీమంతం.. ఫోటోలు వైరల్
-
‘సువర్ణ సుందరి’ సరికొత్త అనుభూతిని ఇస్తుంది: దర్శకుడు సురేంద్ర
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘సువర్ణ సుందరి’. చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుంది అనేది ట్యాగ్లైన్. మాదారపు సురేంద్ర దర్శకత్వంలో ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మించిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సురేంద్ర మాట్లాడుతూ – ‘‘గతానికి భవిష్యత్తుకు మధ్య వారధిలా జయప్రదగారి పాత్ర ఉంటుంది. కరోనా పరిస్థితుల కారణంగా సినిమా లేట్గా విడుదలవుతోంది. విజువల్ పరంగా కావొచ్చు, కంటెంట్ పరంగా కావొచ్చు.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సహనిర్మాత: శ్రీకాంత్ పండుగుల. -
‘పూర్ణ కెరీర్కి మరో టర్నింగ్ పాయింట్ ఇది’
హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బ్యాక్ డోర్’. నంది అవార్డుగ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వం వహించారు. యువ నటుడు తేజ త్రిపురాన మరో ముఖ్య పాత్రలో నటించాడు. ‘ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్’ పతాకంపై బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా బి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘విభిన్న కథాంశంతో రూపొందిన చిత్రమిది. బాలాజీకి చాలా మంచి పేరు తెస్తుంది. పూర్ణ కెరీర్కి మరో టర్నింగ్ పాయింట్గా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘పూర్ణ పెర్ఫార్మెన్స్, గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి’’ అన్నారు కర్రి బాలాజీ. పూర్ణ మాట్లాడుతూ– ‘‘బాలాజీగారు ప్రతి సీన్ ఎంతో ప్లానింగ్తో, క్లారిటీతో తెరకెక్కించారు. దర్శకుడిగా బాలాజీ గారికి, నటిగా నాకు, నిర్మాతగా శ్రీనివాస్ రెడ్డిగారికి మంచి పేరు తెచ్చే చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, నేపథ్య సంగీతం: రవిశంకర్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, లైన్ ప్రొడ్యూసర్: రేఖ, కో–ప్రొడ్యూసర్: ఊట శ్రీను. -
బ్యాక్డోర్ ఎంట్రీ
పూర్ణ ప్రధాన పాత్రలో యువ కథానాయకుడు తేజ ముఖ్య పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్యాక్ డోర్’. కర్రి బాలాజీ దర్శకత్వంలో బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కర్రి బాలాజీ మాట్లాడుతూ– ‘‘బ్యాక్ డోర్’ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రం పూర్ణ కెరీర్లో ఓ మైలు రాయిలా నిలిచిపోతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం దర్శకుడిగా బాలాజీకి చాలా మంచి పేరు తెస్తుంది’’ అన్నారు బి.శ్రీనివాస్ రెడ్డి. ‘‘నిర్మాతకు రివార్డులు, దర్శకుడికి అవార్డులు రావడం ఖాయం’’ అన్నారు పూర్ణ. ఈ చిత్రానికి కెమెరా: ఓంకార్ యూనిట్, సంగీతం: ప్రణవ్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, సహ నిర్మాత: ఊట శ్రీను. -
బ్యాక్ డోర్లో...
నంది అవార్డుగ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బ్యాక్ డోర్’. ఇందులో పూర్ణ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్ పతాకంపై బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కర్రి బాలాజీ మాట్లాడుతూ– ‘‘బ్యాక్ డోర్ ఎంట్రీ అన్నది ఈరోజుల్లో అన్ని రంగాల్లో చాలా సహజం అయిపోయింది. అటువంటి ఓ ప్రత్యేకమైన బ్యాక్ డోర్ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను’’ అన్నారు. ‘‘వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసేందుకు కర్రి బాలాజీ సన్నాహాలు చేస్తున్నారు’’ అన్నారు బి. శ్రీనివాస్ రెడ్డి. ‘‘చాలా రోజుల తర్వాత ఓ ఛాలెంజింగ్ రోల్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అన్నారు పూర్ణ. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, కెమెరా: శ్రీకాంత్. -
జానకి.. శశికళ
ఏ సినిమాకైనా సరైన ఆర్టిస్టులను ఎంపిక చేయడం ముఖ్యం. బయోపిక్ అయితే అది మరింత ముఖ్యం. ప్రస్తుతం జయలలిత బయోపిక్లోనూ ఆర్టిస్ట్ల ఎంపికలో రాజీ పడటం లేదు చిత్రబృందం. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తలైవి’ (నాయకురాలు అని అర్థం). కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తున్నారు. దివంగత నటుడు యంజీ రామచంద్రన్ (యంజీఆర్)గా అరవింద స్వామి, నటుడు శోభన్బాబు పాత్రలో బెంగాలీ నటుడు జిష్షూ సేన్ గుప్తా నటిస్తున్నారు. తాజాగా జయ జీవితంలో కీలకమైన ఆప్తురాలు శశికళ పాత్రలో పూర్ణ నటిస్తున్నారు. యంజీఆర్ భార్య జానకి పాత్రలో ‘రోజా’ ఫేమ్ మధుబాల నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మాట్లాడుతూ – ‘‘శశికళ పాత్రకి ప్రియమణిని అనుకున్నాం. కానీ డేట్స్ సమస్య వచ్చింది. పూర్ణ అయితే ఈ పాత్రకు బావుంటారని తీసుకున్నాం. మధుబాలగారిని జయలలిత తల్లి సంధ్య పాత్రలో తీసుకుందాం అనుకున్నాను. కానీ ఆమెను కలిశాక యంజీఆర్ భార్య జానకి పాత్రకు కరెక్ట్గా సరిపోతారని తీసుకున్నాం. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ చేస్తున్నాం. మార్చి మొదటివారం వరకూ ఈ షెడ్యూల్ సాగుతుంది’’ అన్నారు. శైలేష్ ఆర్, విష్ణు వర్థన్ ఇందూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్లో విడుదల కానుంది. -
600 ఏళ్ల క్రితం ఏం జరిగింది?
ఆరువందల సంవత్సరాల క్రితం ఒక రాజు చేసిన తప్పిదం ఏంటి? దాని వల్ల తరతరాల వాళ్లు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘సువర్ణ సుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అనేది ఉపశీర్షిక. జయప్రద, పూర్ణ, సాక్షీచౌదరి ప్రధాన పాత్రల్లో ఎమ్.ఎస్.ఎన్. సూర్య దర్శకత్వంలో తెరకెక్కింది. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న తెలుగు, కన్నడలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్కు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ సందర్భంగా ఎం.ఎస్.ఎన్. సూర్య మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రమిది. ట్రైలర్కి మంచి స్పందన రావడంతో చాలా ఆనందంగా ఉన్నాను. ప్రొడ్యూసర్తో కాస్త ఎక్కువ ఖర్చుపెట్టించావని చాలామంది అన్నారు. కానీ, స్టోరీ అలా డిమాండ్ చేసింది. ‘అరుంధతి, మగధీర’ టైప్లో మా సినిమా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్లింగ్గా ఉంటుంది’’ అన్నారు. లక్ష్మీ మాట్లాడుతూ– ‘‘అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అయింది. అవుట్ పుట్ బాగా వచ్చింది’’ అన్నారు. కెమెరామేన్ ఈశ్వర్ ఎల్లు మహంతి, ఫైట్మాస్టర్ రామ్ సుంకర మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్. -
సస్పెన్స్ సుందరి
జయప్రద, పూర్ణ, సాక్షీచౌదరి ప్రధానపాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మించిన ఈ సినిమా ఈనెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా సూర్య ఎమ్.ఎస్.ఎన్ మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది. విజువల్ ఎఫెక్ట్స్కి ఏడాది పట్టింది. అయితే సినిమా ఔట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే పాటలను గ్రాండ్గా విడుదల చేస్తున్నాం. పబ్లిసిటీ కూడా విభిన్నంగా చేస్తున్నాం’’ అన్నారు. ‘‘భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సాంకేతికంగా అద్భుతంగా మా సినిమా నిర్మించాం. తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం’’ అని లక్ష్మి అన్నారు. ఇంద్ర, రామ్ మద్దుకూరి, సాయికుమార్, కోటా శ్రీనివాసరావు, ముక్తర్ఖాన్, నాగినీడు, సత్యప్రకాష్, అవినాష్ తదితరులు నటì ంచిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీ్తక్, కెమెరా: ఎల్లుమహంతి. -
మూడు జన్మల థ్రిల్
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో ఎం.ఎస్.ఎన్. సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎస్. టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎం.ఎస్.ఎన్. సూర్య మాట్లాడుతూ– ‘‘మూడు జన్మల కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. కొంతకాలంగా తెలుగులో స్క్రీన్ప్లే బేస్డ్ సినిమాలకు ఆదరణ లభిస్తోంది. మా సినిమాలోనూ ఆసక్తికరమైన స్క్రీన్ప్లే ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఏడాది పట్టింది’’ అన్నారు. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సాంకేతికంగా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం సెన్సార్కు సిద్ధమైన మా చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత లక్ష్మీ అన్నారు. ఇంద్ర, రామ్ మద్దుకూరి, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, నాగినీడు, సత్యప్రకాష్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎల్లు మహంతి. -
మూడు జన్మల కథ
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ చిత్రం మార్చి రెండో వారంలో విడుదల కానుంది. సూర్య మాట్లాడుతూ– ‘‘మూడు జన్మల కాన్సెప్ట్తో హిస్టారికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్కే ఏడాది పట్టింది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో తెరకెక్కిన మా సినిమా ట్రైలర్కు పదిలక్షలు వ్యూస్కి పైగా లభించాయి. మార్చి తొలివారంలో పాటలను, రెండోవారంలో సినిమాను తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల చేయటానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు’’ అన్నారు. ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎల్లు మహంతి. -
బ్యాగ్రౌండ్ చెప్పుకోలేదు
‘‘నేను విజయవాడలో పుట్టాను. నటనపై ఉన్న ఆసక్తితో మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నాను. నిర్మాత దాసరి కిరణ్కుమార్గారి కజిన్ని. రామదూత క్రియేషన్స్ బ్యానర్ మాదే. కానీ, నెనెప్పుడూ నా బ్యాగ్రౌండ్ చెప్పకుండానే ఆడిషన్స్కి వెళ్లాను. ‘వంగవీటి’ సినిమా చేస్తుండగా సూర్యగారు ‘సువర్ణసుందరి’ సినిమాకి చాన్స్ ఇచ్చారు’’ అని హీరో ఇంద్ర అన్నారు. జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధానపాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ చిత్రం మార్చి రెండో వారంలో విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన ఇంద్ర మాట్లాడుతూ– ‘‘రామ్గోపాల్వర్మగారి దర్శకత్వంలో వచ్చిన ‘వంగవీటి’ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషించాను. ‘సువర్ణసుందరి’లో తొలిసారి లీడ్ రోల్ చేశా. ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ సూర్యగారికి రుణపడి ఉంటాను. ఈ చిత్రంలో రెండు స్క్రీన్ప్లేలు నడుస్తుంటాయి. ఒకటి పీరియాడికల్, ఇంకోటి ప్రస్తుతం. ఈ రెండు స్క్రీన్ప్లేల మధ్య నాదొక ఫన్ అండ్ రొమాంటిక్ క్యారెక్టర్. ‘సువర్ణసుందరి’ అనే ఓ విగ్రహానికి సంబంధించిన సినిమా ఇది. ఈ చిత్రం విడుదల తర్వాత నాకు మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది. ప్రస్తుతం ‘రామచక్కని సీత’ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నాను. ఓంకార్గారి అసిస్టెంట్ శ్రీహర్ష మండాగారితో మరో సినిమా చేశాను’’ అన్నారు. -
