Rajeev Kumar
-
వివాదాల నడుమ ‘రాజీవ్’కు వీడ్కోలు
న్యూఢిల్లీ: దేశ ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)గా పదవీ విరమణ చేసిన రాజీవ్కుమార్ తన హయంలో కొంత మేర వివాదాస్పదమయ్యారు. లోక్సభ ఎన్నికలతో సహా పలు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజీవ్కుమార్ పక్షపాత ధోరణితో వ్యవహరించారన్న విమర్శలొచ్చాయి. ముఖ్యంగా కీలక ఎన్నికల సమయాల్లో అధికార బీజేపీకి మేలు జరిగేలా వ్యవహిరించారని ప్రతిపక్షాలు పలు సందర్భాల్లో ఆయనపై ఆరోపణలు చేశాయి.దీంతో రాజీవ్కుమార్ హయంలో ఎన్నికల కమిషన్(ఈసీ) స్వయం ప్రతిపత్తిపై అనుమానాలు తలెత్తాయి.ఔఎన్నికలప్పుడు పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికల హింసను అదుపు చేయడంలో విఫలమయ్యారన్న అపఖ్యాతిని రాజీవ్కుమార్ మూటకట్టుకున్నారనేది పలువురి వాదన. ముఖ్యంగా ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై చర్చ జరుగుతున్న వేళ రాజీవ్కుమార్ ఈవీఎంలు,వీవీప్యాట్లను మీడియా ఎదుటే ఏకపక్షంగా సమర్థించడం ప్రతిపక్షాల ఆగ్రహానికి కారణమైంది.రాజీవ్కుమార్ హయాంలో పలువురు ఎన్నికైన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడ్డ టైమింగ్ వివాదాస్పదమైంది. సీఈసీగా వీడ్కోలు వేళ రాజీవ్కుమార్ కామెంట్లు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల కమిషన్ చుట్టూ అలుముకున్న వివాదాలపై మీడియా దృష్టి ఎక్కువైందని, ఇలాంటి తరుణంలో ఎన్నికల కమిషన్ తన హుందాతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాజీవ్కుమార్ అనడం చర్చకు దారి తీసింది.మొత్తంగా ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్కుమార్ హాయంలో ఎన్నికల కమిషన్తో పాటు ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. సాధారణ ప్రక్రియలో భాగంగా రాజీవ్కుమార్ రిటైర్ అయి వెళ్లిపోయినప్పటికీ దేశంలో ఎన్నికల కమిషన్,ఎన్నికల నిర్వహణపై తలెత్తిన అనుమానాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. -
ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ఈసీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు ఒకే దశలో నవంబర్ 20న, జార్ఖండ్కు రెండు విడతల్లో నవంబర్ 13న, 20న పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎగ్జిట్ పోల్స్, ఈవీఎంల ట్యాంపరింగ్పై కీలక వ్యాఖ్యలు చేశారుఎగ్జిట్స్ పోల్స్తో తమకు ఎలాంటి సంబంధం ఉండదని, వాటికి ఎలాంటి శాస్త్రీయత లేనప్పటికీ భారీ అంచనాలనే సృష్టిస్తాయని చెప్పారు. ఇందువల్ల ప్రజల్లో గంగరగోళం ఏర్పడుతోందని, ఈ విషయంలో మీడియా సహా భాగస్వామ్య పక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సి అవసరం ఉందని, స్వీయ నియంత్రణ అవసరమని అన్నారు.అయితే ఈ ఎగ్జిట్ పోల్స్కు శాంపిల్ సైజ్ ఏంటి.,? సర్వేలు ఎక్కడ జరిగాయి. అంచనాలకు అనుగుణంగా ఫలితాలు రాకుంటే మన బాధ్యత ఎంతవరకు? అనే విషయంలో ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన ఫలితాలు.. తుది ఫలితాలకు మధ్య ఉండే తేడా.. పార్టీలకు, అభ్యర్థులకు, చివరకు ప్రజల్లో కూడా తీవ్ర నిరాశకు దారితీస్తోందని రాజీవ్ కుమార్ వెల్లడించారు.చదవండి:మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు.. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇవ్వగా.. తుది ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా బీజేపీకి పట్టం కట్టిన నేపథ్యంలో ఎగ్జిట్పోల్స్ గురించి ఎన్నికల కమిషనర్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇక హర్యానా ఎన్నికల ఫలితాల సందర్భంగా ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపైనా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.. స్పష్టతనిచ్చారు. మూడంచెల భద్రత నడుమ ఈవీఎంలు ఉంటాయని,ఆరు నెలల ముందే ఈవీఎంలను పరిశీలించి ఎన్నికల నిర్వహణలో ఉపయోగిస్తామని తెలిపారు. నచ్చని ఫలితాలు వచ్చినప్పుడే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని పేర్కొన్నారు.ఈవీఎంలపై వచ్చిన 20 ఫిర్యాదులకు వాస్తవాలతో కూడిన వివరణ ఇస్తామని స్పష్టం చేశారు. ఇక ఓట్ల లెక్కింపు మొదలైన అరగంటలోపే మీడియాల్లో.. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు చేయడాన్ని ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ ప్రశ్నించారు. అంత తొందర్లోనే ఫలితాల గురించి ఒక అంచనాకు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఉదయం 9:30 గంటల కంటే ముందు ఇచ్చే ఫలితాలు అంతా బోగస్ అని కొట్టిపారేశారు. -
Election Commission of India: మోగింది ఎన్నికల భేరీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో దశాబ్ద కాలం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆర్టీకల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం తొలిసారిగా ఎన్నికల సందడి ప్రారంభం కాబోతోంది. జమ్మూకశ్మీర్తోపాటు హరియాణా శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. 90 స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడు దశల్లో, 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీకి ఒక దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. జమ్మూకశ్మీర్లో సెపె్టంబర్ 18, సెపె్టంబర్ 25, అక్టోబర్ 1న, హరియాణాలో అక్టోబర్ 1న ఎన్నికలు జరుగుతాయని, రెండు రాష్ట్రాల్లో అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలియజేశారు. జమ్మూకశ్మీర్లో మొదటి దశలో 24 సీట్లకు, రెండో దశలో 26 సీట్లకు, మూడో దశలో 40 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ చివరిసారిగా 2014 నవంబర్–డిసెంబర్లో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలను సాధారణంగా ఐదు దశల్లో నిర్వహిస్తుంటారు. ఇటీవల లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. దీనిపై విమర్శలు వచ్చాయి. అందుకే జమ్మూకశ్మీర్లో తక్కువ సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఇచి్చన హామీని నిలబెట్టుకుంటున్నామని రాజీవ్ కుమార్ చెప్పారు. ఈసారి కేవలం మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేయబోతున్నామని తెలిపారు. జమ్మూకశ్మీర్లో భద్రతా అవసరాల వల్లే.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తామని రాజీవ్ కుమార్ చెప్పారు. జమ్మూకశ్మీర్లో భద్రతా అవసరాలను దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ను వాయిదా వేసినట్లు వివరించారు. 2019లో హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దాదాపు ఒకే సమయంలో జరిగాయి. ఈ ఏడాది, వచ్చే ఏడాది ఆరంభంలో మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ శాసనసభ ఎన్నికలు సైతం జరగాల్సి ఉందని, వీటిలో రెండు రాష్ట్రాలకు కలిపి ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్, హరియాణాలో పోలింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన రాష్ట్రాల షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. మీడియా సమావేశంలో రాజీవ్ కుమార్తోపాటు ఎన్నికల సంఘం కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూ పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్లో ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆర్టీకల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమరి్థంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెపె్టంబర్ 30వ తేదీలోగా జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.ముగ్గురు జెంటిల్మెన్ మళ్లీ వచ్చేశారు ముగ్గురు పెద్దమనుషులు(జెంటిల్మెన్) మళ్లీ వచ్చేశారని మీడియా సమావేశంలో సీఈసీ రాజీవ్ కుమార్ చమత్కరించారు. తన సహచర కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూను విలేకరులకు పరిచయం చేశారు. లోక్సభ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో ‘లాపతా జెంటిల్మెన్’ అంటూ ట్రోలింగ్ నడిచింది. ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యులు కనిపించకుండాపోయారని, లోక్సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, రాజకీయ నాయకులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. జూన్ 3న విలేకరుల సమావేశంలో రాజీవ్ కుమార్ మాట్లాడుతూ... లాపతా జెంటిల్మన్లు త్వరలో తిరిగివస్తారని చెప్పారు. తాము ఎక్కడికీ వెళ్లలేదని, ఇక్కడే ఉంటున్నామని పేర్కొన్నారు. -
అందుకే మహారాష్ట్రకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు: సీఈసీ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు అనంతరం మరోసారి దేశంలో ఎన్నికల నగరా మోగింది. జమ్ముకశ్మీర్తోపాటు, హర్యానా రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే ఆ రెండు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, జార్ఖండ్కు సైతం అసెంబ్లీ ఎన్నికల తేదీలను నేడు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతానికి వీటి షెడ్యూల్ గురించి సీఈసీ రాజీవ్ కుమార్ ఎలాంటి ప్రకటన చేయలేదు.అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తామని మాత్రం రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఇందుకు గల కారణాలను కూడా ఆయన వివరించారు. జమ్ముకశ్మీర్లో భద్రతా అవసరాల దష్ట్యా మహారాష్ట్ర ఎన్నికలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. అంతేగాక.. మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండటంతో ఓటరు జాబితాను అప్డేట్ చేయడంలో ఆలస్యం అయ్యిందని, ఇది ఎన్నికల నిర్వహణకు కీలకమైనదిగా ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం పితృ పక్షం, దీపావళి, గణేష్ చతుర్థి వంటి ముఖ్యమైన పండుగుల, కార్యక్రమాలు జరగాల్సి ఉందని, ఇవన్నీ కారణాలతో ఎన్నికలను వాయిదా వేయవలసి వచ్చిందన్నారు.చివరిసారి హర్యానాకు, మహారాష్ట్రకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు జమ్ముకి ఎన్నికలు లేవు. కానీ ఈసారి వరుసగా అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి(జమ్మూ కశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ). ఎన్నికలకు సిబ్బంది అవసరాన్ని బట్టి రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం.రాష్ట్రాల శాసనసభ పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందు వరకు ఎన్నికలను షెడ్యూల్ విడుదల చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఈ క్రమంలో ఎన్నికలకు అవసరమైన అన్ని సన్నాహాలు సమర్థవంతంగా పూర్తయిన తర్వాత మహారాష్ట్రలో ఎన్నికలు నిర్వహిస్తాం’ అని చెప్పారు. -
తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు జరపండి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీలు ప్రధానంగా డిమాండ్ చేశాయి. గురువారం శ్రీనగర్లో ఎన్నికల కమిషన్ ఇక్కడి రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సారథ్యంలోని బృందం షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ)లో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ(పీడీపీ), బీజేపీ, కాంగ్రెస్, జమ్మూకశ్మీర్ పాంథర్స్ పార్టీ(జేకేపీపీ) తదితర పార్టీల ప్రతినిధులతో సమావేశమైంది. సీఈసీతోపాటు కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, ఎస్ఎస్ సంధుల బృందం ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఈసీ అధికారులు మీడియాతో మాట్లాడారు. కేంద్ర పాలితప్రాంతమైన జమ్మూకశ్మీర్లో తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు జరపాలన్న డిమాండ్ను ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు వినిపించాయని వెల్లడించారు. జమ్మూకశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు నిష్పాక్షికంగా, పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించాలని కూడా పార్టీల ప్రతినిధులు కోరారన్నారు. అనంతరం ఈసీ బృందం ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లతోపాటు చీఫ్ సెక్రటరీ, పోలీస్ డైరెక్టర్ జనరల్తో సమీక్ష సమావేశం జరిపింది. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై వారితో చర్చించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30వ తేదీలోగా కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. -
రాష్ట్రపతి ముర్ముతో ఈసీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లతో కలిసి గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో సీఈసీ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్లు రాష్ట్రపతి ముర్మును కలిశారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 73ను అనుసరించి సార్వత్రిక ఎన్నికల్లో 18వ లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యుల వివరాలతో కూడిన ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రతిని ఆమెకు అందజేశారని వివరించింది. -
#ElectionsResults: సెకనుకు 2లక్షల మంది వీక్షణ
న్యూఢిల్లీ, సాక్షి: లోక్సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ లెక్కింపులో పారదర్శకత పాటిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకోసం అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లను అనుమతించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపింది. ఓట్ల లెక్కింపుపై మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడారు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్. ఈ సందర్భంగా.. ఈసీ వెబ్సైట్ను సెకనుకు 2లక్షల మంది చూస్తున్నారని తెలిపారాయన. అలాగే.. కౌంటింగ్ను ఈసీ బృందాలు వర్చువల్గా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. -
EC: ఓటర్లకు వందనం
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో మొత్తంగా 64.2 కోట్ల మంది భారతీయ పౌరులు ఓటు హక్కును వినియోగించుకుని నూతన ప్రపంచ రికార్డును సృష్టించారని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ ప్రకటించారు. దేశ చరిత్రలో తొలిసారి ఓట్ల లెక్కింపునకు ముందు తోటి కమిషనర్లతో సహా సీఈసీ సోమవారం ఢిల్లీలో పత్రికాసమావేశం ఏర్పాటుచేసి పలు అంశాలపై మాట్లాడారు. జీ7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ ‘‘ 31.2 కోట్ల మంది మహిళలుసహా 64.2 కోట్ల మంది ఓటేశారు. ఈ సంఖ్య జీ7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ. 27 యురోపియన్యూనియన్ దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ. ఈ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లందరికీ అభినందనలు’’ అంటూ సీఈసీ వేదికపై లేచి నిలబడి ఓటర్లకు అభినందనలు తెలిపారు. ‘‘ఎన్నికల సిబ్బంది జాగ్రత్త, అప్రమత్తత వల్లే తక్కువ చోట్ల మాత్రమే రీపోలింగ్ చేపట్టాల్సి వచి్చంది. 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరిగితే ఈసారి 39 మాత్రమే జరిగాయి’’ అని పేర్కొన్నారు. మా గురించి మాట్లాడుకోరు ‘ 1.5 కోట్ల పోలింగ్, భద్రతా సిబ్బంది పోలింగ్ పర్వంలో పాల్గొన్నారు. 4 లక్షల వాహనాలను వినియోగించాం. 135 ప్రత్యేక రైళ్లలో సిబ్బంది, బలగాలను తరలించాం. 1,692 సార్లు హెలికాప్టర్లను వాడాం. కరెన్సీ కట్టలు, ఉచిత తాయిలాలుగా పంపిణీచేస్తున్న వస్తువులు, మద్యం, మత్తుపదార్థాలు సహా రూ.10,000 కోట్లు సీజ్చేశాం. ఇంత చేస్తే ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూల జాడ లేదంటూ ‘లాపతా జెంటిల్మెన్’ అని మీమ్స్ వేస్తున్నారు. మేం ఎక్కడికీ పోలేదు. మీ ముందే ఉన్నాంకదా. ఎప్పుడూలేనంతగా ఎన్నికలవేళ 100 పత్రికా ప్రకటనలు, అడ్వైజరీలతో అందర్నీ చైతన్యపరిచాం. మమ్మల్ని చూశాకైనా ‘లా పతా జెంటిల్మెన్ ఆర్ బ్యాక్’ అని మీమ్స్ మారుస్తారేమో. విరబూసిన పువ్వులనే చూస్తారుగానీ తోటమాలిని ఎవరూ పట్టించుకోరు. ప్రజాస్వామ్యంలో గెలుపుఓటములనే అందరూ పట్టించుకుంటారుగానీ సమర్థవంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించిన మా గురించి ఎవరూ మాట్లాడుకోరు’’ అని అన్నారు. దమ్ముంటే నిరూపించండి ‘‘ ఎన్నికలను విదేశీ శక్తులు ప్రభావితం చేసే ప్రమాదముందని, వాటిని అడ్డుకునేందుకు మేం ఎప్పుడో సిద్ధమయ్యాం. తీరాచూస్తే ఇక్కడి విపక్షాలే అనవసర ఆరోపణలు చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రభావితం చేయనున్నారని రిటర్నింగ్ అధికారులపై విపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి. దమ్ముంటే మీ ఆరోపణలను సాక్ష్యాధారాలతో నిరూపించండి. పుకార్లు వ్యాపించజేసి అనుమాన మేఘాలు కమ్ముకునేలా చేయకండి. రిటరి్నంగ్ అధికారులుగా పనిచేసే జిల్లా మేజి్రస్టేట్, కలెక్టర్లపై మీరు చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే కౌంటింగ్కు ముందే వారిపై కఠిన చర్యలకు మేం సిద్ధం’ అని అన్నారు. ఎన్నికల తర్వాత హింసనూ అడ్డుకుంటాం ‘‘ ఎన్నికల కోడ్ ముగిసినా సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు కొనసాగుతాయి. ఫలితాలు వచ్చాక ఎన్నికల తర్వాత హింసను అడ్డుకునే లక్ష్యంగా తొలిసారిగా ఈ పద్ధతిని అమలుచేస్తున్నాం. ఎన్నికల వేళ ఘర్షణ ఘటనలు చోటుచేసుకున్న పశి్చమబెంగాల్, మణిపూర్, ఆంధ్రప్రదేశ్సహా పలు రాష్ట్రాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మొహరిస్తాం. రాష్ట్రాలు, కేంద్ర పరిశీలకుల సూచనలు, సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏపీ, బెంగాల్లలో ఓట్ల లెక్కింపు తర్వాత 15 రోజులపాటు, యూపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్లో రెండు రోజులపాటు బలగాలు కొనసాగుతాయి’’ అని సీఈసీ వివరించారు. జమ్మూకశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలకు సంబంధించి జమ్మూకశీ్మర్లో నాలుగు దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా గరిష్టంగా 58.58 శాతం పోలింగ్ నమోదైంది. కశీ్మర్ లోయలో గరిష్టంగా 51.05 శాతం రికార్డయింది. సెపె్టంబర్ 30లోపు జమ్మూకశీ్మర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. అందుకే అక్కడ త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు తలకెత్తుకుంటాం. ఇవి నిజంగా అత్యంత సంతృప్తికరమైన క్షణాలు అని అన్నారు. -
Bhupesh Baghel: పోలింగ్ తర్వాత ఈవీఎంలను మార్చేశారు
న్యూఢిల్లీ: పోలింగ్ ప్రక్రియ ముగిసి ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధమైనా ఎన్నికల సంఘంపై, ఈవీఎంల పనితీరుపై విపక్షాల ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగెల్ సోమవారం రాత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పోటీ చేసిన రాజ్నంద్గావ్ లోక్సభ స్థానంలో పోలింగ్ ముగిశాక పలుచోట్ల ఏకంగా ఈవీఎంలనే మార్చేశారని పేర్కొన్నారు! ‘‘పలు బూత్ల్లో ఈవీఎం బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల సీరియల్ నంబర్లు పోలింగ్ తర్వాత మారిపోయాయి. ఫామ్ 17సీలో పొందుపరిచిన సమాచారమే ఇందుకు రుజువు. దీనివల్ల వేలాది ఓట్లు ప్రభావితమవుతాయి’’ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇందుకు సాక్ష్యాలంటూ ఈవీఎంల తాలూకు తొలి నంబర్లు, మారిన నంబర్లతో కూడిన వివరాలను పోస్ట్ చేశారు. ‘‘ఇలా మార్చిన ఈవీఎం నంబర్ల తాలూకు జాబితా చాలా పెద్దది. అందరికీ తెలియాలని చిన్న జాబితా మాత్రమే పోస్ట్ చేస్తున్నా’’ అని తెలిపారు. ‘‘ఇది చాలా సీరియస్ అంశం. ఇలా నంబర్లను ఎందుకు మార్చాల్సి వచి్చంది?’’ అని ఈసీని ఉద్దేశించి భగెల్ ప్రశ్నించారు. చాలా లోక్సభ స్థానాల నుంచి ఇలాంటి ఫిర్యాదులే వస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేస్తున్నాం. నంబర్లను ఏ పరిస్థితుల్లో మార్చాల్సి వచి్చందో ఈసీ బదులివ్వాల్సిందే. దీనివల్ల ఆయా స్థానాల్లో ఎన్నికల ఫలితంపై ప్రభావం పడితే అందుకు ఎవరిది బాధ్యత?’’ అంటూ మండిపడ్డారు. పోలింగ్ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా 150 జిల్లాల కలెక్టర్లకు నేరుగా ఫోన్ చేసి బెదిరింపులకు దిగారంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆదివారం ఆరోపించడం తెలిసిందే. పుకార్లు వ్యాప్తి చేయొద్దని, రుజువులుంటే ఇవ్వాలని సీఈసీ రాజీవ్కుమార్ స్పందించారు. -
దేశవ్యాప్తంగా కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశాం
-
‘సడలింపు’ని సరిదిద్దండి
సాక్షి, అమరావతి: పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనలను ఏపీలో సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్కుమార్ మీనా ఈనెల 25న జారీచేసిన ఉత్తర్వులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన నిబంధనలకు విరుద్ధమని గుర్తుచేసింది. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఓట్ల తిరస్కరణకు కారణమవుతుందని.. పైగా తీవ్ర వివాదాలకు సైతం దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్కు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఎస్. నిరంజన్రెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్ మీనా నిబంధనలను సడలిస్తూ జారీచేసిన ఉత్తర్వులను తక్షణం సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.దేశవ్యాప్తంగా ఒకలా.. రాష్ట్రంలో మరోలా..నిజానికి.. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి, స్టాంప్ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ.. రాష్ట్రంలో టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఈ మార్గదర్శకాలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్ మీనా ఈనెల 25న ఉత్తర్వులు జారీచేశారు. నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి (ఆర్వో) నిర్దేశించిన అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు (స్పెసిమెన్) సేకరించి.. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఆర్వోలకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు.. డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే.. ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో), జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ అధికారి సంతకం (స్పెసిమెన్)తో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్ను పరిగణనలోకి తీసుకునేలా సడలింపు ఇచ్చారు. గోప్యతకు.. శాంతిభద్రతలకు విఘాతం..ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో స్పెసిమెన్ సంతకంపై రాజకీయ పక్షాల ఏజెంట్ల మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. ఇది చినికిచినికి పెను వివాదంగా మారి శాంతిభద్రతల సమస్యగా పరిణమించే ప్రమాదం ఉంది. ఈ నిబంధనలవల్ల ఓటు గోప్యత ఉండదని రాజకీయ పక్షాలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో టీడీపీ నేతలు విజ్ఞప్తి చేయగానే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా ఉత్తర్వులు జారీచేయడంపై నివ్వెరపోతున్నారు.నిబంధనల సడలింపుపై న్యాయపోరాటం..ఇదిలా ఉంటే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్ మీనా జారీచేసిన ఉత్తర్వులపై దుమారం రేగుతోంది. వాటిని సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సముచిత నిర్ణయం తీసుకోని పక్షంలో.. మీనా సడలింపు ఉత్తర్వులపై న్యాయపోరాటం చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. -
ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలి: రాజీవ్కుమార్
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని.. ఇందుకు అవసరమైన పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాల సీఈవోలు, ఎన్నికల అధికారులకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ ఆదేశించారు. ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈవోలు, ఆయా నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లాల ఎన్నికల అధికారులతో సోమవారం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సందుతో కలసి రాజీవ్కుమార్ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరి సమిష్టి కృషితో దేశవ్యాప్తంగా ఎన్నికలు విజయవంతంగా జరుగుతున్నాయని అభినందించారు. అదే స్ఫూర్తితో వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజున ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పాస్లు లేకుండా ఎవరినీ అనుమతించవద్దని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ పరికరాలను, అంబులెన్సులను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఫలితాల ప్రకటనలో ఆలస్యం చేయొద్దు.. ఈవీఎంలలో పోల్ అయిన ఓట్ల లెక్కింపు గురించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇవ్వాలని రాజీవ్కుమార్ ఆదేశించారు. సుశిక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు వంటి పరికరాలను కౌంటింగ్ కేంద్రాల్లో సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలను ఎడాపెడా పడేయకుండా.. ఒక క్రమ పద్ధతిలో తీసుకురావాలని స్పష్టం చేశారు. ఒక ఈవీఎం లెక్కింపు పూర్తయిన తర్వాతే మరో ఈవీఎం తీసుకోవాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత.. ‘లెక్కింపు పూర్తి అయినట్లుగా’ ఆయా ఈవీఎంలపై మార్క్ చేయాలని ఆదేశించారు. ఆ వెంటనే సీల్ చేసి ఒక క్రమపద్ధతిలో సురక్షితంగా భద్రపరచాలని ఆదేశించారు. అనవసరంగా ఈవీఎంలను అటూ, ఇటూ కదిలించవద్దని సూచించారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను చక్కగా నిర్వహించాలని, వాటి లెక్కింపు కోసం ప్రత్యేకంగా టేబుళ్లు, స్కానర్లు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయొద్దని.. డిస్ప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా, అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, హరేంధిర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘సీఈసీ’ రాజీవ్కుమార్కు జెడ్ కేటగిరీ భద్రత.. కారణమిదే..
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది. ఎన్నికల వేళ ఆయనకు సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఆధారంగానే భద్రత పెంచినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జెడ్ సెక్యూరిటీ భద్రతలో భాగంగా రాజీవ్ కుమార్ (సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్) సీఆర్పీఎఫ్ కమాండోల రక్షణలో 24 గంటలు ఉండనున్నారు. 40నుంచి45 మంది సీఆర్పీఎఫ్ కమాండోలు ఎల్లప్పడూ ఆయనకు భద్రత కల్పిస్తారని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి.. మా అబ్బాయి ఓడిపోవాలి.. మాజీ కేంద్ర మంత్రి -
ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం
సాక్షి, అమరావతి: ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుత, హింసారహిత ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఇందుకోసం గట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు, కేంద్ర ఏజెన్సీ అధికారులను ఆదేశించింది. ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాలు ఉండాలని సూచించింది. ఎన్నికల తనిఖీల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని పార్టీలకు వివిధ అంశాల్లో సమాన అవకాశాలు ఇవ్వాలని సూచించింది. సాధారణ ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్, కమిషనర్లు జ్ఞానేష్కుమార్, సుఖ్బీర్సింగ్ సంధు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు, కేంద్ర ఏజెన్సీ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్సభతో పాటు వివిధ రాష్ట్రాల శాసనసభలకు జరగనున్న ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైనవారందరూ సమన్వయంతో చర్యలు తీసుకోవడంపై దిశానిర్దేశం చేశారు. మద్యం, నగదు, మత్తుపదార్థాలు, ఆయుధాల అక్రమ రవాణా, తాయిలాల పంపిణీపై కఠినమైన నిఘా ఉంచాలని ఆదేశించారు. భద్రతా దళాల తరలింపు, సున్నిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రాల సరిహద్దుల్లో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలిచ్చారు. పోలింగ్ రోజున అంతర్రాష్ట్ర సరిహద్దుల్ని మూసేయాలని సూచించారు. నేరస్తులు, సంఘవిద్రోహ శక్తులపై నిఘా ఉంచాలని చెప్పారు. లైసెన్స్డ్ ఆయుధాలను సకాలంలో డిపాజిట్ చేయించుకోవాలని, నాన్బెయిలబుల్ వారెంట్లను వెంటనే అమలు చేయాలని సూచించారు. ముప్పు ఎదుర్కొంటున్న నేతలు, అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని నిర్దేశించారు. వ్యయ పర్యవేక్షణ కట్టుదిట్టంగా ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ మాట్లాడుతూ ఎక్కడా రీ పోలింగ్కు అవకాశం లేని విధంగా ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పోలింగ్కు 48 గంటల ముందు (సైలెంట్ పీరియడ్) ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం వంటి తాయిలాల పంపిణీకి ప్రయత్నాలు జరుగుతాయని, వాటిని సమర్థంగా అడ్డుకోవాలని చెప్పారు. కట్టుదిట్టంగా కోడ్ అమలు: సీఎస్ జవహర్రెడ్డి ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు రూ.258 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర విలువైన వస్తువులను స్వా«దీనం చేసుకున్నట్టు వివరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో 150 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 132 ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు, 632 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. పటిష్ట భద్రత: డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ల నుంచి మావోయిస్టుల సమస్య ఉండే 91 పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల మహారాష్ట్రకు పంపిన 10 కంపెనీల పోలీసు బలగాలను తిప్పి పంపడమేగాక అదనపు బలగాలను పంపాలని ఆయన కోరారు. ఏపీసీఈవో ముఖేశ్కుమార్ మీనా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్కుమార్ప్రసాద్, రజత్భార్గవ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్కుమార్ గుప్త, అదనపు డీజీపీ బాగ్చి, పన్నుల చీఫ్ కమిషనర్ గిరిజాశంకర్, ఎక్సైజ్ కమిషనర్ వివేక్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
రూల్బుక్ను మార్చి రాయాలా?!
ఎన్ ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కనివిని ఎరుగని విధంగా చేపడుతున్న చట్టపరమైన చర్యల పరంపరపై రచ్చ నడుస్తోంది. ఈ చర్యలు ఏమైనా ‘ఆరోగ్యకర మైన ప్రజాస్వామ్య పద్ధతి’ ఉల్లంఘనకు దారితీస్తున్నాయా అనే విషయాన్ని ఎన్నికల సంఘం నిర్ధారించవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజాస్వామ్య ప్రక్రియల సమగ్రతను, నైతికతను కాపాడుకోవటానికి ‘అందరికీ సమానావకాశాలు’ (ఎల్.పి.ఎఫ్.) అనే భావన కీలకం అవుతోంది. అలాంటి ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఎల్.పి.ఎఫ్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ – ఎం.సి.సి.) అమలుపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించి వివిధ అంశాలను విశ్లేషించడం అవసరమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలను ప్రకటించిన రోజున భారత ఎన్నికల సంఘం, మీడియాకు వివరాలు అందిస్తూ తెలిపిన మంచి అంశాలలో ఒకటి ఏమిటంటే, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్... ఆటలో అందరికీ సమానావకాశాలు (ఎల్పీఎఫ్)కి ఈసీ ఇస్తున్న ప్రాధాన్యం. అన్ని రాజకీయ పార్టీలకూ ప్రవర్తనా నియమావళిని ఈసీ పంపిందనీ, దానిని ఆ యా పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్ల దృష్టికి తీసుకెళ్లాలనీ అభ్యర్థించినట్లు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ తెలిపారు. ఎల్పీఎఫ్కు భంగం కలిగించే చర్యలకు సంబంధించిన ఫిర్యాదులపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. ఎల్పీఎఫ్ అనేది క్రీడలు లేదా యుద్ధాల విషయంలో వర్తించని వ్యక్తీకరణ. సమవుజ్జీలైన రెండు జట్లు మాత్రమే ఒకదానితో ఒకటి ఆడాలి అనేది ఉండదు. క్రికెట్లో, స్వదేశీ జట్లు పిచ్ను తమకు అను కూలంగా మార్చుకుంటాయి, అయితే ఈ ‘అన్యాయమైన అభ్యాసం’ మన్నించబడింది ఎందుకంటే పాల్గొనే జట్లు తమ వంతు కోసం ఎదురు చూస్తుంటాయి. అదేవిధంగా, ఒక శక్తిమంతమైన సైన్యం పోరాటంలో ఒక చిన్న ప్రతిపక్షాన్ని దెబ్బతీస్తే దాన్ని అన్యాయంగా పరిగణించరు. ప్రేమలో, యుద్ధంలో అంతా న్యాయమైనదే అంటారు. ఎల్పీఎఫ్ అనేది స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలకు ఒక పవిత్రమైన సూత్రం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి యుద్ధం లేదా ప్రేమ పోటీ కానే కాదు. వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఒకరితో ఒకరు పోటీపడి ప్రతినిధుల సభలో ప్రాతినిధ్యం వహించడానికి ఓటర్ల ఆదేశాన్ని పొందడం ప్రజాస్వామ్యంలో కీలకమైన సంఘటన. ఓటు అనేది విశ్వాసంపై, వాస్తవాలపై ఆధారపడిన సామాజిక ఒప్పందం. ఈ పోటీ నిష్పక్షపాతంగా ఉండాలంటే, పోటీదారులు సమానంగా ఉండకపోవచ్చని అంగీకరించినప్పటికీ, ఎన్నికల సమయంలో ఎల్పీఎఫ్ లభ్యత ఒక తప్పనిసరి షరతుగా పరిగణించబడుతుంది. స్వాభావిక అసమానతను ఆటలో భాగంగా గుర్తిస్తే, ఎన్నికల సమ యంలో వారు ఓటర్లను తమకు అనుకూలంగా ప్రభావితం చేయడా నికి ప్రయత్నించినప్పుడు ఎల్పీఎఫ్ ఉండేలా చూసుకోవడమనేది ప్రక్రియ నియంత్రణాధికారి బాధ్యత. ఎల్పీఎఫ్కి చెందిన ఈ సూత్రాన్ని నిశితంగా పరిశీలిస్తే, ప్రతిపక్ష అభ్యర్థులతో పోలిస్తే అధికార పక్షం పొందే ప్రయోజనానికి ‘సమం చేయడం’ నిర్దిష్టమైనదని చూపిస్తుంది. క్రీడలలో బలహీనమైన జట్టు బలమైన వారితో పోటీపడవచ్చు. వాస్తవానికి, టెన్నిస్ వంటి ఆటలలో పోటీ ప్రారంభ రౌండ్లలో, బలహీనమైన అన్ సీడెడ్ ఆటగాళ్లు ర్యాంకింగ్ పట్టికలను శాసించే ఆటగాళ్లతో తలపడతారు. అత్యున్న తమైన నైపుణ్యాలు, పరాక్రమాలు కలిగిన వారి చేతుల్లో ఓడిపోయి నప్పుడు కన్నీళ్లు కూడా రావు. ఎందుకంటే క్రీడలు తాము ప్రజాస్వా మికమని చెప్పుకోలేవు. అయితే నిజమైన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు మాత్రం అందుకు భిన్నమైన ఆట అనే చెప్పాలి. సాధారణ సమయాల్లో సాధారణ పౌర ప్రవర్తనను నియంత్రించడానికి సాధారణ చట్టాలు ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీల వారు, అభ్యర్థులు ఎన్నికల సమయంలో ఒక నిర్దిష్ట వైఖరిని పాటించాలని భావిస్తున్నారు, దీనిని వారు ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలోనే స్వచ్ఛందంగా అంగీకరించారు. అయితే సూచించిన నిబంధనలన్నీ నిర్దిష్టంగా చట్టంలో లేవు. కొన్నిసార్లు ఇది మంచి ప్రజా ప్రవర్తన పట్ల వారి నిబద్ధతకు గుర్తు. ఈసీ పాటించే సమతూకం విధానానికి చెందిన ప్రదర్శన. ఎన్నికల సమయంలో ఈసీ అమలు చేయాలని భావిస్తున్న ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్)కి ఆవిర్భావం ఇది. ఎంసీసీని పరిశీలిస్తే కోడ్ పరిధిలో నలుగురు ప్రధాన ఆటగాళ్లు ఉన్నారని అర్థమవుతుంది. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, అధికార పార్టీ, బ్యూరోక్రసీ. చివరి రెండూ పాలక వ్యవస్థలో భాగమే కానీ వాటికి కూడా విడిగా కోడ్ వర్తిస్తుంది. కోడ్లో ఎక్కువ భాగం ఇప్పటికే ఉన్న విభేదాలను తీవ్రతరం చేయడం, లేదా పరస్పర ద్వేషాన్ని పాదుకొల్పటం, లేదా వివిధ కులాలు, వర్గాల మధ్య ఉద్రిక్తతలను సృష్టించటం, లేదా ధ్రువీకరించలేని ఆరోపణలు చేయడం, చట్టంలో పొందుపరచబడిన ఉల్లంఘనల చుట్టూ ఉంటుంది. ఓట్లను పొందడం కోసం కులం లేదా మతపరమైన భావాలను ప్రేరేపించరాదనీ, పార్టీలు, అభ్యర్థులు అవినీతి విధానాలను ఆశ్రయించరాదనీ, పార్టీలు, వారి కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీల కార్యకలాపాలకు అంతరాయం కలిగించరాదనీ కోడ్ నిర్దేశిస్తుంది. ప్రచార సభలు, ఊరేగింపులు, పోలింగ్ బూత్లు, మేనిఫెస్టోలపై కూడా ఇలాంటి సెక్షన్లు ఉన్నాయి. అయితే, గమనించదగ్గ విషయం ఏమిటంటే, ‘కేంద్రంలో,రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ’ కోసం ఎంసీసీ ఒక ప్రత్యేక విభా గాన్ని కేటాయించింది. ‘అధికారిక పదవిని ఉపయోగించినట్లు ఎటు వంటి ఫిర్యాదు రాకుండా, ఎటువంటì ఫిర్యాదుకూ కారణం చూపే అవకాశం లేకుండా చూసుకోవా’లని కోడ్ ఆజ్ఞాపించింది. కోడ్ పరిధిలోకి వచ్చిన దుర్వినియోగమంటే... అతిథి గృహాలు, రవాణా వంటి ప్రభుత్వ సౌకర్యాల వినియోగానికి సంబంధించినవి. అలాగే ప్రకటనల్ని జారీ చేయడానికి లేదా కొత్త ఆంక్షలను మంజూరు చేయ డానికి ప్రభుత్వ నిధులను వినియోగించడం, అందుకు అధికారాన్ని ఉపయోగించడం కూడా! ఎంసీసీ వీటిని దాటి వెళ్లదు. రాష్ట్ర యంత్రాంగం, న్యాయ వ్యవస్థ సాధారణ పని తీరు ప్రస్తుత ఎంసీసీ ద్వారా ఏ విధంగానూ పరిమితమై పోదు. న్యాయస్థాన విచా రణల వంటి న్యాయ ప్రక్రియలో ఈసీ జోక్యం చేసుకోవడం, లేదా చట్టాన్ని అమలు చేసే సంస్థల సాధారణ విచారణ ఈసీ ఆదేశాలకు లోబడి ఉండాలా వద్దా అనేది చర్చనీయాంశం. బహుశా, ప్రారంభంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముసాయిదాను రూపొందించినప్పుడు ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ సంస్థల అధికార దుర్వినియోగం అనేది ఊహకైనా రాలేదు. అయితే, ఎంసీసీ అనేది మానవ ప్రవర్తన లాగా కాలగతిలో మారుతూ వచ్చే పురోగమన పత్రం. 2009లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో, ఈసీ 2009 మార్చి 19 నాటి తన లేఖను పరిశీలించి,ఎంసీసీ వర్తింపు చట్టబద్ధమైన స్వయంప్రతిపత్తి గల ఎలక్ట్రిసిటీ రెగ్యు లేటరీ కమిషన్ ల వంటి కమిషన్ లకు విస్తరించిందని స్పష్టం చేసింది. బడ్జెట్ సమర్పణపై ఎంసీసీ వర్తింపు గురించి ఆ నాటి ఈసీ లేఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం నెలకొన్న వాతావరణం, ప్రభుత్వ సంస్థల జోరు ఫలితంగా అన్ని పక్షాలకూ సమాన అవకాశాలు లేని స్థితి చూశాక ఎన్నికల సంఘం రంగంలోకి దిగాల్సిందేనేమో! తాజా ఫిర్యాదులకు దారితీసిన పరిస్థితులను పరిశీలించాలేమో!! గతంలో ఇలాంటి పరిస్థి తుల్లోనే 2019లో ఎన్నికల సంఘం రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఒక సలహాను జారీ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆ విధంగానే ఎన్ ఫోర్స్మెంట్ ఏజెన్సీల అపూర్వమైన చర్యల పరంపర ఏదైనా ‘ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య అభ్యాసాన్ని’ ఉల్లంఘిస్తున్నదేమో ఈసీ నిర్ధారించాలి. ఇప్పుడు ఎన్నికల సంఘానికి ఉన్న ప్రధానమైన సందిగ్ధత ఏమిటంటే... ‘స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు’ నిర్వహించే తన ఏకైక బాధ్యతకు కట్టుబడి రూల్ బుక్ను అనుసరించాలా, లేక ‘స్క్రిప్టు’ను తిరిగి రాయాలా అనేది! ‘స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్ని కలు’ అనే పదం రాజ్యాంగంలో పేర్కొన లేదు కానీ ఈసీ ‘పర్యవేక్షణ, దిశానిర్దేశం’ అనే మాటలోనే ఆ స్ఫూర్తి నిండి ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనేది కూడా మనం సాధారణంగా అర్థం చేసుకునే దానికంటే చాలా పెద్దది. సంపూర్ణంగా గ్రహించి, అమలు చేయాల్సిన న్యాయమైన స్ఫూర్తి అందులో ఉంటుంది. అశోక్ లావాసా వ్యాసకర్త మాజీ ఎన్నికల కమిషనర్ -
ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా పనిచేయండి: సీఈసీ
సాక్షి, అమరావతి: త్వరలో జరగనున్న పార్లమెంట్, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా శాంతి యుతంగా,హింసా రహితంగా నిర్వహించడమే లక్ష్యంగా పని చేయాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల యంత్రాగానికి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలకు సంబంధించి శాంతి భద్రతలు, భద్రతా బలగాల మోహరింపు, ఎన్నికల వ్యయ నిర్వహణ సెన్సిటివిటి,నోడలు అధికారుల నియామకం, నోటిఫికేషన్ ఆఫ్ డ్రై డే మరియు ఫెయిడ్ హాలిడే,అంతర్జాతీయ సరిహద్దు అంశాలపై బుధవారం ఢిల్లీ నుండి సహచర ఎన్నికల కమిషనర్లతో కలిసి సీఈసీ రాజీవ్ కుమార్ వివిధ రాష్ట్రాల సీఎస్, డీజీపీ, సీఈవోలు తదితర అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఈ ఎన్నికలు ఏవిధంగా జరుగుతున్నాయని ప్రపంచ దేశాలన్నీ మనవైపు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కావున రానున్నఎన్నికలను స్వేచ్ఛగా శాంతి యుతంగా హింసా రహితంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలకు పునరుద్ఘాటించారు.ఇప్పటికే మొదటి,రెండవ దశ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ అయ్యాయని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, డ్రగ్స్ వంటివి ఓటర్లను ప్రభావితం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సీఎస్, డీజీపీ,సీఈవోలకు స్పష్టం చేశారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలెన్సు బృందాలు ఎక్కడైనా తనిఖీల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అలాంటి బృందాలపై జిల్లా యంత్రాంగాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిఇసి రాజీవ్ కుమార్ ఆదేశించారు.ముఖ్యంగా పోలింగ్కు 48 గంటల ముందు(సైలెంట్ ఫిరియడ్)ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు,మద్యం వంటి తాయిలాల పంపిణీకి ప్రయత్నాలు జరుగుతాయని అలాంటి చర్యలను కట్టుదిట్టంగా నియంత్రించేందుకు మోడల్ కోడ్ బృందాలు మరింత నిఘా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలను సజావుగా సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని విధాలా కట్టుబడి పూర్తి సన్నద్ధమై ఉందని ఈప్రక్రియలో అన్ని రాష్ట్రాలు పూర్తి సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సిఇసి రాజీవ్ కుమార్ సూచించారు.ఎన్నికల్లో అన్ని పార్టీలకు వివిధ అంశాల్లో సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకునే ప్రశాంతమైన వాతావరణాన్ని పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని సిఇసి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.ఎక్కడా రీ పోలింగ్ కు అవకాశం లేని విధంగా రానున్న ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్ట అమలుపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుండి ఇప్పటి వరకు 258 కోట్ల రూపాయలు విలువైన నగదు,మద్యం,డ్రగ్స్,ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఏపీతో ఐదు రాష్ట్రాలు అంతర్ రాష్ట్ర సరిహద్దులను కలిగి ఉన్నాయని, రాష్ట్ర సరిహద్దుల్లో 150 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు.ప్రశాంత మరియు స్వేచ్ఛాయుత,హింసా రహిత ఎన్నికల నిర్వహణకు అన్నిచర్యలు తీసుకుంటున్నా మని సిఎస్ జవహర్ రెడ్డి వివరించారు.శాంతి భధ్రతల అంశానికి సంబంధించి సరిహద్దు రాష్ట్రాలైన ఒడిస్సా,ఛతీష్ఘడ్ నుండి కొంత మేర మావోయిస్టుల సమస్య ఉందని ఆ సమస్యను అధిగ మించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పారు.రాష్ట్రంలో 132 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు,632 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పని చేస్తున్నాయని సీఎస్ జవహర్ రెడ్డి సీఈసీకి వివరించారు. పోలీస్ డైరెక్టర్ జనరల్ కెవి.రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాలైన ఒడిస్సా,ఛతీస్గఢ్ రాష్ట్రాల నుండి కొంత వరకు మావోయిస్టుల ప్రాబల్యం ఉందని ఇందుకు సంబంధించి 91 పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నా మని చెప్పారు.ఇటీవల మహారాష్ట్రకు 10 కంపెనీల పోలీసు బలగాలను పంపామని వాటిని తిరిగి పంపాలని కోరారు.రాష్ట్రానికి అదనపు బలగాలను పంపాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో సమావేశంలో సీఈవో ముకేశ్ కుమార్ మీనా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్, రజత్ భార్గవ,హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్త,అదనపు డీజీపీ ఎస్.బాగ్చి,చీఫ్ కమీషనర్ స్టేట్ టాక్స్ గిరిజా శంకర్, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, ఎస్ఇబి డైరెక్టర్ యం.రవి ప్రకాశ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బెంగాల్ డీజీపీ తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం భారీ కసరత్తుకు తెరతీసింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, బిహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ హోం శాఖ కార్యదర్శులతోపాటుగా, పశ్చిమబెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ను తొలగించాలని ఆదేశా లు జారీ చేసింది. మిజోరం, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల సాధారణ పరిపాలన విభాగాల కార్యదర్శులను కూడా తొలగించింది. గతంలోనూ చర్యలు 2016 అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2019 లోక్సభ ఎన్నికల సమయంలోనూ పశ్చిమబెంగాల్ డీజీపీకి ఎన్నికల విధుల నుంచి ఈసీ తొలగించడం గమనార్హం. తాత్కాలికంగా డీజీపీ రాజీవ్ కుమార్కు ఎన్నికలతో సంబంధం లేని బాధ్యతలను అప్పగించాలని బెంగాల్ చీఫ్ సెక్రటరీకి ఈసీ సూచించింది. ఆయనకు జూనియర్గా ఉన్న మరో అధికారికి డీజీపీ బాధ్యతలివ్వాలని కోరింది. డీజీపీ పోస్టుకు అర్హులైన ముగ్గురు అధికారుల పేర్లను తమకు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. వీరికి రెండు విధులు గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులు సంబంధిత రాష్ట్రాల సీఎం కార్యాలయాల బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారని, దీనివల్ల ఎన్నికల సంబంధ విధుల అమలులో ఎంతో కీలకమైన నిష్పా క్షికత, తటస్థత కొరవడే ప్రమాదముందని ఈసీ పేర్కొంది. ముఖ్యంగా శాంతిభద్రతలు, బలగాల మోహరింపుపై ఇది ప్రభావం చూపొచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే వీరిని విధుల నుంచి తప్పించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. బీఎం కమిషనర్ తొలగింపు ఎన్నికల సమయంలో మూడేళ్లు ఒకే చోట బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని, సొంత జిల్లాల్లో విధుల్లో ఉన్న వారిని ఎన్నికల సంబంధ విధుల నుంచి బదిలీ చేయడం ఆనవాయితీ. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం తమ సూచనలను పాటించకపోవడంపై ఈసీ అసంతృప్తిగా ఉంది. దీంతో, బృహన్ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చహల్తోపాటు అదనపు కమిషనర్లు, ఉప కమిషనర్లను విధుల నుంచి తప్పించాలని ఆదేశాలిచ్చింది. ఇతర కార్పొరేషన్ల మున్సిపల్ కమిషనర్లు, అదనపు, ఉప కమిషనర్లను కూడా బదిలీ చేయాలని కోరింది. -
ఈసీలో కొత్త నీరు!
ఎన్నికల నోటిఫికేషన్ల విడుదల సమయాల్లో మాత్రమే వినబడే ఎన్నికల సంఘం చాన్నాళ్లుగా తరచు వార్తల్లోకెక్కుతోంది. అక్కడ కమిషనర్ల ప్రవేశమూ, నిష్క్రమణా కూడా సంచలనాలుగా, వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ నెల 9న ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా చేశాక ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలో కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. తాజాగా ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేశ్కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూలను ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ గురువారం ప్రకటించింది. తనకు 212 పేర్లతో బుధవారం రాత్రే జాబితా పంపారని, తెల్లారేలోగా అంతమందిని జల్లెడపట్టి వారిలో ఇద్దరిని ఎంపిక చేయటం సాధ్య మేనా అని కమిటీలోని విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురి ప్రశ్నించారు. ఆ సంగతలావుంచి రేపో మాపో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతున్న దశలో ఈ ఎంపిక వుండదని, ఏకసభ్య సంఘం చేతులమీదుగా అంతా ముగుస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ రాజు తల్చుకుంటే కానిదంటూ ఏముంటుంది? నిజానికి ఎన్నికల సంఘం 90వ దశకం వరకూ ఏకసభ్య సంఘంగానే వుండేది. 1987లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో జైల్సింగ్కు రెండోసారి అవకాశం లేకుండా ఎన్నికల ప్రక్రియను సవరించాలన్న నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రయత్నానికి అప్పటి ఎన్నికల కమిషనర్ ఆర్వీఎస్ పేరిశాస్త్రి అడ్డుపుల్ల వేయటంతో ఆగ్రహించి ఆ సంఘాన్ని త్రిసభ్య సంఘం చేయాలని కేంద్రం భావించింది. అయితే అనంతర కాలంలో వీపీ సింగ్ ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలా చేసింది. 1990లో నాటి ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ దూకుడును తట్టుకోలేకపోయిన నాటి పీవీ నరసింహారావు సర్కారు దాన్ని త్రిసభ్యసంఘంగా మార్చింది. నిర్వాచన్ సదన్లో ఏదో జరుగుతోందని తెలిసినా ఎందుకో అర్థంకాని పరిస్థితి గతంలో లేదు. ఏదైనా సమస్యవుంటే ప్రభుత్వం వివరణనివ్వటం రొటీన్గా సాగిపోయేది. లేదంటే మీడియానే కూపీ లాగే ప్రయత్నం చేసేది. ఇప్పుడు వివరణనిచ్చే సంస్కృతీ లేదు... వెలికితీసే మీడియా కూడా లేదు. ఈమధ్యే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేసి నిష్క్రమించారు. వచ్చినప్పటిలాగే వెళ్లేటపుడు కూడా ఎన్నో ప్రశ్నలు మిగిల్చారు. వాస్తవానికి ఆయనకు ఇంకా మూడేళ్ల వ్యవధివుంది. పైగా వచ్చే ఫిబ్రవరిలో రాజీవ్కుమార్ రిటైరయ్యాక ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యే అవకాశం కూడావుంది. ఈ చాన్సును కమిషనర్లుగా వున్నవారు ఎట్టి పరిస్థితు ల్లోనూ వదులుకోరు. పోనీ గోయెల్కు అలా వెళ్లితీరాల్సిన పరిస్థితి ఏర్పడినా సాధారణంగా కేంద్రం సర్దిచెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గత నెలలో మరో కమిషనర్ అనూప్ పాండే రిటైరయ్యారు. గోయెల్ కూడా నిష్క్రమిస్తే ఒక్కరే మిగులుతారు. ఒక్కరితో లోక్సభ ఎన్నికల నిర్వహణకు బదులు ఆ ప్రక్రియ ముగిసేవరకూ వుండాలని ఆయన్ను కోరితే వేరుగా వుండేది. ఈ హఠాత్తు నిష్క్ర మణలోని ఆంతర్యమేమిటో మూడోకంటికి తెలియదు. ఆయనంతట ఆయన వెళ్లారా, ప్రభుత్వమే అడిగిందా అన్నది అర్థంకాదు. ఆయన నియామకం కూడా వివాదాస్పదమే. 2022 నవంబర్ వరకూ పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా వున్న గోయెల్ ఆ నెల 18న స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు. రాత్రికి రాత్రి కేంద్ర న్యాయశాఖలో కమిషనర్ ఫైలు చకచకా కదిలి, నలుగురు సభ్యుల జాబితాలో గోయెల్ పేరు చేరిపోయింది. ఆ మర్నాడే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు ఆ ఫైలు వెళ్లటం, గోయెల్ను ఎంపిక చేయటం, ఆయన కమిషనర్గా పదవీ బాధ్యతలు చేపట్టడం ముగిసిపోయాయి. ఈ హైస్పీడ్ ‘24గంటల వ్యవహారం’పై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఎందుకింత తొందర?’ అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది కూడా. కానీ చివరకు ఆ పిల్ను తోసిపుచ్చింది. ఎన్నికల కమిషనర్ల నియామకం అంశంలో కొత్త చట్టం వచ్చేవరకూ ఎంపిక కమిటీలో ప్రధాని, లోక్సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వుండాలని నిరుడు మార్చిలో అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సూచించింది. రాజ్యాంగంలోని 324(2) అధికరణను ఉల్లంఘించి ప్రధాని ఏకపక్షంగా నియమకాలు చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్పై ధర్మాసనం ఆ తీర్పునిచ్చింది. అనంతరం ఆగస్టులో కేంద్రం తెచ్చిన చట్టంలో ఆ తీర్పు స్ఫూర్తి గాలికెగిరి పోయింది. ప్రధాని, కేంద్రమంత్రి, లోక్సభలో విపక్షనేత ఎంపిక కమిటీలో వుంటారని ఆ చట్టం చెబుతోంది. పర్యవసానంగా ఎప్పటిలా పాలకపక్షం అభీష్టమే నెరవేరుతుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షం లేకుండానే బిల్లు ఆమోదం పొంది, చట్టం కావటాన్ని సవాలు చేస్తూ దాఖలైన రిట్ ప్రస్తుతం విచారణలో వుంది. ఆ చట్టంకిందనే తాజాగా ఇద్దరు కమిషనర్లను నియమించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ కీలకమైన అంశం. దాన్ని పర్యవేక్షించే ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వుండాలని జనం కోరుకుంటారు. అందుకే కమిషనర్ల నియామకం, పదోన్నతులు సాధ్యమైనంత పారదర్శకంగా వుండేందుకు ప్రయత్నించాలి. హఠాత్తు నిష్క్రమణలు, ఆగమనాలు ఎన్నికల సంఘం తటస్థతను ప్రశ్నార్థకం చేస్తాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యే దశలో అశోక్ లావాసా 2020లో హఠాత్తుగా రాజీనామా చేయటం, ఇటీవల వున్నట్టుండి గోయెల్ నిష్క్రమించటం, పాలకపక్షందే పైచేయిగావున్న ఎంపిక కమిటీ కొత్త నియామకాలు చేయటం వంటివి సంశ యాలకు తావిస్తాయని పాలకులు తెలుసుకోవటం ఉత్తమం. -
Election Commission: కులం, మతం, భాష పేరుతో ఓట్లడగొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగవద్దని, ఇతర మతాల దేవుళ్లను, దేవతలను కించపరచరాదని పార్టీలకు, నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ శుక్రవారం అడ్వైజరీ విడుదల చేసింది. గతంలో నియమావళిని ఉల్లంఘించి నోటీసులందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మరోసారి తప్పిదానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవంది. ప్రచార సమయంలో మర్యాదలు, సంయమనం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రత్యర్థులను కించపరిచడం, అవమానించడం, సదరు పోస్ట్లను సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడదని పేర్కొంది. విద్వేషానికి వ్యాఖ్యలకు పార్టీలు దూరంగా ఉండాలని కోరింది. ‘‘స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు నియమావళిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉల్లంఘించరాదు. వీటిని నిశితంగా పరిశీలిస్తుంటాం. సమాజంలో వర్గ విభేదాలను, శత్రుత్వాన్ని పెంచే మాటలు, చర్యలకు దూరంగా ఉండాలి. ఓటర్లను తప్పుదోవ పట్టించే లక్ష్యంతో తప్పుడు ప్రకటనలు లేదా నిరాధార ఆరోపణలను ప్రచారం చేయవద్దు. వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండాలి. దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా లేదా మరే ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు’’ అని స్పష్టం చేసింది. మహిళల గౌరవం, గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలు లేదా ప్రకటనలను నివారించాలని ఈసీ కోరింది. సోషల్ మీడియాలో సంయమనం పాటించాలని, ప్రత్యర్థుల ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్ట్లను షేర్ చేయడం మానుకోవాలని పేర్కొంది. శుక్రవారం లఖ్నవూలో ఎన్నికల కాఫీ టేబుల్ బుక్ విడుదల చేస్తున్న సీఈసీ రాజీవ్ కుమార్ -
హామీలపై సమాచారం.. ఓటర్ల హక్కు: సీఈసీ
చెన్నై: ఎన్నికల సమయంలో రాజకీయ పారీ్టలు ఇచ్చే హామీలు ఆచరణ సాధ్యమేనా? అనేది తెలుసుకొనే హక్కు ఓటర్లకు ఉందని ముఖ్య ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. అయితే, ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని గుర్తుచేశారు. మేనిఫెస్టోలో హామీలను పొందుపర్చే హక్కు రాజకీయ పారీ్టలకు ఉన్నట్లే.. ఆయా హామీల్లో నిజమెంత? వాటిని అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి ఎలా సేకరిస్తారో తెలుసుకునే హక్కు ఓటర్లు ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై న్యాయస్థానం విచారణ కొనసాగిస్తోందని వెల్లడించారు. రాజీవ్ కుమార్ శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలు, వాటిని అమలు చేసే విధానం, నిధుల సేకరణ మార్గాలను రాజకీయ పారీ్టలు తప్పనిసరిగా వెల్లడించేలా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఒక ‘ప్రొఫార్మా’ సిద్ధం చేశామని తెలిపారు. -
Rajiv Kumar Sharma: ప్రతికూలతకు... పచ్చటి జవాబు