భవిష్యత్తుని వెంటాడుతుంది
‘‘సువర్ణసుందరి’ లాంటి సినిమాలు రావడం పరిశ్రమకి చాలా అవసరం. దాని వల్ల కొత్త టెక్నీషియన్స్ పరిచయం అవుతారు. సూర్య రాసుకున్న కథ చాలా బాగుంది. తప్పకుండా ఇది ఓ మంచి సినిమా అవుతుంది’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’’ అన్నది ఉపశీర్షిక. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ చిత్రం అతి త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ని దర్శకులు బి.గోపాల్ విడుదల చేశారు. డైరెక్టర్ సూర్య మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రమిది. నటీనటులందరూ నాకు చాలా సహకరించారు. విజువల్ ఎఫెక్ట్స్కి ఏడాది పట్టింది. అందుకే సినిమా విడుదల లేట్ అయింది. అయినా అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘సువర్ణసుందరి’ ఎక్స్ట్రార్డినరీ చిత్రం. హీరోయిన్స్ చాలా చక్కగా చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు అందగత్తె జయప్రద. ఆవిడ కూడా ఈ చిత్రంలో నటించారు. టీమ్కి ఆల్ ద బెస్ట్’’ అని డైరెక్టర్ సాగర్ అన్నారు. ‘‘ఇది చాలా మంచి సినిమా. పాటలు. ఫైట్స్ చాలా బాగా వచ్చాయి’’ అన్నారు సాక్షీ చౌదరి. ‘‘సహనం అంటే అది సూర్యగారి నుంచే నేర్చుకోవాలి. చాలా ఓర్పుగా మంచి నటన రాబట్టుకున్నారాయన’’ అని పూర్ణ అన్నారు. హీరోలు ఇంద్ర, రామ్, రచయిత విజయేంద్రప్రసాద్, రైటర్ ప్రదీప్, స్టంట్ మాస్టర్ రామ్ సుంకర మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎల్లుమంతి ఈశ్వర్. -
బ్లూవేల్ చాలెంజ్
బ్లూ వేల్ చాలెంజ్ .. సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండుంటే ఈ ఆట గురించి వినుంటారు. సీరియస్ రిస్కులతో కూడుకున్న ఈ గేమ్లో చాలామంది హానికి గురయ్యారు. 50 రోజుల పాటు సాగే ఈ చాలెంజ్లో చివరి వరకూ వెళ్లే ఆటగాళ్లను సూసైడ్ చేసుకొమ్మని ప్రేరేపించే భయంకరమైన గేమ్ అది. ఇప్పుడు ఆ ఆట ఆధారంగా తమిళంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘అవును’ ఫేమ్ పూర్ణ ముఖ్య పాత్రలో నూతన దర్శకుడు రంగనాథన్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు రంగనాథన్ మాట్లాడుతూ – ‘‘ఇప్పటి జనరేషన్ పిల్లలందరి వద్ద స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. దీని వల్లే ఇలాంటి భయంకరమైన గేమ్స్ కూడా ఎక్కువవుతున్నాయి. రీసెంట్గా పాపులర్ అయిన గేమ్ ‘బ్లూవేల్ చాలెంజ్’. ఈ గేమ్ ఆధారంగా చిత్రం తెరకెక్కిస్తున్నాం. క్రిమినల్స్ ఎవరో చూపించలేం కానీ తల్లిదండ్రులు ఎలా జాగ్రత్తగా ఉండాలో మా చిత్రం ద్వారా చూపించదలిచాం’’ అని పేర్కొన్నారు. -
అంతా అమ్మ ఇష్టం
మీ పెళ్లెప్పుడు అని హీరోయిన్స్ని అడిగిన వెంటనే తరచుగా వినిపించే సమాధానాలు ‘నచ్చినవాడు దొరకలేదు, అప్పుడే పెళ్లేంటి? కానీ ‘అవును’ ఫేమ్ పూర్ణ మాత్రం అంతా అమ్మ ఇష్టం అంటున్నారు. పెళ్లికి సంబంధించిన ప్లాన్స్ గురించి పూర్ణ మాట్లాడుతూ – ‘‘ఇంతకుముందు పెళ్లి అనే ప్రశ్న ఎక్కువగా మా ఇంట్లో మాత్రమే వినిపించేది ఇప్పుడు సినిమా సెట్స్, షోస్లో ఎక్కడికి వెళ్లినా సరే పెళ్లి ఎప్పుడు అనే అడుగుతున్నారు. ఇంట్లో అమ్మ నా పెళ్లి గురించే మాట్లాడుతుంటుంది. పెళ్లి అనేది మనం అనుకున్నప్పుడు కాదు, దేవుడు అనుకుంటే అయ్యేది. అలాగే పెళ్లి చేసుకుందాం అని వచ్చే వాళ్లందరూ యాక్టింగ్ మానేయాలి, డ్యాన్స్ వదిలేయాలి అంటూ డిమాండ్స్ పెట్టేవాళ్లే. పెళ్లి అనేది కేవలం త్యాగాలమీదే జరక్కూడదు అని నా అభిప్రాయం. అదికూడా కేవలం పెళ్లికొడుకుల తరఫు నుంచి మాత్రమే. ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నా, మా సంప్రాదాయలు తెలియని వారైతే మా అమ్మ అప్సెట్ అవుతుంది. అలా చేయడం ఇష్టం లేదు. అమ్మ సంతోషమే నా సంతోషం. అందుకే నా పెళ్లికి సంబంధించిన అన్ని నిర్ణయాలు మా ఫ్యామిలీకే వదిలేశాను’’ అని చెప్పారు. -
చరిత్ర వెంటాడుతోంది
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణ సుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎస్. టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘సాహో సార్వభౌమి’ పాటను విడుదల చేశారు. సాయి కార్తీక్ మాట్లాడుతూ– ‘‘సువర్ణసుందరి’ ఓ భారీ సూపర్ నేచురల్ థ్రిల్లర్. ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా సూర్య ఈ సినిమా తెరకెక్కించారు. నా సినీ కెరీర్లో ఇది ఓ అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోతుంది. ఇందులోని అన్ని పాటలు వేటికవే విభిన్నంగా ఉంటాయి. నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన పాట ‘సాహో సార్వభౌమి’. మ్యూజికల్గా, విజువల్గా బాగా వచ్చిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించాం. అతి త్వరలోనే సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు లక్ష్మీ. ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి. -
పూర్ణ.. బంటి... ఓ పాట
‘సీమటపాకాయ్, అవును, లడ్డుబాబు, జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు కథానాయిక పూర్ణ. తాజాగా ఆమె ‘అదుగో’ చిత్రంలో ఓ ప్రత్యేక పాటలో నటించారు. బంటి అనే పంది పిల్ల లీడ్ రోల్లో ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అభిషేక్ వర్మ, నభా, రవిబాబు, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేందర్ చౌదరి ఇతర పాత్రల్లో నటించారు. పూర్ణ నటించిన ప్రత్యేక పాటను ఈ రోజు విడుదల చేస్తున్నారు. ఈ పాటలో పూర్ణతో పాటు టైటిల్ రోల్ చేస్తున్న బంటి అనే పందిపిల్ల కూడా కనిపించనుంది. రవిబాబు మాట్లాడుతూ– ‘‘ఈ పాట ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వబోతోంది. ప్రశాంత్ విహారి చక్కటి సంగీతం అందించాడు. ఈ చిత్రం ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. దసరా సెలవుల్లో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్. సుధాకర్ రెడ్డి. -
నవ్వుకునే చిత్రాలను ఆదరించాలి
‘‘సిల్లీ ఫెలోస్’ చిత్రంలో నాలుగైదు రోజుల పాత్ర చేశాను. భీమనేని శ్రీనివాస్తో 26 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. తను హార్డ్ వర్కర్ కాబట్టే సినిమాలన్నీ సూపర్ హిట్స్ అవుతున్నాయి. నరేశ్, సునీల్.. ఎవరో ఒకరుంటేనే కామెడీ పరంగా తట్టుకోవడం కష్టం. అలాంటిది ఇద్దరూ కలిసి నటించారంటే కామెడీ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. హాయిగా నవ్వుకునే సినిమాలను ఆదరించాలి’’ అని నటుడు డా. బ్రహ్మానందం అన్నారు. ‘అల్లరి’ నరేశ్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ, నందినీరాయ్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘16 ఏళ్ల నా సినీ ప్రయాణంలో ‘సుడిగాడు’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన భీమనేనిగారితో మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది. సునీల్గారు, నేను ఈగోస్ లేకుండా నటించాం. ప్రేక్షకులు ‘సుడిగాడు’ రేంజ్ హిట్ అందిస్తారని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ‘‘నరేష్గారు, నేను అన్నదమ్ముల్లా కలిసిపోయాం. ‘తొట్టిగ్యాంగ్’ సినిమాకు ఎంత ఎంజాయ్ చేశానో ‘సిల్లీ ఫెలోస్’కి కూడా అంతే ఎంజాయ్ చేశా. ఇందులో ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్ర చేశా’’ అన్నారు సునీల్. ‘‘సిల్లీ ఫెలోస్’ సినిమా వెనుక చాలా కష్టం ఉంది. మా కష్టాన్ని ఈరోజు తెరపై చూస్తారు. ‘సుడిగాడు’ తర్వాత నేను ఒక సినిమా చేస్తే.. నరేష్గారు 12 చిత్రాలు చేశారు’’ అన్నారు భీమనేని శ్రీనివాస్. ‘‘భీమనేని మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు. పెద్ద హీరోలందరూ తమ సినిమాల్ని కనీసం ఒక షెడ్యూల్ అయినా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేయాలని కోరుకుంటున్నా. ఇందుకు దర్శక–నిర్మాతలను, హీరోలను రిక్వెస్ట్ చేస్తున్నా’’ అన్నారు ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్ అంబికాకృష్ణ. ఈ వేడుకలో డైరెక్టర్ కె.నాగేశ్వర్ రెడ్డి, నటి నందినీరాయ్ పాల్గొన్నారు. -
డాటర్ ఆఫ్ పూర్ణ
ఈ మధ్య కాలంలో తల్లి పాత్రల్లో కనిపిస్తోన్న జయప్రద ఇప్పుడు కూతురిగా కనిపించనున్నారు. అది కూడా పూర్ణకి కూతురిగా. రామ్, ఇంద్ర, జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ముఖ్య తారలుగా సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ సువర్ణ సుందరి’. ఎమ్.వి.కె. రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. ‘చరిత్ర భవిష్యత్ను వెంటాడుతోంది’ అనేది ట్యాగ్లైన్. ‘‘టీజర్కు మంచి స్పందన లభిస్తోంది. హిస్టారికల్ అడ్వెంచర్గా రూపొందిన ఈ చిత్రంలో పూర్ణ కూతురిగా జయప్రద నటించారు. ఆమె పాత్ర సినిమాలో హైలైట్గా ఉంటుంది. దర్శకుడు సూర్య టేకింగ్, విజువల్ గ్రాఫిక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. సాయి కార్తీక్ సంగీతం, ఎలు మహంతి విజువల్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొంది చిత్రబృందం. కోట శ్రీనివాసరావు, నాగినీడు, సత్య ప్రకాష్ నటించారు. -
ఈ సువర్ణసుందరి ఎవర్నీ వదలదు
సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘సువర్ణ సుందరి’. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది. అన్నది ఉపశీర్షిక. సూర్య ఎమ్.ఎస్.ఎన్. దర్శకత్వంలో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ని హైదరాబాద్లో రిలీజ్ చేశారు. ‘ఈ సువర్ణ సుందరి ఎవర్నీ వదలదు’ అంటూ సాగే టీజర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘సువర్ణ సుందరి’ టీజర్ రిలీజైన కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హిస్టారికల్ అడ్వెంచర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందనడానికి టీజర్ చక్కటి ఉదాహరణ. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా గ్రాండ్ లుక్తో హై టెక్నికల్గా రూపొందిస్తున్నాం. త్వరలో పాటలు రిలీజ్ చేయనున్నాం. డిసెంబరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తీక్. -
పూర్ణ చేసిన త్యాగమేమిటో తెలుసా?
తమిళసినిమా: పాత్రల కోసం బరువు తగ్గడం, పెరగడం కోసం తారలు శ్రమిస్తుంటారు. అదీ చాలా తక్కువ మందే. అలాంటిది తమ జుత్తు త్యాగం చేయడానికి ముఖ్యంగా నటీమణులు ససేమిరా అంగీకరించరు. అలాంటిది పూర్ణ కొడివీరన్ చిత్రం కోసం, అదీ హీరోయిన్ పాత్ర కోసం కూడా కాదు, ఒక ముఖ్య పాత్ర కోసం గుండు గీయించుకుని నటించింది. కథానాయకి పాత్రలే కావాలని పట్టుపట్టకుండా కొత్తదనం ఉంటే ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అంటున్న పూర్ణ కొడివీరన్ చిత్రంలో ఒక వైవిధ్యభరిత పాత్రలో కనిపించనుంది. నటుడు శశికుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కొడివీరన్. మహిమానంబియార్ కథానాయకిగా నటించిన ఇందులో శశికుమార్కు చెల్లెలుగా నటి తనూజ నటించింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం గురించి శశికుమార్ తెలుపుతూ అన్నాచెల్లెలి అనుబంధంతో కూడిన కథా చిత్రంలో నటించాలన్నది తన చాలా కాల కోరిక అని చెప్పారు. ఇదే విషయాన్ని కుట్టిపులి చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు ముత్తయ్యకు చెప్పానన్నారు. అలాంటి కథా చిత్రంమే ఈ కొడివీరన్ అని చెప్పారు. ఇందులో పూర్ణది కథా నాయకి పాత్ర కాకపోయినా చాలా కీలక పాత్ర అని చెప్పారు. రెండు సన్నివేశాల కోసం ఆమె గుండు కొట్టించుకుని జుత్తును త్యాగం చేసిందని చెప్పారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడంటూ ఎవరూ ఉండరని, పరిస్థితులు, కొన్ని పాత్రల తప్పుడు నిర్ణయాలే విలన్ అవుతాయన్నారు. శివాజీగణేÔషన్ నటించిన పాశమలర్ చిత్రం మాదిరిగా కొడివీరన్ చిత్రం అన్నాచెల్లెలి అనుభందాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందని ఆయన తెలిపారు. -
డూపు లేకుండా!
‘మౌనమేల నోయి..’ అంటూ సున్నితంగా నటించడమే కాదు.. అవసరమైతే డూప్ లేకుండా ఫైట్స్ చేసేస్తారు జయప్రద. ప్రస్తుతం నటిస్తోన్న ‘సువర్ణ సుందరి’లో క్లైమాక్స్ ఫైట్స్ని డూప్ లేకుండా చేశారామె. ఫిఫ్టీ ప్లస్ ఏజ్లో ఆమె రిస్కీ ఫైట్ చేయడం చిత్రబృందాన్ని ఆశ్చర్యపరిచింది. జయప్రద ముఖ్య పాత్రలో రూపొందుతోన్న ఈ ‘సువర్ణ సుందరి’లో పూర్ణ, సాక్షీచౌదరి, రామ్, ఇంద్ర, సాయికుమార్, నాగినీడు, కోట శ్రీనివాసరావు ఇతర పాత్రధారులు. ‘చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుంది’ అన్నది ట్యాగ్ లైన్. సూర్య ఎమ్.ఎస్.ఎన్. దర్శకత్వంలో ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్నారు. ‘‘గతానికి భవిష్యత్తుకు మధ్య వారధిగా జయప్రదగారి పాత్ర ఉంటుంది. పూర్ణకి కూతురిగా ఆమె నటిస్తున్నారు. తల్లీకూతుళ్ల మధ్య భావోద్వేగాలు ఈ సినిమాకు హైలైట్. జయప్రదగారిది ఛాలెంజింగ్ రోల్. ఫైట్స్ని సవాల్గా తీసుకుని చేశారు’’ అన్నారు దర్శకుడు. ‘‘ప్రేక్షకులను థ్రిల్కి గురి చేసే చిత్రమిది. త్వరలో టీజర్, నవంబర్లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత లక్ష్మి. -
నాలుగు శతాబ్దాల కథ!
చరిత్ర చెప్పే కథలు ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే హిస్టారికల్ మూవీస్కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం నాలుగు శతాబ్దాల నేపథ్యంలో ‘సువర్ణ సుందరి’ అనే చిత్రం రూపొందింది. ఈ నాలుగు శతాబ్దాల చరిత్రలో బయటి ప్రపంచానికి తెలియని ఓ చీకటి కోణం ఈ చిత్రానికి ప్రధానాంశం. సూర్య దర్శకత్వంలో ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మిస్తున్నారు. పూర్ణ, సాక్షి చౌదరి, ఇంద్ర, సాయికుమార్ ముఖ్యతారలు. సూర్య మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ ఇది. కాలాలకు అనుగుణంగా డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేశాం. నాటి తరాలకు, ఇప్పటి తరానికి మధ్య తేడాను చూపించేందుకు జాగ్రత్తలు తీసుకున్నాం. చిత్రీకరణ పూరై్తంది. హైదరాబాద్తో పాటు ముంబైలో కూడా గ్రాఫిక్ వర్క్స్ చేయిస్తున్నాం. త్వరలో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్. -
పూర్ణ అంత పని చేసిందా!
తమిళసినిమా: నటి పూర్ణ అంత పని చేసిందా? తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఇదే. ఇంతకీ పూర్ణ ఏం చేసింది? బహుభాషా నటిగా పేరొందిన ఈ అమ్మడికి తమిళం, తెలుగు, మలయాళం ఇలా ఏ భాషలోనూ పెద్దగా అవకాశాలు లేవు. అయితే పూర్ణ మంచి నటి. అంతకంటే మంచి డాన్సర్. దీంతో నటనకు దూరం కావడం ఇష్టం లేక అంది వచ్చిన పాత్రలను చేస్తూ తన ఉనికిని చాటుకుంటోందని చెప్పవచ్చు. దర్శకుడు మిష్కిన్ నిర్మించిన సవరకట్టి చిత్రంలో దర్శకుడు రామ్కు భార్యగా ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించింది. ఇందులో తనది నటనకు అవకాశం ఉన్న పాత్ర అని, అంత మంచి పాత్రను తనకిచ్చినందుకు మిష్కిన్కు కృతజ్ఞతలు చెబుతూ ఆ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో బోరున ఏడ్చేసింది కూడా. ఆ చిత్రం విడుదల కావలసి ఉంది. తాజాగా కొడివీరన్ అనే చిత్రంలో నటిస్తోంది. ముత్తయ్య దర్శకత్వంలో శశికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో మహిమా నంబియార్ కథానాయకిగా నటిస్తోంది. చెల్లెలిగా రేణుగుంట చిత్రం ఫేమ్ సనూజ నటిస్తోంది. మరో ముఖ్యమైన పాత్రలో నటి పూర్ణ నటిస్తోంది. ఇది చాలా బలమైన పాత్ర అట. ఈ పాత్రలో నటించడానికి ఈ అమ్మడు తన జుత్తునే త్యాగం చేసిందట. అర్థం కాలా? గుండు కొట్టించుకుందట. సాధారణంగా కథానాయకులే గుండు కొట్టించుకోవడానికి సిద్ధపడరు. విగ్తో మ్యానేజ్ చేస్తుంటారు. అలాంటిది నటి పాత్ర కోసం గుండు గీయించుకోవడం టాక్గా మారింది. దీని గురించి పూర్ణను అడిగితే పాత్రకు అవసరం అయితే గుండు కొట్టించుకోవడం తప్పేంకాదు అని పేర్కొంది. కథానా యకి పాత్రలే కావాలని పట్టుపట్టి కూర్చోకుండా నటనకు అవకాశం ఉన్న ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అంటున్న పూర్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక రౌండ్ కొడుతుందేమో! -
అవును... హౌస్ వైఫ్నే!
హారర్ థ్రిల్లర్స్ ‘అవును, అవును–2’లతో గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక పూర్ణ. ఆమె లీడ్ రోల్ చేసిన తాజా హారర్ ఫిల్మ్ ‘రాక్షసి’. పన్నా రాయల్ దర్శకత్వంలో అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ జన్ను నిర్మించిన ఈ సినిమాలో సీనియర్ నటి గీతాంజలి, అభిమన్యు సింగ్, అభినవ్ సర్దార్ ముఖ్యతారలు. యాజమాన్య స్వరపరిచిన పాటల సీడీలను హీరో శ్రీకాంత్ విడుదల చేసి, తొలి సీడీని రాజకీయ నాయకుడు తులసిరెడ్డికి అందజేశారు. ‘‘కామెడీ, సస్పెన్స్, ఎమోషన్స్, హారర్... అన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. ‘అవును’లో హౌస్ వైఫ్గా నటించిన నేను, ఇందులోనూ హౌస్ వైఫ్ క్యారెక్టర్ చేశా. మరి, రాక్షసి ఎవరు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్’’ అన్నారు పూర్ణ. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. -
మన హీరో ‘పూర్ణ’
► నేడు సినిమా విడుదల ► ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థుల బయోపిక్ ► స్వేరోస్కమిటీ అభినందన ఆదిలాబాద్: అతిపిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరం అధిరోహించిన పూర్ణ, ఆనంద్లపై వస్తున్న బయోపిక్ సినిమాలో ఆదిలాబాద్ వాసి మనోజ్ హీరోగా నటిస్తున్నాడు. ‘పూర్ణ’ అనే టైటిల్తో బాలీవుడ్ డైరెక్టర్ రాహుల్బోస్ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 31న దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మనోజ్ ఆనంద్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం ఆదిలాబాద్లో మనోజ్ను స్వేరోస్ కమిటీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సుంకరి రమేశ్, ప్రధాన కార్యదర్శి ఊశన్న, సభ్యులు పొచ్చన్న, కుశల్, అడెల్లు, రాజ్కుమార్ అభినందించా రు. నిజామాబాద్కు చెందిన పూర్ణమాలవత్, ఖమ్మంకు చెందిన ఆనంద్లు 13 ఏళ్ల వయసులో ఎవరెస్టు శిఖరం అధిరోహించి గు రుకులాల పేరు నిలబెట్టారు. వారిపై తీస్తున్న సినిమాలో ఆనంద్ క్యారెక్టర్లో నటిస్తున్న మనోజ్కుమార్ సైతం గురుకులాల్లో చదివాడు. పూర్ణ క్యారెక్టర్లో హైదరాబాద్కు చెంది న ఆదితి ఇందల్ నటిస్తోంది. పూర్ణ సినిమా కోసం వంద మందిని ఎంపిక చేయగా అందులో చివరికి వరంగల్లో ఇంటర్మీడియెట్ చదువుతున్న మనోజ్ను అవకాశం దక్కింది. -
నలభై ఆరేళ్ల తర్వాత తెలుగులో...
బాలీవుడ్ అలనాటి అందాల తార రేఖ దాదాపు నలభై ఆరేళ్ల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. 1966లో బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగుల రాట్నం’ చిత్రంతో బాలనటిగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు రేఖ. ఆ చిత్రం విడుదలైన నాలుగేళ్ల తర్వాత 1970లో వచ్చిన ‘అమ్మ కోసం’ చిత్రంలో కృష్ణంరాజు సరసన నటించారామె. ఆ తర్వాత ఆమె దక్షిణాదిని వదిలి, హిందీ చిత్రసీమకు తరలివెళ్లారు. అందం, అభినయంతో అక్కడ తిరుగులేని స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి రేఖ చాలా విరామం తరువాత తెలుగులో నటించనుండడం సహజంగానే ఆసక్తికరంగా మారింది. కథానాయిక పూర్ణ లీడ్ రోల్ చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో చాలా విరామం తర్వాత రేఖ నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ‘జయమ్ము నిశ్చయమ్మురా’ చిత్రం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న పూర్ణ, నూతన దర్శకుడు సూర్యతో ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేయనున్నారు. మూడు తరాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందట. అందులో ఓ తరం పాత్రలో రేఖ నటిస్తున్నట్లు ఫిల్మ్నగర్లో టాక్. అయితే, రేఖ ఈ చిత్రంలో ఏ పాత్రలో కనిపిస్తారన్నది సస్పెన్స్. ఏది ఏమైనా తెలుగు ప్రేక్షకులను రేఖ మరోసారి అలరించనున్నారు. -
జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు!