పాత వస్తువులను చూస్తూ కొత్తగా ఆలోచిస్తే ఏమొస్తుంది? కొత్త ఆవిష్కరణకు బీజం పడుతుంది. సమాజానికి మేలు జరుగుతుంది. రసాయనాలతో కూడిన ఎయిర్ ఫ్రెష్నర్ ద్వారా అనారోగ్యానికి గురైన రాజీవ్ శర్మ ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాడు. ‘జీరో ప్లాస్టిక్, జీరో ట్యాక్సిన్స్’ నినాదంతో ఎకో–ఫ్రెండ్లీ ఎయిర్ ఫ్రెష్నర్ను డిజైన్ చేశాడు. ‘ఆల్వే–గ్రీన్ సొల్యూషన్స్’ స్టార్టప్తో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నాడు జంషెడ్పూర్కు చెందిన రాజీవ్ కుమార్ శర్మ.... కోవిడ్ సమయంలో రాజీవ్శర్మ కుటుంబం శానిటైజర్లతో పాటు ఎయిర్ ఫ్రెష్నర్లను ఉపయోగించేది. ఒకరోజు వాంతులు, తలనొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు రాజీవ్. హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగివచ్చిన తరువాత ‘ఎందుకు ఇలా జరిగింది?’ అంటూ ఆలోచించాడు. ఇంట్లోకి కొత్తగా వచ్చిన ఎయిర్ ఫ్రెష్నర్ వల్లే తాను అనారోగ్యానికి గురైనట్లు తెలుసుకున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కలప, పూలవ్యర్థాలతో సహజమైన ఎయిర్ ఫ్రెష్నర్ తయారుచేశాడు. ఈ ఎయిర్ ఫ్రెష్నర్ ద్వారా ఇనోవేటర్ కాస్తా ఎంటర్ప్రెన్యూర్ అయ్యాడు. ‘ఆల్వే–గ్రీన్ సోల్యూషన్స్’ పేరుతో స్టార్టప్ ప్రారంభించి విజయం సాధించాడు. ‘ఎయిర్ ఫ్రెష్నర్లలో ఇబ్బంది కలిగించే రసాయనాలు ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా ఏదైనా ఎయిర్ ఫ్రెష్నర్ తయారీలో ఉపయోగించిన ఇన్గ్రేడియెంట్స్ గురించి తెలుసుకోవడం. పిల్లలు, జంతువులకు ఇవి సురక్షితం కాదు. ఈ నేపథ్యంలో పర్యావరణానికి హాని కలిగించని, మనుషులకు, జంతువులకు సురక్షితమైన ఎయిర్ ఫ్రెష్నర్ను తయారుచేయాలనుకున్నాను’ అంటాడు రాజీవ్శర్మ. ఈ ప్రాజెక్ట్పై తల్లితో కలిసి ఎనిమిది నెలలకు పైగా శ్రమించాడు. ఎన్నో ట్రయల్స్ తరువాత ఫైనల్ ప్రాజెక్ట్ ఓకే అయింది. ‘మా ఫ్రొఫెసర్లు ఆశ్చర్యపోయారు. ఇది మరింత ఎక్కువమందికి చేరువ కావాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. కాలేజీలోని యంత్రాలతో ఎయిర్ ఫ్రెష్నర్ పర్ఫెక్ట్గా రావడానికి సహాయం చేశారు’ అంటాడు రాజీవ్. జంషెడ్పూర్(ఝార్ఖండ్)లోని ఆలయాల నుంచి రాజీవ్ ప్రతిరోజూ కనీసం మూడు కిలోల పూలవ్యర్థాలను సేకరిస్తాడు. ప్రస్తుతం ఇంటి నుంచే కంపెనీని నడుతున్న రాజీవ్ దాన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నాడు. ‘ఆల్వే–గ్రీన్ సొల్యూషన్’ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–బెంగళూరుతో కలిసి పనిచేస్తోంది. చిన్నప్పటి నుంచి రాజీవ్ కొత్త కొత్త వస్తువులు తయారుచేసేవాడు. కోవిడ్ సమయంలో సౌకర్యవంతమైన పీపీఇ కిట్లను రూపొందించాడు. ‘ఝార్ఖండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ’ సభ్యుడిగా గాయపడిన శునకాల కోసం ప్రత్యేకమైన వీల్చైర్లను తయారుచేశాడు. ‘మనకు ఉపయోగపడే వస్తువులు మాత్రమే కాదు పర్యావరణానికి హాని కలిగించని పరికరాలను తయారు చేయడం నా లక్ష్యం’ అంటున్నాడు రాజీవ్ కుమార్ శర్మ. -
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
సాక్షి, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేలా స్వేచ్ఛాయుత, పారదర్శక వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల్లో అన్ని రాజకీయపార్టీలకు సమప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛ ఓటర్ల జాబితాతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య హక్కును కాపాడాలని, పోలింగ్లో పెద్దఎత్తున పాల్గొనాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. రానున్న లోక్సభ, రాష్ట్ర శాసనసభ 2024 ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషనర్లు అనూప్చంద్ర పాండే, అరుణ్ గోయల్లతో కలిసి విజయవాడలో రాజీవ్ కుమార్ రెండు రోజుల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష వివరాలను బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా 2024లో తొలి సమీక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మొదలు పెట్టినట్లు తెలిపారు. ఎన్నికల సన్నద్ధతపై స్టేక్ హోల్డర్స్ అందరితో సమావేశాలు నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 1.99 కోట్లు, మహిళలు 2.07 కోట్లు ఉన్నారని వివరించారు. రాష్ట్రంలో 159 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉండటం శుభపరిమాణమన్నారు. 2014లో 1013గా ఉన్న పురుష, మహిళా ఓటర్ల నిష్పత్తి ఇప్పుడు 1036కు పెరిగిందన్నారు. అలాగే రాష్ట్రంలో 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 5.8 లక్షల మంది ఉన్నారని, వారు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్ కాకుండా ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకున్న వారు ఫాం12డీ పూర్తి చేయడం ద్వారా అవకాశం పొందవచ్చన్నారు. వచ్చే ఎన్నికల్లో 18–19 ఏళ్లు ఉన్న 7.88 లక్షల మంది తొలిసారి ఓటు హక్కును వినియోగంచుకోనున్నట్లు తెలిపారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 22న విడుదల చేయనున్నట్లు చెప్పారు. ధన ప్రవాహం తగ్గించే విధంగా చర్యలు ఎన్నికల్లో ధన ప్రవాహంతగ్గించే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకోసం అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద వివిధ శాఖలకు చెందిన 139 చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. మద్యం, నగదు పంపిణీ, బహుమతుల పంపిణీ వంటి వాటి ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా కట్టడి చేసేందుకు కేంద్రరాష్ట్రాలకు చెందిన 20 టాస్క్ఫోర్స్లు సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. గత రెండేళ్లుగా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో పెద్దఎత్తున నగదు జప్తు చేశామన్నారు. 2018–19లో రూ. 366 కోట్ల నగదును సీజ్ చేస్తే 2022–23లో ఆ మొత్తం విలువ రూ. 3,247 కోట్లకు చేరిందన్నారు. అందుబాటులోకి సీవిజిల్ యాప్ నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని ఓటర్లకు పలు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇందుకోసం సీవిజిల్ అనే యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. సీవిజిల్ యాప్ ద్వారా ఏదైనా ఫిర్యాదు వస్తే 100 నిమిషాల్లోనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా ఓటర్లకు సంబంధించిన అన్ని సేవలను అందిస్తున్నామని, అలాగే అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా సమర్పించే అఫిడవిట్లు, ర్యాలీల అనుమతి కోసం సువిధ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. మొదట ఏ పార్టీ దరఖాస్తు చేస్తే ఆపార్టీకే అనుమతివ్వాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల నేర చరిత్ర తెలుసుకునే విధంగా కేవైసీ (నో యువర్ కాండిటేట్) యాప్ను తీసుకురావడంతో పాటు అభ్యర్థి నేరచరిత్రను తప్పనిసరిగా మూడుసార్లు దినపత్రికలు, టీవీ ఛానల్స్లో ప్రచురించాల్సిందిగా కోరారు. దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా పోలింగ్ కేంద్రాల వద్ద అని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్గోయల్, రాష్ట్ర ఎన్నికలప్రధాన అధికారి ముఖేష్ కుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
AP: రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు: సీఈసీ వార్నింగ్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని, ఇది శుభపరిణామమని తెలిపింది. బుధవారం సాయంత్రం సీఈసీ రాజీవ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా వివరాలతో పాటు పలు కీలకాంశాలను వివరించారు. ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లు 2.07 కోట్లు కాగా పురుష ఓటర్లు 1.99 కోట్ల మంది ఉన్నారన్నారు రాజీవ్ కుమార్. వచ్చే ఎన్నికల్లో సీనియర్ సిటిజన్లకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశముందన్నారు. 7.88 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 7.88 లక్షలుగా ఉన్నట్లు చెప్పారు. వంద ఏళ్లు దాటిన వృద్ధులు 1174 మంది ఉన్నారన్నారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు. సీఈసీ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా తొలుత ఆంధ్రప్రదేశ్ సందర్శిస్తున్నాం. ఎన్నికల సందర్భంగా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఓటర్లను కోరుతున్నాం. నిన్న విజయవాడలో పార్టీలతో సమావేశం నిర్వహించాం. ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరింది. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరాయి. చదవండి: రిపబ్లిక్ వేడుకల్లో ఏపీ శకటంగా జగనన్న విజన్! ఏపీ, తెలంగాణ రెండు చోట్లా కొందరు ఓట్లు నమోదు చేసుకున్న అంశాన్ని ఓ పార్టీ ప్రస్తావించింది. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తాం. గతంలో 20 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు. అందులో 13 వేల ఓట్లను అక్రమంగా తొలగించినట్టు గుర్తించాం. అక్రమంగా తొలగించినట్టు తేలిన ఓట్లను పునరుద్ధరించాం. రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి . సగటున ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 870 మంది ఓటర్లు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 1500 వరకు ఓట్లు ఉన్నాయి. తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. 70 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఉంది. ఏపీ, తెలంగాణ లలో ఒకే సారి ఎన్నికలు పెట్టమని కొన్ని పార్టీలు కోరాయి. ఎవ్వరైనా ఒక్క చోట మాత్రమే ఓటు హక్కు తీసుకోవాలి. ఎక్కడ నివసిస్తే అక్కడే ఓటు ఉండాలి.(పుట్టిన ఊరు, సొంత గ్రామం అని కాదు, ఎక్కడ నివసిస్తే.. అక్కడ అని అర్థం). రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, కేసు నమోదవుతుంది. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు.. ఏపీలో ఓటు కోసం ఎలా దరఖాస్తు చేస్తారు?. ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రానా.. ఏపీలో నివాసం ఉండకుండా ఉంటే ఓటు ఇవ్వలేం’ అని సీఈసీ పేర్కొన్నారు. -
ఏపీలో కొనసాగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన
సాక్షి, అమరావతి : రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ, సన్నద్ధత వంటి అంశాలను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం నుంచి రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్, కమిషనర్లు అనూప్చంద్ర పాండే, అరుణ్ గోయల్తో కూడిన ఉన్నతాధికారుల బృందం పర్యటిస్తున్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాలకు సంబంధించి ఎస్ఎస్ఆర్–2024 కార్యకలాపాలు, ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను సమీక్షించనున్నారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి గందరగోళం లేకుండా పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన 5.64 లక్షల పేర్లను అనర్హులుగా ఎన్నికల సంఘం తేల్చింది. అలాగే, రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత కోసం తీసుకున్న చర్యలను జనవరి 10న ఉ.9.30 నుంచి 11 గంటల వరకు స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్తో కలిసి కేంద్ర ఎన్నికల అధికారులకు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం.. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం ఉంటుందని.. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీఐ ఉన్నతాధికారులు సమావేశమవుతారన్నారు. ఆ తర్వాత.. సమావేశ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు 10వ తేదీ సా.4.30కు మీడియాకు వివరిస్తారని ముఖే‹Ù కుమార్ మీనా అన్నారు. సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి.. ఇక ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024, ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై విజయవాడలో ఈనెల 9, 10 తేదీల్లో ఈసీఐ ఉన్నతస్థాయి సమావేశాలు జరగనున్నాయని.. విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎన్టీఆర్జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు ముఖేష్ కుమార్ మీనాతో కలిసి కలెక్టర్ ఢిల్లీరావు విజయవాడ నోవాటెల్ కాన్ఫరెన్స్ హాల్ను పరిశీలించారు. -
పోలింగ్కు ముందే రాష్ట్ర సరిహద్దుల మూసివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల పోలింగ్ జరిగే నవంబర్ 30వ తేదీకి ముందే రాష్ట్ర సరిహద్దులను మూసివేసి బయటి రాష్ట్రాల నుంచి వ్యక్తులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారులను ఆదేశించారు. తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో శాసనసభ సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలతో పాటు వాటి సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్...ఎన్నికల కమిషనర్లు ఏసీ పాండే, అరుణ్ గోయెల్తో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ రాష్ట్ర సచివాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని, శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని శాంతికుమారి వివరించారు. సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సంప్రదింపులు జరిపి సరిహద్దు చెక్పోస్టును కట్టుదిట్టం చేశామని వివరించారు. నవంబర్ 28 నుంచి పోలింగ్ జరిగే 30 వరకు రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని, సాధారణ నేర కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టాయని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. -
కశ్మీర్లో ‘సరైన సమయం’లో ఎన్నికలు: ఈసీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని సరైన సమయంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషన్(సీఈసీ) రాజీవ్ కుమార్ సోమవారం చెప్పారు. ఏది సరైన సమయం అని తాము భావిస్తామో అప్పుడే అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఇతర ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఆరి్టకల్ 370ని రద్దు చేసి, జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత అక్కడ ఎన్నికలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది. -
ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదు: సీఈసీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించామని, అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని పెంచాలని పార్టీలు కోరినట్లు వెల్లడించారు. తొలిసారి రాష్ట్రంలో వృద్ధులు ఇంటివద్దే ఓటు వేయడానికి ఫామ్ 12d ఏర్పాటు చేస్తున్నామన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల బృందం గురువారం మీడియా సమావేశం నిర్వహించింది. 2022-23లో తెలంగాణలో 22 లక్షల ఓట్లను తొలగించామని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. మరణాలు ఉన్నా ధృవీకరణ ఫామ్ అందిన తర్వాతే ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించామని అన్నారు. ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదన్నారు. . పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించామని, ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు. తెలంగాణలో 35, 356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు ఉన్నట్లు రాజీవ్ కుమార్ చెప్పారు. మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 7.689 ఉన్నట్లు పేర్కొన్నారు. కొత్తగా 8,11,640 లక్షల యువత ఓటు నమోదు చేసుకున్నారని తెలిపారు. కాగా తెలంగాణలో మూడు రోజులపాటు పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. వివిధ రాజకీయ పార్టీలు, సీఎస్, డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం సమావేశమైంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించింది. బుధవారం రాష్ట్ర ఓటర్ల జాబితాను సైతం ప్రకటించింది. సీఈసీ రాజీవ్ కుమార్ ఇంకేమన్నారో ఆయన మాటల్లోనే ► యంగెస్ట్ స్టేట్ తెలంగాణ... తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ► ఫ్రీ అండ్ ఫెర్ ఎన్నికల నిర్వహణ కోసం మేము కమిట్మెంట్తో పనిచేస్తున్నాం. ►రాజకీయ పార్టీలతో కలిసినప్పుడు వాళ్ళ నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి ►అక్రమ నగదు - మద్యం ను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. ► అర్బన్ ఏరియాల్లో మైక్రో అబ్జార్వార్లను పెట్టాలని కోరారు. ►119 సెగ్మెట్లలో 88 జనరల్, ఎస్టీ 12, ఎస్సీ 19 ఉన్నాయి. ►80ఏళ్లకు పైబడిన వాళ్ళు 4.43 లక్షలు ఉన్నారు. 100 ఏళ్లకు పైబడిన వాళ్ళు 7689 ఉన్నారు. ► 22లక్షల ఓట్లను 2022-23 డిలీట్ చేశాం. ►తెలంగాణ రాష్ట్రంలో అడ్రెస్స్ ఇష్యూ ఉంది. ► రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలతో దాదాపు వెయ్యి సమావేశాలు నిర్వహించాం. ►ఎన్నికల ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరిగింది. ► ఈ సారి 8.11లక్షల మొదటిసారి ఓటర్స్ను నమోదు చేశాం. ►యువత - మహిళా ఓట్లను పెంచేందుకు మేమెంతో కృషి చేశాం. సక్సెస్ అయ్యాము. ► 3.45 లక్షల యంగ్ విమెన్ ఓట్లు నమోదు అయ్యాయి. ► థర్డ్ జెండర్స్ తో సమావేశాలు పెట్టాం. ► 35వేల పీస్లు, ప్రతీ పీఎస్కు 897 ఉన్నారు. ►మినిమమ్ వసతులు అన్ని కల్పిస్తున్నాం. ►అక్రమంగా నగదు మద్యం సరఫరా చేస్తే c vigil యాప్లో ఫోటో పెడితే 100 నిమిషాల్లో చర్యలు ఉంటాయి. ► ప్రతీ ఒక్కరూ ఓటర్ helpline app డౌన్లోడ్ చేసుకోవాలి. ►suvidha పోర్టల్ ప్రతీ అభ్యర్థి డౌన్లోడ్ చేసుకోవాలి.. సమాచారం తెలుసుకోవచ్చు. ► KYC అంటే KNOW YOUR CANDIDATE క్రిమినల్ బ్యాగ్రండ్ చెక్ చేసుకోవచ్చు. ► సరిహద్దుల్లో చెక్ పోస్ట్లు 89, మొత్తం 148 చెక్ పోస్టులు ఏర్పాటు. ► అక్రమంగా నగదు - మద్యం సరఫరా చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి. ► ఆన్లైన్ లో నగదు బదిలీల పై EC నిఘా ఉంటుంది. ► ఎలిప్యాడ్స్, ఎయిర్పోర్ట్స్ లో ప్రత్యేక నిఘా. ►ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ లు ప్రతీ వారానికి ఒకసారి రిపోర్ట్ చేయాలని ఆదేశించాం. ► ఆరోపణలు(ఫిర్యాదు )వచ్చిన ప్రతీ నాయకులు సమాధానం చెప్పాలి. ► ప్రకటనలు - సోషల్ మీడియా లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయి. ►ఫ్రీ అండ్ ఫెర్ ఎన్నికల కోసం అబ్జర్లు కేంద్రం నుంచి విధులు నిర్వహిస్తారు ► ఎన్నికలు పారదర్శనంగా జరిపేందుకు అన్ని పక్కడ్బంధీ ఏర్పాట్లు చేస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాక సమీక్ష సారాంశం కోసం క్లిక్ చేయండి -
విదేశాల్లోని భారతీయులకు ఓటు హక్కు!