బహుభాషా నాయకీమణుల్లో పూర్ణ ఒకరు. ఈ నటిలో మంచి నృత్యకారిణి కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే నటి కంటే నర్తకినే పూర్ణను డామినేట్ చేస్తుందట. ఈ విషయాన్ని తనే ఒక వేదికపై స్వయంగా చెప్పారు. కథానాయకిగా ఒక స్థారుుకి చేరుకోలేకపోవడానికి ఇదీ ఒక కారణం కావచ్చు. అందుకే అప్పుడప్పుడూ కోలీవుడ్లో నాయకిగా మెరుస్తుంటారు. ప్రస్తుతం రెండు చిత్రాలు చేతిలో ఉన్నారుు. ఈ నేపథ్యంలో పూర్ణ తన మనసులోని భావాలను వెల్లడించారు. నటిగా తనది జయాపజయాల పయనం అని చెప్పారు. అపజయాలు వెంటాడుతున్నప్పుడు నటనకు స్వస్తి పలికి నృత్యంపైనే దృష్టి సారించాలన్న భావనకు వచ్చానని, అలా చేసి ఉంటే ఇప్పుడు కొన్ని మంచి అవకాశాలను కోల్పోయేదాన్నని అన్నారు. జీవితంలో తొందరపడి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోరాదని, అలాంటివి భవిష్యత్లో బాధకు గురిచేస్తాయని అన్నారు. తన వెనుక తన కుటుంబ అండ ఎల్ల ప్పుడూ ఉందన్నారు. తాను ఎప్పుడైనా తొందరపాటు నిర్ణయాన్ని తీసుకుంటే దాన్ని పునఃపరిశీలన చేసుకోవాలని వారు సూచిస్తారన్నారు. అది చేయకపోతే తాను చాలా కోల్పోయేదాన్నని పేర్కొన్నారు. ప్రస్తుతం సవరకత్తి చిత్రంలో చాలా మంచి పాత్రను పోషిస్తున్నానని, అదే విధంగా చతురంగవేటై్ట-2 చిత్రంలో అరవిందస్వామికి జంటగా నటిస్తున్నానని తెలిపారు. ఇక తెలుగులోనూ ఒక చిత్రం చేస్తున్నట్లు పూర్ణ చెప్పారు. -
ఓ శాంపిల్ చూస్తారేంటి?
‘‘నా పేరు అడపా ప్రసాద్. కాకినాడ మున్సిపల్ ఆఫీసులో సీనియర్ సూపరింటెండెంట్ని. కమిషనర్ తర్వాత నేనే. అదేంటో... నా చుట్టూ ఉన్నోళ్లంతా ఆనందంగా ఉంటే నాకు ఆనందమండి. ఓ శాంపిల్ చూస్తారేంటి?’’ అంటున్నారు హాస్య నటుడు కృష్ణభగవాన్. ‘గీతాంజలి’ చిత్రం తర్వాత శ్రీనివాస్రెడ్డి హీరోగా నటించిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. పూర్ణ హీరోయిన్. అడపా ప్రసాద్గా కృష్ణభగవాన్ నవ్వించనున్నారు. శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. శివరాజ్ మాట్లాడుతూ- ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో పల్లెవాసన, తెలుగుదనం ఉండే చిత్రాలు అరుదుగా వస్తున్నాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో మా సినిమా ఒకటిగా నిలుస్తుంది. ఈ నెల 13న పాటలు, 25న సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. -
అరుంధతితో పోల్చడం ఆనందం!
దేవుడికి జంతు బలినిస్తే మంచి జరుగుతుందనే ఆచారం నేపథ్యంలో రూపొందుతున్న హారర్ సినిమా ‘అవంతిక’. శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వంలో పూర్ణ, గీతాంజలి ముఖ్యతారలుగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్ కెమేరా స్విచాన్ చేయగా, దర్శకరత్న దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. దర్శకులు రేలంగి నరసింహారావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ప్రస్తుత సమాజంలో బర్నింగ్ ఇష్యూని సినిమాలో ప్రస్తావిస్తున్నాం’’ అని శ్రీరాజ్ బళ్ళా అన్నారు. ‘‘34 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేశాం’’ అని నిర్మాత తెలిపారు. ‘‘అనుష్క ‘అరుంధతి’తో ఈ సినిమాని పోల్చడం నా అదృష్టం’’ అన్నారు పూర్ణ. చిత్ర సమర్పకులు కేఆర్ ఫణిరాజ్ పాల్గొన్నారు. -
బంజారాహిల్స్లో పూర్ణ సందడి
సాక్షి, సిటీబ్యూరో: భారతీయ వస్త్రధారణలో చీరకు ఉన్న ప్రత్యేకత సాటిలేనిదని, అందుకే అది విశ్వవ్యాప్తంగా ఆకట్టుకుంటోందని సినీనటి పూర్ణ (అవును ఫేం) అన్నారు. నగరానికి చెందిన డిజైనర్ స్వరూపారెడ్డి బంజారాహిల్స్లో ఏర్పాటు చేసిన డిజైనర్ ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఎస్ఆర్ ఫ్యాషన్ స్టూడియోను మాజీ మంత్రి డికె అరుణతో కలసి ఆమె ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యాధునిక వస్త్రరీతులు ఎన్ని వస్తున్నా సంప్రదాయ చీరకట్టుకు ఆదరణ తగ్గలేదన్నారు. మాజీ మంత్రి డి.కె.అరుణ మాట్లాడుతూ నవతరం అభిరుచులకు తగ్గ దుస్తులను అందించడం ద్వారా భారతీయ డిజైనర్లు ప్రపంచవ్యాప్తంగా రాణిస్తుండటం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో డిజైనర్ స్వరూపారెడ్డి, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి, వర్ధమాన నటి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్ కుర్రాడు... కాకినాడ ప్రేమ...
అతనిది కరీంనగర్. కాకినాడలో ప్రభుత్వోద్యోగం రావడంతో అక్క డికి మకాం మార్చాడు. అక్కడ ఓ అందమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు. అక్కడ ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలోని చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, పూర్ణ జంటగా స్వీయ దర్శకత్వంలో శివరాజ్ కనుమూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దర్శక-నిర్మాత మాట్లాడుతూ ‘‘ఓ నగరపాలక సంస్థ కార్యాలయ నేపథ్యంలో జరిగే హాస్యప్రేమకథా చిత్రంగా తెరకెక్కిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రవిచంద్ర, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: భాస్కర్. -
విష్ణుతో, మనోజ్తో చేయించనిది అందుకే!
‘‘రెండేళ్ల క్రితం ఓ మరాఠీ సినిమా చూశా. అది కూడా మా కో-డెరైక్టర్ రవి పట్టుబట్టడం వల్ల. నాకు చాలా బాగా నచ్చింది. అందుకే హక్కులు తీసుకుని ఈ సినిమా చేశాం. ఇందులో అన్ని అంశాలూ ఉన్నాయి’’ అని మోహన్బాబు అన్నారు. ‘అల్లరి మొగుడు’లో సందడి చేసిన రమ్యకృష్ణ-మీనా కాంబినేషన్లో, ‘అల్లరి’ నరేశ్-పూర్ణ ఓ జంటగా మోహన్బాబు నటించిన చిత్రం ‘మామ మంచు-అల్లుడు కంచు’. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మోహన్బాబు పంచుకున్న కబుర్లు... విష్ణుతో సినిమా తీయాలనే ఆలోచనతో దర్శకుడు శ్రీనివాసరెడ్డి వచ్చాడు. ఆ కథ లేట్ అయ్యేట్లు ఉండడంతో ఈ మరాఠీ సినిమా చూడమన్నాను. అతనికి బాగా నచ్చింది. 22 సంవత్సరాలకు ముందు రమ్యకృష్ణ, మీనా నాతో నటించారు. ఈ సినిమాలో మళ్ళీ వాళ్లనే పెట్టుకోవడానికి కారణం... ఇందులోనూ నా పాత్రకు ఇద్దరు భార్యలు ఉంటారు. ఒక భార్యకు కొడుకు, ఇంకో భార్యకు కూతురు ఉంటారు. కూతుర్ని ప్రేమించేవాడిగా ‘అల్లరి’ నరేశ్ నటించాడు. అలీ కూడా హీరో లాంటి పాత్ర చేశాడు. మరాఠీ కథలో కొన్ని మార్పులు చేసి, శ్రీనివాసరెడ్డి అద్భుతంగా తీశాడు. పాటలు, కెమెరా పనితనం- అన్నీ బాగుంటాయి. మరాఠీ కథలో ఏ పాత్రలు ఉంటాయో ఇందులోనూ అవే ఉంటాయి. నిజానికి, నరేశ్ పాత్రను విష్ణు, మనోజ్ కూడా చేయగలుగుతారు. కానీ, సినిమాలో నా కూతుర్ని ప్రేమించే పాత్ర కాబట్టి, కావాలనే వాళ్లతో చేయించలేదు. ఒక్కోసారి పాత్రలను పాత్రలానే చూడలేకపోతున్నాను. అందుకే వాళ్లతో చేయించలేదు. వేరే ఎవరైతే బాగుంటుందా అనుకున్నప్పుడు నరేశ్తో చేయిద్దామనుకున్నాం. నరేశ్ బాగా చేశాడు. టైమ్ అంటే టైమ్కి సెట్స్పైకి వచ్చాడు. ‘పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయి. సినిమా జయాపజయాలు విధి మీద ఆధారపడి ఉంటాయ’ని నేను నమ్ముతాను. నేను తీసిన సినిమాల్లో విజయం సాధించినవీ ఉన్నాయి. పరాజయాలూ ఉన్నాయి. ఆ విషయాన్ని నిర్భయంగా ఒప్పుకుంటాను. ఈ క్రిస్మస్కి మంచి సినిమా ఇవ్వాలనే ఆకాంక్షతో ఈ సినిమా చేశాను. నేను హిందు దేవుళ్లను మాత్రమే కాదు.. అందర్నీ పూజిస్తాను. ఆ దేవుళ్లూ, అలాగే నలభై ఏళ్లుగా నన్ను ఆశీర్వదిస్తున్న ప్రేక్షకుల ఆశీస్సులూ ఉంటాయని నమ్ముతున్నాను. ఒక మంచి చిత్రం ద్వారా 2015కి వీడ్కోలు చెబుతూ, 2016కి నవ్వుతూ స్వాగతం పలకనున్నాం. -
దసరా స్పెషల్స్
పూర్ణాలు కావలసినవి: మినప్పప్పు - ఒక కప్పు, బియ్యం - రెండు కప్పులు, పచ్చి శనగపప్పు- ఒక కప్పు, తరిగిన బెల్లం - ఒక కప్పు, పంచదార- ఒక కప్పు, యాలకుల పొడి - ఒక టీ స్పూను, నెయ్యి - రెండు టీ స్పూన్లు, నూనె - సరిపడినంత. తయారీ: బియ్యాన్ని, మినప్పప్పును విడివిడిగా నానబెట్టాలి మూడు గంటల తరువాత రెండింటినీ కలిపి అందులో చిటికెడు ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి రుబ్బేటప్పుడు నీళ్లు ఎక్కువ కాకుండా జాగ్రత్త పడాలి. దోసెల పిండిలాగా మెత్తగా రావాలి కాని అంత పలుచగా ఉండకూడదు గారెల పిండికంటే కొంచెం లూజుగా ఉండేటట్లు చూడాలి రుబ్బిన తరువాత ఈ మిశ్రమం ఒక రాత్రంతా నానాలి పూర్ణాలు చేయడానికి ముందు రోజు నుంచే ప్రిపరేషన్ మొదలవ్వాల్సి ఉంటుంది శనగపప్పును కడిగి పది నిమిషాల సేపు నానిన తర్వాత ప్రెషర్ కుకర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఉడికిన పప్పులో ఉన్న నీటిని వడపోయాలి శగనపప్పులో బెల్లం పొడి, పంచదార వేసి చిన్న మంట మీద ఉడికించాలి బెల్లం, పంచదార ముందు కరిగి నీరవుతాయి. అవి తిరిగి దగ్గరయ్యే వరకు అడుగంటకుండా గరిటతో తిప్పుతూ ఉడికించాలి కొద్దిసేపటికి శనగపప్పు, బెల్లం, పంచదార అన్నీ కలిసిపోయి ముద్దయిన తరువాత దించేయాలి * దించిన తరువాత యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేయాలి నూనె మరిగిన తరువాత ఒక్కొక్క ఉండను ముందురోజు రుబ్బి సిద్ధంగా ఉంచిన మినప్పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి * పూర్ణాల తయారీలో నైపుణ్యం ఇక్కడే ఉంటుంది లడ్డూ నలగకుండా మినప్పిండిలో ముంచి తీసి నూనెలో వేయాలి ఇలా వేసేటప్పుడు మినప్పిండి మిశ్రమం అన్ని వైపులా సమంగా పట్టాలంటే మూడువేళ్లతో వేయాలి ఇలా చేస్తే పూర్ణం గుండ్రంగా, చూడడానికి అందంగా ఉంటుంది నూనెలో అన్ని వైపులా సమంగా వేగేటట్లు తిప్పుతూ దోరగా వేగిన తరువాత తీసుకోవాలి వేడి వేడిగా నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటాయి. సగ్గుబియ్యం లడ్డూలు కావలసినవి: సగ్గుబియ్యం - 1 కప్పు, నెయ్యి - 1 కప్పు, పంచదార - 1 కప్పు, యాలకుల పొడి - 1 టీస్పూన్, జీడిపప్పు, బాదంపప్పు - 