న్యూఢిల్లీ: విదేశాల్లో నివసించే భారతీయులకు సైతం మన దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించాల్సిన సమయం వచ్చిందని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. ఇందుకోసం ఈ–పోస్టల్ బ్యాలెట్ వంటి టెక్నాలజీ ఆధారిత ఆధునిక విధానాలను ఉపయోగించాలని అన్నారు. మన దేశ ఎన్నికల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని హర్షం వ్యక్తం చేశారు. రాజీవ్ కుమార్ శుక్రవారం నిర్వాచన్ సదన్లో ‘భారత్–ప్రజాస్వామ్యాలకు మాతృమూర్తి, భారత ఎన్నికల సంఘం పాత్ర’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో 2022 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారుల(ట్రైనీలు)ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవలి కాలంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, కుట్రపూరిత ప్రచారం సాగుతున్నాయని అన్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులకు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్(ఈటీబీపీఎస్) ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే ప్రతిపాదించింది. విదేశాల్లోని భారతీయుల్లో 1.15 లక్షల మంది అర్హులైన ఓటర్లు ఉన్నట్లు అంచనా. -
80 ఏళ్లు పైబడ్డ వారికి ‘ఇంటి నుంచే ఓటు’
బెంగళూరు: 80 ఏళ్లు పై బడ్డ వారికి ఇంటినుంచే ఓటేసే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని అమలు చేస్తున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ తెలిపారు. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘80 ఏళ్లు దాటిన వారు కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేయడాన్నే మేమూ ప్రోత్సహిస్తాం. అలా వెళ్లలేని వారికోసం తొలిసారిగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘ఇందుకోసం ‘సక్షమ్’ పేరిట మొబైల్యాప్ రూపొందించాం. అందులోకి వెళ్లి ఇంటి నుంచి ఓటేసే ఆప్షన్ను ఎంచుకోవచ్చు. ఎన్నికల సిబ్బంది వారింటికి వెళ్తారు. వారిచ్చే ఫామ్ 12డి ద్వారా ఓటేయవచ్చు. మొత్తం ప్రక్రియను వీడియో తీస్తాం. గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం’’ అని వివరించారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు, అఫిడవిట్లు ఆన్లైన్లోనే దాఖలు చేసేందుకు వీలుగా సువిధ పేరిట మరో మొబైల్ యాప్ రూపొందించినట్టు సీఈసీ వెల్లడించారు. సమావేశాలు, ర్యాలీలకు కూడా దీని ద్వారానే అనుమతి కోరవచ్చన్నారు. అభ్యర్థి గురించి ఓటర్లకు అవగాహన కోసం నో యువర్ క్యాండిడేట్ (కేవైసీ) ఉద్యమం కూడా చేపట్టినట్టు చెప్పారు. ‘‘నేరచరిత్ర ఉన్న వారిని అభ్యర్థిగా ఎంచుకునే పార్టీలు అందుకు కారణాలను తమ వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఓటర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఇ–విజిల్ యాప్లో ఫిర్యాదు చేయొచ్చు’’ అన్నారు. కర్నాటకలో ఎన్నికల తేదీని త్వరలో నిర్ణయిస్తామన్నారు. -
ఓటు వలస వెళుతుందా? రిమోట్ ఓటింగ్పై పెరుగుతున్న రాజకీయ వేడి
ఓటు. ప్రజాస్వామ్యం మనకిచ్చిన శక్తిమంతమైన ఆయుధం. అయినా దానిని వినియోగించుకోవడంలో ఏదో తెలీని ఉదాసీనత కనిపిస్తోంది. ముఖ్యంగా ఉపాధి కోసం వేరే ఊళ్లు వెళ్లే వలసదారులు ఓటు వెయ్యడానికి సుముఖత చూపించడం లేదు. అందుకే దేశంలో ఎక్కడ నుంచైనా ఓటు వెయ్యడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుట్టింది. అవే రిమోట్ ఓటింగ్ మెషీన్లు(ఆర్వీఎం). ఈ ఓటింగ్ మెషీన్ల ద్వారా సొంతూరుకి వెళ్లకుండా తాముండే ప్రాంతం నుంచి తమ నియోజకవర్గం అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం లభిస్తుంది. ఈ నమూనా ఆర్వీఎంలను ప్రదర్శించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 16న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ సహా 13 పార్టీలు వీటిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై విశ్వాసమే లేకుండా ఉన్న ఈ సమయంలో ఈ కొత్త ప్రక్రియకు తెరతీసి ఓటింగ్ వ్యవస్థను గందరగోళం చెయ్యడమెందుకనే చర్చ మొదలైంది. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతా దళ్ (యూ), శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ, సీపీఎం వ్యతిరేకంగా ఉండడంతో నమూనా ఆర్వీఎంల ప్రదర్శన జరగకుండానే సమావేశం ముగిసింది. అయితే వలస ఓటర్ల ఓటింగ్ శాతం పెంపు లక్ష్యంగా తాము చేస్తున్న ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లడానికి సీఈసీ రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఫిబ్రవరి 28 వరకు గడువు పెంచింది. ఎందుకీ ఆర్వీఎంలు ? వలస ఓటర్లలో మూడో వంతు మంది ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం లేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో 67.4శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. దాదాపుగా 30 కోట్ల మంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు. ఉన్న చోటు నుంచి సొంతూరికి వెళ్లే అవకాశం లేకపోవడం, ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో వారు ఓటు వెయ్యడం లేదు. భారత ప్రధాన ఎన్నికల అధికారిగా రాజీవ్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వలస ఓటర్లపై దృష్టి కేంద్రీకరించి రిమోట్ ఓటింగ్ ప్రక్రియకు తెరతీశారు. ఆర్వీఎంలు ఎలా పని చేస్తాయి ? ప్రస్తుతం ఎన్నికల్లో వినియోగిస్తున్న ఎలక్ట్రానింగ్ ఓటింగ్ మెషీన్లకు (ఈవీఎం) ఇది సవరించిన వెర్షన్. ఇతర ప్రాంతాల్లో ఉన్న వలస ఓటర్లు తమ నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తాము ఏ ప్రాంతం నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటారో రిజిస్టర్ చేసుకోవాలి. అలా రిజిస్టర్ చేసుకున్న వారిని రిమోట్ ఓటర్లు అని పిలుస్తారు. తమ ప్రాంతంలో ఉన్న రిమోట్ పోలింగ్ బూత్కు వెళితే ఆ ఓటరు నియోజకవర్గం వివరాలను కానిస్టిట్యూయెన్సీ కార్డ్ రీడర్ (సీసీఆర్) ద్వారా స్కాన్ చేసి గుర్తిస్తారు. అప్పుడు ఆర్వీఎం మెషీన్ల్లపై ఆ నియోజకవర్గానికి సంబంధించిన బ్యాలెట్ పత్రం డిస్ప్లే అవుతుంది. తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తే రాష్ట్రం కోడ్, నియోజకవర్గం, అభ్యర్థుల నెంబర్ వివరాలన్నీ రిమోట్ కంట్రోల్ యూనిట్లో రికార్డు అవుతాయి. ఓటు నమోదైనట్టుగా వీవీప్యాట్ స్లిప్ వస్తుంది. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తయారు చేసిన ఆర్వీఎంలు ఇంటర్నెట్ అవసరం లేకుండా పని చేస్తాయి. ప్రతిపక్షాల అభ్యంతరాలు ఇవీ ► సీఈసీ ప్రతిపాదనలేవీ సమగ్రంగా లేవు. ఆర్వీఎంల వ్యవస్థ పైపైన రూపొందించినట్టుగా ఉంది. ► ఈవీఎంల పని తీరుపైనే సవాలక్ష సందేహాలున్న ప్రస్తుత పరిస్థితుల్లో అదే నమూనాలో రూపొందించిన ఆర్వీఎంలతో ఒనగూరే ప్రయోజనం ఉండదు. ► ప్రాంతీయ పార్టీలకు, చిన్న పార్టీలకు ఈ వ్యవస్థ ఏ మాత్రం అనుకూలం కాదు. దేశవ్యాప్తంగా ఏర్పాటయ్యే వివిధ పోలింగ్ బూత్లలో వారు తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకునే వనరులు ఆ పార్టీలకు ఉండవు. ► ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు వేరే రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండకపోవడం వల్ల అక్కడ ఉండే వలస ఓటర్లని రాజకీయ పార్టీలు సులభంగా ప్రలోభ పెట్టొచ్చు ► ఓటరు స్థానికంగా నివాసం లేకపోతే రాజకీయ పార్టీలపై ఏర్పరచుకునే అభిప్రాయాలు, ఓటు వేయడంలో వారు తీసుకునే నిర్ణయాల్లో తప్పిదాలు జరిగే అవకాశం ఉంటుంది. ► దేశంలో ఒక చోట ఎన్నికలు జరుగుతూ ఉంటే, మరెక్కడి నుంచో ఓటు వేసే వ్యక్తి అసలు సిసలు ఓటరేనని ఎలా నమ్మాలి. ఓటింగ్లో జరిగే అక్రమాలు ఇకపై వివిధ నియోజకవర్గాలకు విస్తరిస్తాయి. ఈసీ ఎదుట ఉన్న సవాళ్లు ► అసలు వలస ఓటర్లు అంటే ఎవరు ? వారిని ఎలా గుర్తించాలి. వలస ఓటర్లను గుర్తించడంలో ఏర్పడే న్యాయపరమైన చిక్కుల్ని ఎదుర్కోవడం ► ఈవీఎంలకు సవరించిన వెర్షన్గా రూపొందించిన ఆర్వీఎంలలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు పరిష్కారం కనుగొనడం ► ఎన్నికల్లో ఎన్ని రిమోట్ ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న దానిపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవడం ► ఒక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతూ ఉంటే వలస ఓట్లు ఉండే అన్ని ప్రాంతాల్లోనూ ఎన్నికల నియమావళిని అమలు చేయడానికి ఎలాంటి కసరత్తు చేయాలి. ఇలాంటి సవాళ్లను అధిగమించడానికే ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరుతోంది. రిమోట్ ఓటింగ్ అనేది ఎన్నికల ప్రకియలో ఒక విప్లవాత్మకమైన మార్పు. పట్టణ ప్రాంతాల్లో, యువతలోనూ ఓటుపై ఆసక్తి పెంచడమే ధ్యేయంగా పని చేస్తున్నాం. కానీ దీని అమలులో ఎన్నో సవాళ్లున్నాయి. ఇది అంత సులభంగా జరిగేది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్ణయాలు తీసుకోవడానికి సమయం పడుతుంది. మేం వేసే ప్రతీ అడుగు ముందడుగానే ఉంటుంది. రాజీవ్ కుమార్, సీఈసీ ధనిక పార్టీ అయిన బీజేపీకి ఇలాంటి ప్రక్రియలు అనుకూలంగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీల ఆందోళనలో అర్థం ఉంది. రిమోట్ బూత్లున్న ప్రతిచోటా పోలింగ్ ఏజెంట్లను తెచ్చిపెట్టుకునే సామర్థ్యం వారికి ఉండదు. ఎన్నికల బరిలో ఉన్న పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్లు లేకుండా రిమోట్ ఓటింగ్ ప్రక్రియను నిర్వహించడం సరి కాదు. జగ్దీప్ చొకార్, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫారమ్స్ సహ వ్యవస్థాపకుడు ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి గంటలో 10 నుంచి 12% ఓట్లు పోలయినట్టు గుర్తించాం. అంటే ప్రతీ 25–30 సెకండ్లకి ఒక ఓటు పోలయినట్టు లెక్క. అదెలా సాధ్యం. ఒక ఓటు నమోదు కావడానికి కనీసం 60 సెకండ్ల సమయం పడుతుంది. ఈవీఎంలలో కళ్లకు కట్టినట్టు ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే ఆర్వీఎం అవసరం ఏమొచ్చింది..? జైరామ్ రమేష్, కాంగ్రెస్ ఎంపీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
Recession In India 2022: భారత్లో మాంద్యానికి ఆస్కారమే లేదు
న్యూఢిల్లీ: ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారుకోనుందన్న భయాలు నెలకొన్న నేపథ్యంలో భారత్లో అటువంటి పరిస్థితేమీ రాబోదని నీతి ఆయోగ్ మాజీ వైస్–చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల ప్రభావం భారత్పై పడినా .. దేశీయంగా మాంద్యం తలెత్తబోదని స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24)లో వృద్ధి రేటు 6–7 శాతం స్థాయిలో ఉంటుందని కుమార్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికా, యూరప్, జపాన్తో పాటు చైనా తదితర దేశాల్లో ఏకకాలంలో మందగమనం కనిపిస్తోందని, దీనితో రాబోయే నెలల్లో ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారుకునే అవకాశం ఉందని ఒక ఇంటర్వ్యూలో కుమార్ చెప్పారు. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం మరికొంత కాలం పాటు 6–7 శాతం స్థాయిలోనే ఉండవచ్చని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణం ఎక్కువగా అంతర్జాతీయ చమురు ధరలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతల కారణంగా క్రూడాయిల్ రేట్ల పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని, అలా కాకపోతే దేశీయ సానుకూల అంశాల కారణంగా ద్రవ్యోల్బణం దిగి రాగలదని కుమార్ చెప్పారు. ఎగుమతులపై దృష్టి పెట్టాలి.. వాణిజ్య లోటు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తులు, సర్వీసుల ఎగుమతులను పెంచుకోవడానికి తగిన విధానాలపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కుమార్ చెప్పారు. ఒక్కో రాష్ట్రంలో పరిస్థితి ఒక్కో రకంగా ఉన్నప్పుడు దేశం మొత్తానికి ఒకే ఎగుమతుల విధానం అమలుపర్చడం సరికాదన్నారు. సముద్ర తీరమే లేని పంజాబ్కు, శతాబ్దాలుగా సముద్ర వాణిజ్యం చేస్తున్న తీర ప్రాంత రాష్ట్రం తమిళనాడుకు ఒకే తరహా ఎగుమతుల విధానాలు పని చేయవని కుమార్ చెప్పారు. -
నిష్పక్షపాతంగానే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వందకు వంద శాతం నిష్పక్షపాతంగా విడుదల చేశామని, ఆలస్యం కావడం వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. గురువారం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన అనంతరం మీడియా చిట్చాట్లో ఆయన పాల్గొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు షెడ్యూల్ అంతా సవ్యంగానే ఉంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు రెండు వారాల గ్యాప్లోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాం. అయినప్పటికీ ఈ రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఒకే రోజు ఉంటుంది అని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికత.. గర్వించదగ్గ వారసత్వం. మేము 100 శాతం నిష్పక్షపాతంగా ఉన్నాం అని ప్రకటించారాయన. కొందరు ప్రతికూల వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తారు. కానీ, మాటల కంటే చర్యలు, ఫలితాలు ఎక్కువగా మాట్లాడతాయి. కొన్నిసార్లు, కమిషన్ను విమర్శించే పార్టీలు ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలను పొందాయి. ఈ కేసులో థర్డ్ అంపైర్ లేడు. కానీ ఫలితాలు సాక్ష్యంగా ఉంటాయి అని రాజీవ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్తో పాటు ఇతర ప్రధాన ప్రతిపక్షాలు గుజరాత్ షెడ్యూల్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన(దశల వారీగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగాయి) ముగిసే వరకు ఈసీ ఎదురు చూసిందని, తద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆటంకం ఎదురు కాకుండా పక్షపాతంగా వ్యవహరించిందని విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇవాళ ఎన్నికల సంఘం గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు కూడా కాంగ్రెస్-బీజేపీలు ఈసీ తీరుపై పరస్పరం ట్వీట్లు చేసుకున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్ అసెంబ్లీ కాలపరిమితి ఫిబ్రవరి 18వ తేదీతో ముగియనుండగా.. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కాలపరిమితి జనవరి 8వ తేదీతో ముగుస్తుంది. నిజానికి ఈ రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల తేదీలను ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. వాతావరణ పరిస్థితుల కారణంగా హిమాచల్కు కాస్త ముందుగా షెడ్యూల్ విడుదల చేసినట్లు ఈసీ వెల్లడించింది. మోడల్ ప్రవర్తనా నియమావళి 38 రోజుల పాటు అమలులో ఉంటుంది, ఇదే అతి తక్కువ వ్యవధి. అది ఢిల్లీ ఎన్నికల మాదిరిగానే ఉంటుందని రాజీవ్ కుమార్ తెలిపారు. అంతేకాదు.. అసెంబ్లీ కాలపరిమితికి కౌంటింగ్ డేకి మధ్య 72 రోజుల గ్యాప్ ఉందని గుర్తు చేశారాయన. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాతావరణం, అసెంబ్లీ చివరిరోజు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణంగా.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు ఒకేసారి వెలువడడం ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి, సమతుల్యంగా వ్యహరించాల్సిన అవసరం మాకు ఉంది అని సీఈసీ వెల్లడించారు. మోర్బి ప్రమాద బాధితుల కోసం వెలువడే ప్రకటనలు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉండవచ్చా? అనే ప్రశ్నకు.. ఏదైనా నిర్ణయం వల్ల స్థాయి ఆటంకం ఏర్పడితే, ఎన్నికల సంఘం చర్య తీసుకుంటుందని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. -
ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: దేశ 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10న ముగియనుంది. తదుపరి ఉపరాష్ట్రపతి ఆగస్టు 6న ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా లోక్సభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తారని తెలిపారు. రాజ్యసభ ఎక్స్–అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తున్న ఉపరాష్ట్రపతిని లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ప్రస్తుతం పార్లమెంట్ ఉభయసభల్లో కలిపి 788 మంది సభ్యులున్నారని ఈసీ వెల్లడించింది. వీరిలో 233 మంది రాజ్యసభ సభ్యులు, 12 మంది రాజ్యసభ నామినేటెడ్ సభ్యులు కాగా, 543 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు జూలై 5న నోటిఫికేషన్ జారీ చేస్తారు. జూలై 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 20న నామినేషన్లు పరిశీలిస్తారు. జూలై 22 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చు. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.15,000 చెల్లించాల్సి ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికను కేవలం పార్లమెంట్ ప్రాంగణంలోనే నిర్వహిస్తారు. పార్లమెంట్ ఉభయ సభల్లో పార్టీల బలాబలాలను బట్టి చూస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీయే అభ్యర్థి సునాయాసంగా గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికకు 115 నామినేషన్లు ఈ నెల 18న జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికకు ఇప్పటిదాకా 115 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 28 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల గడువు బుధవారంతో ముగిసిందని రాజ్యసభ సెక్రటేరియట్ వెల్లడించింది. గురువారం నామినేషన్లను పరిశీలిస్తారు. ప్రధాన అభ్యర్థులతోపాటు పలువురు సామాన్యులు కూడా నామినేషన్లు వేశారు. -
నూతన ఎన్నికల ప్రధాన కమిషనర్గా రాజీవ్కుమార్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల తదుపరి ప్రధాన అధికారిగా ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీ కాలం ఈ నెల 14తో ముగియనుంది. దీంతో ఎన్నికల కమిషనర్(ఈసీ)గా ఉన్న రాజీవ్ కుమార్ తదుపరి సీఈసీగా 15న బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆ నోటిఫికేషన్ను తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. రాజీవ్ కుమార్కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 నిబంధన (2) ప్రకారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా రాజీవ్ కుమార్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించారు. 15 మే, 2022 నుంచి ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉంటారు’’అని ఆ నోటిఫికేషన్ వెల్లడించింది. కొత్త సీఈసీగా రాజీవ్ కుమార్ 2025 ఫిబ్రవరి వరకు పదవిలో కొనసాగుతారు. 1960, ఫిబ్రవరి 19న జన్మించిన కుమార్కు 2025 నాటికి 65 ఏళ్లు పూర్తవుతాయి. సీఈసీ లేదంటే ఎన్నికల కమిషనర్లు ఆరేళ్లు లేదంటే వారికి 65 ఏళ్లు పూర్తి కావడం ఏది ముందైతే అంతవరకు పదవిలో ఉంటారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటుగా, 2024లో సార్వత్రిక ఎన్నికలు, మరి కొన్ని రాష్ట్రాల ఎన్నికలు రాజీవ్ పర్యవేక్షణలోనే జరగనున్నాయి. రాజీవ్ కుమార్ ఈసీలో చేరడానికి ముందు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ) చైర్పర్సన్గా ఉన్నారు. 2020, సెప్టెంబర్ 1న ఆయన ఈసీగా బాధ్యతలు స్వీకరించారు. రాజీవ్ కుమార్ బిహార్–జార్ఖండ్ కేడర్కు చెందిన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. రాజీవ్ స్థానంలో ఎన్నికల కమిషనర్గా మరొకరిని నియమించాల్సి ఉంది. -
భారత్ వృద్ధికి వ్యవ‘సాయం’
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి 2021–22 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం మంచి తోడ్పాటు ఇవ్వనుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. రికార్డు స్థాయి ఖరీఫ్ పంట, రబీ మంచి అవకాశాలు భారత్ స్థూల దేశీయాభివృద్ధిని (జీడీపీ) 10 శాతంపైకి తీసుకువెళతాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం పురోగతి గ్రామీణ డిమాండ్కు, తయారీ రంగం సామర్థ్యం మెరుగుదలకు దోహదపడతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నీతి ఆయోగ్ వార్తాలేఖ ‘అర్థనీతి’లో రాజీవ్ కుమార్ పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి... ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరలు, సరఫరాల సమస్యలు, ద్రవ్యోల్బణం సవాళ్లు ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. ► ఎగుమతుల్లో గణనీయమైన పురోగతి నమోదవుతోంది. 2021–22లో 400 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని దేశం సాధించే అవకాశం ఉంది. ఉపాధి కల్పనకూ ఎగుమతుల పురోగతి దోహదపడుతుందని విశ్వసిస్తున్నాం. ► వృద్ధి ధోరణికి కాంట్రాక్ట్ ప్రేరిత సేవలు దోహదపడతాయి. ► విస్తృత ప్రాతిపదికన వ్యాక్సినేషన్ వృద్ధికి తోడ్పాటును ఇచ్చే అంశం. తదుపరి వేవ్ వచ్చినా, నష్టం తక్కువగా చోటుచేసుకోవడానికి దోహపదడే అంశం ఇది. ► విద్యుత్ వినియోగం, రైల్వే రవాణా, జీఎస్టీ వసూళ్లు, ఈ–వే బిల్స్ విభాగాలు ఆర్థిక వృద్ధి రికవరీని సూచిస్తున్నాయి. ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 9.5 శాతంగా అంచనావేస్తుండగా, ఐఎంఎఫ్ అంచనా కూడా ఇదే స్థాయిలో ఉంది. -
అర్బన్ ప్లానింగ్ బలోపేతం కావాలి: నీతిఆయోగ్
సాక్షి, న్యూఢిల్లీ: అర్బన్ ప్లానింగ్ సామర్థ్యం పెంపునకు కీలక సంస్కరణలు అవసరమని నీతిఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. ‘అర్బన్ ప్లానింగ్ సామర్థ్యంలో సంస్కరణలు’ పేరుతో రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్కుమార్, సీఈవో అమితాబ్ కాంత్, ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ కె.రాజేశ్వర్ రావు గురువారం ఇక్కడ విడుదల చేశారు. 9 నెలల పాటు సంబంధిత మంత్రిత్వ శాఖలు, పట్టణ ప్రణాళిక, ప్రాంతీయ ప్రణాళికల నిపుణులతో చర్చించి నీతి ఆయోగ్ ఈ నివేదికను రూపొందించింది. ‘రానున్న కాలంలో పట్టణ భారతదేశం దేశ ఆర్థిక వృద్ధికి శక్తిని ఇస్తుంది. పట్టణ ప్రణాళిక సహా పట్టణ సవాళ్లు అధిగమించేందుకు అత్యున్నత విధానాలపై శ్రద్ధ అవసరం. పట్టణ ప్రణాళిక సామర్థ్యంలో ఉన్న అంతరాలను పూడ్చాల్సిన అవసరం ఉంది. లేదంటే వేగవంతమైన, సుస్థిరమైన, సమానమైన వృద్ధికి గల భారీ అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది..’ అని డాక్టర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ఉమ్మడి కృషితో దేశంలోని నగరాలు మరింత నివాసయోగ్యంగా, సుస్థిర నగరాలుగా మారుతాయి..’ అని సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. దేశంలోని 52 శాతం నగరాలకు మాస్టర్ ప్లాన్ లేదని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 3,945 టౌన్ ప్లానర్ పోస్టులకు గాను 42 శాతం ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. దేశంలో 12 వేలకు పైగా టౌన్ ప్లానర్ పోస్టులు అవసరమని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రాల టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ విభాగాల్లో సగటున నగరానికి ఒక ప్లానర్ కూడా లేరని నివేదిక పేర్కొంది. నివేదిక సిఫారసులు ► ఆరోగ్యకరమైన 500 నగరాలు: 2030 నాటికి ప్రతి నగరం అందరికీ ఆరోగ్యవంతమైన నగరం కావాలని ఆకాంక్షించాలి. ఈ దిశగా 500 హెల్తీ సిటీస్ ప్రోగ్రామ్ను ఐదేళ్ల పాటు అమలు చేసేలా కేంద్ర ప్రాయోజిత పథకాన్ని అమలు చేయాలి. ప్రాధాన్యత గల నగరాలు, పట్టణాలను రాష్ట్రాలు, స్థానిక సంస్థలు గుర్తించాలి. ► ప్రతిపాదిత హెల్తీ సిటీస్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని నగరాలు, పట్టణాల్లో భూమి లేదా ప్రణాళిక ప్రాంత సామర్థ్యాన్ని పెంచేందుకు శాస్త్రీయ ఆధారాల ప్రాతిపదికన అభివృద్ధి నియంత్రణ నిబంధనలు బలోపేతం చేయాలి. ► ప్రభుత్వ రంగంలో అర్బన్ ప్లానర్ల కొరత తీర్చేందుకు రాష్ట్రాలు టౌన్ ప్లానర్ల ఖాళీలను భర్తీ చేయాలి. అలాగే మరో 8,268 పోస్టులను లాటరల్ ఎంట్రీ పొజిషన్స్గా కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఐదేళ్లు ఉండేలా మంజూరు చేయడం ద్వారా కొరతను తీర్చాలి. ► పట్టణం, దేశ ప్రణాళిక విభాగాలు టౌన్ ప్లానర్ల కొరత ఎదుర్కొంటున్నందున రాష్ట్రాలు నియామక నిబంధనల్లో సవరణలు చేసి టౌన్ ప్లానింగ్ ఉద్యోగాల్లో అర్హులైన అభ్యర్థులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ► పట్టణాలు ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కరించేందుకు ప్రస్తుత పట్టణ ప్రణాళికా పాలనా నిర్మాణాన్ని రీ–ఇంజినీరింగ్ చేయాలి. ఇందుకు ఉన్నత స్థాయి కమిటీ రూపొందించాలి. ► పట్టణ, దేశ ప్రణాళిక చట్టాలను సమీక్షించి నవీకరించాలి. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో అపెక్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. ► మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో వివిధ దశల్లో పౌరులను భాగస్వాములను చేయాలి. ► సాంకేతిక కన్సల్టెన్సీ సేవలు సహా పలు అంశాల్లో ప్రయివేటు రంగం పాత్రను బలోపేతం చేయాలి. ► కేంద్రీయ విశ్వ విద్యాలయాలు, సాంకేతిక విద్యా సంస్థలు దశల వారీగా ప్లానింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులు అందించాలి. ► కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధమైన సంస్థగా ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్’ను నెలకొల్పాలి. ‘నేషనల్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్’ పోర్టల్ను ఏర్పాటు చేయడం ద్వారా టౌన్ ప్లానర్స్ రిజి్రస్టేషన్ చేసుకునే వెసులుబాటు కలి్పంచాలి. -
వివిధ రంగాల్లో ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తోంది: నీతి అయోగ్
-
ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తోంది: నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నీతి ఆయోగ్ వైస్ఛైర్మన్ రాజీవ్కుమార్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. గురువారం సాయంత్రం రాజీవ్కుమార్తో సమావేశమయ్యారు. గంటకుపైగా కొనసాగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్, పేదలకు ఇళ్ల నిర్మాణాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర నిధులు, సహకారంపై సీఎం జగన్ చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. పేదలందరికి ఇళ్ల పథకం కింద చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 30.76 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని, దీనికోసం 68,381 ఎకరాలు సేకరించామన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీతో 17,005 కొత్త కాలనీలు ఏర్పడ్డాయని, వీటి మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయడానికి రూ.34,109 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. ఈ ఏడాది కొత్తగా 15 లక్షలకుపైగా ఇళ్లు పేదలకోసం నిర్మిస్తున్నామని, మొత్తంగా 28.30 లక్షల ఇళ్లు పేదలకోసం నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఇంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మోయడం కష్టసాధ్యమని తెలిపారు. మౌలిక సదుపాయాలకు అయ్యే ఖర్చును పీఎంఏవైలో భాగంగా చేయాలని కోరారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ పాలనలోని ఏపీ అభివృద్ధిని రాజీవ్కుమార్ కొనియాడుతూ ట్వీట్ చేశారు. ‘పలు రంగాల్లో ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తోంది. 2020-21 సుస్థిర అభివృద్ధి రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది. ఏపీ వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవశ్యకతను సీఎం జగన్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, లక్ష్యాలను సీఎం జగన్ వివరించారు’ అని ఆయన ట్వీట్ చేశారు. చదవండి : పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వ వనరుల నుంచి నిధులు ఖర్చు చేస్తున్నాం Met with the Hon'ble Chief Minister of Andhra Pradesh @ysjagan, to understand the context of growth & development in the state; in the recently released @NITIAayog #SDGIndiaIndex for 20-21, #AndhraPradesh ranked third basis its stellar performance in multiple categories. pic.twitter.com/F9YLcF5ZGh — Rajiv Kumar 🇮🇳 (@RajivKumar1) June 10, 2021 -
కేంద్ర ఎన్నికల సంఘంలో కరోనా కలకలం
-
భేషుగ్గా పెట్టుబడుల ఉపసంహరణ
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రకటించినట్టుగా ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కేలండర్ సజావుగా కొనసాగుతుందన్న నమ్మకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కనబరిచారు. ఫిక్కీ సభ్యులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో పెద్ద ఎత్తున నిధులను వెచ్చించడం జరుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఫిక్కీ ట్వీట్ చేయగా, ఆర్థిక మంత్రి రీట్వీట్ చేశారు. 2021–22లో పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో రూ.1.75 లక్షల కోట్లను సమకూర్చుకుంటామని బడ్జెట్లో భాగంగా మంత్రి చెప్పడం గమనార్హం. బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయినర్ కార్పొరేషన్, ఐడీబీఐ, బీఈఎమ్ఎల్, పవన్హన్స్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్తోపాటు.. రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థలో వ్యూహాత్మక పెట్టుబడులను 2021–22 సంవత్సరంలో ఉపసంహరించుకోవాలన్న ప్రతిపాదనలను మంత్రి బడ్జెట్లో ప్రకటించారు. దీనికి తోడు ఎల్ఐసీ నుంచి అతిపెద్ద ఐపీవో రూపంలోనూ భారీగా నిధులు సమకూర్చుకోవాలనుకుంటోంది. ఏ వర్గంపైనా భారం వేయకుండానే.. భారత్లోని ఏ వర్గంపైనా భారం మోపలేదన్న విషయాన్ని మంత్రి సీతారామన్ గుర్తు చేశారు. ఆదాయం ఈ ఏడాది నుంచి మెరుగుపడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ.. పెట్టుబడుల ఉపసంహరణ మార్గంలోనే కాకుండా, పన్నేతర ఆదాయాన్ని సమకూర్చుకుంటూ అందుకు ఆస్తుల విక్రయాన్ని ప్రస్తావించారు. భారీగా నిధులను వ్యయం వెచ్చించాల్సి ఉండడంతో పన్నేతర ఆదాయ మార్గాలపై బడ్జెట్లో దృష్టి పెట్టినట్టు వివరించారు. ప్రభుత్వం ఒక్కటే పెద్ద ఎత్తున పెట్టుబడులతో ముందుకు వచ్చినా కానీ పెరుగుతున్న దేశ ఆకాంక్షలను తీర్చలేదంటూ ప్రైవేటు రంగం కూడా ముఖ్య భూమిక పోషించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ‘‘పన్నులు పెంచకుండా ఆదాయం పెంచుకునే మార్గాలను ప్రదర్శించిన భిన్నమైన బడ్జెట్ ఇది. ఔత్సాహిక వ్యాపార స్ఫూర్తిని ఇది పెంచుతుంది. పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు ముందుకు రావాలి. బడ్జెట్లో ప్రదర్శించిన స్ఫూర్తిని పరిశ్రమ అర్థం చేసుకుంటుందని భావిస్తున్నాను. పరిశ్రమ రుణ భారాన్ని దించుకుంది. కనుక ఇప్పుడిక విస్తరణపై మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధి దిశగా ప్రయాణించేందుకు సిద్ధం కావాలి’’ అని మంత్రి పిలుపునిచ్చారు. 2021–22లో రూ.34.83 లక్షల కోట్లను ప్రభుత్వం వ్యయాల కోసం కేటాయించడం గమనార్హం. త్వరలో మలి జాబితా.. ► నీతి ఆయోగ్ వైస్చైర్మన్ రాజీవ్ కుమార్ న్యూఢిల్లీ: పెట్టుబడుల ఉపసంహరణకు అనుకూలమైన ప్రభుత్వరంగ సంస్థల మలి జాబితాను వచ్చే కొన్ని వారాల్లో సిద్ధం చేయనున్నట్టు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్ తెలిపారు. ప్రతిపాదిత అస్సెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ మేనేజ్మెంట్ కంపెనీల ఏర్పాటు బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏల) సమస్యను పరిష్కరించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒకప్పుడు యూటీఐ మాదిరే ఇవి కూడా తమ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తాయని అభిప్రాయపడ్డారు. ఒక అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, ఒక అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. పెట్టుబడుల ఉపసంహరణపైనా ఆమె ప్రకటన చేశారు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు వీలుగా తదుపరి జాబితాను నీతి ఆయోగ్ రూపొందిస్తుందని సీతారామన్ పేర్కొనడం గమనార్హం. ఈ ప్రక్రియ మొదలైందని, కొన్ని వారాల్లోనే జాబితాను సిద్ధం చేస్తామని మోదీ చెప్పారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి పట్ల మోదీ సర్కారు ఎప్పటికప్పుడు తన అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనకు స్పందిస్తూ.. అన్ని పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల్లో ఈ సంస్కరణలు అజెండాగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. -
తక్కువ వ్యవధిలో ఫలితం ఇచ్చే ఇన్ఫ్రా ప్రాజెక్టులపై దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: తక్కువ వ్యవధిలో మంచి ఫలితాలను అందించే మౌలిక రంగం ప్రాజెక్టులపై తదుపరి దఫా ఉద్దీపనా చర్యలు దృష్టి సారించాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ గురువారం పేర్కొన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) నిర్వహించిన ఒక వెర్చువల్ కార్యక్రమంలో రాజీవ్ కుమార్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... వివిధ ఆర్థిక వ్యవస్థలు అంచనావేసిన తీవ్ర స్థాయిలో (10 నుంచి 15 శాతం వరకూ క్షీణ అంచనాలు) భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణత ఉండదని భావిస్తున్నాను. నాల్గవ త్రైమాసికంలో (జనవరి-మార్చి) స్వల్ప వృద్ధి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి ద్రవ్యపరమైన ప్రత్యక్ష మద్దతు సాధ్యంకాదు. ప్రభుత్వం అందించే పలు ఉద్దీపన చర్యలు భారత్ ఆర్థిక వృద్ధి సత్వర సాధనకు దోహదపడతాయి. కరోనా కష్టాల్లో ఉన్న పేద ప్రజలను రక్షించడానికి మార్చిలో కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేపీ) పథకాన్ని ప్రకటించింది. తరువాత మేలో రూ.20.97 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీని ప్రకటించింది. వారం క్రితం మూడవ ప్యాకేజీ ప్రకటించింది. దీనిప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కరోనా సమయంలో విహార యాత్రలకు వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి.. అందుకోసం ఇచ్చే లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) మొత్తాన్ని నగదుగా చెల్లించాలని నిర్ణయించింది. ఇది కాకుండా కేంద్రం వివిధ రంగాల మీద పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు రూ.12,000 కోట్లు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణాన్ని ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్యాకేజ్ విలువ దాదాపు రూ.40,000 కోట్లు ఉంటుందని అంచనా. మరో దఫా ఉద్దీపన ప్యాకేజ్ సంకేతాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇస్తున్నారు. మౌలిక రంగ ప్రాజెక్టులపై భారీ వ్యయాల ద్వారా వృద్ధికి తోడ్పాటును అందించవచ్చని పలు వర్గాలు కేంద్రానికి సలహాలను ఇస్తున్న నేపథ్యంలో రాజీవ్ కుమార్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. -
డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ ఫ్రెషర్లకు కొత్త విద్యా సంవత్సరం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు, సాంకేతిక విద్యా సంస్థల్లో చేరే కొత్తగా చేరే విద్యార్థులకు విద్యా సంవత్సరం ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కోవిడ్ నేపథ్యంలో ప్రవేశాల డెడ్లైన్ను పొడిగించినట్లు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల తుది గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించామని ఏఐసీటీఈ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను అమలు చేస్తూ ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా తరగతులను ప్రారంభించవచ్చని సూచిం చారు. కరోనా విజృంభణ కారణంగా మార్చి 16 నుంచి యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లు మూతపడిన సంగతి తెలిసిందే. వర్సిటీలు, కాలేజీల్లో ఫ్రెషర్లకు నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు యూజీసీ ఇటీవల అనుమతినిచ్చింది. తరగతులు ఆలస్యంగా ప్రారంభం అవుతున్న కారణంగా 2021లో వేసవి సెలవులను భారీగా కుదిస్తామని యూజీసీ పేర్కొంది. -
సంస్కరణలంటే కార్మిక చట్టాల రద్దు కాదు
న్యూఢిల్లీ: సంస్కరణలంటే కార్మిక చట్టాలను రద్దు చేయడం కాదనీ, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. కోవిడ్–19, లాక్డౌన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న వాణిజ్య కార్యకలాపాలు తిరిగి వేగవంతం చేసే చర్యల్లో భాగంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్మిక చట్టాల సవరణకు యత్నించడంపై ఆయన స్పందించారు. ‘అంతర్జాతీయ కార్మిక సంఘం(ఐఎల్వో)లో భారత్ సభ్యదేశం అయినందున కార్మిక చట్టాలను రద్దు చేయడం కుదరదని కేంద్రం తన వైఖరిని రాష్ట్రాలకు ఇప్పటికే స్పష్టం చేసింది. కార్మిక చట్టాల్లో సంస్కరణలు తేవడం అంటే పూర్తిగా ఆ చట్టాలను రద్దు చేయడం కాదు. ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను రక్షించేందుకు కట్టుబడి ఉంది’అని అన్నారు. -
స్థానికులే చేతులు కట్టేశారు
సాక్షి, విశాఖపట్నం/పెదవాల్తేరు (విశాఖ తూర్పు): నర్సీపట్నంలోని ప్రభుత్వాస్పత్రిలో మత్తు వైద్యుడిగా పనిచేస్తూ సస్పెండైన డాక్టర్ సుధాకర్ శనివారం సాయంత్రం మద్యం సేవించి స్థానికులు, పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో స్థానికులే చేతులు కట్టేశారని అడిషనల్ డీజీపీ, విశాఖ నగర పోలీస్ కమిషనర్ రాజీవ్కుమార్ మీనా ఆదివారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. డాక్టర్ సుధాకర్పై 353, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు డాక్టర్ను లాఠీతో కొట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశామని చెప్పారు. వైద్యుల పరిశీలనలో సుధాకర్ డాక్టర్ సుధాకర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి తెలిపారు. ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆయన ‘ఎక్యూట్ హ్యాండ్ యాడ్ కామెంట్ సైకోసిస్’ సమస్యతో బాధపడుతున్నారని చెప్పారు. ఇదిలావుండగా, డాక్టర్ సుధాకర్ తల్లి కావేరిభాయి ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడిపై అన్యాయంగా పిచ్చివాడిగా ముద్ర వేశారని ఆరోపించారు. -
కోవిడ్-19 : ఆపత్కాలంలో ఆశాకిరణం..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా దాదాపు 400 జిల్లాల్లో కోవిడ్-19 ఉనికి లేదని నీతిఆయోగ్ ఉపాధ్యక్షులు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. మహారాష్ట్ర సహా మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభించినా 400 జిల్లాల్లో దీని జాడ లేకపోవడం ఆశాకిరణంలా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ముంబై మహానగరం కరోనావైరస్కు కేంద్రంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం మొత్తం పాజిటివ్ కేసుల్లో 80 శాతం ఉన్న 62 జిల్లాల్లో లాక్డౌన్ను పొడిగించవచ్చని భావిస్తున్నారు. కాగా, ఈ వారాంతంలోగా మహమ్మారి కట్టడికి పదునైన వ్యూహం రూపొందించాల్సిన అవసరం ఉందని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఏప్రిల్ 14తో లాక్డౌన్ ముగుస్తున్న క్రమంలో లాక్డౌన్ విరమణకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్రాలతో కేంద్రం చర్చలు జరుపుతోందని ఆయన వెల్లడించారు. లాక్డౌన్ విరమణ వ్యూహాన్ని రూపొందించి అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలదే కీలక పాత్ర ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ ప్రణాళికపై జిల్లా అధికార యంత్రాంగాలు దృష్టిసారించాల్సి ఉంటుందని అన్నారు. ప్రాణాంతక వైరస్ కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పారు. ప్రజల ప్రాణాలు..వారి జీవనోపాధి మధ్య సరైన సమతూకం పాటించేలా అధికారులు వ్యవహరించాలని ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. చదవండి : కరోనా : కూతుర్ని దగ్గరకు తీసుకోలేక.. -
న్యూ ఇయర్ పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తే...