10. తయారీ: పాన్లో కొద్దిగా నెయ్యి వేడి చేసి సగ్గుబియ్యం వేసి దోరగా వేయించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి పంచదార, యాలకులు కలిపి మెత్తగా పొడి చేసుకుని సగ్గుబియ్యం పొడిలో వేయాలి ఇందులో సన్నగా తరిగిన జీడిపప్పు, బాదంపప్పు కలపాలి అంతా కలిసిన తర్వాత నెయ్యి కరిగించి వేసి కలిపి ఉండలు కట్టుకోవాలి చల్లారిన తర్వాత గట్టిపడతాయి. బ్రెడ్ జామూన్స్ కావలసినవి: బ్రెడ్ పొడి - 2 కప్పులు, బెల్లం తురుము - 1/2 కప్పు, యాలకుల పొడి - 1/4 టీ స్పూన్, కొబ్బరి తురుము - 3 టీ స్పూన్లు, నెయ్యి - 3 టీ స్పూన్లు. తయారీ: ఎండిన బ్రెడ్ లేదా రస్కులను పొడి చేసుకోవాలి పాన్లో బెల్లం తురుము, అరకప్పు నీళ్లు పోసి కరిగించి వడకట్టుకోవాలి మరో పాన్ వేడి చేసి ఈ బెల్లం నీరు పోసి మరిగించాలి పాకం కాస్త ముదురుతున్నప్పుడు బ్రెడ్ పొడి, యాలకులపొడి, వేసి కలుపుతూ నిదానంగా ఉడికించాలి మొత్తం బ్రెడ్, బెల్లం ఉడికి దగ్గర పడ్డాక నెయ్యి, యాలకుల పొడి వేసి కలిపి దించి చల్లారనివ్వాలి మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు (గుండ్రంగా లేదా కోలగా) చేసుకుని ఎండు కొబ్బరి పొడిలో రోల్ చేసి ఆరనివ్వాలి. కార్న్ఫ్లోర్ / బొంబాయి హల్వా కావలసినవి: కార్న్ఫ్లోర్ - 1 కప్పు, పంచదార - 3 కప్పులు, నీళ్లు - 4 కప్పులు, నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు - 10, బాదంపప్పు - 8,ఫుడ్ కలర్ - 1/4 టీ స్పూన్. తయారీ: ఒక పళ్లానికి లోపలంతా నెయ్యి రాసుకుని ఉంచుకోవాలి పాన్లో చెంచాడు నెయ్యి వేసి వేడిచేసి చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు పలుకులు వేయించి పెట్టుకోవాలి ఒక గిన్నెలో పంచదార, కలర్, కార్న్ఫ్లోర్, నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి పాన్ వేడి చేసి ఈ మిశ్రమం వేసి కలుపుతూ ఉడికించాలి అది చిక్కబడుతున్నప్పుడు మిగిలిన నెయ్యి వేసి కలుపుతూనే ఉండాలి ముందు తెల్లగా చిక్కగా ఉన్నా తర్వాత మెల్లిగా పారదర్శకంగా మారుతుంది అప్పుడు వేయించిన బాదం, జీడిపప్పు పలుకులు వేసి కలిపి నెయ్యి రాసిన పళ్లెంలో వేసి సమానంగా పరచాలి చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ కలర్స్ వేసుకోవచ్చు కార్న్ఫ్లోర్ లేదా కస్టర్డ్ పౌడర్ కూడా వాడుకోవచ్చు. కోకోనట్ బర్ఫీ కావలసినవి: ఎండు కొబ్బరి తురుము - 250 గ్రా., కండెన్స్డ్ మిల్క్ - 250 మి.లీ., పంచదార - 150 గ్రా.,వెన్న - 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ - 1/2 టీ స్పూన్, నచ్చిన ఫుడ్ కలర్ - 3 లేదా 4 చుక్కలు తయారీ: నలుచదరంగా ఉండే కేక్ టిన్ను లేదా అంచు ఉన్న వెడల్పాటి గిన్నె లేదా ప్లేట్ లోపలివైపు పలుచగా వెన్న రాసి పెట్టుకోవాలి పాన్లో కొబ్బరి తురుము, కండెన్స్డ్ మిల్క్, పంచదార కలిపి చిన్న మంట మీద కలుపుతూ ఉడికించాలి మొత్తం మిశ్రమం ఉడికి చిక్కబడుతున్నప్పుడు ఫుడ్ కలర్ వేసి కలిపి దగ్గరపడ్డాక వెన్న, ఎసెన్స్ వేసి కలిపి అంచులు వదులుతుండగా దింపి వెన్న రాసిన గిన్నెలో వేసి సమానంగా సర్దాలి చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనిని రెండు మూడు రంగుల్లో కూడా చేసుకోవచ్చు. ఆరెంజ్ రవ్వ కేసరి కావలసినవి: బొంబాయి రవ్వ - 2 కప్పులు, తాజా నారింజ రసం - 1 కప్పు, పంచదార - 125 గ్రా., నెయ్యి - 100 గ్రా, యాలకుల పొడి - 1 టీ స్పూన్, జీడిపప్పు - 10, కిస్మిస్ - 20, ఎల్లో ఫుడ్ కలర్ - చిటికెడు. తయారీ: సగం నెయ్యి వేడి చేసి రవ్వను దోరగా వేయించి పెట్టుకోవాలి నాలుగు కప్పుల నీళ్లు మరిగించి అందులో పంచదార, యాలకుల పొడి, ఫుడ్ కలర్ వేసి కలపాలి తర్వాత వేయించిన రవ్వ మెల్లిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి రవ్వ ఉడికిన తర్వాత మిగిలిన నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, తాజా నారింజ రసం వేసి కలుపుతూ ఉండాలి పూర్తిగా ఉడికి చిక్కబడ్డాక తీసి నెయ్యి రాసిన పళ్లెంలో వేసి సమానంగా వత్తుకుని చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి కావాలంటే కొద్దిగా ఆరెంజ్ ఎసెన్స్ వేసుకోవచ్చు. 1. మటన్ పప్పు కావలసినవి: మాంసం - 250 గ్రా., ఉడికించిన కందిపప్పు - 200 గ్రా., ఉల్లిపాయలు - 2, కరివేపాకు - 1 రెబ్బ, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్స్, పసుపు - 1/2 టేబుల్ స్పూన్, కారం పొడి - 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె - 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి - 1/2 టీ స్పూన్, చింతపండు పులుసు - 1/2 కప్పు. తయారీ: పాన్లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి కొద్దిగా వేయించుకోవాలి తరువాత కడిగి శుభ్రం చేసుకున్న మాంసం ముక్కలు, కారం పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి నీరంతా ఇగిరిపోయాక రెండు కప్పుల నీళ్లు పోసి మాంసం మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి చింతపండు పులుసు వేసి మరో ఐదు నిమిషాల తర్వాత ఉడికించిన కందిపప్పు వేసి బాగా కలియబెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించి, గరం మసాలా పొడి కలిపి, కొత్తిమీర చల్లి వడ్డించాలి. 2. చికెన్-సెనగపప్పు కూర కావలసినవి: చికెన్ - 500 గ్రా., సెనగపప్పు - 100 గ్రా. ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 3, అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ స్పూన్, పసుపు - 1/4 టీ స్పూన్, కారం పొడి - 1/2 టీ స్పూన్, ధనియాల పొడి - 1 టీ స్పూన్స్, గరం మసాలా పొడి - 1/2 టీ స్పూన్, కరివేపాకు - 2 రెబ్బలు, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - 5 టీ స్పూన్లు. తయారీ: సెనగపప్పు కడిగి నీళ్లు పోసి గంటసేపు నాననివ్వాలి. చికెన్ను శుభ్రంగా కడిగి జల్లెట్లో వేసి పెట్టుకోవాలి పాన్ లేదా కుక్కర్లో నూనె వేసి వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి కొద్దిగా వేగిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి వేయాలి ఇప్పుడు చికెన్ ముక్కలు వేసి కలిపి మూతపెట్టాలి ముక్కలలో నీరంతా ఇగిరిపోయి వేగిన తర్వాత సెనగపప్పు వేసి మసాలాలు అన్ని కలిసేవరకు వేయించాలి తర్వాత ఇందులో కప్పు నీళ్లు పోసి కలిపి మూతపెట్టి ఉడికించాలి ముక్కలు, పప్పు ఉడికిన తర్వాత తగినంత ఉప్పు, గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి సెనగపప్పు మెత్తబడకుండా బద్దలుగానే ఉండనివ్వాలి. దీనికి పచ్చిపులుసు సరైన జోడు. 3. ఖీమా ముట్టీల (ఉండల) కూర కావలసినవి: మటన్ ఖీమా - 250 గ్రా., ఉల్లిపాయలు - 1, పచ్చిమిరపకాయలు - 2, టమోటాలు - 3, అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు, కొబ్బరి పొడి - 100 గ్రా., పసుపు - 1/2 టీ స్పూన్, కారం పొడి - 2 టీ స్పూన్లు, గరం మసాలా పొడి - 1 టీ స్పూన్, ఉప్పు - తగినంత, కొత్తిమీర - 1/4 కప్పు, కరివేపాకు - 1 రెమ్మ, నూనె - 3 టీ స్పూన్లు. తయారీ: ఉల్లిపాయలు, టమోటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి ఖీమా శుభ్రంగా కడిగి నీరు పిండేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇందులో సగం పసుపు, కారం, గరం మసాలా, కొబ్బరి పొడి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలిపి రోట్లో గాని, గ్రైండర్లో గాని వేసి రుబ్బుకోవాలి ఎక్కువ మెత్తగా చేయకూడదు. పిండిలా అవుతుంది గ్రైండర్లో వేస్తే నిమిషం పాటు తిప్పి తీసేయాలి రోట్లో అయితే మంచిది. మొత్తం మసాలా కలిసి ఒక్కతీరుగా అయ్యేవరకు రుబ్బుకోవాలి చేతికి నూనె అద్దుకుంటూ ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి కావాలంటే వెడల్పుగా కూడా చేసుకోవచ్చు వెడల్పాటి పాన్లో నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి ఉల్లిపాయలు వేగకపోతే బావుండదు అల్లం, వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం పొడి, కరివేపాకు వేసి మరికొంత సేపు వేయించి ఖీమా ఉండలు, తగినంత ఉప్పు వేసి విరిగిపోకుండా మెల్లిగా కలిపి మూత పెట్టాలి నీరంతా ఇగిరిపోయాక సన్నగా తరిగిన టమోటాలు వేసి కాస్త వేయించి, కొబ్బరిపొడి, అరకప్పు నీరు పోసి చిన్న మంటపై నూనె తేలేవరకు ఉండికించాలి ఎక్కువగా కలిపితే ఉండలు విరిగిపోతాయి చివరలో గరం మసాలా, కొత్తిమీరవేసి కలిపి దింపేయాలి ఈ ఖీమా ఉండలు విడిగా నూనెలో వేయించి కూరలో వేయొచ్చు లేదా పచ్చి ఉండలను కూరలోనే వేయించొచ్చు. 4. మసాలా కోడికూర కావలసినవి: కోడి మాంసం - 1 కేజీ, ఉల్లిపాయలు - 2, టమోటాలు - 2, పచ్చిమిర్చి - 4, అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు, పసుపు - 1/4 టీ స్పూన్, ధనియాల పొడి -2 టీ స్పూన్లు, పసుపు - 1/4 టీస్పూన్, కారం పొడి - 2 టీ స్పూన్లు, గరం మసాలా పొడి - 1/2 టీ స్పూన్, కొబ్బరి పొడి - 3 టేబుల్ స్పూన్లు, పెరుగు - 1 కప్పు / 100 మి.లీ., జీడిపప్పు పొడి లేదా ముద్ద - 3 టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - కొద్దిగా, నూనె - 4 టేబుల్ స్పూన్లు. తయారీ: చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి జల్లెట్లో వేసి ఉంచుకోవాలి మందంగా ఉండే బాణలిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం పొడి, ధనియాలు పొడి వేసి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేసి మగ్గిన తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి నిదానంగా ఉడికించాలి జీడిపప్పు ముద్ద, పెరుగు కొబ్బరి పొడి కలిపి పెట్టుకోవాలి చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత ఈ మిశ్రమం, కొత్తిమీర వేసి కలిపి నూనె తేలేవరకు ఉడికించి గరం మసాలా పొడి వేసి కలిపి దించేయాలి. -
అవును! మళ్లీ వచ్చాడు...!
ఆ ఇద్దరికీ అప్పుడే పెళ్లయ్యింది. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తుం టారు. కానీ ఇంతలో ఓ అలజడి. భర్త ఊరెళ్లగానే ఒంటరిగా ఉన్న ఆమెపై రూపం లేని ఓ మనిషి దాడి చేస్తుంటాడు. చిత్రహింసలు పెడుతుంటాడు. ఆ మనిషితో పోరాడింది. చివరకు ఆ బెడద వదిలిందనుకునే లోపే మళ్లీ ఆ వ్యక్తి వచ్చాడు. అప్పుడేం జరిగిందన్నది తెలియాలంటే ‘అవును 2’ చిత్రం చూడాలంటున్నారు దర్శక, నిర్మాతలు. పూర్ణ, హర్షవర్ధన్ రాణే జంటగా సురేశ్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవిబాబు దర్శకుడు. ఏప్రిల్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన డి. సురేశ్ బాబు తమ ఈ తాజా ప్రయత్నం గురించి మాట్లాడుతూ-‘‘గతంలో మేము నిర్మించిన ‘అవును’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సీక్వెల్ అంతకు మించి బాగుంటుంది. ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్ప్లే: సత్యానంద్, సంగీతం: శేఖర్ చంద్ర. -
అమ్మమ్మా..!
వంశోద్ధారకుడి కోసం.. 60 ఏళ్ల వయస్సులో పురిటిపాట్లు పూర్ణి వయస్సు 60, లక్ష్మా వయస్సు 70.. పూర్ణికి ఎనిమిది కాన్పులు..ప్రతి కాన్పులో ఆడపిల్లే. వారిలో ఐదుగురు చనిపోగా, ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయి. వారికీ పిల్లలు పుట్టి పెద్దవాళ్లయ్యారు. కానీ ‘అమ్మ’మ్మ.. వంశోద్ధారకుడి కోసం ఎదురుచూపు.. ఇతని కోసం అరవై ఏళ్ల వయస్సులో పురిటిపాట్లు పడింది. ఎట్టకేలకు వారి కల ఫలించింది. మగబిడ్డ పుట్టాడు. అదీ సాధారణ కాన్పులో. ఈ ఘటన పీఏపల్లి మండలం వద్దిపట్లలో జరిగింది. -
లక్ష్యంతో ముందుకెళ్తే ఏదైనా సాధ్యమే
విద్యార్థులు.. నిత్యం పుస్తకాలతో కుస్తీ.. మార్కులపైనే దృష్టి. కానీ.. గురువుల ప్రోద్బలం.. ప్రోత్సాహంతో వయసుకంటే కంటే పెద్ద సాహసం చేశారు.. ఏకంగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు.. అందరి మన్ననలు పొందారు విద్యార్థులు పూర్ణ, ఆనంద్. ఈ ఘనత సాధించిన వారిని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల పూర్వ విద్యార్థుల సంఘం(స్వారోస్) ఆధ్వర్యంలో శనివారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ఘనంగా సన్మానించారు. కేయూక్యాంపస్ : లక్ష్యంతో ముందుకెళ్తే దేనినైనా సాధించవచ్చని, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్ లే అందుకు సాక్ష్యమని అర్బన్ ఎస్పీ అంబర్కిషోర్ఝా అన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల పూర్వవిద్యార్థుల సంఘం(స్వారోస్) ఆధ్వర్యంలో శనివారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ,అనంద్లను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ ఎస్పీ మాట్లాడుతూ.. జీవితంలో అనేక సవాళ్లు ఎదరవుతాయని, సానుకూల దృక్పథంతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. చిన్నవయసులోనే పూర్ణ, ఆనంద్లు ఎవరెస్టు శిఖరం అధిరోహించడం గర్వకారణమన్నారు. కేయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ రంగారావు మాట్లాడుతూ విద్యార్థులు అకుంఠిత దీక్షతో ముందుకు వెళ్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. గురుకుల విద్యార్థుల కోసం ప్రవీణ్కుమార్ చేస్తున్న వివిధ కార్యక్రమాలు స్ఫూర్తిని కలిగిస్తున్నాయన్నారు. క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి మాట్లాడుతూ విద్యార్ధి దశ నుంచే ప్రణాళిక బద్ధంగా లక్ష్యంతో చదువుకుంటే అనుకున్న స్థానానికి చేరుకోవచ్చన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ పుల్లయ్య మాట్లాడుతూ ప్రవీణ్కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వచ్చే ఏడాది గురుకులాల్లో డిగ్రీ కాలేజీలను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ సభకు స్వారోస్ జిల్లా అధ్యక్షుడు పట్టాభి అధ్యక్షత వహించారు. స్వారోస్ రాష్ర్ట కోకన్వీనర్ చలపతి, రాష్ట, జిల్లా స్వారోస్ బాధ్యులు పుల్లాకిషన్, రవి, కరుణాకర్, ఒంటేరు చక్రి, సదానందం, పరుశరామ్, కుంటా శ్రీనివాస్, మహేష్ , శోభన్బాబు, మానస, పీఈటీ శ్రీలత పాల్గొన్నారు. కలెక్టర్ అభినందన జిల్లాలోని స్వారోస్ కమిటీ సన్మాన కార్యక్రమానికి వచ్చిన పూర్ణ, ఆనంద్లకు సాంఘిక సంక్షేమ గురకుల పాఠశాలల విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం హన్మకొండలోని కీర్తిస్తూపం నుంచి ర్యాలీ ప్రారంభించారు. తొలుత కలెక్టర్ కిషన్ను కలిసిన పూర్ణ, అనంద్లను ఆయన అభినందించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకున్నారు. -
వీనుల విందుగా..కను విందుగా...
‘‘కథ వినకుండా ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. త్రినాథరావుగారి మీద నాకంత నమ్మకం. ‘ఏమైంది ఈ వేళ’ తర్వాత అంతటి హిట్ సినిమా చేయలేదు. ఈ సినిమా ఆ కొరతను తీరుస్తుందనే నమ్మకం ఉంది’’ అని వరుణ్ సందేశ్ చెప్పారు. వరుణ్ సందేశ్, పూర్ణ, సోనియా బిర్జి ముఖ్య తారలుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నువ్వలా నేనిలా’. లోలారెడ్డి సమర్పణలో రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. సాయి కార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను దామోదర ప్రసాద్ విడుదల చేశారు. ఈ వేడుకలో బెక్కెం వేణుగోపాల్, నవదీప్, నిఖిల్, ప్రిన్స్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ చిత్రం టైటిల్ వినడానికి హాయిగా ఉందని అందరూ అంటున్నారనీ, వినడానికి మాత్రమే కాదు, చూడ్డానికి కూడా ఈ సినిమా హాయిగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. వచ్చే నెల రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత అన్నారు. -
ఎవరెస్టంత ఎత్తుకు ఎదిగారు!
-
వైవిధ్యమైన ప్రేమకథ
వరుణ్సందేశ్, పూర్ణ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘నువ్వలా నేనిలా’. త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఇందూరి రాజశేఖర్ నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు చెబుతూ -‘‘వరుణ్ సందేశ్ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. కథ, కథనాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి’’ అని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, త్వరలో పాటల్ని విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. సోనియా బిర్జి, వెన్నెల కిషోర్, సన, ధన్రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: అమోఘ క్రియేషన్స్, మాటలు: ఉదయ్ భాగవతుల, కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: సాయికార్తిక్, కూర్పు: శ్రావణ్. -
మట్టిలో మాణిక్యం పూర్ణ
గ్రామీణ గిరిజన కుటుంబంలో పుట్టి.. గురుకుల పాఠశాలలో చదివి.. ఎవరికీ అందనంత ఎత్తున్న ఎవరెస్టును ఎక్కింది. జిల్లా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. అసాధ్యాన్ని సైతం.. నిండైన ఆత్మవిశ్వాసంతో సుసాధ్యం చేసింది మన ఇందూరు బిడ్డ మాలావత్ పూర్ణ. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తర్వాత తొలిసారి వచ్చిన పూర్ణకు జిల్లా ఘనస్వాగతం పలికింది. పాకాల(సిరికొండ): ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ మట్టిలో మాణిక్యమని తెలంగాణ విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ రిక్క లింబాద్రి అన్నారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన అనంతరం పూర్ణ తొలిసారిగా స్వగ్రామమైన పాకాలకు ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో లింబాద్రి మాట్లాడారు. ఒక సాధారణ గిరిజన బాలిక ప్రపంచంలోనే అత్యంత ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఆణిముత్యం గా నిలిచిందన్నారు. పూర్ణ, ఆనంద్లను ఎవరెస్ట్ అధిరోహణకు ఎంపిక చేసి పంపిస్తున్నప్పు డు ఎంతోమంది ఐపీఎస్ ప్రవీణ్కుమార్ను ఏవేవో అన్నారని, వారికేమైనా జరిగితే పంజాగుట్ట చౌరస్తాలో నన్ను ఉరి తీస్తారని మాట్లాడారని ప్రవీణ్కుమార్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారని గుర్తు చేశారు. అనంతరం సన్మాన గ్రహీత పూర్ణ మాట్లాడుతూ ఎవరెస్ట్ అధిరోహణ కోసం ప్రయాణం ప్రారంభించిన రోజు మా శిక్ష కులు ఎవరెస్ట్ అధిరోహణ ఎంత కఠినతరమైందో మా తల్లిదండ్రులకు వివరించారన్నారు. అప్పుడు మా నాన్న కష్టపడితేనే కదా సార్ ఫలితం వచ్చేది అని చెప్పగానే నాకెంతో ఆనందం వేసిందని పూర్ణ గుర్తు చేశారు. డెత్ జోన్లో రాత్రి తొమ్మిదిన్నర సమయంలో ఎక్కుతున్నప్పుడు ఆకాశంలో కనిపించే నక్షత్రాల వెలుగును ఎంతో ఆస్వాదించానన్నారు. మా గ్రామం పాకాల పేరును ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని పూర్ణ తెలిపారు. ఐపీఎస్ ఆర్.ప్రవీణ్కుమార్, శిక్షకులు శేఖర్బాబు, పరమేష్కుమార్, వేణుగోపాలచారికి ఈసందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తాహెర్బిన్ హందాన్, పూర్ణ తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సన్మానం పూర్ణను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా స న్మానించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎ. సాయిలు పూర్ణకు శాలువా కప్పి పూలమాలలు వేశారు. అనంతరం పూర్ణతోపాటు ఆమె తల్లిదండ్రులకు సన్మానం చేసి నూతన వస్త్రాలను బహుకరించారు. కార్యక్రమంలో యూని యన్ నాయకులు గంగాదాసు, పాకాల నర్సిం లు, జిల్లా బంజారా సేవా సంఘం మాజీ అధ్యక్షుడు శశాంక్ తదితరులు ఉన్నారు. అధికారికంగా పూర్ణకు సత్కారం నిజామాబాద్ ఎంపీ కె. కవిత కలెక్టరేట్: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి దేశ ఖ్యాతిని మరింత పెంచిన మాలావత్ పూర్ణను త్వరలో అధికారికంగా సన్మానించనున్నట్లు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఆమె తన స్వగృహంలో మాట్లాడారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అతిచిన్న వయస్సులో ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా అధిరోహించిన పూర్ణను అభినందిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. పూర్ణను త్వరలో జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున సన్మానిస్తామని వివరించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సిరికొండ మండలం పాకాల గ్రామంలో భార త రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూర్ణ ఆవిష్కరించారు. జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు నారాయణ విగ్రహాన్ని వితరణగా అందించారు. గ్రామాని కి చెందిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులు గద్దె నిర్మించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బాలయ్య, సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సోసైటీ చైర్మన్ నర్సయ్య, పాల్గొన్నారు. భీమ్గల్: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలోకెక్కిన జిల్లా వాసి మాలావత్ పూర్ణను ఆదివారం భీమ్గల్ జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీ శర్మన్ ఆధ్వర్యంలో సన్మానించారు. పూర్ణ స్వగ్రామమైన పాకాలకు వచ్చిన పూర్ణకు శాలువా పూల మాలలు వేసి మెమెంటోతో సన్మానించారు. ఆమె వెంట టీఆర్ఎస్ నాయకులు శర్మన్ నాయక్, రాజేశ్వర్, లింబాద్రి తదితరులున్నారు. -
ఎవరెస్ట్ను అధిరోహించిన తెలుగు తేజాలకు నజరానా!