సాక్షి, విశాఖ : నూతన సంవత్సర వేడుకల పేరుతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా తెలిపారు. మంగళవారం సాక్షితో ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సర వేడుకలకు పకడ్బందీగా బందోబస్తు చేశామని పేర్కొన్నారు. 3400 మంది పోలీసులతో విశాఖ నగరంలో అడుగడుగునా భద్రతా ఏర్పాటు చేశామని వెల్లడించారు. విశాఖ వాసులు ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవచ్చని అన్నారు. బీచ్ రోడ్ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపుతోపాటు ముందుగానే కొన్ని పార్కింగ్ స్థలాలు కేటాయించామని తెలిపారు. బీచ్ రోడ్డులోకి ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదని, న్యూ ఇయర్ వేడుకలకు అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతి ఉందని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. -
అమరావతి : సీఎం జగన్తో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ
-
సీఎం జగన్తో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ శుక్రవారమిక్కడ సమావేశమయ్యారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు అమలుపై చర్చిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. సమావేశం తర్వాత అమరావతిలోని పెట్టుబడి అవసరం లేని ప్రకృతి సాగు క్షేత్రాలను (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్) రాజీవ్ కుమార్ పరిశీలించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విచారణకు కోల్కతా మాజీ చీఫ్ డుమ్మా
కోల్కతా: శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సోమవారం సీబీఐ ఎదుట విచారణకు గైర్హాజరయ్యారు. తాను మూడు రోజులపాటు సెలవులో ఉన్నానని, వ్యక్తిగత కారణాల వల్ల వారం రోజుల వరకు హాజరు కాలేనని రాజీవ్ కుమార్ సీబీఐకి రాసిన లేఖను.. ఓ సీఐడీ అధికారి ఇక్కడి సాల్ట్ లేక్లోని సీబీఐ కార్యాలయంలో అందజేశారు. పలుమార్లు రాజీ వ్కు కాల్ చేసినా ఆయన వైపు నుంచి స్పందన లేదని సీబీఐ అధికారి ఒకరు చెప్పారు. అయినా వెనక్కి తగ్గకుండా కోల్కతాలోని రాజీవ్ అధికారిక నివాసానికి సీబీఐ అధికారుల బృందం వెళ్లగా ఆయన నివాసంలో లేరు. శనివారం రాజీవ్ దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
కోల్కతా మాజీ చీఫ్పై లుకౌట్ నోటీసు
న్యూఢిల్లీ: శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్కు గట్టి షాక్ తగిలింది. రాజీవ్ దేశం విడిచి వెళ్లకుండా ఆదివారం ఆయనపై సీబీఐ లుకౌట్ నోటీసు జారీ చేసింది. ఈమేరకు అన్ని ఎయిర్పోర్టులు, ఇమిగ్రేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రూ.2,500 కోట్ల శారదా కుంభకోణం దర్యాప్తు వ్యవహారంపై సీబీఐ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘రాజీవ్కు తప్పనిసరిగా నిర్బంధ విచారణ అవసరం. ఆయన దర్యాప్తునకు సహకరించకుండా సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఆయన్ని ప్రశ్నించే సమయంలో అహంకారంతో వ్యవహరిస్తున్నారు’ అని సీబీఐ ఆరోపించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాజీవ్ కుమార్ 27వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతోపాటు ఆయన్ను అరెస్టు చేయకుండా ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ‘ఈ కేసులో వేసిన సిట్ దర్యాప్తు సంస్థకు రాజీవ్ కుమార్ అప్పుడు ఇన్చార్జిగా ఉన్నారు. కుంభకోణానికి సంబంధించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, పలువురు నేతల కీలక ఆధారాలను బాధితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను ఫోరెన్సిక్ పరీక్షకు పంపకుండా ఆధారాలను నాశనం చేశారు’ అని సీబీఐ తెలిపింది. -
శారదా చిట్ఫండ్ కేసులో కొత్త మలుపు
కోల్కతా : శారదా చిట్ఫండ్ కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక పత్రాలు మాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్కతా మాజీ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ రాజీవ్కుమార్కు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. రాజీవ్ కుమార్ను కస్టడీలోకి తీసుకునేందుకు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఆయన కస్టడీపై ఉన్న స్టేను ఎత్తివేస్తూ.. రాజీవ్కుమార్ను విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవేళ ఆయన విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేయవచ్చని సీబీఐకి సూచించింది. దీంతో రాజీవ్ కుమార్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు సీబీఐ సన్నాహాలు చేపట్టింది. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం రాజీవ్ కుమార్ వారంలోపు పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా గతంలో విచారణకు వచ్చిన సీబీఐని మమతా సర్కార్ అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారన్న కారణంతో ఈ నెల 15న రాజీవ్ కుమార్ను ఆ రాష్ట్ర సీఐడీ డీజీ బాధ్యతల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తప్పించింది. దీంతో ఆయన నిన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో రిపోర్టు చేశారు. శారదా గ్రూప్ పేరుతో 200 ప్రయివేటు కంపెనీలు నడిపిన పొంజీ స్కీం దివాళా తీయడంతో కోటి 70 లక్షలమంది డిపాజిటర్ల బతుకులు రోడ్లమీద పడ్డ విషయం విదితమే. -
ఎన్నికల నిబంధనల్ని రాజీవ్ ఉల్లంఘించారు
న్యూఢిల్లీ: ‘న్యాయ్’ పథకంపై చేసిన విమర్శలకు నీతిఆయోగ్ వైస్చైర్మన్ రాజీవ్కుమార్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. రాజీవ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలిపింది. భవిష్యత్లో ఇలాంటి అంశాలపై ఆచితూచి స్పందించాలని సూచించింది. ప్రభుత్వ అధికారులు నిష్పాక్షికంగా ఉండాలనీ, అది వారి ప్రవర్తనలో కన్పించాలని వ్యాఖ్యానించింది. రాజీవ్ విషయంలో అది కొరవడిందని చురకలు అంటించింది. నిరుపేద కుటుంబాలకు కనీస ఆదాయ భద్రత(న్యాయ్) కింద ఏటా రూ.72 వేలు అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించడం తెల్సిందే. ఇలాంటి పథకాల వల్ల ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందన్న కుమార్ వ్యాఖ్యలపై ఈసీ పైవిధంగా స్పందించింది. యోగికి ఈసీ మందలింపు భారత సైన్యం మోదీ సేనగా పేర్కొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఈసీ మందలించింది. భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఎలాంటి శిక్ష విధించకుండానే వదిలిపెట్టినట్లు తెలిసింది. సీనియర్ నేత అయిన యోగి మాటలు ఆయన హోదాను ప్రతిబింబించేలా ఉండాలంది. ఆదివారం ఘజియాబాద్లో ఎన్నికల ప్రచారంలో యోగి మాట్లాడుతూ ‘ కాంగ్రెస్ నాయకులు ఉగ్రవాదులకు బిర్యానీ తినిపిస్తారు. కానీ మోదీ సైన్యం తూటాలు, బాంబులతో బదులిస్తుంది’ అని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. -
కనీస ఆదాయ పధకం అసాధ్యం : నీతి ఆయోగ్
సాక్షి, న్యూఢిల్లీ : తాము అధికారంలోకి వస్తే దేశంలోని ఐదు కోట్ల పేద కుటుంబాలకు వారి బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ 72,000 జమ చేస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై నీతి ఆయోగ్ పెదవివిరిచింది. ఈ పధకానికి బడ్జెట్లో 13 శాతం నిధులు అవసరమవుతాయని, దీని అమలు అసాధ్యమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. పనిచేయకుండా ఎవరికైనా భారీగా నగదు బదిలీ చేయడం ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి దారితీస్తుందని ఈ పధకం ఎన్నడూ అమలుకు నోచుకోదని పెదవివిరిచారు. జీడీపీలో రెండు శాతం, బడ్జెట్లో 13 శాతం కనీస ఆదాయ హామీ పధకానికి ఖర్చవుతాయని, ఇంతటి వ్యయంతో వీటిని అమలు చేస్తే ప్రజల వాస్తవ అవసరాలు మరుగునపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ 1971లో గరీబీ హఠావో, 2008లో ఒన్ ర్యాంక్ ఒన్ పెన్షన్, 2014లో ఆహార భద్రత నినాదాలతో ఎన్నికల సమరాంగణంలో నిలిచినా వాటి అమలు మాత్రం సాధ్యం కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన కనీస ఆదాయ హామీ పధకానికీ ఇదే గతి పడుతుందని ఆయన ట్వీట్ చేశారు. -
మూడోరోజూ సీబీఐ విచారణలో రాజీవ్ కుమార్
షిల్లాంగ్: శారద చిట్ఫండ్ కుంభకోణానికి సంబంధించి కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కునాల్ ఘోష్ విచారణ నిమిత్తం సోమవారం షిల్లాంగ్లోని సీబీఐ ఎదుట హాజరయ్యారు. వరుసగా మూడు రోజులుగా రాజీవ్కుమార్ను రెండ్రోజులుగా కునాల్ ఘోష్ను సీబీఐ విచారిస్తోంది. ఘోష్ సోమవారం ఉదయం పది గంటలకు సీబీఐ కార్యాలయానికి హాజరుకాగా, గంట తర్వాత రాజీవ్ కుమార్ వచ్చారు. ఆదివారం కూడా వీరిద్దరినీ వేర్వేరుగా పలు కోణాల్లో ఎనిమిది గంటలపాటు ప్రశ్నించినట్లు సీబీఐకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. శారద చిట్ఫండ్ కుంభకోణంకు సంబంధించిన కీలక ఆధారాలను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై ముగ్గురు సీబీఐ అధికారులు రాజీవ్ కుమార్ను శనివారం సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సీబీఐ విచారణను పర్యవేక్షించేలా ఆదేశించలేం: సుప్రీం శారదా కుంభకోణం విచారణను ప్రత్యక్షం గా పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. శారద చిట్ఫండ్ కుంభకోణంపై సీబీఐ విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా తాము ఆదేశించలేమ ని జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం స్పష్టం చేసింది. -
‘శారదా’ స్కాం కేసులో సుప్రీం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించాలంటూ దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. కాగా శారదా గ్రూప్ పేరుతో 200 ప్రయివేటు కంపెనీలు నడిపిన పొంజీ స్కీం దివాళా తీయడంతో కోటి 70 లక్షలమంది డిపాజిటర్ల బతుకులు రోడ్లమీద పడిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ప్రముఖులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఆధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలతో కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. మరోవైపు శారదా కుంభకోణంతో సంబంధమున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కునాల్ ఘోష్ కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు. -
సీబీఐ ఎదుట కోల్కతా పోలీస్ బాస్
షిల్లాంగ్ : కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శారదా చిట్ఫండ్, రోజ్ వ్యాలీ కుంభకోణం కేసులో రాజీవ్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్న సాయంత్రమే షిల్లాంగ్ చేరుకున్నారు. షిల్లాంగ్లోని సీబీఐ కార్యాలయంలో రాజీవ్ కుమార్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ శారదా చిట్ఫండ్ కేసులో రాజీవ్ కుమార్ నివాసంలో సోదాలకు వెళ్లిన సీబీఐ అధికారులను నిర్బంధించడం, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళనకు దిగిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరోవైపు తమ దర్యాప్తుకు రాజీవ్ కుమార్ సహకరించడం లేదని సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో 1989 బ్యాచ్కు చెందిన రాజీవ్ కుమార్ సీబీఐ విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కూడా. మరోవైపు శారదా కుంభకోణంతో సంబంధం ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కునాల్ ఘోష్ను కూడా ఆదివారం షిల్లాంగ్లో జరిగే విచారణకు హాజరు కానున్నారు. -
ఏకకాల ఎన్నికలే ఉత్తమం
న్యూఢిల్లీ: లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై విస్తృత చర్చ జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వృద్ధి రేటును రెండంకెలకు తీసుకెళ్లడం భారత్ ముందున్న ప్రధాన సవాలని, అందుకోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నీతిఆయోగ్ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ భేటీకి 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక లెఫ్టినెంట్ గవర్నర్ హాజరయ్యారు. సమావేశంలో సీఎంలు వెలిబుచ్చిన అభిప్రాయాల్ని, సలహాల్ని విధాన నిర్ణయాల అమలులో పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాని హామీనిచ్చారు. ముఖ్యమంత్రుల ప్రసంగం అనంతరం మోదీ ముగింపు ఉపన్యాసం చేస్తూ.. ‘లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై విస్తృత స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరపాలి. దీనివల్ల ఖర్చును ఆదా చేయవచ్చు. అదే సమయంలో వనరుల్ని సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది’ అని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఏకకాలంలో ఎన్నికల అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ.. నీతి ఆయోగ్ భేటీలో పునరుద్ఘాటించారు. విధానాల రూపకల్పనలో సీఎంల పాత్ర కీలకమని ఆయన ప్రశంసించారు. ఫలితం ఆధారంగా కేటాయింపులు జరిగేలా, ఖర్చుల్లో సవరణల కోసం 15వ ఆర్థిక సంఘానికి సలహాలు ఇవ్వాలని ముఖ్యమంత్రుల్ని కోరారు. ‘భారత్లో సామర్థ్యం, వనరుల కొరత లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. కేంద్రం నుంచి రాష్ట్రాలు రూ. 11 లక్షల కోట్లు అందుకుంటాయి. గత ప్రభుత్వం చివరి సంవత్సరంలో ఇచ్చిన దానికంటే రూ. 6 లక్షల కోట్లు ఎక్కువ ఇస్తున్నాం’ అని మోదీ చెప్పారు. వరద పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు కేంద్రం నుంచి అన్ని రకాల సాయాన్ని అందచేస్తామని భరోసా నిచ్చారు. అభివృద్ధి కోసం నీతి ఆయోగ్ మంచి వేదిక 2017–18 నాలుగో త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.7 శాతంగా ఉందని, ఈ వృద్ధి రేటును రెండంకెల స్థాయికి తీసుకెళ్లడం మన ముందున్న సవాలని, అందుకోసం అనేక చర్యల్ని చేపట్టాల్సి ఉందని ప్రధాని పేర్కొన్నారు. త్వరలోనే భారత్ 5 ట్రిలియన్ డాలర్ల(రూ. 3.4 కోట్ల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాలని ప్రపంచం ఆశిస్తుందని చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, వెనకబడ్డ జిల్లాల (ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్) అభివృద్ధి, ఆయుష్మాన్ భారత్, మిషన్ ఇంద్రధనుష్, పౌష్టికాహార మిషన్, మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు తదితర అంశాల్ని మోదీ ప్రస్తావించారు. ‘2020 నాటికి నవభారత లక్ష్యాన్ని చేరుకునేందుకు తగిన చర్యలు తప్పనిసరి’ అని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో చారిత్రక మార్పులు తీసుకువచ్చేందుకు నీతి ఆయోగ్ పాలక మండలి మంచి వేదిక అని కితాబునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును ప్రస్తావించిన ప్రధాని స్వచ్ఛ్ భారత్ మిషన్, డిజిటల్ లావాదేవీలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై విధానాల రూపకల్పనలో సబ్ గ్రూపులు, కమిటీల ద్వారా ముఖ్యమంత్రులు కీలక పాత్ర పోషించారని మోదీ గుర్తుచేశారు. ఈ సబ్ గ్రూపులు చేసిన సిఫార్సుల్ని కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు పరిగణనలోకి తీసుకున్నాయని ఆయన చెప్పారు. ‘ఆయుష్మాన్ భారత్’ కింద దేశంలో 1.5 లక్షల వైద్య, సంరక్షణ కేంద్రాల్ని నిర్మిస్తున్నాం. ఈ పథకంలో 10 కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ. 5 లక్షల వరకూ ఆరోగ్య బీమాను అందిస్తాం. విద్య కోసం ‘సమగ్ర శిక్షా అభియాన్’ కింద సమగ్ర విధానాన్ని అమలుచేస్తున్నాం. ముద్రా యోజన, జన్ధన్ యోజన, స్టాండప్ ఇండియాలు ప్రజల ఆర్థిక అవసరాలకు చేయూతగా ఉంటున్నాయి’ అని ప్రధాని చెప్పారు. దేశంలో అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న(ఆస్పిరేషనల్) 115 జిల్లాల్లో అన్ని విధాల అభివృద్ధి సాధించాల్సిన అవసరముందని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం, పెట్టుబడిని తగ్గించి పంటల దిగుబడిని పెంచే విధంగా సూచనలు చేయాలని బిహార్, ఆంధ్రప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్తో పాటు పలు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని సూచించారు. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని నీతి ఆయోగ్కు సూచన సమావేశంలో వ్యక్తమైన సలహాల్ని విధానపర నిర్ణయాలు తీసుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటామని మోదీ హామీనిచ్చారు. అమలు చేయదగ్గ సలహాలు, సూచలనపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని నీతి ఆయోగ్కు ఆయన సూచించారు. సమావేశంలో కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఒడిశా, జమ్మూ కశ్మీర్, ఢిల్లీ తదితర రాష్ట్రాల సీఎంలు గైర్హాజరయ్యారు. సమావేశం అనంతరం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. బిహార్, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన అన్ని హామీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారన్నారు. గత నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం 7.7 కోట్ల మరుగుదొడ్లను నిర్మించిందని, మహాత్మా గాంధీ 150 వ జయంతి వేడుకల నాటికి దేశంలో 100 శాతం పారిశుధ్యం సాధించాలని ఆకాంక్షించారన్నారు. ఢిల్లీ సంక్షోభాన్ని పరిష్కరించండి ప్రధానికి నలుగురు సీఎంల విజ్ఞప్తి ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, ఆమ్ ఆద్మీ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న గొడవలో జోక్యం చేసుకోవాలని పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. నీతి ఆయోగ్ పరిపాలక మండలి సమావేశం వేదికగా.. మమతా బెనర్జీ, చంద్రబాబు, కుమారస్వామి, పినరయి విజయన్లు ఢిల్లీ సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరారు. ‘నాతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ సీఎంలు ఢిల్లీ ప్రభుత్వ సమస్యల్ని తక్షణం పరిష్కరించాలని ప్రధానిని కోరాం. అయితే ప్రధాని మోదీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఆ విషయాన్ని పరిశీలిస్తానని హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు’ అని సమావేశం అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. శనివారం ఈ నలుగురు సీఎంలు అరవింద్ కేజ్రీవాల్కు మద్దతు తెలపడంతో పాటు.. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న కేజ్రీవాల్ను కలుసుకునేందుకు ప్రయత్నించారు. ఢిల్లీలో కొనసాగుతున్న సంక్షోభాన్ని ప్రధాని మోదీ వద్ద ప్రస్తావిస్తామని విలేకరుల సమావేశంలో వారు వెల్లడించారు. నెలరోజుల్లో ‘నవభారత’ పత్రం న్యూఢిల్లీ: ‘నవభారతం 2022’ నిర్మాణానికి సంబంధించిన అభివృద్ధి ఎజెండా పత్రాన్ని నెలరోజుల్లో సిద్ధం చేయనున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ఈ పత్రానికి తుదిరూపునిచ్చాక.. అభిప్రాయాలు, స్పందనల కోసం రాష్ట్రాలకు పంపిస్తామని సమావేశంలో వెల్లడించింది. గత సమావేశంలో పేర్కొన్నదాని ప్రకారం ఈ భేటీలో ఈ పత్రాన్ని రాష్ట్రాలకు అభిప్రాయాల కోసం ఇవ్వాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో నెలరోజులు ఆలస్యం కానుందని నీతి ఆయోగ్ అధికారులు తెలిపారు. ‘నవభారతం 2022 అభివృద్ధి ఎజెండా రూపకల్పన చివరి దశలో ఉంది. అందువల్లే నేటి సమావేశంలో దీన్ని ఇవ్వలేకపోతున్నాం. క్షేత్రస్థాయిలో జరగాల్సిన మార్పులను ఈ ప్రతిపాదన ప్రతిబింబించాలని కోరుకుంటున్నాం. ఇది దాదాపుగా సిద్ధమైనట్లే. త్వరలోనే అభిప్రాయాల కోసం ఈ డాక్యుమెంటును రాష్ట్రాలకు పంపిస్తాం. ఆ తర్వాత విస్తృతమైన చర్చలు జరుగుతాయి. నెల, నెలన్నరలో ఇది అంతా పూర్తవుతుంది’ అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. మూడేళ్లు, ఏడేళ్లు, 15 ఏళ్ల లక్ష్యాలను ఏర్పర్చుకుని వీటిని చేరుకునేందుకు దార్శనిక పత్రాల (విజన్ డాక్యుమెంట్) రూపకల్పన ప్రణాళికలను నీతి ఆయోగ్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 2022 నాటికి (దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు) దేశం ఆరు ప్రధాన సమస్యల (పేదరికం, చెత్త, అవినీతి, ఉగ్రవాదం, కులతత్వం, మతతత్వం) నుంచి విముక్తమయ్యేలా పనిచేయాలని గతేడాది ప్రజెంటేషన్లో నీతి ఆయోగ్ పేర్కొంది. మీడియాతో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్కాంత్, ఉపాధ్యక్షుడు రాజీవ్కుమార్ -
రిస్కుల్ని ఎలా ఎదుర్కొంటారు?
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు భారీ కుంభకోణం నేపథ్యంలో.. రిస్కులను ఎదుర్కొనడంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) సత్తాను సమీక్షించడానికి ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది. ఇందులో భాగంగా.. నిర్వహణపరమైన, సాంకేతిక రిస్కులను ముందస్తుగానే గుర్తించేందుకు, సమర్థంగా ఎదుర్కొనేందుకు అవి ఎంత మేర సిద్ధంగా ఉన్నాయో పరిశీలించనుంది. పెరుగుతున్న రిస్కులను ఎదుర్కొనడానికి అవి ఎంత సిద్ధంగా ఉన్నాయో... ఆ సన్నద్ధతను మెరుగుపరచుకోవటానికి ఏం చర్యలు తీసుకుంటున్నాయో తెలియజేయాలని బ్యాంకుల్ని ఆదేశించింది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలంటూ పీఎస్బీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఈడీ), చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ల(సీటీవో)ను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. ఇందుకు 15 రోజుల గడువు విధించింది. కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్.. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్వీటర్లో ఈ విషయాలను ట్వీట్ చేశారు. ఈడీ, సీటీవోలతో కమిటీ... కేంద్ర ఆర్థిక శాఖ సూచనల ప్రకారం.. ప్రతీ పీఎస్బీ.. తమ తమ ఈడీ, సీటీవోలతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉత్తమ విధానాల గురించి తెలుసుకోవడంతో పాటు.. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న బలహీనతలు, లోపాలను ఈ కమిటీ గుర్తించాలి. ఆ తర్వాత నిర్వహణపరమైన రిస్కులను ఎదుర్కొనటంలో బ్యాంకింగ్ రంగంలోని ఉత్తమ విధానాలు.. తమ బ్యాంకు పాటిస్తున్న విధానాలను పోల్చి చూడాలి. ఏయే అంశాల్లో తాము వెనుకబడి ఉన్నామో, మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందో పరిశీలించాలి. మొత్తం మీద ఉత్తమ బ్యాంకింగ్ విధానాలు, కనీస ఆమోదయోగ్య ప్రమాణాలతో ఈడీలు, సీటీవోలు నివేదికలు తయారు చేయాలి. సాంకేతిక పరిష్కార మార్గాలతో సహా కార్యాచరణ ప్రణాళికను వాటిలో పొందుపర్చాలి. -
భారీ స్కాం : 10 మంది బ్యాంకు ఉద్యోగులు సస్పెండ్
దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో అతిపెద్ద కుంభకోణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తన ముంబై బ్రాంచులో దాదాపు రూ.11,359 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు బ్యాంకు తేల్చింది. డైమండ్ మెర్చంట్ నిరవ్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు, బిజినెస్ పార్టనర్ మెహల్ చోక్సి ఈ స్కాంకు పాల్పడినట్టు బ్యాంకు ఆరోపిస్తోంది. ఈ కుంభకోణంలో భాగంగా 10 మంది ఉద్యోగులను పీఎన్బీ సస్పెండ్ చేసినట్టు బ్యాంకింగ్ సెక్రటరీ రాజీవ్ కుమార్ తెలిపారు. దీనిపై లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ సీబీఐ విచారణ చేపట్టింది. మొండి బకాయిలను గుర్తించడానికి ఈ విచారణ సహకరిస్తుందని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. తన బ్యాంకులో దాదాపు రూ.11,359 కోట్లకు పైగా విలువైన మోసపూరిత లావాదేవీలను గుర్తించినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొంది. కొంతమంది అకౌంట్ హోల్డర్స్ ప్రయోజనార్థం ముంబైలోని ఓ బ్రాంచులో ఈ మోసపూరిత లావాదేవీలు జరిగాయని తెలిపింది. ఈ నగదును విదేశీ అకౌంట్లకు తరలించినట్టు కూడా ధృవీకరించింది. ఈ కుంభకోణం వల్ల బ్యాంకుకు ఏ మేర నష్టం వాటిల్లుతుందో పీఎన్బీ వెల్లడించలేదు. కాగ, ఇదే బ్యాంకుకు సంబంధించి రూ.280 కోట్ల చీటింగ్ కేసులో భాగంగా అత్యంత ధనికవంతుల్లో ఒకరైన సెలబ్రిటీ జువెల్లరీ నిరవ్ మోదీని గతవారమే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. భారీ నష్టాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు షేర్లు ఈ వార్తల నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు షేర్లు బుధవారం మధ్యాహ్నం అమాంతం పడిపోయాయి. పీఎన్బీ ముంబయి బ్రాంచ్లో దాదాపు రూ.11,359 కోట్ల మేర భారీ కుంభకోణం జరిగినట్లు వార్తలు రావడంతో ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నట్టు విశ్లేషకులు చెప్పారు. రూ.160 షేరు విలువతో బీఎస్ఈలో ట్రేడింగ్ ప్రారంభించిన పీఎన్బీ మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 8శాతం పడిపోయింది. ప్రస్తుతం ఆ బ్యాంక్ షేరు విలువ రూ.150 వద్ద కొనసాగుతోంది. బ్యాంకు షేర్లు ఈ మేర నష్టపోతుండటంతో, పీఎన్బీ ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే దాదాపు రూ.3వేల కోట్ల సంపదను కోల్పోయారు. -
అర్హులకు సులభంగా బ్యాంకు రుణాలు
న్యూఢిల్లీ: ప్రస్తుతం అమలు చేస్తున్న సంస్కరణలతో నిజాయితీగల రుణగ్రహీతలు.. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) నుంచి రుణాలు పొందడం సులభం కాగలదని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. నిజాయితీకి పెద్ద పీట వేయడమనేది ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ప్రక్రియ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ఆయన చెప్పారు. కచ్చితంగా అవసరం ఉండి, నిజాయితీగా వ్యవహరించే రుణగ్రహీతలకు ఏ ఆటంకాలూ లేకుండా రుణాలు లభించేలా చూడటం ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ‘‘జీఎస్టీ రిటర్నులు, వివిధ ఫైనాన్షియల్ టెక్నాలజీ సాధనాలు రుణగ్రహీతల ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా రుణమివ్వటంపై బ్యాంకులు నిర్ణయం తీసుకోవచ్చన్నారు. మదింపు ప్రక్రియ కఠినతరం చేయడం వల్ల రుణాలను రాబట్టుకునే ప్రక్రియ మెరుగుపడుతుంది’’ అని కుమార్ వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏకంగా రూ. 8 లక్షల కోట్ల మేర మొండిబాకీలు పేరుకుపోయిన నేపథ్యంలో రాజీవ్ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మొండిబాకీలతో కుదేలైన పీఎస్బీలను గట్టెక్కించేందుకు కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం రూ. 88,139 కోట్ల మేర అదనపు మూలధనాన్ని అందిస్తోంది. అయితే, నిర్దేశిత సంస్కరణలు అమలు చేయడాన్ని బట్టి కేటాయింపులు ఉంటాయంటూ షరతు విధించిన సంగతి తెలిసిందే. -
రాష్ట్రాల మధ్య చిచ్చు పెడతారా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య చిచ్చుపెట్టేలా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్కుమార్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని ఆంధ్రా వాళ్లు ఏపీలోనే పన్నులు చెల్లిస్తే అక్కడి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందంటూ రాజీవ్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. రాజీవ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ను మొత్తం సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసినట్టుగా చెప్పుకోవడం బాధాకరమన్నారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ చంద్రబాబు ఎవరికి వారు సొంత డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. -
‘వార్షిక గణాంక దర్శిని’ని ఆవిష్కరించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 31 జిల్లాల్లోని ప్రభుత్వ విభాగాల సమగ్ర వివరాలతో కూడిన ‘వార్షిక గణాంక దర్శిని– 2017’ను సీఎం కేసీఆర్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ బుధవారం ఆవిష్కరించారు. బేగంపేటలోని ప్రగతి భవన్లో రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ రమేశ్ చంద్లతో కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని కొత్త కార్యక్రమాలు మినహాయించి జాతీయ అభివృద్ధి విషయాలపై చర్చించారు.28 అంశాలతో ప్రచురించిన వార్షిక గణాంక దర్శినిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రణాళిక విభాగ వైస్ చైర్మన్ ఎస్ నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఏకే గోయల్, జీఆర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, బీపీ ఆచార్య, నీతి ఆయోగ్ సలహాదారు అశోక్ జైన్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ అగ్రనేతపై పోలీసు అధికారి దావా
కోల్ కతా: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వార్గియాపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు పరువు నష్టం దావా వేశారు. తనపై కైలాశ్ నిరాధార, అసత్య ఆరోపణలు చేశారనే కారణంతో కోల్ కతా నగర పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులను కాపాడేందుకు రాజీవ్ కుమార్ ప్రయత్నించారని జనవరి 4న కైలాశ్ ఆరోపణలు చేశారు. ఈ కేసులో కీలక పత్రాలను కమిషనర్ నాశనం చేశారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోల్కతా నగర సెషన్స్ కోర్టులో కైలాశ్ పై రాజీవ్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ సుభ్ర ఘోష్.. మార్చి 7న తమ ఎదుట హాజరు కావాలని కైలాశ్ విజయ్ వార్గియాను ఆదేశించారు. -
మరో భారాన్ని భుజానికెత్తుకున్న కమల్
చెన్నై: సాహసం, వైవిద్యం, విభిన్నత వంటి అంశాలే పరమావధిగా ఎప్పటికప్పుడు తనను నిత్యనూతనంగా పరిచయం చేసుకునే విలక్షణ ప్రముఖ నటుడు కమల్ హాసన్ మరోసాహసానికి దిగాడు. తన చిత్రానికే తానే దర్శకత్వం వహించుకునే బాధ్యతలు భుజాన వేసుకున్నారు. తన చిత్ర దర్శకుడు అస్వస్థతకు గురవ్వడంతో ఆయన ఈ పని చేస్తున్నారు. కమల్ తాజాగా నటిస్తున్న చిత్రం శబాష్ నాయుడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, అనూహ్యంగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సి ఉంది. అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి చేసి సినిమా ప్రేక్షకులముందుకు తీసుకురావాల్సిన నేపథ్యంలో ఇప్పటికే దర్శకత్వంలో పట్టున్న కమల్.. ఈ చిత్రానికి ఎలాంటి అవాంతరం కలగకుండా ఉండేందుకు దర్శకత్వ బాధ్యతలు భుజాన వేసుకున్నారు. 'మా దర్శకుడు రాజీవ్ బాగా అస్వస్థతతో ఉన్నారు. లాస్ ఎంజెల్స్లో మేం షూటింగ్ జరుపుకుంటున్న నాలుగో రోజు ఇలా జరగడం దురదృష్టం. ఆయన లైమ్ డిసీజ్కు లోనయ్యారు. ఉత్తర అమెరికా, యూరప్ లో మాత్రమే వచ్చే అత్యంత అరుదైన వ్యాధి ఇది. అందుకే నేను నా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను' అని కమల్ సోమవారం ఒక ప్రకటనలో చెప్పారు. అలాగే లాస్ ఎంజెల్స్ లోని ప్రముఖ ఆస్పత్రిలో తమ డైరెక్టర్ వైద్య చికిత్స పొందుతున్నారని చెప్పారు. -
కోల్ కతా పోలీసు కమిషనర్ పై వేటు
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ ఎన్నికల సంఘం(ఈసీ) కొరడా ఝుళిపించింది. కోల్ కతా నగర పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ పై వేటు వేసింది. ఆయనను కమిషనర్ పదవి నుంచి తొలగించింది. రాజీవ్ కుమార్ స్థానంలో అడిషనల్ డీజీ(సీఐడీ) సౌమెన్ మిత్రాను నియమించింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీవ్ కుమార్ అనుకూలంగా వ్యహరిస్తున్నారని విపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఆరోపించడంతో ఆయనపై ఈసీ చర్య తీసుకుంది. కోట్లాది రూపాయల శారద చిట్ ఫండ్ కుంభకోణం దర్యాప్తు సమయంలో ఆయన పేరు పతాక శీర్షికల్లో నిలిచింది.