-
‘ఎవరెస్టు’ వీరులకు ఘనస్వాగతం
సాక్షి,హైదరాబాద్: ఎవరెస్టు శిఖరంపై భారత పతాకాన్ని ఎగరువేసిన తెలుగు తేజాలు లావత్పూర్ణ, సాధనపల్లి అనంద్కుమార్కు ఆదివారం ఇక్కడ ఘనస్వాగతం లభించింది. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే అభిమానులు గురుకుల సంస్థ విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుర్రపు బగ్గీలో ర్యాలీగా బయటికి తీసుకొచ్చారు. విమానాశ్రయం నుంచి ర్యాలీగా శంషాబాద్కు చేరుకున్న పూర్ణ, ఆనంద్లు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా పాతబస్తీకి చేరుకున్నారు. ఫలక్నుమాలోనూ స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం మొజంజాహిమార్కెట్, గన్పార్కు మీదుగా ట్యాంక్బంక్కు భారీ ర్యాలీ చేరుకుంది. -
ఐపీఎస్ అధికారి కావడమే లక్ష్యం
-
ఎవరెస్ట్ అధిరోహించిన తెలుగు తేజాలు
-
మా సంకల్పం ముందు ఎవరెస్ట్ చిన్నదైంది
మీడియాతో తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్ సాక్షి, న్యూఢిల్లీ: చిన్న వయసు.. పెద్ద లక్ష్యం.. ముందున్నది ప్రపంచంలోనే ఎత్తై ఎవరె స్ట్ శిఖరం.. అధిరోహించాలంటే కొండంత ధైర్యం, అంతే ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం.. మైనస్ నలభై డిగ్రీల చలి, కాలుతీసి కాలు వేయలేనంత మంచు.. కాలి బూట్లే 10 కిలోలు, భుజాన మరో 20 కేజీల బ్యాగ్.. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దపెద్దవారికే సాధ్యంకాని ఎవరెస్ట్ అధిరోహణ.. వీరికెలా సాధ్యమంటూ అంతా ఆశ్చర్యంగా చూసినా, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారు తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్లు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, మువ్వన్నెల జాతీయ జెండాను రెపరెపలాడించిన తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్కుమార్లు బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. వీరికి ఇక్కడి ఏపీభవన్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మిగతా ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఈ ఇద్దరు మే 25న ఎవరెస్ట్ శిఖరాగ్రంపై అడుగు పెట్టిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల అత్యంత పిన్న వయస్సులో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి పూర్ణ రికార్డు సృష్టించగా, 17 ఏళ్ల ఆనంద్ సైతం అరగంట తేడాతో ఈ శిఖారాన్ని చేరుకొని తెలుగు వారి సత్తా చాటిన విషయమూ విదితమే. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ అందించిన సహకారం.. శిక్షకులు శేఖర్, పరమేష్ల సారథ్యంలో సాగిన ఎవరెస్ట్ అధిరోహణ అనుభవాలను వారిద్దరూ మీడియాతో పంచుకున్నారు. అవకాశం దొరికితే మరోమారు అధిరోహిస్తా: పూర్ణ ‘‘నేను ఎవరెస్ట్ ఎక్కడానికి వెళుతున్నా అని చెప్పగా నా తల్లిదండ్రులు ముందు కంగారుపడ్డా, తర్వాత అంగీకరించారు. నువ్వు సాధిస్తావ్ అని ప్రోత్సహించారు. వారి ఆశీర్వాదం, స్వేరోస్ కార్యదర్శి ప్రవీణ్కుమార్ ప్రోత్సాహం, శేఖర్, పరమేష్లు ఇచ్చిన శిక్షణతో ఎవరెస్ట్ అధిరోహణకు సిద్ధమయ్యాం. భువనగిరి రాక్లైప్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే అంత పెద్ద బండను చూసి భయపడిపోయా. ఇంత పెద్ద బండను ఎలా ఎక్కుతామని అనుకున్నా. కానీ శేఖర్, పరమేష్ల ప్రోత్సాహంతో రోజూ ఆ బండను ఎక్కుతుంటే భయం పోయింది. ఆ ఉత్సాహంతోనే డార్జిలింగ్లోని పినాక్ పర్వతాన్ని ఎక్కాం. తర్వాత లఢఖ్లో చలిని తట్టుకుని, జారుడు రాళ్లపై నడవడం నేర్చుకున్నాక మాలో పట్టుదల పెరిగింది. ఆ ఉత్సాహంతోనే ఎవరెస్ట్ ఎక్కేందుకు సిద్ధమయ్యాం. చాలా క్లిష్ట వాతావరణంలో, అంతకన్నా ప్రమాదకర పరిస్థితిలో ప్రయాణం సాగింది. మైనస్ 40 డిగ్రీల చలిలో, జారుడు మంచును దాటుకుంటూ వెళ్లేందుకు చాలా కష్టపడ్డా. ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్లాం. కొద్దిదూరం వెళ్లాకఆరు శవాలు కనిపించాయి. వాటిని చూడగానే భయంతో వణికిపోయాం. అయితే, దేనికీ వెరవకుండా, వె నక్కి చూడకుంగా ముందుకు సాగడమే సాహసం, అదే జీవితం అన్న మా గురువు ప్రవీణ్కుమార్ మాటలు గుర్తొచ్చి మరింత దృఢ విశ్వాసంతో ముందుకు సాగాం. మా దృఢ సంకల్పం ముందు ఎవరెస్ట్ చిన్నగా అయిపోయింది. అన్నీ దాటుకుంటూ చివరికి ఎవరెస్ట్ శిఖరాగ్రాన్ని చేరుకున్నాం. నేను ఈ రోజు అందరికన్నా ఎత్తై ప్రదేశంలో ఉన్నాను అనే భావన కలిగి చాలా గర్వంగా ఫీలయ్యా. నా తల్లిదండ్రులు, ప్రవీణ్కుమార్ సార్ గుర్తొచ్చి ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. అక్కడే జాతీయ జెండా, తెలంగాణ జెండాను ఎగురవేసి.. బీఆర్ అంబేద్కర్, సాంఘిక సంక్షేమ శాఖకు వన్నెతెచ్చిన ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ల ఫోటోలను అక్కడ ఉంచాం. బాలికలు ఏదైనా చేయగలరు. బాలుర కంటే ఎక్కువ చేయగలరు. నాకు మళ్లీ అవకాశం ఇస్తే మరోమారు ఎవరెస్ట్ ఎక్కడానికి సిధ్దంగా ఉన్నా. ఈ విజయాన్ని మా స్వేరోస్ టీమ్ మొత్తానికి అంకితమిస్తున్నా. ఇక మీదట చదువుపై దృష్టిపెడతా. ముందు పదో తరగతి పాసవ్వాలి. ఐపీఎస్ అయి, పేదలకు సేవ చేయాలన్నదే నా సంకల్పం’’. ఓ సవాల్గా తీసుకుని ముందుకెళ్లా: ఆనంద్ ‘‘ముందుగా భవనగిరి రాక్లైన్ స్కైల్లో పెద్ద రాయిని ఎక్కడానికే ఎంతో భయమేసింది. అయితే మా ట్రైనర్స్ ఇచ్చిన ధైర్యంతో దాన్ని ఎక్కగలిగా. తర్వాత పీనాక్ శిఖరాన్ని ఎక్కడంతోపాటు లడఖ్లో కఠిన శిక్షణ తీసుకున్నాం. మొదట్లో చాలా కష్టంగా అనిపించినా అన్నీ తట్టుకోగలిగాం. ఇక 20 కేజీల బరువును భుజాన వేసుకొని, మంచు రాళ్ల మధ్య ముందుకు సాగడం అంటే ఆషామాషీ కాదు. ప్రతి అడుగూ భయానకమే. వాతావరణం ఏమాత్రం సహకరించదు. ఆ సమయంలో.. ‘నేను ఎంత కష్టమొచ్చినా వెనక్కి వెళ్లను’, ‘దేనికీ భయపడను’, ‘నీవు ఎవరికీ తక్కువ కాదు’, ‘ముందుకు సాగడమే జీవితం’ అని మాకు శిక్షణలో నేర్పిన సూత్రాలు గుర్తొచ్చాయి. అవి నాపై బాగా ప్రభావం చూపించాయి. దీంతో ఎవరెస్ట్ అధిరోహణను ఓ సవాల్గా తీసుకున్నా. 7,400 మీటర్ల ఎత్తు చేరాక ఊపిరి సరిగా అందేది కాదు. అక్కడికి వచ్చేసరికే ప్రాణం పోయినంత పనైంది. చివరి క్యాంపు చేరాలంటే రాత్రిపూట లోయల మధ్య నుంచి ప్రయాణం చేయాలి. కొద్దిగా అదుపు తప్పినా కనీసం శవం కూడా దొరకదు. ఓ సమయంలో కిందపడ్డా. చాలా భయమేసింది. అయినా ధైర్యం తెచ్చుకొని, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాం. ఎవరెస్ట్ చేరాక జాతీయజెండా, తెలంగాణ జెండా ఎగురవేశాం. ఎంతో గర్వంగా అనిపించింది. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం ఉంటే పేదవారు దేనికీ తక్కువ కారని నిరూపించామనిపించింది. తిరిగి వస్తున్న సమయంలో రెండుమార్లు కిందపడ్డా. తల్లిదండ్రులు, గురువులు, దేవుడి ఆశీర్వాదాలతో క్షేమంగా వచ్చా. ఇక ఇంటర్మీడియట్ పూర్తి చేయాల్సి ఉంది. ఐపీఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. భవిష్యత్తులో అవకాశాలు వస్తే మరిన్ని శిఖరాలు ఎక్కుందుకు నేను రెడీ’’. -
పూర్ణ, ఆనంద్లకు నేపాల్లో సత్కారం
కఠ్మాండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్ను అధిరోహించిన తెలుగు తేజాలు మాలావత్ పూర్ణ(13), ఎస్. ఆనంద్ కుమార్(16)లకు ఆదివారం నేపాల్లో ఘన సత్కారం లభించింది. నేపాల్లో దళితుల హక్కుల కోసం పోరాడే జాగరణ్ మీడియా సెంటర్వారు కఠ్మాండులో ఈ ఇద్దరు టీనేజర్లనూ ఘనంగా సన్మానించారు. కాగా, నిజామాబాద్ జిల్లాకు చెందిన పూర్ణ, ఖమ్మం జిల్లాకు చెందిన ఆనంద్లు చైనా వైపు నుంచి ఇటీవల ఎవరెస్టును అధిరోహించారు. వీరిలో పూర్ణ.. ఎవరెస్టును ఎక్కిన అతిపిన్న మహిళగా కూడా కొత్త ప్రపంచ రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. -
కష్టమనిపించినా.. ఇష్టపడి చేశాం
మరికొందరిని ఎవరెస్ట్ ఎక్కిస్తాం ఎత్తయిన శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన పూర్ణ, ఆనంద్ ‘నెవర్ గివప్’.. ఇచ్చిన స్ఫూర్తే విజయానికి తోడ్పడింది ఐపీఎస్లమవుతాం..మరికొందరికి తోడ్పాటు ఇస్తామని వ్యాఖ్య తెలుగుతేజాలకు తృటిలో తప్పిన ప్రమాదం తిరుగు పయనమైన గురుకుల విద్యార్థులు ఐదు రోజుల తర్వాతే భారత భూభాగంలోకి ప్రవేశం హైదరాబాద్: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ఎంత కష్టమైనా.. ఇష్టపడి చేసి విజయం సాధించామని గురుకుల విద్యార్థులు మాలావత్ పూర్ణ, ఎస్.ఆనంద్కుమార్ చెప్పారు. తాము ఐపీఎస్ అధికారులం అయి మరికొందరు విద్యార్థులకు తామే శిక్షణ ఇచ్చి ఎవరెస్ట్ ఎక్కిస్తామని పేర్కొన్నారు. కలలో కూడా ఊహించని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యాన్ని సాధించామని.. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, కాలు కదపడం కష్టమనిపించినా ముందుకే వెళ్లామని చెప్పారు. ఎవరెస్ట్ను అధిరోహించిన అనంతరం తిరుగుప్రయాణంలో ఉన్న పూర్ణ, ఆనంద్, వారి శిక్షకుడు శేఖర్బాబు.. బుధవారం బేస్క్యాంపు నుంచి బయలుదేరిన అనంతరం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. తొలుత మాలావత్ పూర్ణ మాట్లాడుతూ... ‘‘ఎవరెస్ట్ ఎక్కడం చాలా కష్టంగా అనిపించినా.. ఇష్టంగా చేశా. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, కాలు కదపడం కష్టమనిపించినా ముందుకే వెళ్లాలనిపించింది. పైకి వెళ్లేటపుడు క్యాంప్లో తీవ్ర అస్వస్థతకు గురయ్యా. అయినా మా కోసం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసి, దాని కోసం ఎంతో కష్టపడిన ప్రవీణ్కుమార్ సార్ గుర్తుకువచ్చారు. కలలో కూడా ఊహించని అవకాశమిచ్చిన ఆయన లక్ష్యం కోసం ఏదైనా చేయాలని అనిపించి ముందుకే వెళ్లా. 8,500 మీటర్ల ఎత్తు దాటిన తరువాత కొన్ని శవాలు కనిపించాయి. అక్కడ కాస్త భయం అనిపించినా.. లక్ష్యం అధిగమించింది’’ అని పేర్కొన్నారు. ‘‘స్వేరోస్లో చదివే వారికి కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద టెన్ కమాండ్మెంట్స్ ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థీ ఉదయం కచ్చితంగా వీటిని చదువుతారు. అందులో ఆఖరుది ‘నెవర్ గివప్’. ఇది ఇచ్చిన స్ఫూర్తే కష్టమైనా వెనుతిరగక లక్ష్యాన్ని చేరుకునేలా చేసింది. అలసటగా అనిపించినప్పుడల్లా గ్లూకోజ్ తాగడం, చాకోలెట్ తినడం వంటివి చేస్తూ ముందుకెళ్లాం. ‘8,848’ పాయింట్ దగ్గర నిలుచున్నప్పుడు మా ప్రవీణ్ సారే కళ్లముందు కదలాడారు. ఆయన నమ్మకం నెరవేర్చినందుకు ఆనందంగా అనిపించింది’’ అని ఆనంద్కుమార్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా శేఖర్బాబు మాట్లాడుతూ... ప్రతి కూల పరిస్థితుల్లోనూ పూర్ణ, ఆనంద్ చూపిన చొరవ తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ‘‘ప్రతీ సూచనను, సలహాలను పక్కాగా ఆచరిస్తూ ముందుకు సాగారు. పొడి మంచు, మంచు చరియలు కూలడం వంటి ఘటనలు ఎదురైనా, కొన్ని గంటలపాటు సంప్రదింపులు సాధ్యం కాకపోయినా వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. బేస్ క్యాంప్కు చేరుకున్నాక మీ లక్ష్యాలు ఏమిటని అడిగితే.. ‘ఐపీఎస్ అధికారులం అవుతాం, మరికొందరు స్వేరోస్ విద్యార్థులకు స్వయంగా శిక్షణ ఇచ్చి ఎవరెస్ట్ ఎక్కిస్తాం..’ అన్నారు..’’ అని ఆయన పేర్కొన్నారు. తప్పిన ప్రమాదం..: భూమిమీదే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడమే కాదు.. తిరిగి కిందికి దిగడమూ అత్యంత ప్రమాదకరమే. అప్రమత్తంగా వ్యవహరించడంతో తిరుగు ప్రయాణంలో ఉన్న పూర్ణ, ఆనంద్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. పూర్ణ, ఆనంద్ 52 రోజుల సాహసయాత్రతో ఆదివారం ఉదయం 6-7 గంటల మధ్య ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అనంతరం అలసటను లెక్కచేయకుండా తిరుగు ప్రయాణం ప్రారంభించి, బేస్క్యాంపునకు చేరుకున్నారు. అయితే వీరి తర్వాత ఎవరెస్ట్ శిఖరంపైకి ఆలస్యంగా చేరుకున్న ఒక పర్వతారోహకుడు ఆలస్యంగా దిగడం మొదలుపెట్టారు. కానీ, చీకటి, పొడి మంచు కారణంగా మంగళవారం రాత్రి ఎల్లో బ్యాండ్ క్యాంప్లో ఆగిపోవాల్సి వచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి హఠాత్తుగా ముంచుకు వచ్చిన మంచు చరియలు.. ఈ క్యాంప్తో పాటు దిగువన ఉన్న మరో మూడు క్యాంపులనూ తుడిచిపెట్టేయడంతో ఆయన మరణించారు. కాగా తిరుగుప్రయాణంలో ఉన్న పూర్ణ, ఆనంద్, శేఖర్బాబు ప్రస్తుతం చైనా-నేపాల్ సరిహద్దుల్లో ఉన్నారు. వారు భారత భూభాగంలోకి అడుగుపెట్టడానికి మరో ఐదు రోజులు పట్టే అవకాశముంది. -
బేస్ క్యాంపునకు చేరుకున్న పూర్ణ, ఆనంద్
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థులు మాలావత్ పూర్ణ, ఎస్. ఆనంద్కుమార్లు తిరుగుప్రయాణంలో భాగంగా మంగళవారం సాయంత్రం బేస్క్యాంప్నకు చేరుకున్నారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఎస్డబ్ల్యూర్ఈఐఎస్) నేతృత్వంలో వీరు ఎవరెస్ట్ను అధిరోహించగా, తిరుగుప్రయాణంలో భాగంగా అడ్వాన్డ్స్ బేస్ క్యాంప్(ఏబీసీ) నుంచి ఆదివారమే తిరుగుపయనమయ్యారు. అయితే, సోమవారం అక్కడి వాతావరణం ప్రతికూలంగా మారడంతో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ కిందికి దిగుతున్నారు. ఎవరెస్ట్ శిఖరం ఆఖరి పాయింట్గా పరిగణించే 8,848 మీటర్లు (సముద్రమట్టానికి 29,029 అడుగులు) నుంచి ఈ సాహసికులు దిగుతున్నారు. అక్కడ నుంచి కిందికి వస్తూ సముద్ర మట్టానికి 8 వేల మీటర్ల ఎత్తులో ఉన్న డెత్ జోన్ (లీథల్ పాయింట్), 8,230 మీటర్లు ఎత్తులో ఉన్న క్యాంప్-6 (ఎల్లో బ్యాండ్), 7,775 మీటర్ల ఎత్తున ఉన్న క్యాంప్-5, 7,100 మీటర్ల ఎత్తున ఉన్న క్యాంప్-4 (నార్త్ కోల్) మీదుగా 6,500 మీటర్ల వద్ద ఉన్న అడ్వాన్డ్స్ బేస్ క్యాంప్ (ఏబీసీ)కు చేరుకున్నారు. -
ఈ బాలలను అబినందించాలి
-
తెలుగుతేజం పూర్ణ ప్రపంచ రికార్డు
హైదరాబాద్: తెలుగు తేజం పూర్ణ ప్రపంచ రికార్డు సాధించింది. చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా పూర్ణ చరిత్ర సృష్టించింది. తెలుగు విద్యార్థులు ఆనంద్, పూర్ణ ఈ సాహసం చేశారు. ఎవరెస్ట్ పర్వతంపై వీళ్లు జాతీయ జెండా ఎగురవేశారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఆనంద్ రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల పూర్ణ నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. 17 ఏళ్ల ఆనంద్ ఖమ్మం జిల్లా గురుకులంలో ఇంటర్ ఫస్ట్ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరూ గతేడాది నవంబర్లో డార్జిలింగ్లోని 17వేల అడుగుల ఎత్తున్న మౌంట్ రినాక్ శిఖరాన్ని ఎక్కి రికార్డు సృష్టించారు. వీరి ప్రతిభను గుర్తిం చిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ వీరికి భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్లో ప్రత్యేక తర్ఫీదునిచ్చింది. వీరికి సొసైటీకి చైర్మన్గా ఉన్న ఐపీఎస్ అధికారి ప్రవీణ్కుమార్ తనవంతు సహాయం అందించారు. మూడు నెలల తర్ఫీదు అనంతరం విద్యార్థులను ఎవరెస్ట్ అధిరోహణకు సిద్ధం చేశారు. -
ఎవరెస్టుకు చేరువలో తెలుగుతేజాలు
హైదరాబాద్: ఆ ఇద్దరు విద్యార్థుల సంకల్ప బలం ముందు ఎవరెస్టు తలవంచుతోంది. ఆ ఇద్దరు మారుమూల గ్రామాల విద్యార్థులు వయసుకు మించిన సాహసయాత్రకు నడుం బిగించారు. సాంఘిక సంక్షేమశాఖ సహకారంతో భారత జెండాను ప్రపంచంలోనే ఎత్తై ఎవరెస్టు శిఖరాగ్రంపై ఎగురవేయబోతున్నా రు. అన్నీ సవ్యంగా సాగితే ఆదివారం ఉద యం 8కల్లా మువ్వన్నెల జెండాను ఎవరెస్టుపై రెపరెపలాడించేందుకు సన్నద్ధమవుతున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు వీరి యాత్ర అత్యంత ప్రమాదకరమైన డెత్జోన్లో సాగుతుందని యాత్రను పర్యవేక్షిస్తున్న ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ శనివారం ‘న్యూస్లైన్’కు తెలిపారు. ప్రస్తుతం వీరు బేస్ క్యాంప్కు 27,390 అడుగుల ఎత్తులో ప్రయాణం సాగిస్తున్నారన్నారు. మరో రెండువేల అడుగులు సాహసయాత్రను పూర్తిచేస్తే.. ఆదివారం ఉదయం 8 గంటల్లోపే లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. సాహసయాత్రకు చేయూత.. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ, ఫ్రాన్స్ అడ్వెంచర్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ విద్యార్థులు సాహసయాత్రకు బయలుదేరారు. నిజామాబాద్ జిల్లా తాడ్వాయికి చెందిన లక్ష్మి, దేవదాస్ వ్యవసాయ కూలీలు. వారి కుమార్తె మాలావత్ పూర్ణ స్వేరోస్(14) ప్రస్తుతం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ 9వ తరగతి చదువుతోంది. ఖమ్మం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన లక్ష్మి, కొండలరావు దంపతుల కుమారుడు ఆనంద్కుమార్(17) అన్నపురెడ్డిపల్లి ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్లో ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఇద్దరు విద్యార్థులు ప్రముఖ పర్వతారోహకుడు, అర్జున అవార్డు గ్రహీత శేఖర్బాబు నేతత్వంలో ఈ సాహసయాత్ర చేస్తున్నారు. వీరితో పాటు వివిధ దేశాలకు చెందిన 30 మంది ఈ సాహసయాత్ర చేస్తున్నారు. వీరు ఎవరెస్టు శిఖరం అధిరోహిస్తే పూర్ణ స్వేరోస్ అత్యంత పిన్నవయస్సులో ఎవరెస్టు అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.